breaking news
viral video
-
170 కేజీల బరువు.. జిమ్ చేస్తూ కుప్పకూలిపోయాడు
బరువు తగ్గడానికి జిమ్కు వెళ్తున్నారా?.. అయితే ఈ వార్త తప్పకుండా చదవాల్సిందే. ఓ వ్యక్తి ఇలాగే జిమ్కు వెళ్లి వర్కవుట్స్ చేస్తూ కుప్పకూలి ప్రాణం పొగొట్టుకున్నాడు. గత నాలుగు నెలలుగా కచ్చితమైన డైట్ పాటిస్తూ.. ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ వహిస్తూ.. స్టెరాయిడ్స్, ప్రోటీన్ పౌడర్లకూ దూరంగా ఉంటున్నాడట. హర్యానా ఫరీదాబాద్లో మంగళవారం ఉదయం ఈ ఘటన చోట చేసుకుంది. నహర్ సింగ్ కాలనీకి చెందిన 37 ఏళ్ల పంకజ్ శర్మకు నాలుగేళ్ల కిందట వివాహం జరిగింది. రెండున్నరేళ్ల పాప కూడా ఉంది. తండ్రి కన్స్ట్రక్షన్ కంపెనీలో చేదోడు వాదోడుగా ఉంటున్నాడతను. అయితే అతని బరువు 170 కేజీలకు చేరింది. దీంతో బరువు తగ్గించుకునేందుకు జిమ్ను ఆశ్రయించాడు. గత నాలుగు నెలలుగా ఫరీదాబాద్ సెక్టార్ 9లో ఉన్న జిమ్కు క్రమం తప్పకుండా వెళ్తున్నాడు. ఈ క్రమంలో.. జులై 1వ తేదీన స్నేహితుడు రోహిత్తో కలసి జిమ్కు వెళ్లాడు. బ్లాక్ కాఫీ తాగిన తర్వాత.. షోల్డర్ పుల్-అప్స్ చేయడం ప్రారంభించారు. మూడో పుల్-అప్ సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. ఆ శబ్దానికి జిమ్లో వాళ్లంతా పరిగెత్తుకొచ్చారు. అప్పటికే కాస్త స్పృహతో ఉన్న అతనికి నీటిని అందించడంతో.. వాంతులు చేసుకున్నాడు. ఆ వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో రెండుసార్లు సీపీఆర్ చేశారు. అయినా ఫలితం లేకపోయింది. సమీపంలోని ఆస్పత్రి నుంచి వైద్యులను రప్పించగా.. అప్పటికే అతని ఊపిరి ఆగిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. పోస్టుమార్టం నివేదిక రావాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన వీడియో స్థానిక మీడియా ఛానెల్స్కు చేరింది. అధిక బరువు ఉన్నవారు లేదంటే ఆరోగ్య సమస్యలున్నవారు జిమ్ ప్రారంభించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.ఎక్సర్సైజులు చేసేప్పుడు ఈ కింది విషయాలు గుర్తుంచుకోండిశరీర సామర్థ్యానికి మించి వ్యాయామాలు ప్రమాదకరంస్టెరాయిడ్స్, సప్లిమెంట్స్లాంటి వాటిని వీలైనంత దూరంగా ఉండాలి హార్ట్బీట్, బీపీలను నిరంతరం చెక్ చేసుకుంటూ ఉండాలివ్యాయామాలకు ఉదయం సరైన సమయంజిమ్ చేసే టైంలో.. గుండె వేగంగా కొట్టుకున్నట్లు(గుండె దడ) అనిపిస్తే వెంటనే ఆపేయాలిఅలసిపోయినప్పుడు, జ్వరం లేదంటే బలహీనంగా అనిపించినా జిమ్కు వెళ్లకూడదుజిమ్ను కొత్తగా ప్రారంభించేవాళ్లు.. నిపుణుల సమక్షంలోనే మొదలుపెట్టడం ఉత్తమంభారీ బరువులు ఎత్తే ముందుకు సరైన శిక్షణ తీసుకుని ఉండాలి.. లేకుంటే ఎత్తకూడదుట్రెడ్మిల్ పరిగెత్తడానికి పరిమితి ఉండాలి.. అదే పనిగా చేయకూడదుఎక్సర్సైజుల మధ్యలో కొంచెం కొంచెంగా నీటిని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. -
దటీజ్ షెకావత్..! వృద్ధురాలైన తల్లితో కలిసి..
ఎనభై సంవత్సరాల వయసులో కొద్ది దూరం నడిచినా అలసటగా అనిపిస్తుంది. ‘సాహసం’ అనే మాట ఊహకు అందదు. అయితే డా. శ్రద్దా చౌహాన్ మాత్రం ‘తగ్గేదే ల్యా’ అని డిసైడై పోయింది. సాహసానికి సై అంది. స్కైడైవింగ్తో తన 80వ పుట్టిన రోజు జరుపుకున్న శ్రద్ధ చరిత్ర సృష్టించింది. ‘స్కైడైవింగ్’ అనే మాట తల్లి నోటి నుంచి వినిపించిన క్షణమే ‘ఓకే’ అన్నాడు ఆమె కుమారుడు సౌరభ్ సింగ్ షెకావత్. శ్రద్ధ భర్తతోపాటు, రెండవ కుమారుడు మాత్రం... ‘ఈ వయసులో చాలా కష్టం. వద్దు’ అన్నారు. వారిని ఒప్పించి రంగంలోకి దిగారు తల్లీకొడుకులు. స్కైడైవర్ అయిన షెకావత్ ‘స్కై హై ఇండియా’ చీఫ్ ఇన్స్ట్రక్టర్. పర్వతారోహణలో, గుర్రపు స్వారీలో దిట్ట అయిన షెకావత్కు సాహసాలు కొత్త కాదు. వర్టిగో, సర్వికల్ స్పాండిలైటిస్లాంటి సమస్యలతో బాధ పడుతున్నప్పటికీ 10,000 అడుగుల ఎత్తు నుంచి కుమారుడితో కలిసి జంప్ చేసింది శ్రద్ధ. ‘ఏ మదర్: ఏ మైల్స్టోన్’ కాప్షన్తో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయింది. వీడియో విషయానికి వస్తే...షెకావత్ మొదట తన తల్లిని పరిచయం చేస్తాడు. ‘మా అమ్మతో కలిసి ఈ సాహసంలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను’ అన్నాడు షెకావత్. స్కైడైవింగ్ చేయాలనేది శ్రద్ధ చౌహాన్ చిన్నప్పటి కల. ఎట్టకేలకు కుమారుడి సహకారంతో తన కల నెరవేర్చుకుంది. ‘ఇది నేను గర్వించే సందర్భం’ అని సంతోషం నిండిన కళ్లతో అంటుంది డా.శ్రద్ధా చౌహాన్. ఈ ఇన్స్టాగ్రామ్ వైరల్ వీడియో సాహసానికి మాత్రమే కాదు తల్లీకొడుకుల అనుబంధానికి కూడా అద్దం పడుతుంది. View this post on Instagram A post shared by Skyhigh (@skyhighindia) (చదవండి: Shubhanshu Shuklas mission: మధుమేహం ఉన్నవాళ్లు అంతరిక్షంలోకి వెళ్లొచ్చా..? ) -
గాల్లో ప్రాణాలు.. ఫోన్లలో వీలునామాలు
టోక్యో: తరుణ్, జెనీలియా జంటగా గతంలో వచ్చిన ‘శశిరేఖా పరిణయం’సినిమాలో గాయాలపాలైన హీరోయిన్ చనిపోతానన్న భయంతో అప్పటికప్పుడు తన ప్రేమను హీరోకు చెప్తుంది. అచ్చం అలాగే తాము చనిపోవడం ఖాయమని భావించిన విమాన ప్రయాణికులు అప్పటికప్పుడు తమ ఆస్తులు ఎవరికి దక్కాలో స్మార్ఫోన్లలో వీలునామాలు, పాస్వర్డ్లు రాసి తమ వారికి సందేశాలుగా పంపించారు. ఈ ఘటన జపాన్లో చోటుచేసుకుంది. ప్రస్తుతం వైరల్గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. జూన్ 30న చైనాలోని షాంఘై పుడోంగ్ ఎయిర్పోర్ట్ నుంచి బయల్దేరిన విమానం మార్గమధ్యంలో ఇలా సాంకేతిక లోపంతో హఠాత్తుగా కిందకు దిగొచ్చి ప్రయాణికులకు గాల్లోనే చుక్కలు చూపించింది. చివరకు పైలట్ చాకచక్యంగా వ్యవహరించి ఎలాగోలా విమానాన్ని సమీప ఒసాకా నగరంలోని కన్సాయ్ విమానాశ్రయంలో రాత్రి 8.50 గంటలకు సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో ప్రయాణికులు, సిబ్బందిసహా విమానంలోని మొత్తం 191 మంది ఊపిరి పీల్చుకున్నారు. A Spring Airlines flight from Shanghai to Tokyo was forced to make an emergency landing at Kansai Airport after a sudden loss of cabin pressure triggered a rapid descent from 36,000 feet to just under 10,500 feet in ten minutes.Flight JL8696 was cruising over Japan when a… pic.twitter.com/2n8rDGfqu5— FL360aero (@fl360aero) July 1, 2025జపాన్లోని టోక్యో నరీటా ఎయిర్పోర్ట్కు బయల్దేరిన ఈ బోయింగ్ 737 విమానం స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 6.53 నిమిషాలకు ఈ అనూహ్య పరిస్థితులను ఎదుర్కొంది. విమానంలో తలెత్తిన ఈ సాంకేతిక సమస్యపై ఇప్పుడు సమగ్ర దర్యాప్తు జరుగుతోంది. రాత్రివేళ హాయిగా నిద్రపోతున్న వేళ విమానం ఒక్కసారిగా కుదుపునకు లోనై కిందకు దూసుకురావడం, ప్రయాణికులు ఉన్నట్లుండి తమ సీట్లలోంచి ఎగిరి పైకప్పునకు ఢీకొనడం, ఆక్సీజన్లు మాసు్కలు పెట్టుకోండని సహాయక సిబ్బంది ఏడుస్తూ చెప్పిన దృశ్యాలను కొందరు ప్రయాణికులు రికార్డ్చేశారు.Passengers on a Japan Airlines flight had to wear oxygen masks after the plane fell nearly 26,000 feet pic.twitter.com/5nseotGv3n— daredevil (@daredevil_1010) July 2, 2025ఇక, తాము ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురై చనిపోతామని భావించిన ప్రయాణీకులు.. అప్పటికప్పుడు తమ ఆస్తులు ఎవరికి దక్కాలో స్మార్ఫోన్లలో వీలునామాలు రాసి తమ వారికి సందేశాలుగా పంపించారు. ఇంకొందరేమో తమ బ్యాంక్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ల పిన్ నంబర్లు, లాగిన్ పాస్వర్డ్లు పంపించారు. మరి కొందరు బీమా మొత్తాలు, ఇన్సూరెన్స్ కంపెనీల వివరాలను మెసేజ్లుగా పంపించారు. 36,000 అడుగుల ఎత్తు నుంచి విమానం 10,500 అడుగుల దిగువకు స్వేచ్ఛగా పడిపోతుండటంతో తాము చనిపోవడం ఖాయమని భావించిన చాలా మంది ప్రయాణికులు ఇలా తమ చివరి కోరికలు, వీలునామాలను స్మార్ట్ఫోన్లో తమ కుటుంబసభ్యులకు చేరవేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. -
కూతురి కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని తండ్రి సాహసం, వైరల్ వీడియో
బిడ్డ ప్రాణాలు ప్రమాదంలో పడితే..ఏ తండ్రి అయినా చూస్తూ ఉరుకుంటాడా..? తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి ముందుకు దూకేస్తాడు. సరిగ్గా అదే చేశాడో తండ్రి. తన కళ్లముందే బిడ్డ సముద్రంలో పడిపోవడాన్ని చూసి క్షణం ఆలోచించకుండా దూకేసాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట విశేషంగా నిలుస్తోంది. డిస్నీ క్రూయిజ్ షిప్ లోని 4వ డెక్ నుంచి ఒక పాప పొరపాటున జారి పడబోయింది. ఇది చూసిన తండ్రి క్షణం ఆలోచించుండా ఆమెను కాపాడటానికి సముద్రంలోకి దూకాడు. జూన్ 29న బహామాస్ - ఫోర్ట్ లాడర్డేల్ మధ్య ఓడ ప్రయాణంలో ఈ సంఘటన జరిగింది. బహామాస్ చుట్టూ నాలుగు రాత్రుల షిప్లో గడిపిన తరువాత ఓడ ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్డేల్కు తిరిగి వస్తోంది. చదవండి: కొడుకు స్నేహితుడితో పెళ్లి, త్వరలో బిడ్డ : వ్యాపారవేత్త లవ్ స్టోరీ వైరల్"ఓడ వేగంగా కదులుతోంది. సముద్రపు హోరును, నీటి మెరుపులను చూస్తూ ప్రయాణికులుఎంజాయ్ చేస్తున్నారు. తన అయిదేళ్ల కమార్తెకు తండ్రి రైలింగ్ దగ్గర ఫోటో తీస్తున్నాడు. ఇంతలోనే ఆ పాప పడిపోయింది. వెంటనే తండ్రి కూడా దూకేశాడు. దీంతో ఓడ సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. కెప్టెన్ వెంటనే ఓడను స్లో చేశాడు. ఇంతలో క్రూ సభ్యులు లైఫ్సేవర్లను నీటిలోకి విసిరారు. క్రూయిజ్ షిప్ నుంచి రెస్క్యూ బోట్ ద్వారా తండ్రీ కూతుళ్లను రక్షించారు. ఇది కళ్లప్పగించి చూస్తున్న ప్రయాణికులు బిగ్గరగా హర్షధ్వానాలు చేశారు. అటు ప్రయాణీకులు, ఇటు డిస్నీ సిబ్బంది తండ్రి ధైర్యాన్ని ప్రశంసించారు.హీరో అంటూ నెటిజనులు కూడా తండ్రిని అభినందనల్లో ముంచెత్తారు. ఈ సంఘటనను రికార్డ్ చేసిన ట్రేసీ రాబిన్సన్-హ్యూస్, "బిడ్డను కాపాడటానికి దూకిన ఒక హీరో’’ అంటూ ప్రశంసించారు. దీనికి సంబంధించిన వీడియో ఎక్స్లో వైరల్గా మారింది. NEW: Father jumps overboard to save his 5-year-old daughter, who fell off a Disney cruise ship from the 4th deck into the ocean.The ship was heading back to South Florida when the intense rescue was made."The ship was moving quickly, so quickly, it's crazy how quickly the… pic.twitter.com/PTGmAzZJ7O— Collin Rugg (@CollinRugg) June 30, 2025మరోవైపు డిస్నీ క్రూయిజ్ లైన్ తమ సిబ్బంది స్పందించిన తీరు, ప్రయాణీకులను రక్షించిన తీరును ప్రశంసిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. సోమవారం తెల్లవారుజామున ఆ ఓడ సురక్షితంగా పోర్ట్ ఎవర్గ్లేడ్స్కు తిరిగి వచ్చింది.ఇదీ చదవండి: 5 వేల కిలోమీటర్ల దూరంనుంచి రెండుగంటల్లో సర్జరీ : విప్లవాత్మక అడుగు -
పాశమైలారం పేలుడు ఘటనలో 26కు చేరిన మృతుల సంఖ్య
-
సిక్సర్ బాది.. గుండెపోటుతో కుప్పకూలి.. పిచ్పైనే ప్రాణాలొదిలి!
పంజాబ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్థానిక క్రికెటర్ పిచ్పైనే ప్రాణాలొదిలాడు. ఉత్సాహంగా మ్యాచ్ ఆడుతున్న అతడు.. సిక్సర్ బాదిన వెంటనే గుండెపోటుతో కుప్పకూలాడు. ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపే అతడు మరణించినట్లు సమాచారం.మృతుడిని హర్జీత్ సింగ్గా గుర్తించారు. కాగా ఫిరోజ్పూర్లోని డీఏవీ పాఠశాల మైదానంలో రెండు జట్లు క్రికెట్ మ్యాచ్లో తలపడుతున్నాయి. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన హర్జీత్.. సిక్సర్తో అలరించాడు. అయితే, ఆ వెంటనే పిచ్ మధ్యలోకి వచ్చిన అతడు ఒక్కసారిగా కుప్పకూలాడు.ఇంతలో సహచర ఆటగాళ్లు వచ్చి హర్జీత్ను పైకిలేపే ప్రయత్నం చేశారు. పరిస్థితిని గమనించి సీపీఆర్ (CPR- కార్డియోపల్మనరీ రిససిటేషన్) చేశారు. కానీ అప్పటికే అతడు స్పృహ కోల్పోయిన అతడిలో ఎలాంటి చలనం కనిపించలేదు. గుండెపోటు కారణంగా హర్జీత్ అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.సిక్సర్బాది ఆ వెంటనే కాగా సిక్సర్బాది ఆ వెంటనే అతడు కుప్పకూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారగా.. హర్జీత్ కుటుంబానికి నెటిజన్లు సానుభూతి తెలుపుతున్నారు. కాగా గతేడాది కూడా ఇలాంటి ఘటనే జరిగింది. 35 ఏళ్ల క్రికెటర్ ఒకరు పుణెలోని గర్వారే స్టేడియంలో మ్యాచ్ ఆడుతూనే గుండెపోటుకు గురయ్యాడు.ఓపెనర్గా బ్యాటింగ్కు వచ్చిన ఇమ్రాన్ పటేల్ అనే వ్యక్తి కాసేపటికే ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పి.. ఫీల్డ్ అంపైర్ల అనుమతితో మైదానాన్ని వీడాడు. కానీ పెవిలియన్ చేరేలోపే అతడు కుప్పకూలిపోయాడు. పూర్తి ఫిట్గా, ఆరోగ్యంగా ఉన్నప్పటికీ అతడు గుండెపోటు కారణంగా మృతి చెందడం గమనార్హం. ఆల్రౌండర్ అయిన ఇమ్రాన్ మైదానంలో ఎంతో చురుగ్గా ఉండేవాడని.. దురదృష్టవశాత్తూ అతడిని కోల్పోయామని తోటి ఆటగాళ్లు, స్నేహితులు విచారం వ్యక్తం చేశారు.A local cricketer in Ferozepur hit a six off a delivery, but just moments later, he suffered a heart attack and tragically collapsed on the ground, losing his life. pic.twitter.com/7j4WXolkFf— Vipin Tiwari (@Vipintiwari952) June 29, 2025 -
'చార్లీ 777 మూవీ'ని తలపించే స్టోరీ..! ఏకంగా 12 వేల కిలోమీటర్లు..
చార్లీ 777 అనే కన్నడ మూవీ తెలుగు ప్రేక్షకులను ఎంతగా అలరించిందో తెలిసిందే. దర్శకుడు కిరణ్రాజ్ కె తీసిన ఈ మూవీ టైటిల్ లీడ్ రోల్లో చార్లీగా లాబ్రాడర్ కుక్క, హీరోగా రక్షిత్ శెట్టి, నటి సంగీత శృంగేరి తదితరులు నటించారు. ఈ సినిమాలో కొన్ని రోజుల్లో దూరమైపోతున్న ఆ కుక్క డ్రీమ్ని నెరవేర్చి, దాని జ్ఞాపకాలను పదిల పర్చుకోవాలని కోరికతో హీరో రక్షిత్ శెట్టి బైక్పై దాన్ని కూర్చోబెట్టుకుని టూర్లు చుట్టివస్తుంటాడు. ఆ క్రమంలో ఇద్దరి మధ్య పెనవేసుకున్న ప్రేమానురాగాలు సైలెంట్గా సాగే ఈ మూవీలో హైలెట్గా ఉంటాయి. అచ్చం అలాంటి కథే ఈ బిహార్ వ్యక్తిది. కాకపోతే ఇక్కడ ఈ వ్యక్తి సైకిల్పై తన పెంపుడు కుక్కతో టూర్లు చుట్టొచ్చాడు. అలా ఎంత దూరం వెళ్లాడో తెలిస్తే విస్తుపోతారు. బిహార్కి చెందిన సోను అనే వ్యక్తి, తాను కాపాడిన చార్లీ అనే కుక్కతో భారతదేశం అంతటా సుమారు 12,000 కి.మీ.ల దూరం పైనే పర్యటించాడు. ఒక ప్రమాదంలో గాయపడిన ఆ కుక్కతో అనుకోకుండా అటాచ్మెంట్ పెరిగిపోయింద ఇద్దరికి. అది అతడు ఎక్కడికి వెళ్తే అక్కడకు అనుసరించడంతో ఇలా ఆ కుక్కతో కలిసి ట్రావెల్ చేసినట్లుగా తెలిపాడు. అంతేగాదు అతడు తన ఇంటిని వదిలి ఇప్పటికీ దాదాపు 11 నెలలు పైనే అయ్యిందట. ఇప్పటి వరకు ఇద్దరూ కలిసి రామేశ్వరం, కేదార్నాథ్, బద్రీనాథ్ వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించారు. ప్రస్తుతం ప్రయాగ్రాజ్ మార్గంలో ఉన్నట్లు ఇన్స్టాగ్రాంలో షేర్ చేసిన వీడియోలో చెప్పుకొచ్చాడు. అందుకు సంబంధించిన వీడియోని అంతకుమునుపే పోస్ట్ చేసినప్పటికీ అందులో ఆడియో సరిగా లేకపోవడంతో మరోసారి రీపోస్ట్ చేశాడు సోను. దాంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు కూడా..ఆ కుక్క నిజంగా చాలా అదృష్టవంతురాలు..ఏ కుక్కకి దక్కని అద్భుత అవకాశం లభించింది. బ్రో మీ ఇద్దరి మధ్య పెనవేసుకున్న ప్రేమకి ఫిదా అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Sonu and Charlie 🐶( Bihar 🚴) (@safarmeinrahi) (చదవండి: అమెరికా ఆఫీసులో భారతీయ మహిళ ఆకలి తిప్పలు..! పాపం ఆ రీజన్తో..) -
ముంచెత్తిన వరద.. సాయం కోసం 2 గంటలకు పైగా ఎదురు చూపులు
సరదాగా నది ఒడ్డుకు పిక్నిక్ వెళ్లడం ఆ కుటుంబం పాలిట శాపమైంది. ఆకస్మిక వరదల్లో చిక్కుకుని రెండు గంటలపాటు ప్రాణాలను రక్షించుకునేందుకు పోరాడింది ఆ కుటుంబం. అయితే సకాలంలో సాయం అందక.. అధికార యంత్రాంగ వైఫల్యంతో చివరకు నదిలో కొట్టుకుపోయి విగతజీవులుగా తేలారు. క్రికెట్ గ్రౌండ్లను ఆరబెట్టడానికి హెలికాఫ్టర్లను ఉపయోగించే పాకిస్తాన్లో ఘోరం జరిగింది. స్వాత్ నదీ ఆకస్మిక వరదల్లో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది కొట్టుకుపోగా, అందులో 10 మంది మరణించారు. నలుగురు ప్రాణాలతో బయటపడగా.. వరదలో గల్లంతైన మరో నలుగురి జాడ తెలియాల్సి ఉంది. జూన్ 27వ తేదీన జరిగిన ఈ ఘటన తాలుకా వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.పంజాబ్ సియాల్కోట్కు చెందిన ఓ కుటుంబం మరికొందరు దగ్గరి బంధువులతో కలిసి ఖైబర్ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని ఫిజాఘట్ వద్ద స్వాత్ లోయకు పిక్నిక్కు వచ్చింది. ఉదయం 8గం.ప్రాంతంలో అల్పాహారం చేస్తుండగా.. పిల్లలు, మహిళలు కొందరు నదీ సమీపంలోకి వెళ్లి సెల్ఫీలు దిగుతున్నారు. ఆ సమయంలో స్వాత్ నదికి ఒక్కసారిగా వరద పోటెత్తింది. దీంతో వాళ్లను బయటకు తీసుకురావాలనే ప్రయత్నంలో.. అంతా వరదలో చిక్కుకున్నారు. ఈలోపు అక్కడికి చేరుకున్న స్థానికులు వారిని రక్షించే ప్రయత్నం చేస్తూనే.. మరోవైపు సహాయం కోసం అధికారులకు సమాచారం అందించారు. అయితే రెండు గంటలు గడిచినా.. సహాయక బృందాలు అక్కడికి రాలేదు. ఈలోపు వరద అంతకంతకు పెరగడం.. వాళ్లు సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. ఓ పెద్ద రాయి మీద నిలబడి సాయం కోసం ఆశగా ఎదురు చూశారు. నీళ్లలో జారిపోతున్న తమ వాళ్లను రక్షించుకునేందుకు చివరిదాకా ప్రయత్నించారు. అయినా లాభం లేకపోయింది. మొత్తం 18 మంది అంతా చూస్తుండగానే వరదలో కొట్టుకుపోగా.. నలుగురిని స్థానికులు అతికష్టం మీద రక్షించగలిగారు. ఇప్పటిదాకా 10 మృతదేహాలను అధికారులు వెలికి తీశారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. మరో నలుగురి ఆచూకీ తెలియాల్సి ఉంది.సకాలంలో అధికారులు స్పందించి ఉంటే ప్రాణాలు దక్కేవని స్థానికులు విమర్శిస్తుండగా.. ప్రతికూల వాతావరణంతోనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్ట లేకపోయామని అధికారులు వివరణలు ఇస్తున్నారు. అయితే ఎగువన వర్షాలతో స్వాత్ నదికి వరద క్రమక్రమంగానే పెరిగిందని.. అధికారులు అప్రమత్తం చేసి ఉంటే ప్రాణాలు దక్కి ఉండేవని అక్కడి మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది. క్రికెట్ గ్రౌండ్లను ఆరబెట్టేందుకు సైనిక హెలికాఫ్టర్లను ఉపయోగించిన పాక్ ప్రభుత్వం.. సకాలంలో స్పందించి ఉంటే వాళ్లందరి ప్రాణాలు దక్కి ఉండేవన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆ వీడియో నెట్లో వైరల్ అవుతుండడంతో.. విమర్శలు మాత్రం అంతకంతకు పెరిగిపోతున్నాయి.ప్రాణాల కోసం పోరాడిన ఆ వీడియోను మీరూ చూసేయండి. A Country where helicopter reaches to dry the Cricket ground in few minutes. Yet can't reach in Several hours to save human lives. #Swat pic.twitter.com/vJAPDQnPJ6— Aima Khan (@aima_kh) June 27, 2025 -
బాధలో అహ్మదాబాద్ బాధితులు.. డీజే పార్టీ జోష్లో ఎయిర్ ఇండియా ఉద్యోగులు
ఢిల్లీ: గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా (Air India) విమానం కూలిపోయిన ఘటన దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దుర్ఘటనలో 275 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ విషాద ఘటన నుంచి మృతుల కుటుంబాలు, ప్రజలు తేరుకోక ముందే ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన ఉద్యోగులు.. ఆఫీసులోనే పార్టీ చేసుకుని ఎంజాయ్ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంస్థ.. నలుగురు సీనియర్ల ఉద్యోగులపై వేటు వేసింది. ఉద్యోగులు పార్టీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల ప్రకారం.. ఎయిర్ ఇండియా గ్రౌండ్ సేవల సిబ్బంది ఆఫీసులో పార్టీ చేసుకోవడం తీవ్ర విమర్శలకు కారణమైంది. సింగపూర్ కేంద్రంగా పనిచేసే ఎస్ఏటీఎస్ లిమిటెడ్ (గతంలో సింగపూర్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ సర్వీసెస్) ఎయిరిండియా భాగస్వామ్యంతో (AISATS) దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో ఫుడ్, బ్యాగేజ్ హ్యాండ్లింగ్ వంటి గ్రౌండ్ సేవలందిస్తోంది. అయితే, గుజరాత్లో విమాన దుర్ఘటన జరిగిన కొన్ని రోజులకే.. గురుగ్రామ్లోని ఏఐఎస్ఏటీఎస్ కార్యాలయ సిబ్బంది ఓ పార్టీ చేసుకున్నారు. సిబ్బందితో కలిసి సీనియర్ ఉద్యోగులు కూడా డీజేకు స్టెప్పులు వేస్తూ డ్యాన్సులు చేశారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.A video showing senior Air India SATS (AISATS) executives dancing at a DJ party in their Gurugram office—just eight days after the deadly Flight AI171 crash—has sparked public outrage.The June 20 celebration, reportedly attended by top officials of AISATS (Air India SATS… pic.twitter.com/jBQwUSBstd— Mid Day (@mid_day) June 23, 2025విమాన ప్రమాదం కారణంగా ఓ వైపు మృతదేహాల కోసం బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తుంటే.. ఉద్యోగులు మాత్రం కనీన మానవత్వం లేదా? అని పలువురు నెటిజన్లు ప్రశ్నించారు. ప్రయాణీకుల ప్రాణాలంటే అంత చులకనగా ఉందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా సంస్థ స్పందించింది. ఈ ఘటనకు సంబంధించి నలుగురు సీనియర్ ఉద్యోగులను రాజీనామా చేయాలని ఆదేశించడంతోపాటు మిగతా వారిని హెచ్చరించినట్లు తెలిసింది. ఉద్యోగుల ప్రవర్తన మా విలువలకు అనుగుణంగా లేదు. బాధ్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నాం’ అని చెప్పుకొచ్చింది. -
భూకంపం.. బుల్లి బకాసురుడు
ఓవైపు.. భూకంపం వచ్చి భవనాలన్నీ ఊగిపోతున్నాయి. ఆ టైంలో ఎవరైనా ఏం చేస్తారు?. ప్రాణ భయంతో బయటకు పరుగులు తీస్తారు కదా. కానీ, ఇక్కడ ఓ బుడతడు చేసిన పని నెట్టింట వైరల్ అవుతోంది. చైనాలో ఇటీవల జరిగిన భూకంపం సమయంలో ఓ చిన్నారి చేసిన పని ఇప్పుడు ఇంటర్నెట్ను నవ్వులు పూయిస్తోంది. జూన్ 23న గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లోని క్వింగ్యువాన్లో రిక్టర్ స్కేల్పై 4.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. అయితే పెద్దగా నష్టం జరగలేదు. అయితే ఈ సందర్భంగా ఓ ఇంట్లో జరిగిన ఘటన తాలుకా వీడియో బయటకు వచ్చింది. ఓ ఇంట్లో ఓ తండ్రి తన ఇద్దరు కొడుకులతో భోజనం చేస్తున్నాడు. సరిగ్గా ఆ టైంలో భూమి కంపించింది. తండ్రి తన చిన్న కుమారుడిని ఎత్తుకుని తలుపు వైపు పరుగెత్తాడు. పెద్ద కుమారుడు కూడా వెంటపడ్డాడు. కానీ.. ఆ చిన్నారి ఒక్కసారిగా తిరిగి వచ్చి, టేబుల్ దగ్గరికి వెళ్లి తినడం ప్రారంభించాడు. పైగా బౌల్లో ఉన్న తిండిని తీసుకుని బయటకు పరిగెత్తే ప్రయత్నమూ చేశాడు. ఈలోపు అవతలి నుంచి తండ్రి.. పరిగెత్తు! అని అరిచాడు. అయినా ఆ బుడ్డోడు భోజనం ముందు అన్నట్లు వ్యవహరించాడు. ఈ వైరల్ వీడియోపై ఆ తండ్రి మీడియాతో మాట్లాడుతూ.. మా బిడ్డకు తినడం చాలా ఇష్టం. కానీ, ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వాడికి తిండి కంటే జీవితం ముఖ్యమని ఇక మీదటైనా నేర్పించాలి అని అన్నాడు. నెటిజన్ల స్పందన.. ఈ పిల్లవాడి ప్రాధాన్యతలు అద్భుతం!, భూకంపం వచ్చినా, తిండిని వదలడు!.. - “Snack first, survive later!.. భూకంపం.. బుల్లి బకాసరుడు ఈ కామెంట్లతో వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ వీడియో మీరూ చూసేయండి..Nothing comes between this kid and his meal not even an earthquake.pic.twitter.com/eWs218JHUH— Science girl (@gunsnrosesgirl3) June 25, 2025 -
WI vs AUS: చెత్త అంపైరింగ్!.. ఇంతకంటే దారుణం ఉంటుందా?
వెస్టిండీస్- ఆస్ట్రేలియా (West Indies vs Australia, 1st Test) మధ్య బార్బడోస్ వేదికగా తొలి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. అద్భుత బౌలింగ్తో కంగారూల పని పట్టిన విండీస్.. తొలి ఇన్నింగ్స్లో 180 పరుగులకే ఆలౌట్ చేసింది. కరేబియన్ పేసర్లలో జేడన్ సీల్స్ ఏకంగా ఐదు వికెట్లతో చెలరేగగా.. షమార్ జోసెఫ్ నాలుగు వికెట్లు కూల్చాడు. ఇక జస్టిన్ గ్రీవ్స్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.అనంతరం బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్.. 190 పరుగుల వద్ద తమ మొదటి ఇన్నింగ్స్ ముగించి పది పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సంపాదించింది. విండీస్ ఇన్నింగ్స్లో కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (44), వికెట్ కీపర్ బ్యాటర్ షాయీ హోప్ (48) మాత్రమే మెరుగ్గా రాణించారు.అయితే, వీరిద్దరు అవుటైన తీరు వివాదానికి దారి తీసింది. క్రీజులో పాతుకుపోయిన రోస్టన్, హోప్లు థర్డ్ అంపైర్ తప్పిదం కారణంగా మూల్యం చెల్లించాల్సి వచ్చిందనే విమర్శలు వస్తున్నాయి. అసలేం జరిగిందంటే..రోస్టన్ 44 పరుగుల వద్ద ఉండగా.. ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ (లెగ్ బిఫోర్ వికెట్) అయినట్లు ఫీల్డ్ అంపైర్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే, రోస్టన్ వెంటనే రివ్యూకు వెళ్లాడు. ఇందులో బ్యాట్ ముందుగా బ్యాట్ను తాకినట్లు తేలింది. అల్ట్రాఎడ్జ్ స్పైక్ కూడా వచ్చింది. కానీ థర్డ్ అంపైర్, సౌతాఫ్రికాకు చెందిన ఆడ్రియాన్ హోల్డర్స్టాక్ మాత్రం రోస్టన్ను అవుట్గా తేల్చాడు.Bat first or pad first? 🤔Roston Chase given OUT… but UltraEdge had a spike.Should that have been given out?#WIvsAUS pic.twitter.com/DaitLZhXPm— FanCode (@FanCode) June 26, 2025 అనంతరం.. షాయీ హోప్ విషయంలోనూ థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. హోప్ ఇచ్చిన క్యాచ్ను వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ అందుకున్నట్లు కనిపించగా.. ఫీల్డ్ అంపైర్ అవుట్ ఇచ్చాడు. అయితే, దీనిపై విండీస్ రివ్యూకు వెళ్లింది. రీప్లేలో చూడగా.. బంతి క్యారీ చేతుల్లోంచి జారీ నేలను తాకినట్లు కనిపించింది. అయితే, అతడు అంతలోనే దానిని మళ్లీ చేతిలోకి తీసుకున్నట్లు కనిపించింది. అయినప్పటికీ అది ఫెయిర్ క్యాచ్ అని తేలుస్తూ థర్డ్ అంపైర్ హోప్ను అవుట్గా ప్రకటించాడు. దీంతో విండీస్ శిబిరంలో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. కోచ్ డారెన్ సామీ సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. రోస్టన్ ఛేజ్, షాయీ హోప్ అవుటైన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందుకు నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. ‘‘చెత్త అంపైరింగ్!.. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు’’అంటూ థర్డ్ అంపైర్పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. Caught or did the ball touch the ground? 🫣Windies are furious with that decision. What's your call? ☝️ or ❌#WIvAUS pic.twitter.com/6evBQGk7vq— FanCode (@FanCode) June 26, 2025ఇక విండీస్ ఆలౌట్ అయిన తర్వాత ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. గురువారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి 33 ఓవర్ల ఆట పూర్తి చేసుకుని నాలుగు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. తద్వారా 82 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ట్రవిస్ హెడ్ 13, బ్యూ వెబ్స్టర్ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు. -
రథయాత్రలో అపశృతి.. భక్తులపైకి దూసుకెళ్లిన ఏనుగులు
గాంధీనగర్: గుజరాత్లో జగన్నాథ రథయాత్ర సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. జగన్నాథ యాత్రలో పాల్గొన్న ఒక ఏనుగు ఆగ్రహంతో భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో భయాందోళనకు గురైన భక్తులు ఆలయం నుంచి బయటకు పరుగులు తీశారు. దీంతో, ఆలయం వద్ద తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట కారణంగా పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల ప్రకారం.. ఒడిశాలోని ప్రసిద్ధ పూరీ జగన్నాథ రథయాత్ర ఈ రోజు ఘనంగా ప్రారంభమైంది. కన్నుల పండుగగా జరిగే ఈ యాత్రను చూడడానికి దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ రథయాత్ర సందర్భంగా పలు రాష్ట్రాల్లో కూడా జగన్నాథ ఆలయాల్లో వేడుకలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గుజరాత్లోని గోల్వాడలో కూడా భక్తులు రథయాత్రను నిర్వహించారు. అయితే, నిర్వాహకులు యాత్రలో ప్రత్యేక ఆకర్షణకు 18 ఏనుగులను అక్కడికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా యాత్ర ప్రారంభమైన 10 నిమిషాలకు అందులో ఉన్న ఓ ఏనుగు ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆగ్రహంతో జనం పైకి దూసుకెళ్లింది.Breaking!🚨Three elephants went out of control during the Jagannath Rath Yatra in Ahmedabad, GujaratHorrifying visuals. #RathaJatra2025pic.twitter.com/W2b7CwHpVw— 𝗩eena Jain (@DrJain21) June 27, 2025 ఇక, సదరు ఏనుగును చూసి పక్కనే ఉన్న ఏనుగులు సైతం ఆగ్రహానికి లోనయ్యాయి. ఒక్కసారిగా అక్కడున్న భక్తులపైకి ఏనుగులు దూసుకెళ్లాయి. దీంతో, ఏనుగులను చూసి అక్కడ ఉన్న వారు భయపడి పరుగులు తీశారు. ఏనుగులు గట్టిగా అరుస్తూ.. అటూ ఇటూ తిరగాయి. ఈ క్రమంలో రథ యాత్ర వద్ద స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఆ ఏనుగులను కంట్రోల్ చేయడానికి మావటివాళ్లు కూడా ప్రయత్నించినప్పటికీ పరిస్థితి అదుపు కాలేదు. ఎట్టకేలకు పరిస్థితిని అదుపు చేసి రథ యాత్రకు సిద్ధం చేశారు. ఈ ఘటనలో మొత్తం తొమ్మిది గాయపడినట్టు తెలుస్తోంది. చికిత్స కోసం వారిని సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. Ahmedabad Rath Yatra ….All people are safe … pic.twitter.com/0rw979Mfxa— €hetu $oN¥ (@chetusony) June 27, 2025🔵During the Rath Yatra in Ahmedabad, an elephant ran out of control. A mishap was narrowly avoided...Jai Jagannath Ji 🙏🙏🙏 pic.twitter.com/fr6Cyx2qSi— THE UNKNOWN MAN (@Theunk13) June 27, 2025 -
వీడియో: తమిళ ‘సింగం’.. రౌడీని పట్టుకునేందుకు ఎస్ఐ పోరాటం
చెన్నై: తమిళనాడులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. హీరో సూర్య.. నటించిన సింగం సినిమాలో మాదిరిగా.. రాష్ట్రంలో మోస్ట్ వాంటెడ్ రౌడీ షీటర్ను పట్టుకునేందుకు ఓ ఎస్ఐ.. అదే రేంజ్లో ప్రయత్నించారు. ఈ ఎపిసోడ్లో సదరు ఎస్ఐ చివరకు విఫలమయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల ప్రకారం.. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాకు చెందిన అళగురాజా.. మయిలై శివకుమార్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఇప్పటికే అళగురాజాపై ఇప్పటికే పలు స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో సదరు రౌడీ షీటర్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. తాజాగా అళగురాజా.. తిరువళ్లూరు జిల్లాలో దాక్కున్నాడని సమాచారం అందడంతో అతన్ని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దీంతో, అతడు ఉన్న ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు.పోలీసుల రాకను పసిగట్టిన అళగురాజా, అతడి బ్యాచ్.. అక్కడి నుంచి పారిపోయింది. వీరంతా ఓ కారులో పారిపోతుండగా వారిని జామ్ బజార్ సబ్ ఇన్స్పెక్టర్ ఆనంద కుమార్, పలువురు పోలీసులు వెంటాడారు. ఎస్ఐ ఆనంద కుమార్.. వాళ్లు ప్రయాణిస్తున్న కారుపైకి దూకారు. తిరువళ్లూరు-తిరుపతి హైవేపై సదరు ఎస్ఐ.. కారుకు డోర్కు వేలాడుతూ దాదాపు ఒక కిలోమీటర్ వెళ్లారు. కారుతో పాటు ఎస్ఐని అళగురాజా ఈడ్చుకెళ్లారు. అనంతరం, కారు లోపల ఉన్న నిందితులు ఎస్ఐను తోసివేయడంతో ఆయన రోడ్డుపై పడిపోయారు. అయితే, ఎస్ఐ ఆనంద కుమార్.. హెల్మెట్ పెట్టుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. రన్నింగ్ కారు నుంచి ఎస్ఐ కింద పడిపోవడంతో గాయాలయ్యాయి. అనంతరం, ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరోసారి రౌడీ షీటర్ అళగురాజా.. పోలీసుల నుంచి తప్పించుకుని పరారీ అయ్యాడు.திருவள்ளுர் அடுத்த திருப்பாச்சூர் பகுதியில் சென்னை ஸ்பெஷல் டீம் போலீசார் முக்கிய வழக்கு ஒன்றில் தொடர்புடைய குற்றவாளியை சினிமாவில் வரும்சண்டைக் காட்சிகளையும் மிஞ்சும் அளவிற்கு துரத்தி சென்றபோது கீழே விழும் காட்சி#Tiruvallur #Chanakyaa pic.twitter.com/x3m4Q7ceJp— சாணக்யா (@ChanakyaaTv) June 26, 2025 -
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో ఓ యువతి హలచల్
-
Urine Eye Wash: ప్లీజ్ అలా చెయ్యొద్దు..! వైద్యుల స్ట్రాంగ్ వార్నింగ్
ఇటీవల ఇన్స్టా రీల్స్ పిచ్చి మాములుగా లేదు కొందరికి. అందుకోసం వాళ్లు చేసే పిచ్చి చేష్టలకు అంతుపొంతు లేకుండాపోతోంది. అది సరైనదా? కాదా..? అన్నది అనవసరం. సోషల్ మీడియా క్రేజ్, ఆ కంటెంట్కి ఎన్ని వ్యూస్ వచ్చాయ్ అన్నదే ధ్యేయం. కానీ వీటిని స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి ఇబ్బందులు పడుతున్న అభాగ్యులెందరో ఉన్నారు. ప్రస్తుతం తాజాగా అలాంటి వీడియో సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఆ వీడియోని చూసి వైద్యులే కంగుతిన్నారు. ప్లీజ్ అలా చెయ్యకండి అని హెచ్చరిస్తునన్నారు. అసలేం జరిగిందంటే.. పూణెకు చెందిన నుపుర్ పిట్టీ అనే మహిళ వైరల్ వీడియోలో తనను "మెడిసిన్-ఫ్రీ లైఫ్ కోచ్"గా పరిచయం చేసుకుంటూ "యూరిన్ ఐ వాష్ " గురించి వివరించింది. ఇది మనకు ప్రకృతి ప్రసాదించిన ఔషధం అంటూ..మూత్రం కళ్లను శుభ్రం చేసుకుంటూ కనిపించింది వీడియోలో. మన మూత్రంతో ఇలా కళ్లను వాష్ చేసుకుంటే..డ్రైగా మారడం, ఎరుపెక్కడం వంటి కంటి సమస్యలు రావని ఆరోగ్య సలహాలు కూడా ఇచ్చేసింది. అయితే ఈ వీడియోపై వైద్య నిపుణులు తీవ్రంగా స్పందించడమే గాక మండిపట్టారు. ప్రజల ఆరోగ్యంతో ఇలా చెలగాటం ఆడటం మంచిద కాదని ఫైర్ అయ్యారు. ఇలాంటి ప్రక్రియలు ప్రమాదకరమైనవని, దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని తేల్చి చెప్పారు. మూత్రంతో ఇలా అస్సలు చేయొద్దని గట్టిగా హెచ్చరించారు కూడా.ఎందుకు మంచిది కాదంటే..నిపుణులు అభిప్రాయం ప్రకారం మూత్రాన్ని తాగడం లేదా ఉపయోగించటం అనేది ఆరోగ్యానికి మంచిదని శాస్త్రీయంగా ఎక్కడ నిరూపితం కాలేదు. “యూరిన్ థెరపీ“కి సంబంధించి వైద్యపరమైన ఆధారాలు కూడా లేవు. మూత్రంలో చాలా తక్కువ మొత్తంలో విటమిన్లు, ఖనిజాలు ఉన్నప్పటికీ ఏవిధమైన ఆరోగ్య ప్రయోజనాలను అందివ్వదు. అందులో శరీరానికి అవసరం లేని ద్రవం, శరీరంలోని వ్యర్థాలనను తొలగించిన ద్రవమే మూత్రం. మూత్రపిండాలు రక్తప్రవాహం నుంచి అదనపు నీటిని సెల్యులార్ వ్యర్థాలను బయటకు పంపించే ఉత్పత్తి ఇది. దీనిలో 90 శాతం నీరు ఉండగా, మిగిలిన భాగం అమ్మోనియా వంటి ఇతర లవణాలు ఉంటాయి. అంతేగాదు మూత్రపిండాల అనే రెండు కండరాల గొట్టలు ద్వారా మూత్రాశయానికి మూత్రాన్ని పంపుతాయి. మూత్రాశయం నిండినప్పుడు, నరాల చివరలు మెదడుకు బాత్రూమ్కి వెళ్లమని సంకేతమిస్తాయి. దాంతో మూత్రనాళం అనే చిన్నగొట్టం సాయంతో విసర్జిస్తాం. అదీగాక ఈ మూత్రనాళం కొన్ని రకాల బ్యాక్టీరియాలకు నిలయం.అందువల్ల మూత్రం శుభ్రమైనద కాదు. శరీరం వదిలించుకున్న ఈ వ్యర్థ ద్రవం తిరిగి శరీరంలోకి పంపిస్తే..హనికరమైన బ్యాక్టీరియాకు గురై లేనిపోని వ్యాధులు బారినపడే ప్రమాదం తీవ్రంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. Please don't put your urine inside your eyes. Urine is not sterile. Boomer aunties trying to be cool on Instagram is depressing...and terrifying.Source: https://t.co/SQ5cmpSOfY pic.twitter.com/qgryL9YHfI— TheLiverDoc (@theliverdr) June 25, 2025 (చదవండి: ఆ తప్పిదాలతో 116 కిలోల బరువు..కానీ 13 నెలల్లో ఏకంగా..) -
Jaiswal: నీకసలు బుద్ధుందా? రోహిత్ ఉంటే ఒక్కటి ఇచ్చేవాడు..
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashavi Jaiswal)పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెత్త ఫీల్డింగ్తో జట్టు ఓటమికి కారణమైందే గాకుండా.. డాన్సులు వేస్తావా? అంటూ మండిపడుతున్నారు. కాగా ఐదు టెస్టు మ్యాచ్లు ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్ (India vs England)లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత జట్టు ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది. ఫీల్డింగ్, బౌలర్ల వైఫల్యం కారణంగా ఐదు వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్లు మరీ చెత్తగా ఫీల్డింగ్ చేశారు.నాలుగు క్యాచ్లను జారవిడిచిన జైసూమొత్తంగా ఐదు రోజుల ఆటలో దాదాపు ఎనిమిది క్యాచ్లు డ్రాప్ చేసి.. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లకు లైఫ్ ఇచ్చి మూల్యం చెల్లించారు. ఇందులో నాలుగు క్యాచ్లను యశస్వి జైస్వాల్ జారవిడిచాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ కీలక సమయాల్లో బ్యాటర్లు ఇచ్చిన క్యాచ్లను నేలపాలు చేసిన జైసూ.. ఆఖరి రోజు ఆటలోనూ బెన్ డకెట్ (149) క్యాచ్ విడిచిపెట్టేశాడు.మహ్మద్ సిరాజ్ బౌలింగ్లో డకెట్.. 97 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నపుడు క్యాచ్ ఇవ్వగా.. జైసూ దానిని జారవిడిచాడు. ఆ ర్వాత డకెట్ భారీ సెంచరీ చేసి ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ఇప్పటికే జైస్వాల్పై అభిమానులు, భారత మాజీ క్రికెటర్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.డాన్స్ చేసిన జైసూ.. అభిమానులు ఫైర్ఇంగ్లండ్ విజయానికి చేరువవుతున్న వేళ.. యశస్వి జైస్వాల్ బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో చిన్నగా స్టెప్పులేస్తూ కనిపించాడు. ఇంగ్లండ్ అభిమానుల ప్రేక్షకులు చిరునవ్వులు చిందిస్తుండగా.. వారి ముందు జైసూ నవ్వుతూ కాలుకదిపాడు. ఇది చూసిన నెటిజన్లు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.‘‘నీకసలు బుద్ధి ఉందా?.. ఏకంగా నాలుగు క్యాచ్లు మిస్ చేశావు. ప్రత్యర్థి జట్టు గెలుపునకు పరోక్షంగా కారణమయ్యావు. అయినా.. ఏమాత్రం బాధ లేకుండా డాన్స్ చేస్తున్నావా?.. ఇప్పుడు గనుక కెప్టెన్గా రోహిత్ శర్మ మైదానంలో ఉంటే.. చెంప మీద ఒక్కటి ఇచ్చేవాడు’’ అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.మరికొందరేమో.. ‘‘విరాట్ కోహ్లిని కాపీ కొట్టాలని చూస్తున్నావేమో.. నువ్వెప్పటికీ కింగ్వి కాలేవు’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. అయితే, జైసూ అభిమానులు మాత్రం అతడికి అండగా నిలుస్తున్నారు. బ్యాటర్గా తన వంతు పూర్తి చేసిన ఈ యువ ఆటగాడి పట్ల అంత ద్వేషం పనికిరాదని.. ఇంగ్లండ్ గడ్డ మీద తన తొలి మ్యాచ్ను అతడు ఆస్వాదించడంలో తప్పేంటని ప్రశ్నిస్తున్నారు.గిల్కు చేదు అనుభవంకాగా ఇంగ్లండ్తో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో జైస్వాల్ శతక్కొట్టాడు. మొత్తంగా 159 బంతులు ఎదుర్కొని 16 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 101 పరుగులు సాధించాడు. అయితే, రెండో ఇన్నింగ్స్లో మాత్రం ఈ లెఫ్టాండర్ బ్యాటర్ విఫలమయ్యాడు. పదకొండు బంతులు ఎదుర్కొని కేవలం నాలుగు పరుగులే చేశాడు. ఇక ఈ మ్యాచ్తో భారత టెస్టు జట్టు సారథిగా ప్రస్థానం ఆరంభించిన శుబ్మన్ గిల్కు.. ఓటమి రూపంలో తొలి ప్రయత్నంలోనే భంగపాటు ఎదురైంది.చదవండి: ఏ ఒక్కరినో తప్పుబట్టను.. కెప్టెన్ నిర్ణయం ప్రకారమే అలా చేశాం: గంభీర్Bro Jaiswal dancing happily after dropping 7 catches in a single match.Helped England to win single-handedly.Goal achieved.#INDvsENG pic.twitter.com/EqjsxuJ5vO— Villager Anuj Tomar (@Da___Engineer) June 24, 2025 -
గిల్ అసంతృప్తి.. జడ్డూ చర్య వైరల్!.. ఆఖరికి మేమే గెలిచాం!
ఇంగ్లండ్తో తొలి టెస్టు (Ind vs Eng 1st Test)లో ఐదో రోజు తొలి సెషన్లో టీమిండియాకు కలిసిరాలేదు. లీడ్స్ (Leeds)లో భారత్ విధించిన 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆతిథ్య జట్టు నిలకడగా ముందుకు సాగుతోంది. ఓపెనర్లు జాక్ క్రాలే, బెన్ డకెట్ క్రీజులో పాతుకుపోగా.. ఈ జోడీని విడదీసేందుకు భారత బౌలర్లు ఎంతగా ప్రయత్నించినా అనుకున్న ఫలితం రాబట్టలేకపోయారు.లంచ్ బ్రేక్కు వెళ్లేసరికి ఇలా..దీంతో.. ఓవర్ నైట్ స్కోరు 21/0తో మంగళవారం నాటి ఐదో రోజు ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్.. భోజన విరామ సమయానికి ముప్పై ఓవర్ల ఆట పూర్తి చేసుకుని వికెట్ నష్టపోకుండా 117 పరుగులు సాధించింది. లంచ్ బ్రేక్కు వెళ్లేసరికి జాక్ క్రాలే 42, బెన్ డకెట్ 64 పరుగులతో క్రీజులో ఉన్నారు.శుబ్మన్ గిల్ అసంతృప్తిఇక ఎంతగా ప్రయత్నించినప్పటికీ క్రాలే, డకెట్ను అవుట్ చేయడం సాధ్యం కాకపోవడంతో భారత శిబిరంలో అసంతృప్తి నెలకొంది. బౌలర్లతో పాటు కెప్టెన్ శుబ్మన్ గిల్ కూడా అసంతృప్తికి లోనయ్యాడు. బంతి ఆకారం మారిందని, దానిని మార్చి కొత్త బంతి ఇవ్వాలని ఫీల్డ్ అంపైర్లు క్రిస్ గఫానీ, పాల్ రీఫిల్లకు భారత ఆటగాళ్లు కేఎల్ రాహుల్, సిరాజ్ తదితరులు విజ్ఞప్తి చేశారు.కెప్టెన్ గిల్ కూడా వారి వద్దకు వెళ్లి మర్యాదపూర్వకంగా, నవ్వులు చిందిస్తూ బంతిని మార్చమని అడిగాడు. కానీ అంపైర్లు మాత్రం ఇందుకు అంగీకరించలేదు. అయితే, టీమిండియా పట్టుబట్టడంతో గేజ్ టెస్టులో బంతి ఆకారం మారినట్లు తేలింది. దీంతో అంపైర్లు కొత్త బంతి ఇవ్వక తప్పని పరిస్థితి.జడ్డూ చర్య వైరల్ఈ నేపథ్యంలో భారత స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అంపైర్ వద్దకు వెళ్లి.. ‘‘చూశారా.. మేము చెప్పింది నిజం.. ఆఖరికి మాదే విజయం’’ అన్నట్లుగా పిడికిలి మడిచి సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు బదులుగా అంపైర్ కూడా నవ్వులు చిందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఏదేమైనా ఎట్టకేలకు కొత్త బంతిని తెచ్చుకోవడంలో టీమిండియా సఫలమైంది. ఇక భారమంతా బౌలర్లదే. ఇంగ్లండ్ను కట్టడి చేసి జట్టుకు విజయం అందించాల్సిన బాధ్యత వారిదే.ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ సైతం బంతిని మార్చమని అంపైర్లను కోరగా.. నిరాశే ఎదురైంది. దీంతో అతడు తన చేతిలో ఉన్న బంతిని నేలకేసి కొట్టగా.. అంతర్జాతీయ క్రికెట్ మండలి మందలించింది. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతడి ఖాతాలో ఓ డిమెరిట్ పాయింట్ జతచేసింది.ఇంగ్లండ్ వర్సెస్ భారత్ తొలి టెస్టు🏏షెడ్యూల్: జూన్ 20- 24🏏వేదిక: హెడింగ్లీ, లీడ్స్🏏టాస్: ఇంగ్లండ్.. తొలుత బౌలింగ్🏏భారత్ తొలి ఇన్నింగ్స్: 471 ఆలౌట్🏏ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 465 ఆలౌట్🏏భారత్కు ఆరు పరుగుల ఆధిక్యం🏏భారత్ రెండో ఇన్నింగ్స్: 364 ఆలౌట్🏏ఇంగ్లండ్ లక్ష్యం: 371🏏నాలుగో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు: 21/0 (6) 🏏ఐదో రోజు భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ స్కోరు: 117/0.చదవండి: వసీం అక్రం, షేన్ వార్న్ కాదు!.. నన్ను భయపెట్టింది ఆ బౌలరే: గంగూలీ.@imjadeja is all fired up as the umpire allows #TeamIndia a ball change! 🔄💥Is a breakthrough around the corner? Will the next two sessions bring the wickets India needs? 👀#ENGvIND 1st Test Day 5 LIVE NOW Streaming on JioHotstar 👉 https://t.co/0K41uhrKJ5 pic.twitter.com/qKMYKc6gDl— Star Sports (@StarSportsIndia) June 24, 2025 -
అలా చేయగలవా?.. అప్పుడు నన్ను బ్రూక్ అంటారు! పాపం వెంటనే..
టీమిండియా- ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు (Ind vs Eng 1st Test) నాలుగో రోజు ఆట సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (Harry Brook).. భారత పేస్ బౌలర్ ప్రసిద్ కృష్ణ (Prasidh Krishna)ను టీజ్ చేశాడు. సిక్సర్లు బాదగలవా అంటూ రెచ్చగొట్టాడు.ఇందుకు ప్రసిద్ ఏమాత్రం ఆవేశానికి లోనుకాకుండా కూల్గా సమాధానమిచ్చాడు. అయితే, ఆ మరుసటి బంతికే ప్రసిద్ అవుట్ కావడంతో భారత ఇన్నింగ్స్కు తెరపడింది.విషయం ఏమిటంటే.. టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా భారత్- ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో లీడ్స్ వేదికగా శుక్రవారం (జూన్ 20) తొలి మ్యాచ్ ఆరంభం కాగా.. టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట బౌలింగ్ చేసింది.ఆది నుంచి గిల్ సేనదే పైచేయిఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 471 పరుగులకు ఆలౌట్ అయింది. యశస్వి జైస్వాల్ (101), కెప్టెన్ శుబ్మన్ గిల్ (147), రిషభ్ పంత్ (134) శతకాల కారణంగా ఈ మేర స్కోరు సాధ్యమైంది.ఇక ఇందుకు బదులిచ్చే క్రమంలో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు 465 పరుగులకు తమ తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఫలితంగా ఆరు పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది టీమిండియా.ఈ క్రమంలో సోమవారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా.. 96వ ఓవర్ వద్ద 364 పరుగులకు భారత్ ఆలౌట్ అయింది. కేఎల్ రాహుల్ (137), రిషభ్ పంత్ (118) శతకాలతో రాణించారు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్లో ఆరు పరుగుల ఆధిక్యంతో కలిపి.. ఇంగ్లండ్కు టీమిండియా 371 పరుగుల లక్ష్యం విధించింది.అయితే, నాలుగో రోజు ఆటలో భారత ఇన్నింగ్స్లో 96వ ఓవర్ను ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ వేశాడు. అప్పటికి రవీంద్ర జడేజా, ప్రసిద్ కృష్ణ క్రీజులో ఉన్నారు. ఐతే ఐదో బంతిని ఎదుర్కొన్న ప్రసిద్.. ఆరో బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధంకాగా.. ఫస్ట్స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న హ్యారీ బ్రూక్ అతడిని టీజ్ చేశాడు.నువ్వు భారీ సిక్సర్లు బాదగలవా?‘‘నువ్వు భారీ సిక్సర్లు బాదగలవా?’’ అంటూ ప్రసిద్ను రెచ్చగొట్టాడు. ఇందుకు.. ‘‘ఒకవేళ నేను అలా చేశానంటే.. అప్పుడు నన్ను బ్రూక్ అంటారు’’ అని ప్రసిద్ సమాధానమిచ్చాడు. అయితే, ఆరో బంతిని బషీర్ ఫుల్ అవుట్సైడ్ ఆఫ్ దిశగా సంధించగా.. దానిని ఆడేందుకు ముందుకు వచ్చిన ప్రసిద్ బంతిని గాల్లోకి లేపగా.. డీప్ మిడ్ వికెట్ వద్ద జోష్ టంగ్ క్యాచ్ పట్టాడు. దీంతో ప్రసిద్ ఇన్నింగ్స్తో పాటు టీమిండియా ఇన్నింగ్స్ కూడా ముగిసింది.విజేత ఎవరో?కాగా బ్రూక్- ప్రసిద్ కృష్ణ మాటలు స్టంప్ మైకులో రికార్డు కాగా.. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో చక్కర్లు కొడుతోంది. కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టులో ఆఖరిదైన మంగళవారం నాటి ఐదో రోజు ఆటలో భాగంగా విజేత ఎవరో తేలుతుంది. భారత్ విజయానికి పది వికెట్లు అవసరం కాగా.. ఇంగ్లండ్ గెలుపునకు 350 పరుగుల దూరంలో ఉంది.చదవండి: పంత్ సెంచరీలపై అలా.. కేఎల్ రాహుల్ శతకంపై ఇలా! గోయెంకా పోస్ట్ వైరల్ "Can you hit big sixes?" — Harry Brook on the stump mic... and Prasidh goes for it on the very next ball and gets out.Classic Test cricket theatre — brought to you by the mic (and a bit of mischief). 🎭#ENGvIND | 1st Test, Day 5 | TUE, 24th JUNE, 2:30 PM on JioHotstar! pic.twitter.com/Bgwq5D3PiB— Star Sports (@StarSportsIndia) June 24, 2025 -
Jeedimetla: ట్యూషన్ నుంచి వచ్చే సరికి కొనఊపిరితో మమ్మీ..
-
అది బైకా.. లేక ఇంకేమన్నానా! మారండిరా బాబూ!!
ప్రమాదమని తెలిసినా కొంతమంది కుర్రకారు రెచ్చిపోతూనే ఉన్నారు. పిచ్చి పిచ్చి చేష్టల కారణంగా కళ్ల ముందే నిండుప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా వీరి ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా ఒక వీడియో నెట్టింట్ హల్ చల్ చేస్తోంది. ఇది చూసిన నెటిజనులు తిట్టిపోస్తున్నారు. మరోవైపు అనేక సామాజిక అంశాలపై సోషల్మీడియాలో స్పందించే టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (Vishwanath Channappa Sajjanar) కూడా ఈవీడియోపై అగ్రహం వ్యక్తం చేశారు. జరగరానికి జరిగితే, ఆ తల్లిదండ్రులకు, కుటుంబాలకు ఎంతటి క్షోభ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సజ్జనార్ ట్వీట్లో ఎమన్నారంటే..అది బైకా.. లేక ఇంకేమన్నానా!!ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఎనిమిది మంది.. ప్రమాదమని తెలిసి కూడా ఇలా చేస్తున్నారంటే వీళ్లని ఏం అనాలి. జరగరానిది జరిగి ప్రాణాలు పోతే మీ కుటుంబాలు ఎంతటి క్షోభను అనుభవిస్తాయనే కనీస సోయి కూడా వీళ్లకు లేదు.సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు కొందరు టీనేజర్లు, యూత్ ఇలాంటి వెర్రి వేషాలు వేస్తున్నారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రమాదకర ప్రయాణాలు చేస్తున్నారు. ఇదేం పిచ్చో వాళ్లకే తెలియాలి!!అది బైకా.. లేక ఇంకేమన్నానా!!ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఎనిమిది మంది.. ప్రమాదమని తెలిసి కూడా ఇలా చేస్తున్నారంటే వీళ్లని ఏం అనాలి.జరగరానిది జరిగి ప్రాణాలు పోతే మీ కుటుంబాలు ఎంతటి క్షోభను అనుభవిస్తాయనే కనీస సోయి కూడా వీళ్లకు లేదు.సోషల్ మీడియాలో ఫేమస్… pic.twitter.com/dmXUQ8BWz4— V.C. Sajjanar, IPS (@SajjanarVC) June 24, 2025అటు ఇకనైనా మారండిరా బాబూ, సోషల్మీడియా పిచ్చి ఇలాంటి వెర్రిమొర్రి వేషాలు వేయకండి.. మీరు బాగానే పోతారు.. మీ వెనక అమ్మనాన్న పరిస్థితి ఏంటి? మీలో ఎవరైనా శాశ్వత వికలాంగులుగా మారిపోతే ఎలా? ఎపుడైనా ఆలోచించారా అంటూ నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని తగినవిధంగా శక్షించాలి అని కొందరు, తల్లిదండ్రులు కూడా ఇలాంటి వాటిని ఒక కంట గమనిస్తూ తమ బిడ్డలను మందలించాలని మరికొందరు సూచిస్తున్నారు. చదవండి: అంత విషాదంలో డీజే పార్టీ?ఎయిరిండియాపై తీవ్ర ఆగ్రహం, వీడియో వైరల్ -
అంత విషాదంలో డీజే పార్టీ?ఎయిరిండియాపై తీవ్ర ఆగ్రహం, వీడియో వైరల్
భారతదేశం తన చరిత్రలోనే అత్యంత దారుణమైన విమానయాన ప్రమాదాల్లో ఒకటి అహ్మదాబాద్లో జరిగిన AI171 విమాన ప్రమాదం. అయితే ఘోర విపత్తులో దాదాపు 270 మంది ప్రాణాలు కోల్పోయిన కొద్ది రోజులకే ఎయిర్ ఇండియా SATS (AISATS) ఉన్నతాధికారులు గురుగ్రామ్ కార్యాలయంలో డీజే పార్టీలో నృత్యం చేస్తూ ఎంజాయ్ చేయడం విమర్శలకు తావిచ్చింది.AISATS అనేది విమానాశ్రయ గ్రౌండ్ సేవలను అందించే సంస్థ. టాటా గ్రూప్కు చెందిన ఎయిర్ ఇండియా విమానాశ్రయ సేవలు , ఫుడ్ అందించే SATS అనే రెండు కంపెనీల (50-50) సమ భాగస్వామ్యంలో ఉన్న జాయింట్ వెంచర్ ఇది.ఎయిర్ ఇండియా SATS (AISATS) సీనియర్ అధికారులు గురుగ్రామ్ లో ఒక DJ పార్టీలో డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జూన్ 20న జరిగిన ఈ పార్టీకి AISATS చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అబ్రహం జకారియా, ఎయిర్ ఇండియా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, GM, సంప్రీత్ కోటియన్, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ GM హాజరయ్యారు. విమాన ప్రమాదంలో 270 మందికి పైగా మరణించిన కొద్ది రోజులకే ఇలాంటి పార్టీ చేసుకోవడం దుమారాన్ని రాజేసింది. వందలాది మంది బాధితులు హృదయవిదారకమైన శోకం ఉంటే, ఆప్తులను కోల్పోయి కంటిమింటికి ధారగా రోదిస్తోంటే... కనీస మానవత్వం లేకుండా ఇలా కుప్పిగంతులు వేస్తున్నారంటూ దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రగిలింది. ఈ విషాదంలో కేవలం బాధితులు మాత్రమే కాదు, యావద్దేశం దుఃఖిస్తోంది.కానీ కనీస ఇంగితలం లేకుండా అధికారులు ఇలాంటి వేడుకలు జరుపుకోవడం సరికాదని మండిపడ్డారు. దీనిపై సంబంధింత అధికారులు క్షమాపణలు చెప్పినప్పటికీ, ఇది క్షమించరానిది అంటూ ఆగ్రహజ్వాలలు ఎగిసిపడుతూనే ఉండటం గమనార్హం. It has only been a few days since the tragic Ahmedabad plane crash. Many families have not yet been able to see their loved ones for the last time; several bodies have still not been handed over. Grief hangs heavy in households, funeral pyres are yet to cool. And at such a… pic.twitter.com/rrlekBNAeD— Squint Neon (@TheSquind) June 22, 2025 "మానవత్వం చచ్చిపోయింది.. నమ్మబుద్ధి కావడం లేదు’’ అని ఒకరు, "సంతోషంగా ఉండండి,కానీ ముందుగా మృతులకు గౌరవ సంతాపం తెలియజేయడం మర్చిపోతే ఎలా? ఇంత మంది చనిపోయిన నెలరోజులలోపే, మీరు ఇలా డాన్స్ చేసి ఎయిరిండియా ఇమేజ్ను నాశనం చేస్తున్నారు. సిగ్గుచేటు ఇప్పటికే సంస్థ సేవల విషయంలో దిగజారిపోయింది, ఇప్పుడు భద్రతలో కూడా’’ మరొకరు అసంతృప్తి వ్యక్తం చేశారు. -
అప్పుడు ఆర్మీ అధికారి.. కానీ ఇవాళ వీధుల్లో..
ఒకప్పుడూ ఆర్మీలో ఉన్నతాధికారిగా సేవలందించింది. ఇప్పుడు వీధుల్లో ఫుడ్స్టాల్ నడుపుతూ లైఫ్ని లీడ్ చేస్తోంది. అయితే ఆమెలో అప్పుడలా..ఇప్పుడిలా అనే నైరాశ్యం అణువంతైనా తొణికిసలాడదు. నెట్టింట ఆమె కథ వైరల్లగా మారి ఎందరి మనసులనో కథిలించింది. ఎవరామె అంటే..79 ఏళ్ల ఈ వృద్ధురాలు ఒకప్పుడు ఆర్మీ మాజీ సైనికురాలు. అయితే ఆమె అస్సలు వివాహమే చేసుకోలేదట. ఆమె భారత సైన్యంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేసి పదవీవిరణమ చేసినట్లు తెలిపింది. అయితే ఆమెకు కుకింగ్ అంటే మహా ఇష్టమట. ఆ ఇష్టంతోనే ఇండోర్ వీధుల్లో ఒక ఫుడ్స్టాల్ని నడుపుతోంది. ఆమె ముంబైలో ఫైన్ ఆర్ట్స్లో డిగ్రీ పూర్తిచేసినట్లు వెల్లడించింది. కొన్నేళ్లు జీవితంలో తీవ్ర కష్టాలను ఎదుర్కొన్నానని కూడా చెప్పుకొచ్చింది. అయినప్పటికీ తన గత జీవితంలోనూ, ప్రస్తుతం ఎంతో ఆనందంగా సంతృప్తిగా జీవిస్తున్నానని ధీమాగా చెబుతోందామె. ఇక్కడ ఆ మహిళ ఈ వయసులో ఒంటరిగా ఈ వ్యాపారం ఎలా చేయగలను అనే సందేహానికి తావివ్వకుండా సాధికారత, సానుకూలతలను అస్త్రాలుగా చేసుకుని ముందుకు సాగడం ప్రశంసనీయం. అందుకు సంబంధించిన వీడియోని కాశీష్ సోని అనే సోషల్ మీడియా ఔత్సాహికురాలు నెట్టింట షేర్ చేయడంతో వైరల్గా మారింది. పైగా ఆ వీడియోకి లక్షకు పైగా లైక్లు వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు సైతం ఒంటరిగా కూడా మహిళలు లైఫ్ని లీడ్ చేయగలరు అనడానికి ఈ మాజీ భారత ఆర్మీ హీరోనే ఉదాహరణ, ఎందరికో ఆ వృద్ధురాలు స్ఫూర్తిదాయకం అని ప్రశంసిస్తూ పోస్ట్లు పెట్టారు. View this post on Instagram A post shared by Kashish Soni (@tasty_trekk) (చదవండి: World Motorcycle Day: రైడింగ్ స్కిల్తో అదరగొట్టిన ఉమెన్ రైడర్స్..!) -
అదృష్టమంటే ఇదే!.. దారుణంగా ఢీకొట్టుకున్నారు.. కానీ..
మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ (MPL) మ్యాచ్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రెండో పరుగు కోసం వికెట్ల మధ్య పరిగెత్తిన బ్యాటర్లు దారుణంగా ఢీకొట్టుకున్నారు. ఇద్దరూ కిందపడిపోయారు. అయితే, అనూహ్య రీతిలో ఇద్దరూ రనౌట్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. విషయం ఏమిటంటే..ఎంపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్లో రాయగడ్ రాయల్స్ (Raigad Royals)- కొల్హాపూర్ టస్కర్స్ తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన.. రాహుల్ త్రిపా (Rahul Tripathi)ఠి కెప్టెన్సీలోని కొల్హాపూర్ 165 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన క్రమంలో రాయల్స్ ఓపెనర్ విక్కీ ఓస్త్వాల్ (Vicky Ostwal) పరుగుకు యత్నించాడు.దారుణంగా ఢీకొట్టుకున్నారునాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్న మరో ఓపెనర్ సిద్దేశ్ వీర్తో కలిసి సింగిల్ పూర్తి చేశాడు. అయితే, రెండో పరుగు కోసం వెళ్లే క్రమంలో ఇద్దరూ బంతిని చూస్తూ పరిగెత్తగా దారుణంగా ఢీకొట్టుకున్నారు. తలలు గుద్దుకుని కిందపడిపోయారు. దెబ్బకు ఇద్దరు చేతుల్లోని బ్యాట్లు కూడా నేలమీద పడిపోయాయి.ఇంతలో నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపున ఎన్న ఫీల్డర్ చేతికి బంతి చిక్కగా బ్యాటర్ పరుగున వచ్చి క్రీజును చేరుకున్నాడు. ఈ క్రమంలో బంతిని స్ట్రైకర్ ఎండ్ వైపు విసరగా దానిని అందుకున్న కెప్టెన్ త్రిపాఠి డైరెక్ట్ త్రో చేయగా.. ఈసారీ విక్కీ కూడా లేచి పరుగున వెళ్లి క్రీజును దాటాడు. అంతేకాదు బంతి బౌండరీ వైపు దూసుకువెళ్లింది.దీంతో రెండుసార్లు రనౌట్ చేయాలని ప్రయత్నించి విఫలం కావడంతో పాటు అదనంగా పరుగులు సమర్పించుకోవడం కొల్హాపూర్ వంతైంది. మరోవైపు.. దారుణంగా ఢీకొట్టుకున్నా రాయల్స్ ఓపెనర్లు.. కిందపడినా అదృష్టవశాత్తూ అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకోవడంతో పాటు పరుగులు రాబట్టడం విశేషం.గెలిచి.. క్వాలిఫయర్-2లో అడుగుపెట్టిఇక ఈ మ్యాచ్లో విక్కీ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. 54 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 74 పరుగులు సాధించాడు. మిగతా వాళ్లలో సిద్దేశ్ వీర్ 39, నీరజ్ జోషి(37 నాటౌట్) రాణించారు. ఈ క్రమంలో రాయల్స్ కొల్హాపూర్ జట్టుపై ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. ఈ క్రమంలో పుణేరి బప్పాతో రాయల్స్ తదుపరి తలపడనుంది. ఈ మ్యాచ్లో విజేతగా నిలిచిన జట్టు ఫైనల్లో ఈగల్ నాసిక్ను ఢీకొట్టనుంది.చదవండి: బుర్ర వాడేవాళ్లు ఇలాంటి పనిచేయరు: స్టోక్స్పై మాజీ కెప్టెన్ ఫైర్Collided, but never gave up — still made the crease! ✅Vicky Ostwal. TAKE A BOW 👏#AdaniMPL2025 #RRvsPBGKT #ThisIsMahaCricket pic.twitter.com/LXsssa740e— MPLT20Tournament (@mpltournament) June 20, 2025 -
Yoga విల్లులా వంగే పాలరాతి శిల్పం.. శిల్పా శెట్టి, వైరల్ వీడియో
International Yoga Day 2025 అంతర్జాతీయ యోగా డే సందర్భంగా బాలీవుడ్ నటి శిల్పా శెట్టి కుంద్రా (shilpa shetty) అద్భుతమైన యోగాసనాలు వేసింది. దీనికి సంబంధించి ఒక వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.బాలీవుడ్ బ్యూటీ క్రమం తప్పకుండా యోగా సాధన చేస్తుంది. ఫిట్నెస్కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే శిల్పా శెట్టి తన సోషల్ మీడియాలో, ఫిట్నెస్ యాప్లో యోగా, ధ్యానం, ఫిట్నెస్ వ్యాయామాలను పంచుకుంటుంది. తన అద్భుతమైన శరీరాకృతి, ఫిట్నెస్కు యోగానే కారణమని చాలా సార్లు వెల్లడించింది. తాజాగా యోగా డే సందర్భంగా ఇన్ష్టాలోషేర్ చేసిన వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. 50 ఏళ్ల వయసులో చాలా ఫిట్గా యంగ్ లుక్లో తన అభిమానులను మెస్మరైజ్ చేస్తుంది. శిల్పా తరచుగా తన అభిమానులతో విభిన్న యోగాసనాలు లేదా భంగిమల్ని పంచుకుంటూ , అభిమానులకు ప్రేరణనిస్తుంది. ఇదీ చదవండి: జిమ్కి వెళ్లకుండానే 30 కిలోలు తగ్గింది..ఫేస్ గ్లో కోసం..! View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) -
అలా అయితే అవుట్ అయిపోతావు! గిల్కు పంత్ వార్నింగ్.. వైరల్
ఇంగ్లండ్తో తొలి టెస్టులో మొదటి రోజు టీమిండియా అదరగొట్టింది. సీనియర్లు లేకపోయినా మేమున్నాము కదా అంటూ యువ ఆటగాళ్లు బ్యాట్తో చెలరేగారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)తో పాటు కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) శతకంతో చెలరేగితే.. వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) కూడా హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.భారీ భాగస్వామ్యాలుజైసూ 101 పరుగులు సాధించి.. బెన్ స్టోక్స్ బౌలింగ్లో బౌల్డ్ కాగా.. శుక్రవారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి గిల్ 127, పంత్ 65 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా జైస్వాల్ మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (42)తో కలిసి తొలి వికెట్కు 91 పరుగులు జోడించడంతో పాటు.. గిల్తో కలిసి మూడో వికెట్కు 129 పరుగులు జతచేశాడు.అనంతరం గిల్కు తోడైన పంత్ అభేద్యంగా 138 పరుగుల భాగస్వామ్యం జోడించి.. అతడితో కలిసి నాటౌట్గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో మొదటి రోజు ఆట ముగిసే సరికి భారత్ 85 ఓవర్లు ఆడి మూడు వికెట్ల నష్టానికి 359 పరుగులు సాధించింది.ఇక మొదటి రోజు ముగింపునకు చేరే క్రమంలో షాట్ ఎంపిక విషయంలో గిల్కు పంత్ స్నేహపూర్వక హెచ్చరిక జారీ చేశాడు.ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ సంధించిన ఫుల్లర్ బాల్ను ఆడేందుకు క్రీజు వెలుపలికి వచ్చిన గిల్.. షార్ట్ కవర్ దిశగా బాదాడు.అలా అయితే అవుట్ అయిపోతావు!ఆ సమయంలో నాన్- స్ట్రైకర్ ఎండ్లో ఉన్న పంత్.. ‘‘క్రీజు బయటకు వచ్చేటపుడు కాస్త చూసుకో.. ఏమాత్రం తేడా జరిగినా క్యాచ్ అవుట్ అయ్యే ప్రమాదం ఉంది’’ అని హెచ్చరించాడు. మైక్ స్టంప్లో ఈ మాటలు రికార్డు అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.కాగా ఇంగ్లండ్తో టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీ ఆడేందుకు భారత జట్టు అక్కడికి వెళ్లింది. ఈ సిరీస్తో ఇరుజట్లు తమ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సైకిల్ను మొదలుపెట్టాయి. ఇక ఇదే సిరీస్తో టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్.. అతడికి డిప్యూటీగా రిషభ్ పంత్ తమ ప్రస్థానం మొదలుపెట్టారు.ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా లీడ్స్లోని హెడింగ్లీలో తొలి మ్యాచ్ జరుగుతుండగా.. ఎడ్జ్బాస్టన్ (బర్మింగ్హామ్), లార్డ్స్ (లండన్), ఎమిరేట్స్ ఓల్డ్ ట్రఫోర్డ్ (మాంచెస్టర్), కెన్నింగ్టన్ ఓవల్ (లండన్) మిగిలిన టెస్టులకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ తొలి టెస్టు👉షెడ్యూల్: జూన్ 20- 24👉వేదిక: హెడింగ్లీ, లీడ్స్👉టాస్: ఇంగ్లండ్.. తొలుత బౌలింగ్👉తొలిరోజు ఆట ముగిసేసరికి టీమిండియా స్కోరు: 359/3 (85).చదవండి: బుర్ర వాడేవాళ్లు ఇలాంటి పనిచేయరు: స్టోక్స్పై మాజీ కెప్టెన్ ఫైర్Warning: When @RishabhPant17's on strike, expect some advice and plenty of chatter between the wickets! 😜🎙️Watch now 👉 https://t.co/PXeXAKeYoj #ENGvIND | 1st Test | LIVE NOW on JioHotstar pic.twitter.com/v53iqPg8cm— Star Sports (@StarSportsIndia) June 20, 2025 -
గాజాలో ఆహార సంక్షోభం.. బ్రెడ్ కి బదులు ఇసుక తింటున్న చిన్నారి
-
నాకు అది అలవాటు.. నువ్వే గుర్తు చేయాలి!.. నో చెప్పడం వల్లే ఇలా..
వయసు జస్ట్ 23 ఏళ్లు.. అయితేనేం.. టీమిండియా ఓపెనర్గా అతడు కనబరిచే పరిణితి మాత్రం అమోఘం.. టెస్టుల్లో ఇప్పటికే నాలుగు సెంచరీలు.. రెండు ద్విశతకాలు.. తాజాగా ఇంగ్లండ్ గడ్డ మీద ఆడిన తొలి టెస్టులోనే శతకం బాదాడు అతడు.. అంతేకాదు ఈ ఘనత సాధించిన ఏకైక భారత ఓపెనర్గా నిలిచాడు.. అవును.. యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswak) గురించే ఈ ఉపోద్ఘాతం.ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా ఇంగ్లండ్ (India vs England)తో శుక్రవారం మొదలైన తొలి టెస్టులో జైసూ శతక్కొట్టాడు. ఆది నుంచే పలుమార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుని ఎట్టకేలకు వంద పరుగుల మార్కు అందుకున్నాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (KL Rahul)తో కలిసి తొలి వికెట్కు 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. మూడో వికెట్కు కెప్టెన్ శుబ్మన్ గిల్తో కలిసి 129 పరుగుల పార్ట్నర్షిప్ అందించాడు.తొందరపడితే నన్ను వారించు..అయితే, గిల్తో కలిసి బ్యాటింగ్ చేస్తున్న సందర్భంగా జైసూ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. తొందరపడితే తనను వారించాలంటూ జైసూ కెప్టెన్కు చెప్పడం గమనార్హం. అసలేం జరిగిందంటే.. భారత్ ఇన్నింగ్స్లో 38 వ ఓవర్లో క్రిస్ వోక్స్ బంతితో రంగంలోకి దిగాడు.అతడి బౌలింగ్లో తొలి బంతికి బౌండరీ బాదిన జైస్వాల్.. తదుపరి బాల్కు సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. షాట్ బాదగానే వెంటనే పరుగు కోసం వెళ్లాడు. అయితే, మరో ఎండ్లో ఉన్న గిల్ మాత్రం రన్కు నిరాకరించాడు. దీంతో కాస్త అసహనానికి గురైనప్పటికి... ఆ వెంటనే తన తప్పు తెలుసుకున్న జైస్వాల్ వెంటనే క్రీజులోకి పరిగెత్తాడు. తద్వారా ఇంగ్లండ్కు రనౌట్ చేసే అవకాశం చేజారింది.నాకు అది అలవాటు..! నువ్వే గుర్తు చేస్తూ ఉండాలి!ఈ ఘటన తర్వాత జైస్వాల్ గిల్తో.. ‘‘రిస్కీ సింగిల్స్ వద్దని నాకు చెబుతూనే ఉండండి ప్లీజ్.. బంతిని బాదగానే వెంటనే పరిగెత్తడం నాకు అలవాటై పోయింది’’ అని పేర్కొన్నాడు. కాగా జైసూ బాదిన బంతి ఎక్కువ దూరం వెళ్లలేదు. ఈ విషయాన్ని గమనించని జైసూ పరుగుకు రాగా.. ‘‘లేదు లేదు బంతి ఇక్కడే ఉంది’’ అంటూ గిల్ చెప్పాడు. గిల్ నో చెప్పిన కారణంగా ఇద్దరూ రనౌట్ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.కాగా అప్పటికి జైస్వాల్ 57 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నాడు. ఆ తర్వాత గిల్తో కలిసి చక్కటి సమన్వయంతో శతకం పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 159 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 101 పరుగులు సాధించిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు.ఇదిలా ఉంటే.. శుక్రవారం నాటి తొలి రోజు ఆట ముగిసేసరికి టీమిండియా 85 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 359 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. శుబ్మన్ గిల్ 175 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 127 పరుగులతో.. రిషభ్ పంత్ 102 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్స్ల సాయంతో 65 పరుగులతో క్రీజులో ఉన్నారు.చదవండి: దక్షిణాఫ్రికాకు కొత్త కెప్టెన్.. ఎవరంటే?When #YashasviJaiswal says “Run!” and #ShubmanGill is still deciding if it’s a good idea! 😂Watch now 👉 https://t.co/PXeXAKeYoj #ENGvIND | 1st Test | LIVE NOW on JioHotstar pic.twitter.com/UJDlpPlpkH— Star Sports (@StarSportsIndia) June 20, 2025 -
అచ్చం నాన్నలాగే!.. కుమారుడితో రోహిత్- రితికా.. వీడియో వైరల్
టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం కుటుంబంతో సమయం గడుపుతున్నాడు. ఐపీఎల్-2025 తర్వాత దొరికిన విరామాన్ని పూర్తిగా ఫ్యామిలీకే కేటాయించిన హిట్మ్యాన్.. తాజాగా ముంబై విమానాశ్రయంలో దర్శనమిచ్చాడు. భార్య రితికా సజ్దే, కుమార్తె సమైరా, చిన్నారి కుమారుడు అహాన్లతో కలిసి రోహిత్ ఎయిర్పోర్టులో ప్రవేశించాడు.ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ వీడియో ద్వారా రోహిత్ కొడుకు అహాన్ ఫేస్ పూర్తిగా రివీల్ అయింది. అహాన్ను చూసిన అభిమానులు.. ‘‘అచ్చం నాన్నలాగే ఉన్నాడు’’ కామెంట్లు చేస్తున్నారు.కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ను విజేతగా నిలిపిన రోహిత్ శర్మ.. కెప్టెన్గా రెండో ఐసీసీ ట్రోఫీని అందుకున్నాడు. అంతకు ముందు టీ20 ప్రపంచకప్-2024లోనూ టీమిండియాను చాంపియన్గా నిలిపాడు హిట్మ్యాన్. ఆ తర్వాత అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ.. ప్రస్తుతం ఐపీఎల్లో కొనసాగుతున్నాడు.ఐపీఎల్-2025లో భాగంగా హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్కు ప్రాతినిథ్యం వహించిన రోహిత్.. పదిహేను మ్యాచ్లలో కలిపి 418 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక ఎలిమినేటర్ మ్యాచ్లో భాగంగా గుజరాత్ టైటాన్స్పై అతడు ఈ సీజన్లో తన అత్యధిక స్కోరు (81) నమోదు చేశాడు.అయితే, క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడటంతో ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ మధ్యలోనే రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే ముందే తన నిర్ణయాన్ని వెల్లడించాడు.కాగా టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన 38 ఏళ్ల రోహిత్.. వన్డేల్లో మాత్రం కొనసాగనున్నట్లు స్పష్టం చేశాడు. ఈ క్రమంలో ఆగష్టులో అతడు మళ్లీ మైదానంలో దిగనున్నాడు. బంగ్లాదేశ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ నేపథ్యంలో సారథిగా పునరాగమనం చేయనున్నాడు.ఇక 2007లో అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ.. టీమిండియా తరఫున ఇప్పటి వరకు 273 వన్డేలు ఆడి.. 11168 పరుగులు సాధించాడు. ఇందులో 32 శతకాలు ఉన్నాయి. ఇక వన్డేల్లో రోహిత్ ఎవరికీ సాధ్యం కాని రీతిలో అత్యధికంగా మూడు డబుల్ సెంచరీలు చేయడం విశేషం. అంతేకాదు.. యాభై ఓవర్ల ఫార్మాట్లో అత్యధిక స్కోరు (264) అతడిదే కావడం గమనార్హం. అదే విధంగా.. 159 టీ20లలో ఐదు శతకాల సాయంతో రోహిత్ 4231 పరుగులు చేశాడు. 67 టెస్టుల్లో కలిపి 4301 రన్స్ సాధించాడు. View this post on Instagram A post shared by Rohit Saraiya (@rohitsaraiya.official) -
నో బ్రా.. నో ఎగ్జామ్!!
ఆ అమ్మాయిలంతా పరీక్ష రాసేందుకు క్యూ లైన్లో నిలబడ్డారు. ఒక్కొక్కరిగా ముందుకు వెళ్తున్న క్రమంలో.. వాళ్ల ముఖంలో హవభావాలు మారిపోతున్నాయి. తనిఖీల పేరుతో అక్కడి సిబ్బంది ఇబ్బందికరంగా తాకుతుండడమే అందుకు కారణం. అదీ అధికారిక పద్ధతిలోనే కావడం ఇంకా దారుణం. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఓ వీడియోపై ప్రస్తుతం విమర్శలు వెల్లువెతుతున్నాయి. పరీక్షా హాల్లోకి ప్రవేశించే ముందు మహిళా విద్యార్థులను బ్రా ధరించారా? లేదా? అని ఛాతీ భాగాన్ని తాకుతూ కనిపించారు. ఈ ఘటన విద్యా సంస్థల్లో వ్యక్తిగత గౌరవం, మానవ హక్కులు, మరియు లైంగిక సమానత్వం వంటి అంశాలపై తీవ్ర చర్చకు దారితీసింది. నైజీరియాలోని ఒలాబిసీ ఒనాబంజో యూనివర్సిటీలో (Olabisi Onabanjo University - OOU) చోటు చేసుకుంది. పరీక్షకు హాజరయ్యే బాలికలు, విద్యార్థినుల కోసం డ్రెస్ కోడ్ రూల్స్ పెట్టింది. కురచ దుస్తులు వేసుకున్నా.. శరీర భాగాలు కొంచెం కనిపించినా అది వర్సిటీ నైతికతను దెబ్బ తీసే అంశమని పేర్కొంది. పైగా ఎదుటివాళ్లను రెచ్చగొట్టడం కిందకే వస్తుందని తెలిపింది. ఈ క్రమంలో నో బ్రా.. నో ఎంట్రీ ఫర్ ఎగ్జామ్ రూల్ను కఠినంగా అమలు చేయించింది. 📌 ఘటనపై యూనివర్సిటీ పెద్దలు మాత్రం అధికారికంగా స్పందించలేదు. No bra, no exam అనే నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నామని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు.. విద్యార్థి సంఘం అధ్యక్షుడు ముయిజ్ ఒలాటుంజీ ఈ విధానంపై మిశ్రమ స్పందన తెలియజేశారు. అయితే.. ⚖️ మానవ హక్కుల సంఘాల ప్రతినిధి హరునా అయాగీ మాత్రం ఇది విద్యార్థుల హక్కులను ఉల్లంఘించే చర్యగా పేర్కొంటూ, చట్టపరమైన చర్యలకు వెళ్తామని హెచ్చరించారు.🎓 చేదు అనుభవం ఎదురైన ఆ విద్యార్థినులు మాత్రం.. ఈ విధానాన్ని లైంగిక వేధింపుగా అభివర్ణించారు. “No bra. No entry” is not a new policy in Olabisi Onabanjo University.OOU promotes a dress code policy aimed at maintaining a respectful and distraction-free environment, encouraging students to dress modestly and in line with the institution's values. https://t.co/xO70cBiabG pic.twitter.com/pTWjpABFmT— ART&SCIENCE (@MAO_of_Africa) June 17, 2025👉గమనిక: పై వీడియో కేవలం వార్తకు అనుగుణంగా సమాచారం అందించడానికి మాత్రమే. అశ్లీలతను పెంపొందించడం కోసమో లేదంటే ఎవరినీ అగౌరవపర్చడం కోసమో కాదు -
Viral Video: కర్రలతో కొట్టుకున్న కేదార్నాథ్ యాత్రికులు
కేదార్నాథ్ యాత్రికుల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. కర్రలతో ఒకరినొకరు కొట్టుకున్న వీడియో.. సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఉత్తరాఖండ్లోని సోన్ప్రయాగ్లో జరిగిన ఈ ఘటనలో యాత్రికులు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో స్థానిక అధికారులు వెంటనే స్పందించి వారిని చెదరగొట్టారు.పరిస్థితి అదుపు తప్పడంతో లాఠీఛార్జ్ కూడా చేశారు. కేదార్నాథ్ యాత్ర మార్గంలో పర్యాటకుల మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగుతున్నాయి. ఈ యాత్రలో కీలక జంక్షన్ అయిన సోన్ప్రయాగ్లోని పార్కింగ్ ప్రాంతంలో కొందరు యాత్రికుల మధ్య ఈ ఘర్షణ జరిగింది. దాడులు చేసుకున్నవారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది యాత్ర ప్రారంభం నుంచి తరుచూ ఇలాంటి ఘటనలు అశాంతిని కలిగిస్తున్నాయి.Earlier, Indian pilgrims travelled to holy sites for peace and darshan but nowadays we have goons going to Kedarnath and Badrinath with rods and sticks always ready for a fight. pic.twitter.com/Szo2RLMWQV— Uttarakhandi (@UttarakhandGo) June 19, 2025కేదార్నాథ్ యాత్రకు విశేషస్పందన లభిస్తోంది. భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. స్థానిక అధికారులు విడుదల చేసిన గణాంకాల ప్రకారం, మే 2న ఆలయ తలుపులు తెరిచినప్పటి నుంచి 1.14 మిలియన్లకు పైగా భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించారు. అధికారిక లెక్కల ప్రకారం యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి స్థానిక హోటళ్లు, రెస్టారెంట్లు, పోర్టర్లు, హెలి ఆపరేటర్ల సంబంధిత సేవల వ్యాపారం రూ.300 కోట్లు దాటింది. -
Donald Trump: అబ్బా.. ఏం గుండెరా వాడిది!
అమెరికా అధ్యక్ష భవనం చరిత్రలోనే తొలిసారి డొనాల్డ్ ట్రంప్(Donald Trump) హయాం ఓ అరుదైన ఘట్టానికి వేదికైంది. వైట్హౌజ్ ఆవరణలో రెండు భారీ జెండా స్తంభాలు ఏర్పాటు అయ్యాయి. పైగా అవి ప్రపంచంలోనే అత్యుత్తమ పోల్స్ అంటూ ట్రంప్ తనదైన శైలిలో ఓ ప్రకటన చేశారు కూడా.బుధవారం ఆ పోల్స్ను వైట్హౌజ్ భవనం బయట దక్షిణం వైపు, ఉత్తరం వైపు మరొకటి ఏర్పాటు చేయించారు(White House Huge Poles). ఆ మరుసటి రోజు అమెరికా జెండాను ఆవిష్కరించి.. సెల్యూట్ చేశారు. అయితే.. మొదటి టర్మ్(2013-2020) టైంలోనే ఇలా ఏర్పాటు ఎందుకు చేయించలేదని కొందరు మీడియా వాళ్లు అడిగారు. దానికి ఆయన ఇచ్చిన సమాధానం ‘‘చాలా కాలం కిందటే ఇలా చేయాలని అనుకున్నా. తొలి టర్మ్లో అన్ని కళ్లు, వేళ్లు నా వైపే ఉండేవి. ఎక్కడ నేను దొరుకుతానా? అని విమర్శకులు వెంటాడేవాళ్లు. ఇప్పుడు నేనే అందరినీ వేటాడుతున్నా. చాలా తేడా ఉంది కదా. అందుకే ఇప్పుడు కుదిరింది’’ అని బదులిచ్చారు.అంతేకాదు.. రియల్టర్ అయిన ట్రంప్ ఆ పోల్స్ను ఎంపిక చేయడం మాత్రమే కాదు.. ఎక్కడ పాతాలో(ఏర్పాటు చేయాలో) కూడా స్వయంగా స్థలాన్ని సిబ్బందికి వెతికి చూపించారట. అయితే ఆ స్తంభాలను అక్కడ ఏర్పాటు చేసిన సిబ్బందిని అభినందించే క్రమంలో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. పోల్స్ ఏర్పాటు చేసిన సిబ్బంది ఒక్కొక్కరిని పిలిచి ట్రంప్ కరచలనం చేశారు. ఆ సమయంలో వెనకాల.. ఓ క్రేన్ ఆపరేటర్(Crane Driver Trump Funny) కునుకు తీస్తూ కనిపించాడు. అయితే ట్రంప్ అది గమనించకుండా సిబ్బందితో ఫొటోలు దిగసాగారు. ఈ ఫొటో కాస్త నెట్టింట వైరల్ అవుతోంది. అసలు అతగాడు ట్రంప్ ముందు అంత దర్జాగా ఆ పని ఎలా చేయగలిగాడంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు జస్ట్ మిస్ అంటూ కామెంట్ పెన్నారు. మరికొందరు ఓ అడుగు ముందుకు వేసి.. అతను ఇప్పుడు అసలు ప్రాణాలతో ఉన్నాడా? అని ఆరాలు తీస్తున్నారు.NEW: Crane operator appears to take a quick nap during the installation of President Trump's flag pole at the White House.The president was seen taking pictures with workers while the man sat back in the crane.Trump says the two large flag poles were his gift because it was… pic.twitter.com/QYZONrjlKO— Collin Rugg (@CollinRugg) June 18, 2025ట్రంప్ ఈ ఏడాది జనవరిలో అధికారంతో వైట్హౌజ్లో అడుగుపెట్టినప్పటి నుంచి గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వచ్చిరాగానే.. ఓవల్ ఆఫీస్లో ఫొటోలన్నీంటిని మార్పించేశారు. పెన్సిల్వేనియాలో తనపై జరిగిన హత్యాయత్నం ఫొటోను ప్రముఖంగా ఆఫీస్లో ఏర్పాటు చేయించుకున్నారు. జాన్ ఎఫ్ కెనడీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రోజ్ గార్డెన్ను ఏర్పాటు చేయించారు. అయితే ఆ గార్డెన్లో నిర్మాణ పనులు జరపాలని ట్రంప్ తాజాగా ఆదేశించారు. అందుకు ఆయన చెప్పిన కారణం.. అక్కడి గడ్డిలో హైహీల్స్తో నడిచేందుకు మహిళలు ఇబ్బంది పడుతున్నారని!!. -
బోధనకు సృజన తోడైతే ఇంత బాగుంటుందా..!
చూస్తుండగానే వేసవి సెలవులు అయిపోయాయి. స్కూళ్లు మొదలయ్యాయి. ఇక పిల్లలు, పెద్దలు హడావిడి మాములుగా ఉండదు. ఇన్నాళ్లు జాలీగా గడిపిన చిన్నారులకు ఇప్పుడు స్కూల్కి వెళ్లాంటే ఉంటుంది బాధ..మాములుగా ఉండదు. వాళ్లని యథావిధిగా స్కూల్కి వెళ్లేలా చేయలేక పేరెంట్స్ తంటాలు ఓ రేంజ్లో ఉంటాయి. సరిగ్గా ఈ సమయంలో సామాజిక మాధ్యమంలో ఓ టీచర్ పిల్లలను ఆకట్టుకునేలా పాఠాలు చెబుతున్న వైరల్ వీడియో అందర్నీ తెగ ఆకట్టుకుంది. ఇలా ప్రతి టీచర్ పిల్లల్నిఎంజాయ్ చేసేలా పాఠాలు చెబితే వాళ్లు స్కూల్కి వెళ్లనని మారం చెయ్యరు అంటున్నారు నెటిజన్లంతా. మరీ ఆ వీడియో కథాకమామీషు ఏంటో చూద్దామా..!.వేసవి సెలవుల తర్వాత స్కూల్స్ తెరిచిన రోజు సామాజిక మాధ్యమాల్లో ఒక టీచర్ వీడియో వైరల్ అయింది. తొలి రోజు తరగతి గదిలో నృత్యం చేస్తూ, పాట పాడుతూ చిన్నారులను హుషారు పరచడం ఆ వీడియో సారాంశం. ఆ టీచర్ పేరు వందనరాయ్. కర్నాటకలోని కర్కలకు చెందిన వందన పిల్లలకు అర్థమయ్యే రీతిలో పాఠం చెప్పడంలో దిట్ట. కన్నడ, ఆంగ్ల అక్షరాలను నృత్యం చేస్తూ పిల్లలకు ఆమె నేర్పే తీరు ఆకట్టుకుంటోంది. పండ్లు, కూరగాయలను పరిచయం చేస్తూ వాటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలను ఆడుతూ, పాడుతూ చెబుతారు. ప్రత్యేక సందర్భాల్లో పిల్లలకు సందర్భోచితంగా మేకప్ వేసి పాటలు నేర్పుతూ ఆటలాడిస్తారు. ఆమె వీడియోలు యూట్యూబ్లో వైరల్ అయ్యాయి. బోధనకు, సృజనాత్మకత తోడైతే ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ వీడియోలు చెప్పకనే చెబుతాయి. "Vandana Rai Karkala, a teacher & a social media sensation"She is a teacher in Karkala, Udupi district. Her teaching methods are integrated with music & nature, rooted in our culture. No wonder her videos have gone viral with millions of views.Youtube: https://t.co/zWQbi6y3Xa pic.twitter.com/Rc3zbBUppQ— Girish Alva (@girishalva) April 24, 2023(చదవండి: రిస్క్ ఎంతున్న రెస్క్యూకి రెడీ..!) -
ప్రియుడితో ఏకాంతంగా భార్య.. ఒక్కసారిగా భర్త రావడంతో..
లక్నో: ఉత్తరప్రదేశ్లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ వివాహిత తన ప్రియుడితో హోటల్ గదిలో ఏకాంతంగా ఉన్న సమయంలో ఆమె భర్త ఒక్కసారిగా అక్కడికి రావడంతో.. సదరు మహిళ హోటల్ పై నుంచి కిందికి దూరి పారిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. యూపీలోని బాగ్పత్ జిల్లా బడౌత్ పట్టణంలో ఓ వివాహిత తన ప్రియుడి శోభిత్తో కలిసి హోటల్ గదికి వెళ్లింది. హోటల్ గదిలో వారిద్దరూ ఏకాంతంగా ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న వివాహిత భర్త.. హోటల్ గది వద్దకు వచ్చాడు. అది గమనించిన ఆమె.. ఏం చేయాలో అర్థం కాకపోవడంతో హోటల్ గది కిటికి నుంచి పారిపోయే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో హోటల్ భవనం నుంచి.. కిందికి దూకి పారిపోయింది. వెంటనే అప్రమత్తమైన భార్య.. పోలీసులకు సమాచారం ఇచ్చారు.A dramatic incident unfolded in Baraut, Baghpat, where a married woman was caught on video j*mping from a 12-foot roof of an OYO hotel, allegedly to escape her husband, in-laws, and police. According to reports, the woman was staying at the hotel with her lover when her… pic.twitter.com/aWcjEqItgz— ForMenIndia (@ForMenIndia_) June 18, 2025ఆమె ప్రియుడు శోభిత్ను మహిళ భర్త పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇక, ఈ ఘటన సోమవారం జరగ్గా.. వారిద్దరి నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆమె భర్త పోలీసులను ఆశ్రయించాడు. తనకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శోభిత్ను అదుపులోకి తీసుకొని కేసు విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా.. వారిద్దరు దంపతులకు 2019లో పెళ్లి కాగా, ఓ కుమారుడు ఉన్నాడు. తరచూ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు.. ఆమె హోటల్ భవనం నుంచి దూకి పారిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ससुरालियों ने विवाहित युवती को होटल में प्रेमी के साथ पकड़ा,Oyo होटल की पिछली खिड़की से कूदकर महिला हुई मौके से फरार,पति और पत्नी के बीच काफी समय से चल रहा विवाद....@Uppolice#बागपत #बडौत #OyoHotel #LoveAffair #viralvideo pic.twitter.com/xcxtmli0v7— Rahul kumar Vishwakarma (@Rahulku18382624) June 17, 2025 -
ఆ తాతకు భార్య అంటే ఎంత ప్రేమ..! వీడియో వైరల్
దాంపత్యం అనే పదానికి ప్రస్తుతం విలువ లేకుండా పోతున్న రోజులివి. ఇలాంటి తరుణంలో ఓ వృద్ధ జంట భార్యభర్తల బంధానికి ప్రతీకగా నిలిచి ఎందరికో కనువిప్పుకలిగించారు. మలిసంధ్యలో ఉన్న ఆ దంపతులు మధ్య అనురాగానికి సంబంధించిన ఘటన నెట్టింట వైరల్గా మారింది. మహారాష్ట్రలోని ఛత్రపతి శంబాజీనగర్లో సాంప్రదాయ తెల్లటి ధోతి కుర్తా టోపి ధరించి 93 ఏళ్ల వ్యక్తి తన భార్యతో కలిసి ఒక ఆభరణాల దుకాణం వద్దకు వచ్చాడు. సిబ్బంది అతడి ఆహార్యాన్ని చూసి ఏదో డబ్బు సాయం అడగడానికి వచ్చాడేమో అనుకున్నారు. అయితే అతడు తన భార్య కోసం మంగళసూత్రం కొనుగోలు చేయడానికి వచ్చినట్లు చెప్పడంతో దుకాణ యజామని ఆశ్చర్యపోయాడు. అతడిని సాదరంగా ఆహ్వానించి తనకు నచ్చిన మంగళ సూత్రాన్ని అతి తక్కువ ధరకే ఇచ్చి పెద్దమనసు చాటుకున్నాడు ఆ ఆభరణాల యజమాని. ఆ వృద్ధుడికి తన భార్యపై ఉన్న ప్రేమ అనురాగానికి వెలకట్టకూడదనే ఇలా చేశానంటూ ఆ ఘటనకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేశాడు. నిజానికి ఆ వృద్ధుడు ఆ మంగళ సూత్రం కోసం దుకాణం యజమానికి రూ. 1,120 ఇచ్చాడు. అయితే తన భార్యకు బహుమతిగా ఇవ్వాలనే ఆ వృద్ధుడి తాపత్రయం ఆ దుకాణం యజామనిని మంత్రముగ్దుడిని చేసింది. దాంతో ఆ యజమాని కేవలం రూ.20లకే ఆ ఆభరణాన్ని ఆ దంపతలుకు ఇచ్చేశాడు. కాగా, ఆ వృద్ధ దంపతుల పేర్లు నివృత్తి షిండే, శాంతబాయిలు. ఆ జంట జల్నా జిల్లా, అంభోరా జహాగీర్ గ్రామంలోని వ్యవసాయ కుటుంబానికి చెందినవారు. అక్కడి స్థానికుల సమాచారం ప్రకారం..ఇద్దరు ప్రస్తుతం ఆషాఢ ఏకాదశి వేడుక కోసం కాలినడకన పంఢర్పూర్కు తీర్థయాత్ర చేస్తున్నారట. అలాగే ఆ దంపతులకు ఒక కొడుకు కూడా ఉన్నాడట. అయితే ఆ వృద్ధ దంపతులు అతడిపై ఆధారపడకుండా జీవిస్తాని, తరుచుగా తీర్థయాత్రలు చేస్తుంటారని చెబుతున్నారు గ్రామస్థులు. నెటిజన్లు సైతం వారి మధ్య ఉన్న అనురాగానికి ఫిదా అవ్వుతూ.. మలిసంధ్యాలో కూడా ఎంత అన్యోన్యంగా ఉన్నారంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Gopika Jewellery Sambhajinagar (@gopika_jewellery_sambhajinagar) (చదవండి: అమ్మాయిలూ.. బహుపరాక్!) -
కూతురి వెర్రి పని... సూపర్ డాడీ సాహసం, వైరల్ వీడియో
రైల్వేస్టేషన్లో అప్రమత్తంగా ఉండాలని అటురైల్వే అధికారులు,ఇతరులు చెబుతూనే ఉంటారు. రైలు రన్నింగ్ లో ఉండగానే దిగేందుకు ఎక్కేందుకు ప్రయత్నించవద్దని, రైలు వస్తున్నపుడు ప్లాట్ఫాం కు దూరంగా ఉండాలనే హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటారు. చాలా మంది అప్రమత్తంగానే ఉంటారు. కానీ. ఒక్కోసారి ఊహించని పరిణామాలు మనల్ని దిగ్భ్రాంతికి గురి చేస్తాయి. అలాంటి ఘటన ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అత్యంత సాహసంతో కన్నబిడ్డను కాపాడి సూపర్ హీరో అయిపోయాడో తండ్రి. పూర్తి వివరాలు తెలియాలంటే.. ఈ వైరల్ వీడియోను చూడాల్సిందే. ఈ కథనం కూడా పూర్తిగా చదవాల్సిందే.రైల్వే స్టేషన్ అనగానే కొంతమందికి గాభరా. కొంతమందేమో చాలా లైట్ తీసుకుంటారు. అలా రైలు పట్టాల మీద ఉన్న కూడా ఒక ప్లాట్ ఫామ్ మీద మరోప్లాట్ ఫామ్ మీదకు వెళ్లేందుకు ప్రయత్నించింది. ఏ మాత్రం ప్రాణ భయం లేకుండా ఒక యువతి ఒక ప్లాట్ ఫామ్ మీద నుంచి మరోక చోటకు వెళ్లేందుకు ప్రయత్నించింది. ఇంతలోనే అటువైపు వేగంగా రైలు దూసుకొచ్చింది. కళ్లు మూసి తెరిచే లోపే ఆమె పట్టాలు, రైలుకి మధ్యలో ఇరుక్కపోయింది. దీన్ని గమనించిన ఆమె తండ్రి అంతే వేగంగా కదిలాడు. వెంటనే పట్టాల మీదకు దూకి ప్లాట్ ఫామ్ వైపు కిందికి దూకి కూతుర్ని గట్టిగా హత్తుకున్నాడు. ఈ సమయంలో ట్రైన్ కూడా వేగంగా ముందుకు వెళ్లిపోయింది. అదృష్టవశాత్తూ వారుకి ఎలాంటి గాయాలు కాకుండా భారీ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. దీంతో అక్కడున్నవారంతా చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. కొంతమంది భావోద్వేగానికి గురై దేవునికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఇందులో ఏ మాత్రం తేడా వచ్చినా లిప్త పాటులో ప్రాణాలు పోయేవే. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్ వైరల్గా మారింది. లక్షల మంది షేర్ చేశారు. దాదాపు కోటి (9.7 మిలియన్లు) వ్యూస్ దక్కించుకుంది.Dad shields his daughter with his body after she stepped into a train’s pathpic.twitter.com/Blqs1UISc8— Interesting things (@awkwardgoogle) June 16, 2025కన్నబిడ్డకోసం తండ్రి చేసిన సాహసం, తండ్రి చూపిన ప్రేమను చూసి సూపర్ డాడ్ అంటూ పొగిడేస్తున్నారు. పిల్లల కోసం తల్లిదండ్రుల అసామాన్య త్యాగాలు అంటూ ఎమోషనల్ అవుతున్నారు. తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు మరొక వినియోగదారు వ్యాఖ్యానించారు, "ఈ వీడియో చూసిన తర్వాత నా కళ్ళు చెమ్మగిల్లాయని మరొకరు కామెంట్ చేశారు. "మరికొందరు మాత్రం ఇది అవసరమా, ఏదైనా తేడా వస్తే పరిస్థితి ఏంటి? అంటూ మండిపడుతున్నారు.ఇదీ చదవండి: Air India Incident భారీ విరాళం ప్రకటించిన యూఏఈ వైద్యుడుఅసలు విషయం ఏమిటంటే..అయితే, ఈ సంఘటన జనవరి 27, 2020న ఈజిప్టులోని ఇస్మాయిలియాలో జరిగింది. ఈ ఘటన ఎక్కడ జరిగినా రైల్వే ప్రయాణాల్లో మాత్రం అప్రమత్తత అవసరం అని ఈ సంఘటన రుజువు చేస్తోంది. -
Plane Crash: విమాన ప్రమాద ఘటనలో బయటపడ్డ షాకింగ్ వీడియో
-
ఆ 16 అమ్మాయి డ్యాన్స్కు.. నటి ప్రియాంక చోప్రా సైతం ఫిదా..
రాత్రికి రాత్రికే స్టార్ డమ్ తెచ్చుకుంది ఓ యువతి. ఎలాంటి శిక్షణ లేకుండానే లయబద్ధంగా కాళ్లు కదుపుతూ నృత్యం చేసి అందర్నీ ఆశ్యర్యపరిచింది. సెలబ్రిటీల మన్ననలను అందుకుని ఒక్కసారిగా సోష్ల్ మీడియా స్టార్డమ్ హోదాను అందుకుంది. ఎవరామె అంటే..చత్తీగఢ్లోని జగదల్పూర్కి లావణ్యదాస్ (Lavanya Das) స్థానిక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడి కుమార్తె. ఈ 16 ఏళ్ల అమ్మాయి ఆశా భోంస్లే ఆజాకు పియా తు అబ్ పాట లయబద్ధంగా బెల్లీడ్యాన్స్ చేసింది. ఆ వీడియోని జూన్ 4న ఇన్స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. అంతే ఒక్కసారిగా ఆ వీడియో ఆమెకు ఎంతమంచి క్రేజ్ని తెచ్చిపెట్టిందంటే.. సాక్షాత్రు బాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంక చోప్రా.. ఆమె నృత్య ప్రతిభకు ముగ్దురాలైంది. ఆ జబల్పూర్ పట్టణంలోని సక్సెస్ కాన్వెంట్ స్కూల్లో పన్నెండో తరగతి చదువుతున్న లావణ్య తన వీడియో ప్రియాంక చోప్రాను ఆకర్షిస్తుందని అస్సలు అనుకోలేదు. ఏదో సరదాగా పోస్ట్ చేసిన వీడియో ఇంత మంచి ఫేమ్ తెచ్చిపెట్టినందుకు ఆనదంతో ఉబ్బితబ్బిబవ్వుతోంది. నిజానికి లావణ్య నటుల కుటుంబ నుంచి వచ్చిన నేపథ్యమే ఆమెది. బహుశా అదే ఆమెకు వారసత్వంగా వచ్చి.. ఇలా నృత్యకారిణిగా పేరుతెచ్చుకునేందుకు కారణమై ఉండొచ్చు. ఆమె తల్లి నీలిమా దాస్ మాణిక్పూరి, హల్బీ మాండలికంపై మంచి పట్టు ఉన్న తాతయ్య భాగీరథి దాస్ మహానంది ఇద్దరూ ధియేటర్ నటులు. ఇక లావణ్య కూడా వారి బాటలోనే పయనిస్తోంది. ఆమె ఇప్పటికే ఒడిస్సా, ఛత్తీస్గఢ్ సంగీత వీడియోలలో నటించింది. అలాగే దూరదర్శన్ కార్యక్రమాల్లో బాల కళాకారణి కూడా. నిజానికి ఆమె నృత్యం లేదా నటనలో ఎటువంటి శిక్షణ పొందలేదు. ఆమె స్వయం శిక్షిత నృత్యకారిణి. అయితే ఆమె తల్లి నీలిమ శిక్షణ పొందిన కథక్ నృత్యకారిణి, పైగా ట్యూటర్గా పనిచేస్తున్నారామె. ప్రస్తుతం లావణ్య తన పన్నెండో తరగతి పరీక్షలు పూర్తి అయ్యిన వెంటనే ఢిల్లీ లేదా హైదరాబాద్ నగరంలో యాక్టింగ్ కోర్సులో చేరాలనుకుంటున్నట్లు పేర్కొంది. ఇక ఆమె తండ్రి 2019లో మరణానంతరం ఈ తల్లి కూతుళ్లిద్దరూ తమ కుటుంబ సంప్రదాయ కళను కొనసాగిస్తున్నారు. చదవండి: ప్రపంచం మెచ్చిన మన ప్రాంతీయ స్వీట్స్ ఇవే..! -
Birthday Celebrations: అట్లుంటది.. హనుమంతన్న తోని
-
పెంపుడు కుక్క చేసిన పనికి "యజమాని"షాక్
-
ఛాతికి గురిపెట్టి.. కటకటాల్లోకి రివాల్వర్ రాణి
డబ్బు ఉందనే పొగరు.. అధికారం ఉందనే అహంకారంతో కిందిస్థాయి సిబ్బందితో కొందరు వ్యవహరించే తీరు తీవ్ర విమర్శలకు తావిస్తుంటుంది. అలాంటిదే ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన. కారు దిగమని మంచిమాటగా చెప్పినందుకు.. పెట్రోల్ బంకు సిబ్బందిపైనే ఓ కుటుంబం దౌర్జన్యానికి దిగింది. ఆ ఇంటి బిడ్డ అయితే ఏకంగా తుపాకీతో సిబ్బందినే చంపుతానంటూ బెదిరించింది. వివరాల్లోకి వెళ్తే..ఉత్తర ప్రదేశ్ హర్దోయ్లో(Hardoi Viral Video) జరిగిన ఘటన తాలుకా వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇషాన్ ఖాన్ అనే వ్యక్తి తన భార్య, బిడ్డతో కలిసి కారులో బయటకు వచ్చాడు. బిల్గ్రామ్ ఏరియాలోని ఓ సీఎన్జీ పెట్రోల్ పంప్ దగ్గర వాళ్ల కారు ఆగింది. అయితే.. గ్యాస్ నింపుతున్న టైంలో కారు దిగాలంటూ ఇషాన్ను మర్యాదపూర్వకంగా అక్కడి సిబ్బంది కోరారు. దీంతో.. ఊగిపోతూ నన్నే కారు దిగమంటావా? అంటూ దుర్భాషలాడుతూ సిబ్బందితో గొడవకు దిగాడు ఇషాన్. ఈలోపు.. అతని భార్య, కూతురు కూడా బయటకు వచ్చి ఆ గొడవలో చేరారు. కూతురు సురుష్ఖాన్(అరిబా) కారు వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి అందులో ఉన్న రివాల్వర్ను బయటకు తీసుకొచ్చింది. నేరుగా అక్కడి సిబ్బంది ఛాతీకి గురిపెట్టి ‘‘కాల్చేయమంటావా?’’ అంటూ బెదిరింపులకు దిగింది. ఈలోపు.. అక్కడున్న జనం వాళ్లను దూరం తీసుకెళ్లి సర్దిచెప్పి పంపించి వేశారు. అయితే అక్కుడున్న సీసీ ఫుటేజీలో ఆ వీడియో అంతా రికార్డయ్యింది.'इतनी गोली मारूंगी की परिवार वाले...' यूपी में 'रिवॉल्वर रानी' की दबंगई का वीडियो वायरलउत्तर प्रदेश के हरदोई जिले से एक सनसनीखेज़ मामला सामने आया है, जहां सीएनजी पंप पर कहासुनी के बाद एक लड़की ने कर्मचारी पर लाइसेंसी रिवॉल्वर तान दी. घटना उस वक्त हुई जब एहसान ख़ान नाम का शख्स… pic.twitter.com/tVNOM5IfJb— NDTV India (@ndtvindia) June 16, 2025ఘటనపై బాధితుడు రజనీష్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ భార్యభర్తలతో కూడా ఆ రివాల్వర్ రాణిని కూడా అరెస్ట్ చేశారు. రివాల్వర్తో పాటు 25 క్యాట్రిడ్జ్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఆ రివాల్వర్ ఇషాన్ లైసెన్స్డ్ ఆయుధంగా పోలీసులు నిర్ధారించుకున్నారు. అయితే దురుసుగా ర్తించడంతో పాటు చంపుతామని బెదిరించినందుకుగానూ ఆ కుటుంబంపై మొత్తానికి కేసు నమోదయ్యింది. #HardoiPoliceथाना बिलग्राम पुलिस द्वारा मु0अ0सं0 268/25 धारा 115(2)/352/351(3) बीएनएस व धारा 30 आर्म्स एक्ट से संबंधित कृत कार्यवाही के संबंध में-#UPPolice pic.twitter.com/hsYiegkb1v— Hardoi Police (@hardoipolice) June 16, 2025 -
ప్యాసింజర్ ను చెంపదెబ్బ కొట్టిన ర్యాపిడో డ్రైవర్
-
సౌదీ ఎయిర్లైన్స్ విమానానికి ప్రమాదం
-
లైకులు, వ్యూస్ కోసం ఇంత దిగజారాలా?
ఒకవైపు.. ఘోర ప్రమాదంలో అయినవాళ్లను కోల్పోయి పుట్టెడు దుఖంలో బాధిత కుటుంబాలు రోదిస్తున్నాయి. డీఎన్ఏ పరీక్షలు పూర్తి కాకపోవడంతో మృతదేహాల కోసం బీజే మెడికల్ కాలేజీ ఆస్పత్రి వద్ద పడిగాపులు కాస్తున్నాయి. ఈలోపు.. సోషల్ మీడియాలో లైక్స్, వ్యూస్ కోసం కొందరు దిగజారి ప్రవర్తిస్తున్నారు. మృతుల గురించి తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేస్తున్నారు. ఈ పరిణామాలపై బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.కొమ్మి వ్యాస్.. తన భార్య, ముగ్గురు పిల్లలతో లండన్లో స్థిరపడేందుకు ఎయిరిండియా విమానం ఎక్కడిన డాక్టర్. అయితే అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాదంలో ఆ కుటుంబం మొత్తం దుర్మరణం పాలైంది. ఇప్పుడు.. ఆ ఫ్యామిలీని బద్నాం చేస్తూ కొన్ని ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. విమానం ఎక్కిన తర్వాత ఫ్యామిలీ ఫొటోను వ్యాస్ తన కుటుంబానికి చెందిన వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేశారు. అయితే ఆ ఫొటోను ఏఐ వీడియోగా కొందరు వైరల్ చేస్తున్నారు. మరికొందరు.. ఒక అడుగు ముందుకు వేసి వ్యాస్ కూతురు మిరాయ ఫొటోను, ఓ వీడియోను తెరపైకి తీసుకొచ్చారు. ‘‘మా కుటుంబాన్ని కోల్పోయామన్న బాధలో మేముంటే.. కొందరు విలువలు మరిచి ప్రవర్తిస్తున్నారు. ఎడిట్ చేసిన వీడియోను వైరల్ చేస్తున్నారు. మా పాప మిరాయ్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. డీఎన్ఏ టెస్టులో ఏ మృతదేహం అనేది దృవీకరణ కాలేదు. కానీ.. ఈలోపే మిరాయ్ అంత్యక్రియలంటూ భావోద్వేగం పేరిట ఓ వీడియోను పోస్ట్ చేసి కొందరు వ్యూస్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇలాగేనా చేసేది?’’ అంటూ వ్యాస్ కుల్దీప్ భట్ ఆవేదన-అసహనం వ్యక్తం చేశారు. వ్యాస్ కుటుంబం మాత్రమే కాదు.. బాధిత కుటుంబాలు చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇలాంటి కంటెంట్ను ఖండిస్తోంది. సంబంధం లేని వీడియోలు, కంటెంట్ను తెర మీదకు తీసుకొచ్చి షేర్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘ప్రమాదం జరిగిన నాటి నుంచే ఇలాంటి కంటెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎక్కడెక్కడివో వీడియోలను తెచ్చి.. ఎయిరిండియా విమానంలోవి అంటూ పోస్టులు పెడుతున్నారు. మా వాళ్లకు ఏమాత్రం సంబంధం లేని పోస్టులు ఇన్స్టాగ్రామ్, ఎక్స్(ట్విటర్)లలో కనిపిస్తున్నాయి. వీటి ఆధారంగా మీడియా సంస్థలు కూడా వార్తలు ప్రచురిస్తున్నాయి. అసలేం చేస్తున్నారు?. ఇలాంటి విషాద సమయంలోనూ కనీస నైతిక విలువలు పాటించరా?’’ అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు విమాన ప్రమాదంపైనా జోకులు, మీమ్స్ వేస్తున్న పరిస్థితి. ఈ తరుణంలో.. ప్రభుత్వాలైన స్పందించి అలాంటి కంటెంట్ను కట్టడి చేయాలని కోరుతున్నారు మరికొందరు. -
హాటెస్ట్ కర్రీ చాలెంజ్.. ఈ బ్రో తిప్పలు చూడండి!
ఫుడ్ ఛాలెంజెస్లో ఒక్కోసారి ఇబ్బందులు తప్పవు. అప్పుడప్పుడూ ఊహించని దుష్పరిణామాలు కూడా సంభవిస్తూ ఉంటాయి. లండన్లోని ప్రసిద్ధ భారతీయ రెస్టారెంట్లో హాటెస్ట్ కర్రీ తిని ఓ కంటెస్టెంట్ నానా ఇబ్బందులు పడ్డాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట సంచలనంగా మారింది. పదండి దీని కథా కమామిష్షు ఏంటో తెలుసుకుందాం.లండన్ లోని హాటెస్ట్ కర్రీ..బెంగాల్ విలేజ్ (Bengal Village) లో దొరుకుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 72 ఘాటైన మసాలా దినుసులతో అత్యంత కారంగా ఈ కర్రీని వండి వారుస్తారు బెంగాల్ విలేజ్ వంటగాళ్లు. ముఖ్యంగా కారోలినా రీపర్, స్కాచ్ బోనెట్, నాగ, బర్డ్స్ ఐ,స్నేక్ చిల్లి వంటివి ఉపయోగిస్తారు. ఆవాలు, మెంతులు, జీలకర్ర మొదలైన వాటితో వండుతారు. గ్రేవీని నెయ్యి, వెల్లుల్లి, ఉల్లిపాయ, మిరపకాయలు, మసాలా దినుసులు కొన్ని టమోటాలతో తయారు చేస్తారు. మధ్యలో పసుపు మిరపకాయను పైకి తిప్పి, తరిగిన కొత్తిమీరతో అలంకరించి వడ్డిస్తారు. తమిళ ప్రిన్స్, గనపతి , బాలుచి వంటివి కూడా ఉన్నాయి. ఇది వండేటపుడు చెఫ్లు గ్లౌజెస్ తప్పకుండా ధరిస్తారు. ఇదీ చదవండి: చిన్న ప్రాణితో.. ప్రాణానికే ముప్పు: ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బెంగాల్ విలేజ్ అనేది UKలోని లండన్లోని బ్రిక్ లేన్లో ఉన్న ఒక భారతీయ వంటకాల రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ అనేక ఆహార సవాళ్లకు ప్రసిద్ధి చెందింది, చాలా ధైర్యవంతులే హాటెస్ట్ కర్రీ ఛాలెంజ్లో పాల్గొంటారు. ఈ రెస్టారెంట్ అధికారిక X హ్యాండిల్లో ఇటీవల పోస్ట్ చేసిన వీడియోలో వారి "హాటెస్ట్ కర్రీ" ప్రయత్నించిన వ్యక్తి దయనీయ స్థితిలో ఉన్న కస్టమర్ను చూడవచ్చు. రెస్టారెంట్ యజమాని చేతిలో ఒక గ్లాసు నీరు పట్టుకుని బ్రో. కాసిన్ని నీళ్లు తాగు బ్రో.. ఒక్క సిప్ చాలు" అని రెస్టారెంట్ బతిమలాడుతున్నాడు. చివరికి ఒక గుక్క నీళ్లు తాగి అతగాడు తెప్పరిల్లాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది. (Today tips : బొద్దింకలతో వేగలేకపోతున్నారా?)After math of the #Londonshottestcurry pic.twitter.com/0SrpWWLTfH— Bengal Village - Best of Brick Lane (@Bengal_Village) June 14, 2025 -
ఆ కుటుంబంలో 56 ఏళ్ల తర్వాత పండంటి పాపాయి..!
ఇటీవల కాలంలో బ్రూణ హత్యలు ప్రభలంగా జరుతున్నాయి. ఆడపిల్ల అనగానే ఎక్కడలేని అక్కసు చూపిస్తూ..భూమ్మీద పడకుండానే చూస్తున్నారు కొందరు ప్రబుద్ధులు. ఎంతలా ఐఏ వంటి సాంకేతికత అభివృద్ధి చెందుతున్న ఆడపిల్ల అనే విషయంలో వివక్ష మాత్రం ఉంటూనే ఉంది. ఎందుకనో గానీ మగబిడ్డ అనగానే సంబరాలు చేసుకోగలిగినంతగా ఆడపిల్ల పుట్టింది అనంగానే ఆ ఊసే రాదు. పైగా ఒక్కసారిగా నిస్సత్తువ వచ్చేస్తుంది కొందరికి. కానీ ఇక్కడ అలాంటి వాటన్నింటికి భిన్నంగా ఓ ఆడశిశువుకు మహారాణి రేంజ్లో స్వాగతం పలికి అందర్నీ ఆశ్చర్యపరించింది ఓ కుటుంబం. ఈ ఘటన ఆడపిల్లలు ఎన్నటికీ మహారాణులు..వాళ్లు నట్టింట తిరుగాడితే..మహాలక్ష్మీ ఇంటికి వచ్చినంత వేడుక అనే చాటిచెప్పేలా ఈ కుటుంబం సంబరాలు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. ఆ వీడియోలో ఓ కుటుంబం తమ ఇంటిలో 56 ఏళ్ల తర్వాత పుట్టిన తొలి ఆడ శిశువు జననం అని ఎంతలా గ్రాండ్గా స్వాగతం పలికారో చూస్తే..రెండు కళ్లు చాలవు. ఓ వీఐపీ మాదిరికి భారీ వాహనాల కాన్వాయితో ఊరేగింపుగా ఇంటికి తీసుకొచ్చారు. ఇంటి వద్ద పింక్ కలర్ బెలూన్లు, అందమైన పూలతో ఆ చిట్టిపాపాయికి ఘన స్వాగతం పలికారు. పైగా ఆ వీడియోకి మా కుటుంబంలో 56 ఏళ్ల తర్వాత పుట్టిన అమ్మాయి అనే క్యాప్షన్ జోడించి మరీ పోస్ట్ చేశారు. నెటిజన్లు కూడా కూమార్తెను స్వాగతించడంలో ఓ గర్వం, మాటల్లో చెప్పలేని ఆనందం ఆ కుంటుంబంలో ప్రతిబించిందని ప్రశంసించారు. View this post on Instagram A post shared by Chahat Rawal (@dr.chahatrawal) (చదవండి: ఆ తండ్రి ప్రాణం నిలుపుతుంటే..కుమార్తె ప్రాణం పోస్తోంది..) -
బిడ్డ కోసం తల్లడిల్లిన తల్లి..! సాక్షాత్తు ఆ దేవుడే..
దేవుడు పిలిస్తే పలుకుతాడు. ప్రార్థిస్తే స్పందిస్తాడు అనేది చాలామంది భక్తుల నమ్మకం. ఆశ్చర్యకరంగా ఈసారి తల మీద అభయహస్తం ఉంచి ఆశీర్వదిస్తూ కెమెరాకు చిక్కాడు. నిజం, ఫొటోలో కనిపిస్తున్న చేయి, మామూలు చేయి కాదని, ఇది స్వర్గం నుంచి వచ్చిన దేవుని అభయహస్తమని నెటిజన్లు చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సంగతి ఏంటంటే, కెంటకీ అమాండా అనే మహిళ, ఎనిమిది నెలల గర్భవతి. అంతా మూములుగా సాగుతున్న ఆమె జీవితంలో అనుకోకుండా ఒక చేదునిజం, రోజూ ఆమెను కలతకు గురిచేసింది. కడుపులోని బిడ్డకు గుండె సంబంధిత సమస్య ఉందని డాక్టర్లు చెప్పారు. దీంతో, ఆ తల్లి ప్రతి స్కాన్కి ముందు దేవుడిని ఒక్కటే అడిగేది– ‘దేవుడా! నా బిడ్డ ఆరోగ్యాన్ని రక్షించు’ అని. అలా ఒకరోజు అల్ట్రాసౌండ్ స్క్రీన్పై బిడ్డ తల మీద ఒక పెద్ద చేయి పెట్టి ఆశీర్వదిస్తున్నట్లు కనిపించి దేవుడు ఆమె ప్రార్థనలకు సమాధానం ఇచ్చాడు. దీంతో, ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు. ‘దేవుడు నా బిడ్డను ఆశీర్వదించాడు’ అంటూ సంతోషంలో మునిగిపోయింది. ‘ఇది ఫొటో కాదు, ఆకాశం నుంచి వచ్చిన దేవుని ప్రేమ. దేవుడు నా ప్రార్థనకు ఇచ్చిన సమాధానం’ అంటూ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కొంతమంది ‘అది బిడ్డ చేయే’ అని వాదించినా, చాలామంది ఇది నిజంగానే దేవుడి ఆశీర్వాదంగా... ‘ఈ ఫొటోలో దేవుడి చేయి మాత్రమే కనిపించలేదు. నీ బిడ్డను తాకాడు. భరోసా ఇచ్చాడు. తన ప్రేమను చూపాడు. ’ అంటూ ఆమె నమ్మకాన్ని మరింత బలపరుస్తున్నారు. (చదవండి: హాట్టాపిక్గా విమానంలోని 11A సీటు..ఎవ్వరూ ఎందుకిష్టపడరంటే..?) -
వివాదంలో డీఎస్పీ సతీమణి.. పార్టీ ఇలా కూడా చేసుకుంటారా?
రాయ్పూర్: ఆమె ఓ ప్రభుత్వ అధికారి భార్య. నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన మహిళ.. బాధ్యత మరిచిపోయి ఓవరాక్షన్ చేసింది. డీఎస్పీ సతీమణి.. తన పుట్టినరోజు సందర్భంగా చేసిన తప్పిదం తీవ్ర చర్చకు దారి తీసింది. ఆమె.. ప్రభుత్వ వాహనం బ్యానెట్పై కూర్చుని కేక్ కట్ చేస్తూ.. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగులు.. ప్రభుత్వ వాహనాలను తమ వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించడం ఈ మధ్య కాలంలో తరచుగా కనిపిస్తూనే ఉంది. తాజాగా ఛత్తీస్గఢ్లోని జంజ్గిర్-చాంపా జిల్లా డీఎస్పీ తస్లీం ఆరీఫ్ భార్య ఫర్హీన్ ఖాన్ తన పుట్టినరోజు వేడుకలను ఒక ప్రభుత్వ వాహనం ఉపయోగించడం వివాదాస్పదంగా మారింది. ఫర్హీన్ ఖాన్ తన పుట్టినరోజు సందర్భంగా.. పోలీసు శాఖకు చెందిన వాహనం బ్యానెట్పై కూర్చొని కేక్ కట్ చేసింది.ఇక, కేక్ కటింగ్ సందర్భంగా.. “స్నో స్ప్రే” తో వాహనం అద్దంపై “32” అని రాసింది. తరువాత డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తి వైపర్స్తో దాన్ని తుడిచేశాడు. అనంతరం ఆమె మళ్లీ “33” అని రాస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి. ఇదే సమయంలో కారు బ్యానెట్పై కేక్, పుష్పగుచ్ఛం కూడా ఉంచారు. ఈ రీల్ వీడియోను సరగానా రిసార్ట్(Saragana Resort)లో చిత్రీకరించినట్లు సమాచారం. ఇక కారు అలా ముందుకు పోతుంటే బ్యానెట్పై డీఎస్పీ సతీమణి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సమయంలో సదరు పోలీసు వాహనంలో మరికొందరు మహిళలు కూడా ఉన్నారు. వారంతా ఎంజాయ్ చేస్తున్నట్టు వీడియోలో కనిపిస్తోంది.DSP की पत्नी ने नीली बत्ती वाली कार के बोनट पर बैठकर मनाया बर्थडे, वायरल हुआ वीडियो छत्तीसगढ़ के बलरामपुर जिले में पुलिस बटालियन में तैनाच डीएसपी तस्लीम आरिफ की पत्नी नीली बत्ती लगी सरकारी कार के बोनट पर बैठकर अपना बर्थडे मना रही है. यह वीडियो सोशल मीडिया पर खूब वायरल हो रहा… pic.twitter.com/iarwZ1j71f— NDTV MP Chhattisgarh (@NDTVMPCG) June 13, 2025అయితే, సదరు అధికారి భార్య తన పుట్టినరోజు వేడుకలకు ప్రభుత్వ వాహనం ఉపయోగించడం చర్చనీయాంశంగా మారింది. నిబంధనల ప్రకారం అధికారిక వాహనాలు కేవలం ప్రభుత్వ అవసరాలకే వినియోగించాలి. వ్యక్తిగత వేడుకల కోసం ఇటువంటి వాహనాలను వినియోగించడం నిబంధనలకు విరుద్ధం. ముఖ్యంగా బ్లూ బీకాన్(blue beacon) వంటి అధికార గుర్తింపు చిహ్నాలున్న వాహనాలను వినియోగించడం నేరంగా పరిగణిస్తారు. దీంతో, పలువురు నెటిజన్లు ఆమెపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై ఇప్పటివరకు సంబంధిత డీఎస్పీపై ఎలాంటి అధికారిక చర్య తీసుకోకపోవడం గమనార్హం. View this post on Instagram A post shared by Brut India (@brut.india) -
దుబాయ్: 67 అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం..
దుబాయ్: అరబ్ దేశం దుబాయ్లో ఘోర అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ‘టైగర్ టవర్’గా పేరొందిన 67 అంతస్తుల ‘మెరీనా పినాకిల్’ భవనంలో అర్ధరాత్రి పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. సహాయక బృందాలు.. 3,820 మంది నివాసితులను సురక్షితంగా బయటకు తరలించాయి. ఇక, ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బాధితులకు తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేశారు.వివరాల ప్రకారం.. దుబాయ్లో ‘మెరీనా పినాకిల్’ భవనంలో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. దాదాపు 6 గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు స్థానిక మీడియా తెలిపింది. అగ్ని ప్రమాదం నేపథ్యంలో సహాయక బృందాలు 764 ఫ్లాట్ల నుంచి 3,820 మంది నివాసితులను సురక్షితంగా బయటకు తరలించాయి.A massive fire broke out at the 67-story Marina Pinnacle (also known as Tiger Tower) in Dubai Marina on June 13, 2025, starting around PM. Dubai Civil Defense teams evacuated 3,820 residents from 764 apartments, with no reported injuries or casualties. The fire, which began… pic.twitter.com/OOsWDHj6pu— EternalChaos (@EternalChaos158) June 14, 2025 ఇక, అగ్ని ప్రమాదం కారణంగా ప్రమాదస్థలిలో అంబులెన్సులు, వైద్యసిబ్బందిని మోహరించారు. ఎటువంటి ప్రాణనష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బాధితులకు తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేశారు. మెరీనా పినాకిల్లో మంటలు చెలరేగడం ఇదే మొదటిసారి కాదు. 2015లోనూ 47వ అంతస్తులో మంటలు చెలరేగి.. 48వ అంతస్తుకు వ్యాపించాయి. సహాయక సిబ్బంది మంటలార్పారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడయాలో వైరల్గా మారాయి. 🚨 BREAKING: Scenes from Dubai, As Projectile from Yemen hits a Marina Pinnacle Tower or Tiger Tower in Dubai Marina. This is a first inclident during the ongoing Iran Israel war in UAE pic.twitter.com/eVxPrJ6Wyu— True Pulse Global (@truepulseglobal) June 14, 2025 -
‘మై లవ్..’గర్ల్ఫ్రెండ్ కోసం ఒంటరిగా కుమిలి కుమిలి : వైరల్ వీడియో
Air India Plane crash అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోగా, అందరినీ దుఃఖంలో ముంచెత్తింది. భయంకరమైన ప్రమాదంలో తన ప్రియురాలిని కోల్పోయిన వ్యక్తి ఆసుపత్రిలో ఒంటరిగా రోదిస్తున్న వీడియో వైరల్గా మారింది.అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం యావద్దేశాన్ని దిగ్భ్రాతిలో ముంచెత్తింది. ఈ ఘోర ప్రమాదంలో తమ కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయిన వారు రోదిస్తున్న అనేక దృశ్యాలు వైరల్ అయ్యాయి. విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తన ప్రియురాలి మృతదేహం కోసం మౌనంగా రోదిస్తున్నాడు. గుండెలు పగిలే దుఃఖంతో కన్నీళ్లు పెట్టుకుంటున్న వీడియో పలువురి హృదయాలను ద్రవింప జేస్తోంది. ఒంటరిగా కూర్చుని కళ్ళు మూసుకుని కన్నీరు కార్చుతున్న అతణ్ని ఎవరికోసం ఎదురు చూస్తున్నారని అక్కడి అధికారి అడిగినపుడు, ‘మై లవ్ అంటూ సమాధానం చెప్పడంతో పలువురి కంట నీళ్లు తెప్పించింది. ప్రమాదం జరిగిన వెంటనే ముంబై నుండి ఇక్కడికి చేరుకున్నాడు. తన ప్రియురాలి మృతదేహం కోసం ఆసుపత్రిలో ఎదురు చూస్తున్న ఒంటరి వ్యక్తి, ఇలాంటి దృశ్యాలను చూడటం నిజంగా హృదయ విదారకంగా అంటూ జర్నలిస్ట్ వీడియోను షేర్ చేశారు. జూన్ 12, 2025న జరిగిన విమాన ప్రమాదంలో AI171 అహ్మదాబాద్ నుండి లండన్కు వెళుతుండగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే నియంత్రణ కోల్పోయి B.J. మెడికల్ కాలేజీ గోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో క్యాబిన్ సిబ్బంది, ప్రయాణికులు, విద్యార్థులు , స్థానికులు సహా 272 మంది మరణించారు. At hospital waiting room, we found this young man. The body was yet to be handed over. He quietly sat there and wept on his own. He lost his girlfriend. No one by his side but a whole bundle of memories that he has to live with for the rest of his life. “Who are you waiting… pic.twitter.com/pdxsZhBPPN— Tamal Saha (@Tamal0401) June 13, 2025 -
అర సెంటులో కట్టిండ్రు మూడంతస్తుల మేడా
-
ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్న కప్పలు
-
Plane Crash: బీజే మెడికల్ కాలేజీలో CCTV విజువల్స్
-
ప్రశ్నించినందుకు! ఈడ్చుకెళ్లి, బేడీలేసి..
అమెరికా రాజకీయాల్లో ఓ ఘటన కలకలం రేపింది. కాలిఫోర్నియా సెనేటర్, డెమొక్రటిక్ సభ్యుడు అలెక్స్ పాడిల్లా(Alex Padilla)తో భద్రతా సిబ్బంది ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. బలవంతంగా లాక్కెళ్లి మరీ ఆయన్ని నేల మీద పడుకోబెట్టి.. చేతులు వెనక్కి విరిచి బేడీలు వేశారు అధికారులు. అమెరికా కాలమానం ప్రకారం.. గురువారం లాస్ ఏంజెల్స్లో హోంల్యాండ్ సెక్యూరిటీ(DHS) సెక్రటరీ క్రిస్టి నోయెమ్ ప్రెస్మీట్ నిర్వహించారు. గత వారం రోజులుగా అక్కడ వలసదారుల నిరసనలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ ఎంత మంది వివరాలు సేకరించారో గణాంకాలను నోయెమ్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ఇంతలో ఓ వ్యక్తి ‘‘నా పేరు అలెక్స్ పాడిలా. సెనేటర్ని. సెక్రటరీకి నాదో ప్రశ్న అంటూ మాట్లాడబోయారు. ఇంతలో..URGENT BREAKING: Democrat US Senator Alex Padilla was just thrown to the ground and arrested for trying to speak at a DHS Press Conference by Secretary Kristi Noem. This is Trump’s America. This is so incredibly pathetic. I am so sad for the state of this country. pic.twitter.com/yI9fKdoYoW— Brian Krassenstein (@krassenstein) June 12, 2025అక్కడున్నన సిబ్బందిని ఆయన్ని బయటకు లాక్కెళ్లారు. ఈ క్రమంలో ఆయనకు, వాళ్ల మధ్య పెనుగులాట జరిగింది. అనంతరం.. ఎఫ్బీఐ సిబ్బంది ఆయన్ని బలవంతంగా నేల మీద పడుకోబెట్టి.. చేతులు వెనక్కి విరిచి.. బేడీలు వేసి అదుపులోకి తీసున్నారు. అయితే కాసేపటికే ఆయన్ని అధికారులు విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.డీహెచ్ఎస్ ఈ చర్యలను సమర్థించుకుంది. పాడిల్లాను దాడి చేయడానికి వచ్చిన వ్యక్తిగా భావించి అధికారులు అలా ప్రవర్తించారని చెప్పుకొచ్చింది. ఆయన చర్యను పొలిటికల్ డ్రామాగా అభిర్ణించింది. అయితే కాసేపటికే ఆయన్ని విడుదల చేశామని, నోయెమ్-పాడిల్లా 15 నిమిషాలపాటు భేటీ అయ్యారని ప్రకటించింది. మరోవైపు ఎఫ్బీఐ డిప్యూటీ డైరెక్టర్ డాన్ బోంగినో కూడా తమ సిబ్బంది చర్యను వెనకేసుకొచ్చారు. ఈ ఘటనపై అలెక్స్ పాడిల్లా స్పందించారు. ఒక సెనేటర్ విషయంలోనే ఇలా జరిగితే.. సాధారణ వర్గాల ప్రజలతో ఇంకెలా వ్యవహరిస్తారో? అని నిలదీశారాయన. వలసవాదులతో ఎలా వ్యవహరిస్తున్నారో.. ఈ దేశ పౌరులతోనూ అలాగే దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారాయన. మరోవైపు డెమొక్రటిక్ పార్టీ నేతలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ట్రంప్ పాలనలో ఇలాంటి దుర్మార్గాలు కూడా మొదలయ్యాయ వ్యాఖ్యానిస్తున్నారు. కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్, కమలా హారిస్, సెనేట్లో మైనారిటీ నేత చుక్ షూమర్ తదితరులు ఈ ఘటనను ఖండించారు. ఇంకోవైపు రిపబ్లికన్ పార్టీలోనూ ఈ ఘటనపై పలువురి నుంచి ప్రతికూల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై అధ్యక్షుడు ట్రంప్ స్పందించాల్సి ఉంది. -
Plane Crash: ప్రమాదం దగ్గర ప్రస్తుత పరిస్థితి
-
Plane Crash: పైలట్ షాకింగ్ నిజాలు
-
భర్త రాజా రఘువంశీని హత్య చేయించినట్టు ఒప్పు కున్న సోనమ్
-
అమెరికాలో వాల్మార్ట్లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్
పిల్లలు విద్యాబుద్ధులు నేర్చుకుని, ప్రయోజకులైతే కన్న తల్లిదండ్రులకు అంతకన్నా సంతోషం మరొకటి ఉండదు. అలాగే బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి అమ్మానాన్నల్ని బాగా చూసుకోవాలని పిల్లలంతా కలలు కంటారు. తమ కల సాకారమైన వేళ వారి సంతోషానికి అవధులే ఉండవు. అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది.అమెరికాలోని వాల్మార్ట్లో పనిచేస్తున్న భారతీయ యువతి తన తల్లిదండ్రులను వాల్మార్ట్ కార్యాలయానికి తీసుకెళ్లింది. అక్కడ మీటింగ్ రూం, జిమ్, స్విమ్మింగ్ పూల్, ఇలా అన్ని చోట్లకు ఆనందంగా తీసుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఇది ఆన్లైన్లో పలువురి హృదయాలను తాకింది. View this post on Instagram A post shared by Devshree Bharatia (@devshree.17) వాల్మార్ట్ యుఎస్ ప్రధాన కార్యాలయంలో పనిచేసే దేవశ్రీ భారతియా తన పేరెంట్స్ను ఆఫీసుకు తీసుకెళ్లింది. లగ్జరీ ఆఫీసులోని అణువణువును వారికి పరిచేసింది. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. తల్లి దండ్రులు సంతోషంతో ఉప్పొంగిపోయారు ఈ చిన్న క్లిప్ వీడియోకు 10.1 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. 24,000 కంటే ఎక్కువ లైక్లు వచ్చాయి. ‘‘నా తల్లిదండ్రులు USA లోని నా వాల్మార్ట్ కార్యాలయాన్ని మొదటిసారి సందర్శించారు. ఇంత విలాసవంతమైన ఆఫీసును ఎప్పుడూ చూడలేదు. ఇక్కడి సౌకర్యాలు చూసి ఆశ్చర్యపోయారు. చాలా సంతోషించారు. బిడ్డలు ఆశపడే సంతోషంతో గర్వించే తల్లిదండ్రులు’’ అంటూ దేవ్శ్రీ పోస్ట్ చేసింది.చాలా మంది నెటిజనులు సంతోషంగా స్పందించారు. ‘‘పిల్లలకు తల్లిదండ్రులకు, ఇది చాలా గొప్ప అనుభవం. వారి చిరునవ్వులు ఎప్పటికీ శాశ్వతం. వారి కళ్లలో మెరుపు, సంతోషం వీడియో అంతా స్పష్టంగా కనిపిస్తోంది. "ప్రతి కొడుకు/కూతురు కల" అని రాశాడు. " సూపర్ ఈ అనుభూతి ఎప్పటికీ దిబెస్ట్ అని మరొకరు వ్యాఖ్యానించారు. "ఇది నన్ను భావోద్వేగానికి గురిచేసింది - ప్రతి తల్లిదండ్రులు ఈ క్షణానికి అర్హులు" చాలా బావుంది!! అభినందనలు!! ప్రతి బిడ్డకు అత్యంత గర్వకారణమైన క్షణం!!" ఇలా నెటిజన్లు కామెంట్ చేశారు. అంతేకాదు తాము కూడా ఒకరోజు ఇలాంటి విజయాన్ని సాధించాలి అంటూ ప్రేరణ పొందడం విశేషం. -
హనీమూన్ హత్య కేసు: కట్టలు తెంచుకున్న కోపం.. చెంప పగిలింది
ఇష్టం లేని వివాహం చేశారని.. ప్రియుడితో కలిసి భర్త రాజా రఘువంశీ పక్కా స్కెచ్తో ప్రాణం తీసింది సోనమ్. ఒకవేళ కిరాయి హంతకుల చేతిలో గనుక మిస్ అయితే తానే అతన్ని లోయలోకి తోసేసి ప్రాణం తీసేద్దామని అనకుందట!. ఈ కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం, అలాగే ట్రాన్సిట్ వారెంట్ మీద నలుగురు నిందితులను మంగళవారం రాత్రి మద్యప్రదేశ్ పోలీసులు మేఘాలయాకు తరలించారు. అయితే.. ఆ టైంలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇండోర్ దేవీ అహల్య ఎయిర్పోర్ట్ నుంచి నిందితులను విమానంలో షిల్లాంగ్కు తరలించారు. ఆ సమయంలో ఓ పెద్దాయన బయట లగేజీతో ఎదురు చూస్తున్నాడు. ఏమైందో ఏమోగానీ.. వాళ్లు దగ్గరికి రాగానే హంతకుల్లో ఒకడి చెంప చెల్లుమనిపించాడు. నలుగురికి ముసుగులు వేసి ఉండడంతో ఎవరి చెంప పగిలిందనే దానిపై స్పష్టత కొరవడింది. అయితే అధికారులు ఆ పెద్దాయనను ఏమనకుండా.. నిందితులను వేగంగా లోపలికి తీసుకెళ్లారు. Indore, Madhya Pradesh: At the Indore Airport, a passenger slapped one of the four accused in the Raja Raghuvanshi murder case, who were being escorted by Shillong Police and Indore Crime Branch for a flight to Shillong on transit remand pic.twitter.com/evB5ppJ2I8— IANS (@ians_india) June 10, 2025మధ్యప్రదేశ్ ఇండోర్కు చెందిన రాజా రఘువంశీకి సోనమ్కు మే 11వ తేదీన వివాహం జరిగింది. మే 20వ తేదీన ఆ జంట హనీమూన్ కోసం మేఘాలయా వెళ్లింది. మూడు రోజుల తర్వాత బస నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అయితే మేఘాలయా హనీమూన్ జంట మిస్సింగ్ కేసు తొలుత పెద్దగా వార్తల్లో నిలవలేదు. కానీ, ఎప్పుడైతే నవ వధువు సోనమ్ తన భర్తను ప్రియుడు, కిరాయి హంతకుల సాయంతో హత్య చేయించిందని తెలిసిందో .. దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. రాజ్సింగ్ కుష్వాహా ఆమె ప్రియుడు కాగా, ఆకాశ్రాజ్పుత్, విశాల్ సింగ్ చౌహాన, ఆనంద్లు సుపారీ హంతకులుగా ఈ హత్యలోభాగం అయ్యారు. నిందితులకు కఠిన శిక్ష పడాలని సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. -
స్టేడియం పైకప్పు బద్దలు కొట్టిన పంత్.. వైరల్ వీడియో
ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం భారత సీనియర్ క్రికెట్ జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్ జూన్ 20న లీడ్స్లోని హెడింగ్లేలో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్కు ముందు భారత్ జూన్ 13 నుంచి 16 వరకు కెంట్ కౌంటీ క్రికెట్ గ్రౌండ్లో ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడనుంది. ప్రతిష్టాత్మకమైన ఈ సిరీస్ కోసం భారత్ రెండు వారాల ముందే ఇంగ్లండ్లో వాలిపోయింది. ప్రస్తుతం టీమిండియా లార్డ్స్ క్రికెట్ మైదానంలో కఠోరమైన సాధన చేస్తుంది.- PANT BROKE THE ROOF WITH A SIX...!!!🔥 [Espn Cricinfo]- RISHABH PANT IS GEARING UP FOR THE TEST SERIES AGAINST ENGLAND.- RISHABH PANT IS IN GREAT TOUCH WITH BAT, GUD TO SEE HIM.#Rishabhpant#ENGvsIND#rinkusingh#RohitSharma#INDvsAUS#WTCFinalpic.twitter.com/t3dRuyeMGg— Nitesh Prajapati (@itsmenitesh004) June 9, 2025ఇందులో భాగంగా తాజాగా జరిగిన ఓ ప్రాక్టీస్ సెషన్లో టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ ఓ భారీ సిక్సర్ బాది వార్తల్లోకెక్కాడు. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో పంత్ కొట్టిన ఓ సిక్సర్ స్టేడియం పైకప్పును బద్లలు కొట్టింది. దీనికి సంబంధిన వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోను చూసి పంత్ అభిమానులు సంబరపడిపోతున్నారు. తమ ఫేవరెట్ ఆటగాడు తిరిగి లయను అందుకున్నాడని ముచ్చటపడిపోతున్నారు.పంత్ను ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్ కోసం టీమిండియా వైస్ కెప్టెన్గా ఎంపిక చేశారు. ఈ సిరీస్లో అతను తొలిసారి భారత టెస్ట్ జట్టుకు కెప్టెన్గా ఎంపికైన శుభ్మన్ గిల్కు డిప్యూటీగా వ్యవహరిస్తాడు. పంత్కు ఇంగ్లండ్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇక్కడ అతను 17 మ్యాచ్ల్లో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీల సాయంతో 32.70 సగటున 556 పరుగులు చేశాడు. పంత్ ఇంగ్లండ్ గడ్డపై చివరి సారి ఆడిన టెస్ట్ మ్యాచ్లో సెంచరీ చేశాడు. 2022 పర్యటనలో అతను 111 బంతుల్లో 146 పరుగులు చేశాడు.పేలవ ఫామ్ కొనసాగినా..!పంత్ తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్లో పేలవ ప్రద్శనలు చేశాడు. 13 ఇన్నింగ్స్ల్లో కేవలం 269 పరుగులు మాత్రమే చేశాడు. సీజన్ ఆధ్యాంతం పేలవ ఫామ్లో కొనసాగిన పంత్.. తమ చివరి లీగ్ మ్యాచ్లో చెలరేగిపోయాడు. ఆర్సీబీతో జరిగిన ఆ మ్యాచ్లో పంత్ విధ్వంసకర శతకంతో (61 బంతుల్లో 118 నాటౌట్) విరుచుకుపడ్డాడు. అయినా ఆ మ్యాచ్లో పంత్ జట్టు ఎల్ఎస్జీ ఓటమిపాలైంది. జితేశ్ శర్మ ఊహకందని మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీని గెలిపించాడు. ఈ సీజన్కు ముందు ఎల్ఎస్జీ పంత్ను రికార్డు ధర రూ. 27 కోట్లకు సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ చరిత్ర సృష్టించాడు. ఇంత డబ్బుపోసి కొనుక్కునా ఈ సీజన్లో పంత్ దారుణంగా నిరాశపరిచాడు. కెప్టెన్గా, ఆటగాడిగా తేలిపోయాడు. సీజన్ ఆరంభంలో టైటిల్ ఫేవరెట్గా కనిపించిన లక్నో చివరి వచ్చే సరికి ఏడో స్థానంతో సీజన్ను ముగించింది. ఇంగ్లండ్ పర్యటనలోనైనా పంత్ స్థాయికి తగ్గట్టు రాణించాలని కోరుకుందాం. -
న్యూజెర్సీ నెవార్క్ ఎయిర్ పోర్ట్ లో ఘటన
-
బావ బామ్మర్దుల ఆత్మీయ సమ్మేళనం
-
Indian Student In USA: బేడీలేసి.. బలంగా అదిమిపట్టి
వాషింగ్టన్: విదేశీ విద్యార్థుల విషయంలో ట్రంప్ సర్కార్ కర్కశ వైఖరి తాజాగా మరోసారి వెలుగులోకి వచ్చింది. ఒక భారతీయ విద్యార్థిని బలవంతంగా ఇండియాకు తరలిస్తూ అతని పట్ల దారుణంగా వ్యవహరించిన వ్యవహారం ఆలస్యంగా మీడియాకు బహిర్గతమైంది. విద్యార్థిని నేరస్తుడి తరహాలో సంకెళ్లు వేసి, దారుణంగా హింసిస్తూ నేలకేసి అదిమిపట్టి అదుపులోకి తీసుకుంటున్న ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. విద్యాభ్యాసం కోసం తమ దేశానికి వచ్చిన విదేశీ విద్యార్థుల పట్ల అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్న అమెరికా ప్రభుత్వ వైఖరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెవార్క్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అక్కడే ఉన్న కునాల్ జైన్ అనే ఒక ప్రవాసభారతీయుడు తన కెమెరాలో ఈ దృశ్యాలను బంధించి తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్చేయడంతో ఈ దారుణోదంతం బహిర్గతమైంది. హరియాణా రాష్ట్రం నుంచి వచ్చిన ఒక భారతీయ యువకుడిని నెవార్క్ ఎయిర్పోర్ట్కు పోలీసులు సంకెళ్లు వేసి తీసుకొచ్చారు. నేనే తప్పు చేయలేదని అరుస్తున్న ఆ యువకుడిని పోలీసులు వెంటనే కిందపడేసి నేలకేసి బలంగా అదిమిపట్టారు. ఒక పోలీసు ఆ యువకుడి మీదనే కూర్చున్నాడు. ‘‘ నేరస్తుడిలా సంకెళ్లు వేయడంతో ఏడుస్తున్న ఆ విద్యార్థిని చూస్తుంటే చాలా జాలివేసింది. కలలను నిజం చేసుకునేందుకు అమెరికాకు వచ్చిఉంటాడు. ఎవరికీ ఏ హానీ తలపెట్టకపోయినా ఇలా అరెస్ట్ అయ్యాడు. ఈ ఘటనను కళ్లారా చూస్తూకూడా నేను నిస్సహాయుడినైపోయా. నా హృదయం ముక్కలైంది. చదువుకునేందుకు వచ్చిన విద్యార్థులను ఇలా బలవంతంగా పంపేయడం నిజంగా పెద్ద విషాదం. ఆ అబ్బాయి హరియాణా యాస అయిన హర్యాణ్వీలో మాట్లాడుతున్నాడు. ‘‘నాకేం పిచ్చిలేదు. ఈ అధికారులు నేను పిచ్చివాడిని అని అందర్నీ న మ్మించేందుకు కుట్ర పన్నారు’’ అని ఆ విద్యార్థి అరవడం ఆ వీడియోలో కనిపించింది. Here more videos and @IndianEmbassyUS need to help here. This poor guy was speaking in Haryanvi language. I could recognise his accent where he was saying “में पागल नहीं हूँ , ये लोग मुझे पागल साबित करने में लगे हुए हे” pic.twitter.com/vV72CFP7eu— Kunal Jain (@SONOFINDIA) June 8, 2025ఇండియన్ ఎంబసీ ఆదుకోవాలి‘‘ఇలాంటి విద్యార్థుల అంశంలో అమెరికాలోని భారతీయ రాయబార కార్యాలయం, భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ జోక్యం చేసుకుని విద్యార్థులకు తగు న్యాయం జరిగేలా చూడాలి. నెవార్క్ ఎయిర్పోర్ట్లో ఇతని పట్ల దారుణంగా ప్రవర్తించిన న్యూజెర్సీ అధికారులతో మాట్లాడేందుకు కొందరు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది’’ అని జైన్ రాసుకొచ్చారు. ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే విదేశీ విద్యార్థుల వీసా గడువును ముగించేసి వాళ్లను బలవంతంగా దేశబహిష్కరణ చేస్తున్న వేళ తాజాగా ఈ ఘటన జరగడం గమనార్హం. పాలస్తీనా అనుకూల, ఇజ్రాయెల్, అమెరికా వ్యతిరేక భావజాలం ఉన్న విదేశీ విద్యార్థులను గుర్తించి గెంటేస్తున్న ఉదంతాలు ఇప్పుడు అమెరికాలో ఎక్కువయ్యాయి. -
అశ్విన్.. నీ స్థాయికి ఇది తగునా.. మహిళతో అలా ఎలా ప్రవర్తిస్తావు..?
తమిళనాడు ప్రీమియర్ లీగ్లో భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ తన స్థాయిని మరిచి ప్రవర్తించాడు. తనను ఎల్బీడబ్ల్యూగా ప్రకటించినందుకు ఓ మహిళా అంపైర్తో వాగ్వాదానికి దిగాడు. అశ్విన్ దురుసు ప్రవర్తనకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది. ఈ వీడియో చూసి అభిమానులు అశ్విన్పై మండిపడుతున్నారు. నీ స్థాయికిది తగునా అంటూ కామెంట్లు చేస్తున్నారు.వివరాల్లోకి వెళితే.. తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2025 ఎడిషన్లో అశ్విన్ దిండిగల్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. లీగ్లో భాగంగా నిన్న (జూన్ 8) దిండుగల్ డ్రాగన్స్, ఐడ్రీమ్ తిరుప్పుర్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో అశ్విన్ ఓపెనర్గా బరిలోకి దిగాడు. సాయి కిషోర్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్ చివరి బంతికి అశ్విన్ స్వీప్ షాట్ ఆడబోయి మిస్ అయ్యాడు. బంతి వికెట్ల ముందు అశ్విన్ ప్యాడ్లకు తాకింది. Ash அண்ணா Not Happy அண்ணாச்சி! 😶🌫📺 தொடர்ந்து காணுங்கள் | TNPL 2025 | iDream Tiruppur Tamizhans vs Dindigul Dragons | Star Sports தமிழில் #TNPLOnJioStar #TNPL #TNPL2025 pic.twitter.com/Csc2ldnRS3— Star Sports Tamil (@StarSportsTamil) June 8, 2025దీంతో సాయి కిషోర్ ఎల్బీడబ్ల్యూకు అప్పీల్ చేశాడు. అక్కడే ఉన్న మహిళా అంపైర్ మారు ఆలోచించకుండా అశ్విన్ను ఔట్గా ప్రకటించింది. దీంతో అశ్విన్ పట్టరాని కోపంతో ఊగిపోతూ అంపైర్తో వాగ్వాదానికి దిగాడు. అంపైర్ పట్టించుకోకపోవడంతో అశ్విన్ అసహనంతో బ్యాట్ను తన ప్యాడ్కు కొట్టుకుంటూ పెవిలియన్ బాట పట్టాడు. ఈ మ్యాచ్లో అశ్విన్ 11 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 18 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో అశ్విన్ జట్టు దిండిగుల్ 9 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.తొలుత బ్యాటింగ్ చేసిన దిండిగుల్.. ఎసక్కిముత్తు (4-0-26-4), మతివణ్ణన్ (2.2-0-12-3), సాయి కిషోర్ (4-0-10-2) చెలరేగడంతో 16.2 ఓవర్లలో 93 పరుగులకు ఆలౌటైంది. అనంతరం స్వల్ప ఛేదనకు దిగిన తిరుప్పుర్.. తుషార్ రహేజా (39 బంతుల్లో 65; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ మెరుపు అర్ద సెంచరీతో చెలరేగడంతో 11.5 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. -
కర్మ అంటే ఇదేనేమో.. ట్రంప్పై మాస్ ట్రోలింగ్
వాషింగ్టన్: ‘కర్మ’ ఎవరినీ వదలదు అంటారు. అచ్చంగా ఇలాంటి అనుభవమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఎదురైంది. అంతకుముందు, మాజీ అధ్యక్షుడు జో బైడెన్.. విమానం ఎక్కుతున్న సమయంలో కిందపడిన సందర్భంలో ట్రంప్ ఆయనపై సెటైర్లు వేశారు. తాజాగా ట్రంప్ కూడా విమానం ఎక్కుతూ అలాగే కింద పడబోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ క్రమంలో పలువురు నెటిజన్లు ట్రంప్పై సెటైరికల్ కామెంట్స్ చేశారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ న్యూజెర్సీలోని ఎయిర్ఫోర్స్ వన్ విమానం మెట్లు ఎక్కుతున్న సమయంలో జారిపడ్డాడు. ట్రంప్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో క్యాంప్ డేవిడ్కు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ట్రంప్ మెట్లపై చేయివేసి పైకి లేచారు. అనంతరం, రూబియో సైతం కిందపడ బోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోను పలువురు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. బైడెన్ 2.0 ట్రంప్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.Here is the whole video. Rubio stumbled as well. Was raining before.Post the whole thing pic.twitter.com/RKVLBZR29Y— Adi 🎗 (@Adi13) June 8, 2025ఇక, జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మెట్లు ఎక్కుతున్న సమయంలో బైడెన్ పలు సందర్భాల్లో కింద పడిపోయారు. దీంతో, బైడెన్ను టార్గెట్ చేసిన ట్రంప్.. పలుమార్లు ఎగతాళి చేసి మాట్లాడారు. ఇప్పుడు అలాంటి విచిత్ర పరిణామామే ట్రంప్కు కూడా ఎదురైంది. 🚨 BREAKING: DOWN GOES DONALDTrump just stumbled and almost faceplanted boarding Air Force One. I’ve been telling you — he drags his legs and he’s clearly not well.When Biden stumbled, the media lost its mind and Tapper wrote an entire fake “nonfiction” book.Where are they… pic.twitter.com/MZlHfbfDUJ— Chris D. Jackson (@ChrisDJackson) June 8, 2025WATCH: President Joe Biden stumbles and falls up the stairs while boarding Air Force One pic.twitter.com/1m7tecpsxc— The Post Millennial (@TPostMillennial) March 19, 2021 -
ఇదో దిక్కుమాలిన ఛాలెంజ్.. బైకర్పై సజ్జనార్ సీరియస్
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు కొందరు యువకులు చేస్తున్న పనులపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ సమాజానికి ఏం నేర్పిస్తున్నారని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఓ వీడియోను షేర్ చేశారు.ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా..‘'ఓపెన్ ఛాలెంజ్' అంట!? ఫేమస్ అయ్యేందుకు ఇవేం పిచ్చి పనులు. సోషల్ మీడియా వైరల్ వెర్రి పట్టి ఎలాంటి కంటెంట్ చేస్తున్నారో ఆలోచించకుండా దిక్కుమాలిన వీడియోలు చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదకర వీడియోలతో ఏం సందేశం ఇస్తున్నారు మీరు. సమాజానికి ఏం నేర్పిస్తున్నారు. ఆలోచించండి’ అంటూ వ్యాఖ్యలు చేశారు. 'ఓపెన్ ఛాలెంజ్' అంట!? ఫేమస్ అయ్యేందుకు ఇవేం పిచ్చి పనులు. సోషల్ మీడియా వైరల్ వెర్రి పట్టి ఎలాంటి కంటెంట్ చేస్తున్నారో ఆలోచించకుండా దిక్కుమాలిన వీడియోలు చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదకర వీడియోలతో ఏం సందేశం ఇస్తున్నారు మీరు. సమాజానికి ఏం నేర్పిస్తున్నారు. ఆలోచించండి. pic.twitter.com/G3FNIDfzjh— V.C. Sajjanar, IPS (@SajjanarVC) June 8, 2025 -
Viral Video: బొకేను విసిరేసిన మంత్రి సవిత
-
ఉత్తరాఖండ్ లో తప్పిన హెలికాప్టర్ ప్రమాదం
-
Garam Garam Varthalu: రౌడీ పోలీస్!
-
వాట్ ఏ టాలెంట్ బ్రో..! రెండు కాళ్లు లేకపోతేనేం..
మనపై మనకున్న నమ్మకం, అచంచలమైన ధైర్యం ముందు..ఏ వైకల్యం అయినా చిన్నబోవాల్సిందే. అందుకు ఉదాహారణ ఈ కొరియోగ్రాఫర్. రెండు కాళ్లు లేపోయినా..విద్యార్థులకు అలవోకగా నృత్యం నేర్పిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. టాలెంట్ అంటే ఇదే అనేలా స్ఫూర్తిగా నిలిచాడు. అతడే కొరియోగ్రాఫర్ అబ్లు రాజేష్ కుమార్. అతడు దివ్యాంగుడు. అయితేనేం..అతడి మనోధైర్యం, సంకల్పం.. అతడి కాళ్లకు ఊపిరిపోశాయా అనిపించేలా అద్భుతంగా డ్యాన్స్ చేస్తాడు అతను. కూమార్ ప్రోస్థెటిక్ కాళ్లతో తన విద్యార్థులకు డ్యాన్స్ నేర్పిస్తున్న వీడియో నెట్టింట వైరల్గా వారింది. ఆ వీడియోలో అతడు పిల్లలకు బాలీవుడ్ ప్రముఖ హిట్పాట చిట్టియాన్ కలైయాన్ పాటకు డ్యాన్స్ చేయడం నేర్పిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ పాటకు లయబద్ధంగా కుమార్ కదుపుతున్న స్టెప్పులు చూస్తే..కళ్లు రెప్పవేయడమే మర్చిపోతాం. ఏదో మ్యాజిక్ చేసినట్లు మంచి హవభావాలు పలికిస్తూ..డ్యాన్స్ చేస్తూ కనిపిస్తాడు వీడియోలో. ఈ వీడియోని చూసి నెటిజన్లు మనసుంటే మార్గం ఉంటుంది అనేందుకు ఇతడే ఉదాహరణ అని ఒకరు, అచంచలమైన ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం అని మరికొందరు కూమార్ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Ablu Rajesh Kumar (@ablurajesh_) (చదవండి: World Bicycle Day: 70 ఏళ్ల వ్యాపారవేత్త ఫిట్నెస్కి ఫిదా అవ్వాల్సిందే! ఇప్పటకీ 40 కి.మీలు సైకిల్) -
ఆటోడ్రైవర్ను తిట్టి.. చెప్పుతో కొట్టి, ఆపై శిరస్సు వంచి క్షమాపణలు
బెంగళూరు: రాష్ట్రంలో కన్నడిగులపై.. కన్నడేతర వ్యక్తులు దాడులు చేస్తున్న ఘటనలు ఈ మధ్యకాలంలో పెరిగిపోయాయి. వీటిని అక్కడి ప్రజలు కూడా అంతే తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటున్నారు. తాజాగా బెంగళూరులో ఓ మహిళ ఓ ఆటోడ్రైవర్ను ఇస్టానుసారం తిడుతూ చెప్పుతో కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. గంటల వ్యవధిలోనే ఆమెతో క్షమాపణలు చెప్పించిన మరో వీడియో బయటకు వచ్చింది. పంకూరి మిశ్రా అనే మహిళ తన భర్తతో స్కూటీ మీద శనివారం బయటకు వెళ్లింది. శివాజీనగర్ ప్రాంతంలో.. వాళ్ల బండి పక్కనే ఆగిన ఆటోడ్రైవర్తో ఒక్కసారిగా ఆమె వాగ్వాదానికి దిగింది. ఆటో టైర్ తన కాలు మీద నుంచి వెళ్లిందని చెబుతూ ఆమె అతని దూషించసాగింది. అయితే అలాంటిదేం జరగలేదు కదా అని ఆ ఆటోడ్రైవర్ ఆమెకు బదులిచ్చాడు. అయినా ఆమె అస్సలు తగ్గలేదు. ఆమె తిట్ల పురాణాన్ని ఆ డ్రైవర్ ఫోన్లో వీడియో తీయబోయాడు. అంతే.. ఆ పరిణామంతో ఆ యువతి రగిలిపోయింది. ‘‘వీడియో తీస్తావా.. తీసుకో’’ అంటూ కాలికున్న చెప్పు తీసి అతన్ని కొట్టింది. స్థానికులు కొందరు సర్దిచెప్పడంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఘటన జరిగిన వెంటనే ఆ ఆటోడ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి పేరు లోకేష్గా తెలుస్తోంది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నగర పోలీసులు సత్వర చర్యలకు దిగారు. ఆ యువతిని అరెస్ట్ చేశారు. ఆపై ఆమె స్టేషన్ బెయిల్ మీద బయటకు వచ్చింది. ఆదివారం సాయంత్రం ఆ ఆటోడ్రైవర్, మరికొందరి సమక్షంలో పంకూరి మిశ్రా క్షమాపణలు కోరింది. తాను గర్భవతినని, ఏదైనా అనుకోని ఘటన జరగొచ్చనే ఆందోళనతో తాను అలా ప్రవర్తించానని చెప్పుకొచ్చింది. జరిగిందానికి లోకేష్కు క్షమాపణలు చెబుతూ.. శిరస్సువంచి నమస్కారాలు చెప్పింది. బెంగళూరు నగరమన్నా.. కన్నడ సంప్రదాయాలన్న తనకు మంచి ఉద్దేశాలే ఉన్నాయని, కన్నడ ప్రజలనుగానీ.. భాషనుగానీ కించపరిచే ఉద్దేశం తనకు లేదని.. జరిగిందానికి తనను క్షమించాలని ఆ భార్యాభర్తలు వేడుకున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. In #Bengaluru: The female software engineer, who was arrested for assaulting an autorickshaw driver with her slipper in Bellandur area over a road dispute, has apologised to the autodriver, his family & Kannadigas. Videos of assault & apology👇@timesofindia pic.twitter.com/61xXewMgI8— TOI Bengaluru (@TOIBengaluru) June 2, 2025 VIDEO CREDITS: TOI Bengaluru -
ఆ మాస్టార్ అంకితభావానికి మాటల్లేవ్ అంతే..! ఏకంగా 20 ఏళ్లుగా..
గురువు అనే పదానికి అసలైన అర్థం ఈ మాస్టారు. పిల్లలకు పాఠాలను చెప్పడం కోసం..ఎన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నారో తెలిస్తే కంగుతింటారు. అలా ఏకంగా 20 ఏళ్ల నుంచి చాలా శ్రమ ఓర్చి.. తన విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. పైగా ఆయన డ్యూటీ పరంగా చాలా సిన్సియర్, ఏ రోజు లేటుగా వచ్చిన దాఖాలాలు కూడా లేవు. అలాంటి గొప్ప మాస్టార్ని పొందిన ఆ విద్యార్థులు కూడా ఎంతో అదృష్టవంతులు కదూ..!.ఆ మాస్టార్ పేరు అబ్దుల్ మాలిక్. కేరళకు చెందని ఆయన మల్లాపురంలోని పదింజత్మురిలోని ముస్లిం లోయర్ ప్రైమరీ స్కూల్లో లెక్కల మాస్టర్గా పనిచేస్తున్నారు. ఈయన ఆ స్కూల్ని చేరాలంటే.. ప్రతిరోజూ సాహసం చేయాల్సిందే. నడుంకి ఓ ట్యూబ్ తగిలించుకుని నది ఈదుకుంటూ వెళ్లి మరీ విద్యార్థులకు పాఠాలు చెప్పి వస్తుంటారు. ఇలా ట్యూబ్ తగిలించుకోవడంతో అక్కడి స్థానికులంతా ఆయన్ను ముద్దుగా ‘ట్యూబ్ మాస్టర్’ అనిపిలుస్తుంటారు. అయితే ఇలా నదిలో ఈదుకుంటూ వెళ్తున్నప్పుడూ.. కాలానుగుణంగా వచ్చే భారీ వర్షాలు, పాములు వంటి ఇతర భయంకరమైన సరీసృపాలు తదితర సవాళ్లు చాలానే ఎదుర్కొంటుంటారాయన. అయినా అవేమి ఆయన్ను తన విద్యార్థుల దగ్గరకు వెళ్లనీయకుండా ఆపలేకపోయాయి. ఇంత ఇబ్బంది పడి వెళ్లటం అవసరమా అని ఆయన ఏనాడు అనుకోకపోవడం విశేషం. ఇలానే ఎందుకంటే..మాలిక్కి ఇలా నదిలో ఈదుకుంటూ కాకుండా మరొక మార్గం ఉంది. కానీ మరింత వ్యయప్రయాసలతో కూడినది. ఎందుకుంటే సుమారు 12 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ స్కూల్కి చేరుకోవాలంటే మూడు బస్సులు మారాల్సిందే. పైగా మూడుగంటలకు పైగా జర్నీ చేయాలి. దాంతో మాలిక్ ఇలా నదిలో ఈదుకుంటూ స్కూల్కి వెళ్లడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. ఇక పడవల సాయంతో వెళ్దామంటే.. ఆ నది నీటి ఉద్ధృతిలోని హెచ్చు తగ్గుల రీత్యా అది అస్సలు సాధ్యం కానీ పని అంటున్నారు మాలిక్. ఇక ఆయన క్లాస్లు ఉదయం 10.30తో మొదలవ్వుతాయి. ఆయన గణితాన్ని బోధించడం తోపాటు పర్యావరణం గురించి తెలుసుకునేలా ఆయన రోజు ఈతకొట్టి వచ్చే నది వద్దకు కూడా విద్యార్థులను తీసుకువెళ్తారు మాలిక్. ప్రకృతిని కాపాడుకోవడం దాన్ని గౌరవించడం నేర్చుకోవాలనే ఉద్దేశ్యంతో ఇలా తీసుకువెళ్తుంటానని చెబుతున్నారు మాలిక్. కాగా, 2013 నుంచి ఆ స్కూల్లో టీచర్గా విధులు నిర్వర్తిస్తున్నారు మాలిక్. అలా ఈ ఏడాది 2025 పూర్తి అయ్యే నాటికి.. ఆయన ఆ స్కూల్కి వెళ్లి తిరిగి రావడానికి.. దాదాపు 700 కిలోమీటర్లక పైనే ఈత కొట్టినట్లు అంచనా.!. నిజంగా ఈ మాస్టారు మాములు గ్రేట్ కాదు కదా..!. (చదవండి: పదహారేళ్ల పడుచు పిల్లలా 85 ఏళ్ల బామ్మ..! ఆ ఎవర్గ్రీన్ ఎనర్జీకి ఫిదా అవ్వాల్సిందే..) -
బొక్కలిరుగుతాయ్.. అమెరికా టూరిస్ట్కు చేదు అనుభవం, వీడియో వైరల్
భారత దేశ పర్యటనకు వచ్చిన అమెరికన్ యూట్యూబర్కు చేదు అనుభవం ఎదురైంది. ఊహించని ఈ పరిణామానికి హతాశుడైన అతను తన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కోల్కతాలో పర్యటిస్తున్న యూట్యూబర్ డస్టిన్ పట్ల స్థానిక టాక్సీ డ్రైవర్ దారుణంగా ప్రవర్తించాడు. ఉద్దేశపూర్వకంగా అతన్ని వేరే హోటల్కు తీసుకెళ్లి, ఎక్కువ ఛార్జీ వసూలు చేయాలని చూశాడు. దీంతోతనకు జరిగిన అవమానానికి సంబంధించిన వీడియోను డస్టిన్ తన యూట్యూబ్ (Youtube) ఛానల్లో అప్లోడ్ చేయగా ఇది వైరల్గా మారింది.ఆనందనగరం కోల్కతాను వీక్షించాలని వచ్చిన పర్యాటకుడి మొదటి రోజు పీడకలగా మారిపోయింది.అమెరికన్ వ్లాగర్ డస్టిన్ అనే కోల్కతా దర్శించేందుకు వచ్చాడు. కోల్కతా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న డస్టిన్ పార్క్ స్ట్రీట్లోని గ్రేట్ వెస్టర్న్ హోటల్కు వెళ్లేందుకు స్థానికంగా ఓ టాక్సీ ని బుక్ చేసుకున్నాడు. ప్రయాణ ప్రారంభమైన కొద్దిసేపటికే డ్రైవర్ దారి మళ్లించి, దాదాపు 15 కిలోమీటర్ల దూరంలోని రాజార్హాట్ ప్రాంతంలోని ది వెస్టిన్ అనే వేరే హోటల్కి తీసుకెళ్లాడు. పైగా అతనితో వాగ్వాదానికి దిగాడు. అసలు చార్జీరూ.700 బదులుగా రూ.900 డిమాండ్ చేశాడు.ఇదీ చదవండి: నిద్ర ముంచుకు రావాలంటే.. బెస్ట్ యోగాసనాలుఇక్కడితో అయిపోలేదు....మరో వ్యక్తి (ఎర్ర చొక్కా ధరించిన వ్యక్తి) కల్పించుకొని డస్టిన్ను బెదరించడం మొదలు పెట్టాడు. మాఫియాతో తనకు సంబంధాలున్నాయ్.ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి బొక్కలు ఇరగదీస్తానంటూ రెచ్చిపోయాడు. అయినా డస్టిన్ బెదరలేదు. విషయాన్ని పూర్తిగా వివరించే ప్రయత్నం చేశాడు. అయినా రూ. 1000 డిమాండ్ చేశాడురెండోవాడు. ఆ తరువాత వారు డస్టిన్కోసం మరో టాక్సీని బుక్ చేశారు. అయితే ఈ సారి "పార్కింగ్ , పెట్రోల్" కోసం అదనంగా రూ. 100 చెల్లించాలని పట్టుబట్టడంతో మొత్తం చార్జీ రూ. 800కి పెరిగింది. ఇందదులో కొత్త డ్రైవర్కు కేవలం రూ.400 మాత్రమే ఇస్తున్నామని మాట్లాడుతుండగా డస్టిన్ తన వీడియోలో రికార్డ్ చేశాడు. అలాగే 50 నిమిషాలు పట్టాల్సిన ప్రయాణాన్ని 1 గంట 20 నిమిషాలకు పొడిగించారంటూ డస్టిన్ అసహనం వ్యక్తం చేశాడు. అయితే ఈ సంఘటన తన భారత్పై తనకున్న అభిప్రాయాన్ని మార్చలేదని, ఇండియా అద్భుతమైన దేశమంటూ పేర్కొన్నాడు. చదవండి: నటి భర్త, టైగర్ మ్యాన్ వాల్మీక్ థాపర్ ఇకలేరు.. ఎవరీ థాపర్? ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దేశానికి ప్రతిష్టకు భంగం అంటూ వ్యాఖ్యానించారు. విదేశీ పర్యాటకుల పట్ల ఇలా ప్రవర్తించడం మాకు సిగ్గుచేటు అని ఒకరు, మ“నేను వీడియో లింక్తో కోల్కతా పోలీసులకు ఫిర్యాదు చేశా,లాంటి పోకిరితనంపై వెంటనే చర్య తీసుకోవాలని అభ్యర్థించాను’’ అని మరొకరు కమెంట్చేశారు. ఆ బెంగాలీ వాలా చాలా మొరటుగా తిట్టుగాడు బెంగాలీని, సారీ అంమూ మరో యూజర్ వ్యాఖ్యానించాడు. మరోవైపు వీడియో వైరల్ కావడంతో బిధన్నగర్ పోలీసులు స్పందించి ఇద్దరిని అరెస్టు చేశారు. డ్రైవర్ అలంగీర్ మొల్లా (34), అతడి సహచరుడు మనోజ్ కుమార్ రాయ్ (52)లపై బెదిరింపు, మోసం, క్రిమినల్ కుట్ర కేసులు నమోదు చేశారు. విదేశీయులపై ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. -
మాక్రాన్-బ్రిగెట్టా వీడియోపై ట్రంప్ ఫన్నీ.. డోర్ క్లోజ్ చేయాలంటూ..
వాషింగ్టన్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వీడియోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇలాంటివి జరిగేటప్పుడు అక్కడ తలుపులు మూసి ఉన్నాయో.. తెరిచి ఉన్నాయో చూసుకోవాలి అని ఫన్నీ కామెంట్స్ చేశారు. అది చూసుకుంటే ఇలా సోషల్ మీడియాలో మనం ఉండం కదా.. అని చెప్పుకొచ్చారు.అధ్యక్షుడు మాక్రాన్ ముఖాన్ని ఆయన సతీమణి బ్రిగెట్టా నెట్టినట్టుగా ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే, తాజాగా ఓవల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఈ ఘటనపై స్పందించాలని ఓ విలేకరి ట్రంప్ను కోరారు. ఈ సందర్భంగా ట్రంప్ స్పందిస్తూ.. దీని గురించి తాను నేరుగా మాక్రాన్తోనే మాట్లాడాను. అంతా బాగానే ఉందని తెలిపారు. అలాంటి ఘటనలు జరిగినప్పుడు తలుపులు వేసి ఉన్నాయో, లేదో ఒకసారి గమనించుకోవాలి అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు.ఇదిలా ఉండగా.. మాక్రాన్-బ్రిగెట్టాల వియత్నాం పర్యటన సందర్బంగా హనోయ్ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం హనోయ్లో దిగిన తరవాత.. ఒక అధికారి తలుపును తెరిచినప్పుడు మాక్రాన్ ఎవరితోనో మాట్లాడుతున్నట్లు కనిపించింది. అంతలోనే ఎర్రని స్లీవ్స్ ధరించిన రెండు చేతులు మాక్రాన్ను నెట్టివేశాయి. ఆయన వెంటనే తలతిప్పి వెనక్కి జరిగారు. ఇది రికార్డు అవుతున్నట్లు గమనించి చిరునవ్వుతో చేయి ఊపారు. ఆ తరువాత ఫొటోల్లో మెక్రాన్, ఎర్రని జాకెట్ వేసుకొని బ్రిగెట్టా విమానం మెట్ల వరుసపై కనిపించారు. భార్య చేతిని పట్టుకోవడానికి మాక్రాన్ ప్రయత్నించినా ఆమె ఇష్టపడలేదు. తరువాత ఇద్దరూ కలసి మెట్లు దిగి రెడ్ కార్పెట్ మీద పక్కపక్కనే నడిచారు.BREAKING:@pdoocy just asked Donald Trump about Brigitte Macron slapping @EmmanuelMacron earlier this week.TRUMP: "Make sure the door remains closed."🤣🤣 pic.twitter.com/V05Hna79DG— Evan Kilgore 🇺🇸 (@EvanAKilgore) May 30, 2025అనంతరం, ఈ ఘటనపై మాక్రాన్ స్పందిస్తూ.. మా విషయంలో ప్రతీ ఒక్కరూ మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. మా మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు. అప్పుడు నా భార్యతో నేను జోక్ చేశాను. ఇది మా మధ్య ఎప్పుడూ జరిగేదే అంటూ క్లారిటీ ఇచ్చారు. ‼️🇫🇷 Here's a higher-quality version of today’s most viral video. Enjoy! #Macron pic.twitter.com/aGkx0nXzKe— Maimunka News (@MaimunkaNews) May 26, 2025 -
ప్లీజ్ మమ్మీ ఆపండి.. అమెరికా స్కూల్లో వింత ప్రవర్తన..
వాషింగ్టన్: అమెరికాలోకి ఎలిమెంటరీ పాఠశాలలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. చిన్నారుల గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా అక్కడికి వచ్చిన పేరెంట్స్ మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో, ఇది కాస్తా కొట్లాటకు దారి తీసింది. పేరెంట్స్ ఫైటింగ్ కారణంగా చిన్నారులు భయంతో ఏడుస్తూ.. వారిని ఆపే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల ప్రకారం.. అమెరికాలో ఆర్కాన్సాస్ రాష్ట్రంలోని వెస్ట్ మెంఫిస్ నగరంలో ఉన్న ఫాల్కీ ఎలిమెంటరీ స్కూల్లో.. ఈనెల 28వ తేదీన గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సదరు స్కూల్ యాజమాన్యం చిన్నారులు సహా వారి తల్లిదండ్రులకు ఆహ్వానం కల్పించారు. ఈ క్రమంలో పిల్లలతో పాటుగా వారి పేరెంట్స్ పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం, కార్యక్రమం జరుగుతుండగా.. కొందరు మహిళల మధ్య ఏదో విషయంలో వాగ్వాదం మొదలైంది.దీంతో, మాటాలమాటా పెరిగి.. గొడవ పెద్దదిగా మారింది. ఆగ్రహంతో రగిలిపోయిన పేరెంట్స్.. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. వారిని నిలువరించేందుకు ప్రయత్నించిన ఇద్దరు పురుషులు కూడా కొట్టుకునే స్థాయికి చేరుకుంది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఈవెంట్లో పేరెంట్స్ గొడవపడటంతో చిన్నారులు భయాందోళనకు గురయ్యారు. కన్నీరుపెట్టుకుంటూ వారిని ఆపివేసే ప్రయత్నం చేసినప్పటికీ ఫలించలేదు.Brawl breaks out after a Kindergarten Graduation at West Memphis’ Faulk Elementary. Children can be heard screaming “Stop” to the adults. <- Read that again. The news reported that the “Police are investigating the situation further.” 🙄 pic.twitter.com/PL43g2zZdx— The Facts Dude (@The_Facts_Dude) May 30, 2025మరోవైపు.. ఈ ఘటనను సదరు పాఠశాల యాజమాన్యం ఖండించింది. ఇటువంటి ప్రవర్తన కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యులపై చర్యలు తప్పవని స్పష్టం చేసింది. విద్యార్థులు, సిబ్బంది రక్షణ, పాఠశాల ప్రాంగణం భద్రత మొదటి ప్రాధాన్యం అని.. ఈ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో, ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్గా మారింది. వీరికి గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. -
ఏరా పులి..!
రేయ్.. పులిని చూడాలనుకో, తప్పులేదు. పులితో ఫోటో దిగాలనుకో, కొంచెం రిస్క్ అయినా పర్లేదు ట్రై చెయ్యొచ్చు.. అంటూ ఓ పాపులర్ సినిమా డైలాగ్ ఉంటుంది. సరిగ్గా అలాంటి ప్రయత్నమే చేయబోయి తన ప్రాణాలనే రిస్క్లో పడేసుకోబోయాడు ఓ భారతీయ టూరిస్టు.ఈ భూమ్మీద పులులకు స్వర్గధామంగా థాయ్లాండ్ ఫుకెట్(Phuket)కు పేరుంది. ఇక్కడికి వచ్చే పర్యాటకులు పులులకు మేత వేయొచ్చు.. ఫొటోలు దిగొచ్చు.. అతిదగ్గరగా వాటితో కొంత సమయం గడపొచ్చు. అదంతా వాటి శిక్షకుల పర్యవేక్షణలోనే జరుగుతుంది. అయితే తాజాగా అక్కడికి వెళ్లిన ఓ భారతీయ పర్యాటకుడికి చేదు అనుభవం ఎదురైంది.తొలుత పులిని తీసుకుని కాస్త దూరం నడిచిన ఆ వ్యక్తి.. దాని శిక్షకుడి సూచన మేరకు దానిని పట్టుకుని ఫొటో దిగే ప్రయత్నం చేయబోయాడు. అయితే ఆ ప్రయత్నం పులికి చిరాకు తెప్పించిందో ఏమో.. ఒక్కసారిగా అతనిపై దాడికి తెగబడింది(Tiger Attack Viral Video). కట్ చేస్తే..సిద్ధార్థ శుక్లా(Sidharth Shukla) అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో ఈ ఘటన తాలుకా వీడియోను పోస్ట్ చేయగా అది వైరల్ అయ్యింది. అయితే అది సరిగ్గా ఎప్పుడు జరిగిందనేది మాత్రం అతను పేర్కొనలేదు. కామెంట్ సెక్షన్లో ఓ వ్యక్తి ఆ టూరిస్ట్ చిన్నచిన్న గాయాలతో బయటపడినట్లు తెలిపాడు.Apparently an Indian man attacked by a tiger in Thailand.This is one of those paces where they keep tigers like pets and people can take selfies, feed them etc etc.#Indians #tigers #thailand #AnimalAbuse pic.twitter.com/7Scx5eOSB4— Sidharth Shukla (@sidhshuk) May 29, 2025ఈ ఘటనతో వన్యప్రాణ పర్యాటకంపై విమర్శలు వినవస్తున్నాయి. అసహజ వాతావరణంలో వాటి ప్రవర్తన అత్యంత ప్రమాదకరంగా ఉంటుందని, కాబట్టి పర్యాటకుల విషయంలో నిర్లక్ష్యం తగదని ఫుకెట్ నిర్వాహకులను నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: వివేక్ రామస్వామి భార్యకు చేదు అనుభవం -
గైడో, డ్రైవరో కాదు నా భర్త.. మహిళ అసహనం : బై డిఫాల్ట్ భర్తలందరూ డ్రైవర్లేగా!
సాధారణంగా ఒక యువతి, యువకుడు కనిపించగానే వాళ్లిద్దరూ, భార్యాభర్తలనో లేదా లవర్స్ అనో అనేసుకుంటారు చాలామంది. అయితే పోలిష్ మహిళ ఇతను నా భర్త మొర్రో మొత్తుకుంటోంది. అదేంటో తెలుసుకుందాం రండి!పోలెండ్ దేశానికి చెందిన గాబ్రియెలా డూడా (Gabriela Duda) ఉత్తర ప్రదేశ్కు చెందిన హార్దిక్ వర్మా (Hardik Varma)ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2023 నవంబర్ 29న ఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్ జిల్లాలో హిందూ ఆచారాల ప్రకారం సాంప్రదాయ బద్ధంగా వీరు పెళ్లి చేసుకున్నారు. భారతదేశంలోని పలు ప్రదేశాల్లో, ఇతర దేశాల్లో ప్రయాణం చేస్తూ, భారతీయ సంస్కృతిని తెలుసుకుంటూ , అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంటారు. అయితే ఏంటి.. అనుకుంటున్నారా? ఈ పయనంలో తమ కెదురవుతున్న ఒక వింత అనుభవాన్ని గురించి సోషల్మీడియాలో ఒక వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్గా మారింది. కంటెంట్ క్రియేటర్ అయిన గాబ్రియేలా భర్త హార్దిక్ వర్మతో కలిసి టూరిస్టులుగా ఆనందంగా గడుపుతున్న క్షణాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటంది. ఇద్దరూ అనేక ప్రదేశాల్లో పర్యటిస్తున్న క్రమంలో ప్రజలు తన భర్తను తన టూర్ గైడ్ లేదా డ్రైవర్గా తరచుగా తప్పుగా భావిస్తుంటారు అంటూ అసహనం వ్యక్తం చేసింది. View this post on Instagram A post shared by Gabriela & Hardik Varma | Travel & Indian Culture (@hardikandgabi) "భారతదేశంలో కొత్త ప్రదేశానికి వచ్చినప్పుడల్లా అత్యంత ఇబ్బందికరమైన క్షణం. ఎప్పుడో ఒకసారి జరిగేదికాదు. ప్రతీ షాపు వాడు, లేదా ఆటో/టాక్సీ డ్రైవర్ హార్దిక్ నా టూర్ గైడ్ అని అనుకుంటారు. అవునబ్బా కొన్నిసార్లు అతను నా నా డ్రైవర్ కూడా.. అయితే ఏంటి’’ ప్రశ్నించింది. ఏ అమ్మాయైనా డ్రైవర్ చేతులు పట్టుకుని తిరుగుతుందా? లేదంటే, తన టూర్ గైడ్తో వేల ఫోటోలు తీసుకుంటుంది, లిప్ లాప్ ఇస్తుంది... ఆ మాత్రం అర్థం చేసుకోలేరా అంటూ చికాకు పడింది. అంతేకాదు తన భర్తతో వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో నాలుగు లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. అయితే ఆమె అసహనంపై నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. "గైడ్ అని పిలవడంలో తప్పేముంది’’, ‘‘మీ మోటార్ లాగా మీరు మళ్లీ గ్రాండ్గా పెళ్లి చేసుకోవాలి’’, నిజం చెప్పాలంటే.. ఆయన అలాగే కనిపిస్తున్నాడు.. నీట్గా షేవ్ చేసుకుంటే బెటర్’’, ‘‘ పెళ్లాం పిల్లలకు, భర్తలందరూ బై డిఫాల్ట్ టూర్ గైడ్లు, డ్రైవర్లే ఇలా రకరకాల కమెంట్లు, జోక్స్ వెల్లువెత్తాయి."నేను నా భార్యపిల్లలతో కలిసి నా స్వస్థలాన్ని సందర్శించినప్పుడు నాకు కూడా అదే జరిగింది. కొంతమంది స్థానికులు నన్ను వారి టూర్ గైడ్ అని అనుకున్నారు" అని మరొక వినియోగదారు వ్యాఖ్యానించారు. -
పెళ్లి బరాత్తో దద్దరిల్లిన వాల్స్ట్రీట్
మన దేశంలో ఏం రేంజ్లో వివాహ వేడుకలు జరుగుతాయో చెప్పాల్సిన పనిలేదు. అందుకోసం పెట్టే డీజేలు, బరాత్ల సందడితో ఊరు ఊరే హోరెత్తిపోతుంది. పైగా పెళ్లి వేడుక కావడంతో ఎవ్వరూ అభ్యంతరాలు చెప్పారు. ఓ వీధిలో పెళ్లి ఊరేగింపుతో కోలాహాలంగా ఉంటే..ఆటోమేటిగ్గా ఆ రోడ్డంతా బ్లాక్ అయిపోతుంది..వాహనదారులు, బాటసార్లు మరోదార్లో వెళ్తారు. అది సర్వసాధారణం. మరీ దేశం కానీ దేశంలో అదే రేంజ్లో ఆర్భాటంగా పెళ్లి చేయాలంటే.. కష్టమనే చెప్పాలి. (చదవండి: క'రెంట్' ట్రెండ్..అద్దెకు అ'డ్రెస్'..! ప్రీ వెడ్డింగ్ షూట్స్ నుంచి రీల్స్ వరకు..)ఎందుకంటే ఎన్నో పర్మిషన్లు కావలి. ముఖ్యంగా శబ్ద కాలుష్యం, ట్రాఫిక్కి అంతరాయం కలుగకుండా ఆయా అధికారుల నుంచి అనుమతి వంటివి ఎన్నో కావాలి. మరీ ఈ పెళ్లి సముహం అనుమతి తెచ్చుకుని మరీ ఏకంగా వాల్స్ట్రీట్లో వివాహ వేడుక ధూం ధాంగా నిర్వహించింది. అచ్చం మన దేశంలో నిర్వహించినట్లుగా పెళ్లి బరాత్ నిర్వహించి..ఓ లెవెల్లో ఆడిపాడి ఎంజాయ్ చేశారు వారంతా. ఈ వేడుక కోసం అత్యంత రద్దీగా ఉండే వాల్స్ట్రీట్ మూసేశారు. ఆ వాల్స్ట్రీట్ వీధుల్లో దాదాపు 400 మంది పెళ్లి సముహంతో కోలాహాలంగా ఉంది. అందుకోసం పెళ్లి వారు ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఉంటారో కదూ..!. ఎందుకంటే మన కరెన్సీ ప్రకారం..లక్షలకు పైగానే ఛార్జ్ చేస్తారు. అక్కడ ఓ పక్క డీజే మ్యూజిక్ సందడి..మరోవైపు ఆ బీట్లకు అనుగుణంగా డ్యాన్స్లతో కన్నులపండుగ ఉంది. ఈ వేడుక జరిగేలా సహకరిస్తుందా అన్నట్లు వాల్స్ట్రీట్ వీధులు వాహానాల రద్దీ లేకుండా నిర్మానుష్యంగా ఉన్నాయి. నెటిజన్లు మాత్రం మన వివాహ సంప్రదాయాలు న్యూయార్క్ వీధుల్లోకి వచ్చేశాయి. పైగా అక్కడ ఉండే స్థానికులు ఫోటోలు తీసుకుంటూ ఈ పెళ్లి వేడుకలో భాగమవ్వడం చూస్తుంటే.. మన సంస్కృతికి ఉన్న గొప్పదనం మరోసారి తేటతెల్లమైంది అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. ఇంకెందు ఆలస్యం అందుకు సంబంధించిన వీడియోపై మీరు ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by DJ AJ (@djajmumbai) (చదవండి: పచ్చి క్యాబేజ్ సలాడ్లు తింటున్నారా..? నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్) -
మహానాడు ఎఫెక్ట్.. బస్టాండ్లలో ప్రయాణికుల అవస్థలు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: తెలుగు దేశం పార్టీ మహానాడు(TDP Mahanadu) కార్యక్రమం మాటేమోగానీ.. జనాలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు జనాల్ని తరలించలేక, సభకు వచ్చినవాళ్లను నిలువరించలేక టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. తొలిరెండు రోజులు ఖాళీ కుర్చీలు దర్శనం ఇవ్వడం, నేతలు మాట్లాడుతుండగానే మధ్యలో జనాలు వెళ్లిపోవడాన్ని సాక్షి హైలైట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో మూడోరోజు మహానాడు బహిరంగ సభనైనా జనంతో నింపేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో.. మహానాడు సభ కోసం ఆర్టీసీ నుంచి భారీగా టీడీపీ బస్సులను వినియోగించుకుంటోంది. చాలా గ్రామాలకు ఉదయమే బస్సులు చేరుకుని జనాల్ని తరలిస్తున్నాయి. దీంతో డిపోల్లో బస్సుల్లేక.. సరిపడా బస్సుల్లేక గమ్యస్థానాలకు చేరేందుకు ప్రయాణికులు అగచాట్లు పడుతున్నారు. చాలా బస్టాండుల్లో బస్సుల్లేవ్ అనే బోర్డులు సైతం దర్శనమిస్తుండడం గమనార్హం. నంద్యాల జిల్లా నుంచి, శ్రీశైలం నుంచి మహానాడు కోసం బస్సులు తరలించారు. ఆత్మకూరు డిపోలో బస్సుల్లేక ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు.. కడప మహానాడు (Kadapa Mahanadu)ను ఎలాగైనా ‘సక్సెస్’ చేసుకోవాలని టీడీపీ భావిస్తోంది. రాష్ట్రం నలుమూలల నుంచి జనసేకరణ చేపట్టింది. అన్నమయ్య జిల్లాలో మహానాడు కోసం ఓబులవారిపల్లి హరిజన వాడ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. అయితే.. అది బలవంతపు తరలింపు అని ఇప్పుడు తేలింది. డ్వాక్రా మహిళలు మహానాడుకు కచ్చితంగా రావాలని, సమావేశానికి రాకపోతే లోన్లు ఇవ్వమంటూ బెదిరించిన ఆడియో ఒకటి బయటకు వచ్చింది.మహానాడు కారణంగా చివరకు పోలీసులు(AP Police) సైతం పడుతున్న కష్టాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయించుకుంది టీడీపీ. అయితే కనీసం తిండి కూడా పెట్టడం లేదంటూ ఓ ఎస్సై పడిన ఆవేదన వీడియో రూపేణా బయటకు వచ్చింది. మహానాడులో రకరకాల రుచులతో భోజనాలు ఘనంగా పెడుతున్నారంటూ టీడీపీ అనుకూల మీడియా ఎంతలా ప్రచారం చేసుకుందో తెలిసిందే. కానీ, తాము ఏ పూట వెళ్లినా తమకు తిండి మాత్రం దొరకడం లేదని ఆయన అక్కడికి వచ్చిన వాళ్లకు చెప్పుకుంటూ వాపోయారు. ఇదీ చదవండి: మహానాడులో ఎన్టీఆర్ స్పీచ్.. నవ్వుకున్న టీడీపీ కార్యకర్తలు -
‘నా భార్య నన్ను కొట్టలే’.. ఫ్రాన్స్ అధ్యక్షుడు
యూరప్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ మొహం మీద ఆయన సతీమణి బ్రిగిట్టే మేక్రాన్ కొట్టారంటూ ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. అయితే, ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ను బ్రిగిట్టే నిజంగా కొట్టారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత?దాదాపూ పదేళ్ల తర్వాత అధ్యక్షుడు మేక్రాన్ సౌత్ ఈస్ట్ ఆగ్నేయాసియా దేశాల్లో సుదీర్ఘ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ఆగ్నేయాసియా దేశాలతో అమెరికా, చైనాకు ఫ్రాన్స్ ప్రత్యామ్నాయమనే సంకేతాలిచ్చేలా డిఫెన్స్, ఎనర్జీ, టెక్నోలజికల్ ఇన్నోవేషన్తో పాటు పలు ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు.ఈ పర్యటనలో భాగంగా మే 25న వియత్నాం రాజధాని హనోయిలో అడుగుపెట్టారు. ప్రత్యేక విమానంలో హనోయి నోయి బాయి అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. ఆ సమయంలో జరిగిన ఓ ఊహించని ఘటన మీడియా కంట పడింది. ప్రస్తుతం ఈ ఘటన ఇప్పుడు ప్రపంచ దేశాల్లో చర్చకు దారి తీసింది.Bizarre moment Emmanuel Macron is slapped by his wife Brigitte pic.twitter.com/kYsE5MCDV1— The Sun (@TheSun) May 26, 2025 అసలేమైందంటే? మేక్రాన్, బ్రిగిట్టేలు ప్రత్యేక విమానం లోపలి నుంచి బయటకు వచ్చే సమయంలో విమానం డోర్లు తెరుచుకున్నాయి. అయితే, ఆ డోర్ ఓపెన్ అయ్యే సమయంలో బ్రిగిట్టే తన రెండు చేతులతో మేక్రాన్ మొహం మీద కొట్టిన దృశ్యాలు కనిపించాయి. బ్రిగిట్టే చేతులు తన మొహం మీద తగలడంతో వెంటనే తన తలను వెనక్కి జరిపారు. దీంతో మేక్రాన్ను బ్రిగిట్టే కొట్టారంటూ అంతర్జాతీయ మీడియా వీడియోల్ని ప్రసారం చేశాయి.అందుకు ఊతం ఇచ్చేలా ఈ ఘటన తర్వాత తన చేతిని పట్టుకోమని బ్రిగిట్టేకు తన చేతిని అందించబోయాడు. కానీ అందుకు ఆమె ఒప్పుకోలేదు. తిరస్కరించింది. కోపంగా అక్కడి నుంచి కదిలింది. ఈ వీడియో వైరల్ కావడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది.ఈ ఘటనపై మేక్రాన్ను మీడియా మాట్లాడారు. వైరల్ అవుతున్న వీడియోల్లో నిజం లేదన్నారు. భార్య బ్రిగిట్టే తనను కొట్టలేదని, తాము ఎప్పుడూ ఇలాగే సరదాగా గొడవ పడుతూ ఉంటామని అన్నారు. కానీ, ఆ వీడియోలో కనిపిస్తున్న సీరియస్నెస్ను చూస్తే మాత్రం మేక్రాన్ అబద్దం చెబుతున్నాడనే విషయం స్పష్టమవుతోందటూ అంతర్జాతీయ మీడియా కథనాల్ని వండి వార్చేస్తోంది. -
Viral Video: ఫ్రాన్స్ అధ్యక్షుడికి చెంపదెబ్బ
-
గ్రేట్ సీఎం సార్!.. మాటల్లేవ్ అంతే!
ఎంత పెద్ద హోదాలో ఉన్నా..ఆ దర్పం చూపించకుండా ప్రవర్తించడం కొందరికే చెల్లుతుంది. అలాంటి వాళ్లు కచ్చితంగా ప్రజల మన్ననలను అందుకుంటారు. బహుశా ఆ తీరే వారిని గొప్ప నాయకుడిగా ఎదిగేలా చేస్తుందనడానికి ఈ సీఎంనే ఉదాహారణవివరాల్లోకెళ్తే..మేఘాలయ సీఎం కన్రాడ్ కే సంగ్మాకి సంబంధించిన హార్ట్ టచ్చింగ్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో సంగ్మా జిరాంగ్ నియోజకవర్గంలోని నాంగ్స్పంగ్ గ్రామంలోని ఒక స్థానికి పాఠశాలను సందర్శిస్తున్నట్లు కనిపిస్తుంది. అక్కడ ఒక విద్యార్థి గిటార్ ప్లే చేయడంలో ఇబ్బంది పడుతున్నట్లు గమనిస్తారు. వెంటనే ఆ విద్యార్థి వద్దకు వచ్చి..కోప్పడకుండా ఓపికతో ఎలా ప్లే చేయాలో చెబుతున్నట్లు కనిపిస్తుంది వీడియోలో. ఆయన ఒక సాధారణ టీచర్ మాదిరిగా ఎలా గిటార్ పట్టుకుని ఆలపించాలో చాలా వివరణాత్మకంగా చెబుతూ విద్యార్థిని గైడ్ చేస్తారు. అందుకు సంబంధించిన వీడయోని నెటిజన్లతో పంచుకుంటూ పోస్ట్లో ఇలా రాసుకొచ్చారు సంగ్మా. నాంగ్స్పంగ్ గ్రామంలోని ఒక స్కూల్ని సందర్శించి..ఆ విద్యార్థులతో కాసేపు మచ్చుటించారు. అక్కడ ఒక విద్యార్థికి గిటార్ ప్లే చేయడం పట్ల అపారమైన ఆసక్తి ఉంది కానీ వాయించడంలో తడబడుతున్నాడు. ప్రస్తుతానికి ఆ విద్యార్థికి అందులో అంత ప్రావీణ్యం లేకపోయినా..అతని పాఠశాల కొత్త భవనం ప్రారంభోత్సవ వేళకు గిటార్లో మంచి పట్టు సాధిస్తాడని ఆశిస్తున్నా అని రాసుకొచ్చారు ఇన్స్టాగ్రాం పోస్ట్లో. ఈ వీడియోని చూసిన నెటిజన్లు మాత్రం గ్రేట్ సీఎం, మెచ్చుకోవడానికి మాటలు సరిపోవు అంటూ ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సంగీతాన్ని అమితంగా ఇష్టపడే మేఘాలయ సీఎం తరుచుగా మ్యూజిక్కి సంబంధించిన వీడియోలను నెటిజన్లతో షేర్ చేసుకుంటుంటారు. View this post on Instagram A post shared by Conrad Sangma (@conrad_k_sangma) (చదవండి: ఇదేం పండుగ సామీ..! ఏకంగా ప్రాణాలనే పణంగా పెట్టి..) -
పెద్ద సారూ.. పార్టీ ఆఫీసులో ఇదేం పని.. వీడియో వైరల్
లక్నో: బీజేపీ సీనియర్ నేత ఒకరు పార్టీకి చెందిన మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. మహిళా కార్యకర్తను రాత్రి వేళ పార్టీ కార్యాలయంలోకి తీసుకెళ్లడం ఆమెతో అనుచితంగా ప్రవర్తించిన వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో సదరు నేత స్పందిస్తూ.. దీని వెనుక రాజకీయ కారణాలున్నాయని చెప్పడం గమనార్హం. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. ఏప్రిల్ 12న రాత్రి 9.30 గంటల సమయంలో గోండా జిల్లా బీజీపీ అధ్యక్షుడు అమర్ కిషోర్ కశ్యప్, ఒక మహిళా కార్యకర్తతో కలిసి కారులో పార్టీ కార్యాలయానికి చేరుకున్నాడు. మెట్ల వద్ద ఆమెను కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత ఆ మహిళతో కలిసి పై అంతస్తులోని గదిలోకి వెళ్లాడు. బీజేపీ పార్టీ కార్యాలయంలోని సీసీటీవీలో ఇది రికార్డ్ అయ్యింది. దీంతో ఈ వీడియో క్లిప్ తాజాగా వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో బామ్ బామ్ మహిళా కార్యకర్తతో అసభ్యకరంగా ప్రవర్తించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.#Gonda: बमबम पर आरोप, पार्टी ने जारी किया नोटिस! क्या पद गंवाएंगे भाजपा जिलाध्यक्ष अमर किशोर कश्यप ? @deepaq_singh @Bhupendraupbjp pic.twitter.com/yKU2OFXYpz— GONDA POST (@gondapost) May 25, 2025మరోవైపు ఈ వైరల్ వీడియోపై బీజేపీ నేత అమర్ కిషోర్ కశ్యప్ స్పందించారు. ఈ వీడియోలో ఉన్నది తానేనని ఒప్పుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను కొనసాగడం ఇష్టం లేని వ్యక్తులు పన్నిన కుట్ర ఇది. కొంతమంది నా ప్రతిష్టను దెబ్బతీసేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. ఇది ఏప్రిల్ 12 తేదీన జరిగింది. ఆ రోజు మహిళా కార్యకర్త అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైంది. దీంతో పార్టీ కార్యాలయంలో విశ్రాంతి తీసుకోవాలని సూచించాను. మానవతా దృక్పథంతో ఆ మహిళకు సహాయం చేశానని చెప్పుకొచ్చారు. అయితే, తనపై కుట్రతో ఇలా చేస్తున్నారని ఆరోపించారు. ‘ఈ వీడియో వైరల్ వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయి’ అని చెప్పుకొచ్చారు. Gonda BJP Chief Responds to Viral Video: “She Was Unwell, Needed Rest” pic.twitter.com/pVY9o8OKoT— The Times Patriot (@thetimespatriot) May 25, 2025ఈ వీడియో బయటకు వచ్చిన నేపథ్యంలో అమర్ కిషోర్కు పార్టీ హైకమాండ్ నోటీసులు జారీ చేసింది. ఏడు రోజుల్లో దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. అనంతరం, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోవింద్ నారాయణ్ శుక్లా స్పందిస్తూ..‘సోషల్ మీడియాలోని వీడియో పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉంది. పార్టీ నేతలకు క్రమశిక్షణ అవసరం. ఈ ఘటనపై నోటీసులు ఇవ్వడం జరిగింది. అనుచితంగా ప్రవర్తించినట్టు తేలితే కఠినమైన క్రమశిక్షణా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. -
రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్
-
ప్రకృతి దాచిన అందమైన క్రికెట్ స్టేడియం
కొన్నింటిని ప్రకృతి సహజసిద్ధంగా చక్కటి ఆకృతిని ఏర్పరస్తుంది. చూస్తే.. కళ్లుతిప్పుకోలేనంత అందంగా ఉంటాయి. అలాంటి సుందరమైన క్రికెట్ స్టేడియం ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. పైగా దీన్ని నెటిజన్లు ప్రకృతి దాచిన క్రికెట్ మైదానంగా అభివర్ణిస్తున్నారు. అదెక్కడ ఉందంటే..కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో వరందరప్పల్లిలో ఉంది. దీన్ని పాలప్పిల్లి క్రికెట్ మైదానం అంటారు. సాధారణంగా స్టేడియంలు పచ్చిక బయళ్లకు దూరంగా ఉంటాయి. కానీ ఇది ప్రకృతితో అల్లుకుపోయినట్లుగా రహస్యంగా ఉంది. ప్రకృతి అందాలకు నెలవైనా కేరళను తరుచుగా 'దేవుని స్వంత దేశం'గా వర్ణిస్తారు కవులు. అందుకు తగ్గట్టు పచ్చని చెట్లతో ఆకర్షణీయంగా కనిపిస్తున్న క్రికెట్ మైదానం ఆ వర్ణనకు మరింత బలం చేకూర్చేలా ఉంది. ఈ మైదానం దశాబ్దాల కాలం నాటిదట. దీనిని మొదట హారిసన్ మలయాళం కంపెనీ తన తోటల కార్మికులకు వినోద స్థలాన్ని అందించడానికి సృష్టించింది. అప్పటి నుంచి ఇది ఉద్యోగులకు మాత్రమే కాకుండా స్థానికులకు ఆటవిడుపు స్థలంగా మారింది. అయితే దట్టమైన చెట్లతో కప్పబడి మారుమూల ప్రాంతంలో ఉండటంతోనే బయటి ప్రపంచానికి అంతగా తెలియదని అంటున్నారు స్థానికులు. అయితే అందుకు సంబంధించిన వీడియోని ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ శ్రీజిత్ ఎస్ "ఇది అమెజాన్ రెయిన్ఫారెస్ట్ కాదు" అనే క్యాప్షన్తో షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Sreejith S (@notonthemap) (చదవండి: వర్షం సాక్షిగా.. ఒక్కటైన జంటలు..!) -
మూగ జీవే..కానీ ఎంత అద్బుతంగా వీడ్కోలు చెప్పింది..!
విశ్వాసానికి పేరుగాంచిన కుక్కలు మనుషులతో ఎంతో అద్భుతంగా బంధాన్ని ఏర్పరుచుకుంటాయో తెలిసిందే. తమ యజామాని పట్ల ఎంతలా విధేయతతో ప్రవర్తిస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాటికి మన మాటలు అర్థం కాకపోయినా..మనకేం జరుగుతుంది, ఏం చేస్తున్నాం అన్నది ఇట్టే పసిగట్టేస్తాయి. మూగజీవే అయినా..ఎంత అందంగా భావోద్వేగాలను అర్థం చేసుకుంటాయో అనేందుకు ఉదహారణే ఈ అగ్నిమాపక స్టేషన్లో జరిగిన ఘటనే. ఇది తన అగ్నిమాపక సిబ్బందికి చెందిన ఒక అధికారి రిటైర్ అవ్వుతుంటే..అది కూడా ఎంత అద్భుతంగా వీడ్కోలు చెప్పిందో చూస్తే..ఆశ్యర్యంగా అనిపిస్తుంది. ఈ ఘటన కేరళ అగ్నిమాపకదళ స్టేషన్లో చోటు చేసుకుంది. ఆ స్టేషన్లోని అగ్నిమాపక అధికారి షాజు పదవీవిరమణ చేస్తున్నరోజు కావడంతో..తోటి సహచర సిబ్బంది అంతా ఆయనకు చక్కగా వీడ్కోలు పలికారు. ఆ తర్వాత అదే స్టేషన్లో ఉండే రాజు అనే కుక్కకూడా ఆయన పక్కకు వచ్చి నిలబడి మూగగా వీడ్కోలు చెబుతోంది. నోటితో భావాన్ని వ్యక్తం చేయలేకపోయినా..అది నిశబ్దంగా వీడ్కోలు చెప్పే తీరు అమోఘం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by StreetdogsofBombay (@streetdogsofbombay) (చదవండి: 'టాకింగ్ ట్రీ'..ఈ టెక్నాలజీతో నేరుగా మొక్కతో మాట్లాడేయొచ్చు..!) -
బాడీ బిల్డర్స్ 900 ఎగ్స్ డైట్..! ఆరోగ్యానికి మంచిదేనా?
ఇటీవల హెల్దీగా ఉందాం అనే నినాదం ప్రజల్లో బాగా వళ్తోంది. అందురూ ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తీసుకునేందుకే ఇష్టపడుతున్నారు. పైగా తమ శరీరానికి సరిపోయే డైట్ని ఫాలోఅయ్యి ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఇక్కడొక కంటెంట్ క్రియేటర్, మాజీ బాడీబిల్డర్ తనపైన అధిక ప్రోటీన్ ఫుడ్ ప్రయోగం చేసుకున్నాడు. అందుకోసం అని రోజుకి 30 గుడ్లు చొప్పున నెలకు 900 గుడ్లు తింటే త్వరితగతిన కండరాలు ఏర్పడి బాడీబిల్డర్గా మారడానికి తోడ్పడుతుందో లేదా తెలుసుకోవాలని తనమీదే స్వయంగా ప్రయోగం చేసుకున్నాడు. చివరికి ఏమైందంటే..యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్, మాజీ బాడీ బిల్డర్ జోసెఫ్ ఎవెరెట్ ప్రముఖ బాడీబిల్డింగ్ లెజెండ్ విన్స్ గిరోండా చెప్పే 900 ఎగ్స్ డైట్ని పరీక్షించాలనుకున్నాడు. గిరోండా తాను రోజు 30 గుడ్డు తింటానని, అదే తన కండల తిరిగిన దేహం రహస్యమని చెబుతుంటారు. అది ఎంతవరకు నిజం అని తెలుసకునేందుకు ఈ యూట్యూబర్ తనమీద ప్రయోగం చేసుకున్నాడు. అందుకోసం రోజుకి 30కి పైగా గుడ్లను డైట్లో తీసుకునేవాడు. అతను గుడ్డు తెల్లసొన ఆమ్లెట్లు, పచ్చసొన స్మూతీలు ఆహారంతో చేర్చుకునేవాడు. వాటితో పాటు రైస్, మాంసం, పెరుగు, పండ్లు, తేనె తదితరాలు తీసుకున్నాడు. ఈ ఆహారం తోపాటు వెయిట్ లిఫ్టింగ్కి సంబంధించిన అన్ని వ్యాయామాలు చేశాడు. ఆ తర్వాత తన బాడీలో జరిగిన మార్పులపై వైద్య పరీక్షలు జరిపించగా..మంచికొలస్ట్రాల్ స్థాయిలు పెరగడం తోపాటు, రక్తంలో చెడు కొలస్ట్రాల్కి సంబంధించి గణనీయమైన మార్పులు కనిపించాయి.ఈ డైట్ మంచిదేనా..? ప్రముఖ డైటీషియన్ కనిక మల్హోత్రా ఇలాంటి డైట్తో పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. గుడ్డులోని పచ్చసొనలో ఉండే అధిక కొలస్ట్రాల్ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుందన్నారు. ఇది గుడ్డు జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని అన్నారు. అంతేగాదు అధికంగా గుడ్లు తీసుకోవడం వల్ల.. కొంతమంది వ్యక్తుల్లో పొట్ట ఉబ్బరం, గ్యాస్, విరేచనలు వంటి జీర్ణ సమస్యలు ఉత్ఫన్నమవుతాయని అన్నారు. అంతేగాదు ఇలా గుడ్లు అధికంగా తీసుకుంటే పోష అసమతుల్యత వస్తుందన్నారు. అలాగే పచ్చిగా లేదా తక్కువగా ఉడికించి తీసుకుంటే సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ బారినపడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.కండరాల పెరుగుదల కోసం గుడ్డు అధికంగా తీసుకోవాల్సిందేనా..గుడ్డు కండరాల పెరుగుదలకు ఉపయోగపడినప్పటికీ..అధికంగా తీసుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదని తేల్చి చెప్పారు. గుడ్డులోని పచ్చసొన కండరాల ప్రోటీన్ సంశ్లేషణను సమర్థవంతంగా పెంచుతుందన్నారు. దీనిలో ప్రోటీన్ కంటెంట్ ఇతర వాటిలో కంటే ఎక్కువ. పైగా దీన్ని ఉడకించి తింటేనే సులభంగా అరుగుతుంది లేదంటే శరీరం దాన్ని అరిగించుకోవడానికి చాలా సమయం తీసుకుంటుందన్నారు. చెప్పాలంటే సోయా లేదా గోధుమలు, పాలు తదితరాల కంటే గుడ్డులో ప్రోటీన్ సంశ్లేషణ ఎక్కువ కాబట్టి దీన్ని తగు మోతాదులో తీసుకుంటే కండరాల పెరుగుదలకు, బాడీ బిల్డింగ్కి ఉపయోగపడుతుందని తెలిపారు. అంతకు మించి అంటే..మరిన్ని ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్లేనని హెచ్చరించారు నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులను లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: డ్యాన్స్ బేబీ డ్యాన్స్..! పార్కిన్సన్స్కు నృత్య చికిత్స) -
'టాకింగ్ ట్రీ'..నిజంగానే మొక్కతో మాట్లాడే టెక్నాలజీ..!
చిన్నప్పుడు సరదాగా చెట్టు వెనుకదాక్కుని దాంతో మాట్లాడటం వంటివి చేసేవాళ్లం. ఆ సరదా అల్లరే వేరు. కొందరు ప్రకృతి ప్రేమికులు చెట్లనే తమ ఆత్మీయులుగా వాటితోనే మాట్లాడటం, పెళ్లి చేసుకోవడం వంటివి చేసిన ఘటనలు చూశాం. అలాగే పరిశోధకులు చెట్టుకు ప్రాణం, ఉంది అవి కూడా స్పందిస్తాయని చెప్పారు. అది ఎంత వరకు నిజం అనేది కూడా ప్రయోగాత్మకంగా ప్రూవ్ చేశారు. అవి ఎలా తన పక్క చెట్లతో సంభాషిస్తుందో కూడా వివరించారు. ఇప్పుడూ ఏకంగా చెట్టుతో నేరుగా మాట్లాడే సరికొత్త టెక్నాలజీని అభివృద్ధిపరచడమే కాదు..మాట్లాడే అవకాశం కూడా ఇస్తున్నారు. అదెలాగో సవిరంగా తెలుసుకుందాం..!.ఐర్లాండ్ రాజధానిలలోని ట్రినిటి కాలేజ్లో 'టాకింగ్ ట్రీ' అనే టెక్నాలజీని ప్రవేశపెట్టారు. ఏఐ సాంకేతికతతో చెట్టుకు స్వరాన్ని అందిస్తారు. అందుకోసం పర్యావరణ సెన్సార్లు ఉపయోగించుకుంటుంది. అంటే ఇక్కడ సెన్సార్లుగా నేల తేమ, నేల pH, గాలి ఉష్ణోగ్రత, తేమ, సూర్యకాంతి, గాలి నాణ్యత' తదితరాల ఆధారంగా 'బయోఎలక్ట్రికల్ సిగ్నల్స్'ని తీసుకుంటుంది. ఆ సిగ్నల్స్ని ఏఐ సాంకేతికత మానవులకు అర్థమయ్యే భాషలా మారుస్తుంది. అయితే ఈ ప్రాజెక్టు లక్ష్యం కేవలం ప్రకృతి ప్రయోజనార్థమే చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రకృతితో మనం అనుసంధానమై ఉంటే..అకస్మాత్తుగా అంటుకుని కార్చిచ్చులను సకాలంలో నివారించడం సాధ్య పడుతుందని చెబుతున్నారు. అంతేగాదండోయ్ తాము చెట్టుతో ఎలా సంభాషిస్తున్నామో వీడియో రూపంలో సవివరంగా చూపించారు. అక్కడ ట్రినిటీ కాలేజ్లో దాదాపు 200 ఏళ్ల నాటి లండన్ ప్లేన్ ట్రీ వేర్లకు వైర్లకు టెక్నాలజీని అనుసంధానించి మాట్లాడుతున్నారు. నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి ఆ పురాతన చెట్టుతో ఏవిధంగా సంభాషిస్తున్నాడో స్పష్టంగా కనిపిస్తుంది వీడియోలో. View this post on Instagram A post shared by RTÉ News (@rtenews) (చదవండి: డ్యాన్స్ బేబీ డ్యాన్స్..! పార్కిన్సన్స్కు నృత్య చికిత్స) -
అతనికి ఆధార్ కార్డు ఇవ్వాల్సిందే..!
ఏ వ్యాపారంలోనైనా.. అమ్మడం అనే ట్రిక్ తెలిస్తే..విజయం సాధించేసినట్లే. ఏ బిజినెస్ సక్సెస్ మంత్రా అయినా..కస్టమర్ కొనేలా అమ్మడంలోనే ఉంది. అదే పాటిస్తున్నాడు ఇక్కడొక లండన్ విక్రేత. అది కూడా మన భారతీయ భాషలో విక్రయిస్తూ..అందర్నీ ఆక్టటుకుంటున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఆ వీడియోలో లండన్లో ఒక వ్యక్తి కొబ్బరిబోండాలు అమ్ముతున్నట్లు కనిపిస్తుంది. అతడు కొబ్బరికాయ కొట్టివ్వడం, అమ్మే విధానం అంతా భారతీయ చిరువ్యాపారిలానే ఉంటుంది. ఒక్క క్షణం భారత్లో ఉన్నామనే ఫీలింగ్ కలుగుతుంది అతడు అమ్ముతున్న విధానం చూస్తే. "నారియల్ పానీ పీ లో" అని హిందీలో అరుస్తూ కనిపిస్తాడు. అచ్చం మన వద్ద ఉండే కొబ్బరిబొండాల విక్రేతలు తియ్యటి కొబ్బరి బొండాలు అంటూ అరుస్తారే అలానే ఈ లండన్ వ్యక్తి అరవడమే అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. అది కూడా మన హిందీ భాషలో చెప్పడం విశేషం. ఇది ఒకరకంగా మన భారతీయ చిరువ్యాపారులు తమ గొంతుతో కస్టమర్లను ఆకర్షించే విధానం హైలెట్ చేసింది కదూ..!. View this post on Instagram A post shared by UB1UB2: Southall, West London (@ub1ub2) (చదవండి: Mobile Tailoring: ఇంటి వద్దకే టైలరింగ్ సేవలు..! ఐడియా మాములుగా లేదుగా..) -
ధోని పాదాలకు నమస్కరించిన వైభవ్.. సీఎస్కే కెప్టెన్ రియాక్షన్ వైరల్
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఆటలోనే కాదు.. పెద్దలను గౌరవించడంలోనూ ముందే ఉంటానని నిరూపించాడు. ఐపీఎల్-2025లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK vs RR)తో మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ పద్నాలుగేళ్ల పిల్లాడు.. దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) పాదాలకు నమస్కరించడం ఇందుకు నిదర్శనం. కాగా ఈ సీజన్లో తమ ఆఖరి మ్యాచ్లో భాగంగా రాజస్తాన్ సీఎస్కేతో మంగళవారం తలపడింది.ఢిల్లీలోని అరుణ్జైట్లీ స్టేడియంలో జరిగిన పోరులో రాయల్స్ ఆరు వికెట్ల తేడాతో చెన్నైపై గెలుపొంది.. విజయంతో ముగించింది. మరోవైపు.. ధోని జట్టుకిది పదో పరాజయం కావడం గమనార్హం. టాస్ ఓడిన చెన్నై మొదట నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.ఆయుశ్ మాత్రే (20 బంతుల్లో 43; 8 ఫోర్లు, 1 సిక్స్), బ్రెవిస్ (25 బంతుల్లో 42; 2 ఫోర్లు, 3 సిక్స్లు) ధాటిగా ఆడారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆకాశ్ మధ్వాల్, యుద్వీర్ చెరో 3 వికెట్లు తీశారు. తర్వాత రాజస్తాన్ 17.1 ఓవర్లలో 4 వికెట్లకు 188 పరుగులు చేసి గెలిచింది. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (33 బంతుల్లో 57; 4 ఫోర్లు, 4 సిక్స్లు) మరోసారి మెరిపించాడు. కెప్టెన్ సంజూ శాంసన్ (31 బంతుల్లో 41; 3 ఫోర్లు, 2 సిక్స్లు) కూడా ధాటిగా ఆడాడు. ఆరంభంలో కుదేలైనా... చెన్నై ఆరంభంలోనే కాన్వే (10), ఉర్విల్ పటేల్ (0) వికెట్లను కోల్పోయింది. మరో ఓపెనర్ ఆయుశ్ మాత్రే బౌండరీలతో అలరించాడు. పవర్ప్లేలో జట్టు పుంజుకుంటున్న తరుణంలో... ఆయుశ్ దూకుడుకు తుషార్ చెక్ పెట్టాడు. స్వల్ప వ్యవధిలో అశ్విన్ (13), జడేజా (1) వికెట్లను కోల్పోయిన చెన్నై 78/5 స్కోరు వద్ద కష్టాల్లో పడింది. ఈ దశలో బ్రెవిస్, శివమ్ దూబే (32 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్స్లు) ఇన్నింగ్స్ను నిలబెట్టారు.వైభవ్ ధనాధన్లక్ష్య ఛేదనలో మొదట యశస్వి జైస్వాల్ (19 బంతుల్లో 36; 5 ఫోర్లు, 2 సిక్స్లు) ఒక్కడే దంచేశాడు. అతను అవుటైనప్పడు జట్టు స్కోరు 37/1. అందులో 36 జైస్వాల్వే! శాంసన్ వచ్చాకే వైభవ్ బ్యాట్కు పనిచెప్పాడు. భారీ సిక్సర్లతో విరుచుకు పడి 27 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే అశ్విన్ ఒకే ఓవర్లో శాంసన్, వైభవ్లను అవుట్ చేశాడు. పరాగ్ (3)ను నూర్ అహ్మద్ బౌల్తా కొట్టించాడు. అయితే చెన్నై పట్టుబిగించకుండా జురేల్ (12 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్లు) దంచేయడంతో ఇంకా 2.5 ఓవర్లు మిగిలుండగానే రాజస్తాన్ గెలిచింది. మిస్టర్ కూల్ రియాక్షన్ ఇదీఇక మ్యాచ్ ముగిసిన తర్వాత ఆనవాయితీ ప్రకారం చెన్నై- రాజస్తాన్ ఆటగాళ్లు పరస్పరం కరచాలనం చేసుకున్నారు. అయితే, వైభవ్ మాత్రం ఇందుకు భిన్నంగా.. చెన్నై సారథి ధోని పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నాడు. మిస్టర్ కూల్ కూడా వైభవ్ వెన్నుతట్టి బాగా ఆడావు అన్నట్లుగా ప్రశంసించాడు.ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా ఐపీఎల్-2025లో రాజస్తాన్ రాయల్స్కు చేదు అనుభవాలే మిగిలినా.. వైభవ్ రూపంలో ప్రతిభ గల ఆటగాడు వెలుగులోకి వచ్చాడు. ఆడిన ఏడు ఇన్నింగ్స్లో ఓ సెంచరీ సాయంతో ఈ హర్యానా కుర్రాడు 252 పరుగులు సాధించాడు. ఈ సీజన్లో పద్నాలుగు మ్యాచ్లలో రాజస్తాన్ కేవలం నాలుగు మాత్రమే గెలిచింది.చదవండి: IPL 2025: ఐపీఎల్ షెడ్యూల్లో మార్పులు.. లక్నో వేదికగా ఆర్సీబీ మ్యాచ్లు 𝙈𝙤𝙢𝙚𝙣𝙩𝙨 𝙩𝙤 𝙘𝙝𝙚𝙧𝙞𝙨𝙝 😊This is what #TATAIPL is all about 💛🩷#CSKvRR | @ChennaiIPL | @rajasthanroyals pic.twitter.com/hI9oHcHav1— IndianPremierLeague (@IPL) May 20, 2025 -
బీర్ బాటిళ్ల ట్రక్ బోల్తా: ఎగబడిన జనం, ఘోరం ఏంటంటే!
బీర్ బాటిళ్ల లోడుతో నిండిన ట్రక్కు బోల్తాపడింది. దీంతో బీర్ బాటిళ్లను దక్కించుకునేందుకు జనాలు ప ఓటీలుపడ్డారు. డ్రైవర్ను, క్లీనర్ ట్రక్కులో చిక్కుకుపోయారు. ఆర్తనాదాలు చేస్తున్నారు. వారికి సహాయం చేయడానికి బదులుగా అయితే, బాటసారులు, స్థానికులు రోడ్డుపై చెల్లాచెదురుగా ఉన్న బీరు బాటిళ్లను పట్టుకుని లగెత్తారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మీ బీర్ పిచ్చి తగలడ, కాస్త మారండిరా బాబూఅంటూ నెటిజన్లు కమెంట్లతో మండిపడుతున్నారు.మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఈ ఘటనచోటుచేసుకుంది. కట్ని జిల్లా చాపారా గ్రామం సమీపంలోని జాతీయ రహదారిపై సవందలాది మద్యం కార్టన్లతో నిండిన ట్రక్కు బోల్తా పడింది. ట్రక్కు లోపల చిక్కుకున్న డ్రైవర్ , క్లీనర్కు సహాయం చేయడానికి కొంతమంది మొదట ముందుకు వచ్చారు. కానీ బీరు బాటిళ్లను మర్చి మానవత్వాన్ని మర్చిపోయారు. దొరికింది దొరికినట్టు మందు సీసాలను దొరకబుచ్చుకొని కాళ్లకు పనిచెప్పారు.ఈ మొత్తం సంఘటన వీడియోలో రికార్డ్ చేయబడింది మరియు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రమాదంలో చిక్కుకుపోయిన డ్రైవర్గురించి గానీ క్లీనర్ గురించి గానీ ఏ మాత్రం పట్టించుకోకుండా పట్టించుకోలేదు నెటిజన్టు కమెంట్స్ చేశారు.People Rush To Loot Beer Bottles As Loaded Truck Overturns In MP's Jabalpur #people #Jabalpur #BearBottles #loot #MadhyaPradesh pic.twitter.com/EUoJkaEtER— Free Press Madhya Pradesh (@FreePressMP) May 19, 2025 p; కొందరు బీరును సంచులలో మోసుకెళ్లగా, మరికొందరు తమ భుజాలపై డబ్బాలను ఎత్తుకుని పారిపోయారు. డజన్ల కొద్దీ వ్యక్తులు సీసాలను దోచుకుంటున్న సంఘటన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కనీస మానవత్వం లేకుండా ప్రవర్తించిన తీరు నెట్టింట విమర్శలకు దారి తీసింది. ఈ ట్రక్కు జబల్పూర్ నుండి భోపాల్లోని హజారిబాగ్కు వెళుతోంది. ఒక గేదె అకస్మాత్తుగా దాని ముందుకి రావడంతో ట్రక్కు బోల్తా పడిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. జంతువును కాపాడే ప్రయత్నంలో, డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు దీంతో ట్రక్కు బోల్తా పడింది. లక్షల రూపాయల నష్టం జరిగినట్లు అంచనాపోలీసులకు సమాచారం అందిన వెంటనే, సలీమ్నాబాద్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ అఖిలేష్ దహియా నేతృత్వంలోని బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. గాయపడిన డ్రైవర్ , క్లీనర్ను చికిత్స కోసం కట్ని జిల్లా ఆసుపత్రికి పంపారు. మరోవైపు మిగిలిన మద్యంను భద్రపరచడానికి ఎక్సైజ్ శాఖ సంఘటనా స్థలానికి చేరుకునే లోపే స్థానికులు భారీ మొత్తంలో వాటిని ఎత్తుకుపోయారు.ప్రమాదం, జనాల కక్కుర్తి వల్ల నష్టం లక్షల రూపాయలలో ఉందని మద్యం కాంట్రాక్టర్ పేర్కొన్నాడు. కేసు నమోదు చేసిన అధికారులు వైరల్ వీడియోల ఆధారంగా అనుమానితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చట్టపరమైన చర్యలుతీసుకునేందుకు ఫుటేజ్లో కనిపించిన వ్యక్తులను గుర్తించడంలో సహాయం చేయాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
మెట్రోలో ఇన్ఫ్లూయెన్సర్ సందడి మాములుగా లేదు! వీడియో వైరల్
భారతీయ సంస్కృతి, ఫ్యాషన్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందుతున్నాయి. అనేక అంతర్జాతీయ ఈవెంట్లలో మన ఫ్యాషన్ స్టైల్ ఫ్యాషన్ ప్రియులనుంచి సామాన్యులదాకా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మెట్ గాలా, కేన్స్ లాంటి ప్రతిష్టాత్మక వేదికలు, ఐకానిక్ ప్రపంచ వేదికలపై మన భారతీయ నటీమణులు, సెలబ్రిటీలు భారత సంప్రదాయ ఫ్యాషన్ శైలిని ప్రదర్శిస్తున్నారు. రెడ్ కార్పెట్ దేశీ సంస్కృతిని ప్రచారం చేస్తున్నారు. అయితే ఇది కేవలం తారలు మాత్రమే కాదు..వివిధ స్థాయిలలో భారతీయ వారసత్వాన్ని ప్రభావితం చేస్తున్న సామాన్యులకు కూడా కొదవేమీ లేదు. తాజా వీడియో ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఢిల్లీ మెట్రోలో లెహంగాలు, అనార్కలి లేదా చీరలు ధరించి రీల్స్ చేసే అమ్మాయిలను చూసి ఉంటారు. కానీ విదేశాల్లో మెట్రోలో చీర లేదా మన సంప్రదాయ దుస్తులు ధరించిన యువతులను చూడటం చాలా అరుదు. తాజా ప్యారిస్లోని మెట్రోలో ఒక లెహంగాలో అందంగా మెరిసిన యువతి ప్రస్తుతం సోషల్ మీడియాలో నివ్య సందడి చేస్తోంది. ఇదీ చదవండి: నిహారికను తీర్చిదిద్దిన శిల్పి ఆమె తల్లే!భారతీయ సంతతికి చెందిన ఫ్యాషన్ ఇన్ఫ్లూయెన్సర్ నివ్య ప్యారిస్లోని స్థానిక రైలులో అందమైన లెహెంగాలో ప్రయాణించడమే కాదు, చక్కటి హావభావాలను ఆకట్టుకుంది. లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తున్న తన వీడియోను ఆమె ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో షేర్ చేసింది. దీంతో నెటిజన్లు తెగ మురిసి పోతున్నారు. నివ్య బ్రైట్ నారింజ రంగు భారీ లెహంగాలో మెరిసింది. క్లిష్టమైన బంగారు ఎంబ్రాయిడరీ జరీ వర్క్ లెహెంగాకు స్లీవ్లెస్ చోలి సెట్, ఇతర నగలతో స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది. కూల్...కూల్గా గాగుల్స్ పెట్టుకుని మరింత స్టైల్గా కనిపించింది. గత ఏడాది నవంబరులో షేర్ చేసిన ఈ వీడియో ఏకంగా 10 లక్షలకు పైగా వ్యూస్, వేల కామెంట్లను సొంతం చేసుకుంది. View this post on Instagram A post shared by MAKEUP & HAIR ARTIST PARIS (@tanzeela.beauty) యూరప్లో భారతీయ సంస్కృతిని ప్రదర్శిస్తూ, ఆత్మవిశ్వాసంతో వ్యవహరించిన నివ్యను నెటిజన్లు ప్రశంసించారు. చాలా అందంగాఉన్నారనే కామెంట్లు వెల్లువెత్తాయి. ఫ్రాన్స్లోని మెట్రోలో బంగారు నగలతో ప్రయాణిస్తున్నారా? సేఫ్టీ ఫస్ట్. ఇవి కాస్ట్యూమ్ ఆభరణాలు అయితే మంచిది. అవి మీ అమ్మగారి ఆభరణాలు కాకూడదని అనుకుంటున్నా అంటూ మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. ఇదే లెహంగాలో ఆకట్టుకున్న వీడియో కూడా ఆకర్షణీయంగా నిలిచింది. చదవండి: Yoga: ప్రాణాయామంతో అమోఘమైన ఆరోగ్య ఫలితాలు View this post on Instagram A post shared by Nivya | Fashion & Lifestyle (@boho_gram)p> -
భారతీయ వంటకాలు అమోఘం..! విదేశీ జంట ప్రశంసల జల్లు
భారతదేశంలోని పలు ప్రదేశాలు..వాతావరణం తదితరాలను ఎందరో విదేశీయలు మెచ్చుకున్నారు. ఇక్కడ సాంస్కృతి సంప్రదాయాలు ఎంతగానో నచ్చాయని ఇక్కడే నా పిల్లలను పెంచుతానని ఒక విదేశీ తల్లి సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది. ఇవన్నీ మరువక ముందే ఇప్పుడు మరో విదేశీ జంట ఇక్కడ వంటకాలపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. భారతీయులు వంటకాలు వండే పద్ధతి గురించి ఏం చెబుతున్నారో ఆ జంట మాటల్లోనే విందామా..భారతీయు రోజువారీ వంటల్లో ఆకుపచ్చని పదార్థాలను విరివిగా వినియోగిస్తారని అన్నారు. ఇక్కడ పచ్చిగా ఉన్నవాటిని చక్కగా పచ్చళ్లు పట్టేస్తారు లేదా ఘుమ ఘుమలాడే కూరల్లా మార్చేస్తారు. అదే పండిన వాటిని పండ్లు మాదిరిగా ఉపయోగిస్తారని చెబుతున్నారు. పండని కూరగాయలు, పండ్లతో చేసే వంటకాలని అసాధారణ ఆవిష్కరణలుగా అభివర్ణించారు. ముఖ్యంగా ఆకుపచ్చని మామిడిపండ్లతో పట్టే ఊరగాయ, పనపండుతో చేసే వంటకాలు అమోఘం అని ప్రశంసించారు. భారతదేశంలో తినడానికి ఏది పచ్చిగా ఉండదు. వాళ్ల చేతిమహిమతో అద్భుతమైన రుచిగా మార్చేస్తారు. పువ్వులను పకోడాలుగా మార్చేయడంలో వారి పాక నైపుణ్యం ఊహకందనిదని అన్నారు. పచ్చిగా ఉండే సబ్జీలో ఉడికించి తినడం మరింత అద్భుతమని అన్నారు. అందుకు సంబంధించిన వీడియోకి 'భారతదేశంలో తినడానికి ఏది పచ్చిగా ఉండదు' అనే క్యాప్షన్ జోడించి మరీ పోస్ట్ చేశారు. అయితే నెటిజన్లు..భారతీయులుగా మేము చాలా వాటిని పచ్చిగా తింటున్నామనే విషయాన్ని గమనించలేదు. అయినా మా ఆహార సంస్కృతి ప్రాంతాల వారీగా మారుతుందని అది కూడా తెలుసుకోండి అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Life in India with Guru and Lila (@guru_laila) (చదవండి: గోల్డ్ మ్యాన్ అందించే '24 క్యారెట్ల గోల్డ్ కుల్ఫీ'..! ధర ఎంతంటే.. ) -
అనంత్-రాధిక సండే షాపింగ్ : లవ్బర్డ్స్ వీడియో వైరల్
బాల్య ప్రేమికులు,గత ఏడాది జూలైలో వివాహం బంధంలోకి అడుగపెట్టిన లవ్బర్డ్స్ అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ షాపింగ్లో సందడిగా కనిపించారు. జియో ప్లాజాలో భార్య రాధిక మర్చంట్ తో కలిసి అనంత్ అంబానీ ఆదివారం షాపింగ్ చేయడం సోషల్ మీడియాలో విశేషంగా నిలిచింది. అంబానీ అప్డేట్ పేజీ ఇన్స్టాలో షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.అనంత్ , రాధిక జియో వరల్డ్ ప్లాజా ప్రాంగణంలో షాపింగ్ చేశశారు. జియో వరల్డ్ ప్లాజాలోని భద్రతా సిబ్బంది వెంటరాగా ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని పెళ్లి అయ్యి దాదాపు ఏడాది కావస్తున్నా కొత్తజంటలా జియో షాపింగ్ మాల్లో సందడి చేశారు. అనంత్ కాల్లో బిజీగా ఉండగా, రాధిక చేయి పట్టుకుని ఉల్లాసంగా నడుస్తు, విలాసంగా కనిపించింది. అనంత్ నేవీ బ్లూ షర్ట్, త్రీ-ఫోర్త్స్ బ్లాక్ షార్ట్స్, బ్లాక్ సాక్స్, బ్లూ షూస్ ధరించాడు. ఇక అంబానీ చోటీ బహూ ఎప్పటిలాగానే తన సింపుల్ స్టైల్ను చాటుకుంది. రాధిక తెల్లటి స్లీవ్లెస్ క్రాప్ టాప్ ధరించి, గిరిజాలజుట్టును అలా వదిలేసి సైడ్ బ్యాగ్ వేసుకుని చాలా క్యాజువల్ స్టైల్లో కనిపించింది.అయితే జంట దేని కోసం షాపింగ్ చేశారో స్పష్టంగా తెలియదు. ఫ్యాన్స్కి మాత్రం అనంత్-రాధిక షాపింగ్ వీడియో తెగ నచ్చేసింది. View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update)ఇదీ చదవండి: బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా? ఈ తొమ్మిది మస్ట్..! దేశీయ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ చిన్నకుమారుడు అనంత్ అంబానీ తన చిన్ని నాటి స్నేహితురాలు రాధిక మర్చంట్ను గత ఏడాది జైలూ12న పెళ్లాడాడు. ప్రపంచంలోనే కనీవినీ ఎరుగనిరీతిలో వివాహ వేడుకలు జరిగాయి. అంగరంగవైభవంగా జరిగిన ఈ వివాహానికి ఇండియాతో పాటు, ప్రపంచవ్యాప్తంగా అనేకమంది బిలియనీర్లు హాజరైన సంగతి తెలిసిందే. -
42 ఏళ్ల వయసులోనూ ఇరగదీసిన ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం.. వైరల్ వీడియో
వయసు కేవలం సంఖ్య మాత్రమేనని ఇంగ్లండ్ మాజీ పేసర్ జేమ్స్ ఆండర్సన్ మరోసారి నిరూపించాడు. 42 ఏళ్ల వయసులోనూ కౌంటీ మ్యాచ్ ఆడుతూ ఇరగదీశాడు. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్-2లో భాగంగా లాంకాషైర్కు ఆడుతున్న ఆండర్సన్.. డెర్బిషైర్తో జరుగుతున్న మ్యాచ్లో 2 వికెట్లతో సత్తా చాటాడు. ఇందులో ఓ వికెట్ (కాలెబ్ జువెల్) మ్యాచ్ మొత్తానికే హైలైట్గా నిలిచింది. ఆండర్సన్ సంధించిన ఇన్ స్వింగింగ్ బంతికి వికెట్లు గాల్లోకి లేచాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది. జిమ్మీ లేటు వయసులోనూ ఇరగదీస్తున్నాడని క్రికెట్ అభిమానులు కొనియాడుతున్నారు.43 YEAR OLD JIMMY ANDERSON FOR LANCASHIRE. 🤯pic.twitter.com/w5AwHTndmv— Mufaddal Vohra (@mufaddal_vohra) May 17, 2025గతేడాది జులైలో అంతర్జాతీయ క్రికెట్కు (టెస్ట్లకు) రిటైర్మెంట్ ప్రకటించిన ఆండర్సన్.. ఆతర్వాత కొద్ది రోజులు ఇంగ్లండ్ జాతీయ జట్టుకు బౌలింగ్ కోచ్గా పని చేశాడు. ఆతర్వాత 41 ఏళ్ల వయసులో ఐపీఎల్ 2025 మెగా వేలంలో తన పేరును నమోదు చేసుకుని అందరిని ఆశ్చర్యపరిచాడు. ఆండర్సన్ ప్రస్తుతం లాంకాషైర్ తరఫున టీ20, సుదీర్ఘ ఫార్మాట్లో కొనసాగుతున్నాడు. అతను ఇంగ్లండ్ దేశవాలీ టీ20 లీగ్ టీ20 బ్లాస్ట్లోనూ ఆడనున్నాడు. గత నెలలో కాలి మడమ సమస్యతో బాధపడిన ఆండర్సన్ నెల రోజుల్లోనే కోలుకుని రీఎంట్రీ ఇచ్చాడు. వచ్చీ రాగానే రెండు వికెట్ల ప్రదర్శనతో సత్తా చాటాడు. ఆండర్సన్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్గా రిటైరయ్యాడు. 188 మ్యాచ్ల్లో అతను 704 వికెట్లు తీశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన లాంకాషైర్ తొలి ఇన్నింగ్స్లో 458 పరుగులకు ఆలౌటైంది. వెల్స్ (141) సెంచరీతో కదంతొక్కగా.. మాథ్యూ హర్ట్స్ (51), జార్జ్ బెల్ (57), బాల్డర్సన్ (73) అర్ద సెంచరీలతో రాణించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన డెర్బిషైర్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. ఇందులో ఆండర్సన్ 2 వికెట్లు తీయగా.. టామ్ హార్ట్లీ, వెల్స్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
రోహిత్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తల్లిదండ్రులు పూర్ణిమా శర్మ- గురునాథ్ శర్మ కన్నీటి పర్యంతమయ్యారు. కష్టాల కడలిని దాటి శిఖరాగ్రానికి చేరుకున్న కుమారుడిని చూసి పుత్రోత్సాహంతో పొంగిపోయారు. కాగా బ్యాటర్గా, కెప్టెన్గా తనకంటూ ప్రత్యేక అధ్యాయం రచించుకున్న రోహిత్ శర్మను అతని సొంత సంఘం ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) సముచిత రీతిలో గౌరవించిన విషయం తెలిసిందే.ముంబైలోని ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియంలో ఒక ప్రేక్షకుల గ్యాలరీకి ‘రోహిత్ శర్మ స్టాండ్’ అని పేరు పెట్టింది. ఈ స్టాండ్ ఆవిష్కరణ కార్యక్రమంశుక్రవారం జరిగింది. రోహిత్ తల్లిదండ్రులు పూర్ణిమ, గురునాథ్, భార్య రితిక (Ritika), మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఈ కార్యక్రమానికి హాజరై ‘రోహిత్ శర్మ స్టాండ్’ను ప్రారంభించారు. రోహిత్ భావోద్వేగంఈ సందర్భంగా మాట్లాడుతూ రోహిత్ భావోద్వేగానికి గురయ్యాడు. ‘నేడు ఇక్కడ జరిగిన కార్యక్రమాన్ని నేను కలలో కూడా ఊహించలేదు. ఇదో ప్రత్యేక అనుభూతి. మ్యాచ్లలో సాధించే ఎన్నో మైలురాళ్లకంటే విశేషమైంది.వాంఖడేలాంటి ప్రతిష్టాత్మక మైదానంలో ఎంతో మంది దిగ్గజాల సరసన నా పేరు కనిపిస్తున్న ఆనందాన్ని మాటల్లో వర్ణించలేదు. ఈ స్టేడియంలో నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. నేను ఇంకా క్రికెట్ ఆడుతున్నాను. వచ్చే బుధవారం ఇక్కడ నా స్టాండ్ ముందు ఐపీఎల్ మ్యాచ్ ఆడబోతున్నాను. అది చాలా గొప్ప అనుభవం అవుతుంది.ఇక భారత్ తరఫున మ్యాచ్ ఆడితే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. నా కుటుంబ సభ్యులందరి ముందు ఈ కార్యక్రమం జరిగింది. అందరికీ ఎంతో కృతజ్ఞుడను’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు. కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక!మరోవైపు.. కుమారుడి పేరిట స్టాండ్ ఆవిష్కరణ కాగానే పూర్ణిమా- గురునాథ్ ఆనందభాష్పాలు రాల్చగా.. రితిక కూడా తీవ్ర భావోద్వేగానికి లోనైంది. కన్నీళ్లు తుడుచుకుంటూ మామగారి వెనుకగా వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.కాగా కార్యక్రమంలో భారత మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్ పేరిట, సీనియర్ అడ్మినిస్ట్రేటర్, ఐసీసీ మాజీ అధ్యక్షుడు శరద్ పవార్ పేరిట కూడా స్టాండ్లను ఆవిష్కరించిన ఎంసీఏ... ఇటీవలే కన్నుమూసిన మాజీ అధ్యక్షుడు అమోల్ కాలే పేరిట ప్రత్యేక లాంజ్ను కూడా ప్రారంభించింది. ‘నేనైతే సిడ్నీలో రోహిత్ను ఆడించే వాడిని’ మరోవైపు.. ఆస్ట్రేలియాతో సిరీస్తో చివరి టెస్టుకు ముందు తాను ఫామ్లో లేనంటూ రోహిత్ శర్మ స్వయంగా తప్పుకొన్నాడు. సిడ్నీలో జరిగిన ఈ టెస్టుకు దూరమైన అతను మళ్లీ టెస్టు ఆడకుండానే ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే తాను జట్టు కోచ్గా ఉండి ఉంటే రోహిత్ను తప్పనిసరిగా ఆ టెస్టులో ఆడించే వాడినని మాజీ కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు.‘సిరీస్ ముగిసిపోలేదు కాబట్టి కచి్చతంగా అతడిని ఆడించే వాడిని. సిరీస్లో 1–2తో వెనుకబడి ఉన్న సమయంలో జట్టును వదలవద్దని చెప్పేవాడిని. ఆ టెస్టులో తేడా ఒక 30–40 పరుగులు మాత్రమే. ఫామ్ ఎలా ఉన్న అతనో మ్యాచ్ విన్నర్. పిచ్పై పరిస్థితిని అర్థం చేసుకొని ఓపెనర్గా ఒక 35–40 పరుగులు చేసి ఉంటే చాలు మ్యాచ్ ఫలితం మారిపోయేదేమో. సిరీస్ కూడా సమంగా ముగిసేది. అక్కడ రోహిత్ ఆడకపోవడం నన్ను చాలా కాలం వెంటాడింది’ అని రవిశాస్త్రి తన మనసులో మాటను పంచుకున్నాడు. చదవండి: Rohit Sharma Interesting Facts: పేద కుటుంబంలో పుట్టి.. కోటీశ్వరుడిగా! లగ్జరీ ఇల్లు, కార్లు.. ఆస్తి ఎంతంటే?#WATCH | Mumbai | Rohit Sharma stands unveiled at Wankhede stadium. Indian ODI men's cricket team captain Rohit Sharma and his family, Maharashtra CM Devendra Fadnavis, NCP-SCP chief Sharad Pawar, and others, are also present.The Mumbai Cricket Association (MCA) is formally… pic.twitter.com/K39kSfRkCY— ANI (@ANI) May 16, 2025 -
‘ఇక్కడి నుంచి పో..’: సహనం కోల్పోయిన స్టార్క్.. వీడియో వైరల్
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) సహనం కోల్పోయాడు. ‘‘ఇక్కడి నుంచి వెళ్లిపో’’ అంటూ అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. కాగా ఐపీఎల్-2025 (IPL 2025) మెగా వేలంలో భాగంగా ఢిల్లీ స్టార్క్ను రూ. 11. 75 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది.ఈ క్రమంలో ఈ సీజన్లో ఢిల్లీ (Delhi Capitals) తరఫున పదకొండు మ్యాచ్లు ఆడి పద్నాలుగు వికెట్లు పడగొట్టాడు స్టార్క్. చివరగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ సందర్భంగా అతడు బరిలోకి దిగాడు. అయితే, భారత్- పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ధర్మశాలలో బ్లాక్ అవుట్ (విద్యుత్ సరఫరా నిలిపివేయడం) విధించడంతో పంజాబ్- ఢిల్లీ మ్యాచ్ అర్దంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే.భార్య అలిసా హేలీతో కలిసిఈ నేపథ్యంలో బీసీసీఐ ఆటగాళ్లను వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించి.. ఆపై కట్టుదిట్టమైన భద్రత నడుమ ఢిల్లీకి చేర్చింది. ఈ పరిణామాలతో తీవ్ర భయాందోళనకు లోనైన స్టార్క్, అతడి భార్య అలిసా హేలీ ఢిల్లీకి చేరుకుని.. వెంటనే స్వదేశానికి పయనమయ్యారు.ఇక్కడి నుంచి పో..ఈ క్రమంలో ఢిల్లీ ఎయిర్పోర్టులో ఓ వ్యక్తి స్టార్క్ దగ్గరగా వెళ్లి వీడియో తీసే ప్రయత్నం చేశాడు. దీంతో అతడు పక్కకు వెళ్లిపో అంటూ సైగ చేశాడు. అయితే, కాసేపటి తర్వాత సదరు వ్యక్తి మరోసారి స్టార్క్ దగ్గరికి వెళ్లి పలకరించాడు. దీంతో కోపోద్రిక్తుడైన ఆసీస్ బౌలర్.. ‘‘పో.. పో.. ఇక్కడి నుంచి దూరంగా వెళ్లిపో’’ అన్నట్లుగా విసుక్కున్నాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో చాలా మంది స్టార్క్కు మద్దతుగా నిలుస్తున్నారు. అసలే భయపడిన వాడిని మరింత భయపెట్టడం సరికాదంటూ సెటైర్లు వేస్తుండగా... మరికొందరు మాత్రం స్టార్క్ అంతలా విసుక్కోవాల్సిన అవసరం లేదని.. ఏదేమైనా ఒకరి గోప్యతకు భంగం వాటిల్లేలా ప్రవర్తించడం ఏమిటని సదరు వ్లాగర్కు చివాట్లు పెడుతున్నారు.మే 17 నుంచి తిరిగి ప్రారంభంఇదిలా ఉంటే... మే 17 నుంచి ఐపీఎల్-2025 తిరిగి ప్రారంభం కానుంది. అయితే, ఢిల్లీకి ఆడుతున్న ఆసీస్ స్టార్లు స్టార్క్, జేక్ ఫ్రేజర్-మెగర్క్ తిరిగి ఇండియాకు వచ్చే సూచనలు కనిపించడం లేదు. ఇష్టమైతేనే భారత్కు తిరిగి వెళ్లవచ్చు అని క్రికెట్ ఆస్ట్రేలియా తమ ఆటగాళ్లకు సూచించగా.. స్వదేశంలోనే ఉండేందుకు వీరిద్దరు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.మరోవైపు.. ఢిల్లీకి లీగ్ దశలో ఇంకో మూడు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం పదకొండు మ్యాచ్లు పూర్తి చేసుకుని 13 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతున్న అక్షర్ సేన.. ప్లే ఆఫ్స్నకు గురిపెట్టింది. అయితే, స్టార్క్, మెగర్క్ వంటి కీలక ఆటగాళ్లు లేకపోవడం తీవ్ర ప్రభావం చూపనుంది.చదవండి: మాట తప్పారు!.. ఆర్సీబీకి తిరిగి ఆడాలని అనుకోలేదు: పాటిదార్Go away😭pic.twitter.com/hqkyHzCEg4— Ghar Ke Kalesh (@gharkekalesh) May 15, 2025 -
'టీ బ్యాగులు' తినడం గురించి విన్నారా..?
ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అలవాట్లు ఉంటాయి. కానీ కొందరికి చాలా వెరైటీ అభిరుచులు ఉంటాయి. అది తినడం లేదా స్కిల్ పరంగా ఏదైనా.. ఆ అలవాట్లు చాలా చిత్రంగా ఉంటాయి. అలానే ఇక్కడొక అమ్మాయికి ఉన్న విచిత్రమైన అలవాటు వింటే..ఇదేం అభిరుచి అనిపిస్తుంది.సైప్రస్లోని లిమాసోల్కు చెందిన లియుబోవ్ సిరిక్ అనే 20 ఏళ్ల అమ్మాయికి ఓ వింత ఆహారపు అలవాటు ఉంది. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ అభిరుచి నెట్టింట హాట్టాపిక్గా మారింది. 'టీ' అంటే ఇష్టపడే ఆహార ప్రియులు ఆమె అలవాటు వింటే..వామ్మో అని నోరెళ్లబెడతారు. మార్కెటింగ్ బ్రాండ్ మేనేజర్ అయిన లియుబోవ్కి టీ బ్యాగులు తినడం అంటే ఇష్టమట. టీ తాగిన తర్వాతా ఆ టీ బ్యాగ్ని పడేయకుండా మొత్తంగా తినేస్తుందట. ఇలా ఆమె రోజుకు రెండుసార్లు తినేస్తానని చెబుతోందామె. వారానికి కనీసం మూడుసార్లు పేపర్ టీ బ్యాగ్లు ఫినిష్ చేస్తానని అంటోంది. ఈ అలవాటు 14 ఏళ్ల అప్పుడు ప్రారంభమైందట. వాళ్ల అమ్మమ్మ పుదీనా ఆకులు తినమని చెప్పినప్పుడూ ..ఈ టీ ఆకులు రుచి చూడాలని అనుకున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే టేస్ట్ నచ్చి..అది క్రమంగా అలవాటుగా మారిందని అంటోంది లియుబోవ్. ఆమె ఆర్గానిక్ టీ బ్యాగులను మాత్రమే తింటుందట. ప్లాస్టిక్ లేదా నైలాన్తో ఉన్న వాటిని టచ్ చేయనని చెబుతోంది. అయితే కొన్ని టీ బ్యాగుల్లో ఫాబ్రిక్ ఉంటుంది కాబట్టి తినడానికి కష్టంగా ఉంటుందని అంటోంది. అయితే ఆమె ఈ అలవాటుని వదిలేద్దాం అనుకుందట గానీ సాధ్యం కాలేదని చెబుతోంది. ఇది ప్రమాదకరమా..?అయితే ఇదిప్రమాదకరమా అంటే..ఒక్కోసారి ఆ టీ వేస్ట్ గొంతులో అడ్డుపడటం లాంటిది జరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల గొంతు సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణుల వాదన. కానీ ఈ అమ్మాయి లియుబోవ్ మాత్రం ఈ అలవాటు మంచిదేనా? కాదా? అని గూగుల్లో సర్చ్ చేసిందట. చివరికి ఇది హానికరం కాదని నిర్థారించుకున్నాకే ధీమాగా తింటున్నానని చెబుతోంది. ప్రస్తుతానికి ఆమె ఆరోగ్యంగానే ఉన్నానంటోంది. ధూమపానం, మద్యం వంటి అలవాట్ల కంటే ప్రమాదకరమైనది కాకపోయినా..సాద్యమైనంత వరకు ఈ అలవాటుని దూరం చేసుకునేందుకు ప్రయత్నిస్తానంటోంది. అయినా ఏ అలవాటుకైనా అడిక్ట్ అయ్యిపోకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే 'అతి సర్వత్ర వర్జయేత్' అని పెద్దలు ఊరికే అనలేదు కదా..! ఆరోగ్యానికి హానికరం కాకపోయినా..తగు జాగ్రత్తలో ఉండటమే మంచిది కదూ..!. View this post on Instagram A post shared by Newsflare (@newsflare) (చదవండి: 70 ఏళ్ల వ్యక్తి కాలినడకతో కేదార్నాథ్కు..! వీడియో వైరల్) -
70 ఏళ్ల వ్యక్తి కాలినడకతో కేదార్నాథ్కు..! వీడియో వైరల్
మనిషి సంకల్పం ముందు ఏదైనా చిన్నబోవాల్సిందే. అలాంటి ఉదంతాలు ఎన్నో కోకొల్లలుగా జరిగాయి. వాటన్నింటిని తలదన్నేలా అంతకు మించి..అనే అజేయమైన సాహాసానికి తెరతీశాడు ఈ 70 ఏళ్ల వృద్ధుడు. అతడి చేసిన ఘనకార్యం ఏంటో తెలిస్తే.. ఇదేలా సాధ్యం అనే ఆశ్చర్యం కలగకమానదు. కర్ణాటకలోని కలబురగి (గుల్బర్గా) జిల్లాకు చెందిన 70 ఏళ్ల వృద్ధుడు ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ధామ్కు కాలినడకన వచ్చాడు. ఎన్నో వేల కిలోమీటర్లు నడిచి మరీ కేదార్నాథ్ స్వామిని దర్శించుకున్నారాయన. ఆ వృద్ధ భక్తుడు తన తోటి యాత్రికుల బృందంతో కలబురగి నుంచి ఈ యాత్ర చేసినట్లు తెలిపారు. తాము మార్చి 3న యాత్రని ప్రారంభించి మే 1న కేదార్నాథ్ పుణ్యక్షేత్రానికి చేరుకున్నామని అన్నారు. అంటే దాదాపు రెండు నెలల్లో వివిధ మైదానాలు, అడవులు, పర్వత మార్గాల గుండా సుమారు 2,200 కిలోమీటర్ల అసాధారణ యాత్రను చేశారు వారంతా. అంతేగాదు ఆ వృద్ధుడు ఇదంతా మన ఆధ్యాత్మికతకు ఉన్న శక్తి అని అంటున్నారాయన. దైవం ఆశీస్సులు ఉంటే ఎంత కఠినతరమైన ప్రయాణమైనే చిటికెలో సాధ్యమైపోతుందని ధీమాగా చెబుతున్నాడు ఆ వృద్ధుడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో ఎంతో మంది నెటిజన్ల మనసును కదిలించింది. ధృడ సంకల్పం, అజేయమైన భక్తి..అనితరసాధ్యమైన ఓర్పుని అందిస్తాయనడానికి ఆ వృద్ధుడే ఉదహారణ అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. 12000 km Padyatra from Karnataka to KedarnathHindu Dharma is Sanatan because of the Bhakts like him Har Har Mahadev 🔥 pic.twitter.com/bNphehFL8t— Sheetal Chopra 🇮🇳 (@SheetalPronamo) May 15, 2025 (చదవండి: పేరెంట్స్ అలా స్పందిస్తారని ఊహించలేదు..! పట్టరాని ఆనందంలో స్వలింగ జంట) -
వింత డ్యాన్స్తో ట్రంప్కు స్వాగతం.. వీడియో వైరల్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పశ్చిమ దేశాల పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు చేరుకున్నారు. ట్రంప్కు యూఏఈలో ఘన స్వాగతం లభించింది. ఆయనకు అక్కడి సంప్రదాయ నృత్యం అల్ అయ్యాలా (Al-Ayyala)తో స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇదేం డ్యాన్స్ అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.వివరాల ప్రకారం.. అధ్యక్షుడు ట్రంప్ యూఏఈ (UAE) చేరుకున్నాక అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ స్వాగతం పలికారు. అనంతరం, ఇద్దరు నేతలు కలిసి అధ్యక్ష భవనం ఖషర్ అల్-వాటన్కు చేరుకున్నారు. ఈ క్రమంలోనే పలువురు బాలికలు జుట్టు విరబోసుకొని సంప్రదాయ సంగీతానికి అనుగుణంగా తలలు ఊపుతూ ట్రంప్నకు స్వాగతం పలికారు. పక్కనే కొందరు డబ్బులు వాయిస్తుండగా ఇద్దరు నేతలు ముందుకు కదిలారు. వారి డ్యాన్స్ చూసిన ట్రంప్.. ఒక్కసారిగా షాకయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.In a symbolic gesture of respect, the #UAE welcomed Donald Trump with the traditional Al-Ayyala dance — a beautiful display of heritage, unity, and yes, the iconic hair-flippic.twitter.com/rjYe0y0VJu— Jordan Kyle (@_Jordan_Kyle_) May 15, 2025ఇదిలా ఉండగా, యునెస్కో (UNESCO)ప్రకారం.. అల్- అయ్యాలా అనేది యూఏఈ, ఒమన్లలో ప్రసిద్ధి చెందిన సంప్రదాయ నృత్యం. సంప్రదాయ దుస్తులు ధరించిన బాలికలు వారి పొడవాటి జుట్టును విరబోసుకొని.. సంగీతానికి అనుగుణంగా తలలను ఊపుతుంటారు. వేడుకలు, వివాహాల సమయాల్లో అల్- అయ్యాలాను ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు. వయసు, లింగం, సామాజిక బేధం వంటి తేడాలు లేకుండా అందరినీ ఒకచోట చేర్చేదిగా దీన్ని భావిస్తారు. వీరంతా తలలు ఊపుకుంటూ డ్యాన్స్ చేసినట్టుగా ఊగిపోతారు.It is actually a traditional Emirati dance called Al Ayyala or Al Razfa depending on the region. The hair movement by the women symbolizes pride and beauty and is part of a heritage performance that reflects unity and strength. What you saw was not just a show. It was culture. pic.twitter.com/JKcAlXOmGd— Khalid Alkaabi (@alyarwani) May 15, 2025 -
ఆగి ఉన్న రైలు కింద నుంచి దాటే యత్నం
-
పేరెంట్స్ అలా స్పందిస్తారని ఊహించలేదు.!
ఇటీవల కాలంలో కొందరు స్వలింగ వివాహం చేసుకుంటున్నారు. అయితే వాటిని సమాజం, పెద్దలు అంగీకరించకపోవడంతో.. ఎక్కడో విదేశాల్లో జీవనం సాగిస్తున్నారు. కొన్ని దేశాలు ఈ వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తున్నాయి కూడా. కానీ మన దేశంలో ఈ వివాహంపై పలు అభ్యంతరలు ఉన్నాయి. ఈ తరుణంలో ఓ తల్లిదండ్రులు తమ కూతురి స్వలింగ వివాహం గురించి ఏ మాత్రం సంకోచించకుండా సగర్వంగా చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అది చాలా సర్వసాధరణమైన విషయంగానే మాట్లాడారు. ప్రస్తుతం ఇది నెట్టింట హాట్టాపిక్గా మారింది. నెటిజన్లు సైతం ఆశ్యర్యపోతూ..అందరూ ఇలా అంగీకరిస్తే బాగుండని చెబుతుండటం విశేషం.భారత సంతతికి చెందిన క్వీర్ మహిళ తన స్వలింగ వివాహాన్ని తల్లిందండ్రులు అంగీకరించిన విధానాన్ని నెట్టింట షేర్ చేసుకుంది. తన భార్య టీనాతో కెనడాలో నివసిస్తున్న సుభిక్ష సుబ్రమణి ఇన్స్టా వేదికగా ఈ విషయాన్ని షేర్ చేసుకున్నారు. ఓ గృహ ప్రవేశ వేడుకలో తన తల్లిందండ్రుల తమ వివాహాన్ని అంగీకరించిన సంఘటనను వీడియో తీసి మరీ పోస్ట్ చేశారు. ఆ తంతు నిర్వహించేందుకు భారతదేశం నుంచి ఒక హిందూ పూజారి కెనడాకు వచ్చినట్లు ఆ వీడియోలో తెలిపింది సుబ్రమణి. ఆ వేడుకకు సుబ్రమణి తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. పూజకు సంబంధించిన ఆచారాల్లో భాగంగా సుబ్రమణిని కొన్ని ప్రశ్నలు అడిగారు పూజరి. దానికి సుబ్రమణి తల్లిదండ్రులు, సంకోచం లేకుండా.. గర్వంగా మా కుమార్తె టీనాను వివాహం చేసుకుందని చెప్పారు. సుబ్రమణి కూడా ఒక్కసారిగా షాకయ్యారు. ఎందుకంటే తల్లిందండ్రుల స్పందన ఇలా ఉంటుదని ఊహించలేదామె. నిజంగానే ఇలా స్పందిస్తారని అస్సలు ఊహించలేదని, ఇది మర్చిపోలేని అత్యంత మధురమైన క్షణం ?అంటూ సుబ్రమణి సంతోషంగా చెప్పుకొచ్చింది వీడియోలో. అంతేగాదు ఆ వీడియోకి "పూజారి ఇలాంటి ప్రశ్నలు మిమ్మల్ని అడిగితే ఎలా స్పందిస్తారు?" అనే క్యాప్షన్ ఇచ్చి మరీ షేర్ చేశారు సుబ్రమణి. ఇక ఈ వీడియోకి ఏడు లక్షలకు పైగా వ్యూస్, రెండు లక్ష్లలకు పైగా లైక్లు వచ్చాయి.వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి:(చదవండి: జస్ట్ డ్రెస్సింగ్ మాత్రమే కాదు..ట్రెండ్కి తగ్గ ఆభరణాలతో మెరవండిలా..!) -
కదులుతున్న కారుపై కొత్త జంట విన్యాసాలు, వైరల్ వీడియో
సోషల్ మీడియా మోజు అనేక ప్రమాదాలకు దారి తీస్తున్నప్పటికీ సోషల్మీడియాపై క్రేజ్ పోవడం లేదు. కొంతమంది యువతీ యువకులు సోషల్ మీడియా లైక్స్, కమెంట్స్ కోసం ఎంతటికైనా దిగజారడానికి సిద్ధపడిపోతున్నారు. తాజాగా కదులుతున్న కారుపై వధువు,వరుడు డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. దీనిపై కొంతమంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి ఏమైందో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే..జీవితంలో అంత్యం సంతోషకరమైన క్షణాలను పదిలంగా దాచుకోవాల్సిందే. తమసంతోషాన్ని నలుగురితో పంచుకోవడంలో తప్పులేదు. కానీ లేనిపోని, పిచ్చి పిచ్చి సాహసాల వలన స్వయంగా కోరి ప్రమాదాన్ని తెచ్చుకోవడమే కాదు, ఒక్కోసారి సహచరులకు ముప్పుగా పరిణమిస్తుంది. సరదా పేరుతో తెలివితక్కువతో చేసే పనులపై ఇటీవలి కాలంలో చాలా ఆందోళన వ్యక్తమవుతోంది.వివాహ వేడుక తరువాత ఒక నూతన జంట ప్రమాదకరంగా డ్యాన్స్ చేసి వైరల్గా మారారు. ఆ తరువాత చిక్కుల్లో పడ్డారు.చదవండి: 138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్తో In Gwalior, a bride and groom violated traffic rules in order to go viral. A video of the groom doing stunts with a sword on the car and the bride dancing on the bonnet is becoming increasingly viral on social media#MadhyaPradesh #MetGala #MetGala2025 #MetGala2025xFREEN #Stunt pic.twitter.com/JrBfc58JTB— TodaysVoice ImranSayyed (@todaysvoice24nz) May 6, 2025గ్వాలియర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. వరుడు గర్వంగా కారు పైకప్పుపై నృత్యం చేశాడు. అక్కడితో ఆగలేదు.. కత్తిని గాలిలో తిప్పుతూ దర్పాన్ని ప్రదర్శించాడు. ఇక నేనేం తక్కువ అన్నట్టు, పెళ్లిదుస్తుల్లోనే వధువు కూడా బోనెట్ మీద కూర్చుని స్టెప్పులేయడం మొదలు పెట్టింది. సల్మాన్ ఖాన్ నటించిన నో ఎంట్రీ బాలీవుడ్ చిత్రంలోని ‘ఇష్క్ కి గలి విచ్ నో ఎంట్రీ’ పాటకుఉత్సాహంగా గెంతులేశారు. కొత్త రైల్ ఓవర్ బ్రిడ్జి సమీపంలో రద్దీగా ఉండే రోడ్డుపై జరిగిన ఉదందాన్ని చూసి నెటిజన్లు దిగ్భ్రాంతికి లోనయ్యారు. కామన్ సెన్స్ లేదంటూ తిట్టిపోస్తున్నారు. ఈ షాకింగ్ వీడియో సోషల్మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. గ్వాలియర్ ట్రాఫిక్ పోలీసులు కారును ట్రాక్ చేసి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు చలానా జారీ చేశారు. గోలా కా మందిర్ ట్రాఫిక్ స్టేషన్కు చెందిన సుబేదార్ అభిషేక్ రఘువంశీ దీన్ని ధృవీకరించారు. దంపతులకు, ఇతర ప్రయాణికులకు ప్రమాదం ఉందని , విచారణ అనంతరం మరిన్ని జరిమానాలు విధించే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు.ఇదీ చదవండి: రూ. 2 లక్షలతో మొదలై రూ. 8,500 కోట్లకు, ఎవరీ ధీర -
వామ్మో..! రైలు 40 నిమిషాలు ఆలస్యమైతే ఇంతలానా..!
హైదరాబాద్ ముంబై వంటి మెట్రో నగరాల్లో ప్రజలు రాకపోకలకు లోకల్ రైళ్లపైనే ఆధారపడుతుంటారు. అది కామన్. అయితే ముంబై నగరంలోనో ఓ లేడీస్ స్పెషల్ ట్రైన్ కొద్ది నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకు ఏ రేంజ్లో రద్దీగా ఉందో చూస్తే షాకవ్వుతారు. అది కూడా అమ్మాయిలే ఫుట్బోర్డుపై వేళ్లాడుతూ వెళ్తున్న విధానం చూస్తే నోటమాట రాదు. మరి అదెక్కడ జరిగిందో చదివేయండి మరీ..ముంబై మహానగరం అంతటా లక్షలాదిమంది ప్రయాణికులు ఈ లోకల్ రైళ్లపై ఆధారపడతారు. ఈ స్థానిక రైళ్లే ముంబైలోని వివిధ శివారు ప్రాంతాలను అనుసంధానించడంతో.. అక్కడ నివాసితులకు ఈజీగా రాకపోకలు సాగించడంలో కీలక పాత్రపోషించేది అవే. ఐతే అలాంటి ఓ రైలు మహిళతో ఫుల్ అయ్యి ఉన్నవీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది. అదికూడా మహిళలే ఫుట్బోర్డుపై వేలాడుతూ ప్రయాణించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటన ముంబై కళ్యాణ్ లేడీస్ స్పెషల్ లోకల్ రైలులో చోటుచేసుకుంది. అయితే ఆ రైలు 40 నిమిషాలు ఆలస్యంగా రావడంతో ఇంతలా హౌస్ఫుల్ అయ్యినట్లు సమాచారం. ఏకంగా మహిళలు కూడా ఏ మాత్రం భయపడకుండా ఫుట్బోర్డుపై ప్రయాణించడమే అత్యంత షాకింగ్ గురిచేసే విషయం. అందుకు సంబంధించిన వీడియోని ముంబౌ రైల్వే యూజర్స్ ఎక్స్ అకౌంట్ షేర్ చేసింది. అయితే నెటిజన్లు ఈ అసురక్షితమైన జర్నీలకంటే మరొక రైలు కోసం ఎదురుచూడటం మంచిదని పోస్ట్ చేయగా, మరికొందరు ఇలాంటి ప్రమాదకరమైన జర్నీలు తమ కుటుంబాలకు శాశ్వతాన్ని బాధను మిగులుస్తాయని హెచ్చరిస్తూ పోస్టులు పెట్టారు.#ViralVideo #CRFixLocalTrainDelays Today’s Ladies Special from Kalyan was delayed by 40 mins, forcing women to hang on the footboard—an unsafe and risky commute. Railways term this dangerous, yet delays continue. @AshwiniVaishnaw pls review delay data. @MumRail @rajtoday pic.twitter.com/vnhxTIyFD6— Mumbai Railway Users (@mumbairailusers) May 9, 2025 (చదవండి: ఆ హగ్ గుర్తొచ్చినప్పుడల్లా.. మనసు చివుక్కుమంటోంది! హృదయాన్ని కదిలించే పోస్ట్) -
భారత్ చేసింది న్యాయం..! పాక్ వ్యక్తి ప్రశంసల జల్లు
పహల్గాం ఘటనకు ప్రతిగా భారత్ బుధవారం ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్లోని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసిన సంగతి తెలిసింది. దీనిపై యావత్ దేశం హర్షం వ్యక్తం చేసింది. అయితే ఈ నేపథ్యంలో భారత్-పాక్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పూర్తిస్థాయిలో ఇరు దేశాలు యుద్ధం దిశగా కదులుతున్నాయి. ఈ తరుణంలో నెట్టింట ఒక పాక్ వ్యక్తి భారత్ చేసింది న్యాయమే అంటూ పోస్ట్ చేసిన వైరల్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అందులోనూ ఇలాంటి సమయంలో శత్రు దేశానికి చెందిన వ్యక్తే ఇలా మాట్లాడటం నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ఆ వీడియోలో దుబాయ్కి చెందిన ఫారెక్స్ వ్యాపారి అభయ్ భారత్ సిందూర్ ఆపరేషన్తో పాక్పై చేసిన దాడిని సరైదని, అది న్యాయం అని మాట్లాడారు. అంతేగాదు భారత ప్రభుత్వం చర్యను, భారత సాయుధ దళాల ప్రతిస్పందనను మెచ్చకున్నాడు. ఇప్పుడు పాక్ వరకు వచ్చేటప్పటికీ తామూ బాధితులమే అని డ్రామా ప్లే చేస్తోందని ఆరోపించాడు. పహల్గాం పర్యటనకు వచ్చిన 26 మంది అమాయకులను పొట్టనపెట్టుకున్నప్పుడూ ఏమైంది ఇదంతా అని నిలదీశాడు. ఇప్పుడు అకస్మాత్తుగా శాంతి, మానవహక్కులు అంటూ నీతి కబర్లు చెప్పడమే గాక పాక్ కూడా ఉగ్రవాద బాధిత దేశమే అని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది అని తిట్టిపోశాడు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా స్పందించే హక్కు భారత్కి పూర్తిగా ఉందన్నారు. అలాగే భారత్ చేసింది న్యాయమే అని ప్రశంసించాడు. అసలు ఉగ్రవాదాన్ని పెంచి పోషించినప్పుడూ తెలియలేదా పాక్కి ఇది ఎప్పటికైనా నష్టమే అని అంటూ ఫైర్ అయ్యాడు. ప్రజలు మరణించగానే శాంతి అనడం కాదు..భారత్ మొదటి నుంచి సంయమనం పాటిస్తూ..శాంతికి పీటవేస్తూ వచ్చిందనేది గుర్తులేదా అని మండిపడ్డారు. అంతేగాదు భారత్ చేసింది యుద్ధ చర్య కాదు..కేవలం అది న్యాయం.. అనినొక్కి చెప్పాడు అభయ్ వీడియోలో. పైగా ఆ వీడియోకి ఒక పాకిస్తానీ హిందువుగా నా అభిప్రాయం అనే క్యాప్షన్ కూడా ఇచ్చాడు. దీనిపై నెటిజన్లు సదరు పాక్ వ్యక్తిని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Abhay (@abhayy_s)source: Live Mint english website ఆధారంగా..(చదవండి: '54 ఏళ్ల నాటి యుద్ధ ప్రసంగం'..! ఇప్పటికీ హృదయాన్ని తాకేలా..) -
నిండుగర్భిణి జోష్ఫుల్ స్టెప్పులు..చూస్తే షాకవ్వడం ఖాయం!
ప్రెగ్నెంట్తో ఉన్న మహిళలు ఎంత జాగ్రత్తగా ఉంటారో తెలిసిందే. నడవడం కూడా చీమచిటుక్కు మనకుండా సుతారంగా నడుస్తారు. కొందరు కొద్దిపాటి శారీరక శ్రమ మంచిదని నిపుణుల పర్యవేక్షణలో వ్యాయామాలు కూడా చేస్తుంటారు. అంతేతప్ప మైకేల్ జాక్సన్ మాదిరిగా బాడీ అంతా స్ప్రింగ్లు ఉన్నట్లుగా డ్యాన్స్లు చేసే డేరింగ్ మాత్రం చేయరు. కానీ ఇక్కడొక మహిళ నిండు గర్భంతో ఏ రేంజ్లో ఉత్సాహంగా డ్యాన్స్ చేసిందో చూస్తే.. కళ్లు ఆర్పడమే మర్చిపోతారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో సునిధి చౌహాన్ అనే నిండు గర్భిణి బాలీవుడ్ ఫేమస్ సాంగ్ 'డింగ్ డాంగ్ డోల్'కి ఉత్సాహభరితంగా డ్యాన్స్ చేస్తుంది. తన కొరియోగ్రాఫర్ సాయంతో డ్యాన్స్ చేస్తూ కనిపిస్తోంది వీడియోలో. చూడటానికి ఆమె తొమ్మిదోనెల గర్భంతో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఆమె మాత్రం ఎంతో జోష్గా తన కొరియోగ్రాఫర్ని బీట్చేసేలా నృత్యం చేసింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. కొందరు మాతృత్వానికి ఉత్సాహభరితమైన నివాళిగా అభివర్ణించారు. మరికొందరు ఈ సమయంలో ఇలాంటి అవసరమా..? అని తిట్టిపోస్తూ పోస్టులు పెట్టారు. అయితే ఒక డాక్టర్ ఆ పోస్టులకు స్పందిస్తూ..ఆలోచనాత్మక వివరణను అందించారు. గర్భంతో ఉన్నప్పుడూ మహిళలు డ్యాన్స్లు చేయొచ్చా..? అంటే..అవుననే అంటానని చెప్పారు. ప్రెగ్నెన్సీలో ఎలాంటి కాంప్లికేషన్స్ లేకపోతే నిర్భయంగా ఎలాంటి ఉత్సాహభరితమైన యాక్టివిటీల్లో అయినా పాల్గొనవచ్చు అని అన్నారు. అంతేగాదు శారీరక శ్రమ అనేది గర్భస్రావం, తక్కువ బరువుతో జననం లేదా ముందస్తు ప్రసవ ప్రమాదం వంటివి పెంచవని తేల్చి చెప్పారు. ఆయా మహిళల ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా వైద్యులు జాగ్రత్తలు చెబుతారే తప్ప, అందరికీ వర్తించవు అని పోస్టులో రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Artist_Dance_Community (@artist_dance_community_) (చదవండి: World Thalassaemia Day: శెభాష్ సమర్థ్ లాంబా ..! వయసుకి మించిన సేవతో ..) -
SRH Vs DC: ‘హే.. వెళ్లు.. వెళ్లు.. నువ్వు అవుట్’!.. కావ్యా మారన్ రియాక్షన్ వైరల్
చాలా రోజుల తర్వాత సొంతగడ్డపై మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ సత్తా చాటింది. ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ (SRH vs DC)తో సోమవారం నాటి మ్యాచ్లో రైజర్స్ బౌలర్లు అదరగొట్టారు. ముఖ్యంగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) పవర్ ప్లేలో అద్భుతమే చేశాడు.ఐపీఎల్ చరిత్రలోనేఉప్పల్ వేదికగా సాగిన ఈ మ్యాచ్లో ప్రమాదకర ఓపెనర్లు కరుణ్ నాయర్ (0), ఫాఫ్ డుప్లెసిస్ (3)లతో పాటు.. వన్డౌన్ బ్యాటర్ అభిషేక్ పోరెల్ (8)ను కూడా వచ్చీరాగానే పెవిలియన్కు పంపాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలోనే పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన కెప్టెన్గా కమిన్స్ నిలిచాడు.Wickets ✅Catch ✅Captaincy ✅Pat Cummins is producing a perfect performance for #SRH in an important clash against #DC 🔥Updates ▶ https://t.co/1MkIwk4VNE#TATAIPL | #SRHvDC | @SunRisers | @patcummins30 pic.twitter.com/SbACH0yVcJ— IndianPremierLeague (@IPL) May 5, 2025 స్టబ్స్ దంచేశాడుఇక మిగతా వాళ్లలో స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (10) వికెట్ను జయదేవ్ ఉనాద్కట్ దక్కించుకోగా.. కెప్టెన్ అక్షర్ పటేల్ (6) హర్షల్ పటేల్ బౌలింగ్లో కమిన్స్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.ఈ క్రమంలో ట్రిస్టన్ స్టబ్స్ (36 బంతుల్లో 41) జట్టును ఆదుకునే ప్రయత్నం చేయగా.. విప్రాజ్ నిగమ్ అతడికి సహకరించాడు. అయితే, ఢిల్లీ ఇన్నింగ్స్ 13వ ఓవర్లో బంతితో రంగంలోకి దిగిన రైజర్స్ స్పిన్నర్ జీషన్ అన్సారీ సంధించిన బంతిని ఆడిన స్టబ్స్.. విప్రాజ్తో కలిసి సింగిల్ పూర్తి చేశాడు.అయితే, మరో పరుగుకు కూడా ఆస్కారం ఉందని భావించి అందుకు ఉపక్రమించగా... విప్రాజ్ మాత్రం బ్యాటర్ ఎండ్లోనే ఉండిపోయాడు. ఇంతలో స్టబ్స్ అతడి వైపుగా పరుగు తీయగా.. బంతిని అందుకున్న ఫీల్డర్ అనికేత్ వర్మ జీషన్ వైపు విసిరాడు.హే.. వెళ్లు.. వెళ్లు.. నువ్వు అవుట్దీంతో వేగంగా స్పందించిన జీషన్ బౌలర్ ఎండ్ నుంచి వికెట్లను గిరాటేశాడు. అప్పటికి స్టబ్స్ బ్యాటర్ ఎండ్ వైపు వెళ్లగా.. విప్రాజ్ మాత్రం మరో ఎండ్కు చేరలేకపోయాడు. ఈ క్రమంలో ఎవరు పరుగు పూర్తి చేశారని థర్డ్ అంపైర్ పరిశీలించగా స్టబ్స్ విప్రాజ్ను దాటినట్లు తేలింది. దీంతో విప్రాజ్ మూల్యం చెల్లించకతప్పలేదు. 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్గా అతడు వెనుదిరిగాడు.ఈ సందర్భంగా సన్రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్యా మారన్ ఇచ్చిన రియాక్షన్ వైరల్గా మారింది. విప్రాజ్ రనౌట్ కాగానే.. లేచి నిలబడిన ఆమె.. ‘‘హే.. వెళ్లు.. వెళ్లు.. నువ్వు అవుట్’’ అన్నట్లుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. అంతేకాదు చప్పట్లతో తమ ఆటగాళ్లను అభినందించారు.Stubbs செஞ்ச Mistake-க்கு Vipraj Wicket போய்டுச்சு😫 📺 தொடர்ந்து காணுங்கள் | Tata IPL 2025 | SRH vs DC | JioHotstar & Star Sports தமிழில் #IPLOnJioStar #IPL2025 #TATAIPL #SRHvDC pic.twitter.com/YUmHK0745k— Star Sports Tamil (@StarSportsTamil) May 5, 2025ఆశలు ఆవిరికానీ ఢిల్లీని నిర్ణీత 20 ఓవర్లలో 133 పరుగులకే పరిమితం చేశామన్న సన్రైజర్స్ ఆనందాన్ని వర్షం ఆవిరి చేసింది. ఢిల్లీ ఇన్నింగ్స్ ముగియగానే మొదలైన వాన.. ఉధృతం కావడంతో రైజర్స్ బ్యాటింగ్ మొదలుపెట్టకుండానే మ్యాచ్ రద్దైపోయింది. దీంతో ఇరుజట్లకు చెరో పాయింట్ రాగా.. సన్రైజర్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది.ఈ మ్యాచ్లో గెలిచి ఉంటే.. కమిన్స్ బృందానికి ఇంకా ఆశలు సజీవంగా ఉండేవి. ఇక ఈ మ్యాచ్లో స్టబ్స్ (41 నాటౌట్)తో పాటు అశుతోష్ శర్మ (26 బంతుల్లో 41) రాణించడంతో ఢిల్లీ ఏడు వికెట్ల నష్టానికి ఈ మాత్రం స్కోరు చేయగలిగింది. రైజర్స్ బౌలర్లలో కమిన్స్ మూడు, జయదేవ్ ఉనాద్కట్, హర్షల్ పటేల్, ఇషాన్ మలింగ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.చదవండి: IPL 2025 Playoffs Scenarios: లెక్క తేల్చిన వరుణుడు!.. సన్రైజర్స్ అవుట్.. మరి ఢిల్లీ రేసులోనే ఉందా? -
ఎవరీ బీజేపీ లీడర్?..భద్రతా దళాలతో మంచులో రన్నింగ్! వీడియో వైరల్
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న వేళ.. ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బీజేపీకి చెందిన సీనియర్ నాయకుడు భద్రతా సిబ్బందితో మంచులో పరుగెడుతూ దాని వెనుక బ్యాక్ గ్రౌండ్లో ఓ బాలీవుడ్ సాంగ్ ప్లే అవుతున్న వీడియో ఇప్పుడు విశేషంగా వార్తల్లో నిలిచింది.ఎవరీ బీజేపీ లీడర్?రవీందర్ రైనా.. బీజేపీలో సీనియర్ నాయకుడు. జమ్మూ కశ్మీర్ బీజేపీ మాజీ చీఫ్, మాజీ ఎమ్మెల్యే ఈయన. అయితే ఎప్పుడు వార్తల్లో పెద్దగా కనిపించని రవీందర్ రైనా.. ఒక్కసారిగా హాట్ టాపిక్ గా నిలిచారు. ఒక బృదం భద్రతా బలగాల్ని వెంట బెట్టుకుని ఆయన కూడా మంచులో పరుగెడుతూ కనిపించారు. దీనికి సంబంధించిన షార్ట్ వీడియోను ఆదివారం సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ఇప్పుడు అది వైరల్ గా మారింది.#JaiHind 🇮🇳🔥🔥🔥 pic.twitter.com/vH4XYKkrpI— Ravinder Raina (@RavinderRaina) May 4, 2025 మండిపడ్డ కాంగ్రెస్దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. భద్రతా బలగాల్ని ఈ తరహాలో ఉపయోగించుకుంటారా అంటూ మండిపడింది. ఈ వీడియోపై సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా ష్రినాతే ధ్వజమెత్తారు. పహల్గామ్ దాడి తర్వాత దేశం అంతా తీవ్ర శోకంలో ఉంటే ఇలా చేయడం సమంజసం కాదంటూ విమర్శించారు. పహల్గామ్ ఉగ్రదాడిలో కొంతమంది తన కుమారుల్ని కోల్పోగా, మరికొంతమంది తల్లిదండ్రుల్ని, పలువురు భర్తల్ని కోల్పోయారు. మరి ఈయన అయితే మంచి రిథమ్ లో ఉన్నారు. రీల్స్ షూటింగ్ చేసుకుంటున్నారు. భద్రతా సిబ్బందిని దుర్వినియోగం చేస్తున్నారు. ఇది నిజంగా సిగ్గు పడాల్సిన చర్య’ అంటూ మండి పడ్డారు. -
ఇదేం ఆట?.. గుడ్లు ఉరిమి చూసిన రియాన్.. ఒక్క చూపుతోనే..
కోల్కతా నైట్ రైడర్స్ (KKR vs RR)తో మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ (Riyan Parag) అద్భుత ఇన్నింగ్స్ ఆడినా వృథాగానే పోయింది. 71 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన వేళ ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఊహించని రీతిలో కమ్బ్యాక్ ఇచ్చాడు.45 బంతుల్లో 95 పరుగులుఇరవై ఏడు బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రియాన్ పరాగ్.. ఆ తర్వాత ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాది స్కోరు బోర్డును దౌడు తీయించాడు. కేకేఆర్ స్పిన్నర్ మొయిన్ అలీ బౌలింగ్ (13వ ఓవర్)లో వరుస సిక్స్లతో అలరించి వహ్వా అనిపించాడు. అయితే, దురదృష్టవశాత్తూ సెంచరీకి 95 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. 45 బంతుల్లో 95 పరుగులు చేసి నిష్క్రమించాడు.అయితే, ఈ మ్యాచ్లో రాజస్తాన్ బ్యాటర్లు పెవిలియన్కు వరుస కట్టడంతో రియాన్ పరాగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ముఖ్యంగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో ఐదు, ఆరో నంబర్ బ్యాటర్లు ధ్రువ్ జురెల్, వనిందు హసరంగ డకౌట్ కావడం పట్ల రియాన్ ఆగ్రహానికి లోనయ్యాడు.రాజస్తాన్ ఇన్నింగ్స్లో ఎనిమిదో ఓవర్ తొలి బంతికి వరుణ్ చక్రవర్తి ధ్రువ్ జురెల్ (0)ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత మరో రెండు బంతులకు అదే రీతిలో వనిందు హసరంగ (0)ను కూడా బౌల్డ్ చేసి పెవిలియన్కు పంపాడు.చూపుతోనే చంపేసేలాఇక హసరంగ అవుట్ కావడాన్ని రియాన్ పరాగ్ సహించలేకపోయాడు. సహచర ఆటగాడిని ఒ క్క చూపుతోనే బెంబెలెత్తేలా ఓ రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. దీంతో కొంత మంది రియాన్ ఆగ్రహంలో అర్థం ఉందని అంటుంటే.. మరికొందరు మాత్రం కెప్టెన్గా ఉండటం మామూలు విషయం కాదని అతడికి ఇప్పుడే తెలిసి వస్తోందని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన రాజస్తాన్ రాయల్స్ ఆదివారం కోల్కతాతో తలపడింది. ఈడెన్ గార్డెన్స్లో టాస్ గెలిచిన కేకేఆర్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 206 పరుగులు సాధించింది.ఒక్క పరుగు తేడాతో ఓడిభారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ ఆరంభంలోనే వరుసగా వికెట్లు కోల్పోయినా.. రియాన్ తన ఇన్నింగ్స్తో మ్యాచ్ను మలుపుతిప్పాడు. ఆఖరి బంతి వరకు రాజస్తాన్ పోరాడిందంటే అందుకు కారణం కెప్టెన్. అయితే, రియాన్ అవుటైన తర్వాత పరిస్థితి మారిపోయింది. చివరి బంతికి మూడు పరుగులు అవసరమైన వేళ.. శుభమ్తో కలిసి పరుగు పూర్తి చేసిన జోఫ్రా ఆర్చర్ రనౌట్ అయ్యాడు. దీంతో రాజస్తాన్ ఓటమి ఖరారైంది. కేకేఆర్ చేతిలో ఒక్క పరుగు తేడాతో ఓడి.. ఈ సీజన్లో పన్నెండింట తొమ్మిదో పరాజయం నమోదు చేసింది.రాజస్తాన్ బ్యాటర్లలో రియాన్ కెప్టెన్ ఇన్నింగ్స్తో మెరవగా.. యశస్వి జైస్వాల్ (34), షిమ్రన్ హెట్మెయిర్ (29), శుభమ్ దూబే (14 బంతుల్లో 25) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. మిగతా వాళ్లలో వైభవ్ సూర్యవంశీ(4) పూర్తిగా విఫలం కాగా.. కునాల్ సింగ్ రాథోడ్, ధ్రువ్ జురెల్, హసరంగ డకౌట్లుగా వెనుదిరిగారు. ఆర్చర్ ఆఖర్లో 12 పరుగులు చేశాడు.చదవండి: వైభవ్ సూర్యవంశీలా సెంచరీ చేయనక్కర్లేదు!.. ఆయుశ్కు ధోని చెప్పిందిదే!Through the gate ✖ 2️⃣ \|/Varun Chakaravarthy is weaving his magic in Kolkata! 👏Updates ▶ https://t.co/wg00ni9CQE#TATAIPL | #KKRvRR | @chakaravarthy29 | @KKRiders pic.twitter.com/vHcMTObTrL— IndianPremierLeague (@IPL) May 4, 2025 -
కేఎల్ రాహుల్ను కలిసిన బీఆఎర్ఎస్ ఎమ్మెల్యే.. కుమార్తెకు ఓ ‘గిఫ్ట్’!
ఐపీఎల్-2025 (IPL 2025)లో సన్రైజర్స్ హైదరాబాద్ చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ (SRH vs DC)తో తలపడనుంది. సొంత మైదానం ఉప్పల్లో అక్షర్ సేనను కమిన్స్ బృందం ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే సాంకేతికంగా రైజర్స్కు ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి.ఒకవేళ సోమవారం నాటి మ్యాచ్లో గనుక ఢిల్లీ చేతిలో ఓడితే.. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ తర్వాత ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించిన మూడో జట్టుగా సన్రైజర్స్ నిలుస్తుంది. ఈ క్రమంలో కీలక పోరు కోసం కమిన్స్ బృందం నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తోంది.కేఎల్ రాహుల్ను కలిసిన బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేమరోవైపు.. ఢిల్లీ జట్టు కూడా ఇప్పటికే హైదరాబాద్ చేరుకుని సన్రైజర్స్తో మ్యాచ్కు అన్ని విధాలా సన్నద్ధమైంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. ఢిల్లీ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ను కలిశారు.ఈ సందర్భంగా తన కుమార్తె శ్రీనికను కూడా కౌశిక్ రెడ్డి వెంట తీసుకువెళ్లారు. ఇక రాహుల్ కూడా ప్రేమ పూర్వకంగా నవ్వుతూ వీరిని పలకరించాడు. అదే విధంగా.. శ్రీనిక తీసుకువచ్చిన టీ-షర్టుపై తన ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చాడు. అంతేకాదు ముగ్గురు కలిసి సెల్ఫీ తీసుకున్నారు. అనంతరం ఫొటోలు కూడా దిగారు.ఇందుకు సంబంధించిన వీడియోను పాడి కౌశిక్ రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. కాగా ఇంతకు ముందు.. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్.. అదే జట్టుకు ఆడుతున్న హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ను కూడా కౌశిక్ రెడ్డి కలిశారు.కాగా కౌశిక్ రెడ్డి కూడా క్రికెటర్ అన్న విషయం తెలిసిందే. దేశీ క్రికెట్లో ఆయన హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. ప్రస్తుతం హుజురాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు.అదరగొడుతున్న రాహుల్ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025 సీజన్లో కేఎల్ రాహుల్ అదరగొడుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఇప్పటికి తొమ్మిది మ్యాచ్లలో కలిపి 371 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 93 నాటౌట్. ఇక ఢిల్లీ జట్టు పది మ్యాచ్లు పూర్తి చేసుకుని ఆరింట గెలిచి పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. కాగా తన భార్య అతియా శెట్టి తమ తొలి సంతానం ఇవారాకు జన్మనిచ్చిన నేపథ్యంలో రాహుల్ సీజన్లో తొలి మ్యాచ్కు దూరమయ్యాడు.చదవండి: IPL 2025: ఈ పంత్ మనకొద్దు, పీకి పడేయండి సార్..! Had a great time with KL Rahul. I absolutely loved his outfit colour...PINK PERFECT 🩷@KLRAHUL@Kaushik @Shrinika@Cricket@PinkVibes pic.twitter.com/NI6Faiq5dD— Padi Kaushik Reddy (@KaushikReddyBRS) May 5, 2025 -
ఎంత పనిచేశావ్ నాన్న..! హార్ట్ టచింగ్ వీడియో..
మన టాలెంట్ మన కన్నవాళ్లకి తెలిసినట్టుగా మరెవరకి తెలియదు. మనల్ని మనం నమ్మకపోయినా..మన తల్లిదండ్రులకు మాత్రం అపార నమ్మకం ఉంటుంది. బహుశా ఆ ప్రేమే పిల్లల్ని ప్రయోజకులుగా మారుస్తుందేమో ..!. ఇప్పుడిదంతా ఎందుకంటే..ఇక్కడొక తండ్రి తన కొడుకు టాలెంట్ని చూసి సంబరపడటమే కాదు సీక్రెట్గా రికార్డు చేశాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మనసుని టచ్ చేసే ఈ ఘటన ఎవ్వరినైనా కదిలిస్తుంది. ఆ వీడియోలో ఓ బాలుడు మంచం మీద కూర్చొని హాయిగా పాట పాడుతున్నట్లు కనిపిస్తుంది. ఓ పక్కన బ్యాగులో పుస్తకాలు సద్దుతూ..పంజాబీ ఫేమస్ పాట “దో గల్లన్” పాడుతున్నట్లు కనపడుతుంది వీడియోలో. అతడు ఆ పాటని మైమరిచిపోయి పాడుతున్నాడు. పైగా లయబద్ధంగా అందంగా ఆలపించాడు. దాన్ని మొత్తం అతడి తండ్రి తన కుమారుడికి తెలియకుండా రహస్యంగా రికార్డు చేస్తూ. చివర్లో అది చూసి కొడుకు స్టన్ అయిపోతాడు. కాసేపటికి తేరుకుని ఏంటి నాన్న అంటూ మాట్లాడటంతో ముగిసిపోతుంది ఆ వీడియో. ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకర్షించింది. పిల్లల అభిరుచిని తల్లిదండ్రులు గుర్తించి..ప్రోత్సహించే పద్ధతి ఇదే అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. ఏ చిన్నారులకైనా తమలోని టాలెంట్కి మొదటి విమర్శకులు తల్లిదండ్రులే..వారు స్పందించే తీరే ఆ రంగంలో పిల్లలు ఎదగడానికి, విజయం సాధించడానికి కారణమవుతుంది కదూ..!. View this post on Instagram A post shared by 🤍☘️ (@_bhangraempire_) (చదవండి: రెండు వేల ఏళ్ల నాటి గ్రామం..! ఒకప్పుడూ నంది వడ్డెమాన్గా..) -
అంపైర్తో గొడవపడి.. అభిషేక్ను కాలితో తన్ని!.. ఎందుకిలా చేశాడు?
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) ప్రవర్తన విమర్శలకు దారితీసింది. సారథిగా సంయమనంతో వ్యవహరించాల్సిన ఆటగాడే ఇలా సహనం కోల్పోవడం సరికాదంటూ క్రికెట్ ప్రేమికులు అతడిని విమర్శిస్తున్నారు. గిల్ నుంచి ఇలాంటివి అస్సలు ఊహించలేదని.. స్నేహపూర్వకంగా చేసే పనులకు కూడా ఓ హద్దు ఉంటుందని సోషల్ మీడియా వేదికగా హితవు పలుకుతున్నారు.అసలు విషయమేమిటంటే.. ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా గుజరాత్ టైటాన్స్ అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు (GT vs SRH)తో తలపడింది. సొంత మైదానం నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ ఓడిన టైటాన్స్ తొలుత బ్యాటింగ్ చేసింది.సాయి, గిల్ మెరుపు ఇన్నింగ్స్ఓపెనర్లు సాయి సుదర్శన్ (23 బంతుల్లో 48), శుబ్మన్ గిల్ (38 బంతుల్లో 76) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. వన్డౌన్ బ్యాటర్ జోస్ బట్లర్ (37 బంతుల్లో 64) కూడా అదరగొట్టాడు. వీరికి తోడు వాషింగ్టన్ సుందర్ (16 బంతుల్లో 21) కూడా రాణించాడు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో టైటాన్స్ ఆరు వికెట్లు నష్టపోయి ఏకంగా 224 పరుగులు చేసింది. అయితే, గిల్ రనౌట్ అయిన తీరు విమర్శలకు దారితీయగా.. అతడు మైదానాన్ని వీడే ముందు అంపైర్తో వాదించాడు.38 పరుగుల తేడాతో ఇదిలా ఉంటే.. లక్ష్య ఛేదనలో తడబడ్డ సన్రైజర్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి కేవలం 186 పరుగులే చేసింది. తద్వారా 38 పరుగుల తేడాతో ఓటమి పాలై ప్లే ఆఫ్స్ ఆశలను దాదాపు వదిలేసుకుంది.ఇక రైజర్స్ ఇన్నింగ్స్లో ఓపెనర్ అభిషేక్ శర్మ ఒక్కడే మెరుగ్గా ఆడాడు. మొత్తంగా 41 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 74 పరుగులు సాధించాడు. అయితే, పద్నాలుగో ఓవర్లో టైటాన్స్ పేసర్ ప్రసిద్ కృష్ణ వేసిన యార్కర్ను ఆడే క్రమంలో అభిషేక్ విఫలమయ్యాడు.అంపైర్తో గొడవపడి.. అభిషేక్ను కాలితో తన్ని!అయితే, బంతి దిశను మార్చుకుని అతడి ప్యాడ్ను తాకినట్లు కనిపించింది. కానీ ఫీల్డ్ అంపైర్ మాత్రం స్పందించకపోవడంతో.. టైటాన్స్ రివ్యూకు వెళ్లింది. అందులో బంతి వికెట్లను హిట్ చేసినట్లుగా కనిపించినప్పటికీ.. అంపైర్స్ కాల్ ద్వారా అభిషేక్ నాటౌట్గా నిలిచాడు.దీంతో సహనం కోల్పోయిన శుబ్మన్ గిల్ ఫీల్డ్ అంపైర్తో వాదనకు దిగాడు. కోపంతో అతడి పైపైకి వస్తూ వాగ్వాదం పెట్టుకున్నాడు. ఇంతలో అభిషేక్ శర్మ జోక్యం చేసుకుని గిల్ను కూల్ చేసేందుకు ప్రయత్నించాడు.అయితే, అప్పటికి అభిషేక్ క్రీజులో ఉండి చాలా సేపు కావడంతో బహుశా కండరాలు పట్టేయడంతో.. ఫిజియోను పిలిపించుకుని ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో అభిషేక్ కింద కూర్చుని ఉండగా.. గిల్ వెనక్కి వచ్చి అతడి కాలిని తన్నాడు. సమయం వృథా చేస్తున్నాడన్న కారణంతో ఇలా చేసి ఉంటాడు.PC: BCCI/JioHotstarయాంగ్రీ యంగ్ మ్యాన్.. సరదాగా చేసినా..కాగా గిల్- అభిషేక్.. ఇద్దరూ దేశవాళీ క్రికెట్లో పంజాబ్ జట్టుకు ఆడతారన్న విషయం తెలిసిందే. ఈ ఓపెనింగ్ జోడీ మధ్య గాఢమైన స్నేహం ఉంది. అయితే, ఈ మ్యాచ్లో మాత్రం అభిషేక్ గిల్ను సముదాయించేందుకు ప్రయత్నిస్తే.. అతడు మాత్రం ఇలా కాలితో తన్నడం గమనార్హం.అభిషేక్తో తనకున్న చనువుతో సరదాగానే గిల్ ఈ పని చేసినా.. లైవ్లో ఇలాంటి చర్యలు ఎంతమాత్రం సరికాదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా రైజర్స్పై గెలుపుతో ఈ సీజన్లో టైటాన్స్ ఏడో విజయం నమోదు చేయగా.. కమిన్స్ సేనకు ఇది ఏడో ఓటమి.చదవండి: IPL 2025: శుబ్మన్ గిల్ది ఔటా? నాటౌటా? Chaos at the centre! 😳#ShubmanGill and #AbhishekSharma in discussion with the umpires!A review going #SRH’s way has sparked some serious drama! 🧐Watch the LIVE action ➡ https://t.co/RucOdyBo4H#IPLonJioStar 👉 #GTvSRH | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, &… pic.twitter.com/KX68eec2ZB— Star Sports (@StarSportsIndia) May 2, 2025 -
హల్దీ వేడుకలో వధువు చేసిన పనికి దెబ్బకి అందరూ షాక్!
పెళ్లి అంటే ఆ సందడే వేరుంటుంది. నిశ్చితార్థం దగ్గర్నుంచి, పసుపుకొట్టడం, పెళ్లి కూతుర్ని చేయడం, హల్దీ, సంగీత్, బారాత్ ఇలా ప్రతీదీ చాలా ఘనంగా ఉండాలని ప్లాన్ చేసుకుంటారు. ఆకాశమంత పందిరి, భూదేవి అంత పీట అన్నట్టు సాగుతుంది ఈ సందడి. అలాగే బంధువులు, సన్నిహితులు, వధూవరుల ఫ్రెండ్స్ చేసే అల్లరి, అనుకోని సర్ప్రైజ్లు, సరదా సరదా సంఘటనలు చాలా కామన్. కానీ స్వయంగా పెళ్లి కూతురే అక్కడున్న వారందరికీ షాకిస్తే... పదండి అదేంటో చూద్దాం.న్యూఢిల్లీకి చెందిన ఓ జంట పెళ్లి వేడుకల్లో భాగంగా జరిగిన హల్దీ వేడుక (haldi ceremony) నెట్టింట సందడిగా మారింది. వధువు చేసిన సర్ప్రైజ్ అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా విపరీతంగా వైరల్ అవుతోంది. అక్కడంతా పెళ్ళికి వచ్చిన అతిథులతో అంతా హడావిడిగా ఉంది. హల్దీ వేడుకలో అందరూ పెళ్లికూతురి రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలోనూ ఉన్నట్టుండి డైనోసార్ ఎంట్రీ ఇవ్వడంతో అతిథులంతా షాక్ అయ్యారు. అందర్నీ పలకరిస్తూ తెగ సందడి చేసింది. అందరితో కలిసి డ్యాన్స్ చేసింది. పెళ్లి కొడుకును కూడా కవ్వించి, సరదాగా ఆటపట్టిస్తూ కాసేను స్టెప్పులేసింది. ఆ తరువాత అసలు విషయం తెలిసాక వేదిక అంతా అందమైన నవ్వులు పూసాయి. అలా వచ్చింది మరెవ్వరో కాదు స్వయంగా వధువే. ఊహించని విధంగా విచిత్రమైన అలంకరణతో రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. View this post on Instagram A post shared by Malkeet Shergill | Anchor | Wedding Host (@malkeetshergill)తనకు కాబోయే భార్య చిలిపితనం, ఊహించని గెటప్ చూసి వరుడు కూడా నవ్వుతూ, సిగ్గుల మొగ్గయ్యాడు. ఆ తరువాత ముసి ముసి నవ్వులతో కాబోయే జంట స్టెప్పులేయడం విశేషం. ఇన్స్టాగ్రామ్ యూజర్ మల్కీత్ షెర్గిల్ అప్లోడ్ చేసిన వీడియోలో, "కభీ ఐసా కుచ్ దేఖా హై?" అనే క్యాప్షన్తో ఈ వీడియో షేర్ అయింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. మీ క్రియేటివిటీకి ఓ దండం రా బాబూ అని ఒకరంటే, ఇలా ఉన్నారేంట్రా బాబూ అని మరికొందరు కామెంట్ చేశారు. గాడ్జిల్లా కాదు బ్రైడ్జిల్లా అని కామెంట్ చేయడం విశేషం. -
బంగారం డోర్ డెలివరీ.. సెక్యూరిటీ చూశారా?
కాదేదీ డోర్ డెలివరీకి అనర్హం అన్నట్లు ఆర్డర్ ఇస్తే చాలు ఇప్పుడు ప్రతీదీ ఇంటి ముంగిటకే వచ్చేస్తోంది. ఈ ఏడాది అక్షయ తృతీయను పురస్కరించుకుని ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ స్విగ్గీ ఇన్స్టా మార్ట్ నిత్యావసర సరుకుల మాదిరిగానే బంగారాన్నీ డెలివరీ చేస్తామంటూ ముందుకు వచ్చింది. అయితే డోర్ స్టెప్ గోల్డ్ డెలివరీ కోసం ఆ కంపెనీ చేసిన హై సెక్యూరిటీ ఏర్పాట్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతున్న వరుస వైరల్ వీడియోలు నెటిజనుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా విస్తృతంగా షేర్ అవుతున్న ఒక వీడియో క్లిప్లో స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్.. సెక్యూరిటీ గార్డుతో కలిసి ట్రాఫిక్లో బైక్పై వెళ్తూ కనిపించారు. అందులో సెక్యూరిటీ గార్డు ఒక చేతిలో లాఠీ, మరో చేతిలో హై సెక్యూరిటీ లాకర్ పట్టుకొని కనిపించాడు. ఈ వీడియో వీక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది."ఏమి జరుగుతోంది?" అంటూ ఒక ఇన్స్టాగ్రామ్ యూజర్ ప్రశ్నించగా "రియల్ గోల్డ్ డెలివరీ కర్నే కే లియే రియల్ సెక్యూరిటీ చాహియే బ్రో (రియల్ గోల్డ్ కోసం రియల్ సెక్యూరిటీ కావాలిగా) అని స్విగ్గీ చమత్కారంగా బదులిచ్చింది. ఆన్ లైన్ లో ప్రచారం ఊపందుకోవడంతో స్విగ్గీ ఇన్ స్టామార్ట్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో వైరల్ వీడియోలను రీపోస్ట్ చేసింది. దీనికి బంగారమా? నిజంగానా?' అంటూ మరో యూజర్ ఆశ్చర్యం వ్యక్తం చేయగా దీనికి కూడా ‘డెలివరింగ్ సోనా ఇన్ ఎవరీ కోనా కోనా’(ప్రతి మూలకూ బంగారం డెలివరీ) అంటూ స్విగ్గీ రిప్లయి ఇచ్చింది.కాగా కల్యాణ్ జ్యువెల్లర్స్ నుంచి వివిధ బరువుల బంగారు, వెండి నాణేలను నిమిషాల్లో కస్టమర్లకు డెలివరీ చేయనున్నట్లు స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. క్విక్ కామర్స్ సర్వీస్ ద్వారా లభించే నాణేలలో 0.5 గ్రాములు, 1 గ్రాము బంగారు నాణేలు, అలాగే 5 గ్రాములు, 10 గ్రాములు, 20 గ్రాముల వెండి నాణేలు ఉన్నాయి. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
'గుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి'..! కన్నీళ్లు పెట్టుకున్న యూకే వ్యక్తి..
మన చిన్నతనంలోని విషయాలు ఎవ్వరికైనా మధురమైన జ్ఞాపకాలే. అవి అంత తేలిగ్గా మర్చిపోం. ఒక్కసారి మన పాత స్కూల్, లేదా చిన్ననాటి స్నేహితుడిని చూస్తే..వెంటనే తన్మయత్వానికి గురవ్వుతాం. నాటి రోజులన్నీ కనుల ముంగిట మెదిలాడుతూ ఉంటాయి. ఒక్కసారి ఆ రోజుల్లోకి వెళ్లిపోతే ఎంత బాగుండునో అనిపిస్తుంది. ఎవ్వరికైనా అంతే..!. అలాంటి సంతోషంతోనే తడిసి ముద్దవుతున్నాడు ఈ యూకే వ్యక్తి.యూకే(UK)కి చెందిన కంటెంట్ క్రియేటర్ రాల్ఫ్ లెంగ్ భారతదేశంలోని తన చిన్ననాటి ఇంటిని సందర్శించి అలాంటి అనుభూతే పొందాడు. ఇటీవలే ఆ ఇంటిని సందర్శించాడు. అందుకు సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ.."నేను భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను" అనే క్యాప్షన్ని కూడా జోడించాడు. అంతే ఒక్కసారిగా ఆ వీడియో భారతీయ నెటిజన్లందర్నీ కదలించింది. ఆ వీడియోలో రాల్ఫ్ 16 ఏళ్ల తర్వాత తన బాల్యం(Childhood ) గడిచిన ఇంటిని చూసినప్పడు తనకు ఎలా అనిపించిందో పంచుకున్నాడు. ఇది చూడటాని ఓ పిచ్చిలా అనిపించినా..అవన్నీ చూస్తే నాటి మధుర జ్ఞాపకాలే కళ్లముందు కదలాడుతున్నాయి అంటూ కన్నీళ్లుపెట్టుకున్నాడు. తాను చిన్నప్పుడు ఏనుగుతో ఆడుకుంటున్న దృశ్యంతో సహా అన్ని వరుసగా గుర్తుకొస్తున్నాయి..అంటూ భావ్వోద్వేగానికి గురయ్యాడు. ఆ వీడియోలో తన మధుర స్మృతులకు నిలయమైన ఆ ఇంటికి చేరుకోగానే..ఆ ఇంటి తలుపు తట్టి యజామని పర్మిషన్ తీసుకుని మరీ ఆ ఇల్లంతా కలియతిరిగాడు. అంతేగాదు తన కుటుంబంతో సహా భారతదేశం వదిలి యూకే వెళ్తున్నప్పుడు తనకిష్టమైనవి అన్నింటిని ఎలా వదిలేయాల్సి వచ్చిందో కూడా వివరించాడు ఆ వీడియోలో. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పైగా ఈ వీడియోకి ఏకంగా రెండు మిలియన్లకు పైగా వ్యూస్, రెండు లక్షలకు పైగా లైక్లు వచ్చాయి. అంతేగాదు నెటిజన్లు భారతదేశం మీ బాల్యాన్ని చిరస్మరణీయంగా మార్చడమే గాక మీతో మాకు చాలా అనుబంధం ఉందని తెలుస్తోంది అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Ralph Leng (Blue) 💙🇬🇧 (@ralphleng) (చదవండి: ఇంటి వాతావరణాన్ని తలపించేలా కారు లోపల సెటప్..! మెచ్చుకోకుండా ఉండలేరు) -
పోలీస్ అధికారితో అలా.. సహనం కోల్పోయిన సీఎం సిద్ధరామయ్య
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సహనం కోల్పోయారు. ఓ పోలీస్ అధికారిపై చెయ్యేత్తి కొట్టబోయారు. అదీ పెద్ద పెద్ద నేతలు పాల్గొన్న ఓ పబ్లిక్ మీటింగ్లో. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుండగా.. ప్రతిపక్షాలే కాదు సామాన్యులు సైతం మండిపడుతున్నారు.సోమవారం బెలగావిలో సంవిధాన్ బచావో & ధరల వ్యతిరేకల నిరసన ప్రదర్శన జరిగింది. అయితే ఆ సమయంలో బీజేపీకి చెందిన కొందరు అక్కడికి చేరుకుని నల్ల జెండాలు, కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక ఫ్లకార్డులతో నిరసన నినాదాలు చేశారు. దీంతో ఆయన సహనం కోల్పోయారు. ‘‘ఏయ్ ఎవరు మీరు? నోరు మూయండి’’ అంటూ గట్టిగా అరిచారాయన.అయినా కూడా వాళ్లు శాంతించకపోవడంతో.. అక్కడే ఉన్న ఏఎస్పీ నారాయణ్ భరమణిని దగ్గరకు పిలిచారు. ‘‘ఏయ్.. ఎవరు ఇక్కడ ఎస్పీ? ఏం చేస్తున్నావ్? అంటూ చెయ్యేత్తి కొట్టబోయారు. అయితే ఆ అధికారి వెనక్కి వెళ్లగా.. సీఎం కూడా తేరుకుని చెయ్యిని వెనక్కి లాక్కున్నారు. ‘‘ఏం చేస్తున్నారయ్యా మీరంతా? వాళ్లంతా ఇక్కడి దాకా ఎలా రాగలిగారు?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారాయన.#Karnataka Chief Minister #Siddaramaiah lost his temper and raised his hand to slap a senior police officer while he was addressing a Congress rally against the Centre's policies in #Belagavi on Monday.🔗https://t.co/kkeaADaLnu@XpressBengaluru pic.twitter.com/pTntV5QZrN— The New Indian Express (@NewIndianXpress) April 28, 2025ఈ వీడియో కన్నడనాట దుమారం రేపింది. అధికారం శాశ్వతం కాదని.. తమరు ఐదేళ్లు అధికారంలో ఉంటారని.. కానీ ఆ అధికారి 60 ఏళ్లు వచ్చే దాకా డ్యూటీలో ఉంటారంటూ జేడీఎస్ ట్వీట్ చేసింది. ఇక.. బీజేపీ ఆ అధికారికి సీఎం సిద్ధరామయ్య క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేసింది. మరోవైపు.. కొందరు నెటిజన్లు సైతం సిద్ధరామయ్య తీరు తప్పుబడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. -
ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్
ఆధునికయుగం, స్మార్ట్ యుగం అని చెప్పుకొని పొంగిపోతున్న నేటి కాలంలో కూడా ఆడ శిశువులపై అంతులేని వివక్ష కొనసాగుతూనే ఉంది. ఆడబిడ్డ మహాలక్ష్మీగా భావించే సమాజమే ఆడబిడ్డను భారంగా భావిస్తుంది. అందుకే కొందరు తల్లిదండ్రులు ఆడశిశువులను భారంగా భావిస్తున్నారు. అవును మళ్లీ ఆడపిల్లే పుట్టిందన్న బాధతో పసిగుడ్డును ఆసుపత్రిలోనే వదిలివేసిన ఘటన మానవత్వానికే మచ్చగా నిలిచింది. దీనికి సంబంధించిన ఘటనను ఒక మహిళా వైద్యురాలు షేర్ చేయడంతో ఇది వైరల్గా మారింది.చదవండి: అమ్మమ్మ కాంజీవరం పట్టు చీరలో ‘బుట్టబొమ్మ’లామహిళా డాక్టర్ పోస్ట్ చేసిన వైరల్ వీడియో ప్రకారం, ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఒక మహిళ తన మూడవ కుమార్తెకు జన్మనిచ్చింది. మళ్లీ ఆడ శిశువు జన్మించడంతో నిరాశ చెందిన ఆ కుటుంబం, నవజాత శిశువును ఆసుపత్రిలోనే వదిలివేసింది. ప్రసవం తర్వాత శిశువు తండ్రి కూడా ఆమెను సందర్శించలేదని డాక్టర్ వెల్లడించారు.I am shocked to see this happening in 2025.These kinds of people don't deserve to be parents!. pic.twitter.com/0kHYhbZHTf— Anushka Gupta (@Anushqq) April 27, 2025సోషల్ మీడియాలో డాక్టర్ భావోద్వేగ విజ్ఞప్తి21వ శతాబ్దంలో కూడా ఇప్పటికీ కొనసాగుతున్న, లోతుగా పాతుకుపోయిన లింగ వివక్షను ఆమె హైలైట్ చేశారు. దేశ అధ్యక్షురాలు మహిళ, ఇటీవల అంతరిక్షంనుంచి ఎంతో ధైర్యంతో తిరిగి వచ్చిన సునీతా విలియమ్స్ మహిళ. ఇలాంటి వారిట భారతదేశం ఎంత గర్వపడాలి.ఆడ శిశువును ఎలా తిరస్కరించడం అన్యాయం,ఇది తనకు ఎంతో బాధను కలిగించిందని అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయ్యింది దీనిపై నెటిజనులు స్పందించారు. ఈ ఘటనపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేయగా, మరికొందరు తాము దతత్త తీసుకుంటామన్నారు. ఆమెను ప్రేమతో నిండిని గూడును అందించడానికి తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు. దీంతో శిశువు కుటుంబం తమ తప్పును గ్రహించారు. తిరిగి తమ బిడ్డను తీసుకెళ్లారు. ఈ విషయాన్ని ఆ డాక్టర్ తరువాత ఒక ఫాలో-అప్ వీడియోను షేర్ చేశారు. సోషల్ మీడియా వల్లే ఆ ఫ్యామిలి తమ తప్పు తెలుసుకుంది అంటూ ఆమె నెటిజన్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ పాప కుటుంబ సభ్యులను వివరాలను మాత్రం డాక్టర్ గోప్యంగా ఉంచారు.ఇదీ చదవండి: అమాయకులను పొట్టనబెట్టుకున్నారు: వాళ్ల పాపానికి మేం మూల్యం చెల్లిస్తున్నాం! -
కేఎల్ రాహుల్పై కోహ్లి సీరియస్!.. ఇచ్చిపడేశాడు! వీడియో వైరల్
సొంతమైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఎదురైన పరాభవానికి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ప్రతీకారం తీర్చుకుంది. ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా అక్షర్ సేనను వారి హోం గ్రౌండ్లో ఓడించి లెక్క సరిచేసింది. ఇక అరుణ్జైట్లీ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ సందర్భంగా ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి (Virat Kohli)- ఢిల్లీ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) మధ్య జరిగిన వాగ్వాదం హైలైట్ అయ్యింది.కేఎల్ రాహుల్ మరోసారిటాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ఆర్సీబీ.. ఢిల్లీని 162 పరుగులకు కట్టడి చేసింది. ఓపెనర్లు అభిషేక్ పోరెల్ (28), ఫాఫ్ డుప్లెసిస్ (22), ట్రిస్టన్ స్టబ్స్ (18 బంతుల్లో 34) రాణించగా.. కేఎల్ రాహుల్ (41) ఢిల్లీ ఇన్నింగ్స్లో టాప్ రన్స్కోరర్గా నిలిచాడు.ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు కూల్చగా.. జోష్ హాజిల్వుడ్ రెండు, కృనాల్ పాండ్యా- యశ్ దయాళ్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఢిల్లీ విధించిన 163 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 18.3 ఓవర్లలోనే ఛేదించింది.కోహ్లి బాధ్యతాయుత ఇన్నింగ్స్ఫిల్ సాల్ట్ స్థానంలో ఓపెనర్గా వచ్చిన జేకబ్ బెతెల్ (12) నిరాశపరిచినా.. మరో ఓపెనర్ విరాట్ కోహ్లి బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. 47 బంతుల్లో 51 పరుగులు చేశాడు. మిగతా వాళ్లలో ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా (47 బంతుల్లో 73), టిమ్ డేవిడ్ (5 బంతుల్లో 19) ధనాధన్ దంచికొట్టి ఆర్సీబీ విజయాన్ని ఖరారు చేశారు.అయితే, లక్ష్య ఛేదన సమయంలో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ కోహ్లి - ఢిల్లీ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్తో వాదనకు దిగినట్లు కనిపించింది. ఆర్సీబీ ఇన్నింగ్స్లో ఎనిమిదో ఓవర్ను ఢిల్లీ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వేశాడు. ఈ క్రమంలో తొలి బంతిని ఎదుర్కొన్న కోహ్లి సింగిల్ తీయగా.. మిగతా ఐదు బంతులను కృనాల్ పాండ్యా ఎదుర్కొన్నాడు.రాహుల్తో వాదనకు దిగిన కోహ్లి?!అయితే, ఆ ఓవర్లో మధ్యలోని నాలుగు బంతులు డాట్ కాగా.. ఆఖరి బంతికి మాత్రం కృనాల్ రెండు పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో మొత్తంగా ఎనిమిదో ఓవర్లో ఆర్సీబీకి కేవలం మూడు పరుగులే వచ్చాయి. ఈ క్రమంలో కోహ్లి- రాహుల్తో వాదనకు దిగిన దృశ్యాలు నెటిజన్లను ఆకర్షించాయి.కానీ వీరిద్దరి మధ్య వాగ్వాదం ఎందుకు జరిగిందన్న అంశంపై మాత్రం స్పష్టత రాలేదు. ఈ క్రమంలో కామెంటేటర్, భారత మాజీ స్పిన్నర్ పీయూశ్ చావ్లా కోహ్లి- రాహుల్ మధ్య జరిగింది ఇదే అంటూ స్టార్ స్పోర్ట్స్ షోలో ఈ మేరకు తన అభిప్రాయం పంచుకున్నాడు.గట్టిగానే బదులిచ్చాడు‘‘ఫీల్డింగ్ సెట్ చేసేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ కాస్త ఎక్కువగానే సమయం తీసుకుంటోందని.. బహుశా ఇదే విషయమై కోహ్లి రాహుల్కు ఫిర్యాదు చేసి ఉంటాడు. అయితే, వికెట్ కీపర్ రాహుల్ కూడా తన జట్టుకు మద్దతుగా కాస్త గట్టిగానే బదులిచ్చాడు. వ్యూహంలో భాగంగానే తమ కెప్టెన్ ఇలా చేస్తున్నాడని చెప్పి ఉంటాడు’’ అని చావ్లా అభిప్రాయపడ్డాడు. ఇక బ్రాడ్కాస్టర్ షేర్ చేసిన వీడియోలో.. తాను వికెట్లకు నిర్ణీత దూరంలోనే ఉన్నానని రాహుల్ బదులిచ్చినట్లు కనిపించడం గమనార్హం.ఐపీఎల్-2025: ఢిల్లీ వర్సెస్ బెంగళూరుఢిల్లీ స్కోరు: 162/8 (20)ఆర్సీబీ స్కోరు: 165/4 (18.3)ఫలితం: ఢిల్లీపై ఆరు వికెట్ల తేడాతో బెంగళూరు గెలుపుప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: కృనాల్ పాండ్యా. చదవండి: IPL 2025: అగ్రస్థానానికి దూసుకొచ్చిన ఆర్సీబీ.. టాప్ ప్లేస్లో కోహ్లి, హాజిల్వుడ్ Things are heating up in Delhi! 🔥#ViratKohli and #KLRahul exchange a few words in this nail-biting match between #DC and #RCB. 💪Watch the LIVE action ➡ https://t.co/2H6bmSltQD#IPLonJioStar 👉 #DCvRCB | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, Star Sports 2, Star… pic.twitter.com/Oy2SPOjApz— Star Sports (@StarSportsIndia) April 27, 2025 -
వాట్ ఏ డేరింగ్..! నిటారు చెట్టుపైన డ్యాన్స్..!
ఎన్నో రకాల డేరింగ్ డ్యాన్స్లు చూసుంటారు. ఒంటి కాలితో..కాళ్లే లేకపోయిన వాళ్లు చేసిన సాహసోపేతమైన నృత్యాలు తిలకించాం గానీ. ఇలాంటి డ్యాన్స్ మాత్రం చేసే ఛాన్సే లేదు. ఎవ్వరికి రానీ ఆలోచన అని చెప్పొచ్చు. ఏకంగా ఓ పెద్ద చెట్టు..చిటారు కొమ్మపై నుంచి డ్యాన్స్ అంటే మాటలు కాదుకదా..!. చెబుతుంటేనే వణుకొస్తోంది. మరి చూస్తే.. చెమటలు పట్టేయడం ఖాయం..!. అలాంటి సాహసమే చేసింది ఇక్కడొక అమ్మాయి. కాశ్మీరీ మహిళ నాగ్వంసీ ఏకంగా నిటారుగా వంపుతో ఉన్న చెట్టుపై బ్యాలెన్స్ చేస్తూ డ్యాన్స్ చేసింది. 2012 చిత్రం ఇషాక్జాదేలోని హిట్ బాలీవుడ్ పాట "जहालालालाला" కు లయబద్ధంగా డ్యాన్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. ఆ డేరింగ్ డ్యాన్స్ అందర్నీ ఆకర్షించడమే గాక ఆందోళన రేకెత్తించేలా ఉంది. అయితే నెటిజన్లు మాత్రం సిస్టర్ నెక్స్ట్ ఈఫిల్ టవర్పై ట్రై చేయండని ఒకరూ, ఆమెను చూసి మరణమే భయపడుతుందని మరొకరు ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by usha (@ushanagvanshi31) (చదవండి: చల్లచల్లగా వేడితాక'కుండ'..!) -
కిడ్ఫ్లూయెన్సర్... కిం కర్తవ్యం
యూ ట్యూబ్లో కిడ్ఫ్లూయెన్సర్ల వైరల్ వీడియోలు ప్రవాహంలా కనిపిస్తాయి. క్యాచీ కంటెంట్తో లక్షల్లో వ్యూస్ సాధిస్తున్నారు. లక్షల్లో సబ్స్క్రైబర్లు ఉన్నారు. మన దేశంలో క్లిడ్ఫ్లూయెన్సర్ల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.తెర వెనుక కథ గురించి చర్చ మొదలైంది. షూటింగ్ల కోసం వారు తరచుగా స్కూల్కు వెళ్లకుండా ఎక్కువ సెలవులు పెడుతున్నారా? సరిగా తింటున్నారా? తగినంత నిద్ర ఉంటోందా? కంటెంట్కు సంబంధించి ఒత్తిడికి గురవుతున్నారా? అందరు పిల్లల్లా సాధారణ జీవితాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారా... ఇలాంటి సందేహాలు ఎన్నో ఉన్నాయి.బాగా చదివే పిల్లలు కూడా ‘కిడ్ఫ్లూయెన్సర్’ ట్యాగ్లైన్ పుణ్యమా అని చదువులో వెనకబడి పోతున్నారు. ‘నేను చాలా సాధించాను. నేను చాలా గ్రేట్’ అనే భావన పెరిగిపోతుంది. ‘యాభై ఏళ్ల క్రితం అకాడమిక్ ఎక్స్లెన్స్ గోల్డ్ స్టాండర్డ్, ముప్పై ఏళ్ల క్రితం ఆటలు ఉండేవి. ఇప్పుడు క్రియేటివిటీ, డ్యాన్స్, మ్యూజిక్, విజువల్ కంటెంట్. ఒక్క వైరల్ వీడియో చాలు పిల్లలకు రాత్రికి రాత్రి స్టార్డమ్ తీసుకురావడానికి. ఈ తక్షణ పాపులారిటీ వల్లే పిల్లలు, తల్లిదండ్రులు వైరల్ కంటెంట్పై దృష్టి పెడుతున్నారు’ అంటుంది కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ డా.మేఘా పుష్కర్ణ. -
సీమా హైదర్ పాక్ వెళ్లిపోవాల్సిందేనా?రాఖీ సావంత్ సంచలన వీడియో
జమ్మూకశ్మీర్ (Jammu Kashmir)లోని పహెల్గామ్ (Pehalgam) ఉగ్ర దాడి తర్వాత భారత్ పాకిస్తాన్పై అనేక ఆంక్షలు విధించింది. ముఖ్యంగా 48 గంటల్లో పాకిస్థానీలు ఇండియా వదిలి వెళ్లిపోవాలని ఆదేశించింది. పాకిస్తానీలకు వీసాలను రద్దు చేసింది ఈ నేపథ్యంలో 2023లో నేపాల్ ద్వారా అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించి భారతదేశానికి చెందిన ప్రేమికుడు సచిన్ మీనాను యువకుడ్ని పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచిన సీమా హైదర్ మరోసారి చర్చల్లో నిలిచింది. సీమా హైదర్ సోషల్మీడియాలో ట్రెండింగ్లో నిలిచింది. సీమా హైదర్ కూడా పాకిస్తాన్ కు తిరిగి వెళ్తారా ఎక్స్లో చర్చకు దారి తీసింది. అయితే అనూహ్యంగా ఆమెకు మద్దతుగా వివాదాస్పద నటి రాఖీ సావంత్ స్పందించడం మరింత సంచలనంగా మారింది.పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత సీమా హైదర్ (Seema Haider)ను పాకిస్తాన్కు పంపొద్దు అంటూ రాఖీ సావంత్ (Rakhi Sawant) భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఈ దాడిలో సీమకు ఏమీ సంబంధంలేదనీ, ఆమె నిర్దోషి అని వ్యాఖ్యానించింది. ఆమె'హిందూస్తాన్ కీ బహు హై' సచిన్కీ బీవీ, అంతేకాదు యూపీకి బహు అంటూ ఇలా వాపోయింది. ‘‘ఇప్పటికే నలుగురు పిల్లలను కన్న సీమాకు సచిన్తో ఒక అమ్మాయి కూడా ఉంది, ఆమెకు వారు భారతి మీనా అని పేరు పెట్టుకున్నారు. సీమా ఒక తల్లి, సచిన్ భార్య, అతని బిడ్డకు తల్లి అని రాఖీ చెప్పింది. సీమా భారతదేశానికి కోడలు కాబట్టి ఆమెకు అన్యాయం జరగ కూడదని,ఆమెను గౌరవించాలి అంటూ వాదించింది. సార్క్ వీసా మినహాయింపు సర్వీస్ కింద ఇచ్చిన వీసాలను రద్దు చేయాలని భారతదేశం నిర్ణయం, పాకిస్తానీ ప్రజలు 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని కఠినమైన ఆదేశాలు ఇచ్చిన తర్వాత రాఖీ ఆమెకు సపోర్ట్గా ఇన్స్టాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు పలు రకాలు వ్యాఖ్యానించారు.చదవండి: సింహాల వయసుని ఎలా లెక్కిస్తారు? మీకు తెలుసా? View this post on Instagram A post shared by Rakhi Sawant (@rakhisawant2511)మరోవైపు తాజా నివేదికల ప్రకారం, సీమాకు భారతదేశంలో నివసించడానికి అనుమతి లభిస్తుందని ఆమె తరపు న్యాయవాది ఏపీ సింగ్ భావిన్నారు, ఎందుకంటే, అతని వాదనల ప్రకారం, సీమ పాకిస్తాన్ పౌరురాలు కాదు.,గ్రేటర్ నోయిడా నివాసి సచిన్ మీనాను వివాహం చేసుకుంది , ఇటీవల ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది, అలాగే ఆమె పౌరసత్వం భారతీయ భర్తతో ముడిపడి ఉంది కాబట్టి, కేంద్రం ఆదేశాలు ఆమెకు వర్తించే అవకాశాలు లేవని ఆయన వాదిస్తున్నారు.ప్రస్తుతం, సీమా హైదర్ పౌరసత్వం మరియు అక్రమ వలస కేసు కోర్టులో పెండింగ్లో ఉంది.కాగా 2023లో నలుగురు బిడ్డల తల్లి అయిన 32 ఏళ్ల సీమా అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించి గ్రేటర్ నోయిడాలోని రబుపురాలో నివసించే 24 ఏళ్ల సచిన్ మీనాను వివాహం చేసుకుంది. తన మొదటి భర్త గులాం హైదర్ వేధింపుల కారణంగానే పాకిస్తాన్ను విడిచిపెట్టానని పేర్కొన్న సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: మూడు సార్లు ప్రెగ్నెన్సీ అయినా ఓకే కానీ : సానియా మీర్జా భావోద్వేగ జర్నీ -
పహల్గాం ఉగ్రదాడి నిరసనకారులకు పాక్ బెదిరింపులు
-
‘అంపైర్ కూడా డబ్బులు తీసుకుంటున్నాడు.. నీకెందుకంత తొందర?!’
గతేడాది రన్నరప్గా నిలిచిన సన్రైజర్స్ హైదరాబాద్.. ఐపీఎల్-2025 (IPL 2025)లో మాత్రం పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్లు పూర్తి చేసుకున్న కమిన్స్ బృందం కేవలం రెండు మాత్రమే గెలిచింది. తద్వారా కేవలం నాలుగు పాయింట్లు మాత్రమే సాధించి పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.ఇక సన్రైజర్స్ శుక్రవారం నాటి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK vs SRH)తో తలపడనుంది. చెపాక్ స్టేడియం ఇందుకు వేదిక. ఈ మ్యాచ్ నుంచి వరుసగా విజయాలు సాధిస్తేనే కమిన్స్ బృందానికి ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఇదిలా ఉంటే.. గత మ్యాచ్లో సన్రైజర్స్ సొంత మైదానం ఉప్పల్లో ముంబై ఇండియన్స్తో తలపడిన విషయం తెలిసిందే.ఈ మ్యాచ్లో రైజర్స్ ముంబై చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రైజర్స్.. ఆది నుంచే తడ‘బ్యా’టుకు గురైంది. ముంబై బౌలర్ల ధాటికి టాపార్డర్ పెవిలియన్కు క్యూ కట్టింది.ఇషాన్ కిషన్ స్వీయ తప్పిదంఓపెనర్లు ట్రవిస్ హెడ్ (0), అభిషేక్ శర్మ (8) పూర్తిగా విఫలం కాగా.. ఇషాన్ కిషన్ స్వీయ తప్పిదంతో వికెట్ పారేసుకుని విమర్శలు మూటగట్టుకున్నాడు. రైజర్స్ ఇన్నింగ్స్లో మూడో ఓవర్ను దీపక్ చహర్ వేయగా.. బంతిని డౌన్ ది లెగ్ ఆడేందుకు ఇషాన్ ప్రయత్నించాడు.ఈ క్రమంలో బంతి వికెట్ కీపర్ రియాన్ రికెల్టన్ చేతిలో పడింది. అయితే, బాల్ ఇషాన్ బ్యాట్ లేదంటే గ్లౌవ్స్ను తాకిందా లేదా అన్న సందేహంతో ముంబై బౌలర్గానీ, వికెట్ కీపర్గానీ అప్పీలు చేయలేదు.అంపైర్ కూడా వెంటనే ఏ నిర్ణయానికీ రాలేదు. కానీ ఇంతలోనే తాను అవుటయ్యాయని ఫిక్స్ అయి ఇషాన్ క్రీజును వీడాడు. ఏం జరిగిందో అర్థం కాని అంపైర్.. అవుట్ ఇచ్చేందుకు వేలు పైకెత్తాలా అన్న సందిగ్దంలో ఆఖరికి అవుట్ ఇచ్చాడు.అయితే, రీప్లేలో మాత్రం ఇషాన్ కిషన్ నాటౌట్ అని తేలింది. దీంతో ఇషాన్ అమ్ముడుపోయాడంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. ఇక ఈ ఘటనపై భారత మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ ఘాటుగా స్పందించాడు.అంపైర్ కూడా డబ్బులు తీసుకుంటున్నాడు‘‘చాలాసార్లు ఇలాగే మెదడు పనిచేయడం ఆగిపోతుంది. నిజంగా ఇదొక మతిలేని చర్య. కాసేపు ఆగితే ఏమయ్యేది?.. అంపైర్ కూడా తాను చేస్తున్న పనికి డబ్బు తీసుకుంటున్నాడు కదా!అతడు తన నిర్ణయం ప్రకటించేదాకానైనా ఎదురుచూడాలి. తన పనిని తనను చేసుకోనివ్వాలి. ఇదేం రకమైన నిజాయితీయో నాకైతే అర్థం కావడం లేదు. క్రీడాస్ఫూర్తిని పాటిస్తున్నానని అతడు ఇలా చేసి ఉండవచ్చు, కానీ అవుట్ కాకుండానే వెళ్లిపోవడం.. అది కూడా అంపైర్ను తికమకపెట్టేలా వ్యవహరించడం సరికాదు. హఠాత్తుగా అతడు అలా ఎందుకు వెళ్లిపోయాడో తెలియడం లేదు’’అంటూ సెహ్వాగ్ ఇషాన్కు చురకలు అంటించాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (71), అభినవ్ మనోహర్ (43) వల్ల ఈమాత్రం పరువునిలుపుకోగలిగింది. సన్రైజర్స్ విధించిన నామమాత్రపు లక్ష్యాన్ని ముంబై 15.4 ఓవర్లలోనే ఛేదించింది.చదవండి: కోటీశ్వరుడినయ్యా.. నేను స్టార్ అనుకుంటే వచ్చే ఏడాది కనిపించడు! Fairplay or facepalm? 🤯 Ishan Kishan walks... but UltraEdge says 'not out!' What just happened?!Watch the LIVE action ➡ https://t.co/sDBWQG63Cl #IPLonJioStar 👉 #SRHvMI | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi & JioHotstar! pic.twitter.com/bQa3cVY1vG— Star Sports (@StarSportsIndia) April 23, 2025 -
'తొలి యూట్యూబ్ వీడియో' ..! ఇప్పటికీ 300 మిలియన్లకు పైగా వ్యూస్
సోషల్ మీడియా ప్లాట్ఫాం రారాజుగా నీరాజనాలు అందుకుంటోంది 'యుట్యూబ్'..!. దీని పుణ్యమా అని నేటితరం ఏదైనా అవలీలగా చిటికెలో నేర్చేసుకుంటోంది. ఏ చిన్న సందేహం వచ్చినా..యూట్యూబ్ సాయంతో చకచక తెలుసుకుంటున్నారు. అది కుకింగ్, చదువు, ఇతరత్రా ఏదైనా..క్షణాల్లో తెలుసుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు. అంతేగాదు ఈ యూట్యూబ్ సాయంతో ఎంతో మంది ఓవర్నైట్ స్టార్లుగా మారారు. పైగా ఎంతోమందికి జీవనోపాధిని అందించింది కూడా. అలాంటి యూట్యూబ్ ఫ్లాట్ ఫాంలో అప్లోడ్ అయినా తొలి వీడియో ఏదో తెలుసా..అది నేటికి నిశ్శబ్దంగా ఇంటర్నెట్ చరిత్రను సృష్టిస్తోంది. యూట్యూబ్ను ఫిబ్రవరి 14, 2005న జావేద్ కరీం, చాడ్ హర్లీ, స్టీవ్ చెన్, పేపాల్ తదితర వ్యక్తులు స్థాపించారు. ఇది ప్రస్తుతం గూగుల్ యాజమాన్యంలో ఉంది. అలా మొదలైనా యూట్యూబ్ ప్రస్థానం..ఎంతోమంది యంగ్ టాలెంట్ని వెలికితీసి పరిచయం చేసింది..వారి స్కిల్ ప్రపంచమే తెలుసుకునేందుకు వేదికగా మారింది. అంతేగాదు దీని సాయంతో కొందరూ కంటెంట్ క్రియేటర్లుగా మారి ప్రభంజనం సృష్టిస్తున్నారు కూడా. అలాంటి యూట్యూబ్ ఫ్లాట్ ఫాంపై అప్లోడ్ అయినా తొలి వీడియో ఏదో తెలుసా..!. ఇప్పటికీ అది మిలియన్ల వ్యూస్తో దూసుకుపోతూ నెట్టింట చరిత్ర సృష్టిస్తోంది. పైగా అది జస్ట్ 19 సెకన్ల వీడియో. ఏప్రిల్ 23, 2005న, YouTube సహ వ్యవస్థాపకుడు జావేద్ కరీం శాన్ డియాగో ఓ జూ వద్ద నిలబడి చేసిన చిన్న వీడియో అది. సుమారు 20 ఏళ్ల క్రితం జావేద్ ఏనుగుల ముందు నిలబడి..వాటి గురించి మాములుగా చెబుతున్న సాధారణ వీడియో. ఎలాంటి ఎడిటింగ్ లేకుండా..కనీసం వెనుక ఏవిధమైన సంగీత నేపథ్యం లేని సాదాసీదా వీడియో క్లిప్ అది. కానీ ఆ వీడియోకి గత కొన్నేళ్లుగా వస్తున్నా..వ్యూస్, లైక్లు చూస్తే మతిపోతుంది. ఇప్పటికీ ఆ ఈవీడియోకి 335 మిలియన్లకు పైగా వ్యూస్, 17 మిలియన్లకు పైగా లైక్లు ఉండటం విశేషం. మరో గమ్మత్తైన విశేషం ఏంటంటే.. కరీమ్ య్యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ అయినా ఏకైక వీడియో అదే కావడం. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియో మీరు కూడా చూసేయండి మరీ..!. (చదవండి: 24 ఏళ్లకే కంపెనీ రన్ చేశాడు ..28కే రిటైర్మెంట్! ఏకంగా రూ. 106 కోట్లు..) -
వినయ్ మృతదేహం వద్ద బోరున విలపించిన భార్య హిమాన్షి
-
Pahalgam: ఈ దుఃఖాన్ని ఆపడం ఎవ్వరి తరము? గుండెల్ని పిండేసే వీడియోలు
జమ్మూకశ్మీరిలోని పహల్గామ్ ఉగ్ర దాడి యావత్ దేశాన్ని కుదిపేసింది. మినీ స్విట్జర్లాండ్ బైసరన్ లోయలో మంగళవారం జరిగిన మారణ హోమం పలువురి కంటతడి పెట్టిస్తోంది. ఈ సంఘటనకు భయానక వివరాలు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. హనీమూన్కి వచ్చి ఒకరు, సెలవులకోసం వచ్చి ఒకరు ఇలా 26 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న వైనాన్ని యావద్దేశం ఖండించింది. 8 ఏళ్ల శిశువు నుండి నావికాదళ అధికారి వరకు, 22 మంది పర్యాటకులు, ఇద్దరు విదేశీయులు ,ఇద్దరు స్థానికులు ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో తండ్రి కోల్పోయిన చిన్నారి హృదయ విదారకంగా రోదిస్తున్న వీడియో కన్నీళ్లు పెట్టిస్తోంది. ఉగ్రమూకలు రెచ్చిపోయి పర్యాటలకు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. దీంతో ప్రాణ భయంతో అనేకమంది పరుగులు తీశారు. 26 మంది తూటాలకు నేలకొరిగారు. ఇలా తండ్రిభౌతిక దేహం మీద ఒక చిన్నారి రోదిస్తున్న వీడియో నెటిజనుల గుండె పిండేసింది. అతణ్ని రక్షించి తీసుకెళ్లుతుండగా, ఆ చిన్నారి రోదన ముఖ్యంగా అమ్మకావాలి అటూ ఏడుస్తున్న దృశ్యాలు హృదయ విదారకం ఉన్నాయి. ఈ ఘటన అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా దాడి జరిగిన ప్రదేశానికి చేరుకుని, బాధితులకు నివాళులర్పించారు. దేశం ఉగ్రవాదానికి తలొగ్గదని, దోషులను వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు. బాధిత కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను కూడా ప్రకటించారు. आपका दिल फट्ट जाएगा इस छोटे बच्चे का रोना सुनकर! इसके पिता का जुर्म इतना सा था की वह एक हिंदू थे! इन आतंकियों को ऐसा सबक सीखना चाहिए की इनकी 100 पुश्ते भी याद करके काँप जाये! #PahalgamTerroristAttack #HindusUnderAttack pic.twitter.com/J6Q6xhSU8L— Priyanshi Bhargava (@PriyanshiBharg7) April 23, 2025మృతుల్లో నావికాదళ అధికారి వినయ్ నర్వాల్.భార్య హిమాన్షి నర్వాల్ భర్త శవపేటిక పక్కన తీవ్రంగా రోదించింది. తన భర్త ధైర్యసాహసాల గురించి మాట్లాడుతూ విలపించిన దృశ్యాలు కలచివేస్తున్నాయి. కోటి ఆశలతో కొత్తజీవితాన్ని ప్రారంభించిన ఆ జంట కలలు క్షణాల్లో తునాతునాలైపోయాయి. ఇక హిమాన్షి దుఃఖాన్ని నిలువరించడం ఎవ్వరి తరము? #WATCH | Delhi | Indian Navy Lieutenant Vinay Narwal's wife bids an emotional farewell to her husband, who was killed in the Pahalgam terror attackThe couple got married on April 16. pic.twitter.com/KJpLEeyxfJ— ANI (@ANI) April 23, 2025మరోవైపు ఆ ఘాతుకానికి పాల్పడిన ముగ్గురు టెర్రరిస్టుల ఊహాచిత్రాలను దర్యాప్తు బృందాలు విడుదల చేశాయి. ఆసిఫ్ ఫౌజి, సులేమాన్ షా, అబు తాలాగా గుర్తించారు. వీరిని జమ్మూకశ్మీర్ కేంద్రంగా పనిచేసే ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’లో సభ్యులుగా భావిస్తున్నారు. -
ఇలాంటివన్ని పాకిస్తాన్ క్రికెట్లోనే జరుగుతాయి.. సహచరుడికే ఇచ్చి పడేసిన బౌలర్
చిత్రవిచిత్ర ఘటనలన్నీ పాకిస్తాన్ క్రికెట్లోనే జరుగుతాయి. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025లో భాగంగా ఓ ఆటగాడు వికెట్ తీసిన ఆనందంలో సొంత జట్టు ఆటగాడిపైనే దాడి చేశాడు (అనుకోకుండా). ఈ ఘటనలో బాధిత ఆటగాడి తలకు గాయమైంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంది.Update: Everyone is ok 🤗Khel Khel main 😄#HBLPSLX l #ApnaXHai l #MSvLQ pic.twitter.com/sJBcX91wai— PakistanSuperLeague (@thePSLt20) April 22, 2025ఇంతకీ ఏం జరిగిందంటే.. పీఎస్ఎల్ 2025లో భాగంగా నిన్న లాహోర్ ఖలందర్స్, ముల్తాన్ సుల్తాన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ముల్తాన్ సుల్తాన్స్ లాహోర్ ఖలందర్స్పై 33 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన సుల్తాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో తడబడిన ఖలందర్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 195 పరుగులకే పరిమితమైంది. ఖలందర్స్ను సుల్తాన్స్ బౌలర్ ఉబైద్ షా 3 వికెట్లు తీసి దెబ్బకొట్టాడు.ఈ ఉబైద్ షానే ఇన్నింగ్స్ 15వ ఓవర్లో వికెట్ (సామ్ బిల్లింగ్స్) తీసిన ఆనందంలో పొరపాటున సహచరుడు ఉస్మాన్ ఖాన్ (వికెట్కీపర్) తలపై దాడి చేశాడు. వికెట్ తీశాక సంబరాల్లో భాగంగా ఉబైద్ షా సహచరులకు హై ఫై ఇస్తున్నాడు. ఈ క్రమంలో ఉస్మాన్ ఖాన్ కూడా తన చేయి పైకి లేపాడు. అప్పటికే జోరుమీదున్న ఉబైద్.. పొరపాటు ఉస్మాన్ చేయిపై కాకుండా తలపై హై ఫై ఇచ్చాడు. ఈ ఘటనతో దిమ్మతిరిగిపోయిన ఉస్మాన్ తల పట్టుకుని నేల వాలాడు. ఇది చూసి మైదానంలో ఉన్న వారంతా పక్కున నవ్వుకున్నారు.ఊహించని చర్యతో షాక్కు గురైన ఉస్మాన్ కొద్ది సేపు మైదానంలో పడిపోయాడు. ఫిజియో పరిశీలించాక ఎలాంటి గాయాలు లేకపోవడంతో ఉస్మాన్ మ్యాచ్లో కొనసాగాడు. ఈ ఘటన కారణంగా మ్యాచ్కు కొద్ది సేపు అంతరాయం కలిగింది. కాగా, పాకిస్తాన్ సూపర్ లీగ్-2025 గత కొన్ని రోజుల నుంచి నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఈ లీగ్లోని ఓ ఫ్రాంచైజీ (కరాచీ కింగ్స్) బాగా రాణించిన తమ ఆటగాళ్లకు హెయిర్ డ్రయర్లు, హెయిర్ ట్రిమ్మర్లు బహుమతులగా ఇచ్చి నవ్వులపాలైంది. ఈ ఏడాది పీఎస్ఎల్ ఐపీఎల్కు పోటీగా ఒకే సమయంలో జరుగుతుంది. ఐపీఎల్ కంటే తమ లీగే గొప్పదంటూ ఢాంబికాలకు పోయిన పాక్ క్రికెట్ బోర్డు ఇలా చేసింది. తీరా చూస్తే ఐపీఎల్ కారణంగా ఒకరిద్దరున్న పీఎస్ఎల్ అభిమానులు కూడా ఆ లీగ్ను చూడటం మానేశారు. ఐపీఎల్తో పోటీ కారణంగా ఈ సీజన్లో పీఎస్ఎల్ అభిమానులు ఒక్కసారిగా తగ్గిపోయారు. స్టేడియంలో స్టాండ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియక పాక్ క్రికెట్ బోర్డు అధికారులు తలలు పట్టుకుని కూర్చున్నారు. -
విజయనగరం: గురువును చెప్పుతో కొట్టిన విద్యార్థిని
విజయనగరం, సాక్షి: జిల్లాలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో దారుణం చోటు చేసుకుంది. కాలేజ్ ప్రాంగణంలో ఓ విద్యార్థిని ఫోన్ మాట్లాడుతుండగా.. ఓ మహిళా లెక్చరర్ అడ్డుకుని ఫోన్ లాక్కుంది. ఈ క్రమంలో ఫోన్ ఇవ్వాలంటూ సదరు విద్యార్థిని లెక్చరర్ను దుర్భాషలాడింది. అందుకు లెక్చరర్ నిరాకరించడంతో విద్యార్థిని సదరు లెక్చరర్ను చెప్పుతో కొట్టింది. లెక్చరర్ సైతం ఆమెపై ప్రతిదాడి చేయగా.. తోటి విద్యార్థులు, ఓ వ్యక్తి అడ్డుపడ్డారు. ఈ ఘటనను అక్కడే ఉన్న మరో విద్యార్థిని వీడియో తీయగా.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోపై రఘు కాలేజ్ యాజమాన్యం స్పందించాల్సి ఉంది.ఈ తరం పిల్లలు తమ గురువులకు ఇచ్చే గౌరవం ఇది...👆తప్పు పిల్లలది కాదు, తల్లిదండ్రులది, టీచర్లది. పిల్లలకు ఫోన్లు కొనివ్వడం, వాళ్ళ గౌరవం కోసం లక్షల రూపాయల ఫీజులు కట్టే తల్లిదండ్రులు, లక్షల రూపాయల ఫీజులు తీసుకోని అమ్ముడుపోయిన టీచర్లు గౌరవాన్ని ఆశించడం సరైందేనా? #ShameOnSociety pic.twitter.com/tSmxNdNeW7— ꜱʀɪʀᴀɴɢᴀᴍ ꜱᴀɢᴀʀ(ᴍᴏᴅɪ ᴋᴀ ᴘᴀʀɪᴠᴀʀ) (@SAGAR4TBJP) April 22, 2025రఘు కళాశాలలో టీచర్ విద్యార్థిని మధ్య వాగ్యుద్ధం.. టీచర్ మీద చేయి చేసుకున్న విద్యార్థిని.#RaghuEngineeringCollege #Vizianagaram #Vizag #AndhraPradesh #UANow pic.twitter.com/APzPn1isCK— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) April 22, 2025 -
RCB Vs PBKS: ‘హద్దు’దాటిన కోహ్లి.. కింగ్పై మండిపడ్డ శ్రేయస్ అయ్యర్!.. వీడియో
ఐపీఎల్-2025 (IPL 2025)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐదో గెలుపు నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్ (PBKS vs RCB) చేతిలో సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో ఎదురైన పరాభవానికి ఆదివారం బదులు తీర్చుకుంది. పంజాబ్ను వారి హోం గ్రౌండ్ ముల్లన్పూర్లో ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది.శ్రేయస్ అయ్యర్ లక్ష్యంగాఈ క్రమంలో పంజాబ్పై ప్రతీకార విజయం నేపథ్యంలో ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు. అయితే, పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లక్ష్యంగా కోహ్లి వైల్డ్గా సెలబ్రేట్ చేసుకున్న తీరు విమర్శలకు తావిచ్చింది.కోహ్లి చర్య.. శ్రేయస్ ఫైర్ఇక కోహ్లి చర్య పట్ల శ్రేయస్ కూడా ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కనిపించింది. మ్యాచ్ ముగియగానే ఇరుజట్ల ఆటగాళ్లు పరస్పరం కరచాలనం చేసుకునే సమయంలో.. అయ్యర్ కోహ్లితో కోపంగా ఏదో మాట్లాడాడు. అయితే, కోహ్లి మాత్రం నవ్వుతూ వాతావరణాన్ని చల్లబరచాలని ప్రయత్నించాడు.కానీ శ్రేయస్ అయ్యర్ మాత్రం గంభీరంగా అతడికి బదులిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఏదేమైనా సహచర టీమిండియా ఆటగాడిని కించపరిచేలా ఇలాంటి సెలబ్రేషన్స్ దిగ్గజ బ్యాటర్ అయిన కోహ్లి స్థాయికి తగవంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.కోహ్లిని అనుకరిస్తూ హేళన చేశాడా?అయితే, ఆర్సీబీ అభిమానులు మాత్రం శ్రేయస్ అయ్యర్ గత మ్యాచ్లో కోహ్లిని అనుకరిస్తూ హేళన చేశాడని.. అందుకే కింగ్ ఇలా బదులిచ్చాడని కామెంట్లు పెడుతున్నారు. కానీ.. శ్రేయస్ ఆర్సీబీ మ్యాచ్ సమయంలో ఎలాంటి మూర్ఖపు చర్యలకు దిగలేదని.. కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్లో అతడు ఇచ్చిన రియాక్షన్ను తప్పుగా ప్రచారం చేస్తున్నారని కొందరు నెటిజన్లు పేర్కొంటున్నారు.బ్యాటర్గా శ్రేయస్ విఫలంకాగా ముల్లన్పూర్లో ఆదివారం జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ పంజాబ్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ సేన నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (22), ప్రభ్సిమ్రన్ సింగ్ (33), వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ (29), శశాంక్ సింగ్ (33 బంతుల్లో 31) రాణించగా.. ఆఖర్లో మార్కో యాన్సెన్ (20 బంతుల్లో 25 నాటౌట్) ఆకట్టుకున్నాడు.ఆర్సీబీ బౌలర్లలో స్పిన్నర్లు కృనాల్ పాండ్యా, సూయశ్ శర్మ చెరో రెండు వికెట్లు తీయగా.. పేసర్ రొమారియో షెఫర్డ్ శ్రేయస్ అయ్యర్ (6) రూపంలో కీలక వికెట్ దక్కించుకున్నాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.దంచికొట్టిన పడిక్కల్, కోహ్లిఓపెనర్ ఫిల్ సాల్ట్ కేవలం ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ విరాట్ కోహ్లి, వన్డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. పడిక్కల్ కేవలం 35 బంతుల్లోనే 61 పరుగులతో దుమ్ములేపాడు.అయితే, కెప్టెన్ రజత్ పాటిదార్ (12) ఈసారి విఫలం కాగా.. కోహ్లి- జితేశ్ శర్మతో కలిసి ఆర్సీబీ విజయాన్ని ఖరారు చేశాడు. కోహ్లి 54 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 73 పరుగులతో అజేయంగా నిలవగా.. జితేశ్ (8 బంతుల్లో 11) సిక్సర్తో మ్యాచ్ను ముగించాడు. కాగా ఈ సీజన్లో ఎనిమిది మ్యాచ్లు పూర్తి చేసుకున్న ఆర్సీబీ ఐదింట గెలిచి.. పట్టికలో ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది.చదవండి: Rohit Sharma: ఒక్కోసారి మనపై మనకే డౌట్!.. నాకు దక్కిన అరుదైన గౌరవంCSK Vs MI: ముంబై జెర్సీలో రాధికా మర్చంట్.. రోహిత్ ఫిఫ్టీ కొట్టగానే అనంత్ అంబానీతో కలిసి ఇలా..Jitesh Sharma dials 6⃣ to seal it in style 🙌Virat Kohli remains unbeaten on 73*(54) in yet another chase 👏@RCBTweets secure round 2⃣ of the battle of reds ❤Scorecard ▶ https://t.co/6htVhCbltp#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/6dqDTEPoEA— IndianPremierLeague (@IPL) April 20, 2025 -
Viral: చిన్నారిని రక్షించిన ఈ రియల్ హీరో ఏమన్నాడంటే..
తన ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా ఓ వ్యక్తి చేసిన సాహసం నెట్టింట ప్రశంసలందుకుంటోంది. విద్యుత్ షాక్కు గురైన తొమ్మిదేళ్ల చిన్నారిని కాపాడి శెభాష్ అనిపించుకున్నాడు చెన్నై యువకుడు కణ్ణన్. ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. అసలేం జరిగిందో ఆయన మాటల్లోనే..‘‘నా పేరు కణ్ణన్ తమిళసెల్వన్. బుధవారం మధ్యాహ్నాం సమయంలో పని మీద బైక్ మీద వెళ్తున్నా. ఆరోజు బాగా వర్షం కురిసింది. అరుంబాక్కమ్ ఏరియాలో రోడ్ల మీద బాగా నీరు నిలిచిపోయింది. చూస్తుండగానే ఓ పిల్లాడు నీళ్లలో పడిపోయాడు. బహుశా కళ్లు తిరిగి అందులో పడిపోయాడు అనుకున్నా. సాయం చేయడానికి దగ్గరగా వెళ్లా. కానీ, దగ్గరికి వెళ్లి చూస్తే షాక్తో విలవిలాడుతున్నాడని అర్థమైంది.సాయం కోసం కేకలు వేశా. ఎవరూ ముందుకు రాలేదు. దగ్గరికి వెళ్లి ముట్టుకోగానే నాకూ షాక్ కొట్టింది. ఆలస్యం చేయకుండా బయటకు లాగేశా. పక్కకు తీసుకెళ్లి ఛాతీ మీద బలంగా నొక్కా. ఆ పిల్లాడు ఊపిరి తీసుకోవడంతో ెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లా అని కణ్ణన్ తెలిపాడు. బాధిత చిన్నారి పేరు జేడన్. ప్రస్తుతం అతను కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. సీసీటీవీ ఫుటేజీలో ఆ ఘటన రికార్డయ్యింది. కరెంటు షాక్తో విలవిల్లాడుతూ ఆ బాలుడు నీటిలో కుప్పకూలిపోయాడు. అది గమనించిన కణ్ణన్ దగ్గరగా వెళ్లాడు.. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కాపాడాడు. కాస్త ఆలస్యమైతే ఆ చిన్నారి ప్రాణాలు పోయేవే. ఆదివారం నుంచి ఆ వీడియో వైరల్గా మారడంతో కణ్ణన్పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘నిజమైన హీరో’ అంటూ కొనియాడుతున్నారు. జేడన్ తండ్రి రాబర్ట్ ఓ ప్రైవేట్ ఉద్యోగి. అరుంబాక్కమ్లోని మాంగ్లీ నగర్లో నివాసం ఉంటున్నారు. ఆరోజు జేడన్కు ఆరోగ్యం బాగోలేదట. కానీ, వార్షిక పరీక్షలు ఉండడంతో బడికి పంపించా. పరీక్ష రాశాక ఒక్కడే తిరిగి వచ్చాడు. ఈ క్రమంలోనే ప్రమాదానికి గురయ్యాడు అని చెబుతున్నాడాయన. జేడన్ ఐడీ కార్డు మీద ఉన్న నెంబర్ చూసి కణ్ణన్ తనకు ఫోన్ చేశాడని, తన బిడ్డ ప్రాణం కాపాడిన అతనికి జీవితాంతం రుణపడి ఉంటానని చెబుతున్నాడు రాబర్ట్. సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్ కావడంతో అరుంబాక్కమ్ అధికారులు స్పందించారు. అండర్గ్రౌండ్ కేబుల్ దెబ్బ తినడం వల్లే ఈ ఘటన జరిగిందని వివరణ ఇచ్చుకున్నారు. #Kannan is the young man who bravely saved a boy who was drowning in the water due to an electric shock. He is the young man who risked his life to save the boy.⛑️He is a true hero. An inspiration to all.🫡Everyone should admire him.🫡#Chennai #Tamilnadu pic.twitter.com/PopgnYDUGp— Shashi Kumar Reddy Vura (@vurashashi) April 20, 2025 -
అయ్యో ఎంత విషాదం : కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళి
చెట్టంత ఎదిగిన పిల్లలకు వేడుకగా పెళ్లి చేయాలని భావిస్తారు ఏ తల్లిదండ్రులైనా. అలాగే కనిపెంచిన అమ్మానాన్నల కనుల విందుగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాలి ఆశిస్తారు ఏ బిడ్డలైనా. కానీ కన్నకొడుకు మూడు ముళ్ల ముచ్చట చూడాలన్న కోరిక తీరకముందే ఓ తండ్రి అనంతలోకాలకు వెళ్లిపోయాడు. దీంతో పుట్టెడు దుఃఖ్ఖంతో కొడుకు తీసుకున్న నిర్ణయం పలువురి చేత కంట తడి పెట్టిస్తోంది.Cuddalore Marriage | அப்பாவின் உடல் முன்பு நடைபெற்ற மகன் திருமணம்#cuddalore #viralvideo #virudhachalam #marriage #death pic.twitter.com/wUJW3qgvov— Thanthi TV (@ThanthiTV) April 18, 2025తండ్రి నిండు మనసుతో అక్షింతలేసి ఆశీర్వదిస్తుండగా, తన ప్రియురాల్ని పెళ్లి చేసుకోవాలని భావించిన కొడుక్కి తీరని వేదని మిగిల్చిన ఘటన ఇది. దీంతో తండ్రి భౌతిక దేహం సాక్షిగా అమ్మాయి మెడలో తాళి కట్టాడు. వధూవురులతోపాటు, బంధుమిత్రుల అశ్రు నయనాల మధ్య జరిగిన ఈ పెళ్లి తమిళనాడులోని కడలూర్ జిల్లాలో చోటుచేసుకుంది. భౌతికంగా తన తండ్రి పూర్తిగా మాయం కాకముందే, ఆయన ఆశీస్సులు పొందాలనే ఉద్దేశంతో ప్రియురాలిని ఒప్పించి మరీ తండ్రి మృతదేహం ఎదుటే ఆమెకు తాళి కట్టారు. బోరున విలపిస్తూ తండ్రి ఆశీస్సులు తీసుకోవడం అక్కడున్నవారినందరి హృదయాలను బద్దలు చేసింది. ఉబికి వస్తున్న కన్నీటిని అదుముకుంటూ బంధువులు, స్థానికులు కూడా వారిని ఆశీర్వదించారు.ఇదీ చదవండి:అనేక విషాద గాథల మధ్య.. స్ఫూర్తినిచ్చే జ్యోతి, శోభనాద్రి దాంపత్యం!కవణై గ్రామానికి చెందిన సెల్వరాజ్(63) రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. ఆయన రెండో కుమారుడు అప్పు లా కోర్సు చదువుతున్నాడు. గత నాలుగేళ్లుగా విజయశాంతి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. తమ ప్రేమ సంగతిని ఇంట్లోని పెద్దలతో చెప్పారు. ఇరు కుటుంబాల అనుమతితో త్వరలోనే పెళ్లి చేసుకోవాలను కున్నారు. విరుధాచలం కౌంజియప్పర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విజయశాంతి డిగ్రీ చదువుతోంది. చదువు పూర్తైన తరువాత వివాహంచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని ఆగవు కొన్ని..అన్నట్టు విధి మరోలా ఉంది. అప్పు తండ్రి సెల్వరాజ్ అనారోగ్యంతో అనూహ్యంగా కాలం చేశాడు. దీంతో గుండె పగిలిన అప్పు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
పుష్ప పాటకు సతీమణితో కేజ్రీవాల్ స్టెప్పులు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంట శుభకార్యం జరిగింది. కేజ్రీవాల్ కూతురు హర్షిత తన ఐఐటీయన్ స్నేహితుడిని వివాహమాడారు. కుటుంబ సభ్యులు, కొద్ది మంది రాజకీయ సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. అయితే ఈ వేడుకలో కేజ్రీవాల్ చేసిన సందడి ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఢిల్లీలోని షాంగ్రీ లా ఎరోస్ హోటల్లో గురువారం కేజ్రీవాల్ కూతురి నిశ్చితార్థ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులతో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఆప్ నేత మనీశ్ సిసోడియాలు హాజరయ్యారు. ఈ వేడుకలో పుష్ప 2 చిత్రంలోని ‘అంగారో కా అంబర్ సె’ పాటకు సతీమణి సునీతతో కలిసి కేజ్రీవాల్ హుషారుగా స్టెప్పులేశారు. #arvindkejriwal #dancevideo #delhiaap pic.twitter.com/1hObFExoGU— Khushbu Goyal (@kgoyal466) April 18, 2025జనాల గోల మధ్య కేజ్రీవాల్ వేసిన స్టెప్పులు ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యాయి. సుకుమార్ డైరెక్షన్లో పుష్ప రాజ్గా అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా ఎంతటి ఆదరణ దక్కించుకున్నారో తెలియంది కాదు. ఈ చిత్రంలోని పాటలు, డైలాగులు, ఆఖరికి పుష్ప మేనరిజం కూడా జనాలకు బాగా ఎక్కేసింది. మరోవైపు.. వివాహ కార్యక్రమానికి హాజరైన పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా పంజాబీ స్టైల్లో చిందులేసి ఆకట్టుకున్నారు. Punjab CM Bhagwant Mann performing at the engagement ceremony of Kejriwal's daughter in Delhi.#Bhagwantmann #ArvindKejriwal pic.twitter.com/Vy9PqA4Teu— Raajeev Chopra (@Raajeev_Chopra) April 18, 2025పీటీఐ కథనం ప్రకారం.. అరవింద్ కేజ్రీవాల్ కూతురు హర్షిత ఢిల్లీ ఐఐటీలో చదివారు. కాలేజీ రోజుల్లో స్నేహితుడైన సంభవ్ జైన్ ఇష్టపడి వివాహమాడారు. ఇంతకు ముందు ఈ ఇద్దరూ కలిసి బసిల్ హెల్త్ అనే స్టార్టప్ను కూడా నడిపిస్తున్నారు. శుక్రవారం కుటుంబ సభ్యుల సమక్షంలో కపుర్తలా హౌజ్లో వీళ్ల వివాహం జరిగింది. ఈ వేడుకకు కొందరు సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. ఏప్రిల్ 20వ తేదీన రిసెప్షన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. -
బట్టల మిషనా? బంగాళదుంపల మిషనా? వైరల్ వీడియో
వంట చేయడం కంటే.. ప్రిపరేషన్కే ఎక్కువ టైం పడుతుంది. కూర వండాలంటే..చిక్కుడు కాయలు, బీన్స్ గిల్లడం, దొండకాయలు, బెండకాయలు కట్ చేయడం అబ్బో పెద్దపనే కదా. అలాగే బంగాళాదుంపలను తొక్క తీసి శుభ్రం చేయడం అంటే అదో పెద్ద పని. కానీ ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో కనిపించిన మహిళ కేవలం రెండు నిమిషాల్లో వాషింగ్ మెషిన్ సహాయంతో బంగాళాదుంపలు తోలు తీయడం అందర్నీ ఆకర్షించింది.‘ఆమె వాషింగ్ మెషిన్ దగ్గరకు వెళ్లింది. ఆ తరువాత ఏం చేస్తుంది?’ అనే ప్రశ్నకు ఎవరైనా ఇచ్చే జవాబు....‘బట్టలను వాషింగ్ మెషిన్లో వేస్తుంది’ అయితే సదరు మహిళ మాత్రం బట్టలను కాదు బంగాళదుంపలను వేసింది. మన ఆశ్చర్యాన్ని మరింత పెంచేలా మెషిన్ ఆన్ చేసింది. ఆ తరువాత ఏమిటి అనే విషయానికి వస్తే..... తొక్క రహిత బంగాళదుంపలు కనిపించాయి! వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి ‘భేష్’ అని కొందరు కితాబు ఇవ్వగా చాలామంది మాత్రం ‘ఇది సరికాదు’ అని విమర్శించారు. మరికొందరు ‘ఇది ఫేక్ వీడియో’ అన్నారు. बढ़ती हुई तकनीक ने बहुत कामों को बहुत सरल बना दिया है।ये देखो आलू को छीलने वाली मशीन।एक मिनट में कितने सारे आलू छील दिए हैं। pic.twitter.com/gpwu6Y5KG0— kuldeep kumar (@kdgothwal1) April 6, 2025ఎండలను చల్లపుచ్చండి వేసవిలో ఎదురయ్యే సమస్యలలో డీ హైడ్రేషన్ ఒకటి. డీ హైడ్రేషన్కు గురి కాకుండా పుచ్చకాయ తింటే మంచిది. పుచ్చకాయతో లాభాలునీరు ఎక్కువగా ఉండే పుచ్చకాయ ఒంట్లోని టాక్సిన్స్ను తొలగిస్తుందినీరసం, నిస్సత్తువ లేకుండా చేస్తుంది. చెమట రూపంలో కోల్పోయిన నీరు భర్తీ అవుతుంది. పుచ్చలో అమైనో ఆమ్లం ‘సిట్రులిన్’ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది.ఎండలో కమిలిన చర్మానికి పుచ్చపండు గుజ్జు రాస్తే మంచిది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మలబద్ధకం లేకుండా చేస్తుంది.కండరాల నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది. ఎముకలను దృఢంగా ఉంచుతుంది.పుచ్చకాయలో ఎక్కువగా ఉండే ఎ విటమిన్ కంటిచూపును మెరుగుపరుస్తుంది. -
రీల్స్ కోసం ఎక్స్ట్రాలకు పోయి..
సోషల్ మీడియాలో యూజర్ల అటెన్షన్ కోసం వినూత్నంగా ప్రయత్నించే వాళ్లు ఈ మధ్యకాలంలో పెరిగిపోయారు. అదే సమయంలో అధికారిక చానెల్స్ నుంచే ‘సెల్ఫ్ ట్రోలింగ్’తో ఆకట్టుకుంటున్నవాళ్లను ఈ మధ్యకాలంలో చూస్తున్నదే. ఇక.. ప్రజలకు అవగాహన కల్పించే విషయంలో, ఆకతాయిలను హెచ్చరించే విషయంలోనూ పోలీసులూ అస్సలు తగ్గడం లేదు.తాజాగా.. బెంగళూరు సిటీ పోలీసులు(Bengaluru City Police) చేసిన ఓ ట్వీట్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం ఓ వ్యక్తి మాగాడి రోడ్లో పైత్యం ప్రదర్శించాడు. నడిరోడ్డు మధ్యలో కుర్చీ వేసుకుని టీ తాగుతూ రీల్ చేశాడు. ఈ రీల్ జనాల్లోకి విపరీతంగా వెళ్లింది.అయితే ఈ స్టంట్ అతనికే కాదు.. ప్రజల ప్రాణాలకు కూడా ముప్పు కలిగించేదిగా ఉండడంతో బెంగళూరు పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎలాగోలా ట్రేస్ చేసి ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇలాంటి వేషాలు వస్తే కటకటాల వెనక్కి నెడతామంటూ ఓ సినిమాలోని ఫన్నీ సీన్ను జోడించారు. బెంగళూరు పోలీసులు మిమ్మల్ని గమనిస్తుంటారు జాగ్రత్త అంటూ ఓ ఫన్నీ పోస్ట్ చేశారు. Taking tea time to the traffic line will brew you a hefty fine, not fame !!! BEWARE BCP is watching you#police #awareness #weserveandprotect #stayvigilant pic.twitter.com/5A8aCJuuNc— ಬೆಂಗಳೂರು ನಗರ ಪೊಲೀಸ್ BengaluruCityPolice (@BlrCityPolice) April 17, 2025 -
'దయ'కు అసలైన అర్థం..! హృదయాన్ని తాకే ఘటన..
అందరివి బిజీ లైఫ్లు అయిపోయాయి. ఈ హడావిడి జీవితంలో జాలి, దయ దాక్షిణ్యాలకు చోటే లేకుండాపోయింది. ఎవరి స్వార్థం వారిది. అలా లేకపోతే వెనుకబడిపోతాం అనే ఫీల్కి వచ్చేశారు జనాలంతా. మన పొరిగింటివాడితోనే నాలుగు మాటలు కదపని వాళ్లం. ఇక ఇలాంటి వాటి ప్రసక్తే ఏం ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే..నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే..ఒక్కోసారి క్రూరంగా ప్రవర్తించే జంతువులు కూడా విచక్షణ జ్ఞానంతో మసులుకుంటాయాని తెలుస్తోంది. అంతలా దాడి చేయాలనుకుని ఒక్క క్షణం సంయమనంతో వ్యవహరించిన తీరు చూస్తే..ఆహా అడవిలో పెరిగినా.. ప్రకృతి ధర్మానికి కట్టుబడ్డాయి కదూ అనిపిస్తుంది. ఏం జరిగిందంటే..ఒక పెద్ద ఏనుగు ఒక గడ్డి మైదానంలో పిల్లలతో సేద తీరి ఉన్న సింహాన్ని చూసి దాడి చేసేందుకు వస్తుంది. అది చూసి సింహం ఆశ్చర్యపోతుంది. ఏం చేయాలో తోచదు. ఎందుకంటే దాని వద్ద ఉన్న చిన్న పిల్లలను వదిలి ఎలా వెళ్లాలో తెలియక ఒక్క నిమిషం అలా షాక్లో ఉండిపోతుంది. కొద్ది వ్యవధిలోనే తేరుకుని బాధతో ముగ్గురు పిల్లల్లో ఒక్క పిల్లనే నోట కరుచుకుని పారిపోతుంది. అయితే ఆ ఏనుగు కూడా అంత కోపంతో దాడి చేయడానికి వచ్చిందల్లా ఆ సింహం పిల్లలను చూసి కోపాన్ని తమాయించుకుని ఆగిపోయి వెనక్కి టర్న్ అవుతుంది. ముక్కుపచ్చలారని చిన్న పిల్లల జోలికి పోకూడదన్న ఆ ఏనుకు విచక్షణ తీరుకి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. దయ అనే పదానికి ఇది కదా అసలైన అర్థం అనిపిస్తుంది. మనుషుల తప్ప పశుపక్షాదులు, జంతువులు వీటిని పాటిస్తాయని పలు ఉదంతాలు నిరూపించాయి కూడా. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోపై ఓ లుక్కేయండి. Elephant attacks the lioness but spares cubs pic.twitter.com/0pU8uIi7BQ— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) April 6, 2025 (చదవండి: Kushboo Sundar: 20 కిలోలు తగ్గిపోయిన ఖుష్బూ.. అందుకోసం ఏం చేసిందంటే?) -
Puri Jagannath Temple : ఆలయ జెండాతో గద్ద ప్రదక్షిణలు వీడియో వైరల్
ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి (Puri Jagannath temple) ఆలయంలో అద్భుతమైన ఘటన చోటుచేసుకుంది. శ్రీమందిర్ ఆలయ శిఖరంపై ఉన్న పవిత్రమైన జెండాను ఒక గద్ద తన ముక్కుతో పట్టుకుని ఆకాశంలో ప్రదక్షిణ చేసింది. ఈ అసాధారణ ఘటన భక్తులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇది అనర్థమా, శుభసూచికగా అనేక చర్చకు దారితీసింది ఇది భక్తులను విపరీతంగా ఆకర్షించడంతో ఈ వీడియో వైరల్గా మారింది. ఇదీ చదవండి: షారూక్ ఖాన్ భార్య హోటల్లో ఫేక్ పనీర్ ఆరోపణల దుమారం : టీం స్పందనపూరీ ఆలయ శిఖరంపై ఉన్న (Neela Chakra) నీలచక్రంపైన ఎగిరే జెండాను ముక్కున కరుచుకుని ఓ గద్ద ఆకాశంలో చక్కర్లు కొట్టింది. పూరీకి వచ్చే భక్తులు పవిత్రంగా భావించే ఆ జెండాను దర్శనం చేసుకుని , తరించడం ఆనవాయితీ. అలాంటిది ఇపుడు శ్రీమహావిష్ణువు వాహనమైన గద్ద తన ముక్కుతో ఈ జెండాను జాగ్రత్తగా పట్టుకుని, ఆకాశంలో ప్రదక్షిణం చేయడం విశేషంగా మారింది. ఈ దృశ్యం కెమెరాలో రికార్డ్ అయింది. ఇది దైవిక సంకేతంగా భక్తులు భావించారు.What is going to happen?Eagle takes away flag from Jagannath Temple pic.twitter.com/0AzUZb1uDE— Woke Eminent (@WokePandemic) April 13, 2025 నెటిజన్లు స్పందనఆలయ జెండాను పోలి ఉన్నప్పటికీ, ఆ వస్త్రం నిజానికి జగన్నాథ ఆలయానికి చెందినదా లేదా కేవలం ఒక సాధారణ గుడ్డ ముక్కేనా అనేది ఇంకా నిర్ధారించలేదు. ఆన్లైన్లో చర్చలకు దారి తీసింది. "జగన్నాథ ఆలయం నుండి ఒక గద్ద పవిత్ర జెండాను తీసుకెళ్లినప్పుడు, అది దొంగతనం కాదనీ, అది స్వర్గపు సందేశం. జగన్నాథుని ఆశీర్వాదాలతో గరుడుడు స్వయంగా స్వర్గానికి ఎక్కినట్లుగా. దైవిక జోక్యం, పునరుద్ధరణ ,క్తివంతమైన మార్పుకు సంకేతమన్నవాదనలు వినిపించాయి. సోషల్ మీడియాలో వేలాదిమంది భక్తులు దీన్ని షేర్ చేయడంతో ఇది వైరల్గా మారింది. “PuriJagannathEagle” హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లో నిలిచింది, ఈ ఘటన జగన్నాథుని అనుగ్రహంగా కొంతమంది భావించారు.‘జగన్నాథుని కృప’’, ‘‘గరుడ దర్శనం’’ వంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. మరోవైపు ఈ ఘటనను సహజమైనదని కామెంట్ చేశారు. దాన్ని ఆహారంగానో, మరేదో ఆసక్తికరమైన వస్తువుగా గద్ద భావించి ఉండవచ్చని వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా ఈ ఘటనతో ఒడిశాలోని భారతదేశంలోని అత్యంత పవిత్రమైన క్షేత్రాల్లో ఒకటైన పూరీ జగన్నాథ ఆలయం ఒక్కసారి చర్చల్లో నిలిచింది. ఆలయ వైభవాన్ని, ఖ్యాతిని పలువురు గుర్తుచేసుకున్నారు. చదవండి: రెండో పెళ్లి చేసుకున్న ప్రముఖ యాంకర్, ఫోటోలు వైరల్ -
కశ్మీర్ను మరిచిపోయే ప్రసక్తే లేదు: పాక్ ఆర్మీ చీఫ్
కశ్మీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్(General Asim Munir) భారత్ వ్యతిరేక వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. భారత్, పాకిస్థాన్లు సిద్ధాంతాల పరంగా వేర్వేరు దేశాలేనన్న ఆయన.. కశ్మీర్ను ఇస్లామాబాద్కు గళ సిరగా అభివర్ణించారు. ఈ క్రమంలో పాక్ ఎట్టి పరిస్థితుల్లోనూ కశ్మీర్ను మరిచిపోదని, ఏ శక్తీ దానిని పాక్ నుంచి వేరు చేయలేదని వ్యాఖ్యానించారు. అలాగే దేశ విభజనకు కారణమైన రెండు దేశాల విభజనను సమర్థిస్తూ తీవ్ర వ్యాఖ్యలూ చేశారు. పాక్ మీడియా హౌజ్ డాన్(dawn) కథనం ప్రకారం.. తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన జనరల్ మునీర్ మాట్లాడారు. ఉగ్రకార్యకలాపాలతో పాక్ నిధులు రావనే భయాలు నెలకొన్నాయని.. కానీ, ఆ భయాలను తొలగించే ప్రయత్నాల్లో పాక్ సైన్యం ఉందని అన్నారు. ఉదాహరణగా.. బెలూచిస్తాన్, కశ్మీర్ అంశాలను(Kashmir Issue) ప్రస్తావించారు. పాక్కు బెలూచిస్తాన్ ఎంతో గర్వకారణమైంది. అలాంటి ప్రాంతంలో వేర్పాటువాద ఉద్యమాలను పాక్ సైన్యం సమర్థవంతంగా అణచివేసింది. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాల కారణంగా పెట్టుబడులు రాకపోవచ్చనే భయాలు ఉన్నాయి. కానీ, ఉగ్రవాదులు దేశ భవిష్యత్తును మార్చగలరా?. త్వరలో పూర్తి విజయం సాధిస్తాం. ఇంకో పది జన్మలెత్తినా ఆ ప్రాంతాన్ని మనకు ఎవరూ దూరం చేయలేరు. ఇక.. కశ్మీర్పై తమ ఆశ చావదన్న పాక్ ఆర్మీ చీఫ్(Pak Army Chief).. అది మాకు గళ సిర(జగ్యులర్ సిర) అని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మరిచిపోలేమని, కశ్మీరీ సోదరుల వీరోచిత పోరాటాలను అంత సులువుగా వదిలిపెట్టబోమని, ఏ శక్తీ దానిని పాక్ నుంచి వేరు చేయలేదని వ్యాఖ్యానించారు. పాక్ గురించి తర్వాతి తరాలకు ఎంతో చెప్పాల్సిన అవసరం ఉందన్న జనరల్ మునీర్.. మతం, సంప్రదాయాలు, ఆలోచనలు, లక్ష్యాలు.. ఇలా ప్రతీ విషయంలోనూ హిందువులతో మనం(ముస్లిం) వేరనే విషయం తెలియజేయాల్సిన బాధ్యత ఉందంటూ పాక్ పౌరులకు సూచించారు. ఇదే రెండు దేశాల సిద్ధాంతానికి పునాది వేసింది అని అన్నారాయన. ఏరకంగా ఈ రెండు దేశాలు ఒక్కటి కాదని.. అందుకే తమ పూర్వీకులు పాక్ కోసం పోరాడారని వ్యాఖ్యానించారు. ఇలాంటి దేశాన్ని ఎలా రక్షించుకోవాలనే దానిపైనే దృష్టిసారించాలని అన్నారు. ఈ వ్యాఖ్యలకు భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి!.Ugh! I thought General Musharraf was the worst, but this COAS takes the cake. The whole bakery. General Asim Munir. pic.twitter.com/t8eVYukQqG— Smita Prakash (@smitaprakash) April 16, 2025 -
లావణ్యపై దాడి చేయించిన రాజ్ తరుణ్ పేరెంట్స్
-
టైంకి ఇంటికి చేరుకోకపోతే ఆమె నన్ను..! వైరల్గా పైలట్ అనౌన్స్మెంట్
విమానంలో వెళ్లేటప్పుడూ..ప్రయాణికులు సేఫ్టీ కోసం పైలట్లు, అక్కడ సిబ్బంది మనకు కొన్ని సూచనలిస్తుంటారు. అలాగే జర్నీ పూర్తి అవుతుందనగా.. సేఫ్ ల్యాండింగ్ కోసం ప్రకటనలు చేస్తుంటారు. అయితే అలానే ఇక్కడొక పైలట్ కూడా ఒక ప్రకటన వెల్లడించాడు. అయితే అది ఎంత ఫన్నీగా ఉందంటే..జర్నీ బడలిక అంత ఉఫ్మని ఎగిరిపోయినంత ఆహ్లాదంగా ఉంది. ఇంతకీ అతడేం అనౌన్స్మెంట్ ఇచ్చాడంటే..ఇదంతా డెల్టా ఎయిర్లైన్స్ విమానంలో చోటుచేసుకుంది. సురక్షితమైన ల్యాండింగ్ కోసం ప్రయాణికులకు భరోసా ఇచ్చేలా అనౌన్స్మెంట్ చేస్తుంటారు పైలట్లు. అది సర్వసాధారణం. అయితే ఇక్కడ ఈ పైలట్ ఇచ్చిన అనౌన్స్మెంట్ అత్యంత విభిన్నంగా నవ్వు తెప్పించేలా ఉంది. సదరు పైలట్ మాట్లాడుతూ.."నాకు పెళ్లై 33 సంవత్సరాలు. భార్య, నలుగురు పిల్లలు, రెండు కుక్కలు, ఎనిమిది కోళ్లు ఉన్నాయి. నాబార్య ఈ చలిలో వాటిని చూసుకుంటూ అలిసిపోతుంది. అందువల్ల కచ్చితంగా శుక్రవారం సాయంత్రం కల్లా నేను ఇంటికి వెళ్లాల్సిందే. ఎందుకంటే ఆ కోళ్లను చూసుకోవాల్సింది నేనే కాబట్టి. అదీగాక నేను గనుక ఇంటికి సమయానికి చేరుకోకపోతే ఆమె నన్ను చంపేస్తుంది అందువల్ల మనం కచ్చితంగా సేఫ్గా ల్యాండ్ అవుతామని హామీ ఇస్తున్నా..! అని అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఆ ప్రకటన విన్న ప్రయాణికులు ఒక్కసారిగా షాకయ్యి..ఏం అనౌన్స్మెంట్ అంటూ అందరి ముఖాల్లో ఒక్కసారిగా నవ్వులు మెరిశాయి. జర్నీ చేసిన అలసట కూడా ఎగిరిపోయి ఉత్సాహంతో ఉన్నారంతా. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఏం చెప్పాడబ్బా..! అంటూ పైలట్ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Liz Chan (@liz.chann) (చదవండి: Sachin Tendulkar: ఇంత స్వచ్ఛంగా ఉంటే ఫిల్టర్లు ఎందుకు? సచిన్ మనుసుదోచిన గ్రామం..) -
ఆ గ్రామం స్వచ్ఛతకు క్రికెటర్ సచిన్ ఫిదా..!
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. తన మనసుకి హత్తుకున్న వంటకాలు, ప్రదేశాల గురించి షేర్చే స్తుంటారు. అలానే ఈసారి తన మేఘాలయ పర్యటనలో తనను ఎంతో ఇంప్రెస్ చేసిన గ్రామం గురించి తన అభిమానులతో పంచుకున్నారు. అంతేగాదు అందుకు సంబధించిన వీడియోని కూడా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు.సచిన్ని అంతలా ఆకర్షించిన గ్రామమే మేఘాలయలోని మావ్లిన్నాంగ్. ఇది ఆసియాలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా పేరుతెచ్చుకుంది. ఆ వీడియోలో సచిన్ మావ్లిన్నాంగ్ గ్రామంలో తిరుగుతూ..స్థానికులతో కాసేపు ముచ్చటించారు. అలాగే ఆ ప్రదేశం గురించి మరింత తెలుసుకునే యత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది కూడా. అక్కడ కలియ తిరుగుతుంటే..పచ్చదనంతో నిండిన పరిసరాల్లో తిరుగుతున్నట్లు ఉందని మెచ్చుకున్నారు. అక్కడ చుట్టు పక్కల పరిసరాలు నన్నుఎంతాగనో కట్టిపడేశాయని అన్నారు. అంతేగాక అక్కడ ఉండే స్థానిక పిలల్లతో ఫోటోలకి ఫోజులు కూడా ఇచ్చారు సచిన్. అలాగే పోస్ట్లో ఏ గ్రామం అయినా మావ్లిన్నాంగ్ లాగా అందంగా ఉంటే ఫ్లిల్టర్లతో పనేంముంటుంది. పరిసరాలు ఇంత స్వచ్ఛంగా ఉంటే..అంతరంగంలో కూడా ఆటోమేటిగ్గా ప్రశాంతతతో కూడిన ఆనందం సొంత అవుతుందంటూ సంతోషం వ్యక్తం చేశారు. మావ్లిన్నాంగ్ గ్రామం ప్రత్యేకత..ఇది దేవుని స్వంత తోటగా పిలిచి అందమైన ప్రదేశం. అంతేగాదు డిస్కవర్ ఇండియా మ్యాగజైన్ దీనిని ఆసియాలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా పేర్కొంది. ఇది తూర్పు ఖాసీ కొండలలో ఉంది. ఆ అందమైన ప్రాంతం ఖాసీ ప్రజలకు నిలయం. అక్కడ ప్రజల తమ సాంప్రదాయ జీవనశైలికి కట్టుబడి ఉండటం వల్ల ఈ ప్రాంతాన్ని ఇంతలా పరిశుభ్రంగా ఉంచడంలో సఫలమయ్యారని చెప్పొచ్చు. ఇక్కడ ఉండే వివిధ పండ్ల తోటలు, ప్రవహించే వాగులు, సతత హరిత వృక్షసంపద సమతుల్యతకు పెద్దపీట వేసినట్లుగా ఉంటాయి. అలాగే ఇక్కడ ఉండే దట్టమైన అడువులు సుందరమైన ప్రకృతి దృశ్యాన్ని అందించేలా కొండలతో పెనవేసుకుని ఉంటాయి. ముఖ్యంగా టూరిస్టులను అత్యంత ఆకర్షించే పర్యాటక ప్రాంతాల్లో ఇది ఒకటి. ఇక్కడ అత్యంత ఫేమస్ నోహ్వెట్ లివింగ్ రూట్ బ్రిడ్జి. ఇది ఫికస్ ఎలాస్టికా చెట్టు వేళ్లతో ఏర్పరిచి సంక్లిష్టమైన బ్రిడ్జి. దీని వల్లే అక్కడ ప్రజలు వివిధ భూభాగాలకు సులభంగా ప్రయాణించగలుగుతున్నారు. పైగా ఈబ్రిడ్జ్ పొడవు, నిర్మాణం కూడా ఆశ్చర్యానికిలోను చేస్తుందట. View this post on Instagram A post shared by Sachin Tendulkar (@sachintendulkar) (చదవండి: -
నాన్న అంటే అంతేరా...! వైరల్ వీడియో
టాలాంట్ చూపించడంలో మనోళ్ల తర్వాతే ఎవరైనా. ఎలాంటి దాన్నైనా వెరైటీగా వాడాలంటే కొంచెం బుర్ర వాడాలి. ఈ వాడకంలో మనోళ్లు మామూలోళ్లు కాదు. అసలేంటి ఇదంతా అనుకుంటున్నారా? సరే. సూటిగా సుత్తిగా లేకుండా విషయంలోకి వెళ్లిపోదాం. తెలుగు రాపర్ రోల్ రిడా ఒక వీడియోను షేర్ చేశాడు. ఇదే ఇపుడు నెట్టింట తెగ సందడి చేస్తోంది. View this post on Instagram A post shared by Roll Rida (@rollrida) ఇంతకీ ఈ వీడియోలో ఏముందీ అంటే పిల్లలను వెనకి కూర్చోబెట్టుకుని ఝాం అంటూ వెళ్లి పోతున్నాడో డాడీ. అయితే ఏంటట అంటూ అప్పుడే ఫిక్స్ అయిపోవద్దు. ఇక్కడే ఉంది అసలు కత అంతా... సాధారణంగా సీటుపై కూర్చొంటే వింతేముంది. కోడి, ఇతర పక్షులను తీసుకెళ్లే ఒక బుట్ట ( పౌల్ట్రీ క్యారియర్) లాంటిది దాంట్లో వీల్ళద్దర్నీ కూర్చోబెట్టాడన్నమాట. ఈ పౌల్ట్రీ క్యారియరే నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. జస్ట్ కిడ్..డ్డింగ్ అనే క్యాప్షన్ కూడా దీనికి. రోల్ రిడా "ఇది భారతదేశంలో మాత్రమే జరుగుతుంది" అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఇదీ చదవండి: వ్యాపారవేత్తతో బిగ్బాస్ బ్యూటీ ఎంగేజ్మెంట్ : ఫోటోలు వైరల్ఈ వీడియో ఇప్పటికే 30 లక్షలకు పైగా వ్యూస్ సంపాదించుకుంది. దీనిపై నెటిజన్లు అనేక కమెంట్లు చేస్తున్నారు. "కోళ్ల సమాజం హర్ట్ భయ్యా" అంటూ ఒకరు ఫన్నీగా కమెంట్ చేశారు. మరొకరు తండ్రి క్రియేటివ్ ఆవిష్కరణను మెచ్చుకోగా, "అమ్మ కంటే నాన్న ఎప్పుడూ భిన్నంగా ఆలోచిస్తాడు" అని మరొకరు అన్నారు. బైక్ నంబర్ ప్లేట్ అది ఆంధ్రప్రదేశ్కు చెందిన బైక్గా భావిస్తున్నప్పటి, ఇది ఎక్కడిది అనేది ఖచ్చితమైన తెలియదు. -
అంతరిక్షంలోకి మహిళల టీమ్.. సింగర్ కేటీ పెర్రీ ఏం చేసిందంటే..
అంతరిక్ష పర్యాటకానికి ఊపు తెచ్చే దిశగా ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ మరో ముందడుగు వేసింది. మహిళా సెలబ్రిటీలతో 11 నిమిషాల బుల్లి రోదసి యాత్రను సోమవారం విజయవంతంగా నిర్వహించింది. బెజోస్ కాబోయే భార్య లారెన్ శాంచెజ్తో పాటు ప్రఖ్యాత అమెరికా గాయని కేటీ పెర్రీ, జర్నలిస్టు గేల్ కింగ్, సినీ నిర్మాత కెరియన్ ఫ్లిన్, సైంటిస్టు అమందా గుయెన్, నాసా మాజీ ఇంజనీర్ ఆయేషా బోవ్ ఇందులో భాగస్వాములయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.బ్లూ ఆరిజన్ సంస్థకు చెందిన న్యూ ఫెపర్డ్ వ్యోమనౌక NS-31 ద్వారా ఈ యాత్ర సాగింది. ఏప్రిల్ 14న సోమవారం పశ్చిమ టెక్సాస్ నుంచి ఇది ఆరంభమైంది. ఈ వ్యోమనౌక నింగిలో 107 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అంతరిక్ష సరిహద్దు అయిన కర్మాన్ రేఖను కూడా దాటగా, మహిళా ప్రముఖులు అంతా అక్కడ భార రహితస్థితిని ఆస్వాదించారు. మొత్తంగా 11 నిమిషాలు పాటు సాగిన ఈ యాత్ర సాగింది. అనంతరం ఈ వ్యోమనౌక భూమికి తిరిగొచ్చింది. బ్లూ ఆరిజిన్కు ఇది 11వ మానవసహిత అంతరిక్ష యాత్ర. ✨ Weightless and limitless. pic.twitter.com/GQgHd0aw7i— Blue Origin (@blueorigin) April 14, 2025అయితే, ఈ అంతరిక్ష యాత్ర సందర్బంగా వ్యోమనౌకలో ఉన్న మహిళలు ఎంజాయ్ చేశారు. వారంతా భార రహిత స్థితిలోకి వెళ్లిన తర్వాత ఆనందం వ్యక్తం చేశారు. ఇక, రోదసి నుంచి కిందకు దిగిన తర్వాత అమెరికా గాయని కేటీ పెర్రీ ఆనందంతో భూమిని ముద్దాడారు. వీరికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.A smooth landing in West Texas. Book your flight on New Shepard: https://t.co/RP3Lixyr4Y pic.twitter.com/xPiu9LMtlH— Blue Origin (@blueorigin) April 14, 2025 ఇదిలా ఉండగా.. బ్లూ ఆరిజిన్ సంస్థ 2000 సంవత్సరంలో ఏర్పాటైంది. ఈ సంస్థకు ఇది 11వ అంతరిక్ష యాత్ర. అమెరికాకు సంబంధించి పూర్తిగా మహిళలతో రోదసి యాత్రను నిర్వహించడం ఇదే తొలిసారి. 2021వ సంవత్సరం నుంచి బ్లూ ఆరిజిన్ సంస్థ రోదసి యాత్ర నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు మొత్తంగా 10 మిషన్లు చేపట్టగా, 52 మందిని అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. REPLAY: A New Shepard tradition pic.twitter.com/dSexRmoZl7— Blue Origin (@blueorigin) April 14, 2025 ‘YOUR KISS IS COSMIC 🎶’US pop star Katy Perry kissed the ground after returning to Earth following a flight aboard Blue Origin’s New Shepard NS-31. The rocket soared past the Kármán line—the internationally recognized boundary of space—before landing safely in Van Horn, West… pic.twitter.com/1PjjDWD2v4— Philstar.com (@PhilstarNews) April 15, 2025 -
సినిమా రేంజ్ మావా.. నడి రోడ్డుపై వాటర్ ట్యాంకర్ పల్టీలు
బెంగళూరు: బెంగళూరు నగరంలో పట్టపగలే సినిమా రేంజ్ రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అతి వేగంలో ఉన్న వాటర్ ట్యాంకర్ మరో వాహనాన్ని ఓటర్ టేక్ చేసే క్రమంలో అదుపు తప్పింది. దీంతో, నడిరోడ్డుపై మూడు పల్టీలు కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల ప్రకారం.. వాటర్ ట్యాంకర్ వర్తూర్ వైపు నుంచి దొమ్మసాంద్రకు నీటిని తీసుకెళ్తోంది. ఈ క్రమంలో సదరు వాటర్ ట్యాంకర్ డ్రైవర్ ముందు వెళ్తున్న వాహనాలను ఓటర్ టేక్ చేశాడు. ఒక్కసారిగా వేగం పెరగడంతో ట్యాంకర్ వాహనం అదుపు తప్పింది. దీంతో, వాహనం ప్రమాదానికి గురైంది. సినిమా రేంజ్లో పల్టీలు కొడుతూ.. రోడ్డుపై పడిపోయింది. ట్యాంకర్లో ఉన్న నీళ్లు ఎగిరిపడ్డాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఇక, ఈ ప్రమాదం కారణంగా ట్యాంకర్ డ్రైవర్, వాహనంలో ఉన్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. A water tanker overturned on #Dommasandra-#Varthur Main Road in #Bengaluru earlier today, causing a major disruption to traffic in the area.According to eyewitnesses, the driver lost control of the vehicle, leading to the accident.Passersby and local residents quickly rushed… pic.twitter.com/sPtLTr6Hpg— Hate Detector 🔍 (@HateDetectors) April 14, 2025 -
DC VS MI: కరుణ్ నాయర్తో బుమ్రా వాగ్వాదం.. సారి చెప్పినా పట్టించుకోని వైనం
ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య నిన్న (ఏప్రిల్ 13) జరిగిన మ్యాచ్లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఎప్పుడూ ఎవరితో గొడవ పడని ముంబై పేసర్ జస్ప్రీత్ బుమ్రా సహనాన్ని కోల్పోయాడు. ఢిల్లీ బ్యాటర్ కరుణ్ నాయర్తో వాగ్వాదానికి దిగాడు. కరుణ్ సారీ చెప్పినా పట్టించుకోలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది.The average Delhi vs Mumbai debate in comments section 🫣Don't miss @ImRo45 's reaction at the end 😁Watch the LIVE action ➡ https://t.co/QAuja88phU#IPLonJioStar 👉 #DCvMI | LIVE NOW on Star Sports Network & JioHotstar! pic.twitter.com/FPt0XeYaqS— Star Sports (@StarSportsIndia) April 13, 2025ఇంతకీ ఏం జరిగిందంటే.. ముంబై నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదిస్తుండగా (ఇన్నింగ్స్ 6వ ఓవర్ చివరి బంతికి) కరుణ్ పరుగు తీసే క్రమంలో బౌలింగ్ చేస్తున్న బుమ్రాను పొరపాటున ఢీకొట్టాడు. దీనికి కరుణ్ వెంటనే క్షమాపణ చెప్పినా బుమ్రా పట్టించుకోలేదు. కరుణ్పై నోరు పారేసుకున్నాడు. హార్దిక్ కల్పించుకుని కరుణ్కు సర్ది చెప్పాడు. బుమ్రా-కరుణ్ మధ్య వాగ్వాదాన్ని నిశితంగా గమనిస్తున్న రోహిత్ శర్మ తనదైన శైలిలో కామెడీ చేస్తూ కనిపించాడు.పొరపాటున జరిగిన దానికి కరుణ్ సారీ చెప్పినా బుమ్రా పట్టించుకోకపోవడానికి కారణం వేరే ఉంది. ఆ ఓవర్లో, అంతకుముందు ఓవర్లో కరుణ్ బుమ్రాను చెడుగుడు ఆడుకున్నాడు. బుమ్రాను ఎదుర్కొన్న 9 బంతుల్లో కరుణ్ 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 26 పరుగులు చేశాడు. కెరీర్లో ఏ బ్యాటర్ బుమ్రాను ఇంతలా చితక్కొట్టలేదు. Nair fire against Bumrah 🔥pic.twitter.com/3D6kjyR5lx— Delhi Capitals (@DelhiCapitals) April 13, 2025బుమ్రా అత్యంత వేగంతో సంధిస్తున్న బంతులను కరుణ్ సునాయాసంగా బౌండరీలు, సిక్సర్లుగా తరలించాడు. ఇదే కోపంతో బుమ్రా కరుణ్పై నోరు పారేసుకున్నాడు. బుమ్రాతో వాగ్వాదం జరిగే సమయానికి కరుణ్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. రెండేళ్ల విరామం తర్వాత ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన కరుణ్ కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో కరుణ్ ట్రెంట్ బౌల్ట్పై కూడా ఇదే తరహా విరుచుకుపడ్డాడు. ఆ ఓవర్లో కరుణ్ మూడు బౌండరీలు బాదాడు. కరుణ్ దెబ్బకు హార్దిక్ బౌల్ట్ను బౌలింగ్ నుంచి తప్పించి మళ్లీ చివర్లో బరిలోకి దించాడు. ఈ మ్యాచ్లో కరుణ్ కర్ణ్ శర్మ, హార్దిక్ పాండ్యాను కూడా వదిలి పెట్టలేదు. హార్దిక్ బౌలింగ్లో 2 సిక్సర్లు, ఓ ఫోర్.. కర్ణ్ శర్మ బౌలింగ్లో ఓ సిక్సర్, 2 ఫోర్లు బాదాడు.ఈ మ్యాచ్లో కరుణ్ చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆడినా ఢిల్లీ ఓటమిపాలైంది. గెలవాల్సిన మ్యాచ్లో ఢిల్లీ ఒత్తిడికి లోనై చేజేతులా ఓటమిని కొని తెచ్చుకుంది. ఢిల్లీ మరో ఓవర్ మిగిలుండగానే చివరి మూడు వికెట్లు రనౌట్ల రూపంలో కోల్పోయి 12 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. సింగిల్స్ తీసుకుని స్ట్రయిక్ రొటేట్ చేసుకున్నా ఢిల్లీకి విజయాకాశాలు ఉండేవి. అయితే లోయర్ ఆర్డర్ బ్యాటర్లు లేని రెండో పరుగులకు ప్రయత్నించి వికెట్లు పారేసుకున్నారు. కరుణ్ ఔటయ్యాక (13వ ఓవర్లో) కొత్త బంతి తీసుకోవడం కూడా ముంబైకి కలిసొచ్చింది. కొత్త బంతితో కర్ణ్ శర్మ, సాంట్నర్, బౌల్ట్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు కీలకమైన స్టబ్స్, కేఎల్ రాహుల్, విప్రాజ్ నిగమ్ వికెట్లు తీశారు. ఫలితంగా చివరి రెండు ఓవర్లకు ముందు ఢిల్లీ బ్యాటర్లు ఒత్తిడికి లోనై రనౌట్ల రూపంలో వికెట్లు సమర్పించుకున్నారు. 3 వికెట్లు తీసిన కర్ణ్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్ వర్మ (59), ర్యాన్ రికెల్టన్ (41), సూర్యకుమార్ యాదవ్ (40), నమన్ ధీర్ (38) రాణించగా.. రోహిత్ శర్మ (18) మరోసారి విఫలమయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్ తలో రెండు వికెట్లు తీయగా.. ముకేశ్ కుమార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న అభిషేక్ తల్లి వ్యాఖ్యలు.. ఆరెంజ్ ఆర్మీ మస్త్ ఖుష్
క్రికెట్ ప్రేమికుల్లో.. ముఖ్యంగా ఆరెంజ్ ఆర్మీలో ఎక్కడ చూసినా అభిషేక్ శర్మ నామస్మరణే.. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ సందర్భంగా ఈ పంజాబీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తనలోని మాస్టర్ క్లాస్ను వెలికి తీసి విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు.గత కొన్నాళ్లుగా కొనసాగుతున్న తన వైఫల్యాలకు తెర దించుతూ బీస్ట్ మోడ్లోకి వెళ్లిపోయి.. భారీ సెంచరీ సాధించాడు. కేవలం నలభై బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్న అభిషేక్.. ఐపీఎల్లో సన్రైజర్స్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన తొలి క్రికెటర్గా, ఓవరాల్గా మూడో ప్లేయర్గా చరిత్రకెక్కాడు.మొత్తంగా ఈ మ్యాచ్లో యాభై ఐదు బంతులు ఎదుర్కొన్న అభిషేక్ శర్మ .. పద్నాలుగు ఫోర్లు, పది సిక్సర్ల సాయంతో 141 పరుగులు సాధించాడు. తద్వారా ఐపీఎల్ మ్యాచ్ ఛేజింగ్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత ఆటగాడిగానూ ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఆల్టైమ్ రికార్డు సాధించాడు.ఇలా తన సుడిగాలి ఇన్నింగ్స్తో సన్రైజర్స్ హైదరాబాద్ను గెలిపించి.. తిరిగి విజయాల బాట పట్టించాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సహచర ఆటగాళ్లు, సన్రైజర్స్ ఫ్యామిలీతో పాటు అతడి కుటుంబం కూడా సంతోషంలో తేలియాడుతోంది.𝘼 𝙣𝙤𝙩𝙚-𝙬𝙤𝙧𝙩𝙝𝙮 𝙏𝙊𝙉 💯A stunning maiden #TATAIPL century from Abhishek Sharma keeps #SRH on 🔝 in this chase 💪Updates ▶ https://t.co/RTe7RlXDRq#TATAIPL | #SRHvPBKS | @SunRisers pic.twitter.com/ANgdm1n86w— IndianPremierLeague (@IPL) April 12, 2025కావ్యా మారన్తో కలిసి సంబరాలు ఇక అభి తల్లిదండ్రులు మంజు శర్మ, రాజ్కుమార్ శర్మ.. తమ కుమారుడి సెంచరీ పూర్తి కాగానే రైజర్స్ యజమాని కావ్యా మారన్తో కలిసి సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రైజర్స్ విజయానంతరం అభిషేక్ శర్మ తల్లి మంజు శర్మ పుత్రోత్సాహంతో పొంగిపోయారు.జైత్రయాత్ర కొనసాగుతుంది‘‘ఈరోజు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు.. నేను కూడా ఎంతో ఆనందంగా ఉన్నాను.. మొత్తం హైదరాబాద్ అంతా సంతోషంతో నిండిపోయింది.. మనం మ్యాచ్ గెలిచాం.. ఇన్నాళ్లు కాస్త మనకు బ్రేక్ పడింది... ఇకపై అలాంటిదేమీ ఉండబోదు.. జైత్రయాత్ర కొనసాగుతుంది’’ అని మంజు శర్మ ఆరెంజ్ ఆర్మీకి మాటిచ్చారు.ఈ మేరకు ఆమె చేసిన వ్యాఖ్యలు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. అమ్మ ఆశిర్వాదం ఉంటే ఏదైనా సాధ్యమే అంటూ ఆరెంజ్ ఆర్మీ ఫుల్ ఖుషీ అయిపోతూ.. ఇందుకు సంబంధించిన వీడియోను వైరల్ చేస్తున్నారు. కాగా ఐపీఎల్-2025లో ఆరంభ మ్యాచ్లో గెలిచిన సన్రైజర్స్.. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్లు ఓడిపోయింది.అయితే, సొంత మైదానం ఉప్పల్లో పంజాబ్ కింగ్స్తో శనివారం నాటి మ్యాచ్లో మాత్రం సత్తా చాటింది. తమదైన దూకుడు శైలితో పంజాబ్ విధించిన 246 పరుగుల లక్ష్యాన్ని.. 18.3 ఓవర్లలోనే ఊదేసింది. తద్వారా శ్రేయస్ అయ్యర్ సేనపై కమిన్స్ బృందం ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి.. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి చేరుకోగలిగింది.ఐపీఎల్-2025: సన్రైజర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్👉టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్.. మొదట బ్యాటింగ్👉పంజాబ్ కింగ్స్ స్కోరు: 245/6 (20)👉హైదరాబాద్ స్కోరు: 247/2 (18.3)👉ఫలితం: పంజాబ్పై ఎనిమిది వికెట్ల తేడాతో సన్రైజర్స్ గెలుపుచదవండి: అతడి బ్యాటింగ్కు వీరాభిమానిని.. వాళ్లంతా అద్భుతం: కమిన్స్Mother's blessings ✨Hyderabad's joy 😇Abhishek Sharma's whirlwind night to remember 🧡Describe his knock in one word ✍️#TATAIPL | #SRHvPBKS | @SunRisers | @IamAbhiSharma4 pic.twitter.com/yJwBK5bAiD— IndianPremierLeague (@IPL) April 12, 2025 -
అనంత్ లవ్యూ, సర్ప్రైజ్ కేక్ కట్, వీడియో వైరల్
దేశీయ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ సామ్రాజ్యవారసుడు, బిలియనీర్ అనంత్ అంబానీ పుట్టిన రోజంటే ఓ రేంజ్ ఉండాలి. అతిరథమహారథులు, సెలబ్రిటీలు, విశిష్ట అతిథులు..ఇలా బోలెడంతా హంగామా, హడావిడి ఉండాలి అనుకోవడంలో, ఉండటంలో సందేహం లేదు. కానీ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా, అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఈసారి ఇందుకు భిన్నంగా వ్యవహరించాడు. తన పుట్టిన రోజు వేడుకల్లో అభిమానులందర్నీ సర్ప్రైజ్ చేశాడు. దీనికి సంబందించిన వీడియో ఒకటి నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఏమిటబ్బా అది? నెట్టింట వైరల్గా మారిన ఆ వీడియో విశేషాలేంటో తెలుసుకుందాం రండి! అనంత్ అంబానీ (Anant Ambani) ఇటీవల (ఏప్రిల్ 10న) తన 30వ పుట్టినరోజును జరుపుకున్నారు. గుజరాత్లోని జామ్నగర్ నుంచి ద్వారకాధీశ ఆలయానికి అనంత్ అంబానీ 170 కి.మీల పాదయాత్ర చేసిన మరీ తన బర్త్డే వేడుకలకు ఒక ఆధ్మాత్మిక వైభవాన్ని తీసుకొచ్చారు. తనకెంతో విశ్వాసమైన భద్రతా సిబ్బంది మధ్య కేక్ కట్ చేయడం విశేషంగా నిలిచింది. అనేకమంది నెటిజన్ల ప్రశంసలందుకుంది. ఆ క్షణం అనంత్ చూపించిన ఆప్యాయత, సర్ప్రైజ్ అందరినీ ఆకర్షించింది. నల్లటి పట్టు కుర్తా పైజామాలో మెరిసిపోతున్న బర్త్డే బోయ్కి పూల బొకేను అందించింది సెక్యూరిటీ టీం (Security guards). వారి అభినందనలు, కేరింతల మధ్య అనంత్ ఉత్సాహంగా కేక్ కట్ చేశారు. అంబానీ అప్డేట్స్ ఇన్స్టాగ్రామ్ దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది. భారతదేశంలోని అత్యంత ధనిక కుటుంబ వారసుడు ఇలా నిరాడంబరంగా పుట్టినరోజు జరుపుకోవడం నెటిజనులకు తెగ నచ్చేసింది. వీడియో అంబానీ కుటుంబానికి, అతని బాడీ గార్డులకు మధ్య ఉన్న అనుబంధం, ఆప్యాయతలకు నిదర్శనం అంటున్నారు అభిమానులు. View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update)అనంత్ అంబానీ మాజీ నానీ భావోద్వేగ పుట్టినరోజు శుభాకాంక్షలుఅనంత్కి వచ్చిన అనేక పుట్టినరోజు సందేశాలలో మరో ప్రత్యేకమైంది ఉంది. అదేంటీ, అంటే తనకి చిన్నప్పుడు నానీగా పనిచేసిన లలితా డిసిల్వా, చిన్న అనంత్ సాంప్రదాయ దుస్తులు ధరించి, ఛాతీపై చిన్న భారతీయ జెండాను ధరించి ఉన్న అనంత్ చిన్ననాటి ఫోటోను పోస్ట్ చేశారామె. ఆ ఫోటోతో పాటు, లలిత ఒక భావోద్వేగ అభినందను రాసుకొచ్చారు.“నా అనంత్కి బోలెడన్ని పుట్టినరోజు శుభాకాంక్షలు. దేవుడు అతన్ని దీవించుగాక. నా అనంత్ ఇప్పుడు చాలా పెద్దవాడు. అతను జంతువులను అమితంగా ప్రేమించే తీరు నిజంగా మెచ్చుకోదగ్గది. జంతువుల భద్రత కోసం మీరు చేసిన కృషికి అనంత్, లవ్యూ...మీ రోజును ఆస్వాదించండి, అందమైన పుట్టినరోజు. శుభాకాంక్షలు’’ -
వీడియో: అరేయ్ బులుగు చొక్కా.. ఏం పనులు రా అవి?
విధి నిర్వహణలో ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్. ఏదో ధర్నా జరుగుతుంటే.. నిరసనకారుల్లో కొందరిని అరెస్ట్ చేయడంలో తన సిబ్బందికి సాయం చేస్తుంటుంది. ఇంతలో వెనకాల పోలీసుల చేతిలో ఉన్న బులుగు చొక్కావోడు.. ఆమె నడుంను పట్టుకుని తెగ ఊగిపోతుంటాడు. చాలామంది ఇదేదో జోక్ అనుకుని.. మెన్ విల్ బి మెన్ అనుకుంటూ వీడియోను ఇతరులకు ఫార్వర్డ్ చేస్తున్నారు. నవ్వుకుంటున్నారు. కానీ..ఆ టైంకి ఆ కామాంధుడి చెర నుంచి తనను తాను విడిపించుకున్న ఆమె.. సిబ్బంది సాయంతో పక్కకు తీసుకెళ్లింది. ఈ ఘటన ఎక్కడ? ఎప్పుడు? జరిగిందో స్పష్టత లేదు. కేసు నమోదైన దానిపైనా స్పష్టత లేదు. పలు జాతీయ మీడియా చానెల్స్ కథనాలు ఇచ్చాయికానీ.. ఎక్కడ జరిగిందన్నది ప్రస్తావించలేదు. గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. చాలామంది ఆ బులుగు చొక్కావోడిని తిట్టి పారేస్తున్నారు. అలాంటి వాళ్లను వదలకూడదంటూ పోస్టులు పెడుతున్నారు. పట్టపగలు.. అదీ ఓ మహిళా పోలీస్ పట్ల అలా ప్రవర్తించడం ఏంటని? కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఓ మహిళా పోలీస్తో ఓ వ్యక్తి బహిరంగంగా.. అసభ్యంగా ప్రవర్తించిన తీరును హాస్య కోణంలో కాకుండా తీవ్రంగా పరిగణించాలని పలువురు కోరుతున్నారు.Just look at that blue shirt guy.He is trying to harass a lady Police officer.Such anti social people deserve Jail. pic.twitter.com/nj5MGAEKJU— Sunanda Roy 👑 (@SaffronSunanda) April 9, 2025ఇదిలా ఉంటే.. మహిళా పోలీసులతో ఇలాంటి అసభ్య ప్రవర్తనల ఘటనలు ఈ మధ్యకాలంలోనే చూశాం. మహారాష్ట్రలో నాగ్పుర్ (Nagpur)లో మార్చి మూడో వారంలో.. రెండు గ్రూప్ల మధ్య చెలరేగిన హింసతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ ఘర్షణల్లో ఒక అల్లరిమూక డ్యూటీలో ఉన్న మహిళా పోలీసు అధికారితో అసభ్యకరంగా ప్రవర్తించింది. అలాగే.. గణేష్పేట ప్రాంతంలో ర్యాపిడ్ కంట్రోల్ పోలీస్ దళంలో విధులు నిర్వహించిన ఓ అధికారిణి సైతం తాను ఎదుర్కొన్న ఇబ్బందులపై సీనియర్ అధికారులకు ఫిర్యాదు చేసింది. అదే ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తోన్న మరో అధికారిణి కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారట. -
CSK Vs KKR: ‘ద్రోహి వచ్చేశాడు చూడండి... జీవితం చాలా చిత్రమైనది’
ఐపీఎల్-2025 (IPL 2025)లో వరుస పరాజయాలతో చతికిల పడ్డ చెన్నై సూపర్ కింగ్స్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) మరోసారి నాయకుడిగా వ్యవహరించనున్నాడు.కోల్కతా నైట్ రైడర్స్తో శుక్రవారం జరిగే మ్యాచ్ సందర్భంగా ధోని సీఎస్కే తాత్కాలిక కెప్టెన్గా బాధ్యతలు తీసుకోనున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే సొంత మైదానం చెపాక్లో సీఎస్కే ఆటగాళ్లు ప్రాక్టీస్లో తలమునకలయ్యారు. ఇక ధోని సైతం నెట్స్లో బ్యాటింగ్ చేస్తూ తీవ్రంగా శ్రమించాడు.ఆ సమయంలో కేకేఆర్ మెంటార్ డ్వేన్ బ్రావో మైదానంలోకి వచ్చి సీఎస్కే ఆటగాళ్లను పలకరించాడు. ఈ క్రమంలో రవీంద్ర జడేజా అతడికి ఎదురువెళ్లి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు. ద్రోహి వచ్చేశాడు చూడండిఇంతలో నెట్స్లో ఉన్న ధోని మాత్రం.. బ్రావోను చూసి.. ‘‘ఇదిగో.. ద్రోహి వచ్చేశాడు చూడండి’’ అంటూ తనదైన శైలిలో స్వాగతం పలికాడు. ఇందుకు.. ‘‘జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. చాలా చిత్రమైనది’’ అని బ్రావో బదులిచ్చాడు. నవ్వుతూ వెళ్లి ధోని హగ్ చేసుకున్నాడు. ఆ వైబ్ను మిస్సవుతున్నాంఇందుకు సంబంధించిన వీడియోను సీఎస్కే సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘‘ఎంఎస్- డీజే.. ఆ వైబ్ను మిస్సవుతున్నాం’’ అంటూ క్యాప్షన్ జతచేసింది. ఇక ఈ వీడియోను చూసి సీఎస్కే అభిమానులు సైతం భావోద్వేగానికి గురవుతున్నారు. బ్రావో చెన్నై ఫ్రాంఛైజీని వీడి వెళ్తాడని అస్సలు ఊహించలేదంటూ కామెంట్లు చేస్తున్నారు.సీఎస్కేతో సుదీర్ఘ బంధంకాగా వెస్టిండీస్కు చెందిన డ్వేన్ బ్రావో 2011- 2015 వరకు చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించాడు. ఆ తర్వాత మళ్లీ 2018- 2022 మధ్య కాలంలో ఈ కరేబియన్ ఆల్రౌండర్ సీఎస్కేకు ఆడాడు. 2011, 2018, 2021, 2022లో ట్రోఫీ గెలిచిన చెన్నై జట్టులో అతడు సభ్యుడిగా ఉన్నాడు.అంతేకాదు.. ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత బ్రావో 2023లో బౌలింగ్ కోచ్గా చెన్నై జట్టుకు సేవలు అందించాడు. ఈ నేపథ్యంలో చెన్నై ముఖచిత్రం, కర్త, కర్మ, క్రియ అయిన ధోనితో బ్రావోకు విడదీయలేని అనుబంధం ఏర్పడింది. అయితే, 2025 సీజన్ ఆరంభానికి ముందు పరిస్థితులు మారిపోయాయి.గౌతం గంభీర్ స్థానంలోసీఎస్కేను వీడిన తర్వాత బ్రావో.. కేకేఆర్ ఫ్రాంఛైజీతో జట్టుకట్టాడు. గౌతం గంభీర్ స్థానంలో డిఫెండింగ్ చాంపియన్ మెంటార్గా బాధ్యతలు చేపట్టాడు. ఇక సీఎస్కే- కేకేఆర్ మధ్య శుక్రవారం మ్యాచ్ నేపథ్యంలో చెన్నై ఆటగాళ్లను కలవగా ధోని ఇలా సరదాగా స్పందించడం విశేషం.కాగా 41 ఏళ్ల పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ బ్రావో ఐపీఎల్లో 161 మ్యాచ్లు ఆడి 183 వికెట్లు తీశాడు. అదే విధంగా.. 1560 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు అర్ధ శతకాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025లో కేకేఆర్ అజింక్య రహానే కెప్టెన్సీలో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లు ఆడి కేవలం రెండే గెలిచింది. మరోవైపు.. సీఎస్కే ఆడిన ఐదింట.. గత నాలుగు మ్యాచ్లలోనూ ఓటమిపాలైంది.చదవండి: RCB Vs DC: ఇదేం కెప్టెన్సీ?.. పాటిదార్పై కోహ్లి ఫైర్?!.. డీకేతో చర్చ.. అతడు కెప్టెన్తో మాట్లాడాల్సింది!MS🫂DJ : MISS THIS VIBE! 💛✨#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/IlSd876zes— Chennai Super Kings (@ChennaiIPL) April 11, 2025 -
మంగళవారం రాత్రి.. ఆ ఊరంతా భయం గుప్పిట
బెంగళూరు: ఎప్పటిలాగే ఆ ఊరి ప్రజలు తమ పనులు ముగించుకుని ఇళ్లకు చేరుకున్నారు. మరికొన్ని గంటల్లో నిద్రలోకి జారుకుంటారనగా.. ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఏదో విలయం సంభవించినట్లు జనం హాహాకారాలు చేస్తూ ఇళ్ల నుంచి ఉరుకులు పరుగులు తీశారు. తమను రక్షించాలంటూ గట్టి గట్టిగా కేకలు వేశారు. మంగళవారం రాత్రి.. కర్ణాటకలోని యాదగిరి జిల్లా సూర్పూర్ తాలుకా జాలిబెంచి(Jalibenchi village) అనే మారుమూల గ్రామాన్ని భయం గుప్పిట ఉంచింది. విద్యుత్ సరఫరాలో షార్ట్ సర్క్యూట్తో చెలరేగిన మంటలే అందుకు కారణం.విద్యుత్ సరఫరాలో కలిగిన అంతరాయం.. ఏకంగా ఒక ఊరినే వణికించింది. మంగళవారం రాత్రి జాలిబెంచి పరిసర ప్రాంతాల్లో బలంగా ఈదురు గాలులు వీచాయి. ఈ ప్రభావంతో కరెంట్ వైర్లు ఒకదానికొకటి రాజుకుని.. షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకుంది. అలా మంటలు రాజుకున్నాయి. చాలా ఇళ్లలో స్విచ్ బోర్డులు, టీవీలు, ఫ్రిడ్జిలు కాలిపోయాయి. సెల్ఫోన్లు పేలిపోయాయి. కరెంట్ స్తంభాల నుంచి వైర్లు ఇళ్ల పైకప్పుల మీద తెగి పడడంతో మంటలు అంటుకున్నాయి. ఈ పరిణామాలతో భీతిల్లిన ప్రజలు ప్రాణాలను అరచేత పట్టుకుని పరుగులు తీశారు. కొందరు ఆ గందరగోళంలోనూ తమ ఫోన్లకు పని చెప్పారు.సమాచారం అందుకున్న అత్యవసర సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. గ్రామానికి విద్యుత్ సరఫరా చేసే సబ్స్టేషన్లో విద్యుత్ నిలిపివేశారు. అప్పటికే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎక్కడపడితే అక్కడ వేలాడుతున్న తీగలను పక్కకు జరిపారు. ఈ బీభత్సంలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయని.. అయితే వాళ్లకు వచ్చిన ప్రమాదమేమీ లేదని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో వణికిపోయిన ప్రజలు రాత్రంతా ఇళ్ల బయటే కంటి మీద కునుకు లేకుండా గడిపారు.సుమారు వంద ఇళ్లకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రకటించారు. సమాచారం అందుకున్న గులబర్గ ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ సిబ్బంది గ్రామానిక చేరుకున్నారు. ఈ ఉదయం నుంచి లైన్లను పునరుద్ధరించే పనిని చేపట్టారు. తమ గ్రామానికి కరెంట్ సరఫరా కోసం వైర్లు దశాబ్దాల కిందటివని, ఆ కారణంగానే ఇంతటి ప్రమాదం జరిగిందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి మార్పులు చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి వీడియో వైరల్ అవుతోంది.Shocking, terrible video!!A tragic incident unfolded in Jalibenchi village of Surpur taluk on Tuesday around 6 PM, as powerful winds caused an electricity-related accident, plunging the area into chaos and fear.Cc @OfficialGescom pic.twitter.com/VCQXLqQymW— Nishkama_Karma (@Nishkama_Karma1) April 8, 2025 -
ఆఖరిసారిగా అప్పుడే బాగా ఏడ్చాను: శ్రేయస్ అయ్యర్
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్ టీమిండియా సొంతం కావడంలో శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)ది కీలక పాత్ర. ఈ మిడిలార్డర్ బ్యాటర్ ఐదు మ్యాచ్లలోనూ అద్భుత ఆట తీరుతో రాణించి.. జట్టుకు వెన్నెముకగా నిలిచాడు. ఈ వన్డే టోర్నీలో మొత్తంగా 243 పరుగులు సాధించి భారత్ తరఫున టాప్ రన్స్కోరర్గా నిలిచాడు.తుదిజట్టులో చోటు కరువు?అయితే, ఈ మెగా ఈవెంట్కు ముందు శ్రేయస్ అయ్యర్కు తుదిజట్టులో చోటు దక్కే పరిస్థితే లేదు. ఈ టోర్నీకి ముందు ఇంగ్లండ్ (Ind vs Eng ODIs)తో స్వదేశంలో టీమిండియా మూడు వన్డేలు ఆడగా.. తొలి మ్యాచ్కు విరాట్ కోహ్లి గాయం వల్ల దూరమయ్యాడు. ఫలితంగా శ్రేయస్ అతడి స్థానంలో ప్లేయింగ్ ఎలెవన్లోకి వచ్చాడు.ఇక అప్పటి నుంచి అతడికి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుస మ్యాచ్లలో బ్యాట్ ఝులిపించి చాంపియన్స్ ట్రోఫీ జట్టులో స్థానం సంపాదించాడు. ఇక ఈ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యమివ్వగా.. భారత జట్టు మాత్రం తమ మ్యాచ్లన్నీ దుబాయ్ (Dubai)లో ఆడిన విషయం తెలిసిందే. అయితే, తొలి మ్యాచ్కు ముందు శ్రేయస్ అయ్యర్ బాగా ఏడ్చాడట. ఇందుకు గల కారణాన్ని అతడు తాజాగా వెల్లడించాడు.ఆఖరిసారిగా అప్పుడే బాగా ఏడ్చానుక్యాండిడ్ విత్ కింగ్స్ ప్రోగ్రామ్లో భాగంగా ఈ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘నేను చివరగా ఏడ్చిన సందర్భం అంటే.. చాంపియన్స్ ట్రోఫీ అప్పుడే. మొదటి ప్రాక్టీస్ సెషన్లో నేను సరిగ్గా ఆడలేకపోయాను. దాంతో ఏకధాటిగా ఏడుస్తూనే ఉన్నాను.అంతేకాదు.. నా మీద నాకు అంతులేని కోపం వచ్చింది. నిజానికి సాధరణంగా నేను అస్సలు ఏడ్వను. కానీ అప్పుడు ఎందుకు అంతలా బాధపడ్డానో నాకే తెలియదు. ఒక్కోసారి నాకు ఇది షాకింగ్గా అనిపిస్తుంది.అంతకు ముందు ఇంగ్లండ్ సిరీస్లో నేను బాగానే ఆడాను. అదే జోరును చాంపియన్స్ ట్రోఫీలో కొనసాగించాలని ఫిక్సయ్యాను. అయితే, అలా తొలి సెషన్లోనే చేదు అనుభవం ఎదురుకావడం వల్ల నిరాశకు గురయ్యాను. తర్వాత అక్కడి పిచ్ పరిస్థితులను అర్థం చేసుకుని నాదైన శైలిలో ఆడాను’’ అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.కనక వర్షంకాగా ఐపీఎల్-2024లో కోల్కతా నైట్ రైడర్స్ను చాంపియన్గా నిలిపిన శ్రేయస్ అయ్యర్ను ఆ జట్టు వదులుకుంది. ఈ క్రమంలో మెగా వేలంలోకి వచ్చిన ఈ ముంబైకర్పై కాసుల వర్షం కురిసింది. పంజాబ్ కింగ్స్ అతడి కోసం ఏకంగా రూ. 26.75 కోట్లు ఖర్చు చేసింది. ఇక పంజాబ్ సారథిగా ఇప్పటి వరకు మూడు మ్యాచ్లు పూర్తి చేసుకున్న అయ్యర్.. రెండింట గెలిచాడు.చదవండి: గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్గా ఊహించని పేరు చెప్పిన కపిల్ దేవ్Sarpanch Saab's passion for the game... 🥹🤌🏻Watch the full heartfelt conversation between Shreyas Iyer and Sahiba Bali on our YT channel and Punjab Kings App. 📹 pic.twitter.com/t1PBDtCY6M— Punjab Kings (@PunjabKingsIPL) April 7, 2025 -
MI vs RCB: యార్కర్తో దడ పుట్టించిన బుమ్రా.. వీడియో వైరల్
ఐపీఎల్-2025 (IPL 2025)లోనూ ముంబై ఇండియన్స్ పరాజయ పరంపర కొనసాగుతోంది. గతేడాది పద్నాలుగింట.. నాలుగు మ్యాచ్లే గెలిచిన హార్దిక్ సేన.. ఈసారి ఓటమితో సీజన్ను ఆరంభించింది. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్లలో మూడు ఓడిపోయి విమర్శలు మూటగట్టుకుంటోంది.బ్యాటర్లు, బౌలర్ల సమిష్టి వైఫల్యం ముంబైపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇలాంటి తరుణంలో ముంబై ఇండియన్స్కు అదిరిపోయే శుభవార్త అందింది. ఆ జట్టు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. వాంఖడేలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో సోమవారం నాటి మ్యాచ్కు అందుబాటులోకి వచ్చాడు.యార్కర్తో దడ పుట్టించిన బుమ్రా..ఇక ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టిన ఈ పేస్ గుర్రం.. నెట్ సెషన్లో తన బౌలింగ్ మాయాజాలంతో బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. బుమ్రా వేసిన పదునైన యార్కర్ దెబ్బకు స్టంప్స్ ఎగిరిపోగా.. ఆ బంతిని ఎదుర్కొనేందుకు ప్రయత్నించిన బ్యాటర్ బ్యాలెన్స్ చేసుకోలేక కిందపడిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.రెండు నెలల విరామం తర్వాతకాగా బుమ్రా రాకతోనైనా తమ తలరాత మారుతుందని ముంబై జట్టు వేయికళ్లతో ఎదురుచూస్తోంది. ఇక ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్లో అదరగొట్టిన జస్ప్రీత్ బుమ్రా.. సిడ్నీలో జరిగిన ఆఖరి టెస్టు సందర్భంగా గాయపడిన విషయం తెలిసిందే. వెన్నునొప్పితో విలవిల్లాడిన అతడు .. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత చాలా రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నాడు.అయితే, ఫిట్నెస్ సాధించని కారణంగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నమెంట్కు కూడా బుమ్రా దూరమయ్యాడు. అదే విధంగా.. ఐపీఎల్-2025 ఆరంభ మ్యాచ్లకు కూడా దూరమైన ఈ రైటార్మ్ పేసర్.. రీఎంట్రీ ఇచ్చేందుకు సన్నద్ధమయ్యాడు. కాగా జనవరి తర్వాత బుమ్రా కాంపిటేటివ్ క్రికెట్ బరిలోకి దిగనుండటం ఇదే తొలిసారి.రోహిత్ కూడామరోవైపు.. గాయం వల్ల గత మ్యాచ్కు దూరమైన ముంబై ఇండియన్స్ స్టార్ ఓపెనర్, మాజీ సారథి రోహిత్ శర్మ కూడా తిరిగి జట్టుతో చేరాడు. వీరిద్దరి రాకతో ముంబై ఇండియన్స్ శిబిరంలో సరికొత్త ఉత్సాహం నిండింది. కాగా ఆర్సీబీపై బుమ్రాకు అద్భుతమైన రికార్డు ఉంది. ఇది బుమ్రా వర్సెస్ ఆర్సీబీఇప్పటి వరకు బెంగళూరు జట్టుతో తాను ఆడిన 19 మ్యాచ్లలో కలిపి బుమ్రా 29 వికెట్లు తీయడం గమనార్హం. అందుకే సోమవారం నాటి పోరును బుమ్రా వర్సెస్ ఆర్సీబీగా అభివర్ణిస్తూ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బుమ్రా ఆర్సీబీ బ్యాటర్లకు చుక్కలు చూపించడం ఖాయమని కామెంట్లు చేస్తున్నారు.ఇక ఆరంభ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిన ముంబై ఇండియన్స్.. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ చేతిలోనూ పరాజయం పాలైంది. అనంతరం కోల్కతా నైట్ రైడర్స్పై విజయం సాధించిన హార్దిక్ సేన.. ఆఖరిగా లక్నో సూపర్ జెయింట్స్తో తలపడి మరో ఓటమిని మూటగట్టుకుంది. ప్రస్తుతం కేవలం రెండు పాయింట్లతో పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.చదవండి: ఇలా వచ్చి.. అలా వెళ్లారు.. అసలేం చేస్తున్నారు? కావ్యా మారన్ రియాక్షన్ వైరల్Goodnight Paltan! 😊#MumbaiIndians #PlayLikeMumbai pic.twitter.com/UYghtBvYMN— Mumbai Indians (@mipaltan) April 6, 2025