Pulwama Terror Attack
-
‘పుల్వామా’ అమరులకు ప్రధాని మోదీ ఘన నివాళులు
న్యూఢిల్లీ/హల్దా్వనీ: జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో 2019 ఫిబ్రవరి 14వ తేదీన జరిగిన ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లకు ప్రధాని మోదీ శుక్రవారం నివాళులర్పించారు. దేశం పట్ల వారు అచంచలమైన విశ్వాసాన్ని కనబరిచారని కొనియాడారు. వారి త్యాగాలను భవిష్యత్తు తరాలు గుర్తుంచుకుంటాయని ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఉగ్రవాదులను ఏరిపారేసేందుకు మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. పుల్వామా ఉగ్ర ఘటనలో అసువులు బాసిన జవాన్లకు ఆయన ఘనంగా నివాళులర్పించారు. వీరి త్యాగాల వల్లే మన దేశ సరిహద్దులు భద్రంగా ఉన్నాయన్నారు. మానవీయతకే అతిపెద్ద శత్రువైన ఉగ్రవాదంపై పోరుకు నేడు ప్రపంచమే ఏకమైందని శుక్రవారం హోం మంత్రి అమిత్ షా ‘ఎక్స్’లో తెలిపారు. పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ని ఆత్మాహుతి దళ బాంబర్ వాహనంతో ఢీకొట్టడంతో 40 మంది జవాన్లు అసువులు బాసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు ప్రతీకారంగా వైమానికదళం యుద్ధ విమానాలు పీవోకేలోని బాలాకోట్ ఉగ్ర స్థావరాన్ని నేలమట్టం చేశాయి. -
పుల్వామా అమర జవాన్లకు ప్రధాని మోదీ నివాళులు
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం (ఫిబ్రవరి 14) నివాళులర్పించారు. ‘పుల్వామాలో అమరులైన వీరులకు నివాళులు అర్పిస్తున్నాను’ అని సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ‘ఎక్స్’లో ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశం కోసం వారు చేసిన సేవలు, త్యాగం ఎప్పటికీ గుర్తుండిపోతాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. I pay homage to the brave heroes who were martyred in Pulwama. Their service and sacrifice for our nation will always be remembered. — Narendra Modi (@narendramodi) February 14, 2024 జమ్మూకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఉగ్రదాడి జరిగి నేటికి ఐదేళ్లు పూర్తయ్యాయి. పుల్వామా ఉగ్రదాడి 2019, ఫిబ్రవరి 14న జరిగింది. భారత్పై జరిగిన భారీ తీవ్రవాద దాడుల్లో ఇదొకటి. ఆ చీకటి రోజున ఉగ్రవాదులు 200 కిలోల పేలుడు పదార్థాలతో కూడిన వాహనంతో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) కాన్వాయ్ను లక్ష్యంగా చేసుకున్నారు. ఉగ్రవాదుల దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవానులు అమరులయ్యారు. ఈ ఘటనలో 35 మంది గాయపడ్డారు. ఆరోజు సీఆర్పీఎఫ్ కాన్వాయ్లో 78 వాహనాలు ఉండగా, వాటిలో 2500 మందికి పైగా సైనికులు ప్రయాణిస్తున్నారు. -
పుల్వామా దాడికి ఐదేళ్లు... ఆ రోజు ఏం జరిగింది?
2019, ఫిబ్రవరి 14.. సరిగ్గా ఐదేళ్ల క్రితం జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రదాడి జరిగింది. ఇది భారతదేశంలో జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడుల్లో ఒకటి. ఈ దాడిలో 40 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. ఈ దాడి తర్వాత పాకిస్తాన్కు భారత్ గుణపాఠం చెప్పిన తీరు గతంలో ఎన్నడూ జరగలేదు. పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకునే దిశగా పాక్పై భారత్ కఠిన చర్యలు అవలంబించింది. సర్జికల్ స్ట్రైక్ రూపంలో బదులు తీర్చుకుంది. పాకిస్తాన్లోకి ప్రవేశించిన భారత సైన్యం పాక్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఇంతకీ ఐదేళ్ల క్రితం ఫిబ్రవరి 14న పాక్ ఎటువంటి దాడికి పాల్పడిందో, దానికి భారత్ ఎలా ప్రతీకారం తీర్చుకుందో ఇప్పుడొకసారి గుర్తుచేసుకుందాం. ఐదేళ్ల క్రితం ఇదేరోజున సీఆర్పీఎఫ్ కాన్వాయ్ జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి గుండా వెళుతోంది. సైనికులు ఉన్న ఈ కాన్వాయ్లో అధికంగా బస్సులు ఉన్నాయి. కాన్వాయ్ పుల్వామా వద్దకు చేరుకోగానే అటువైపు నుంచి వచ్చిన ఓ కారు కాన్వాయ్లోని ఓ బస్సును ఢీకొంది. బస్సును ఢీకొన్న ఆ కారులో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు ఉన్నాయి. దీంతో వెంటనే పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. పుల్వామాలో ఉగ్రదాడి అనంతరం భారత్.. పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెప్పేందుకు కఠిన చర్యలు అవలంబించింది. ఫలితంగా పాకిస్తాన్కు తీవ్ర నష్టం వాటిల్లింది. 2019, ఫిబ్రవరి 26న భారత వైమానిక దళం పాకిస్తాన్లోని బాలాకోట్లోకి ప్రవేశించి వైమానిక దాడులతో పాక్లోని ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేసింది. దీంతో ఫిబ్రవరి 27న పాకిస్తాన్ వైమానిక దళం జమ్మూ, కాశ్మీర్లోకి చొరబడి భారతదేశంపై వైమానిక దాడులకు పాల్పడింది. దీనికి ప్రతిస్పందనగా భారత వైమానిక దళం దాడులు చేపట్టిన సమయంలో భారత్కు చెందిన యుద్ధ విమానం ‘మిగ్-21’ పాకిస్తాన్ సైన్యం దాడికి గురై, అక్కడే పడిపోయింది. ఈ నేపధ్యంలో పాకిస్తాన్ సైనికులు ‘మిగ్-21’ పైలట్ అభినందన్ వర్థమాన్ను పట్టుకున్నారు. 2019, మార్చి ఒకటిన అమెరికాతో పాటు ఇతర దేశాల ఒత్తిడి మేరకు పాకిస్తాన్ సైన్యం అభినందన్ వర్థమాన్ను విడుదల చేసింది. పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్ అప్పటివరకూ పాక్తో ఉన్న అన్ని వాణిజ్య సంబంధాలను రద్దు చేసుకుంది. ఫలితంగా పాకిస్తాన్ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. పాకిస్తాన్ను బ్లాక్లిస్ట్లో చేర్చేందుకు మనీలాండరింగ్పై ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్)ను కూడా భారత ప్రభుత్వం కోరింది. -
‘త్వరలో మరో పుల్వామా దాడి’ అంటూ పోస్ట్.. రంగంలోకి పోలీసులు
న్యూఢిల్లీ: ‘పుల్వామా దాడి’ మాదిరి మరో దాడి త్వరలో జరగనుందని ఓ విద్యార్థి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ ఒక్కసారిగా దుమారం రేపింది. వెంటనే స్పందించిన పోలీసులు ఉత్తర ప్రదేశ్లో సదరు విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని జార్ఖండ్కు చెందిన విద్యార్థిగా గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు. ‘పుల్వామా దాడి... వంటి మరో దాడి తర్వలో జరగనుంది’ అని ఆ విద్యార్థి ‘ఎక్స్’ ట్విటర్లో పోస్ట్ చేశాడు. మంగళవారం జమ్మూ కశ్మీర్లో భద్రతా బలగాలు పుల్వామాలో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద లభించిన తుపాకాలను స్వధీనం చేసుకున్నారు. ఆ ముగ్గురిని ఆర్మీ భద్రతా సిబ్బంది, పోలీసులు సంయూక్తంగా విచారణ చేస్తున్నారు. ఇటువంటి సమయంలో ఓ స్టూడెంట్ పెట్టిన షోషల్ మీడియా పోస్ట్ వెలుగు చూడటంతో అప్రమత్తమైన షహరాన్ పూర్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఇక 2019లో పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ భద్రతా బలగాలు మృతి చెందిన విషయం తెలిసిందే. చదవండి: Video: ఆగ్రా రహదారిపై రోడ్డు ప్రమాదం.. కోళ్ల కోసం ఎగబడ్డ జనం -
పుల్వామాలో మళ్లీ ఉగ్రదాడి.. వలసకూలీపై కాల్పులు
జమ్ము: జమ్ముకశ్మీర్లో మళ్లీ ఉగ్రతూటా పేలింది. ఉత్తరప్రదేశ్కు చెందిన వలస కూలీపై దుండగులు కాల్పులు జరిపారు. పుల్వామాలో ఈ ఘటన జరగగా.. బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. క్రికెట్ ఆడుతున్న ఎన్స్పెక్టర్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపి మరుసటి రోజే ఈ ఘటన జరగడం కలకలం రేపుతోంది. "పుల్వామాలోని తుమ్చి నౌపోరా ప్రాంతంలో యూపీకి చెందిన వలస కూలీపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. మృతున్ని ముఖేష్గా గుర్తించాం. ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాం." అని పోలీసులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో పుల్వామాలో జరిగిన రెండో ఉగ్రదాడి ఇది. ఆదివారం ఈద్గా ప్రాంతంలో క్రికెట్ ఆడుతున్న ఇన్స్పెక్టర్ మస్రూర్ అహ్మద్ వానీపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఇదీ చదవండి: శివసేన, ఎన్సీపీ అనర్హత పటిషన్లపై స్పీకర్కు సుప్రీంకోర్టు తుది గడువు -
హాని చేయాలని చూస్తే బుద్ధి చెబుతాం
కాంకేర్(ఛత్తీస్గఢ్): భారత్కు ఎవరైనా హాని కలిగించాలని చూస్తే తగిన బుద్ధి చెబుతామని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ పొరుగుదేశాన్ని హెచ్చరించారు. ఛత్తీస్గఢ్లోని మావోయిస్ట్ ప్రభావిత కాంకేర్లో శనివారం జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. తొమ్మిదేళ్లలో ప్రధాని మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను ఈ సందర్భంగా మంత్రి వివరించారు. పుల్వామా, ఉడి ఉగ్రదాడులకు ప్రతిగా 2016, 2019ల్లో చేపట్టిన సర్జికల్ స్ట్రైక్లను ఆయన ప్రస్తావించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం శక్తివంతంగా మారింది, ఇప్పుడు బలహీన దేశం ఎంతమాత్రం కాదని చెప్పారు. కేంద్రం చేపట్టిన చర్యలతో వామపక్ష తీవ్రవాద సంబంధ ఘటనలు ఇప్పుడు కేవలం 10–12 జిల్లాలకు మాత్రమే పరిమితం అయ్యాయన్నారు. -
Pulwama attack 2019: ‘పుల్వామా’పై అనుమానాలెన్నో
న్యూఢిల్లీ: 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్న 2019 పుల్వామా ఉగ్ర దాడిపై అనుమానాలు నానాటికీ బలపడుతున్నాయని కాంగ్రెస్ పేర్కొంది. ఉగ్రదాడి ముప్పుందని తెలిసి కూడా జవాన్లను విమానంలో కాకుండా రోడ్డు మార్గాన ఎందుకు పంపాల్సి వచ్చిందో మోదీ సర్కారు చెప్పి తీరాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ డిమాండ్ చేశారు. ‘‘పుల్వామా దాడిపై నాటి జమ్మూ కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ బయట పెట్టిన విషయాలు షాకింగ్గా ఉన్నాయి. జైషే ముప్పును, ఏకంగా 11 నిఘా హెచ్చరికలను ఎందుకు విస్మరించారు? ఉగ్రవాదులకు 300 కిలోల ఆర్డీఎక్స్ ఎలా వచ్చింది? ఉగ్ర దాడిపై విచారణ ఎంతదాకా వచ్చింది? బాధ్యులను గుర్తించారా?’’ అని ప్రశ్నించారు. -
ఎన్నికల కోసమే పుల్వామా దాడి.. మోదీపై కాంగ్రెస్ నేత తీవ్ర వ్యాఖ్యలు
జైపూర్: ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర ఆరోపణలు చేశారు రాజస్థాన్ కాంగ్రెస్ ఇంఛార్జ్ సుఖ్జిందర్ సింగ్ రంధావా. ఎన్నికల ప్రయోజనాల కోసం పుల్వామా దాడిని ఆయనే చేయించి ఉంటారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 44 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఈ ఉగ్ర ఘటన ఎలా జరిగిందో ఇప్పటివరకు ఇంకా ఏమీ తెలియకపోవడం ఏంటని ప్రశ్నించారు. జైపూర్లో కాంగ్రెస్ ధర్నాలో మాట్లాడుతూ రంధావా ఈ వ్యాఖ్యలు చేశారు. 'పంజాబ్లో మాపియాను కాంగ్రెస్ అంతం చేసింది. అకాలీదళ్ను శాశ్వతంగా లేకుండా చేశాం. తలచుకుంటే మోదీని గద్దె దించలేమా? మా గ్రామం పాకిస్థాన్కు ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కానీ మేము ఆ దేశానికి ఎప్పుడూ భయపడలేదు. ఇంట్లోకి చొరబడి అంతం చేస్తాం అని మోదీ ప్రగల్భాలు పలుకుతారు. అలాంటప్పుడు పుల్వామాలో దాడి ఎలా జరిగింది. దానిపై విచారణ జరపండి. ఈరోజు వరకు ఆ ఘటన ఎలా జరిగిందో తెలియదు. ఎన్నికల ప్రయోజనాల కోసమే ఇది జరగలేదంటారా? అని రంధావా తీవ్ర ఆరోపణలు చేశారు. అలాగే మోదీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు అందరు కలిసి రావాలని రంధావా పిలుపునిచ్చారు. మోదీ దిగిపోతేనే భారత్ను కాపాడగలమన్నారు. ఓకవేళ మోదీనే మళ్లీ అధికారంలో ఉంటే భారత్ పని అయిపోతుందన్నారు. తమకంటే గొప్ప దేశభక్తులు లేరని బీజేపీ నేతలు చెప్పుకుంటారని, అసలు దేశభక్తి అనే పదానికి అర్థం కూడా మోదీకి తెలియదని విమర్శించారు. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నవారిలో ఒక్క బీజేపీ నేత అయినా ఉన్నాడా? అని ప్రశ్నించారు. హిండెన్బర్గ్ నివేదికపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు జరపాలని కోరుతూ కాంగ్రెస్ జెపూర్లో ధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమంలోనే పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ రంధావా ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ను నాశనం చేసేందుకు ఈస్ట్ ఇండియా కెంపెనీలాంటి అదానీ సంస్థను మోదీ తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. మోదీ అధికారం నుంచి దిగిపోతే అదానీ కంపెనీ కూడా కనుమరుగు అవుతుందని వ్యాఖ్యానించారు. బీజేపీ కౌంటర్ రంధావా వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. పుల్వామా ఘటనలో పాకిస్తాన్కు క్లీన్ చిట్ ఇచ్చినట్లు ఆయన మాట్లాడారని, కాంగ్రెస్ మరోసారి హద్దులు మీరి మాట్లాడిందని ధ్వజమెత్తింది. సైనికుల త్యాగాలను అవమానించిన ఆయనపై చర్యలు తీసుకుని, పదవి నుంచి తప్పిస్తారా లేదా? సమర్థిస్తారా అని హస్తం పాార్టీని ప్రశ్నించింది. చదవండి: ప్రియాంక గాంధీ పెయింటింగ్కు రూ.2 కోట్లా? కాంగ్రెస్ అవినీతిలో రోజుకో కొత్త మోడల్ -
పుల్వామా అమర జవాన్ల భార్యల అరెస్ట్
జైపూర్: పుల్వామా ఉగ్ర దాడిలో మరణించిన అమరవీర జవాన్ల భార్యలను రాజస్థాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు డిమాండ్లతో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్ల భార్యలు జైపూర్లోని సచిన్ పైలట్ ఇంటి ఎదుట ఆమరణ దీక్ష చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం దీక్షను భగ్నం చేసి.. స్థానిక స్టేషన్కు తరలించారు పోలీసులు. కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ నివాసం ఎదుట ఫిబ్రవరి 28వ తేదీ నుంచి ఈ ముగ్గురు మహిళలు నిరసన ప్రదర్శనకు దిగారు. ఈ క్రమంలో సచిన్ పైలెట్ ఆ ముగ్గురితో మాట్లాడినా కూడా స్పష్టమైన హామీ ఇవ్వలేకపోయారు. దీంతో.. తమ దీక్షను ఆమరణ దీక్షగా మార్చుకున్నారు వాళ్లు. అయితే శుక్రవారం ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి స్థానిక పీఎస్కు తరలించారు. అరెస్ట్ క్రమంలో పోలీసులు ఆ మహిళలతో దురుసుగా ప్రవర్తించగా.. సచిన్ పైలట్ పోలీసుల తీరును తప్పుబట్టారు. మరోవైపు ఈ ఉదంతంపై జాతీయ మహిళా కమిషన్ మండిపడింది. వితంతువులపై భౌతిక దాడి జరిగిందంటూ రాజస్థాన్ డీజీపీ లేఖ రాసి.. ఘటనపై వివరణ కోరింది. ఇదిలా ఉంటే.. అమర వీరుల కుటుంబ సభ్యులకు సాధారణంగా ప్రభుత్వాలు ఉద్యోగాలను ప్రకటిస్తుంటాయి. అయితే తమ పిల్లలకు బదులుగా బంధువులకు ఉద్యోగాలు ఇవ్వాలని, ఈ మేరకు అవసరమైతే రూల్స్ సవరించాలని ఈ ముగ్గురు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు.. తమ గ్రామాలకు రోడ్లు వేయించాలని, ఊరి నడిబొడ్డున తమ భర్తల విగ్రహాలు ఏర్పాటు చేయించాలని కోరారు. దీనిపై ట్విటర్ ద్వారా స్పందించిన సీఎం అశోక్ గెహ్లాట్.. ఈ అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. అయితే రాతపూర్వకంగా స్పష్టమైన హామీ ఇస్తేనే దీక్ష విరమిస్తామని చెబుతూ.. తమ దీక్షను కొనసాగించారు వాళ్లు. మరోవైపు బీజేపీ ఈ పరిణామాల ఆధారంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది. అయితే దీనిని రాజకీయం చేయడం సరికాదని అంటున్నారు సీఎం గెహ్లాట్. జమ్ముకశ్మీర్ పుల్వామాలో 2019 ఫిబ్రవరి 14వ తేదీన.. శ్రీనగర్ జాతీయ రహదారిపై పేలుడు పదార్థాలు నింపిన వాహనంతో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRFP) సిబ్బంది కాన్వాయ్ మీద ఆత్మాహుతి దాడికి ఉగ్రవాదులు తెగబడ్డారు. ఈ దాడిలో 40 మంది జవాన్లు అమరులు కాగా, యావత్ దేశం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. -
పుల్వామా అమర వీరులకు ప్రధాని మోదీ నివాళులు..
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. ఈ ఘటన జరిగి నాలుగేళ్లయిన సందర్భంగా వారిని స్మరించుకున్నారు. పుల్వామా అమరుల త్యాగాన్ని దేశం ఎన్నిటికీ మరువదని, దేశాభివృద్ధికి వీర సైనికుల శౌర్యమే స్ఫూర్తిదాయకమన్నారు. ఈమేరకు ఆయన మంగళవారం ఉదయం ట్వీట్ చేశారు. Remembering our valorous heroes who we lost on this day in Pulwama. We will never forget their supreme sacrifice. Their courage motivates us to build a strong and developed India. — Narendra Modi (@narendramodi) February 14, 2023 2019 ఫిబ్రవరి 14న జమ్ముకశ్మీర్ పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 40 మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఇందుకు ప్రతీకారంగా పాకిస్తాన్ బాలాకోట్లోకి ప్రవేశించి భారత సైన్యం మెరుపుదాడులు చేసింది. ఉగ్ర శిబిరాలను పేల్చి వేసింది. ఈ ఘటనలో దాదాపు 250 మంది తీవ్రవాదాలు హతమైనట్లు అమిత్ షా ఓ ఎన్నికల ర్యాలీలో తెలిపారు. చదవండి: ‘అదానీ’పై అదే దుమారం -
వాటికీ ప్రూఫ్ ఏంటి?: దిగ్విజయ్ సింగ్ షాకింగ్ వ్యాఖ్యలు
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ పుల్వామా ఉగ్రదాడి, సర్జిక్ స్ట్రైక్లపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019లో పుల్వామ ఉగ్రదాడిలో సుమారు 40 మంది భ్రదతా సిబ్బంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై కేంద్రాన్ని గట్టిగా నిలదీశారు. "పుల్వామ ఉగ్రవాదానికి కేంద్రం, పైగా అక్కడ ప్రతి కారుని కూడా తనిఖీ చేస్తారు. అలాంటప్పుడూ రాంగ్సైడ్ నుంచి వచ్చిన స్కార్పియో కారుని ఎందుకు తనిఖీ చేయలేదు. అప్పుడే కదా ఈ స్కారిపియో కారు భద్రతా సిబ్బంది కాన్వాయ్ని ఢీ కొనడంతో అంతమంది జవాన్లు చనిపోయారు" అంటూ కేంద్రంపై విరుచకుపడ్డారు. ఈ విషయమై ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి సరైనా సమాధానం ఇవ్వలేదన్నారు. అదీగాక పార్లమెంటులో బహిరంగంగా ప్రధాని మోదీ పదేపదే సర్జికల్ స్ట్రైక్ గురించి మాట్లాడతారంటూ విమర్శించారు. ఈ సర్జికల్ స్ట్రైక్తో ఇంతమందిని చంపాం అని ఏవో ప్రగాల్పాలు చెబుతుంటారని మండిపడ్డారు. వాటికి సంబంధించి ఇప్పటి వరకు సరైనా ఆధారాలను అందించలేకపోయిందంటూ కేంద్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఈ మేరకు దిగ్విజయ్ సింగ్ జమ్మూలోని భారత్ జోడోయాత్రలో రాహుల్తో కలసి ఈ విషయాలు గురించి మాట్లాడారు. అంతేగాదు 300 కిలోల ఆర్డిఎక్స్ ఉగ్రవాదుల చేతికి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. అలాగే ప్రధాని మోదీ, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మధ్య ఉన్న స్నేహ సంబంధాలపై కూడా పలు ప్రశ్నలను లేవనెత్తారు. అందుకు సంబంధించిన వీడియోని కూడా దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇదిలా ఉండగా, వాస్తవానికి జమ్మూ కాశ్మీర్లోని ఉరీలోని ఆర్మీ బేస్ క్యాంపుపై జరిగిన ఉగ్రదాడిలో సుమారు18 మంది సైనికులు మరణించారు. దీంతో 2016లో భారత్ సర్జికల్ స్ట్రైక్స్ ప్రారంభించింది.అయితే కాంగ్రెస్ పార్టీ పుల్వామా దాడి, వైమానిక దాడుల గురించి బీజేపీ కొంతకాలం వరకు ప్రశ్నలు సంధించింది. ఐతే బీజేపీ మన సైన్యాన్నే అనుమానిస్తున్నారా? అని గట్టి కౌంటర్ ఇవ్వడంతో సైలెంట్ అయ్యింది. पुलवामा हादसे में आतंकवादी के पास ३०० किलो RDX कहॉं से आई? देवेंद्र सिंह डीएसपी आतंकवादियों के साथ पकड़ा गया लेकिन फिर क्यों छोड़ दिया गया? पाकिस्तान व भारत के प्रधानमंत्री के मैत्री संबंधों पर भी हम जानना चाहते हैं। pic.twitter.com/1wVbJEDPIC — digvijaya singh (@digvijaya_28) January 23, 2023 (చదవండి: వీడియో: అలాంటి వ్యక్తి దొరికితేనే పెళ్లి: మరోసారి స్పష్టం చేసిన రాహుల్ గాంధీ) -
ఎఫ్బీలో ఓవర్ యాక్షన్: బీటెక్ విద్యార్థికి జైలు, భారీ జరిమానా
బెంగళూరు: పుల్వామా ఉగ్రదాడికి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు గాను బెంగళూరుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి ఫైజ్ రషీద్కి ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యుఎపిఎ) కింద జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక కోర్టు జడ్జి సిఎం గంగాధర అతనికి ఐదేళ్ల జైలు శిక్షతోపాటు 10వేల రూపాయల జరిమానా విధించారు. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని ప్రశంసిస్తూ, భారత సైన్యాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ఇంజనీరింగ్ విద్యార్థి రషీద్ను 2019 ఫిబ్రవరిలో పోలీసులు అరెస్టు చేశారు. అప్పటినుంచి అతనికి బెయిల్ మంజూరు కాలేదు. విచారణలో తాజాగా కోర్టు తీ ర్పునిచ్చింది. రషీద్ నిరక్షరాస్యుడు కాదని, కావాలనే ఫేస్బుక్లో ఈ వ్యాఖ్యలను పోస్ట్ చేశారని న్యాయమూర్తి అన్నారు. ఇది జాతికి వ్యతిరేకమైందనీ, హేయమైందని న్యాయమూర్తి గంగాధరను ఉటంకిస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది. కాగా ఫైజ్ ఫేస్బుక్ పోస్ట్లో, భారత సైనికులపై పుల్వామాలో జరిగిన దాడి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు మతాల మధ్య శత్రుత్వాన్ని పెంచేలా ఉన్నాయని ఆరోపించిన పోలీసులు ఫైజ్ను అరెస్ట్ చేసి, అతని ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. 2019, ఫిబ్రవరి 24న పుల్వామా దాడి జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై భారత భద్రతా సిబ్బందిని తీసుకెళ్తున్న వాహనాల కాన్వాయ్పై జరిగిన ఉగ్రవాదులు ఆత్మాహుతికి దాడికి పాల్పడ్డారు. జమ్మూ- శ్రీనగర్ జాతీయ రహదారిపై జైషే మొహమ్మద్ ఉగ్రవాదుల దాడిలో 40మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. -
ఇండియా@75: పుల్వామా దాడి
జమ్మూ కశ్మీర్లో 2019 ఫిబ్రవరి 14 న పాకిస్థాన్ ముష్కరులు సీఆర్పీఎఫ్ కాన్వాయ్ను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతికి దాడికి తెగబడ్డారు. జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన ఆ బాంబు దాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)కి చెందిన 40 మంది సైనికులు బలయ్యారు. జమ్మూ– శ్రీనగర్ జాతీయ రహదారిపై లేథిపుర (అవంతిపురా సమీపం) లో ఆ రోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఘాతుకం చోటుచేసుకుంది. జమ్మూ నుంచి సైనికులు శ్రీనగర్కు వెళ్తుండగా ముష్కరులు మాటువేసి ఘాతానికి పాల్పడ్డారు. సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్లో 10 మందికి పైగా మిలిటెంట్లు హతమయ్యారు. పుల్వామా దాడి తర్వాత భారత్, పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ దాడికి తామే బాధ్యులమంటూ పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలకు గుణపాఠం చెప్పాలని భావించిన భారత్.. ఫిబ్రవరి 26న తెల్లవారుజామున సరిహద్దులు దాటి పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి బాలాకోట్లోని జైషే మొహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. 40 ఏళ్ల తర్వాత పాక్ భూభాగంలోకి భారత్ యుద్ధ విమానాలు చొచ్చుకెళ్లడం ఇదే తొలిసారి. మరోవైపు.. పుల్వామా దాడికి తామే కారణమంటూ.. ఇది పాక్ ప్రజల విజయమని ఆ దేశ మంత్రి ఫవద్ ఛౌధురీ ఆ తర్వాతి ఏడాది జాతీయ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడంతో పాక్ కుట్ర తేటతెల్లమయ్యింది. ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి. పాకిస్థాన్కి పట్టుబడి, విడుదలైన ఫైటర్ పైలట్ అభినందన్ వర్థమాన్. యాంటీ శాటిలైట్ మిస్సైయిల్ కలిగిన నాలుగో దేశంగా భారత్. చంద్రయాన్ 2 ని ప్రయోగించిన భారత్. కోడి రామకృష్ణ, మనోహర్ పారికర్, వింజమూరి అనసూయాదేవి, రాళ్లపల్లి, గిరీశ్ కర్నాడ్, షీలా దీక్షిత్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, రామ్ జఠ్మలానీ, వేణమాధవ్.. కన్నుమూత. (చదవండి: మహోజ్వల భారతి: నంబర్ 1 స్టూడెంట్ ) -
Pakistan PM: థ్యాంక్స్ ‘మోదీ జీ’.. పాక్ కొత్త పీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: భారత ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్తాన్ నూతన పీఎం షెహబాజ్ షరీఫ్ ఆదివారం లేఖ రాశారు. ఈ లేఖలో భారత్తో శాంతియుత సంబంధాలు, కశ్మీర్ సహా అపరిష్క్రత సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అయితే, పాక్లో అవిశ్వాస తీర్మానం తర్వాత ప్రధాన మంత్రిగా షెహబాజ్ షరీఫ్ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా ఓ లేఖలో భారత ప్రధాని మోదీ.. షెహబాజ్ షరీఫ్కు అభినందనలు తెలిపారు. ఆ లేఖలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాక్ నూతన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు. కాగా, ఈ లేఖపై పాక్ ప్రధాని స్పందిస్తూ.. శుభాకాంక్షలు తెలిపినందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు అంటూ వ్యాఖ్యానించారు. భారత్తో పాకిస్తాన్ శాంతియుత, సహకార సంబంధాలను కోరుకుట్టున్నట్టు తెలిపారు. అలాగే, జమ్ముకశ్మీర్తో సహా ఇతర వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరులో పాకిస్తాన్ త్యాగం అందరికీ తెలిసిందేనని అన్నారు. శాంతి కోసం పాటుపడాలని అన్నారు. సమస్యల పరిష్కారంతో పాటు సామాజిక, ఆర్థికాభివృద్ధి గురించి ద్వైపాక్షిక చర్చలు జరగాల్సిన అవసరముందని షెహబాజ్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. పుల్వామా ఉగ్రదాడికి ప్రతి స్పందనగా 2019లో పాకిస్తాన్లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిక్షణా శిబిరంపై భారత్ దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల తర్వాత భారత్, పాక్ల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అనంతరం జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేయడం వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ.. పాకిస్తాన్తో భారత్ నిర్మాణాత్మక సంబంధాలను కోరుకుంటోందని ఇటీవలే స్పష్టం చేశారు. తాజాగా మరోసారి అదే విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. -
Pulwama Encounter: జమ్ముకశ్మీర్లో హైఅలర్ట్
జమ్ముకశ్మీర్లో శనివారం ఉదయం హైఅలర్ట్ ప్రకటించారు భద్రతా అధికారులు. శుక్రవారం రాత్రి నుంచి జమ్ములోని వేర్వేరు ప్రాంతాల్లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లలో ముగ్గురు ముష్కరులను మట్టుపెట్టినట్లు అధికారులు ధృవీకరించారు. శుక్రవారం రాత్రి సమయంలో.. పుల్వామా చవల్కాన్లో, హంద్వారా నెచమా, గందర్బాల్ ఏరియాల్లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఈక్రమంలో గాలింపు బృందాలపై టెర్రరిస్టులు కాల్పులు జరపగా, భద్రతా దళాలు ప్రతిదాడికి దిగాయి. శనివారం వేకువ జామున వరకు జరిగిన ఈ కాల్పుల్లో ముగ్గురు హతమయ్యారని కశ్మీర్ ఐజీ విజయ్కుమార్ చెప్పారు. మరొకరికోసం గాలిస్తున్నామన్నారు. పుల్వామాలోని చవల్కాన్ ప్రాంతంలో జైషే మహమ్మద్కు చెందిన టెర్రరిస్టులను మట్టుబెట్టినట్లు విజయ్ కుమార్ తెలిపారు. మరో ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నట్లు వెల్లడించారు. చనిపోయిన ఉగ్రవాదుల్లో JeM కమాండర్ కమాల్ భాయ్ తో పాటు ఒక పాకిస్థానీ ఉన్నట్లు వెల్లడించారు. We had launched joint ops at 4-5 locations yesterday night. So far 2 terrorists of JeM including 1 Pakistani killed in Pulwama, 1 terrorist of LeT killed each in Ganderbal & Handwara. Encounters over in Handwara & Pulwama. Also arrested 1 terrorist alive: IGP Kashmir (File pic) pic.twitter.com/BPN25Gx3dz — ANI (@ANI) March 12, 2022 ఇక గందర్బల్ హంద్వారాలో జరిగిన ఎదురుకాల్పులో ఒక ఉగ్రవాది హతమయ్యాడని, అతడు లష్కరే తొయిబా సంస్థకు చెందిన టెర్రరిస్టుగా గుర్తించామన్నారు. పలుచోట్ల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నదని చెప్పారు. -
ది పుల్వామా కేస్: కశ్మీర్ గడ్డపై నెత్తుటి మరక
ఉత్తర భారతదేశంలోని... జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రం. దక్షిణ కాశ్మీర్లోని పుల్వామా హైవే... సమయం... మద్యాహ్నం 3గంటల 30నిమిషాలు. సీఆర్పీఎఫ్ జవాన్లను తీసుకు వెల్తున్న కాన్వాయ్పై ఒక్కసారిగా ఆత్మాహుతి దాడి జరిగింది. బ్లూకలర్ కార్... వేగంగా దూసుకువచ్చి జవాన్లు వెలుతున్న బస్సులోకి దూసుకుపోయింది. అంతలోనే ఒక్కసారిగా భారీ పేలుడు జరిగింది.. పేలుడు ధాటికి జవాన్లు ప్రయాణిస్తున్న బస్సులు తునాతునకలై పోయాయి. అందులో ఉన్న వారి మృతదేహాలు చెల్లాచెదురైపోయాయి. అసలేం జరిగిందో అర్ధం అయ్యేలోపు... జరగాల్సిన దారుణం జరిగిపోయింది. కనీవిని ఎరుగని రీతిలో జరిగిన ఈ దాడితో ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడింది. భద్రతా దళాల మీద జరిగిన భయంకర దాడి తరువాతి కాలంలో దేశభద్రత, రాజకీయ అంశాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. పుల్వామా దాడి ఒక ఆత్మాహుతి దాడి. కారుణలో పెద్ద ఎత్తున పేలుడు పదార్ధాలు కూర్చి ఆ కారును భద్రతా దళాల వాహనాలతో ఢీకొట్టడం ఈ మొత్తం దాడిలో కీలకం. ఈ దాడి ఎలా జరిగింది ఇంత పెద్ద ఎత్తున ఏవిధంగా పేలుడు పదార్ధాలు దేశంలోకి వచ్చాయనేది కూడా విచారణ సంస్థలను విస్మయానికి గురిచేశాయి. ఈ దాడిలో పాల్గొన్నది స్థానిక కశ్మీరీ ఉగ్రవాదులా లేక పాకిస్థాన్ నుంచి వచ్చిన సీమాంతర ఉగ్రవాదులా అనేది ఈ కేసులో చాలాకాలం మిస్టరీగా ఉండింది. 40మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న ఈ దాడి విచారణను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ ఎన్ఐఏకు అప్పగించారు. పుల్వామా.. దక్షిణ కాశ్మీర్లో ఉన్న పట్టణం గుండా వెళుతున్న హైవే అటు జమ్మూను ఇటు కాశ్మీర్ను కలుపుతుంది. చలికాలంలో ముఖ్యంగా నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున మంచుక కురవడం వల్ల... హైవేపై రాకపోకలు ఆగిపోతాయి. అటు జమ్మూ నుంచి కాశ్మీర్లో ఉన్న భద్రతా దళాలకు నిత్యావసరాల నుంచి అమ్యునేషన్ ఏది పంపాలన్నా ఈహైవే ద్వారానే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. 2019లో కూడా జమ్మూలోని సీఆర్పీఎఫ్ క్యాంప్లో ఉన్న జవాన్లను కాశ్మీర్కు పంపేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. ముఖ్యంగా సెలవుల మీద వెళ్లివచ్చిన జవాన్లు ముందుగా జమ్మూలోని క్యాంప్లో రిపోర్ట్ చేస్తారు... ఆ తరువాత వారు ఒకేసారిగా కాశ్మీర్లోని క్యాంప్లకు భారీ భద్రత మధ్య కాన్వాయ్లో వెళతారు. అయితే 2019 జనవరి15 తరువాత కాశ్మీర్లో భారీగా మంచు కురిసింది దీంతో దాదాపు 20రోజుల పాటు జవాన్లను తరలించడం సాధ్యం కాలేదు. ఫిబ్రవరి 5వ తేదీన జవాన్ల కాన్వాయ్ వెళ్లేందుకు ఏర్పాటు చేసినా... మంచు కారణంగా అది ఫిబ్రవరి 14కు వాయిదా పడింది. గతంలో కాశ్మీర్లో వ్యవహారలను చూసే బీఎస్ఎఫ్ స్థానంలో సీఆర్పీఎఫ్ సిబ్బందికి ఆ బాధ్యతలు అప్పగించారు. ఆ తరువాత సీఆర్పీఎఫ్ జమ్మూ కాశ్మీర్లో భద్రతా వ్యవహారాలను పర్యవేక్షిస్తోంది. ఫిబ్రవరి 14న తెల్లవారు జామున 4గంటల ప్రాంతంలో జమ్మూ నుంచి భారీగా జవాన్లను తీసుకుని వాహనాలు కాశ్మీర్కు బయలుదేరాయి. మొత్తం 78వాహనాల్లో 2547మంది సీఆర్పీఎఫ్ జవాన్లు... జమ్మూ నుంచి కాశ్మీర్లో ఉన్న క్యాంపుకు వెలుతున్నారు. జమ్మూ-కాశ్మీర్ను కలిపే టన్నెల్ వద్దకు మద్యాహ్నం సమయానికి జవాన్ల కాన్వాయ్ చేరుకుంది. టన్నెల్ నుంచి పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలలోనే జవాన్ల తరలింపు జరగాలి. ఇది స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్. భద్రతా కారణాల దృష్ట్యా కాశ్మీర్లో భద్రతా దళాలు పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ కాన్వాయ్లోనే ప్రయాణించాలి. అయితే భారీగా జవాన్లు ఉండటంతో... సరిపోయినన్ని బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు టన్నెల్ వద్దరు రాలేదు. దీంతో చాలామంది జవాన్లు... సాధారణ బస్సుల్లోనే కూర్చుండి అక్కడి నుంచి ప్రయాణం కొనసాగించారు. 2019ఫిబ్రవరి 14 రోజున మద్యాహ్నం 2గంటల సమయంలో పుల్వామా హైవేపై పోలీసుల హడావిడి ప్రారంభం అయింది. ఏరియా డామినేషన్ పార్టీ పూర్తిగా హైవే తమ ఆధీనంలోకి తీసుకుంది. జవాన్లు ఆ ఏరియా దాటిపోయే వరకు హైవేపై ఇతర వాహనాలను అనుమతించరు. ఇది ఎప్పుడూ ఉండే ప్రొసీజర్. దాదాపు 3గంటల 15నిమిషాల సమయంలో సీఆర్పీఎఫ్ జవాన్ల బస్సులు పుల్వామా సరిహద్దులోకి చేరుకున్నాయి. 3గంటల 30నిమిషాలకు పుల్వామా పట్టణాన్నిదాటి కాన్వాయ్ ముందుకు కదులుతోంది. అంతలోనే రెండు ఒక బ్లూకలర్ మారుతి కారు సర్వీస్ రోడ్డు నుంచి హైవే మీదకు వెళ్లే మార్గం దగ్గర నుంచి ఒక్కసారిగా కాన్వాయ్లోని బస్సుల మీదకు దూసుకుపోయింది. వెంటనే భారీ పేలుడు జరిగింది.. పేలుడు ధాటికి బస్సు పూర్తిగా తునాతునకలైంది. ఒక్కసారిగా ఊహించని విధంగా భారీ పేలుడు జరగడంతో అసలేం జరిగిందో ఎవరికి అర్ధం కాలేదు. వెంటనే ముందు బస్సులో ఉన్న జవాన్లు కన్ఫ్యూజన్లో కాల్పులు జరిపారు. అయితే వెంటనే తేరుకుని ఎవరూ లేరని గ్రహించి క్షతగాత్రుల వద్దకు చేరుకున్నారు. పేలుడు తీవ్రత దాదాపు 10కిలోమీటర్ల వరకు వినిపించింది. బస్సు నామరూపాల్లేకుండా ధ్వంసం అయింది చాలామంది జవాన్ల శరీర భాగాలు ముక్కలు ముక్కలైపోయాయి. హైవే పక్కన ఎలాంటి నివాస జనావాసాలు లేవు. అయితే హైవే కింది భాగంలో నివాస ప్రాంతం ఉంది. పేలుడు తరువాత వెంటనే తేరుకున్న అధికారులు సహాయంకోసం దగ్గరలోనే ఉన్న ఆసుపత్రితో పాటు ఆర్మీ క్యాంపుకు సమాచారం అందించారు. అక్కడి చేరుకున్న అధికారులు ఆ భీతావాహ దృష్యాలను చూసి స్థబ్దులైపోయారు. చనిపోయిన జవాన్ల మృతదేహాలు చేసి అధికారుల కళ్లు చెమర్చాయి. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు... చనిపోయిన వారి మృతదేహాల భాగాలను భద్రపరిచారు. దాదాపు 200మీటర్ల వరకు జవాన్ల మృతదేహాలు... చేతివేళ్లు.. కాలి ముక్కలు విసిరివేసినట్లు పడ్డాయి. ఆ భాగాలను బాక్సుల్లో అమర్చి...ఆర్మీ బేస్ క్యాంపుకు తరలించారు. పుల్వామా వార్త టీవీ స్క్రీన్లను తాకగానే .. దేశవ్యాప్తంగా ప్రజలు ఆ దృశ్యాలను చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ఈ దాడి మీద తీవ్రమైన ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తాయి. ఈ సంఘటన జరిగిన 15నిమిషాల్లోనే బాంబుదాడి జరిపింది తామేనంటూ జైషే మహమ్మద్ ఒక వీడియో విడుదల చేసింది. మహమ్మద్ దాడికి పాల్పడింది తామే అంటూ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో అదిల్ అహ్మద్ దార్ అని చెప్పుకున్న ఒ ఉగ్రవాది ఎమ్-4 కార్బైన్ గన్ , ఒక పిస్టల్ పట్టుకుని కనిపించాడు. ఆదిల్ వెనకాల జైషే మహమ్మద్ జెండా ఉంది. ఈ దాడికి పాల్పండింది తానేనని చెప్పుకున్న దార్... గతంలో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చేసిన దాడుల గురించి చెప్పుకొచ్చాడు. ఈ వీడియో విడుదల కాగానే భద్రతాదళాలతో పాటు ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడిపెరిగింది. ఆత్మాహుతి దాడి చేసి ఆ వెంటనే వీడియో విడుదల చేయడం ద్వారా ఉగ్రవాద అనుకూల ప్రాపగాండాను విస్తరింపజేయాలనే కుట్ర జరిగింది. దాడిలో ఎంత మంది జవాన్లు చనిపోయారనే వార్తను సీఆర్పీఎఫ్ ధృవీకరించక ముందే జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ తన వెబ్సైట్ అల్ఖలమ్లో 40మంది జవాన్లు చనిపోయారని ఖచ్చితమైన మృతుల సంఖ్యను ప్రకటించింది. దీంతో పేలుడు జరిగిన తరువాత ఎప్పటికప్పుడు సమాచారం పాకిస్థాన్కు వెలుతుందనే విషయాన్ని నిఘావర్గాలు గుర్తించాయి. పేలుడు తీవ్రత... భారీగా జవాన్లు చనిపోవడంతో... కేంద్రం వెంటనే ఈ కేసును జాతీయ విచారణ సంస్థ ఎన్ఐఏకు అప్పగించింది. ఎన్ఐఏ జమ్మూకాశ్మీర్ చీఫ్...రాకేశ్ బల్వాల్ ఈ కేసు విచారణ అధిపతిగా నియమితులయ్యారు. వెంటనే రాకేశ్ సంఘటనా స్థలానిక వెళ్లి పరిశీలించారు. దాదాపు 200మీటర్ల దూరం వరకు పడి ఉన్న వాహన శకలాలు, ఇతర సాక్ష్యాధారాలను సేకరించారు. రెండవ రోజు పేలుడు జరిగిన ప్రాంతానికి సెంట్రల్ ఫొరెన్సిక్ సైన్స్ లాబరేటరి, నేషనల్ బాంబ్ డాటా సెంటర్, ఎన్ఐఏ బాంబ్ స్క్వాడ్, ఎన్ఎస్జీ సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. సంఘటనా స్థలం నుంచి పేలుడుకు ఉపయోగించిన కారు ముక్కలను సేకరించారు. కారు ఇంజిన్ కు సంబంధించిన కొన్ని భాగాలను సేకరించి దాని ఛాసిస్ నెంబర్ గుర్తించే ప్రయత్నం చేశారు. అయితే ఆ కారు తయారీకి సంబంధించిన నెంబర్లను ముందుగానే జాగ్రత్తగా తొలగించినట్లు అధికారులు గుర్తించారు. వెంటనే ఫిబ్రవరి 18న మారుతీ కంపెనీకి చెందిన ఇంజనీర్ల టీమ్ విచారణ సంస్థలకు సహకరించడానికి ఢిల్లీ నుంచి కాశ్మీర్కు చేరుకుంది. మారుతీ ఇంజనీర్స్ కారు ఇంజన్ పూర్తిగా ఓపెన్ చేసి అందులో ఉన్న కారు ఇంజన్ బ్యాచ్ నెంబర్ గుర్తించగలిగారు. ఆ నెంబర్ సహాయంతో దాడికి వాడిన కారు మారుతి ఈకో మోడల్ గా తేల్చారు. దాని మోడల్ నెంబర్ ద్వారా ఇది 25జనవరి 2011రోజున తయారైనట్లు... ఆరోజు తయారైన 7ఈకో కార్లలో ఒక్కటి మాత్రమే కాశ్మీర్లో అమ్ముడైనట్లు గుర్తించారు. ఈ దాడికి వాడిన మారుతి ఈకో కారు ఛాసిస్ నెంబర్ MA3ERLF1SOO183735... కారు ఇంజిన్ నెంబర్...G12BN164140గా గుర్తించారు. విచారణలో కారు డీటేయిల్స్ తెలియగానే... ఆ కారు యజమాని జలీల్ అహ్మద్ హక్కానీను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కారు షోరూంలో కొనుగోలు చేసిన తరువాత కొన్నిరోజులకు తాను ఆ కారును ఇతరులకు అమ్మేసినట్లు హక్కాని ఎన్ఐఏ అధికారులకు చెప్పాడు. పోలీసులు విచారణను మరింత లోతుగా జరిపినప్పుడు ఆ కారు తరువాతి కాలంలో దాదాపు 6గురి చేతులు మారిందని... గుర్తించారు. గతంలో కారును కొనుగోలు చేసిన 6గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణను రహస్యంగా ఉంచేందుకు కొన్నాళ్లపాటు ఆ ఆరుగురిని పోలీసులు తమ అదుపులోనే ఉంచుకున్నారు. ఇక ఈ కారు అమ్మకంలో దానిష్ అహ్మద్ లోన్ అనే బ్రోకర్ కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. ఇక అహ్మద్ లోన్ను విచారిస్తే ఈ కారును తన బంధువు సజ్జాద్ భట్కు అమ్మినట్లు తెలిపాడు. చివరిసారిగా మారుతి ఈకో కారును 2019 జనవరిలో 1.85లక్షలకు సజ్జాద్ భట్కు అమ్మినట్లు బ్రోకర్ తెలిపాడు. ఇక సజ్జాద్ భట్ కోసం వెళ్లిన పోలీసులు అప్పటికే అతను పారిపోయినట్లు గుర్తించారు. దీంతో కేసు విచారణ అక్కడే ఆగిపోయింది. ఓ వైపు కేసు విచారణ కొనసాగుతుండగా ... ఈ పేలుడు పెద్ద ఇంటెలిజెన్స్ ఫేయిల్యూర్ అని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఇంత పెద్ద ఎత్తున ఆర్డీఎక్స్ కాశ్మీర్లోకి ఎలా వచ్చిందనే చర్చ ప్రారంభం అయింది. అది ఎన్నికల సమయం కావడంతో కావాల్సినంత రాజకీయం జరిగింది. దీంతో విచారణను వేగవంతం చెయ్యాలనే ఒత్తిడి ఎన్ఐఏపై పెరిగింది. దీంతో ఏదో విధంగా కేస్లో బ్రేక్ త్రూ సాధించాలనే పట్టుదలతో... విచారణాధికారి బలవాల్ సంఘటన స్థలంలో 250మీటర్ల వరకు పోలీసులతో క్షుణ్ణంగా వెతికించాలని సంకల్పించారు. ఆ ప్రాతంలో ఉగ్రవాదులకు మద్దతుగా ఉండే అతివాద శక్తులున్నాయని... అక్కడ 250మీటర్లు వెతకాలంటే కుదిరే అవకాశం లేదని జమ్మూకాశ్మీర్ పోలీసులు అభ్యంతరం తెలిపారు. అయినా వెనక్కి తగ్గని బలావల్ పై అధికారులను ఒప్పించి సంఘటన జరిగిన 6రోజులకు ఫిబ్రవరి 20న బ్లాస్ట్ సైట్లో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు... ఈ సెర్చ్ ఆపరేషన్లో 400మంది సీఆర్పీఎఫ్ జవాన్లు, 100మంది ఎన్ఐఏ అధికారులు పాల్గొన్నారు. ఉదయం నుంచి కొనసాగిన ఈ వెతుకులాటలో చనిపోయిన జవాన్ల చిన్న చిన్న శరీర భాగాలు... పేలిపోయిన వాహనాల ముక్కలు తప్ప ఏమీ లభించలేదు.అప్పటికే అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న స్థానికులు... పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వడం ప్రారంభించారు. మద్యాహ్నం తరువాత పేలుడు జరిగిన ప్రదేశం నుంచి దాదాపు 200మీటర్ల దూరంలో బలావల్కు మట్టిలో మెరుస్తూ ఒక తాళంచెవి కనిపించింది. 1026 నెంబర్తో ఉన్న కారు కీ ఎన్ఐఏ అధికారి బలావల్ చేతికి చిక్కింది. తాళంచెవి మీద ఉన్న రక్తం మరకలను ఆత్మాహుతి దాడి చేసిన ఆదిల్ ఆహ్మద్ దార్ రక్తం డీఎన్ఏతో పోల్చారు. కారుతో ఆత్మాహుతి దాడికి పాల్పడింది అహ్మద్ దార్ అధికారులు నిర్ధరించారు. ముందుగా ఈ దాడి చేసింది.. కాశ్మీరీయా లేక పాకిస్థాన్ నుంచి వచ్చి న ఉగ్రవాదా అనే విషంయపై పెద్ద చర్చ జరిగింది. గతంలో కాశ్మీరీలు ఆత్మాహుతి దాడులు చేసిన సందర్భాలు చాలా తక్కువ. దీంతో మొదటిసారిగా ఒక కాశ్మీరి ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు గుర్తించారు. వీడియో విడుదల చేసిన ఆదిల్ అహ్మద్ దార్... స్వయంగా ఈ దాడి జరిపాడని పేలుడులో అతను కూడా మరణించాడని నిర్ధారణ అయింది. దాడికి పాల్పడిన వ్యక్తి కాశ్మీర్లోని పుల్వామాకు చెందిన ఆదిల్ దార్గా తేలింది. ఇక కారు పుల్వామాకే చెందిన సజ్జాద్ భట్ కొనుగోలు చేసినట్లు కూడా నిర్దారణ అయింది. దీంతో ఇక కారు ఓనర్ సజ్జాద్ భట్ ఇంటిపై పోలీసులు రేడ్ చేశారు. భట్ అక్కడ లేడని... వారం రోజుల నుంచి ఇంటికి రాలేదని అతని తండ్రి తెలిపాడు. అయితే సూసైడ్ బాంబర్ ఆదిల్ దార్ చదువుకున్న సిరాజ్ ఉల్ ఉలుమ్ మదర్సాలోనే భట్ కూడా చదువుకున్నట్లు పోలీసులు గుర్తించారు. జమాతే ఇస్లామీ జమ్ము-కాశ్మీర్ అనే సంస్థ ఈ మదర్సా నడుపుతోంది. వెంటనే 28ఫిబ్రవరి 2019నాడు ఈ సంస్థను కేంద్రం నిషేధించింది. ఇక ఫిబ్రవరి 25నాడు ఏకే-47పట్టుకుని సజ్జాద్ భట్ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలో చేరినట్లు సోషల్ మీడియాలో ఫోటోలు సర్క్యులేట్ అయ్యాయి. దీంతో ఈ కేసులో సజ్జాద్ భట్ కీలకం అని పోలీసులు భావించారు.సజ్జాద్ భట్ కోసం వెతుకులాట ప్రారంభించిన పోలీసులకు ఎలాంటి ఫలితం లభించలేదు. దీంతో అతను పాకిస్థాన్ వెళ్లిపోయినట్లు భావించారు. కేసు మళ్లీ మొదటికొచ్చింది.. ఈ కేసులో విచారణలో పురోగతి లేదు ఇక నెలలు గడుస్తున్నా కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో... ఎన్ఐఏ అధికారులు పుల్వామా తరువాత జరిగిన ఎన్కౌంటర్లపై దృష్టిసారించారు. ఎన్ఐఏ అధికారి బలావల్ ఓ ఎన్కౌంటర్ సంఘటనపై దృష్టిసారించారు. 2019 మార్చిలో నౌగామ్ పోలిస్స్టేషన్ పరిధిలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో జైషేమహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన కామ్రాన్ అనే ఉగ్రవాది హతమయ్యాడు. కామ్రాన్తో పాటు మరో ఉగ్రవాది కూడా ఈ ఎన్కౌంటర్లో చనిపోయాడు.కామ్రాన్ స్థానికంగా జైష్ కమాండర్గా ఉన్నాడు... దీంతో చనిపోయిన రెండో ఉగ్రవాదిపై పోలీసులు పెద్దగా దృష్టిసారించలేదు. అయితే కామ్రాన్తో పాటు చనిపోయిన మరో ఉగ్రవాది ఆడిడాస్ జాకెట్ వెసుకుని నీట్గా హేయిర్ కట్ చేసుకుని ఉన్నాడు. సాధారణంగా కాశ్మీరీ ఉగ్రవాదులు ఇలా నీట్గా హేయిర్ కట్ చేసుకోవడంగాని గడ్డం ట్రిమ్ చేసుకోవడంలాంటివి చేయరు. దీంతో ఈ ఉగ్రవాదిపై ఎన్ఐఏ అధికారి బలావల్కు అనుమానం వచ్చింది. చనిపోయిన ఉగ్రవాది పేరు ఇద్రీస్ భాయ్ అని స్థానిక పోలీసులు చెప్పారు... ఇద్రీస్ దగ్గర ఒక ఎమ్-4కార్బన్తో పాటు పిస్టర్ రెండు సెల్ఫోన్లు దొరికినట్లు పోలీసులు తెలిపారు. రెండు ఫోన్లలో ఒకటి ఐఫోన్ కాగా మరొకటి సాంసంగ్ ఎస్-9 ప్లస్. అయితే ఈ రెండు ఫోన్లు ఎన్కౌంటర్లో చనిపోకముందు ఇద్రీస్ పూర్తిగా వీటిని ధ్వంసం చేశాడని. ఈ ఫోన్ల నుంచి ఎలాంటి సమాచారం లభించలేదని... పోలీసులు చెప్పారు. అయితే ఈ ఫోన్లను పరిశీలించిన కాశ్మీర్ పోలిస్ సైబర్ సెల్ ఇందులో ఎలాంటి డేటా తీయలేకపోయామని బలావల్కు తెలిపారు. ఈ ఫోన్లను ఎలాగైనా ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్కు పంపాలని ఎన్ఐఏ అధికారి బలావల్ ప్రయత్నించాడు. అయితే దీనికి రూల్స్ ఒప్పుకోవని కాశ్మీర్ పోలీసులు కరాఖండీగా చెప్పారు. అయినా పుల్వామా కేసు కొలిక్కి రావాలంటే... ఏదో ఒక బ్రేక్ త్రూ కావాలనే తపనతో ఉన్న ఎన్ఐఏ అధికారి బలవాల్లో అన్ని అవకాశాలను వాడుకున్నాడు. దీంతో తనకు పరిచయమున్న కాశ్మీర్ క్యాడర్ ఐపిఎస్ అధికారిని రిక్వేస్ట్ చేసి ఆ ఫోన్లు స్వాధీన పరుచుకునేందుకు పర్మిషన్ తీసుకున్నాడు. వెంటనే ఆ ఫోన్లు ఢిల్లీలోని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ చేతికి అందాయి. చాలా కష్టపడి పూర్తి డేటాను వెలికితీసిన ఇంజనీర్ల టీమ్కు జాక్పాట్ తగిలింది. వెంటనే ఎన్ఐఏ అధికారి రాకేశ్కు అందులో ఉన్న డేటాను పరిశీలించడాని ఢిల్లీ వెల్లాడు. ఓ వైపు ఎన్ఐఏ అధికారులు ఫోన్లో దొరికిన సమాచారాన్ని ఫోటోలను పరిశీలిస్తున్న సమయంలో.. మరో సంఘటన జరిగింది. ఒక వాహనం జమ్మూ నుంచి కాశ్మీర్లోకి ఎంటర్ అవుతుండగా పోలీసులకు అనుమానం కలిగి చెక్పోస్ట్ దగ్గర ఆపారు. అనుమానం వచ్చిన పోలీసులు వారిని నిలదీశారు. దీంతో వారు పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరు అడవిలోకి పారిపోయారు... వీరిని వెంబడించిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఒకరిని సమీర్ దార్ గా గుర్తించారు. సమీర్ దార్ను విచారించిన తరువాత పుల్వామా ఆత్మాహుతి దాడిలో పాల్గొన్న ఆదిల్ దార్ కు ఇతను సోదరుడిగా గుర్తించారు. దీంతో రంగంలోకి దిగిన ఎన్ఐఏ అధికారులు పుల్వామా దాడి తరువాత వచ్చిన వీడియోను సమీర్దార్కు చూపించారు. అయితే ఆ వీడియోలో ఉన్న వ్యక్తి సూసైడ్ బాంబర్ ఆదిల్ దారేనని... అయితే ఆ గొంతుమాత్రం అతనిది కాదని చెప్పాడు. గతంలోనే ఆ వీడియోను పూర్తిగా పరిశీలించిన ఫొరెన్సిక్ అదికారులు ఇది డబ్బింగ్ చెప్పిన వీడియో అని చెప్పారు. చనిపోయింది సూసైడ్ బాంబర్ ఆదిల్ దార్... డీఎన్ఏ టెస్టులో ఇది నిర్ధరణ అయింది. మరి గొంతు ఎందుకు డబ్బింగ్ చెప్పాల్సి వచ్చిందో పోలీసులకు గతంలో అర్ధం కాలేదు. ఇప్పుడు విచారణలో సమీర్ ఆ గొంతు మరో ఉగ్రవాది హింజిలా జిహాదిది అని చెప్పాడు. దీంతో ఈ హంజిలా జిహాదీ ఎవరు దానిపై పోలీసులు విచారణ జరిపారు. ఈ హంజిలా జిహాది అనే వ్యక్తి పుల్వామాకే చెందిన ఒక కార్పెంటర్ అని పోలీసుల విచారణలో తేలింది. హంజిలా ఎక్కడున్నాడని పోలీసులు సాగించిన వేటలో... ఆర్టికల్ 370రద్దు సందర్భంగా అతడని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారని తేలింది. దీంతో పోలిసు కస్టడీలో ఉన్న హంజిలాను తీసుకువచ్చి ఎన్ఐఏ విచారణ జరిపింది. ఇంతలో ఉగ్రవాది ఇద్రీస్ ఖాన్ ఐఫోన్లో ఉన్న ఫోటోలు కూడా ఎన్ఐఏ అధికారుల చేతికి అందాయి. ఇద్రీస్ఖాన్తో పాటు హంజిలా కూడా ఫోటోల్లో ఉన్నాడు. దీంతో పోలీసులు ఇద్రీస్ఖాన్ గురించి అడిగితే హంజిలా అతను ఇద్రీస్ కాదని.. పాకిస్థాన్ నుంచి వచ్చిన ఉమర్ ఫారూఖ్ అని చెప్పాడు. ఈ మొత్తం దాడిలో ఉమర్ ఫారూఖ్ కీలకం అని.. ఉమర్ ఫారూఖ్ సాక్ష్యాత్తూ పాకిస్థాన్లో ఉన్న మసూద్ అజ్హర్ అన్న కొడుకు అని హంజిలా చెప్పాడు. తానే స్వయంగా సూసైడ్ బాంబర్ను కారులో పుల్వామా హైవే వరకు తీసుకు వెళ్లానని... బాంబు పేలుతున్న సమయంలో అక్కడే ఉన్నానని హంజిలా కథ మొత్తం చెప్పాడు. పుల్వామా బాంబు దాడికోసం పాకిస్థాన్ కేంద్రంగా ఉన్న జైషే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థ దాదాపు రెండేళ్లుగా రెక్కి నిర్వహించింది. దీనికోసం పాకిస్థాన్ నుంచి మౌలానా మసూద్ అజ్హర్ అన్న కొడుకు ఉస్మాన్ హైదర్ 2017లో కాశ్మీర్లోకి చొరబడ్డాడు. అయితే అతను ఆపరేషన్ పూర్తి చేయకముందే భద్రతా దళాల ఎన్కౌంటర్లోచనిపోయాడు. దీంతో మళ్లీ అతని సోదరుడు ఉమర్ ఫారూఖ్ను ఇద్రీస్ భాయ్ అనే పేరుపెట్టి పాకిస్థాన్ నుంచి కాశ్మీర్లోకి చొప్పించారు. ఆప్ఘనిస్తాన్లోని ఉగ్రవాద సంస్థల్లో శిక్షణ పొందిన ఉమర్ ఫారూఖ్... ఐఈడీలు తయారు చేయడంలో సిద్ధహస్తుడు. తాలిబాన్ క్యాంపుల్లో చాలాకాలం పాటు అమెరికా సైనికులతో పోరాడని ఉమర్ ఫారూఖ్... ఇండియాలో పెద్ద పేలుడు చేసే ఉద్దేశంతో కాశ్మీర్ సరిహద్దుల నుంచి ఇండియాలోకి ఎంటరయ్యాడు. వచ్చే సమయంలో తనతో పాటు పెద్ద ఎత్తున ఆర్డీఎక్స్ తెచ్చుకున్నాడు. 50లక్షల రూపాయలు హవాలాద్వారా ఈ ఆపరేషన్కు ఉపయోగించినట్లు సమచారం. ఇండియాకు వచ్చిన ఇద్రీస్ పుల్వామాలోని బిలాల్ అహ్మద్ కూచే అనే వ్యక్తి ఇంట్లో ఉన్నాడు. అక్కడే ఆదిల్ దార్ను పూర్తిగా సూసైడ్ బాంబర్గా మార్చడానికి కావాల్సిన ట్రైనింగ్ ఇచ్చాడు. ఆదిల్ దార్ ఒక చిన్న దుకాణంలో పనిచేసేవాడు... అతడికి మతమౌఢ్యం ఎక్కించడంతో పాటు ఇండియాపై విషం నింపాడు. ఇక పేలుడుకు కావాల్సిన కారును సజ్జాద్ అహ్మద్ భట్ ద్వారా కొనుగోలు చేయించాడు. ఇక తనతో పాటు తెచ్చుకున్న ఆర్డీఎక్స్కు తోడుగా కావాల్సిన ఎలక్ట్రికల్ వస్తువులు, అల్యూమినియం పౌడర్ సైతం అమెజాన్ నుంచి కొనుగోలు చేశారు. అవేజ్ భోలా అనే యువకుడి అమెజాన్ అకౌంట్ ద్వారా ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించారు. ఇక కూచే అనే వ్యక్తి ఇంట్లో ఉన్నప్పుడు ఆయన కూతురు ఇన్షాజాన్తో ఉమర్ ఫారూఖ్ ప్రేమాయణం నడిపాడు. ఆమెతో కలిసి దిగిన ఫోటోలు కూడా తరువాత అతని ఫోన్లో లభ్యమయ్యాయి. ఇక పేలుడుకు నెల రోజుల ముందే బిలాల్ అహ్మద్ కూచే ఇంట్లో ఆదిల్ దార్తో దాడి తరువాత విడుదల చేసే వీడియోను చిత్రీకరించారు. అయితే అందులో ఆదిల్ దార్ సరిగా మాట్లాడలేకపోవడంతో... హంజిలా జివాదీతో డబ్బింగ్ చెప్పించారు. ఈ వీడియోను పాకిస్థాన్కు పంపి...అక్కడ ఉన్న నాయకులతో దానిని ఓకే చేయించారు. ముందుగా ఫిబ్రవరి 5వ తేదీనే దాడి చేయాలనుకున్నా... ఆరోజు మంచు కారణంగా సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. దీంతో బాంబులతో నింపిన కారును దాదాపు పదిరోజుల పాటు కారు కొనుగోలు చేసిన సజ్జాద్ భట్ ఇంటిదగ్గరే ఉంచారు. ఇక చివరిగా 14వ తేదీన పోలీసుల మూవ్మెంట్ చూసి పుల్వామా హైవేపై అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని సూసైడ్ బ్లాస్ట్ చేశారు. కేవలం గంట ముందు పాకిస్థాన్లో ఉన్న మసూద్ అజ్హర్ సోదరుడు తన చిన్నాన్న అమ్మార్ అల్వీకి ఫోన్ చేసి దాడి చేయాలన్న విషయంపై ఉమర్ ఫారూఖ్ పర్మిషన్ తీసుకున్నాడు. చివరి నిమిషంలో ఆదిల్ దార్ పారిపోతాడనే భయంతో...అక్కడికి హంజిలా జిహాదీని తోడుగా పంపించాడు. బయట ఉండి హంజిలా జిహాది బాంబు పేలే వరకు మొత్తం ఆపరేషన్ మానిటర్ చేశాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న హంజిలా జిహాది... ఈ విషయాలను పోలీసులకు పూసగుచ్చినట్లు చెప్పాడు. ఇస్మాయిల్, ఇన్పుట్ ఎడిటర్, సాక్షిటీవీ -
2019 పుల్వామా ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి హతం
-
షార్ట్ సర్వీస్ కమిషన్ పరీక్షలో పాసై భారత సైన్యం లో చేరిన నికిత
-
సైనిక దుస్తుల్లో సగర్వంగా.. మనసుల్ని కదిలించిన ఆ సెల్యూట్
జమ్మూ: చూడముచ్చటైన జంట. పెళ్లయి తొమ్మిది నెలలే అయింది. ఎన్నెన్నో కలలు. భవిష్యత్తుపై కలబోసుకున్న ఊసులు, ఆశలు. అది 2019 ఫిబ్రవరి 14. నితికా కౌల్ కాళ్ల కింద భూమి కంపించింది. భర్త... మేజర్ విభూతి శంకర్ ఉగ్రవాదులతో పోరాడుతూ అమరుడయ్యారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా జీవితం తల్లకిందులైపోతుంది. నిరాశానిస్పృహల్లో కూరుకుపోతారు. కాని నితికా కౌల్ వేరు. మనసులో దృఢ సంకల్పం.. సుస్పష్టమైన లక్ష్యం. దేశసేవలో అమరుడైన భర్త ఆశయాన్ని బతికిస్తూ... తానూ సైన్యంలో చేరాలి. అంతే శ్రమించింది... సాధించింది. దేశం గర్వపడేలా శనివారం లెఫ్టినెంట్ హోదాలో భారత సైన్యం అడుగుపెట్టింది. ఈ ధీశాలి మనోనిబ్బరానికి... అంతకుమించి ఆమె కర్తవ్యదీక్షకు దేశం సలాం కొడుతోంది. స్ఫూర్తిమంతమైన ఆమె విజయానికి ప్రశంసలు కురిపిస్తోంది. విధి నిర్వహణలో భర్త ప్రాణాలు కోల్పోయాక సరిగ్గా 27 నెలల తర్వాత నితికా కౌల్ సైతం భారత సైన్యంలో చేరడం గమనార్హం. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో జైషే మొహమ్మద్ ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు బలైన సంగతి తెలిసిందే. దేశంలో తీవ్ర ఆగ్రహజ్వాలలు. ఆర్మీ, పోలీసులు ప్రతీకారేచ్ఛతో రగిలిపోయారు. పుల్వామా దాడి స్థలానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలోనే ఫిబ్రవరి 18న ఎన్కౌంటర్ జరిగింది. ముగ్గురు జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామా దాడి వెనకున్న ఇద్దరు అగ్రనేతలు ఇందులో ఉన్నారు. ఐదుగురు భద్రతా సిబ్బంది వీరమరణం పొందారు. వీరిలో 55 రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన మేజర్ విభూతి శంకర్ దౌండియాల్ కూడా ఉన్నారు. డెహ్రాడూన్కు చెందిన ఆయనకు అప్పటికి కేవలం 9 నెలల ముందే కశ్మీర్ వాసి నితికా కౌల్తో వివాహం జరిగింది. వారిది ప్రేమ వివాహం. మరో మూడు నెలల్లో వివాహ మొదటి వార్షికోత్సవం ఘనంగా జరుపుకోవాలని ఏర్పాట్లు చేసుకుంటుండగా మాతృభూమి సేవలో దౌండియాల్ ప్రాణాలు అర్పించారు. విధి నిర్వహణలో అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన మేజర్ దౌండియాల్కు భారత ప్రభుత్వం శౌర్యశక్ర పురస్కారం (మరణానంతరం) ప్రకటించింది. సంకల్ప బలంతో... భర్త దూరమైనప్పటికీ నితికా కౌల్ ధైర్యం కోల్పోలేదు. ఆయన ఆశయాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. అందుకు సైన్యంలో చేరడమే మార్గమని నిశ్చయించుకున్నారు. ఢిల్లీలోని ఓ బహుళ జాతి సంస్థలో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా సమర్పించారు. పట్టుదలతో కష్టపడి చదివారు. గత ఏడాది షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) పరీక్షలో, అనంతరం ఇంటర్వ్యూలో నెగ్గారు. తమిళనాడు రాజధాని చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(ఓటీఏ)లో ఏడాదిపాటు విజయవంతంగా శిక్షణ పూర్తి చేశారు. లెఫ్టినెంట్ హోదాలో శనివారం సగర్వంగా సైన్యంలో అడుగుపెట్టారు. మనసుల్ని కదిలించిన ఆ సెల్యూట్ మేజర్ శంకర్ దౌండియాల్ అంత్యక్రియల సందర్భంగా ఆయన భార్య ప్రదర్శించిన మనోనిబ్బరం అందరినీ ఆశ్చర్యపరిచింది. స్వస్థలం డెహ్రాడూన్లో దౌండియాల్ అంత్యక్రియలు జరిగాయి. సంబంధిత వీడియో దృశ్యాలు అప్పట్లో వైరల్గా మారాయి. నితికా తన భర్తకు కన్నీటి వీడ్కోలు పలికారు. గాలిలో ముద్దు (ఫ్లయింగ్ కిస్) ఇచ్చి, ‘లవ్ యూ... విభూ’ అంటూ భర్త పార్థివదేహానికి సెల్యూట్ చేయడం ప్రజల మనస్సులను కదిలించింది. నా భర్తకు మరింత చేరువయ్యా.. ‘‘సైన్యంలో చేరడం ద్వారా నా భర్తకు మరింత చేరువగా ఉన్నట్లు అనుభూతి చెందుతున్నా. సైన్యంలో అడుగుపెట్టడం నా భర్తకు నిజమైన నివాళి అని భావిస్తున్నా. మేజర్ దౌండియాల్ మరణంతో నా జీవితం తొలుత శూన్యంగా మారినట్లు తోచింది. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి చాలా సమయం పట్టింది. సన్నిహితులు దూరమైతే మనోవేదన కలగడం సహజమే. అయినప్పటికీ వాస్తవ పరిస్థితిని అంగీకరించాలి. సానుకూల దృక్పథం అలవర్చుకోవాలి. సైనికుడిగా పోరాడుతూ ప్రాణాలు అర్పించిన భర్త ఆశయాలను కొనసాగించాలంటే సైన్యంలో చేరడం మంచిదని నిర్ణయానికొచ్చా. భర్త మరణించాక 15 రోజులకు ఢిల్లీలో మళ్లీ ఉద్యోగంలో చేరా. మళ్లీ నా కాళ్లపై నేను నిలబడడానికి, బాధను మరచిపోవడానికి కొంతకాలం పనిచేసి, రాజీనామా సమర్పించా. షార్ట్ సర్వీసు కమిషన్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నా. దరఖాస్తును పూర్తి చేయడం నా జీవితంలో తీసుకున్న అతిపెద్ద నిర్ణయం. భర్త అడుగు జాడల్లోనే నడిచే అవకాశం దక్కడం సంతోషంగా ఉంది’’ – లెఫ్టినెంట్ నితికా కౌల్ -
భర్తకు నివాళిగా సైన్యంలో అడుగుపెట్టిన భార్య
సాక్షి, చెన్నై: పుల్వామాలో ఉగ్రవాదులతో పోరాడుతూ 2019 ఫిబ్రవరిలో భారత ఆర్మీ అధికారి మేజర్ విభూతి శంకర్ ధౌండియాల్ వీరమరణం పొందిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన భార్య నితికా కౌల్ భారత సైన్యంలో లెఫ్టినెంట్గా నియమితులయ్యారు. నితికా కౌల్ శనివారం చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ నుంచి ఉత్తీర్ణత సాధించారు. ఆమె తన కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి తన భర్తకు నివాళిగా షార్ట్ సర్వీస్ కమిషన్ పరీక్షను క్లియర్ చేసి సైన్యంలో చేరారు. కాగా దీనిపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ట్విట్టర్లో స్పందిస్తూ...నితికా కౌల్కు అభినందనలు తెలిపారు. "లెఫ్టినెంట్-నితికా కౌల్, మీరు భారతదేశ నారీ శక్తి స్వరూపం. మీ అంకితభావం, సంకల్పం, భక్తి గొప్పది. మేజర్ విభూతి ధౌండియాల్ ఈ రోజు మీ భుజంపై ఉన్న నక్షత్రాలను చూసి ఆనందం, గర్వంతో నవ్వుతారు.’’ అంటూ ట్వీట్ చేశారు. (చదవండి: వైరల్ వీడియో: పోలీస్పై గ్రామస్థుల విచక్షణ రహిత దాడి) -
బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్: ‘కోతి ఖతమైంది’
న్యూఢిల్లీ: 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధం తర్వాత భారతదేశం దాయాది పాకిస్తాన్పై చేసిన మొదటి వైమానకి దాడి బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్. 40 మంది భారత సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ బాలకోట్లోని ఉగ్ర స్థావరంపై చేసిన దాడికి నేటితో రెండు సంవత్సరాలు పూర్తయ్యాయి. సరిగ్గా రెండేళ్ల క్రితం 2019, ఫిబ్రవరి 26న తెల్లవారుజామున 3.30 గంటలకు భారత మిరాజ్ 2000 ఫైటర్ జెట్స్ ఎల్ఓసీని దాటుకుని.. పాకిస్తాన్ బాలకోట్లోని జైషే మహ్మమద్ టెర్రర్ క్యాంప్పై దాడి చేశాయి. ఉరి, బాలాకోట్పై జరిగిన వైమానిక దాడులతో పాక్కు భారత సామార్థ్యం మరోసారి తెలిసి వచ్చింది. ఇక రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఈ దాడికి సంబంధించి మరింత సమాచారం తాజాగా వెలుగులోకి వచ్చింది. నాటి ఎయిర్ స్ట్రైక్ ఆపరేషన్కు పెట్టిన పేరుతో పాటు నాడు ఓ క్షిపణి విఫలమయ్యిందనే వివరాలు వెలుగులోకి వచ్చాయి. నాటి ఆపరేషన్లో మన మిరాజ్ ఫైటర్ జెట్స్ని ఎదిరించేందుకు.. పాక్ తన ఎఫ్ 16 ఫైటర్ జెట్స్ని రంగంలోకి దింపింది. కాని ప్రయోజనం లేకపోయింది. ఈ దాడిలో ఐఏఎఫ్ మిరాజ్ 2000 యోధులు తమ స్పైస్ 2000 పెనెట్రేటర్ బాంబులను విడుదల చేశాయి. ఇవి ఒక్కొక్కటి 90 కిలోల పేలుడు పదార్థాలతో నిండి ఉంటాయి. సరిగ్గా పావుగంట తర్వాత అనగా 3.45 గంటలకు ఎయిర్ చీఫ్ బీఎస్ ధనోవా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్కి ఆపరేషన్ సక్సెస్ అయ్యిందనే సమాచారం ఇచ్చారు. ప్రత్యేక ఆర్ఏఎక్స్ నంబర్ ద్వారా టెలిఫోన్ కాల్ చేసిన ధనోవా హిందీలో బందర్ మారా గయా(కోతి చంపబడింది) అని తెలిపారు. అంటే పాకిస్తాన్, బాలకోట్లో ఉన్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ టెర్రరిస్ట్ శిక్షణా క్యాంప్ని సరిహద్దు దాటి సాహసోపేతమైన ముందస్తు ఆపరేషన్లో భారత్ నాశనం చేసింది అని అర్థం. ఆర్ఏఎక్స్ అనేది అల్ట్రా-సేఫ్డ్ ఫిక్స్డ్-లైన్ నెట్వర్క్. అజిత్ దోవల్తో మాట్లాడిన అనంతరం ధనోవా అప్పటి రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రా సెక్రటరీ అనిల్ ధస్మానాకు తెలియజేశారు. ఆ తర్వాత దోవల్ ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి తెలిపారు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ను గందరగోళపరిచేందుకు ‘బందర్’ అనే కోడ్ పేరును ఉద్దేశపూర్వకంగా ఎన్నుకున్నట్లు బాలకోట్ దాడిలో పాల్గొన్న ఉన్నతాధికారులు వెల్లడించారు. చదవండి: బాలాకోట్ దాడి: సంచలన విషయాలు వెల్లడి పుల్వామా దాడిపై పాక్ సంచలన ప్రకటన -
ప్రభుత్వానికి ప్రశాంతత లేకుండా చేస్తాం
కర్నాల్: డిమాండ్లను పరిష్కరించే వరకు రైతులు ప్రభుత్వానికి ప్రశాంతత లేకుండా చేస్తారని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ అన్నారు. కర్నాల్ జిల్లా ఇంద్రి ధాన్యం మార్కెట్లో ఆదివారం జరిగిన మహాపంచాయత్లో ఆయన ప్రసంగించారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరే కంగా నిరసనలు కొనసాగిస్తున్న రైతు సంఘాలకు చెందిన 40 మంది నేతలు మద్దతు కూడగట్టేందుకు దేశవ్యాప్తంగా పర్యటిస్తారని వెల్లడించారు. ‘డిమాం డ్లకు అంగీకరించకుండా, రైతు సంఘాలతో చర్చలు జరపకుండా ఉన్నంత కాలం ప్రభుత్వాన్ని ప్రశాంతంగా కూర్చో నివ్వకుండా చేస్తాం’అన్నారు. మూడు కొత్త వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం ఉపసం హరించుకోవాల్సిందేననీ, అప్పటి దాకా పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కొత్త సాగు చట్టాలతో ప్రజా పంపిణీ వ్యవస్థ అంతమ వుతుందన్నారు. రైతులతోపాటు చిన్న వ్యాపా రులు, రోజు కూలీలు తదితరులపైనా ఈ చట్టాలు ప్రభావం చూపుతాయని తికాయత్ చెప్పారు. ఆకలితో వ్యాపారం చేయడాన్ని అనుమతించబో మని తెగేసి చెప్పారు. కొత్త చట్టాలు కార్పొరేట్లకు అనుకూలమనే విషయం రైతులకు తెలియదను కుంటున్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సింఘు బోర్డర్లో జరుగుతున్న ఆందోళనలే రైతు నిరసనలకు కేంద్ర బిందువుగా ఉంటాయన్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన రాకేశ్ తికాయత్ రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఘాజీపూర్ వద్ద రెండు నెలలుగా నిరసనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. -
యుద్ధ ట్యాంకర్ల హబ్గా తమిళనాడు
సాక్షి, చెన్నై: మోటార్ వాహన ఉత్పత్తిలోనే కాదు, యుద్ధ ట్యాంకర్ల ఉత్పత్తిలోనూ హబ్గా తమిళనాడు మారుతోందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. భారత ఆర్మీని అపార శక్తివంతంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు సాగుతున్నాయని తెలిపారు. డీఆర్డీఓ దేశీయంగా తయారు చేసిన అర్జున్ ప్రధాన యుద్ధ ట్యాంక్(ఎంకే–1ఏ)ను భారతీయ సైన్యానికి అప్పగించారు. చెన్నై నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్, సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వంలతో కలిసి ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. మెట్రో సేవలు.. రూ.3,770 కోట్లతో పూర్తయిన చెన్నై వాషర్మెన్ పేట–విమ్కోనగర్ మధ్య మెట్రో రైలు, రూ.293 కోట్లతో పూర్తి చేసిన చెన్నై బీచ్–అత్తిపట్టు మధ్య 4వ ట్రాక్లో, రూ.423 కోట్లతో విద్యుద్దీకరించిన విల్లుపురం–తంజావూరు – తిరువారూర్ మార్గంలో రైలు సేవలకు జెండా ఊపారు. తంజావూరు, పుదుకోట్టైలకు సాగు నీరు అందించడం లక్ష్యంగా రూ. 2,640 కోట్లతో చేపట్టనున్న కళ్లనై కాలువ పునరుద్ధరణ పనులకు, రూ.1000 కోట్లతో చెంగల్పట్టు జిల్లా తయ్యూరు సమీపంలో 163 ఎకరాల్లో నిర్మించనున్న ఐఐటీ డిస్కవరీ క్యాంపస్ పనులకు శంకుస్థాపన చేశారు. చెన్నై ఆవడిలోని ఆర్మీ ఫ్యాక్టరీలో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో 71 సరికొత్త హంగులతో రూపుదిద్దుకున్న అర్జున యుద్ధ ట్యాంకర్ను భారత ఆర్మీకి అందించారు. ముందుగా వేదికపై ఏర్పాటు చేసిన దివంగత సీఎంలు ఎంజీఆర్, జయలలిత చిత్ర పటాలకు మోదీ పుష్పాంజలి ఘటించారు. ఈ దశాబ్దం భారత్దేనని, కోవిడ్–19పై పోరు విషయంతో సహా అన్ని విషయాలలో ప్రపంచం ఇప్పుడు భారత్ వైపు చూస్తోందని ప్రధాని తెలిపారు. ఏప్రిల్ నెలలో తమిళనాడు అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్సెల్వంలతో కలిసి ప్రధాని మోదీ చేతులు పైకెత్తి ప్రజలకు అభివాదం చేశారు. తమిళ సంస్కృతి, సంప్రదాయాలను తన ప్రసంగంలో ప్రధాని కొనియాడారు. తమిళ సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. శ్రీలంక తమిళుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వారి కోసం అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. జాఫ్నాలో పర్యటించిన ఏకైక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తానే కావడం తనకు గర్వకారణమని వ్యాఖ్యానించారు. శ్రీలంకలోని తమిళుల హక్కుల గురించి ఆ దేశంతో చర్చించామని వెల్లడించారు. దేశీయంగా తయారు చేసిన మార్క్1ఏ ట్యాంక్ను ఆర్మీకి అప్పగిస్తున్న సందర్భంగా సైన్యంతో మోదీ ప్రతి నీటి చుక్క కీలకం.. ఈ వేడుకలో ప్రధాని నరేంద్ర మోదీ తమిళంలో వణక్కం చెన్నై.. వణక్కం తమిళనాడు అంటూ తన ప్రసంగాన్ని మొదలెట్టారు. తమిళనాడు రైతులు ఇక్కడి వనరుల్ని సద్వినియోగం చేసుకుని ఆహార ఉత్పత్తిలో రికార్డులు సృష్టిస్తున్నారని కొనియాడారు. ప్రతి నీటి చుక్క కీలకం అని, పొదుపు గురిం చి వివరిస్తూ భావితరాల కోసం జల, వనరుల పరిరక్షణ లక్ష్యంగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. తక్కువ జల వినియోగంతో ఎక్కువ దిగుబడి సాధించే దిశగా మరింత కృషి చేయాల్సి ఉందన్నారు. చెన్నై మెట్రో ఫేజ్–2కు బడ్జెట్లో రూ. 63 వేల కోట్లను ప్రకటించామని గుర్తుచేశారు. ప్రపంచ దేశాలు భారత వైపు చూస్తున్నాయని, ఇది 130 కోట్ల మంది శ్రమ ఫలితమని పేర్కొన్నారు. పుల్వామా అమరులకు నివాళి.. రెండేళ్ల క్రితం ఇదే రోజున (ఫిబ్రవరి 14) పుల్వామా దాడి జరిగిందని గుర్తు చేస్తూ, ఆ దాడిలో అమరులైన వీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా తమిళ కవి సుబ్రమణ్య భారతియార్ రాసిన ‘ఆయుధం సెయ్వోం...(ఆయుధం తయారు చేద్దాం)’ అన్న కవితను గుర్తు చేస్తూ, డిఫెన్స్ కారిడార్కు తమిళనాడు ఎంపికైనట్టు తెలిపారు. మోటారు వాహన ఉత్పత్తిలోనే కాదు, యుద్ధట్యాంకర్ల ఉత్పత్తికి హబ్గా తమిళనాడు మారిందని పేర్కొంటూ, తాజాగా ఆర్మీకి అంకితం ఇచ్చిన ఎంకే–1ఏ గురించి వివరించారు. భారత ఆర్మీ శాంతియుతంగా సరిహద్దుల్లో దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నదని కొనియాడారు. ప్రపంచ స్థా యి ప్రమాణాలతో ఐఐటీ డిస్కవరీ రూపుదిద్దుకోబోతున్నదని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రధానికి బ్రహ్మరథం పట్టే రీతిలో చెన్నైలో ఆహ్వానం లభించింది. ప్రధాని పర్యటన సందర్భం గా చెన్నైలో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. బీపీసీఎల్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ జాతికి అంకితం కొచ్చి: కేరళలో పలు అభివృద్ధి పథకాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. రూ. 6 వేల కోట్ల విలువైన బీపీసీఎల్కు చెందిన పెట్రో కెమికల్ కాంప్లెక్స్ను జాతికి అంకితం చేశారు. కొచ్చిన్ పోర్ట్ ట్రస్ట్ ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ను, మెరైన్ ఇంజినీరింగ్ శిక్షణ కేంద్రం ‘విజ్ఞాన సాగర్’ను ప్రారంభించారు. పెట్రో కెమికల్ ప్రాజెక్టుతో అక్రిలిక్ యాసిడ్, ఆక్సో ఆల్కహాల్, అక్రిలేట్స్ తదితర ఉత్పత్తుల దిగుమతులు తగ్గి గణనీయ మొత్తంలో విదేశీ మారకం ఆదా అవుతుందన్నారు. బోల్గట్టి, విలింగ్డన్ ఐలండ్ మధ్య జల మార్గ రవాణా కోసం రెండు నౌకలను ప్రారంభించారు. కేరళలో పర్యాటక రంగ మౌలిక వసతుల కల్పన కోసం కేంద్రం కృషి చేస్తోందన్నారు. కొచ్చిలో అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ ఏర్పాటు అందులో భాగమేనన్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేరళ బీజేపీ నేతలతో మోదీ సమావేశమయ్యారు. ఎన్నికల్లో కేంద్రం అభివృద్ధి పథకాలను ప్రధానంగా ప్రచారం చేయాలన్నారు. -
పుల్వామా తరహా దాడికి ఉగ్రవాదుల కుట్ర
న్యూఢిల్లీ : జమ్మూ,కశ్మీర్ పోలీసులు పుల్వామా తరహా ఉగ్రవాద దాడి కుట్రను భగ్నం చేశారు. ఇద్దర్ని అదుపులోకి తీసుకోవటంతోపాటు పెద్ద మొత్తంలో పేలుడు పదార్ధాలను స్వాధీనం చేస్తున్నారు. పుల్వామా దాడి జరిగి నేటికి రెండేళ్లు అవుతున్న సందర్బంగా అదే తరహా ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని మూడు రోజులక్రితం పోలీసులకు సమాచారం అందింది. దీంతో జమ్మూ,కశ్మీర్ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి పుల్వామా జిల్లాలో సుహాలి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్దనుంచి ఆరున్నర కేజీల ఐఈడీని స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్నుంచి వచ్చిన మెసేజ్తో పుల్వామాలో ఉగ్రదాడికి ప్లాన్ చేసినట్లు విచారణ సందర్భంగా సుహాల్ తెలిపాడు. చంఢీఘడ్లో ఖాజీ అనే మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ( అజిత్ దోవల్ నివాసం వద్ద ఉగ్రవాదుల రెక్కీ) అంతేకాకుండా సాంబ జిల్లాలో 15 చిన్నచిన్న ఐఈడీలు, ఆరు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆయుధాలను డ్రోన్నుంచి పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. దీనిపై జమ్మూ,కశ్మీర్ డీజీపీ మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్ ఉగ్రవాద మూకలు జైషే ఈ మహ్మద్, లష్కర్లు ‘ది రెసిస్టంట్ ఫ్రంట్, లష్కర్ ఈ ముస్తఫా’ అనే రెండు కొత్త గ్రూపులను తయారు చేశాయి. గతవారం లష్కర్ ఈ ముస్తఫా చీఫ్ హిదయతుల్లాను ఆరెస్ట్ చేశాం. ఇతడు న్యూఢిల్లీలోని ఎన్ఎస్ఏ అజిత్ ధోవల్ ఆఫీసుపై రెక్కీ నిర్వహించాడు’’ అని తెలిపారు. -
బాలాకోట్ దాడి: సంచలన విషయాలు వెల్లడి
ఇస్లామాబాద్: దాయాది దేశం కుట్ర పన్ని చేసిన పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది భారత సీఆర్పీఎఫ్ సైనికులు అసువులు బాసిన సంగతి తెలిసిందే. ఇందుకు ప్రతీకారంగా భారత్ బాలకోట్ ఉగ్రస్థావారలపై ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించింది. ఇక నాటి దాడిలో దాదాపు 300 మంది ఉగ్రవాదులు మరణించినట్లు కేంద్రం ప్రకటించింది. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఇవ్వన్ని గాలి మాటలే.. అంతమంది చనిపోతే.. రక్తం ఎక్కడ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ దౌత్యవేత్త ఓ టీవీ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాయి. (చదవండి: దేశమంతా శోకంలో ఉంటే నీచ రాజకీయాలా?) ఓ ఉర్దు చానెల్ డిబెట్లో పాక్ దౌత్యవేత్త ఆఘా హిలాలీ మాట్లాడుతూ.. ‘భారతదేశం అంతర్జాతీయ సరిహద్దును దాటి.. ప్రతీకార చర్యలకు పూనుకుంది. ఈ ఘటనలో కనీసం 300 మంది మరణించారు. ఇందుకు మేం బదులు తీర్చుకుంటాం. కానీ మా లక్ష్యం వేరు. మేం వారి హై కమాండ్ని టార్గెట్ చేశాం. అది మా చట్టబద్ధమైన లక్ష్యం. ఇక మేం సర్జికల్ దాడులు జరిగాయి కానీ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని ప్రకటించాం. వారు ఎంత నష్టం కలిగించారో.. మేం కూడా అంతే నష్టం వారికి కలగజేస్తాం. ఎక్కువ చేయం’ అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాయి. -
దేశమంతా శోకంలో ఉంటే నీచ రాజకీయాలా?
కేవాడియా: 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మరణానికి కారణమైన పుల్వామా దాడి ఘటనలో వాస్తవాలను పాకిస్తాన్ పార్లమెంట్లో అక్కడి నేతలు అంగీకరించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. మన జవాన్లు వీర మరణం పొందితే దేశమంతా సంతాపం వ్యక్తం చేస్తుండగా, కొందరు మాత్రం స్వప్రయోజనాల కోసం నీచ రాజకీయాలకు తెరతీశారని పరోక్షంగా ప్రతిపక్షాలపై మండిపడ్డారు. భారత భూభాగాన్ని కాజేయాలని చూస్తున్న శక్తులకు సరిహద్దుల్లో మన సైనికులు సరైన సమాధానం చెబుతున్నారని వ్యాఖ్యానించారు. సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ 145వ జయంతి సందర్భంగా శనివారం గుజరాత్ రాష్ట్రం నర్మదా జిల్లాలోని కేవాడియాలో సర్దార్ ఐక్యతా విగ్రహం వద్ద ప్రధాని మోదీ ఘనంగా నివాళులర్పించారు. ఇక్కడ నిర్వహించిన రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పుల్వామా దాడి ఘటన తర్వాత ఇండియాలో కొందరు చేసిన అనుచిత వ్యాఖ్యలను, వారి నీచ రాజకీయాలను దేశం మరచిపోదని చెప్పారు. పొరుగు దేశం పాకిస్తాన్ పార్లమెంట్లో వాస్తవాలను అంగీకరించిన తర్వాత అలాంటి వ్యక్తుల నిజ స్వరూపం బట్టబయలైందని పేర్కొన్నారు. సైనిక దళాల మనోసై్థర్యాన్ని దెబ్బతీయకండి పుల్వామా దాడి తర్వాత తనపై కొందరు వ్యక్తులు విమర్శలు చేసినా, దారుణమైన పదాలు ఉపయోగించినా మౌనంగానే ఉన్నానని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వారు ఏ స్థాయికైనా దిగజారుతారని అన్నారు. సైనిక దళాల మనోస్థై్ౖథర్యాన్ని దెబ్బతీసే రాజకీయాలకు పాల్పడవద్దని రాజకీయ పార్టీలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. మీ స్వలాభం కోసం జాతి వ్యతిరేక శక్తుల చేతుల్లో పావులుగా మారకండి అని రాజకీయ నాయకులకు హితవు పలికారు. రామాలయం నిర్మాణానికి ప్రజలే సాక్షులు సోమనాథ్ ఆలయ నిర్మాణం ద్వారా భారత సాంస్కృతిక వారసత్వాన్ని పునరుద్ధరించేందుకు సర్దార్ పటేల్ యజ్ఞానికి శ్రీకారం చుట్టారని, ప్రస్తుతం ఆ యజ్ఞం అయోధ్యలో కొనసాగుతోందని నరేంద్ర మోదీ అన్నారు. భవ్య రామమందిరం నిర్మాణానికి ప్రజలు సాక్షులుగా నిలుస్తున్నారని తెలిపారు. సీప్లేన్ సేవలను ప్రారంభించిన మోదీ కేవాడియాలోని పటేల్ ఐక్యతా విగ్రహం నుంచి అహ్మదాబాద్లోని సబర్మతి రివర్ఫ్రంట్ వరకు సీప్లేన్ సేవలను ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. నీటిపై, గాలిలో ప్రయాణించే విమానాన్ని సీప్లేన్ అంటారు. ఐక్యతా శిల్పం నుంచి సీప్లేన్లో మోదీ ప్రయాణించారు. 40 నిమిషాల్లో సబర్మతి రివర్ఫ్రంట్కు చేరుకున్నారు. ఈ రెండింటి మధ్య దూరం 200 కిలోమీటర్లు. సీప్లేన్ సర్వీసును స్పైస్జెట్ సంస్థకు చెందిన స్పైస్ షటిల్ సంస్థ నిర్వహిస్తోంది. అహ్మదాబాద్–కేవాడియా మధ్య నిత్యం రెండు ప్లేన్లను నడపనుంది. ఒక వైపు ప్రయాణానికి రూ.1,500 రుసుం వసూలు చేస్తారు. సర్దార్ సరోవర్ డ్యామ్ నీటిపై సీప్లేన్ ల్యాండ్ అవుతుంది. కనిష్ట ప్రభుత్వం.. గరిష్ట పాలన అహ్మదాబాద్: నిర్ణయాలు తీసుకునేటప్పు డే దేశ హితాన్ని, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని ప్రొబేషనరీ సివిల్ సర్వీస్ అధికారులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. కనిష్ట ప్రభుత్వం.. గరిష్ట పాలన అనే మంత్రాన్ని పాటించాలని ఉద్బోధించారు. నిత్యం వార్తల్లో ఉండేం దుకు ప్రయత్నించకూడదని చెప్పారు. రొటీ న్కు భిన్నంగా పనిచేస్తేనే గుర్తింపు వస్తుం దన్నారు. మోదీ శనివారం కేవాడి యా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రొబే షనరీ సివిల్ సర్వీసు అధికారులను ఉద్దేశిం చి మాట్లాడారు. పాలనలో మీలాంటి అధికారుల పాత్ర వల్లే దేశం ప్రగతి సాధిస్తోందని అన్నారు. ప్రజలు సాధికారత సాధించేలా అధికారులు కృషి చేయాలన్నారు. వారి జీవితాల్లో మితిమీరి జోక్యం చేసుకోవద్దన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. కేవలం విధానాలపైనే(పాలసీలు) ఆధార పడి ప్రభుత్వం నడవకూడదన్నారు. -
‘పాక్ ప్రకటనతో వారి నిజస్వరూపం బయటపడింది’
గాంధీనగర్/కేవాడియా: గతేడాది పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడి సమయంలో ప్రతిపక్షాలు దారుణంగా వ్యవహరించాయని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. దేశం తన బిడ్డలను కోల్పోయిన బాధలో ఉంటే.. కొందరు మాత్రం తమ స్వార్థం చూసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పుల్వామా దాడి గురించి పాకిస్తాన్ మంత్రి తమ పార్లమెంట్లో చేసిన ప్రకటనతో మన ప్రతిపక్షాల నిజస్వరూపం ఏంటో జనాలకు తెలిసింది అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా గుజరాత్లోని కేవడియాలోని ఐక్యతా విగ్రహం వద్ద మోదీ నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఈ రోజు ఇక్కడ పరేడ్ నిర్వహించిన అధికారులను చూస్తే.. నా మదిలో పుల్వామా దాడి ఘటన మెదిలింది. దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుల త్యాగాలను ఎన్నటికి మరువం. దేశం బిడ్డలను కోల్పోయి బాధపడుతుంటే.. కొందరు మాత్రం స్వార్థపూరితంగా ప్రవర్తించారు’ అన్నారు. (చదవండి: పాక్లో ‘పుల్వామా’ చిచ్చు) ‘పుల్వామా దాడిలో కూడా తమ లాభాన్నే చూసుకున్నారు. ఆనాడు వారు చేసిన వ్యాఖ్యలను దేశం మరవదు. వారి ఆరోపణలను నేను మౌనంగా భరించాను. రాజకీయ లబ్ధి కోసమే వారు ఇదంతా చేస్తున్నారని నాకు తెలుసు. కాన ఇప్పుడు పాకిస్తాన్ తమ పార్లమెంట్లో చేసిన ప్రకటనతో నిజం బయటపడింది. దాంతో ఈ ఘటనపై రాజకీయాలు చేసిన వారి నిజస్వరూపం కూడా బయటపడింది. ఈ సందర్భంగా నేను కోరేది ఒక్కటే.. దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి రాజకీయాలు చేయకండి’ అన్నారు మోదీ. ఉగ్రవాదంపై భారత్ నిరంతర పోరు సాగిస్తుందని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలన్నీ ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదం, హింసతో ఏ ఒక్కరూ ప్రయోజనం పొందలేరని పరోక్షంగా పాక్కు చురకలంటించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వీర సైనికుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరువదని మోదీ పేర్కొన్నారు -
పాక్లో ‘పుల్వామా’ చిచ్చు
పాకిస్తాన్ పార్లమెంటు జాతీయ అసెంబ్లీలో పాలక, ప్రతిపక్షాలు పరస్పరం చేసుకున్న విమర్శలు, ఆరోపణలు ఆ దేశంలో మాత్రమే కాదు... మన దేశంలో కూడా వాగ్యుద్ధానికి దారితీశాయి. ఇదేమీ కొత్తగాదు. తమ పాలకుల్ని విమర్శించాలంటే రెండు దేశాల్లోనూ విపక్షాలకు దొరికే మొదటి ఆయుధం పొరుగు దేశమే. అవతలి దేశం ముందు మోకరిల్లారని పాలకులపై ఆరోపణ చేస్తే రాజ కీయంగా వారిని దెబ్బతీసినట్టవుతుందని విపక్షాలు అనుకుంటాయి. విపక్షాలను అవతలి దేశానికి ఏజెంట్లుగా పనిచేస్తున్నారని ఆరోపిస్తే, వారికి రాజకీయంగా పుట్టగతులుండవని పాలకపక్షం విశ్వసి స్తుంది. తాజాగా మొన్న బుధవారం జాతీయ అసెంబ్లీలో విపక్ష పీఎంఎల్(ఎన్) నాయకుడు ఆయాజ్ సాదిక్ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను తీవ్రంగా విమర్శించారు. ఆ క్రమంలో ఆయన పాక్ సైన్యానికి బందీగా పట్టుబడిన మన వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ ఉదం తాన్ని కూడా ప్రస్తావించారు. నిరుడు ఫిబ్రవరిలో పుల్వామాలో ఆత్మాహుతి దాడికి పాల్పడి 43మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉదంతం తర్వాత భారత్ విమానాలు చేసిన దాడులతో పాక్ పాలకులు, సైనిక దళాల చీఫ్ వణికారని సాదిక్ విమర్శించారు. అభినందన్ బందీగా చిక్కితే, ఆయన్ను భారత్కు అప్పగించేవరకూ పాలకులకు నిద్రపట్టలేదని అన్నారు. ఆరోజు విదేశాంగ మంత్రి షా మెహ్మూద్ ఖురేషీ అఖిలపక్ష సమావేశం పెట్టి అభినందన్ను వెంటనే విడుదల చేయకుంటే ఆ రాత్రికి భారత్ మనపై దాడి చేసే ప్రమాదమున్నదని చెప్పారని వెల్లడించారు. ఆ భేటీకి రావాల్సిన ఇమ్రాన్ మొహం చాటేయగా, వచ్చిన విదేశాంగమంత్రి వదిలేద్దామంటూ బేరం పెట్టారని, ఇక ఆర్మీ చీఫ్ కమార్ జావేద్ బజ్వాకైతే కాళ్లు వణుకుతూనే వున్నాయని ఆయాజ్ ఎద్దేవా చేశారు. సాదిక్ చేసిన ఈ దాడితో పరువు పోగొట్టుకున్న పాకిస్తాన్ సర్కారు సీనియర్ మంత్రి ఫవాద్ చౌధరిని రంగంలోకి దించింది. ఆయన గురువారం జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ ఘనత ఎలాంటిదో ఏకరువు పెట్టారు. ‘పుల్వామాలోకి ప్రవేశించి మరీ మనం భారత్పై దాడి చేశామ’ని చెప్పారు. పుల్వామా విజయం ఈ దేశ విజయమని ఫవాద్ చెప్పుకొచ్చారు. సహ ఎంపీలే ఇందుకు అభ్యంతరం చెప్పడంతో ఆయన వెంటనే స్వరం మార్చి, పుల్వామా దాడి అనంతరం పాక్ సైన్యం భారత్లోకి చొచ్చుకెళ్లి దాడి చేశాయని సవరించుకున్నారు. అయితే పుల్వామాలో విజయం సాధించా మన్న వ్యాఖ్యను వెనక్కి తీసుకోలేదు. పైగా అఖిలపక్ష సమావేశంలో జరిగినదాన్ని వెల్లడించి సాదిక్ జాతిని అవమానించారంటూ చెప్పారు. ఇప్పుడు ఎవరేమి చెప్పుకుంటున్నా పుల్వామా ఉగ్ర దాడి పాక్ పనేనని అప్పట్లోనే మన దేశం స్పష్టంగా ప్రకటించింది. జైషే మొహమ్మద్ పాక్ సైన్యం ప్రాపకంతో పనిచేస్తున్న సంగతి అంతర్జాతీ యంగా అందరికీ తెలుసు. దాని అధిపతి మసూద్ అజర్ను ఐక్యరాజ్యసమితి నిరుడు ఉగ్రవాదిగా ప్రకటించింది. కనుక పుల్వామా దాడి తమ పనే అని ఫవాద్ చెప్పడం ద్వారా కొత్తగా ఆయన వెల్లడిం చిందేమీ లేదు. దాన్ని ఆయన అధికారికంగా ధ్రువీకరించారంతే. సాదిక్ మాటలతో జాతికి అవ మానం జరిగిందని ఫవాద్ అనడం సిగ్గు చేటు. అంతకన్నా పొరుగు దేశంపై ఉగ్రవాద దాడి ఘటన తమ ఘనతగా చెప్పడమే జాతికి అవమానకరమైనది. దేశాల మధ్య విభేదాలొచ్చినప్పుడు దౌత్య పరంగా చర్చించుకోవడం ఏ దేశమైనా చేయాల్సిన పని. ఇచ్చిపుచ్చుకునే వైఖరితో వుంటే ఎంతటి క్లిష్ట సమస్య అయినా పరిష్కారమవుతుంది. యుద్ధం సరేసరి. కానీ దొంగచాటుగా ఒక కిరాయి మనిషిని ప్రవేశపెట్టి ఆత్మాహుతి దాడి చేయించి, అదేదో ఘనకార్యంగా చెప్పుకోవడం వల్ల ఒరిగేదే మిటి? నిజంగా అది ఘనకార్యమనుకుంటే అప్పుడే ఆ మాట ప్రపంచానికి ధైర్యంగా వెల్లడించ వలసింది. పర్యవసానాలకు సిద్ధపడవలసింది. పుల్వామా దాడికి తెగించినవారు అఖిలపక్ష సమా వేశం సమయానికి ఎందుకంత నీరుగారి పోయారు? ఎందుకా ముచ్చెమటలు? దేశంలో ఇమ్రాన్ సర్కార్ అన్నివిధాలా విఫలమై, విపక్షాలు బలపడుతున్నాయి. ఉపాధి లేమి, అధిక ధరలు, అవినీతి తదితర అంశాల్లో ప్రభుత్వం విఫలమవుతున్న తీరుతో జనంలో అసంతృప్తి పెరిగింది. ఇటీవల విపక్షాలు పెట్టిన సభ విజయవంతం కావడం ఇందుకు తార్కాణం. వీటికితోడు భారత్ దాడి చేస్తుందని పాలకులు వణికారని పీఎంఎల్(ఎన్) వెల్లడించడంతో ఏదోరకంగా తమ గొప్పతనాన్ని చాటుకునే క్రమంలో పుల్వామా దాడిపై ఫవాద్ నిజం చెప్పివుండొచ్చు. ఉగ్రవాదులకు నిధులందించే అనుమానిత దేశాల జాబితానుంచి పాక్ను తొలగించడానికి రెండురోజులక్రితమే 39మంది సభ్యుల ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) నిరాకరించింది. ఉగ్రవాదులకు తోడ్పడుతున్నదని నిర్ధారణైతే ఆ సంస్థ పాక్ను బ్లాక్లిస్టులో పెట్టే అవకాశం వుంది. అదే జరిగితే ఆర్థికంగా పాకిస్తాన్ మరిన్ని సమస్యలు ఎదుర్కొనవలసివుంటుంది. స్వయంగా మంత్రే పుల్వా మాలో తమ ప్రమేయాన్ని అంగీకరించారు గనుక మున్ముందు ఎఫ్ఏటీఎఫ్ ఏం చేస్తుందో చూడాలి. -
పుల్వామా దాడి; పాక్ సంచలన ప్రకటన
ఇస్లామాబాద్: పుల్వామా దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందనీ, ఆ ఘటన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విజయమని ఆ దేశ మంత్రి ఒకరు ప్రకటించడం సంచలనం రేపింది. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో గురువారం జరిగిన చర్చ సందర్భంగా శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి ఫవద్ చౌధరి ఈ మేరకు ప్రకటన చేశారు. ‘‘భారత్ను వారి దేశంలోనే గట్టి దెబ్బ తీశాం. పుల్వామా విజయం ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలో మన జాతి సాధించిన విజయం. ఈ విజయంలో మీరు, మేము, మనందరమూ భాగస్వాములమే’’అని అన్నారు. పుల్వామాలో విజయం అని మంత్రి పేర్కొనడంపై సభలో కొందరు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం ఫావద్ మీడియాతో మాట్లాడుతూ.. పుల్వామా ఘటన అనంతరం పాక్ బలగాలు దాడి చేసేందుకు భారత్ భూభాగంలోకి వెళ్లగలిగాయని తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో పుల్వామాలో విజయం అన్న వ్యాఖ్యలను మాత్రం వెనక్కు తీసుకునేందుకు ఆయన నిరాకరించారు. అభినందన్ని విడుదల చేయకపోతే భారత్ దాడి చేస్తుందని ఆర్మీ చీఫ్కే కాళ్లలో వణుకు పుట్టినట్టుగా పీఎంఎల్–ఎన్ నేత అయాజ్ సాధిక్ ప్రకటన చేసిన నేపథ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు అత్యంత సన్నిహితుడైన చౌధరి ఈ వ్యాఖ్యలు చేశారు. సాధిక్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని ఆయన పేర్కొన్నారు. ‘ప్రభుత్వాన్ని వ్యతిరేకించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ, జాతిని కించపరచడం తగదు’ అని తెలిపారు. గత ఏడాది జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో 40 మంది భారత్ జవాన్లు నేలకొరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం రెండు దేశాల మధ్య విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి. కాళ్లు వణికాయి.. చెమటలు పట్టాయి మేజర్ అభినందన్ వర్ధమాన్.. ఈ పేరు వింటేనే చాలు భారతీయుల గుండెలు ఉప్పొంగుతాయి. గత ఏడాది ఫిబ్రవరిలో కశ్మీర్లోని పుల్వామా దాడి ఘటన అనంతరం పాక్ చెరలో ఉన్న వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ప్రదర్శించిన శౌర్య పరాక్రమాలకు సాక్షాత్తూ పాకిస్తాన్ ఆర్మీ జనరల్ చీఫ్ కమర్ జావేద్ బాజ్వా వెన్నులో వణుకు పుట్టింది. ‘‘బాజ్వా కాళ్లు వణికాయి, నుదుటంతా చెమటలు పట్టాయి, పాక్ చెరలో ఉన్న అభినందన్ను విడుదల చేయకపోతే భారత్ ఎక్కడ దాడికి దిగుతుందోనని ఆయన నిలువెల్లా వణికిపోయారు’’అని పాకిస్తాన్ ఎంపీ, పాక్ ముస్లిం లీగ్–నవాజ్ (పీఎంఎల్–ఎన్) నాయకుడు సర్దార్ అయాజ్ సాధిక్ బుధవారం పార్లమెంటులో వెల్లడించారు. పుల్వామా దాడి ఘటనలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడంతో ప్రతీకారంగా పాకిస్తాన్లోని బాలాకోట్లో ఉగ్రవాద శిక్షణా శిబిరాలపై ఫిబ్రవరి 26, 2019న భారత్ బాంబులతో దాడి చేసింది. ఈ సందర్భంగా ఇరుపక్షాల మధ్య జరిగిన వైమానిక పోరులో పాక్ యుద్ధవిమానం ఎఫ్–16ని అభినందన్ మిగ్–21 విమానంతో వెంబడించారు. పాక్ విమానాన్ని కూల్చేశారు. అదే సమయంలో మిగ్ విమానం పాక్ భూభాగంలో కూలిపోవడంతో అభినందన్ను పాక్ సైన్యం అదుపులోకి తీసుకుంది. ఆనాటి సమావేశంలో ఏం జరిగిందంటే..! మేజర్ అభినందన్ వర్ధమాన్ను పాక్ చెరలోకి తీసుకున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆ సమయంలో పాక్లో పార్లమెంటరీ పార్టీ నాయకులతో కూడిన ఉన్నతస్థాయి సమావేశంలో జరిగిన విషయాలను సాధిక్ వెల్లడించారు. ‘‘ఆనాటి సమావేశానికి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ హాజరు కాలేదు. విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి సమావేశంలో ఉన్నారు. అప్పుడే గదిలోకి వచ్చిన ఆర్మీ చీఫ్ బాజ్వా కాళ్లు వణుకుతున్నాయి. శరీరమంతా చెమటలతో నిండిపోయింది. చర్చలు జరిగిన అనంతరం ఖురేషి అభినందన్ను వెంటనే విడుదల చేయనివ్వండి. లేకపోతే భారత్ రాత్రి 9 గంటలకి మన దేశంపై దాడికి దిగుతుందని ఖురేషి అన్నారు’’ అంటూ సాధిక్ ఆనాటి సమావేశ వివరాలను గుర్తు చేసుకున్నారు. భారత్ దాడి చేయడానికి సన్నాహాలు చేయకపోయినా, పాక్ సర్కార్ భారత్ ముందు మోకరిల్లి అభినందన్ని అప్పగించిందంటూ సాధిక్ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై మాటల తూటాలు విసిరారు. తన మాటల్ని వక్రీకరించారంటూ ఆ తర్వాత సాధిక్ ఒక వీడియో సందేశం విడుదల చేశారు. -
పుల్వామా దాడిపై పాక్ సంచలన ప్రకటన
ఇస్లామాబాద్ : పుల్వామా ఉగ్రదాడి వెనుక దాయాది దేశం పాకిస్తాన్ హస్తం ఉందన్న భారత్ అనుమానం నిజమైంది. 2019 ఫిబ్రవరి 14న కశ్మీర్లోని పుల్వామాలో చోటుచేసుకున్న విధ్వంసం వెనుక తామ దేశ హస్తం ఉందని పాకిస్తాన్ మంత్రి ఫవద్ చౌదరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుల్వామ ఉగ్రదాడి తమ పనేనని ప్రకటించుకున్నారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ నేతృత్వంలో సాధించిన గొప్ప విజయమని పేర్కొన్నారు. భారత్ను సొంతగడ్డపైనే దెబ్బతీశామని, ఇమ్రాన్ ప్రభుత్వాన్ని పొగడ్తల్లో ముంచెత్తారు. గురువారం ఆ దేశ నేషనల్ అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన ఈ ప్రకటన చేశారు. పుల్వామా ఉగ్రదాడికి భారత్కు చెందిన 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. పాకిస్తాన్లో నెలకొని కార్యకలాపాలు సాగిస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహమ్మద్ ఈ దాడికి పాల్పడినట్టు తొలుత ప్రకటించుకుంది. అయితే అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ దాడి వెనుక పాకిస్తాన్ కుట్ర ఉందని భారత నిఘా వర్గాలు ఓ అంచనాకు వచ్చాయి. తాజాగా పాక్ మంత్రి ప్రకటనతో.. భారత్ అనుమానం నిజమైంది. ఈ నేపథ్యంలో దాయాది దేశంపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాక్ మంత్రి ప్రకటనపై స్పందించిన భారత విదేశాంగ శాఖ పూల్వామా దాడి వెనుక పాక్ ఉందని ప్రపంచానికి తెలుసు. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ బహిరంగంగానే సమర్థించుకుంటోంది. పాక్ నిజస్వరూపాన్ని ఇప్పటికైనా ప్రపంచం తెలుసుకోవాలి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాకిస్తాన్ను క్షమించొద్దు. -
తృటిలో తప్పిన పుల్వామా తరహా ఘటన!
శ్రీనగర్: పుల్వామా దాడితో భారత సైన్యంపై విరుచుకుపడిన ఉగ్రవాదులు మరోసారి అలాంటి పథకాన్నే రచించారు. అయితే, భద్రతా బలగాల ఉమ్మడి సెర్చ్ ఆపరేష్తో వారి కుట్రలు భగ్నమయ్యాయి. గురువారం ఉదయం 8 గంటల సమయంలో గడీకల్ ప్రాంతంలోని కెవారాలో హైవే పక్కన 52 కిలోల పేలుడు పదార్థాలను గుర్తించామని ఆర్మీ ఒక ప్రకటనలో పేర్కొంది. హైవే పక్కన ఉన్న పండ్లతోటలో భూమిలో పాతిపెట్టిన ప్లాస్టిక్ ట్యాంక్లో ఈ మొత్తం బయటపడిందని తెలిపింది. పుల్వామా ఘటన జరిగిన ప్రాంతానికి 9 కిలో మీటర్ల దూరంలోనే ఈ ప్రాంతం ఉందని వెల్లడించింది. 125 గ్రాముల చొప్పున మొత్తం 416 ప్యాకెట్లలో పేలుడు పదార్థాలు లభించాయని ఆర్మీ వెల్లడించింది. ఆ ప్రాంతంలోనే మరిన్ని సోదాలు నిర్వహించగా మరో ట్యాంక్లో 50 డిటోనేటర్లు కనుగొన్నామని పేర్కొంది. కాగా, 2019 ఫిబ్రవరి పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఆ దాడిలో ఉగ్రవాదులు 35 కిలోల ఆర్డీఎక్స్ను మరికొన్ని జలెటిన్ పేలుడు పదార్థాలను ఉపయోగించినట్టు వెల్లడైంది. పుల్వామా దాడి వెను జైషే చీష్ మసూద్ అజార్ ఉన్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తేల్చింది. ఇక పుల్వామా దాడికి ప్రతిగా భారత్ పాకిస్తాన్లోని బాలాకోట్పై వైమానిక దాడులు చేసి జైషే ఉగ్రవాద శిబిరాలను మారూపాల్లేండా చేసిన సంగతి తెలిసిందే. -
పుల్వామా దాడి.. ఎన్ఐఏ చార్జిషీట్
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లో గత ఏడాది 40 మంది జవాన్లను బలి తీసుకున్న పుల్వామా దాడి వెనుక జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజార్, అతని సోదరుడు రాఫ్ అస్ఘర్లతో సహా 19 మంది ప్రమేయం ఉన్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అభియోగాలు నమోదు చేసింది. పాకిస్తాన్ ఆదేశాల మేరకు ఈ ఉగ్రవాదులంతా పేలుళ్లకు పాల్పడినట్టుగా ఎన్ఐఏ మంగళవారం జమ్మూలోని ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన 13,500 పేజీల చార్జిషీట్లో పేర్కొంది. అజర్, అతని సోదరుడు, మేనల్లుడు, ఇప్పటికే ఎన్కౌంటర్లో మరణించిన ఉమర్ ఫరూఖ్, అమ్మర్ అల్వీ తదితరుల పేర్లు చార్జిషీట్లో ఉన్నాయి. అభియోగాలు నమోదైన ఉగ్రవాదుల్లో ఆరుగురు ఇప్పటికే ఎన్కౌంటర్లలో మరణించగా, మరోనలుగురు పరారీలో ఉన్నారు. వీరిలో ఇద్దరు కశ్మీర్లోనే ఉన్నట్టు సమాచారం. ఐఈడీ పేలుడు పదార్థాల తయారీలో దిట్టయిన ఉమర్ ఫరూఖ్ ఈ దాడిని పర్యవేక్షించడానికి 2018లో భారత్లోకి చొరబడ్డాడు. 1999 ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని హైజాక్ చేసిన ఇబ్రహీం అతర్ కుమారుడే ఇతడు. 2019 ఫిబ్రవరిలో ఫరూఖ్ ఈ దాడి చేయించాడు. ఈ దాడిలో సీఆర్పీఎఫ్కు చెందిన 40 మంది ప్రాణాలు కోల్పోవడంతో భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎన్కౌంటర్లో ఫరూఖ్ మరణించాడు. ఆత్మాహుతి బాంబర్ చివరి వీడియో చార్జిషీటులో వెల్లడించిన వివరాల ప్రకారం పుల్వామా దాడికి పాల్పడిన ఆత్మాహుతి బాంబర్ అదిల్ అహ్మద్ దార్ 200 కేజీల పేలుడు పదార్థాలతో నింపిన కారుని డ్రైవ్ చేసుకుంటూ వచ్చి సీఆర్పీఎఫ్ సిబ్బంది ప్రయాణించే వాహనాన్ని ఢీ కొన్నాడు. పుల్వామాలో షేక్ బషీర్ నివాసంలో బిలాల్ అహ్మద్ కుచే అన్న ఉగ్రవాది తెచ్చిన హైటెక్ ఫోన్ ద్వారా దార్ తన చివరి వీడియోని తీశాడు. దాడిలో అహ్మద్ దార్ మరణిస్తే, బషీర్, బిలాల్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్ఐఏకి ఎన్నో సవాళ్లు పుల్వామా దాడి కుట్రదారులు, దానిని అమలు పరిచిన వారు వివిధ ఎన్కౌంటర్లలో మరణించడంతో దర్యాప్తును ముందుకు తీసుకువెళ్లడం ఎన్ఐఏకు కత్తి మీద సాము అయింది. కారు యజమాని అహ్మద్ దార్ అని నిరూపించడానికి ఎంతో కష్టపడ్డామని ఓ అధికారి చెప్పారు. పేలుడులో నంబర్ ప్లేట్ సహా కారు పూర్తిగా «నుజ్జునుజ్జయినా ఆ కారు యజమానుల జాబితాను సేకరించామని తెలిపారు. ఆత్మాహుతి బాంబర్ అహ్మద్ దార్ అవశేషాలను సేకరించి, అతని తండ్రి డీఎన్ఏతో సరిపోల్చి ఇదంతా చేసిన వ్యక్తి దార్యేనని కోర్టులో నిరూపించాల్సి వచ్చిందని ఆ అధికారి వివరించారు. -
పుల్వామా దాడులు.. చార్జిషీట్ దాఖలు
న్యూఢిల్లీ: దేశ ప్రజలను తీవ్ర విచారంలోకి నెట్టడమే కాక పాక్, ఇండియా మధ్య యుద్ధ పరిస్థితులకు దారి తీసిన పుల్వామా దాడి కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు బృందం(ఎన్ఐఏ) మంగళవారం చార్జిషీట్ దాఖలు చేసింది. జైషే మహ్మద్ చీఫ్, ఉగ్రవాది మసూద్ అజర్తో పాటు అతడి సోదరుడు రౌఫ్ అస్గర్ పేరును ఎన్ఐఏ ఈ చార్జిషీట్లో చేర్చింది. పుల్వామా దాడికి వీరిద్దరే ప్రధాన సూత్రధారులని ఎన్ఐఏ ఛార్జిషీట్లో పేర్కొంది. 5,000 పేజీలతో కూడిన ఛార్జిషీట్ను ఎన్ఐఏ జమ్మూ కోర్టులో సమర్పించనుంది. ఈ దారుణమైన ఉగ్రదాడులకు ఎలాంటి ప్రణాళిక రచించారు.. పాక్ నుంచి ఎలా అమలు చేశారనే దాని గురించి అధికారులు చార్జిషీట్లో పూర్తిగా వివరించారు. అంతేకాకుండా జైషే మహ్మద్కు చెందిన 20 మంది ఉగ్రవాదులు ఈ దాడికి అవసరమైన ఆయుధాలను సమకూర్చారని ఛార్జిషీట్లో తెలిపారు. వీటన్నింటికీ అవసరమైన పూర్తి ఆధారాలను కూడా ఎన్ఐఏ బృందం కోర్టుకు సమర్పించనుంది. వాట్సాప్ చాటింగ్, ఫొటోలు, ఆర్డీఎక్స్ రవాణాకు సంబంధించిన ఫొటోలు, ఫోన్ కాల్స్ డేటా... ఇలా కీలక ఆధారాలను ఎన్ఐఏ అధికారులు కోర్టుకు నివేదించనున్నారు. (చదవండి: మళ్లీ ‘పూల్వామా’ దాడి జరిగితేనే బీజేపీ గెలుపు!) భారత్ కశ్మీర్ను ఆక్రమించుకున్నందనే పాక్ ఈ దాడులకు తెగబడిందని ఎన్ఐఏ తెలిపింది. భారత్పై దాడికి పాక్, స్థానికుడు ఆదిల్ అహ్మద్ దార్ను ఉపయోగించింది. అతడు సూసైడ్ బాంబర్గా మరి సీఆర్పీఎఫ్ దళాలు ప్రయాణిస్తున్న కాన్వాయ్ మీదకు పేలుడు పదార్థాలతో నిండిని కారును దూకించాడని అధికారులు తెలిపారు. ఇక పుల్వామా దాడిలో పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ తన దేశం పాత్రను ఖండించిన సంగతి తెలిసిందే. భారతదేశం సాక్ష్యాలు ఇస్తే నేరస్థులను విచారిస్తామని కూడా తెలిపారు. కానీ చర్యలు మాత్రం శూన్యం. పైగా అంతర్జాతీయ సమాజం నుంచి ఎంత ఒత్తిడి వస్తున్నప్పటికి పాక్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
ఉగ్రవాది ఖతం.. బాంబులు మిస్సింగ్!
-
ఉగ్రవాది ఖతం.. కానీ, బాంబులు మిస్సింగ్!
శ్రీనగర్: పుల్వామాలో బుధవారం జరిగిన భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు జైషే ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో బాంబు తయారీలో నిపుణుడైన ఫౌజీ భాయ్ అలియాస్ అబ్దుల్ రెహమాన్ కూడా ఉన్నట్టు కశ్మీర్ రేంజ్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. ఫౌజీ భాయ్ ఎన్కౌంటర్ భద్రతా బలగాలకు పెద్ద విజయమని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, రెహమాన్ తయారు చేసిన మూడు కారు బాంబుల్లో ఒకదానిని భద్రతా బలగాలు పేల్చివేయగా... మరో రెండింటి ఆచూకీ తెలియాల్సి ఉంది. బుడ్గాం, కుల్గాం ప్రాంతాల్లో ఆ బాంబులు ఉండొచ్చని, వాటి జాడ కోసం ముమ్మర తనిఖీలు కొనసాగుతున్నాయని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. (చదవండి: పెనుముప్పుగా నిబంధనల ఉల్లంఘన..!) కాగా, పుల్వామా తరహా ఉగ్రదాడి జరగనుందనే ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. 20 కిలోల శక్తిమంతమైన ఐఈడీని మోసుకెళ్తున్న శాంట్రో వాహనాన్ని మే 27న సీజ్ చేశాయి. ఐఈడీని తరలిస్తున్న టెర్రరిస్టు సమీర్ అహ్మద్ దార్ తృటిలో తప్పించుకుపోయాడు. ఇక ఐఈడీ వాహనాన్ని తరలించడం ప్రమాదమని భావించిన బాంబు స్క్వాడ్ నిపుణులు దానిని అక్కడే పేల్చివేశారు. గతేడాది పుల్వామా వద్ద భద్రతా బలగాలపై ఆత్మహుతి దాడికి పాల్పడ్డ అదిల్ దార్కు సమీర్ అహ్మద్ దార్ బంధువని తేలింది. పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. (చదవండి: పుల్వామాలో భారీ ఎన్కౌంటర్) -
పుల్వామా దాడి: అమెజాన్లో రసాయనాలు కొని..
శ్రీనగర్: గతేడాది 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను బలితీసుకున్న పుల్వామా ఉగ్రదాడితో సంబంధం ఉన్నట్లుగా అనుమానిస్తున్న మరో ఇద్దరు వ్యక్తులను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు అరెస్టు చేశారు. జవాన్ల కాన్వాయ్ను పేల్చివేసేందుకు ఉపయోగించిన ఐఈడీ తయారీలో కీలకంగా వ్యవహరించిన వాజ్-ఉల్-ఇస్లాం(19), మహ్మద్ అబ్బాస్(32)లను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. బాంబు తయారీ కోసం వీరిద్దరు అమెజాన్లో పలు రసాయనాలు కొనుగోలు చేసినట్లు గుర్తించామని పేర్కొన్నారు. విచారణలో భాగంగా.. జైషే మహ్మద్ ఉగ్రవాదుల సూచనల మేరకు.. తన అమెజాన్ షాపింగ్ అకౌంట్ను ఉపయోగించి వివిధ రసాయనాలు, బ్యాటరీలు, ఇతర పదార్థాలు ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసినట్లు ఇస్లాం అంగీకరించాడని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. పుల్వామా ఉగ్రకుట్రలో భాగంగా ఇస్లామే వీటన్నింటినీ జైషే ఉగ్రవాదులకు వ్యక్తిగతంగా చేరవేశాడని పేర్కొన్నారు. (చదవండి: ఉగ్రవాది ఆదిల్కు శిక్షణ ఇచ్చింది అతడే!) అదే విధంగా పుల్వామా దాడికి ఉపయోగించిన ఐఈడీని తయారు చేసిన మహ్మద్ ఉమర్కు.. అబ్బాస్ 2018 నుంచి తన ఇంటిలో ఆశ్రయం కల్పించాడని తెలిపారు. కొన్నేళ్లుగా రహస్యంగా జైషే కోసం పనిచేస్తున్న అబ్బాస్... జవాన్ల వాహనశ్రేణిపై ఆత్మాహుతికి పాల్పడిన ఆదిల్ అహ్మద్ దార్, పాకిస్తాన్ నుంచి వచ్చిన సమీర్ అహ్మద్ దార్, కమ్రాన్లకు సహకరించాడని పేర్కొన్నారు. అంతేగాకుండా జైషే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన తారీఖ్ అహ్మద్ షా, అతడి కూతురు ఇన్షా జాన్కు కూడా సహకారం అందించాడని వెల్లడించారు. త్వరలోనే ఇస్లాం, అబ్బాస్ను ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం ముందు ప్రవేశపెడతామని తెలిపారు. కాగా పుల్వామాలోని హక్రిపొరాకు చెందిన ట్రక్ డ్రైవర్ తౌఫిక్ అహ్మద్ షా, అతడి కూతురు ఇన్షాజాన్(23)లు 2018-19 కాలంలో ఉగ్రవాదులకు చాలాసార్లు ఆహారం, ఇతర వస్తువులను సమకూర్చారన్న ఆరోపణలతో ఎన్ఐఏ అధికారులు వారిని బుధవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజా పరిణామాలతో ఈ కేసులో అరెస్టైన నిందితుల సంఖ్య ఐదుకు చేరింది.(‘పుల్వామా’ నిందితుడి అరెస్ట్ ) -
పుల్వామా కేసులో తండ్రి, కూతురు అరెస్టు
శ్రీనగర్: గత ఏడాది 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న పుల్వామా ఘటన విచారణలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కీలక పురోగతి సాధించింది. నిందితులకు జమ్మూలోని ప్రత్యేక న్యాయస్థానం 10 రోజుల రిమాండ్ విధించింది. పుల్వామాలోని హక్రిపొరాకు చెందిన ట్రక్ డ్రైవర్ తౌఫిక్ అహ్మద్ షా, అతడి కూతురు ఇన్షాజాన్(23)లు 2018–19 కాలంలో ఉగ్రవాదులకు చాలాసార్లు ఆహారం, ఇతర వస్తువులను సమకూర్చారు. పాకిస్తాన్ ఉగ్రవాది, పేలుడు పదార్థాల నిపుణుడు అయిన మొహ్మద్ ఉమర్ ఫరూక్, పాకిస్తాన్కే చెందిన కమ్రాన్, ఇస్మాయిల్ అలియాస్ ఇబ్రహీం, అలియాస్ అద్నాన్లు తౌఫిక్ ఇంట్లోనే బస చేశారు. ‘మొహ్మద్ ఉమర్తో ఇన్షా జాన్ టెలిఫోన్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ఉత్తరప్రత్యుత్తరాలు సాగించింది. అతడు చనిపోయే దాకా ఈ సంబంధాలు కొనసాగాయని మా దర్యాప్తులో తేలింది’అని ఎన్ఐఏ తెలిపింది. -
పుల్వామా ఉగ్రదాడి : తండ్రికూతుళ్ల అరెస్ట్
శ్రీనగర్ : పుల్వామా ఉగ్రదాడి విచారణలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కీలక ముందడుగు వేసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న తండ్రికూతుళ్లను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో జమ్మూకశ్మీర్లోని లెత్పొరాకు చెందిన తారిక్ అహ్మద్ షా, ఇన్షా తారిక్లు ఉన్నారు. సోమవారం రాత్రి వారి ఇళ్లపై సోదాలు జరిపిన అధికారులు మంగళవారం తెల్లవారుజామున అహ్మద్, ఇన్షాలను అరెస్ట్ చేశారు. పుల్వామా దాడికి కొద్ది రోజుల ముందు వీరు జైషే మొహ్మద్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించినట్టుగా తెలుస్తోంది. అహ్మద్, ఇన్షా అరెస్ట్లతో ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ చేసిన వారి సంఖ్య మూడుకు చేరింది. గతవారం పుల్వామా ఉగ్రదాడికి సహకరించిన జైషే మొహ్మద్ సభ్యుడు షకీర్ బషీర్ మాగ్రేను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పుల్వామా దాడిలో పాల్గొన్న ఆత్మా హుతి సభ్యుడు ఆదిల్ అహ్మద్ ధార్కు షకీర్ వసతి, ఇతర సౌకర్యాలు కల్పించాడు. షకీర్ను విచారిస్తున్న ఎన్ఐఏ అధికారులు.. అతడి నుంచి రాబట్టిన సమాచారం మేరకే అహ్మద్, ఇన్షాలను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. కాగా, గతేడాది ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామాలో సీఆర్పీఎఫ్ వాహన శ్రేణిపై జరిగిన ఆత్మహుతి దాడిలో 40 మంది జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. (చదవండి : ‘పుల్వామా’ నిందితుడి అరెస్ట్) -
సరిహద్దు దాటిన రోజు!
-
వాలెంటైన్స్ డే: భజరంగ్దళ్ కార్యకర్తల బీభత్సం..!
-
వాలెంటైన్స్ డే: భజరంగ్దళ్ కార్యకర్తల అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : వాలెంటెన్స్ డే సందర్భంగా మాదాపూర్, ఐటీ కారిడార్ పరిసరాల్లో ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల దినోత్సవానికి వ్యతిరేకంగా ఆగ్రహంతో విధ్వంసం సృష్టించిన ఐదుగురు యువకులను మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో నాగోత్ అజయ్ సింగ్, వదిత్య అర్జున్, కొర్ర సంతోష్, గుడుపు పవన్ కుమార్, పొలారి తిరుపతి ఉన్నారు. ఫిబ్రవరి 14వ తేదీన సుమారు 10 నుంచి 15 మంది బజరంగ్ దళ్ కార్యకర్తలు కే పి హెచ్ బి నుంచి హైటెక్ సిటీ వెళ్లేదారిలో ద్విచక్ర వాహనాలపై వెళ్తూ వాలెంటైన్స్ డేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గచ్చిబౌలి, కొత్తగూడా, మాదాపూర్ తదితర ప్రాంతాలలోని వాణిజ్య సముదాయాలపై దాడులకు దిగారు. దారిలో కనపడిన ఓ ఐస్ క్రీమ్ షాప్ లో విధ్వంసం సృష్టించారు. ఇనార్బిట్ మాల్, బికనీర్ వాలా, ఏబీఎన్ శరత్ మాల్ తదితర చోట్ల దాడులకు దిగారు. సమాచారం మేరకు కాగా పోలీసులు ఇనార్బిట్ మాల్ కి చేరుకోగానే వారంతా అక్కడి నుంచి పారిపోయారు. కాగా షాపు యాజమాన్యాల ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీస్ స్టేషన్ లలో రెండు కేసులు నమోదయ్యాయి. సీసీటీవీ ఫుటేజీ లు పరిశీలించిన అనంతరం పోలీసులు ఐదుగురు భజరంగ్ దళ్ కార్యకర్తలను అరెస్టు చేశారు. వారిని జ్యూడిషియల్ రిమాండ్ కు తరలించారు. కాగా మిగిలిన వారైన సుభాష్, కిరణ్, దత్త సాయి, సాయి రెడ్డి, వెంకట్ మరియు తదితరులు కోసం పోలీసులు గాలిస్తున్నారు. (చదవండి: వాలెంటైన్స్ డే.. ప్రేమికుల అవస్థలు) -
‘పుల్వామా’పై రాజకీయ దాడి
న్యూఢిల్లీ/శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో 40 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలను బలిగొన్న దాడి ఘటనకు ఏడాదైన సందర్భంగా భారత్లో రాజకీయ చిచ్చు రాజుకుంది. కాంగ్రెస్, వామపక్షాలు దాడిలో మరణించిన జవాన్లకు నివాళులర్పిస్తూనే కేంద్రంపై మాటల తూటాలు విసిరాయి. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా కేంద్రానికి సూటిగా మూడు ప్రశ్నలు సంధించారు. 1. ఈ దాడి నుంచి ఎక్కువగా లబ్ధి పొందిందెవరు? 2. ఈ దాడిపై విచారణ ఎంతవరకు వచ్చింది? 3. సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై దాడి.. భద్రతా వైఫల్యానికి బీజేపీలో ఎవరిది బాధ్యత? ఈ మూడు ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం జవాబివ్వాలని డిమాండ్ చేశారు. రాహుల్కు మద్దతుగా సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గళం విప్పారు. పుల్వామా దాడిలో బతికి బయటపడిన వారికి ఎలాంటి సాయం అందించారని, మృతుల కుటుంబాలకు ఏం చేశారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ, బీజేపీ.. జవాన్ల మృతదేహాలతో రాజకీయం చేసి ఎన్నికల్లో ఓట్లు దండుకున్నారని ఆరోపించారు. ఉగ్రవాదుల సానుభూతిపరుడు రాహుల్: బీజేపీ జాతి యావత్తూ పుల్వామా దాడిలో మృతి చెందిన వారికి నివాళులర్పిస్తుంటే రాహుల్ ఇలా మాట్లాడడం సిగ్గు చేటని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ధ్వజమెత్తారు. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థల సానుభూతి పరుడైన రాహుల్ కేంద్రంతో పాటు భద్రతా బలగాలను కూడా టార్గెట్ చేయడం దారుణమని అన్నారు. దోషి అయిన పాక్ను రాహుల్ ఎప్పుడూ ప్రశ్నించరెందుకని నిలదీశారు. రాహుల్ తన వ్యాఖ్యల ద్వారా అంతర్జాతీయ వేదికలపై భారత్ను ఇరుకున పెట్టడానికి ఒక ఆయుధం ఇస్తున్నారని ట్వీట్ చేశారు. పుల్వామా దాడిపై విచారణ పురోగతి కష్టమే పుల్వామా దాడిపై విచారణ ముందుకు వెళ్లడానికి అన్ని మార్గాలు మూసుకుపోయినట్టే కనిపిస్తోంది. ఈ దాడితో ప్రమేయం ఉన్న అయిదుగురు ఉగ్రవాదులు భద్రతా బలగాలు చేపట్టిన వివిధ ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయారు. 2008లో ముంబైపై ఉగ్రవాదుల దాడి తర్వాత ఏర్పాటైన ఉగ్రవాద నిరోధక విచారణ సంస్థ (ఎన్ఐఏ)కు ఈ దాడి వెనుక సూత్రధారి, ఇతర కుట్రదారులెవరు వంటి వివరాలు తెలుసుకోవడానికి కచ్చితమైన సమాచారమేదీ లేదు. ‘‘ఈ కేసులో ఎన్నో అంశాలున్నాయి. కానీ వేటికి ఆధారాలు లేవు. కోర్టుల్లో ఏదైనా సాక్ష్యాధారాలతోనే సమర్పించాలి. అందుకే ఈ కేసులో పురోగతి సాధించలేం’’అని విచారణ బృందంలో ఉన్న అధికారి ఒకరు చెప్పారు. సరిగ్గా ఏడాది క్రితం కరడు గట్టిన జైషే మహమ్మద్ ఉగ్రవాదులు భారత్పై విద్వేషం వెళ్లగక్కారు. కశ్మీర్లో పుల్వామా సమీపంలో సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్పై కారుబాంబుతో దాడి జరిపారు. ఈ దాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఆత్మాహుతి దాడి కోసం వినియోగించిన ఆ కారు యజమాని ఎవరన్నదే ఇప్పటికీ విచారణ బృందానికి సవాల్గానే మారింది. మీ బలిదానాన్ని మరువలేం: ప్రధాని ‘పుల్వామా’అమరవీరులకు శుక్రవారం ప్రధాని మోదీ నివాళులర్పించారు. దేశ రక్షణ కోసం జీవితాన్ని అంకితం చేసి, చివరికి ప్రాణత్యాగం చేసిన వారికి సాటి, పోటీ ఎవరూ లేరని కొనియాడారు. భారతీయులు ఎన్నటికీ ఆ వీర సైనికుల బలిదానాన్ని మరువలేరని మోదీ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, స్మృతీ ఇరానీ హర్దీప్ పూరీ, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తదితరులు పుల్వామా అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. పుల్వామా స్మారకం ఆవిష్కరణ పుల్వామా దాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 40 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది స్మృత్యర్థం లెత్పోరా సైనిక శిబిరంలో స్మారక స్తూపాన్ని ఆవిష్కరించారు. సీఆర్పీఎఫ్ జవాన్ల సేవ, నిజాయితీలకు గుర్తుగా ఈ స్థూపాన్ని ఆవిష్కరించారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన 40 మంది జవాన్ల ఫోటోలను వారి పేర్లతో సహా ఆ స్థూపంపై చెక్కారు. అమరవీరుల కుటుంబాలకు తాము ఎంతో చేస్తున్నామని సీఆర్పీఎఫ్ అదనపు డైరెక్టర్ జనరల్ జుల్ఫికర్ హసన్ తెలిపారు. ఇక మహారాష్ట్రకు చెందిన ఉమేష్ గోపీనాథ్ అనే వ్యక్తి మొత్తం 61 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి, అమరవీరుల ఇళ్లకు వెళ్లి అక్కడ మట్టిని తీసుకువచ్చి సీఆర్పీఎఫ్ ఏర్పాటు చేసిన స్మారక స్తూపం వద్ద నివాళిగా ఉంచారు. -
పూల్వామా ఉగ్రదాడితో లాభపడింది ఎవరు?
న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడితో లాభపడింది ఎవరని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. పుల్వామా ఉగ్రదాడి జరిగి నేటితో సరిగా ఏడాది పూర్తయిన సందర్భంగా రాహుల్ ట్విటర్ వేదికగా.. ఆ దాడిలో మరణించిన 40 మంది అమర జవాన్లకు నివాళులర్పించారు. అలాగే బీజేపీ ప్రభుత్వానికి మూడు ప్రశ్నలు సంధించారు.‘పుల్వామా ఉగ్రదాడితో ఎక్కువగా లాభపడింది ఎవరు?. ఈ ఘటనపై జరిపిన విచారణలో ఏం తేలింది?. భద్రతా లోపాల వల్ల జరిగిన ఈ దాడికి బీజేపీ ప్రభుత్వంలోని ఎవరు బాధ్యత వహిస్తారు?’ అని రాహుల్ గాంధీ ట్విటర్లో పేర్కొన్నారు. పుల్వామా ఉగ్రదాడిని బీజేపీ రాజకీయ లబ్ధికి వాడుకుందని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తున్న సంగతి విదితమే. ఈ దాడిని సాకుగా చూపి భద్రత, జాతీయవాదం పేరిట బీజేపీ గత లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందిందని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. కాగా, గతేడాది ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామాలో సీఆర్పీఎఫ్ వాహన శ్రేణిపై జరిగిన ఆత్మహుతి దాడిలో 40 మంది జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో దాదాపు 80 కిలోల బరువున్న హై గ్రేడ్ ఆర్డీఎక్స్ పేలుడు పదార్థాలు వాడినట్టు అధికారులు తెలిపారు. Today as we remember our 40 CRPF martyrs in the #PulwamaAttack , let us ask: 1. Who benefitted the most from the attack? 2. What is the outcome of the inquiry into the attack? 3. Who in the BJP Govt has yet been held accountable for the security lapses that allowed the attack? pic.twitter.com/KZLbdOkLK5 — Rahul Gandhi (@RahulGandhi) February 14, 2020 -
ఎన్నికలు.. ఆందోళనలు
2019 రాజకీయంగా, సామాజికంగా జరిగిన మార్పులు మామూలువి కావు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరున్న భారతదేశంలో ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో సార్వత్రిక ఎన్నికల క్రతువు ముగిసింది. 543 లోక్సభ స్థానాలతో పాటు కొన్ని అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగ్గా భారతీయ జనతా పార్టీ 303 లోక్సభ స్థానాలతో కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకుంది. ఒక రాజకీయ పార్టీ సొంతంగా పూర్తిస్థాయి మెజారిటీ సాధించడం 30 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి కూడా. ఆర్థికంగా వెనుకబడ్డ వారికి రిజర్వేషన్లు.. విద్యా, ఉపాధి రంగాల్లో ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణాల వారికి పదిశాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రాజ్యాంగాన్ని 124వ సారి మార్చారు కూడా. ఏడాదికి రూ.8 లక్షల కంటే తక్కువ ఆదాయం కలిగి ఉండి... ప్రభుత్వమిచ్చే ఇతర రిజర్వేషన్లు (ఎక్స్ సర్వీస్ మెన్, వికలాంగులు తదితరాలు) ఉపయోగించుకోని అగ్రవర్ణాల వారికి ఈడబ్ల్యూఎస్ కోటా వర్తిస్తుంది. ఏడాది మొదట్లో, లోక్సభ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఈ నిర్ణయం తీసుకోవడం ఎన్డీయేపై కొన్ని విమర్శలు వచ్చేందుకూ కారణమైంది. పౌరసత్వ చట్ట సవరణ.... దేశాద్యంతం ఆందోళనలకు, హింసాత్మక ఘటనలకు తావిచ్చిన చట్ట సవరణ ఇది. 1955 నాటి చట్టం ప్రకారం భారతీయ పౌరులయ్యేందుకు ఉన్న ఐదు అవకాశాల్లో కొన్ని సవరణలు చేయడం మొత్తం వివాదానికి కారణమైంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లకు చెందిన హిందు, సిక్కు, పార్శీ, క్రైస్తవ, జైన, బౌద్ధ మతాల వారు ఆయా దేశాల్లో మతపరమైన హింస ఎదుర్కొంటే వారికి భారతీయ పౌరసత్వం కల్పించేందుకు ఈ సవరణ వెసులుబాటు కల్పించింది. ఈ జాబితాలో ముస్లింల ప్రస్తావన లేకపోవడం, ఇతర ప్రాంతాలు, దేశాల నుంచి వచ్చే ముస్లిమేతరుల పరిస్థితీ అగమ్యగోచరంగా మారడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు రేగాయి. ఈ ఆందోళనపూరిత వాతావరణం కొనసాగుతుండగానే కేంద్రం జాతీయ జనాభా పట్టిక తయారీకి ఏర్పాట్లు చేయడంతో పరిస్థితి ఇంకా సద్దుమణగలేదు. కాంగ్రెస్లో నేతల కరవు సార్వత్రిక ఎన్నికల తరువాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడంతో ఆ పార్టీలో కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. గాంధీ కుటుంబానికి చెందని వారినెవరినైనా పార్టీ అధ్యక్షుడిగా నియమించుకోవాలని రాహుల్ స్వయంగా విజ్ఞప్తి చేసినప్పటికీ కొన్ని నెలల పాటు అధ్యక్ష ఎన్నికపై తర్జనభర్జనలు కొనసాగాయి. చివరకు సోనియాగాంధీ మరోసారి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సమయంలోనే ఉత్తరప్రదేశ్లోని ఒక ప్రాంతానికి ఇన్చార్జ్గా ప్రియాంక గాంధీ నియమితులవడం, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగానూ ఆమెకు పదవి దక్కడం ఆ పార్టీలో జరిగిన ముఖ్యపరిణామాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూ కశ్మీర్, లద్దాఖ్... జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుతోపాటు జమ్మూ కశ్మీర్ నుంచి లద్దాఖ్ను వేరు చేసి కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించడం ఈ ఏడాది జరిగిన అత్యంత కీలకమైన రాజకీయ ఘట్టాల్లో ఒకటి. దశాబ్దాలుగా దేశంలో ఒకరకమైన అసంతృప్తికి కారణమైన ఆర్టికల్ 370ని ఈ ఏడాది ఆగస్టు 5న రద్దు చేశారు. ఆ తరువాత అక్కడ పెద్ద ఎత్తున ఆంక్షలు విధించడం, 145 రోజుల వరకూ ఇంటర్నెట్పై నిషేధం విధించటం వంటి అంశాలు ప్రపంచదేశాలు దృష్టి పెట్టేలా చేశాయి. పుల్వామా దాడులు... పాకిస్తాన్ ప్రేరిపిత ఉగ్రవాద చర్యలకు తాజా తార్కాణంగా చెప్పుకునే పుల్వామా దాడులు ఈ ఏడాది దాయాది దేశాలు మరోసారి కత్తులు నూరేందుకు కారణమయ్యాయి. ఫిబ్రవరి 14న జమ్మూ కశ్మీర్లో ఓ మిలటరీ కాన్వాయ్పై ఉగ్రవాదులు దాడి చేయగా అందులో సుమారు 40 మంది భారతీయ సైనికులు మరణించారు. ఈ ఘటనకు ప్రతీకారంగా అదే నెల 26న భారత సైన్యం పాకిస్తాన్ లోపలికి చొరబడి బాలాకోట్ వద్ద ఉగ్రవాద స్థావరాలపై బాంబులు వేసింది. ఈ క్రమంలో భారతీయ యుద్ధ విమాన పైలెట్ అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ చేతికి చిక్కాడు. అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గిన పాకిస్తాన్ కొన్ని రోజుల వ్యవధిలోనే అభినందన్ను సగౌరవంగా భారత్కు అప్పగించింది. -
అమర జవాన్ల కోసం 'స్టాండ్ ఫర్ ద నేషన్'
సాక్షి, విజయవాడ: ఆసరా సంస్థ ఆధ్వర్యంలో 'స్టాండ్ ఫర్ ద నేషన్' బ్రోచర్ ఆవిష్కరణ శనివారం విజయవాడ ప్రెస్ క్లబ్లో జరిగింది. విజయవాడ వినియోగదారుల (కన్జ్యూమర్) ఫోరమ్ జడ్జి మాధవరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. పుల్వామా దాడిలో అమరులైన 40 మంది సైనికులకోసం ఆసరా సంస్థ ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. రాబోయే ఫిబ్రవరి 14న మధ్యాహ్నం 3 గంటల15 నిమిషాలకు అమరులైన జవాన్ల కోసం నివాళిగా స్టాండ్ ఫర్ ద నేషన్ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టనుందని పేర్కొన్నారు. దేశంలోని ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని కోరారు. ఆసరా ద్వారా ఢిల్లీ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు వినియోగదారులకు అందించిన సేవలు మరువలేనివని మాధవరావు ప్రశంసించారు. చట్టం గురించి తెలియని వారి కోసం.. ఆసరా సంస్థ సభ్యులు పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు. -
పుల్వామాలో మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రమూక..
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్లోని పుల్వామాలో భద్రతా దళాల పెట్రోలింగ్ పార్టీపై మంగళవారం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. భద్రతా దళాలపై దాడికి పాల్పడిన అనంతరం ఉగ్రవాదులు పరారయ్యారు. పెట్రోలింగ్ పార్టీపై దాడులకు తెగబడిన ఉగ్రవాదులను అదుపులోకి తీసుకునేందుకు ఆ ప్రాంతాన్ని సైన్యం జల్లెడపడుతోంది. ఈ దాడికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది. కాగా, జమ్ము కశ్మీర్లోని అనంత్నాగ్లో ట్రక్ డ్రైవర్ను కాల్చిచంపిన ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుబెట్టిన కొద్దిసేపటికే పుల్వామా ఉగ్ర దాడి చోటుచేసుకోవడం గమనార్హం. అనంత్నాగ్ జిల్లాలోని బిజ్బెహరా పట్టణంలో ఉగ్రవాదులు ట్రక్ డ్రైవర్ను దారుణంగా హతమార్చారు. జమ్ము కశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను ఆగస్ట్ 5న రద్దు చేసిన అనంతరం కశ్మీర్లో కశ్మీరీయేతర వ్యక్తిపై ఉగ్రవాదులు ఈ తరహా దాడి జరపడం ఇది నాలుగోసారి. బాధిత ట్రక్ డ్రైవర్ను జమ్ముకు చెందిన నారాయణ్ దత్గా గుర్తించారు. ఇక జమ్ము కశ్మీర్లో క్షేత్రస్ధాయి పరిస్ధితులను పర్యవేక్షించేందుకు యూరప్ ఎంపీల బృందం కశ్మీర్లో పర్యటిస్తోంది. -
‘వారు సైనిక హీరోల కుమారులు’
న్యూఢిల్లీ: భారత జట్టు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీటర్ అకౌంట్లో ఎప్పుడూ యాక్టివ్ ఉంటాడు. అయితే తాజాగా వీరూ చేసిన ట్వీట్కు మాత్రం నెటిజన్లు ఫిదా అయ్యారు. ఈ ఏడాది ఆరంభంలో పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. వారిలో కొందరి పిల్లలను సెహ్వాగ్ తన అంతర్జాతీయ స్కూల్లోనే చదివిస్తున్నాడు. ఈ సందర్భంగా వారు క్రికెట్లో శిక్షణ పొందుతున్న ఫొటోలను ట్వీట్ చేశాడు. ‘వారంతా సైనిక హీరోల కుమారులు. ముఖ్యంగా ఆ ఇద్దరు ఇక్కడ ఉండడం గౌరవంగా భావిస్తున్నాను. బ్యాటింగ్ చేస్తున్న కుర్రాడు అమర జవాన్ రామ్ వకీల్ కుమారుడు.. బౌలింగ్ చేస్తున్న కుర్రాడు అమర జవాన్ విజయ్ సోరెంగ్ కుమారుడు. వీరికి సేవ చేయడం కన్నా మించిన ఆనందం ఉంటుందా’ అని ట్విటర్లో పోస్ట్ చేశాడు. దీనిపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. అభిమానులు సెహ్వాగ్కు సెల్యూట్ చేస్తున్నారు. అమరులైన జవాన్ల పిల్లల్ని చదివించి గొప్ప మానవత్వాన్ని చాటుకున్నావ్ అంటూ కొనియాడుతున్నారు. విద్యాదానం కంటే మరేది గొప్పది కాదు అంటూ సెహ్వాగ్ను ప్రశంసిస్తున్నారు. -
బాలాకోట్ ఉగ్రశిబిరం మొదలైంది
చెన్నై: బాలాకోట్ ఉగ్రశిబిరాలపై భారతవైమానిక దళాల దాడితో ధ్వంసమైన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఉగ్ర స్థావరాలు తిరిగి ప్రారంభమయ్యాయని భారత సైనికాధిపతి బిపిన్రావత్ చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో వెల్లడించారు. పుల్వామా దాడికి సమాధానంగా భారత వైమానికదళం దాడుల్లో «ధ్వంసమైన బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలను పాకిస్తాన్ ఇటీవలే తిరిగి ప్రారంభించిందని ఆయన తెలిపారు. పుల్వామాలో భారత సైనిక వాహనంపై ఉగ్రవాదుల దాడి 40 మంది భారత సైనికులను పొట్టనపెట్టుకున్న సంగతిని ఆయన గుర్తుచేశారు. ఏడు నెలలక్రితం బాలాకోట్పై భారత్ దాడితో ఉగ్రవాదులు అక్కడినుంచి వెళ్ళిపోయారని తెలిపారు. తిరిగి మళ్ళీ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు బాలాకోట్లో తమ కార్యకలాపాలను ప్రారంభించారని ఆయన వెల్లడించారు. గతంలో జరిపిన దాడికి మించి ఈసారి దాడులు చేసే అవకాశముందన్నా రు. మంచుకరుగుతున్న ప్రాం తాల గుండా, మంచు తక్కువగా ఉన్న ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్లోని ఉత్తరభాగంనుంచి భారత్లోకి చొరబడేందుకు 500 మంది ఉగ్రమూకలు వేచిఉన్నారనీ, ఈ సంఖ్య సమయానుకూలంగా మరవచ్చుననీ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. కశ్మీర్ లోయలో ఏదో జరుగుతోందని కొందరు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారనీ, కానీ కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఆంక్షలను క్రమంగా ఎత్తివేస్తున్నామనీ, ఇప్పుడిప్పుడే అక్కడి పరిస్థితి చక్కబడుతోందనీ ఆయన వెల్లడించారు. నియంత్రణ రేఖ వెంబడి మోహరించిన సైన్యం ఉగ్రవాదులను చొరబాట్లను తీవ్రంగా అడ్డుకుంటోందనీ అయితే అంతర్జాతీయ సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాలను ఉగ్రవాదులు తమ కార్యకలాపాలకు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు బిపిన్ రావత్ ఆరోపించారు. కాగా, కథువా జిల్లాలో 40 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు సైన్యం ప్రకటించింది. కశ్మీర్లో ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్ జమ్ము: బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతల హత్య సహా నాలుగు ఉగ్రవాద ఘటనలతో సంబంధమున్న ముగ్గురు హిజ్బుల్ ముజాహిదీన్ ముష్కరులను పోలీసులు అరెస్టు చేశారు. కిష్త్వార్ జిల్లాకు చెందిన నిస్సార్ అహ్మద్ షేక్, నిషాద్ అహ్మద్, ఆజాద్ హుస్సేన్లు కలిసి బీజేపీ నేత అనిల్ పరిహార్, ఆయన సోదరుడు అజిత్ పరిహార్లను గత ఏడాది కాల్చి చంపారు. ఏప్రిల్ 9వ తేదీన ఆర్ఎస్ఎస్ నేత చందర్కాంత్ శర్మ, ఆయన అంగరక్షకుడిని కాల్చి చంపారని జమ్మూ జోన్ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ ముకేశ్ సింగ్ వెల్లడించారు. హింసాత్మక ఘటనలకు పాల్పడిన అనంతరం వీరంతా షేక్ హుస్సేన్ ఇంట్లో తలదాచుకునే వారని ముకేశ్ వెల్లడించారు. మరోవైపు, జమ్మూ కశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి చొరబాటుదారులను అడ్డుకునేందుకు భారత రక్షణ బలగాలకు పూర్తి స్థాయి అధికారాలు కట్టబెట్టారు. ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం భారత్లోని కీలకమైన నగరాలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆర్మీని బలగాలను అలర్ట్ చేసినట్లు పేర్కొన్నారు. -
మళ్లీ ‘పూల్వామా’ దాడి జరిగితేనే బీజేపీ గెలుపు!
ఔరంగబాద్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్సీపీ అధినేత, సీనియర్ నాయకుడు శరద్ పవార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పూల్వామా తరహా ఉగ్రవాద దాడి జరిగితే తప్ప బీజేపీ మహారాష్ట్ర ఎన్నికల్లో గట్టెక్కలేదని, రాష్ట్రంలోని దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వంపై ప్రజలు ప్రతీకారంతో రగిలిపోతున్నారని అన్నారు. ‘లోక్సభ ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం, వ్యతిరేకత ఉన్నాయి. కానీ, పూల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి జరగడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి’ అని ఆయన విలేకరులతో పేర్కొన్నారు. అదే తరహాలో మరో పూల్వామా దాడి జరిగితే తప్ప బీజేపీ మహారాష్ట్ర ఎన్నికల్లో గట్టెక్కబోదని పేర్కొన్నారు. బీజేపీ-శివసేన కూటమి నుంచి అధికారాన్ని తాము చేజిక్కించుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఫడ్నవీస్ సర్కారు గత ఐదేళ్లలో ప్రజలకోసం చేసిందేమీ లేదని అన్నారు. ఎన్సీపీపై ప్రజల్లో భారీ అంచనాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీతోపాటు బహుజన్ వికాస్ అగాథి, సమాజ్వాదీ పార్టీ వంటి చిన్న పార్టీలతో జత కలిసి కాషాయ కూటమిని ఎదుర్కోబోతున్నామని అన్నారు. -
అమర జవాన్లకు బాలీవుడ్ నివాళి
న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ఘనంగా నివాళులర్పించేందుకు బాలీవుడ్ తారలు సిద్దమయ్యారు. అందుకోసం వారంతా ఓ వీడియో సాంగ్లో కనిపించనున్నారు. ‘తూ దేశ్ మేరా’ అని సాగే ఈ పాటలో అమితాబ్ బచ్చన్, షారుఖ్ఖాన్, అమీర్ఖాన్, ఐశ్వర్య రాయ్, రణబీర్ కపూర్, కార్తీక్ ఆర్యన్, టైగర్ ష్రాఫ్లు కనిపించనున్నారు. ఎంతో బిజీగా ఉండే తారలు.. అమర జవాన్లకు నివాళులర్పించడానికి తమ సమయాన్ని ఈ వీడియో కోసం కేటాయించినట్టుగా తెలుస్తోంది. 73వ స్వాతంత్ర్యదినోత్సవానికి ఒక్క రోజు ముందుగా ఈ వీడియో సాంగ్కు సంబంధించి కవర్ పోస్టర్ను సీఆర్పీఎఫ్ ట్విటర్ ద్వారా విడుదల చేసింది. అలాగే ఇందులో పాలుపంచుకున్న బాలీవుడ్ తారలకు ధన్యవాదాలు తెలిపింది. సీఆర్పీఎఫ్ విడుదల చేసిన ఈ పోస్టర్లో బాలీవుడ్ తారలు జవాన్లకు సెల్యూట్ చేస్తూ కనిపించారు. ఈ పాట కోసం సింగర్లు జావేద్ అలీ, జుబిన్ నౌటియల్, షబాబ్ సబ్రి, కబీర్ సింగ్లు తమ గళం విప్పారు. మీట్ బ్రోస్ సంగీతం అందించారు. Official Poster of the Tribute Song for #CRPF Martyrs of Pulwama #TuDeshMera by @HAPPYPRODINDIA Bollywood comes together to pay homage to the Pulwama Martyrs of #CRPF Thanks @SrBachchan @iamsrk @aamir_khan @TheAaryanKartik @iTIGERSHROFF #Ranbirkapoor #AishwaryaRai pic.twitter.com/OPLrNfz8Ia — 🇮🇳CRPF🇮🇳 (@crpfindia) August 14, 2019 -
పైలట్ అభినందన్కు అత్యున్నత పురస్కారం?
న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ను భారత ప్రభుత్వం ఉన్నత మిలిటరీ పురస్కారంతో సత్కరించే అవకాశముందని కథనాలు వస్తున్నాయి. బాలాకోట్లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడుల అనంతరం గగనతలంలో జరిగిన పోరులో దాయాది పాకిస్థాన్కు చెందిన ఎఫ్-16 విమానాన్ని తాను నడుపుతున్న మిగ్-21 బిసన్ యుద్ధవిమానం నుంచి అభినందన్ కూల్చేశారు. ఇందుకుగాను ఆయనకు ‘వీరచక్ర’ పురస్కారం దక్కే అవకాశముందని తెలుస్తోంది. పరమవీర చక్ర, మహావీర చక్ర పురస్కారాల తర్వాత అత్యున్నత మిలిటరీ పురస్కారం ‘వీరచక్ర’. బాలాకోట్లోని జైషే మహమ్మద్ (జేఈఎం) ఉగ్రవాద శిబిరాలపై బాంబులు జారవిడిచిన ఐదుగురు మిరాజ్ 2000 ఫైటర్ పైలట్లను కూడా కేంద్రం సత్కరించనుంది. వారి సాహసానికి గుర్తింపుగా వాయుసేన మెడల్స్ను బహూకరించనుంది. పాక్ యుద్ధవిమానాలతో పోరాడుతూ.. తన మిగ్-21 బిసన్ యుద్ధవిమానం కూలిపోవడంతో అభినందన్ పాక్ భూభాగంలో దిగిన సంగతి తెలిసిందే. రెండురోజుల పాక్ చెరలో ఉన్న అభినందన్ను.. భారత ప్రభుత్వం తెచ్చిన దౌత్య ఒత్తిడిని తలొగ్గి దాయాది రెండు రోజుల అనంతరం మన దేశానికి అప్పగించింది. గత ఫిబ్రవరి 26న పూల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా బాలాకోట్లో భారత సైన్యం వైమానిక దాడులు జరిపిన సంగతి తెలిసిందే. -
ఆర్టికల్ 370 రద్దు: మరో పుల్వామా దాడి
ఇస్లామాబాద్: ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు అంశాలపై దాయాది దేశం పాక్ మరోసారి విషం చిమ్మింది. ఆర్టికల్ 370 రద్దు ప్రభావం త్వరలోనే ఉంటుందని.. రానున్న రోజుల్లో మరో పుల్వామా దాడి జరగవచ్చని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. మంగళవారం పాకిస్తాన్ పార్లమెంటు సంయుక్త సమావేశంలో ఇమ్రాన్ ఖాన్ ప్రసంగిస్తూ.. మోదీ నిర్ణయం కశ్మీర్ ప్రజలను అణచి వేయలేదని పేర్కొన్నాడు. బీజేపీది జాత్యాంహకార భావజాలమని.. ముస్లింలను ఆ పార్టీ రెండో తరగతి ప్రజలుగానే పరిగణిస్తుందని వ్యాఖ్యానించాడు. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం, మహ్మద్ అలీ జిన్నా రెండు దేశాల సిద్ధాంతాన్ని బలపరుస్తుందని ఇమ్రాన్ పేర్కొన్నాడు. ‘భారతదేశం కేవలం హిందువులకే అని ఆర్ఎస్ఎస్ అభిప్రాయం. అదెప్పుడూ ముస్లింలను రెండో తరగతి ప్రజలుగానే భావిస్తుంది. ఈ రోజు మొదటి సారి బీజేపీ భావజాలాన్ని ప్రపంచం కూడా చూసింది’ అన్నాడు ఇమ్రాన్. పాకిస్తాన్ ఏర్పాటును వ్యతిరేకించిన కొందరు కశ్మీర్ నాయకులు.. నేడు జిన్నా రెండు దేశాల సిద్ధాంతం నిజమయ్యిందని బాధపడుతున్నారని పేర్కొన్నాడు. భారతదేశం కేవలం హిందువులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంది. కానీ పాకిస్తాన్ మాత్రం మానవులందరిని సమానంగా చూస్తుందని ఇమ్రాన్ తన ప్రసంగంలో పేర్కొన్నాడు. గతంలో జరిగిన పుల్వామా దాడికి, పాక్కు ఎలాంటి సంబంధం లేదని ఈ సందర్భంగా ఇమ్రాన్ స్పష్టం చేశాడు. అయితే బీజేపీ తీసుకున్న నిర్ణయం వల్ల త్వరలోనే మరో పుల్వామా దాడి జరగనుందని ఇమ్రాన్ పేర్కొన్నాడు. జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు లోక్సభ ఆమోదముద్ర వేసింది. మంగళవారం రాత్రి లోక్సభలో హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టిన జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు–2019కు అనుకూలంగా 370 మంది, వ్యతిరేకంగా 70 మంది ఓటు వేశారు. జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, ఆర్టికల్ 35–ఏలను రద్దు చేసిన తీర్మానం కూడా లోక్సభ ఆమోదం పొందింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 351 మంది, వ్యతిరేకంగా 72 మంది ఓటు వేశారు. ఒకరు గైర్హాజరయ్యారు. తృణమూల్ కాంగ్రెస్, జేడీ(యూ) సభ నుంచి వాకౌట్ చేశాయి. -
మోదీలోని మరో కోణాన్ని చూడాలంటే..
న్యూఢిల్లీ: బేర్ గ్రిల్స్.. డిస్కవరి ఛానెల్ చూసే వారికి ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ షోతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బేర్ గ్రిల్స్.. సోమవారం చేసిన ఓ ట్వీట్తో మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ‘180 దేశాలకు చెందిన ప్రజలు.. 2019, ఆగస్టు 12నాటి రాత్రి 9గంటలకు మోదీలోని మరో కోణాన్ని చూడబోతున్నారు’ అంటూ ఓ వీడియోను ట్వీట్ చేశారు గ్రిల్స్. 49 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ప్రధాని నరేంద్ర మోదీ, బేర్ గ్రిల్స్తో కలిసి అడవుల్లో సంచరిస్తూ.. నదులను దాటుతూ కనిపించారు. ఈ క్రమంలో గ్రిల్స్, మోదీని ఉద్దేశించి.. ‘భారత్కు చెందిన ముఖ్యమైన వ్యక్తి ప్రస్తుతం నాతో ఉన్నారు. మిమ్మల్ని క్షేమంగా తిరిగి తీసుకెళ్లాల్సిన బాధ్యత నా మీద ఉంది’ అంటూ కామెంట్ చేయడం వినవచ్చు. People across 180 countries will get to see the unknown side of PM @narendramodi as he ventures into Indian wilderness to create awareness about animal conservation & environmental change. Catch Man Vs Wild with PM Modi @DiscoveryIN on August 12 @ 9 pm. #PMModionDiscovery pic.twitter.com/MW2E6aMleE — Bear Grylls (@BearGrylls) July 29, 2019 ఈ వీడియోలో గ్రిల్స్ జంతువుల సంరక్షణ, పర్యావరణ మార్పుల వంటి అంశాలపై మోదీతో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ మొత్తాన్ని ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ జాతీయ పార్కులో చిత్రీకరించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇందుకు సంబంధించిన షూటింగ్ జరిగినట్లు సమాచారం. అయితే అదే సమయంలో జమ్మూకశ్మీర్లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై దాడి చేసి 40 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ దాడి చోటు చేసుకున్న సమయంలో నరేంద్ర మోదీ షూటింగ్లో పాల్గొన్నారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అప్పుడాయన ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ షూటింగ్లో పాల్గొన్నారనే విషయం ప్రస్తుతం స్పష్టమైంది. ఈ షో గురించి ప్రకటించిన వెంటనే ప్రతిపక్షాలు మరో సారి నరేంద్ర మోదీ తీరుపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. ‘పుల్వామాలో ఉగ్రవాదులు బరి తెగించి 44 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్నారు. దేశం అంతా తీవ్ర విషాదంలో మునిగి ఉన్న సమయంలో మోదీ మాత్రం షూటింగ్లో పాల్గొన్నారు. దారుణం గురించి తెలిసిన తర్వాత కూడా ఆయన ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు. జవాన్ల మృతి పట్ల మోదీకి ఎంత బాధ ఉందో ప్రోమోలో ఆయన నవ్వు చూస్తేనే అర్థం అవుతుంద’ని విపక్ష నేతలు మండి పడుతున్నారు. -
ఇమ్రాన్ వ్యాఖ్యలకు ఆర్మీ చీఫ్ కౌంటర్
సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడి భారత్ ఇంటి పనేనని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ దీటుగా తిప్పికొట్టారు. పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి పాకిస్తాన్ పాత్రపై భారత్ పూర్తి ఆధారాలను పాక్కు ఇచ్చిందని చెప్పారు. భారత నిఘా సంస్ధలు పుల్వామాలో ఏం జరిగిందనేది ఆధారాలతో సహా అందించాయని..ఇంతకంటే తాను ఏమీ చెప్పలేనని ఆయన వ్యాఖ్యానించారు. కాగా ఇమ్రాన్ ఖాన్ ఇటీవల తన అమెరికా పర్యటన సందర్భంగా పుల్వామా దాడిలో పాకిస్తాన్ పాత్ర లేదని, భారత భద్రతా దళాల వేధింపులతో విసుగుచెందిన ఓ కశ్మీరీ యువకుడు ఈ ఘాతుకానికి తెగబడగా, అనూహ్యంగా పాకిస్తాన్ పేరును తెరపైకి తెచ్చారని వ్యాఖ్యానించారు. జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ పాకిస్తాన్లో ఉన్నా కశ్మీర్లోనూ దాని ఉనికి ఉందని, పుల్వామా దాడి భారత్లో జరిగిన దేశీయ దాడిగా ఇమ్రాన్ చెప్పుకొచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో 40 మందికిపైగా సీఆర్పీఎఫ్ సిబ్బంది మురణించిన సంగతి తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని బాలాకోట్లో మెరుపు దాడులు చేపట్టి ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసింది. -
అందుకే మా దేశం బదనాం అయింది: పాక్ ప్రధాని
వాషింగ్టన్ : భారత్లో జరిగిన పుల్వామా ఉగ్రదాడితో పాకిస్తాన్కు సంబంధంలేదని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. ఈ దాడి భారత్ అంతర్గత సమస్యతో కశ్మీర్ ప్రజలు చేసిన పనేనన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఇమ్రాన్ వాషింగ్టన్లోని ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ కేంద్రంగా ఏర్పడిన జైషే ఈ మొహమ్మద్ ఉగ్రసంస్థ ఈ దాడికి పాల్పడినట్లు అంగీకరించడంతో తమ దేశం బదనాం అయిందన్నారు. కానీ ఈ దాడితో పాక్కు ఎలాంటి సంబంధం లేదన్నారు. జైషే మోహమ్మద్ పాక్ చెందినదే అయినప్పటికి అది కశ్మీర్లో కూడా ఉందని, భారత్లోని సమస్యలతోనే ఈ ఉగ్రదాడి జరిగిందని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. ‘భారత భద్రతా బలగాల వేధింపులకు గురైన ఓ కశ్మీర్ యువకుడే తిరుగుబాటు చేస్తూ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. కానీ ఈ దాడి పాకిస్తాన్ చేయించినట్లు ప్రచారం జరిగింది’ అని ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు. ఈ ఉగ్రదాడిలో 40 మంది భారత సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఈ దాడి అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. పాక్పై భారత వాయుసేన ప్రతీకారదాడులు చేపట్టడం.. పాక్ కూడా దాడులు చేసే ప్రయత్నం చేయడం.. తదానంతరం చోటుచేసుకున్న పరిణామాలు తెలిసిందే. అమెరికాలో పర్యటన సందర్భంగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్తో సోమవారం వైట్హౌస్లో సమావేశమయ్యారు. అనంతరం జరిగిన ఉమ్మడి మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘రెండు వారాల క్రితం మోదీతో సమావేశమైనప్పుడు.. కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా ఆయన నన్ను కోరారు. కశ్మీర్ సమస్య పరిష్కారం కావాలని భారత్, పాక్లు కోరుకుంటున్నాయి. ఈ విషయంలో ఇరు దేశాలు కోరితే తన వంతుగా మధ్యవర్తిత్వం చేసేందుకు సిద్ధంగా ఉన్నాన’ని పేర్కొన్నారు. అక్కడే ఉన్న ఇమ్రాన్ ట్రంప్ ప్రతిపాదనను స్వాగతించారు. ట్రంప్ మధ్యవర్తిత్వం తమకు ఇష్టమేనని ఆయన తెలిపారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలు భారత్లో పెనుదుమారాన్నే లేపాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. కశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా మోదీ.. ట్రంప్ను కోరలేదని స్పష్టం చేసింది. కశ్మీర్ సమస్య రెండు దేశాలకు సంబంధించిందని, ఈ విషయంలో మూడో దేశం జోక్యం అవసరం లేదని ఘాటుగా వ్యాఖ్యానించింది. -
‘బాలాకోట్ దాడితో దారికొచ్చారు’
సాక్షి, న్యూఢిల్లీ : భారత వైమానిక దళం పాకిస్తాన్లోని బాలాకోట్లో జరిపిన మెరుపు దాడులు అనంతరం దేశంలోకి చొరబాట్లు 43 శాతం తగ్గాయని ప్రభుత్వం మంగళవారం పార్లమెంట్లో వెల్లడించింది. గత ఏడాది తొలి ఆరు నెలల కాలంతో పోలిస్తే ఈ ఏడాది ప్రధమార్ధంలో జమ్ము కశ్మీర్లో భద్రతా పరిస్థితి మెరుగైందని హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది. సీమాంతర చొరబాట్లను ప్రభుత్వం ఉపేక్షించకుండా భద్రతా చర్యలను ముమ్మరం చేసిందని తెలిపింది. జమ్ము కశ్మీర్ ప్రభుత్వంతో కలిసి భద్రతా దళాలు దేశ సరిహద్దుల్లో నిరంతర నిఘా, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టడంతో చొరబాట్లు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ చెప్పారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత వైమానికదళం పీఓకేలోని బాలాకోట్లో మెరుపు దాడులు చేపట్టి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. -
పుల్వామా ఉగ్రదాడి.. వారి తప్పేమీ లేదు
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో జరిగిన పుల్వామా ఉగ్రదాడి విషయంలో ఇంటిలిజెన్స్ వైఫల్యం ఏమీ లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు. బుధవారం లోక్సభలో జరిగిన చర్చలో భాగంగా ఆయన ఈ ప్రకటన చేశారు. దేశ భద్రత కోసం ఇంటిలిజెన్స్, భద్రతా సిబ్బంది ఎంతో సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. గడిచిన మూడు దశాబ్ధాల కాలంలో అనేక మంది ఉద్రవాదులను భారత బలగాలు హతమార్చాయని ఆయన గుర్తుచేశారు. పుల్వామా ఉగ్రదాడికి కారణమైన జైషే ఏ మహ్మద్ స్థావరాలపై దాడులు చేసి.. ప్రతీకార చర్యలను కూడా చేపట్టామన్నారు. దేశంలో అశాంతి అనే పదం వినపించకుండా పాలించడమే ప్రభుత్వం లక్ష్యమని కిషన్రెడ్డి అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదుల కుట్ర కారణంగానే ఫిబ్రవరి 14న జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారని వెల్లడించారు. దానిలో భాగంగా ఫిబ్రవరి 26న పాక్ సరిహద్దులోని బాలాకోట్పై భారత వైమానిక దళాలు మెరుపు దాడులు చేపట్టినట్లు కిషన్రెడ్డి గుర్తుచేశారు. -
కలవరపెట్టిన పాక్ సబ్మెరైన్
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని బాలాకోట్లో ఉన్న జైషే మొహమ్మద్ ఉగ్రస్థావరంపై భారత్ ఫిబ్రవరి 26న వైమానికదాడులు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పాకిస్తాన్కు చెందిన అత్యాధునిక సబ్మెరైన్ ఒకటి భారత అధికారులను తీవ్రంగా కలవరపెట్టింది. చాలాకాలం నుంచి భారత్ పాక్ నేవీ కదలికలపై నిఘా ఉంచుతోంది. ఈ క్రమంలో బాలాకోట్ దాడుల తర్వాత పాక్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడకుండా 60కిపైగా యుద్ధనౌకలు, విమానవాహక యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యను అంతర్జాతీయ సముద్ర జలాల్లో మోహరించింది. ఈ నేపథ్యంలో పాక్ నేవీకి చెందిన అగొస్టా క్లాస్ సబ్మెరైన్ ‘పీఎన్ఎస్ సాద్’ కరాచీకి సమీపంలో అదృశ్యమైపోయింది. ‘ఎయిర్ ఇండిపెండెంట్ ప్రపల్షన్’ సాంకేతికత ఉన్న ఈ పీఎన్ఎస్ సాద్ మిగతా సబ్మెరైన్ల కంటే ఎక్కువరోజులు సముద్రగర్భంలో ఉండిపోగలదు. దీంతో భారత్పై దాడికి పాక్ పీఎన్ఎస్ సాద్ ను పంపిందన్న అనుమానం భారత అధికారుల్లో బలపడింది. పీఎన్ఎస్ సాద్ గుజరాత్ తీరానికి 3 రోజుల్లో, ముంబైకి 4 రోజుల్లో చేరుకోగలదని నేవీ నిపుణులు అంచనా వేశారు. దాన్ని అడ్డుకునేందుకు అణు సబ్మెరైన్ ఐఎన్ఎస్ చక్ర, ఐఎన్ఎస్ కల్వరితో పాటు పీ–8ఐ విమానాలను రంగంలోకి దించారు. వీటితోపాటు ఉపగ్రహాల సాయంతో 21 రోజుల పాటు గాలించారు. భారత జలాల్లో ప్రవేశించి లొంగిపోకుంటే సాద్ను పేల్చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. చివరికి 21 రోజుల తర్వాత పాక్కు పశ్చిమాన ఉన్న సముద్రజలాల్లో పీఎన్ఎస్ సాద్ను భారత నేవీ గుర్తించింది. ఈ విషయమై నేవీ అధికార ప్రతినిధి కెప్టెన్ డీకే శర్మ మాట్లాడుతూ.. భారత్తో యుద్ధం తలెత్తితే రహస్యంగా దాడి చేసేందుకు పాక్ సాద్ను వ్యూహాత్మకంగా అక్కడ మోహరించిందని తెలిపారు. కానీ భారత దూకుడు, అంతర్జాతీయ ఒత్తిడిలతో పాక్ తోకముడిచిందని వెల్లడించారు. దీంతో మక్రాన్ తీరంలోనే ïసాద్ అగిపోయిందని పేర్కొన్నారు. -
జమ్మూకశ్మీర్లో హై అలర్ట్..!
శ్రీనగర్: ఉగ్రదాడులు జరగొచ్చన్న నిఘావర్గాల హెచ్చరికలతో జమ్మూకశ్మీర్లో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాద దాడులు జరగొచ్చని భారత్, అమెరికాకు పాకిస్థాన్ నిఘా సమాచారం ఇచ్చిన నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. అవంతిపురలో శక్తిమంతమైన ఐఈడీ బాంబులతో కూడిన వాహనాలతో ముష్కరులు పేలుళ్లకు పాల్పడవచ్చని పాక్ ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీచేసింది. గత నెలలో కశ్మీర్లో ఆర్మీ నిర్వహించిన స్పెషల్ ఆపరేషన్లో ఉగ్రవాది జకీర్ మూసా హతమయ్యాడు. దీనికి ప్రతీకారంగా ఉగ్రదాడులు జరుగొచ్చని నిఘావర్గాలు హెచ్చరించాయి. అవంతిపురకు 7 కిలోమీటర్ల దూరంలోనే ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడి జరిగింది. ఆ దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ హెచ్చరికలతో భారత్ అప్రమత్తమైంది. సరిహద్దుల వెంట గస్తీని మరింత పెంచింది. -
మోదీకి పాక్ ప్రధాని లేఖ!
ఇస్లామాబాద్ : ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యలు, కశ్మీర్ అంశంపై చర్చించుకుందామని ప్రధాని నరేంద్రమోదీకి, పాకిస్తాన్ అధినేత ఇమ్రాన్ ఖాన్ లేఖ రాసినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. కిర్జిస్తాన్ రాజధాని బిషక్లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సదస్సు సందర్భంగా నరేంద్రమోదీ, ఇమ్రాన్ ఖాన్ మధ్య సమావేశం ఉండబోదని భారత్ స్పష్టం చేసిన మరుసటి రోజే పాక్ ఈ లేఖ రాయడం గమనార్హం. రెండోసారి ప్రధానిగా ఎన్నికైన మోదీకి ఇమ్రాన్ ఖాన్ అభినందనలు తెలిపారని, ఇరు దేశాల సత్సంబంధాలు, సమస్యల పరిష్కారం కేవలం చర్చలతోనే సాధ్యమని లేఖలో పేర్కొన్నారని పాక్ మీడియా తెలిపింది. ఇరు దేశాల సత్సంబంధాలు మెరుగుపడితే పేదరికాన్ని అధిగమించవచ్చని, ప్రాంతీయ అభివృద్ధికి కృషి చేయవచ్చని, కశ్మీర్ సమస్య పరిష్కారం కూడా చర్చలతోనే సాధ్యమని ఇమ్రాన్ ఖాన్ అభిలాషించినట్లు పేర్కొంది. అయితే ఈ లేఖపై ఇప్పటి వరకు భారత్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇక మోదీ మరోసారి ప్రధానిగా ఎన్నికైన అనంతరం కలిసి పనిచేద్దాం, చర్చించుకుందామని పాక్ కోరడం ఇది రెండోసారి. 2016లో పఠాన్కోట్ వైమానిక శిబిరంపై ఉగ్రవాద దాడి అనంతరం భారత్, దాయాది పాకిస్థాన్తో అధికారిక చర్చలను నిలిపివేసింది. ఉగ్రవాదం, చర్చలు కలిసిసాగలేవంటూ అప్పటి నుంచి దాయాదితో ద్వైపాక్షిక చర్చలకు ఫుల్స్టాప్ పెట్టింది. ఈ నెల 13, 14 తేదీల్లో బిషక్లో జరగనున్న షాంఘై సహకార సంస్థ సదస్సుకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. అటు పాక్ ప్రధాని ఇమ్రాన్ కూడా ఈ సదస్సుకు వస్తుండటంతో వీరిద్దరు భేటీ కావొచ్చునని ఊహాగానాలు వినిపించాయి. కానీ భారత్ మాత్రం పాక్ ప్రధాని ఎలాంటి సమావేశం లేదని స్పష్టం చేసింది. తనకు తెలిసినంతవరకు బిషక్లో ఎస్సీవో సదస్సు సందర్భంగా మోదీ, ఇమ్రాన్ ఖాన్ భేటీకి ప్లాన్ చేయలేదని, వారిద్దరి మధ్య సమావేశం ఉండే అవకాశం లేదని విదేశాంగ అధికార ప్రతినిధి రవీష్కుమార్ మీడియాకు తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ మాత్రం మోదీ ఘనవిజయంపై ఫోన్ద్వారా అభినందనలు తెలిపారని, మోదీ సైతం ఆయనకు ధన్యవాదాలు చెప్పారన్నారు. ఫిబ్రవర్ 14న పుల్వామా ఉగ్రదాడితో ఇరు దేశాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తతంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో 40 మంది భారత జవాన్లు అమరులుకాగా.. ప్రతీకారచర్యగా భారత వాయుసేన పాక్పై సర్జికల్ స్ట్రైక్స్ జరపడం.. పాక్ వాయుసేన భారత్పై దాడికి ప్రయత్నించడంతో యుద్దం ఖాయామనే పరిస్థితి ఏర్పడింది. కానీ పాక్ భూభాగంలో చిక్కుకున్న భారత వాయుసేన పైలట్ అభినందన్ వర్థమాన్ క్షేమంగా తిరిగిరావడంతో ఈ ఉద్రిక్తతలకు ఫుల్స్టాప్ పడింది. ఇక పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సైతం భారత్లో బీజేపీ ప్రభుత్వమే కొలువుదీరాలని భావించారు. బీజేపీ అయితే కశ్మీర్ అంశం కొలిక్కి వస్తుందని, కాంగ్రెస్ అయితే ఏ నిర్ణయం తీసుకోకుండా సంశయిస్తుందని ఎన్నికల ముందు ఏప్రిల్లో అభిప్రాయపడ్డారు. -
గగనతల నిషేధాన్ని పొడిగించిన పాక్
ఇస్లామాబాద్: భారత సరిహద్దుల్లోని గగనతలంపై విధించిన నిషేధాన్ని పాకిస్తాన్ వరుసగా రెండోసారి పొడిగించింది. మరో రెండు వారాల పాటు ఈ మార్గంలో వాణిజ్య విమాన సేవలు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 14న పుల్వామా జిల్లాలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా ఫిబ్రవరి 26న పాకిస్తాన్లోని బాలాకోట్లో జైషే మహ్మద్ ఉగ్రస్థావరాలపై భారత వైమానిక దళం మెరుపుదాడులు నిర్వహించింది. దీంతో పాక్...భారత సరిహద్దుల్లోని తన గగనతలంపై వాణిజ్య విమానాలు వెళ్లకుండా నిషేధం విధించింది. మే 15తో ఇది ముగియడంతో... ఈ నెల 30 వరకు నిషేధాన్ని పొడిగించింది. తాజాగా వచ్చేనెల 14 వరకు తమ గగనతలంపై నిషేధాన్ని పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. నిషేధం కారణంగా యూరోప్, ఆగ్నేయాసియా విమానాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. -
పుల్వామా ఉగ్రదాడి దర్యాప్తులో కీలక పురోగతి
-
జవాను సమాచారంతోనే.. పుల్వామా దాడి
భోపాల్ : హానీ ట్రాప్లో చిక్కిన ఓ భారతసైనికుడు సీఆర్పీఎఫ్ కదలికల సమాచారం అందించి పుల్వామా దాడికి కారణమయ్యాడని మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్(ఏటీఎస్), కేంద్ర నిఘా సంస్థల దర్యాప్తులో తేలింది. సామాజిక మాధ్యమాల్లో పాక్ ఐఎస్ఐ వేసిన ఉచ్చులో భారత సైనికుడు అవినాష్ కుమార్ (25) చిక్కుకున్నాడు. స్నూఫింగ్ యాప్ ద్వారా ఓ అమ్మాయిలా మాట్లాడినట్టు జవానును మభ్యపెట్టి కీలక సమాచారాన్ని తెలుసుకున్నారని కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాల దర్యాప్తులో తెలిసింది. సీఆర్పీఎఫ్ బలగాల కదలికల సమాచారం అవినాష్ ఎప్పటికప్పుడు అందజేశాడని, దీనివల్లే పుల్వామాలో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేయించి 40మందిని హతమార్చారని వెల్లడైంది. మన సైనిక బలగాల సమాచారాన్ని పాకిస్థాన్కు చేరవేసిన అవినాష్ కుమార్ను మధ్యప్రదేశ్ ఏటీఎస్ అధికారులు అరెస్టు చేశారు. ఇండోర్ సమీపంలోని మోహో పట్టణంలోని బీహార్ రెజిమెంట్లో క్లర్క్గా అవినాష్ కుమార్ పనిచేశారు. 2018లో ఇతన్ని అసోంకు బదిలీ చేశారు. అవినాష్ తండ్రి కూడా ఆర్మీ జవానే. అవినాష్ బ్యాంకు ఖాతాలో పాకిస్థాన్ నుంచి రూ.50 వేలు డిపాజిట్ కూడా చేశారని తెలుస్తోంది. అయితే అమ్మాయితో సెక్స్ ఛాట్ చేయడంతో పాటు డబ్బుకు కక్కుర్తి పడి భారత సైనిక రహస్యాలను పాక్ ఐఎస్ఐకు అందించాడా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అవినాష్ కుమార్ను అరెస్టు చేసి భోపాల్లోని స్పెషల్ జిల్లా కోర్టులో ప్రవేశపెట్టగా అతన్ని రిమాండుకు తరలించారు. అవినాష్ ఇంట్లో పోలీసులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. -
‘ఆ అందమైన మొహం ఇప్పుడు ఎక్కడ’
పట్నా : బిహార్ ప్రతిపక్ష నాయకుడు, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్... ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మీద విమర్శల వర్షం కురిపించారు. నా మొహం చూసి జనాలు ఓట్లు వేస్తారని ప్రగల్భాలు పలికిన వ్యక్తి.. నేడు మొహం చాటేశాడు ఎందుకు అని నితీశ్ కుమార్ని ప్రశ్నించారు తేజస్వీ. సీఎం నితీశ్ కుమార్ నియోజకవర్గమైనా నలందలో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు తేజస్వీ యాదవ్. ఈ క్రమంలో ఆయన సీనియర్ రిపోర్టర్ ప్రణయ్ రాయ్తో ముచ్చటించారు. నలంద ప్రజలకు నితీశ్ కుమార్ మీద ఉన్న నమ్మకం తగ్గిపోయిందన్నారు. రిజర్వేషన్ల విషయంలో నితీశ్ తీసుకున్న చర్యలే ఇందుకు కారణమని పేర్కొన్నారు తేజస్వీ. అంతేకాక గతంలో ‘జనాలు నా మొహం చూసి ఓటు వేస్తారని చెప్పిన వ్యక్తి.. ఇప్పుడు పుల్వామా ఉగ్రదాడిని చూపించి ఓట్లు వేయమని కోరుతున్నారు. భారత ఆర్మీని, ఒకప్పుడు తాను ఎంతగానో ద్వేషించిన మోదీ పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు ఎందుకు. ఇప్పుడు ఆయన అందమైన మొహం ఎక్కడ’ అని తేజస్వీ ప్రశ్నించారు. ఉగ్రవాదుల మీద దాడుల చేయడం మాత్రమే నిజమైన దేశ భక్తి అనిపించుకోదన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసి.. వారిని ఆర్థికంగా బలంగా తయారు చేయడం కూడా దేశభక్తే అన్నారు. పేదరికం తొలగించడం.. యువతకు ఉపాధి కల్పించడం వంటి అంశాలన్ని కూడా దేశభక్తి కిందకే వస్తాయన్నారు తేజస్వీ. -
ఔదార్యం చాటుకున్న ‘పుల్వామా’ జవాన్
-
వైరల్ : మానవత్వం చాటుకున్న ‘పుల్వామా’ జవాన్..!
శ్రీనగర్ : పక్షవాతంతో బాదపడుతున్న ఓ బాలుడి పట్ల పుల్వామా ఉగ్రదాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఇక్బాల్ సింగ్ అనే జవాన్ ఔదార్యం చాటాడు. అతనికి తన లంచ్ బాక్స్ ఇవ్వడంతో పాటు స్వయంగా ఆహారం తినిపించాడు. శ్రీనగర్లోని నవాకాదల్ ప్రాంతంలో శాంతిభద్రతల పర్యవేక్షణ విధులు నిర్వర్తిస్తున్న ఇక్బాల్కు స్థానికంగా నివాసముంటున్న ఓ పిల్లాడు తారసపడ్డాడు. అతను ఆకలితో ఉన్నాడని గ్రహించిన జవాన్ తన లంచ్ బాక్స్ ఇచ్చాడు. అయితే, సదరు బాలుడి రెండు చేతుల్లో చలనం లేదని తెలియడంతో .. తనే దగ్గరుండి తినిపించాడు. 31 సెకన్ల నిడివి గల ఈ వీడియో వైరల్ అయింది. సోల్జర్ మంచితనంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక్బాల్ ఔదార్యం మెచ్చి ‘హ్యూమన్ అండ్ సెల్ఫ్లెస్ యాక్ట్’ సర్టిఫికేట్ కూడా అందించామని సీఆర్పీఎఫ్ తెలిపింది. వీరత్వం, కరుణ అనేవి ఒకే నాణేనికి ఉన్న రెండు పార్శ్వాలు అని పేర్కొంది. జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్తున్న సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై జైషే మహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఇదే కాన్వాయ్లోని ఓ వాహనానికి ఇక్బాల్ డ్రైవర్గా ఉన్నారు. క్షతగాత్రులైన సహచరులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి ఆయన వారి ప్రాణాలు కాపాడారు. ఔదార్యం చాటుకున్న ‘పుల్వామా’ జవాన్ -
నాడు 170 మంది ఉగ్రవాదులు హతం
న్యూఢిల్లీ: బాలాకోట్లోని జైషే ఉగ్రస్థావరంపై భారత వాయుసేన(ఐఏఎఫ్) చేసిన దాడిలో ఎవ్వరూ చనిపోలేదని బుకాయిస్తున్న పాకిస్తాన్కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఏడాది ఫిబ్రవరి 26న తెల్లవారుజామున ఐఏఎఫ్ చేపట్టిన వైమానికదాడిలో 130 నుంచి 170 జైషే ఉగ్రవాదులు చనిపోయారని ఇటాలియన్ జర్నలిస్ట్ ఫ్రాన్సెక్సా మారినో తెలిపారు. ఐఏఎఫ్ దాడిలో ఘటనాస్థలిలోనే భారీ సంఖ్యలో ఉగ్రవాదులు చనిపోగా, మరికొందరు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారని వెల్లడించారు. ఈ దాడిలో గాయపడ్డ ఉగ్రమూకలకు పాక్ మిలటరీ డాక్టర్లు వైద్యం చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ మారినో రాసిన కథనాన్ని ‘స్ట్రింగర్ ఆసియా’ అనే వెబ్సైట్ ప్రచురించింది. మృతుల కుటుంబాలకు పరిహారం.. ఫిబ్రవరి 26 తెల్లవారుజామున ఐఏఎఫ్ యుద్ధవిమానాలు బాలాకోట్లోని ఉగ్రస్థావరంపై బాంబుల వర్షం కురిపించాయని మారినో తెలిపారు. ‘ఈ దాడిలో 11 మంది శిక్షకులు సహా 170 మంది వరకూ చనిపోయారు. దాడి జరిగిన కొద్దిసేపటికే అక్కడకు చేరుకున్న పాక్ ఆర్మీ క్షతగాత్రులను షింకియారీ ప్రాంతంలో ఉన్న హర్కతుల్ ముజాహిదీన్ క్యాంప్కు తరలించింది. స్థానికుల సమాచారం ప్రకారం ఇంకా 45 మంది ఉగ్రవాదులు ఇక్కడ చికిత్స పొందుతున్నారు. కోలుకున్నవారిని ఆర్మీ అదుపులోకి తీసుకుంది. ఈ మొత్తం విషయం బయటకు పొక్కకుండా జైషే నేతలు మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించారు. ఇప్పుడు జైషే క్యాంపును తాలిమున్ ఖురాన్(మదర్సా)గా మార్చేశారు. ప్రస్తుతం స్థానిక పోలీసులకు కూడా ఇక్కడ అనుమతి లేదు’ అని చెప్పారు. అవసరమైతే బాలాకోట్లో భారత జర్నలిస్టులను అనుమతిస్తామని పాక్ ప్రకటించిన నేపథ్యంలో మారినో ఈ కథనం రాయడం గమనార్హం. -
మసూద్ ఆస్తుల ఫ్రీజ్
ఇస్లామాబాద్: జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజర్ ఆస్తులను స్తంభింపజేయడంతోపాటు ఆయనపై ప్రయాణ నిషేధాన్ని పాక్ విధించింది. మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐరాస ప్రకటించడంతో పాక్ ఈ నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్కు చెందిన మసూద్ ఇకపై ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కొనడం, అమ్మడం వంటివి చేయడానికి వీలు లేదు. సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ (ఎస్ఈసీపీ) గురువారం పాకిస్తాన్లోని అన్ని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు ఆదేశాలిస్తూ, మసూద్కు చెందిన అన్ని పెట్టుబడుల ఖాతాలను స్తంభింపజేయాలంది. పోలీసుల అనుమతి లేకుండా మసూద్ ఎక్కడికీ ప్రయాణిచడానికి కూడా వీలు లేదని పాక్ హోం శాఖకు చెందిన ఓ అధికారి చెప్పారు. కాగా, పుల్వామా ఉగ్రవాద దాడ అనంతరమే మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని విశ్వసనీయవర్గాలు చెప్పాయి. -
ఉగ్రముద్రలో పుల్వామా పాత్ర
న్యూఢిల్లీ/వాషింగ్టన్/ఐరాస: జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తూ ఐక్యరాజ్య సమితి చేసిన నోటిఫికేషన్లో పుల్వామా ఉగ్రదాడి ప్రస్తావన లేకపోవడాన్ని భారత్ తేలిగ్గా కొట్టేసింది. అజర్ ఉగ్ర కార్యకలాపాలన్నిటి గురించి ప్రకటనలో వివరంగా ఉందని పేర్కొంది. ఆ నోటిఫికేషన్ అజర్ బయోడేటా కాదని విదేశాంగ శాఖ ప్రతినిధి రావీశ్ మీడియాతో అన్నారు. అతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడంలో పుల్వామా పాత్ర కూడా ఉందని స్పష్టం చేశారు. జైషే మొహమ్మద్కు సంబంధించిన ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రణాళికలు రచించడంతో పాటు నిధులందించినందుకు, సహాయం చేసినందుకు గాను అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తున్నట్టు యూఎన్ నోటిఫికేషన్లో స్పష్టంగా ఉందన్నారు. తమకు తగిలిన దౌత్యపరమైన పెద్ద ఎదురుదెబ్బ నుంచి దృష్టి మళ్లించేందుకు పాకిస్తాన్ అర్ధంలేని ప్రకటనలు చేస్తోందని అన్నారు. పుల్వామా దాడితో అజర్కు ముడిపెట్టే ప్రయత్నాలతో పాటు కశ్మీర్ సహా అన్ని రాజకీయ ప్రస్తావనలను ప్రతిపాదన నుంచి తొలగించిన తర్వాతే.. అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు తాము అంగీకరించామన్న పాక్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చారు. గత ప్రభుత్వాల నిరంతర కృషి వల్లే: కాంగ్రెస్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం ఒక్క మోదీ ప్రభుత్వ ఘనతే అన్నట్టుగా చెప్పుకోవడాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. అది గత ప్రభుత్వాల హయాం నుంచీ జరిగిన నిరంతర కృషితో వచ్చిన ఫలితమని కాంగ్రెస్ ప్రతినిధి రాజీవ్ శుక్లా చెప్పారు. పాక్ సైన్యం సరైన నిర్ణయాలు తీసుకోవాలి పాక్ ప్రధాని ‘సరైన విషయాలు’ చెబుతున్నారు కానీ ఆయన సైనిక నాయకత్వమూ సరైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని అమెరికా ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. ఉగ్ర సంస్థలకు మద్దతిచ్చే పాక్ విధానాన్ని మార్చేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు. కమిటీ విశ్వసనీయత పరిరక్షించబడింది అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం ద్వారా ఐక్యరాజ్య సమితి ఆంక్షల కమిటీ పవిత్రత, విశ్వసనీయత పరిరక్షించబడ్డాయని కమిటీ చైర్మన్, ఇండోనేసియా రాయబారి డియాన్ ట్రియాన్సా్యహ్ డ్జానీ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో సహకరించిన సభ్య దేశాలన్నిటికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ తీరును తప్పుపట్టిన బీజేపీ ఈ విషయంలో కాంగ్రెస్ తీరును బీజేపీ తప్పుపట్టింది. దేశం సాధించిన దౌత్య విజయంలో పాలుపంచుకునేందుకు విముఖత ప్రదర్శిస్తోందంటూ ధ్వజమెత్తింది. అలా చేస్తే రాజకీయంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందేమోనని భయపడుతున్నట్టుగా ఉందని విమర్శించింది. మోదీ ప్రభుత్వ నిరంతర కృషి వల్లే దేశం ఈ అతిపెద్ద దౌత్య విజయం సాధించగలిగిందని బీజేపీ నేతలు జైట్లీ, నిర్మలా సీతారామన్ గురువారం నాడిక్కడ చెప్పారు. జాతి భద్రతలో కాంగ్రెస్, బీజేపీల వైఖరుల మధ్య వైరుధ్యం స్పష్టంగా కన్పిస్తోందని జైట్లీ అన్నారు. ఇది ప్రతి భారతీయుడూ గర్వించదగ్గ విషయమని జైట్లీ అన్నారు. అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం బీజేపీకి ఎన్నికల అస్త్రం ఎంతమాత్రం కాదంటూనే.. జాతీయవాదం అనేది తమ పార్టీ కి ఎప్పటికీ ప్రధానాంశమేనని నొక్కిచెప్పారు. -
జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ ఉగ్రవాదిగా ప్రకటన
-
ఫలించిన దౌత్యం.. అంతర్జాతీయ ఉగ్రవాదిగా మసూద్
న్యూయార్క్ : దశాబ్ధ కాలంగా భారత్ చేస్తోన్న ప్రయత్నం నేటితో ఫలించింది. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పుల్వామాలో ఉగ్రదాడికి పాల్పడింది తామేనని జైషే మహ్మద్ అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడి అనంతరం మసూద్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ భారత్ పదే పదే ఐక్యరాజ్యసమితిని కోరింది. అయితే ఈ ప్రతిపాదనను చైనా నాలుగు సార్లు అడ్డుకున్నప్పటికీ చివరికి భారత్దే పైచేయి అయింది. మసూద్ని బ్లాక్ లిస్ట్లో చేర్చినట్లు భారత అంబాసిడర్ సయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు. ‘అందరికీ శుభవార్త.. మసూద్ అజర్ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ విషయంలో అందరి సహకారం చాలా గొప్పది. అందరికీ ధన్యవాదాలు’ అని అక్బరుద్దీన్ ట్వీట్ చేశారు. Big,small, all join together. Masood Azhar designated as a terrorist in @UN Sanctions list Grateful to all for their support. 🙏🏽#Zerotolerance4Terrorism — Syed Akbaruddin (@AkbaruddinIndia) May 1, 2019 -
‘పుల్వామా దాడితో మసూద్కు సంబంధం లేదంటేనే’
ఇస్లామాబాద్ : ఉగ్రవాది మసూద్ అజహర్ను బ్లాక్లిస్ట్లో పెట్టాలంటూ భారత్.. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో డిమాండ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అంతేకాక కొన్ని రోజుల క్రితం బ్రిటన్ కూడా త్వరలోనే మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తిస్తామని.. పాక్లోని ఉగ్ర సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో పాక్ విదేశాంగ వ్యవహారాల ప్రతినిధి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పుల్వామా ఉగ్రదాడిలో జైషే పాత్ర లేదని భారత్ ఒప్పుకుంటేనే.. మసూద్ అజహర్ను బ్లాక్లిస్ట్లో పెట్టే అంశంపై చర్చిస్తామంటూ సదరు మంత్రి షరతులు విధించడం గమనార్హం. పాకిస్తాన్ విదేశాంగ వ్యవహారాల ప్రతినిధి మహ్మద్ ఫైజల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘పుల్వామా ఉగ్రదాడిలో మసూద్ అజహర్ పాత్ర ఉన్నట్లు భారత్ దగ్గర ఏమైనా రుజువులున్నాయా. ఉంటే వాటిని ప్రపంచానికి చూపించాలి. ఒకవేళ ఎలాంటి ఆధారాలు లేకపోతే.. లేవని ఒప్పుకోవాలి. భారత్ అలా చేస్తేనే మసూద్ని బ్లాక్ లిస్ట్లో పెట్టే విషయం గురించి చర్చిస్తాం’ అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాక ‘పుల్వామా దాడి అనేది ప్రత్యేక అంశం. దీన్ని.. మసూద్ అజహర్కు ముడిపెట్టడం భావ్యం కాదు. కానీ ఈ విషయంలో భారత్ తీరు ఏం బాగోలేదు. కశ్మీర్లో దేశీయ తిరుగబాటును అణచివేయడానికి భారత్ చేసే ప్రయత్నాల్లో ఈ ప్రచారం ఓ భాగమే. దీని గురించి మేం ఎంత చెప్పినా ఎవరూ నమ్మడం లేద’ని ఫైజల్ పేర్కొన్నాడు. ఓవైపు మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ.. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఐక్యరాజ్యసమితిపై ఒత్తిడి తెస్తుండగా.. చైనా మాత్రం అందుకు అడ్డుతగులుతున్న సంగతి తెలిసిందే. -
పాకిస్తాన్కు వార్నింగ్ ఇచ్చా
పటన్/జైపూర్: పాకిస్తాన్కు తాము చేసిన తీవ్ర హెచ్చరికల ఫలితంగానే భారత వైమానిక దళ(ఐఏఎఫ్) పైలట్ వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ను సురక్షితంగా వెనక్కి పంపించిందని ప్రధాని మోదీ తెలిపారు. దేశంలో ఉగ్రవాదం అంతం కావాలంటే బీజేపీకే ఓటేయాలని ప్రజలను కోరారు. గుజరాత్లోని అన్ని స్థానాల్లోనూ బీజేపీనే గెలిపించాలని, లేకుంటే దేశవ్యాప్తంగా అదే పెద్ద చర్చకు దారి తీస్తుందని పేర్కొన్నారు. గుజరాత్లోని పటన్, రాజస్థాన్లోని చిత్తోర్గఢ్లలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని ప్రసంగించారు. బాలాకోట్ దాడి అనంతరం పాక్ ప్రతీకార యత్నం, ఆ దేశ ఎఫ్–16 విమానాన్ని కూల్చివేసే క్రమంలో అభినందన్ పాక్ సైన్యానికి పట్టుబడటం, ఆ తర్వాత విడుదలైన తీరును ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘అభినందన్ శత్రుదేశానికి పట్టుబడటంపై ప్రతిపక్షాలు నన్ను ప్రశ్నించడం మొదలుపెట్టాయి. దీంతో ప్రధాని పదవి ఉన్నా పోయినా ఒకటే. అయితే నేనైనా ఉండాలి లేదా ఉగ్రవాదులైనా ఉండాలని నిర్ణయించుకున్నా. అందుకే, మీడియా సమావేశం పెట్టి, మా పైలట్కు ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలుంటాయని, ఆ తర్వాత మోదీ ఏం చేశాడో మీరు ప్రపంచానికి చెప్పుకోవాల్సి ఉంటుందని పాక్ను హెచ్చరించా. ‘పాక్పై దాడి చేసేందుకు మోదీ వద్ద 12 క్షిపణులు సిద్ధంగా ఉన్నాయి. దాడి జరిగితే పరిణామాలు దారుణంగా ఉంటాయి’ అంటూ ఆ మరునాడే అమెరికా ఉన్నతాధికారి ఒకరు ప్రకటించారు. దీంతో దిగివచ్చిన పాక్, అభినందన్ను వెనక్కి పంపుతున్నట్లు ప్రకటించింది. లేకుంటే పాక్కు ఆ రాత్రి కాళరాత్రే అయి ఉండేది’ అని మోదీ వ్యాఖ్యానించారు. ‘పుల్వామా ఘటన అనంతరం ప్రజలు మోదీ నుంచి ఏం ఆశించారు? ముంబై ఉగ్రదాడుల తర్వాత మన్మోహన్సింగ్ మాదిరిగా వ్యవహరించి ఉంటే దేశం నన్ను క్షమించేదా? అందుకే సైన్యానికి పూర్తి అధికారాలిచ్చా. పాకిస్తాన్ కూడా అన్ని ఏర్పాట్లు చేసుకుంది. కానీ, హనుమాన్ భక్తుల్లాగా మన వాళ్లు బాలాకోట్పై విరుచుకుపడి, వాళ్ల అంతు చూశారు’ అని తెలిపారు. బాలాకోట్ దాడి ప్రతిపక్షాలకు అసౌకర్యంగా మారిందన్న ప్రధాని..భారత్ తమపై దాడి చేసిందంటూ పాక్ పదేపదే చెబుతుంటే మన ప్రతిపక్షాలు కూడా బాలాకోట్ భారత్లోనే ఉందన్నట్టుగా ఆధారాలు చూపాలంటూ గగ్గోలు పెట్టాయని ఆరోపించారు. ప్రధాని మోదీ ఎప్పుడు ఎలా స్పందిస్తారోనని తనకు భయంగా ఉందన్న ఎన్సీపీ చీఫ్ శరద్పవార్ వ్యాఖ్యలను ఆయన ప్రస్తావిస్తూ.. ‘రేపు మోదీ ఏం చేస్తాడో శరద్ పవార్కే తెలియనప్పుడు పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు ఎలా తెలుస్తుంది’ అంటూ వ్యాఖ్యానించారు. శరద్పవార్ తనకు రాజకీయ గురువు అని గతంలో ప్రధాని మోదీ ప్రకటించారు. కమలంతో ఉగ్రవాదం అంతం ‘కష్ట సమయంలో శ్రీలంక ప్రజలకు తోడుగా ఉంటాం. వారికి అవసరమైన సాయం అందించేందుకు సిద్ధం’ అని ప్రకటించారు. ‘మీరు పోలింగ్ బూత్కు వెళ్లి, కమలం(బీజేపీ ఎన్నికల చిహ్నం) గుర్తు మీట నొక్కేటప్పుడు.. అది ఉగ్రవాదాన్ని అంతం చేసే మీట అని గుర్తుంచుకోండి. మీ వేలికి అంతటి శక్తి ఉంది. మీరు మీట నొక్కడం ద్వారా ఉగ్రవాదంపై పోరాడాలన్న నా సంకల్పం బలపడుతుంది’ అని అన్నారు. అన్ని సీట్లూ నాకే ఇవ్వండి బీజేపీని గెలిపించాలని గుజరాత్ ప్రజలను కోరిన ప్రధాని.. ‘ఈ గడ్డపై పుట్టిన బిడ్డ యోగక్షేమాలు చూసుకోవడం నా సొంత రాష్ట్రం ప్రజల ధర్మం. రాష్ట్రంలోని 26 లోక్సభ స్థానాలను నాకు ఇవ్వండి. మీ సహకారంతో నా ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుంది. ఒకవేళ మీరు బీజేపీకి 26 సీట్లు ఇవ్వకుంటే ఎందుకలా జరిగిందంటూ మే 23వ తేదీ(ఎన్నికల ఫలితాల రోజు)న టీవీల్లో చర్చలు మొదలవుతాయి’ అని పేర్కొన్నారు. రాజస్థాన్లోని చిత్తోర్గఢ్లో అభిమానులు బహూకరించిన తన చిత్తరువుతో ప్రధాని మోదీ -
తిరిగి విధుల్లోకి అభినందన్!?
న్యూఢిల్లీ : పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని కూల్చి భారతావని నీరాజనాలు అందుకున్న భారత వాయుసేన పైలట్ అభినందన్ వర్థమాన్ త్వరలోనే తిరిగి విధుల్లో చేరనున్నారు. అయితే గతంలో ఆయన పనిచేసిన శ్రీనగర్ ఎయిర్బేస్లో కాకుండా మరో చోట పోస్టింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు... ‘ ధైర్యసాహసాలు ప్రదర్శించిన వింగ్ కమాండర్కు పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేశాం. పాక్ సరిహద్దులోని ఓ ఎయిర్బేస్లో తను విధులు నిర్వర్తించే అవకాశం ఉంది. అయితే అది శ్రీనగర్లోనా.. మరే ఇతర చోటా అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం. త్వరలోనే అతడు తన విధుల్లో చేరతాడు’ అని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కాగా పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో.. పాక్ వైమానిక దాడులను తిప్పి కొట్టే క్రమంలో అభినందన్ విమానం కూలిపోగా...ఆయన పాక్ భూభాగంలో దిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అనేక పరిణామాల అనంతరం జెనీవా ఒప్పందం ప్రకారం ఆయన భారత్కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో శత్రు సైన్యం చెర నుంచి విముక్తి పొందిన అభినందన్ మానసిక స్థితిని విశ్లేషించేందుకు డీబ్రీఫింగ్ సెషన్(తీవ్రమైన ఒత్తిడికి గురైన సైనికుడికి నిర్వహించే వైద్య పరీక్షలు) నిర్వహించారు. ఇందులో భాగంగా కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆయన తిరిగి విధుల్లో చేరనున్నారు. -
‘పుల్వామా దాడికి ప్లాన్ చేసింది ఆయనే’
సిహోర్(మధ్యప్రదేశ్): పుల్వామా ఉగ్రదాడి వెనుక ప్రధాని నరేంద్ర మోదీ హస్తం ఉందని మిజోరం మాజీ గవర్నర్, కాంగ్రెస్ నేత అజీజ్ ఖురేషీ సంచలన ఆరోపణలు చేశారు. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు పుల్వామా దాడికి మోదీ ప్లాన్ చేశారని వ్యాఖ్యానించారు. మోదీ కుట్రకు ప్రజలు అర్థం చేసుకున్నారని అన్నారు. మధ్యప్రదేశ్లో అత్యధిక లోక్సభ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు. 27 స్థానాల్లో 20కిపైగా సీట్లలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని దీమా వ్యక్తం చేశారు. భోపాల్లో దిగ్విజయ్ సింగ్పై పోటీకి బీజేపీకి అభ్యర్థులే కరువయ్యారని ఎద్దేవా చేశారు. ఓటమి ఖాయమన్న భయంతో ఇక్కడ బీజేపీ వెనుకడుగు వేస్తోందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిందని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. ఓటు అడిగే హక్కు కమలనాథులకు లేదన్నారు. బీజేపీ పాలనలో ఎన్నో పరిశ్రమలు మూతపడ్డాయని, దీంతో నిరుద్యోగం పెరిగిందని తెలిపారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్తాన్ మధ్య ‘మ్యాచ్ ఫిక్సింగ్’లో భాగంగానే పుల్వామా దాడి జరిగిందని కాంగ్రెస్ నాయకుడు బీకే హరిప్రసాద్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 14న జమ్మూకశ్మీర్లోని పుల్వామా జిల్లా లితోపొరా ప్రాంతంలో ఆత్మాహుతి దాడి చేయడంతో 40 మంది సీఆర్ఫీఎఫ్ జవానులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి పాల్పడింది తామేనని పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే-ఈ-మహ్మద్ ప్రకటించుకుంది. -
తొలిదశ ఎన్నికల వేళ పాక్ అనూహ్య నిర్ణయం
ఇస్లామాబాద్ : పుల్వామాలో భారత్ సీఆర్పీఎఫ్ జవాన్ల మీద జరిగిన దాడికి ప్రతీకారంగా.. బాలాకోట్లోని జైషే ఉగ్ర స్థావరాలపై భారత్ వైమనిక దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారని భారత్ ఆరోపిస్తుండగా.. పాక్ మాత్రం ఎలాంటి నష్టం వాటిల్లలేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో పాక్ తొలిసారి భారత్ వైమానిక దాడులు జరిపిన బాలాకోట్ పరిసర ప్రాంతంలో సందర్శించడానికి అంతర్జాతీయ మీడియాను అనుమతించింది. భారత్ వైమనిక దాడి చేసిన 43 రోజుల తర్వాత.. భారత్లో తొలి దశ ఎన్నికల పోలింగ్కు ముందు పాక్ ఈ పర్యటనకు అనుమతించడం పట్లా సర్వత్రా ఉత్కంఠతకు తెర తీసింది. పలు అంతర్జాతీయ మీడియా సంస్థలకు చెందిన వ్యక్తులతో పాటు.. వివిధ దేశాల దౌత్యవేత్తలు.. భద్రతా బలగాలకు చెందిన దాదాపు 24 మంది పర్యటనలో పాల్గొన్నారని సమాచారం. పాక్ అధికారులు వీరందరిని దాడి జరిగినట్లుగా చెప్పబడుతున్న ప్రాంతానికి తీసుకెళ్లారు. భారత వైమానకి దళం దాడి జరపిన ప్రాంతం ఉగ్రవాద శిబిరం కాదని.. అది ఒక మదర్సా అని పాక్ ప్రభుత్వం పేర్కొంది. ఈ మదర్సాలో దాదాపు 130 దాకా విద్యార్థులున్నట్లు సమాచారం. అంతేకాక ఈ దాడిలో ఎటువంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని తెలిపింది. ఈ నేపథ్యంలో పాక్ ఆర్మీ అధికారి ఒకరు.. ‘అంతర్జాతీయ మీడియాతో పాటు భారత్కు చెందిన జర్నలిస్టులు.. దౌత్యవేత్తలు, భద్రతా సిబ్బంది బాలాకోట్ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 26న భారత వైమానిక దళం ఇక్కడ దాడులకు పాల్పడింది. భారత్ చెప్పుకున్నట్లుగా ఇక్కడ ఎలాంటి ఉగ్ర సంస్థలు లేవు. భారత్ నియమాలను ఉల్లఘించి వైమానిక దాడి జరిపింది ఓ మదర్సా మీద. వాస్తవ పరిస్థితులను తెలుసుకొండి. భారత్ చేస్తున్న అబద్దపు ప్రచారాన్ని నమ్మకండి’ అంటూ ట్వీట్ చేశారు. A group of international media journalists mostly India based and Ambassadors & Defence Attachés of various countries in Pakistan visited impact site of 26 February Indian air violation near Jabba, Balakot. Saw the ground realities anti to Indian claims for themselves. pic.twitter.com/XsONflGGVP — Maj Gen Asif Ghafoor (@OfficialDGISPR) April 10, 2019 -
మోదీ గెలిస్తేనే మంచిది : పాక్ ప్రధాని
ఇస్లామాబాద్ : కశ్మీర్ అంశంపై శాంతి చర్చలు జరగాలంటే మళ్లీ నరేంద్రమోదీనే ప్రధాని కావాలని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ గెలిస్తేనే శాంతి చర్చలకు ఆస్కారం ఉంటుందన్నారు. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ గెలిస్తే శాంతి చర్చలు నిర్వహించడానికి భయపడుతుందని విదేశీ జర్నలిస్టులతో వ్యాఖ్యానించినట్లు ఓ జాతీయ చానెల్ పేర్కొంది. బీజేపీ గెలిస్తే కశ్మీర్ అంశం కొలిక్కి వస్తుందని, కొన్ని సెటిల్మెంట్లు జరుగుతాయన్నారు. ప్రస్తుతం భారత్లో జరుగుతున్న పరిణామాలను తానెప్పుడు ఊహించలేదన్నారు. తనకు భారత్లోని చాలా మంది ముస్లింలు తెలుసని, వారి ఇప్పటి వరకు చాలా సంతోషంగా ఉన్నారని, కానీ ప్రస్తుతం వారు హిందుత్వ జాతీయవాదంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పుకొచ్చారు. నరేంద్ర మోదీ ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ను తలపిస్తున్నారని, ఆయన తరహాలో భయం, జాతీయవాదం అన్న సిద్ధాంతంతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు. కశ్మీర్ ఓ రాజకీయ అంశమని, దానికి మిలిటరీ పరిష్కారం లేదన్నారు. పాక్ మిలిటెంట్లు దాడి చేసినప్పుడుల్లా కశ్మీరీలు నష్టపోయారని, తోటివారితో శాంతి సంబంధాలు కలిగి ఉండడం పాక్కు అవసరమన్నారు. ఇప్పటికే పాక్లోని ఉగ్రవాదులను పాక్ సైన్యం ఏరివేసిందని, ఈ విషయంలో ప్రభుత్వం వారికి పూర్తి మద్దతిస్తుందన్నారు. మోదీపై వ్యతిరేకత వ్యక్తమైతే.. భారత సైన్యం చేత పాక్పై దాడి చేయించే అవకాశం ఉందన్నారు. ఇక పుల్వామా ఉగ్రదాడితో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. దీనికి ప్రతీకారంగా భారత వాయుసేన పాక్ భూభాగంపై దాడి చేయడం.. పాక్ వైమానిక దళం భారత్పై దాడులు చేసే ప్రయత్నం చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. -
మీ ఓటు వీర జవాన్లకే!
ఔసా(మహారాష్ట్ర)/చిత్రదుర్గ: పాకిస్తాన్ భూభాగంలోని బాలాకోట్లో ఉగ్రవాదుల పని పట్టిన వీర జవాన్లకు తమ ఓటుహక్కును అంకితం చేయాలని తొలిసారి ఓటేయబోతున్న యువజనులకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ‘మీ తొలి ఓటును వీర జవాన్లకు అంకితమిస్తారా? పుల్వామాలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు అంకితమిస్తారా? ఏ ఎన్నికల్లో ఎవరికి తొలి ఓటు వేశారో ఎన్నటికీ మరచిపోరు’ అని అన్నారు. మహారాష్ట్ర లాతూర్ జిల్లాలోని ఔసాలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రసంగించారు. స్వాతంత్య్రం రావడానికి ముందు కాంగ్రెస్ నేతలు తెలివిగా వ్యవహరిస్తే అసలు పాకిస్తాన్ అనే దేశమే పుట్టేది కాదని అన్నారు. కశ్మీర్కు ప్రత్యేక ప్రధాని ఉండాలని నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలకు నేషనలిస్ట్ కాంగ్రెస్ చీఫ్ శరద్ పవార్ మద్దతు పలకడం ఎంత వరకు సబబమన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పాక్ పల్లవి.. కాంగ్రెస్ మేనిఫెస్టో పాకిస్తాన్ భాషలో మాట్లాడుతోందని అన్నారు. ఉగ్రవాదుల సొంత గడ్డకు చొచ్చుకెళ్లి వారిని మట్టుపెట్టడమే బీజేపీ ప్రతిపాదించిన నవ భారత్ విధానమని చెప్పారు. సాయుధ బలగాల అధికారాల్లో కోత విధించాలని కాంగ్రెస్ భావిస్తోందని, పాక్ కూడా ఇదే కావాలని అన్నారు. అలా అయితే భారత్కు వ్యతిరేకంగా పనిచేస్తున్న శక్తులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత అవినీతిని మాత్రమే నిజాయతీతో చేసిందని చురకలంటించారు. ఇటీవల జరిగిన వరస ఐటీ దాడుల్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ముఖ్యుల ఇళ్ల నుంచే పెట్టెల కొద్దీ కరెన్సీ నోట్లు బయటపడ్డాయని గుర్తుచేశారు. గత ఆరు నెలలుగా చౌకీదారునే దొంగ అంటున్నారని, కానీ ఈ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అసలు దొంగ ఎవరు? అని ప్రశ్నించారు. చాన్నాళ్ల తరువాత తనతో వేదిక పంచుకున్న శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే తనకు తమ్ముడు లాంటి వారని అన్నారు. భారత్ వ్యవహారాల్లో పాకిస్తాన్ మళ్లీ తలదూర్చకుండా గట్టిగా దెబ్బకొట్టాలని మోదీని ఉద్ధవ్ కోరారు. ఉగ్రవాదుల్లో భయం పుట్టించాం.. కర్ణాటకలోని చిత్రదుర్గలో జరిగిన మరో ర్యాలీలో మోదీ మాట్లాడారు. బాలాకోట్ దాడి తరువాత ఉగ్రవాదుల్లో భయం పుట్టిందని, పాకిస్తాన్లో అధికారంలో ఉన్న వారిని పీడకలలు వెంటాడాయన్నారు. వైమానిక దాడుల తరువాత ప్రపంచం మొత్తం భారత్కు మద్దతుగా నిలిస్తే కాంగ్రెస్–జేడీఎస్లు దుఃఖంలో మునిగాయన్నారు. అధికారం, స్వప్రయోజనాల కోసమే ఈ పార్టీలు ఒక్కటయ్యాయని విమర్శించారు. పటిష్ట ప్రభుత్వం రావాలంటే ఆలోచించి ఓటేయాలని యువతను కోరారు. కేంద్రంలో సంపూర్ణ మెజారిటీతో కూడిన ప్రభుత్వం ఏర్పాటైతేనే శక్తిమంతమైన భారత్ సాధ్యమవుతుందని పునరుద్ఘాటించారు. -
‘పుల్వామా దాడి గురించి ముందే తెలుసు’
న్యూఢిల్లీ : ఈ ఏడాది ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని దేశం ఎన్నటికి మర్చిపోదు. ఈ దారుణ సంఘటనలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడి గురించి తనకు ముందే తెలుసు అంటున్నాడు జైషే మహ్మద్ కమాండర్ నిసర్ అహ్మద్ తంత్రి. ఈ దాడికి సంబంధించి విచారణ నిమిత్తం నిసర్ను రెండు రోజుల క్రితం దుబాయ్ నుంచి ఇండియాకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా నిసర్ అనేక ఆసక్తికర అంశాలను వెల్లడించాడు. పాకిస్తాన్లోని జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ సూచనలతోనే ఈ దాడి జరిగిందని నిసర్ తెలిపాడు. ఈ దాడిలో ప్రధాన కుట్రదారైన ముదాసిర్ ఖాన్ దాడి చేయడానికి ముందు తనకు ఫోన్ చేశాడని.. త్వరలో తాము జరపబోయే బ్రహ్మాండమైన దాడిలో భాగం కావాల్సిందిగా తనను కోరాడని వెల్లడించాడు. జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ సూచనల మేరకే ఈ దాడి చేయబోతున్నట్లు ముదాసిర్ తనకు చెప్పాడని నిసర్ పేర్కొన్నాడు. జైషే సంస్థకు చెందిన ఒక కమాండర్ పుల్వామా దాడిలో జైషే పాత్ర ఉన్నట్లు ధ్రువీకరించడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం. ఈ విషయంలో భారత్ ఇప్పటివరకూ ఇంటెలిజెన్స్ సమాచారంపై ఆధారపడుతూ వచ్చింది. అయితే ఈ విషయాల గురించి విచారణతో సంబంధం ఉన్న ఓ ఇంటెలిజెన్స్ అధికారి తెలిపారు. -
మోదీ, రాహుల్ కోసం నా తండ్రి చావలేదు!
సాక్షి, న్యూఢిల్లీ : ‘మోదీ కోసమో, రాహుల్ కోసమో నా తండ్రి చనిపోలేదు. భారత్ కోసం చనిపోయారు. మన సైనికులను లాగకుండా మీరు ఎన్నికల్లో పోటీ చేయలేరా? ఎన్నికలైతే మీరు కచ్చితంగా మమ్మల్ని మరచిపోతారు. అది మాకు తెలుసు’ సూటిగ గుండెల్లో గుచ్చుకునే ఈ మాటలు అన్నది ఎవరో కాదు, పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లలో ఒకరైన కౌశల్ కుమార్ రావత్ కూతురు అపూర్వ రావత్. ‘భారత్ సైన్యానికి చెందిన ఎవరిని మీరు రాజకీయాల్లోకి లాగినా మీరు వారిని అవమానించినట్లే. సైనికులేమి ప్రధానికి చెందిన వారు కాదు’ అని కూడా ఆమె వ్యాఖ్యానించారు. భారత సైన్యాన్ని ‘మోదీకీ సేన’ అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని అపూర్య అలా మాట్లాడి ఉండవచ్చు. ‘భారత సైన్యం ఏ రాజకీయ పార్టీకే, ఏ రాజకీయ నాయకుడికో చెందినది కాదు. దేశంలోని ప్రతి ఒక్కరిది. నా తండ్రి చనిపోయారని వార్త తెల్సిన తర్వాత రాజకీయ నాయకులు తండోపతండాలుగా మా ఇంటికి వచ్చి కుటుంబం పట్ల ఎనలేని సానుభూతి కురిపించారు. మమ్మల్ని విసిగించారు. ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చి పోయారు. ఆ తర్వాత ఫోన్లు చేస్తే ఒక్కరంటే ఒక్కరి నుంచి కూడా సమాధానం లేదు’ అని ‘తిరంగ టీవీ’ షోకు తన తల్లి మమతా రావత్తో హాజరైన అపూర్వ రావత్, రాజకీయ నేతలనుద్దేశించి మాట్లాడారు. అనంతరం ఆమె వ్యాఖ్యలను సీనియర్ జర్నలిస్ట్ బర్ఖా దత్ ట్వీట్ చేశారు. -
మేం కూల్చింది ఎఫ్16నే
న్యూఢిల్లీ: పాకిస్తాన్ వైమానిక దళం(పీఏఎఫ్)కు చెందిన ఎఫ్–16 కూల్చివేతపై వస్తున్న అనుమానాలను భారత వైమానిక దళం(ఐఏఎఫ్) మరోసారి కొట్టిపారేసింది. ఫిబ్రవరి 27వ తేదీన జరిగిన ఘటనలో తాము కూల్చింది ఎఫ్–16 యుద్ధ విమానమే అనేందుకు బలమైన ఆధారాలున్నాయని పేర్కొంది. సోమవారం రక్షణ శాఖ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎయిర్ వైస్ మార్షల్ ఆర్.జి.కపూర్ మాట్లాడారు. ‘ఫిబవరి 27వ తేదీన జరిగిన ఘటనలో పీఏఎఫ్ ఎఫ్–16ను వినియోగిం చడం మాత్రమే కాదు, దానిని ఐఏఎఫ్ మిగ్–21 బైసన్ విమానం కూల్చి వేసిందడానికి కూడా తిరుగులేని ఆధారాలున్నాయి’ అని తెలిపారు. ‘ఫిబ్రవరి 27వ తేదీన రెండు విమానాలు పరస్పరం తలపడిన విషయం సుస్పష్టం. అందులో ఒకటి పీఏఎఫ్కు చెందిన ఎఫ్–16 కాగా మరొకటి ఐఏఎఫ్కు చెందిన మిగ్–21 బైసన్ రకం విమానం. ఈ విషయాన్ని ఎలక్ట్రానిక్, రాడార్ వ్యవస్థలు కూడా పసిగట్టాయి’ అని వివరించారు. అయితే, భద్రతా కారణాల రీత్యా మిగతా వివరాలను తాము బహిరంగ పర్చలేక పోతున్నామన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎయిర్బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్(అవాక్స్)కు సంబంధించిన చిత్రాలను ప్రదర్శించారు. ఫిబ్రవరి 27న ఎఫ్–16ను కూల్చివేసిన అనంతరం వింగ్ కమాండర్ అభినందన్ నడుపుతున్న మిగ్ విమానాన్ని పీఏఎఫ్ కూల్చివేయడంతో ఆయన పాక్ భూభాగంలో దిగటం, తర్వాత విడుదల తెల్సిందే. -
భారత్ మళ్లీ దాడి చేయాలని చూస్తోంది
ఇస్లామాబాద్: ఏప్రిల్ 16 నుంచి 20వ తేదీల మధ్య పాక్పై దాడి చేసేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోందంటూ నిఘా వర్గాల సమాచారం అందిందని పాక్ విదేశాంగ మంత్రి చెప్పారు. ఫిబ్రవరి 26వ తేదీన పాక్ భూభాగంలోని బాలాకోట్పై భారత్ జరిపిన బాంబు దాడిపై అంతర్జాతీయ సమాజం మౌనంగా ఉండటాన్ని ఆయన తప్పుపట్టారు. పాక్ మంత్రి ప్రకటనను భారత్ ఖండించింది. ఈ ప్రాంతంలో యుద్ధభయాన్ని పెంచడమే పాక్ ఉద్దేశమని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ‘పాక్ మంత్రి చేసిన బాధ్యతారహిత, అవమానకర ప్రకటన. యుద్ధభయాన్ని పెంచడమే పాక్ ఉద్దేశం. భారత్లో ఉగ్రదాడులకు పాల్పడాలంటూ అక్కడి ఉగ్ర సంస్థలకు పిలుపునిచ్చేందుకే ఇలాంటి ఎత్తులు వేస్తోంది’ అని భారత్ ప్రకటించింది. -
బ్రేకింగ్: ఏప్రిల్ 16-20 మధ్య పాక్పై భారత్ దాడి!
న్యూఢిల్లీ : ఈ నెల 16-20 తేదీల మధ్య మా దేశంపై దాడి చేసేందుకు భారత్ పథకం పన్నుతోందని, ఈ విషయమై తమకు విశ్వసనీయమైన నిఘా సమాచారముందని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ చెప్పుకొచ్చారు. జమ్మూకశ్మీర్ పూల్వామాలో భారత సైనిక కాన్వాయ్ వెళుతుండగా.. జైషే మహమ్మద్కు చెందిన సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చుకొని 40మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనకు ప్రతీకారంగా భారత వైమానిక దళం బాలకోట్లోని జైషే ఉగ్రవాద స్థావరంపై దాడులు జరిపింది. ఇందుకు ప్రతిగా పాకిస్థాన్ వైమానిక దళం.. భారత గగనతలంలోకి చొచ్చుకురావడం..భారత్కు చెందిన మిగ్-21 విమానాన్ని కూల్చడం తెలిసిందే. ఈ దాడి నుంచి తప్పించుకున్న ఐఏఎఫ్ పైలట్ అభినందన్.. ఈ క్రమంలో దాయాది భూభాగంలో దిగడం.. భారత్ తీసుకొచ్చిన అంతర్జాతీయ ఒత్తిడితో పాక్ అతన్ని మన దేశానికి తిరిగి అప్పగించడం తెలిసిందే. ఈ క్రమంలో ఖురేషీ ఆదివారం ముల్తాన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ కొత్త పథకాన్ని రచిస్తోందని తమకు విశ్వసనీయమైన నిఘా సమాచారముందని, పాక్కు వ్యతిరేకంగా దాడి చేసేందుకు భారత్ సన్నాహాలు చేస్తోందని ఖురేషీ చెప్పుకొచ్చారు. ఈ దాడి ఏప్రిల్ 16-20 తేదీల మధ్య ఉండొచ్చునని తెలిపారు. పాక్పై తమ దౌర్జన్యాన్ని సమర్థించుకునేందుకు, దౌత్యపరంగా ఇస్లామాబాద్పై ఒత్తిడి పెంచేందుకు భారత్ ఈ దాడికి పూనుకుంటోందని, ఇదే జరిగితే ఉపఖండంలో శాంతి, సుస్థిరతలకు తీవ్ర విఘాతం తప్పదని ఆయన పేర్కొన్నారని డాన్ పత్రిక తెలిపింది. -
పుల్వామా సైనికులకు ప్రవాస భారతీయుల నివాళులు
టెక్సాస్ : జమ్మూకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో 40 మంది భద్రతాదళ సభ్యల ప్రాణాలను బలిగొన్న తీవ్రవాదుల అమానవీయ ఘటన యావత్ దేశాన్నీ కుదిపేసింది. ఆస్టిన్ ఇండియన్ టీం ఆధ్వర్యంలో ఆస్టిన్ లో వీర సైనికులకు ప్రవాస భారతీయులు నివాళులు అర్పించారు. ఈ ఘటనలో వీరమరణం పొందిన సైనిక కుటుంబాలకు తోడుగా నిలవడానికి 2k రన్ నిర్వహించి వచ్చిన ఫండ్ని bharatkeveer.gov.in లో డొనేట్ చేయడం జరిగింది. తీవ్ర వాదం వల్ల అనేక దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని ముఖ్యంగా భారత దేశం గత కొన్ని దశాబ్దాలుగా తీవ్రవాదంతో ఇబ్బంది పడుతోందన్నారు. ప్రపంచ దేశాలు అన్ని కలిసి తీవ్రవాదం మీద పోరాడి తీవ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా పెకలించివేయాలని ప్రపంచదేశాలకి విజ్ఞప్తి చేశారు. తీవ్రవాదాన్ని పాకిస్తాన్ దేశం పెంచిపోషిస్తోందని, అనేక తీవ్రవాద సంస్థలకి పాకిస్తాన్ స్వర్గధామంగా మారిందని ఆస్టిన్ ఎన్ఆర్ఐలు అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్ సైతం ఈ తీవ్రవాదంతో అనేక ఇబ్బందులు పడటమే కాకుండా తన దేశంలో ఉన్న అమాయక ప్రజలను పొట్టనబెట్టుకుంటోదని, మిగిలిన దేశాల్లో సైతం తీవ్రవాద భావజాల వ్యాప్తికి ఆ దేశం సహకరించడమే కాకుండా తీవ్రవాదులకి అన్ని రకాలుగా సహాయపడుతూ దాడులకి వారిని ప్రోత్సహించడం దారుణమని ప్రపంచ దేశాలన్నీ కలిసి అలాంటి దేశాల మీద చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి కష్ట సమయంలో భారత దేశంలో ఉన్న ప్రజలంతా తమ దేశపు సైన్యానికి, వీరమరణం పొందిన కుటుంబ సభ్యులకి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆస్టిన్ ఇండియన్ టీం ఆర్గనైజర్లు సుబ్బా రెడ్డి చింతగుంట, పుల్లా రెడ్డి ఎదురు, పరమేశ్వర రెడ్డి నంగి , సతీష్ యెన్న, దుశ్యంత్ వంగల తో పాటు మరెంతోమంది పాల్గొని వీరమరణం పొందిన సైనిక కుటుంబాలకు తోడుగా నిలవడానికి తరలివచ్చారు. -
‘ఉగ్రవాదులపై దాడి చేస్తే.. వారికి నిద్ర పట్టడం లేదు’
లక్నో : భారత్ ఉగ్రవాదులకు వారి భాషలోనే సమాధానం చెప్పడం కొందరికి నచ్చడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యనించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మోదీ ప్రతిపక్షాల మీద విమర్శల వర్షం కురిపించారు. ఈ క్రమంలో శుక్రవారం ఉత్తరప్రదేశ్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోదీ ప్రసంగిస్తూ.. ఉగ్రదాడి జరిగాక నేను మౌనంగా ఉండలా.. లేదా ప్రతి దాడి చేయాలా అంటూ పుల్వామా ఉగ్రదాడిని ఉద్దేశిస్తూ జనాలను ప్రశ్నించారు. అనంతరం ఆయన కొనసాగిస్తూ.. ‘ఉగ్రవాదులకు వారి భాషలోనే సమాధానం చెప్పాం. కానీ భారత దేశ చర్యల వల్ల కొందరికి నిద్ర కరువయ్యింది. పాకిస్తాన్ భారత్ చేసిన మెరుపు దాడుల గురించి ప్రపంచ దేశాల ముందు చర్చించినప్పుడు వీరు పాక్కు మద్దతుగా మాట్లాడారు’ అని ఆరోపించారు. అంతేకాక కాంగ్రెస్ కావచ్చు.. ఎస్పీ, బీఎస్పీ పార్టీ ఏదైనా సరే వారు ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో మాయావతి, అఖిలేశ్ యాదవ్లు ఉగ్రవాదులుగా అనుమానించబడే వ్యక్తులను విడుదల చేశారని ఆరోపించారు. తాను అధికారంలో ఉన్న ఐదేళ్లలో దేశం తలవంపులకు గురయ్యే పని ఒక్కటి కూడా చేయలేదని మోదీ స్పష్టం చేశారు. ఈ క్రమంలో యూఏఈ ప్రభుత్వం తనకు బహుకరించిన జాయేద్ మెడల్ గురించి మాట్లాడుతూ.. ఇది కేవలం మోదీకి దక్కిన గౌరవం కాదు.. ఇది భారత ప్రజలకు దక్కిన గౌరవంగా పేర్కొన్నారు. -
ఈసీని రెండ్రోజులు జైలులో పెడతాం
ముంబై: తాము అధికారంలోకి వస్తే కేంద్ర ఎన్నికల సంఘాన్ని రెండ్రోజులు జైలులో పెడతామని దళిత నేత, ఎంపీ ప్రకాశ్ అంబేడ్కర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లా దిగ్రాస్లో గురువారం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ..‘పుల్వామా దుర్ఘటనలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను కోల్పోయినా మనం మౌనంగా ఎందుకు కూర్చోవాలి? పుల్వామా ఘటనపై మాట్లాడవద్దని మనకు చెప్పారు. అలా చెప్పే అధికారం ఈసీకి ఎక్కడిది? రాజ్యాంగం మనకు వాక్ స్వాతంత్య్రాన్ని ప్రసాదించింది. మేం బీజేపీ కాదు. ఈ ఎన్నికల్లో మేం అధికారంలోకి వస్తే ఈసీని రెండ్రోజులు జైలులో పెడతాం’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే రద్దుచేసిన పెద్దనోట్లను చలామణిలోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. దీంతో ప్రకాశ్ అంబేడ్కర్ ఎన్నికల నియమావళిని స్పష్టంగా ఉల్లంఘించారని ఈసీ తెలిపింది. యావత్మల్ జిల్లా కలెక్టర్ ఫిర్యాదుతో దిగ్రాస్ పోలీసులు ఐపీసీ 503, 505, 189 సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదుచేశారు. కాగా, తాను మామూలుగానే మాట్లాడానని, తన ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలను వక్రీకరించారని ప్రకాశ్ ఆరోపించారు. మహారాష్ట్రలో ఏప్రిల్ 11 నుంచి 29 వరకూ లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. -
ట్వీట్లలో నరేంద్ర మోదీ రికార్డు
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ప్రస్తుతం బిజీబిజీగా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ 2018, అక్టోబర్ నుంచి 2019, మార్చి నెల వరకు, అంటే 182 రోజుల్లో వ్యక్తిగతంగా 2,143 ట్వీట్లు చేశారు. వాటిని ఆయన ఫాలోవర్లు తమ అభీష్టం మేరకు రీట్వీట్ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సోషల్ మీడియాను విజయవంతంగా ఉపయోగించుకోవడం మోదీకి ఆది నుంచి అలవాటే. ఇన్ని రోజుల్లో ఆయన చేసిన అన్ని ట్వీట్లలో ఓ రెండు ట్వీట్లు మాత్రం విపరీతంగా షేర్ అయ్యాయి. అందులో ఒకటి పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకుపోయి బాలకోట్లో బాంబు దాడులు జరపిన సంఘటనకు సంబంధించినది కాగా, మరొకటి ‘మై భీ చౌకీదార్’ అంటూ మోదీ చేసుకున్న ప్రచారానికి సంబంధించినది. ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన విమర్శలకుగాను ‘మై భీ చౌకీదార్’ అంటూ మోదీ ఓ ఉద్యమాన్ని చేపట్టడం, అందులో భాగంగా ఆయన కేంద్ర మంత్రులందరూ తమ ట్విట్టర్ ఖాతాలకు ‘మై భీ చౌకీదార్’ అంటూ ట్యాగ్ను తగిలించుకోవడం తెల్సిందే. బాలకోట్ బాంబులు గురితప్పి అడవిలో పడ్డాయంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో రుజువులు చూపించాల్సిందిగా రాహుల్ చేసిన సవాల్కు ప్రతిగా.. రాహుల్ను పాక్ మిత్రుడిగా మోదీ అభివర్ణిస్తున్న విషయం తెల్సిందే. మోదీ ఈ 182 రోజుల్లో రోజుకు సరాసరి 12 ట్వీట్లు, అంటే రెండు గంటలకు ఒక్క ట్వీట్ చొప్పున చేశారు. ఆయన గత అక్టోబర్ నెలలో రోజుకు సరాసరి 16 ట్వీట్ల చొప్పున చేయగా, 2019, ఫిబ్రవరి రోజుకు సరాసరి 9 ట్వీట్లు చేశారు. ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో మార్చి నెలలో రోజుకు సరాసరి 11 ట్వీట్లు చేశారు. మోదీ తన ట్వీట్ల సందర్భంగా పలు హాష్ట్యాగ్లను కూడా ఉపయోగించారు. జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని మోదీ హాష్ట్యాగ్ గాంధీ150, మన్కీబాత్, వోటకర్, మైభీచౌకీదార్, మిషన్శక్తి తదితర హ్యాష్ట్యాగ్లు ఉపయోగించారు. మొత్తం 2,143 ట్వీట్లకుగాను 77 లక్షలు రీట్వీట్లు వెళ్లాయి. వాటికి 3.24 కోట్ల లైక్స్ వచ్చాయి. పాక్ సైనికులకు చిక్కిన భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ విడుదల సందర్భంగా ఎక్కువ రీట్వీట్లు (66,485), ఎక్కువ లైక్స్ (2,71,932) వచ్చాయి. -
ప్రతిపక్షాలు పాక్ ప్రతినిధులు
జముయ్(బిహార్): బాలాకోట్ ఉగ్రశిబిరాలపై ఐఏఎఫ్ దాడికి రుజువులు చూపాలంటూ డిమాండ్ చేస్తున్న ప్రతిపక్షాలు భారతీయ రాజకీయ పార్టీల కంటే మించి పాక్ ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. బిహార్లోని జముయ్లో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలపై విరుచుకుపడ్డారు. ‘పాక్కు సాయపడేవారు, ఆధారాలు చూపాలంటూ మన సైన్యం నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే వారు కావాలో వద్దో తేల్చాల్సింది ప్రజలే’ అని తెలిపారు. జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ప్రధాని పదవిని పునరుద్ధరించాలన్న నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా డిమాండ్పై ఆయన స్పందిస్తూ.. ‘ఏ దేశంలోనైనా ఒకరి కంటే ఎక్కువమంది ప్రధానులుంటారా? అని ప్రశ్నించారు. ఈ విషయంలో మహాకూటమి ప్రధాన పార్టీలు కాంగ్రెస్, ఆర్జేడీలు తమ వైఖరిని స్పష్టం చేయాలన్నారు. ‘కాంగ్రెస్ తన సొంతంగా లేదా కూటమి పార్టీగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రతిసారీ దేశంలో పాలన తిరోగమనంలో సాగుతుంది. అభివృద్ధి పడిపోతుంది. హింస, ఉగ్రచర్యలు, నల్లధనం పేరుకుపోవడం మితిమీరుతాయి’ అని ఆరోపించారు. సోషలిస్ట్ నేత జయప్రకాశ్ నారాయణ్ పేరుతో పదవీ ప్రమాణం చేసే లాలూ ప్రసాద్ వంటి నేతలు ఇప్పుడు కాంగ్రెస్ చంకనెక్కారు అంటూ ఎద్దేవా చేశారు. ఆర్ఎస్ఎస్ అజెండాను అనుసరిస్తున్న బీజేపీ దేశంలో రిజర్వేషన్లు లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తోందన్న ఆర్జేడీ ఆరోపణలపై ఆయన స్పందించారు. ‘రిజర్వేషన్లను ఎవరూ రద్దు చేయలేరు. ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించిన మా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్ల జోలికి పోలేదు’ అని వివరించారు. ప్రతిపక్షాల నుంచి అవరోధాలు ఎదురైనప్పటికీ ఓబీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించినట్లు తెలిపారు. ‘రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జీవించి ఉన్న కాలంలో ఆయన్ను తీవ్రంగా నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు ఆయనంటే ఎంతో అభిమానం ఉన్నట్లు నటిస్తోంది. మా ప్రభుత్వం అంబేడ్కర్ సేవలను గుర్తిస్తూ భారతరత్న ప్రకటించింది. ఆయనకు సంబంధించిన ఐదు ప్రాంతాలను తీర్థయాత్రా స్థలాలుగా గుర్తించి, అభివృద్ధి చేస్తోంది’ అని తెలిపారు. ప్రసంగం చివరలో ఆయన ‘మై భీ చౌకీదార్’ అంటూ ప్రజలతో నినాదం చేయించారు. -
విమానాల కూల్చివేతపై తొలిసారి ఒప్పుకున్న పాక్
ఇస్లామాబాద్: బాలాకోట్పై ఐఏఎఫ్ దాడి అనంతరం ఎఫ్–16 విమానాలను వినియోగించలేదని ఇప్పటిదాకా బుకాయించిన పాకిస్తాన్.. తాజాగా మాట మార్చింది. తమ ఎఫ్–16 యుద్ధ విమానాలే భారత్ విమానాలను కూల్చేశాయని మొదటిసారిగా అంగీకరించింది. పాక్ సైన్యం అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఫిబ్రవరి 27వ తేదీన నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ వైమానిక దళం(పీఏఎఫ్) పాక్ గగనతలం నుంచే దాడులకు దిగింది. ఆ సమయంలో మా భూభాగంలోకి ప్రవేశించిన రెండు ఐఏఎఫ్ విమానాలను పీఏఎఫ్ కూల్చివేసింది. మేం మోహరించిన విమానాల్లో ఎఫ్–16లు కూడా ఉన్నాయి. ఆత్మరక్షణ కోసం ఏ విధంగానైనా స్పందించే హక్కు మాకుంది’ అని ఆయన ప్రకటించారు. ‘ఆ ఘటన గత చరిత్ర. మా వద్ద ఉన్న ఎఫ్–16 విమానాలను మాత్రం ఐఏఎఫ్ కూల్చలేదు’ అని కూడా ఆయన తెలిపారు. కానీ, గత నెలలో జేఎఫ్–17 రకం విమానాన్ని మాత్రమే వాడినట్లు గఫూరే ప్రకటించారు. బాలాకోట్లోని ఉగ్ర శిబిరాలపై ఐఏఎఫ్ దాడికి ప్రతీకారంగా పాక్ వైమానిక దళం కూడా దాడికి యత్నించిన విషయం తెలిసిందే. కానీ, ఈ సందర్భంగా అమెరికా తయారీ ఎఫ్–16ను ఐఏఎఫ్ కూల్చివేయడం కలకలం రేపింది. ఈ విమానాలను మూడో దేశంపై ఉపయోగించరాదని విక్రయ ఒప్పందంలో అమెరికా పేర్కొంది. కానీ, ఈ షరతులను పాక్ ఉల్లంఘించిందంటూ భారత్ అమెరికాకు సాక్ష్యాధారాలు అందజేయడం తెల్సిందే. -
ఆ 22 చోట్ల ఉగ్ర శిబిరాలే లేవు!
ఇస్లామాబాద్: ఉగ్ర శిబిరాలున్నాయంటూ భారత్ చెబుతున్న 22 ప్రాంతాల్లో అందుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని పాకిస్తాన్ తెలిపింది. పుల్వామా ఆత్మాహుతి దాడితో జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్కు సంబంధం ఉందనే విషయం భారత్ అందించిన నోటీసులో లేదంది. తాము నిర్బంధంలోకి తీసుకున్న వారిలో 54 మందికి పుల్వామా ఘటనతో సంబంధం లేదని పాక్ చెప్పింది. అంతర్జాతీయంగా వచ్చిన తీవ్ర ఒత్తిడులకు తలొగ్గిన పాకిస్తాన్.. భారత్ అందజేసిన వివరాల మేరకు దర్యాప్తు చేపట్టడంతో పాటు వివిధ నిషేధిత ఉగ్ర సంస్థలకు చెందిన 120 మందిని నిర్బంధంలోకి తీసుకుంది. అయితే, తమ దర్యాప్తులో భారత్ ఆరోపణలకు తగిన రుజువులు లభించలేదనీ, మరిన్ని వివరాలు అందించాలని బుధవారం కోరింది. ఆ దేశ అంతరంగిక శాఖ కార్యదర్శి ఆజం సులేమాన్ ఖాన్, విదేశాంగ శాఖ ప్రతినిధి ముహమ్మద్ ఫైజల్ గురువారం వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. ‘జైషే మొహమ్మద్ అధినేత అజార్ కొడుకు హమ్మద్, సోదరుడుసహా 120 మందిని నిర్బంధంలోకి తీసుకున్నాం. వీరిలో 54 మందికి పుల్వామా దాడితో సంబంధం ఉన్నట్లుగా ఆధారాలు లేవు. ఉగ్ర శిబిరాలున్నట్లుగా పేర్కొన్న 22 ప్రాంతాల్లో సోదాలు జరపగా అటువంటివేమీ లేనట్లు తేలింది. కావాలంటే భారత్ తనిఖీ చేసుకోవచ్చు’ అని అన్నారు. ‘పుల్వామా ఘటన మా పనే’ అంటూ జైషే మొహమ్మద్ నేత ఆదిల్ దార్ ప్రకటిస్తున్నట్లుగా ఉన్న వీడియోల వంటి వాటిపైనా దర్యాప్తు చేపట్టాం’ అని వివరించారు. పాక్లో ఉగ్ర స్థావరాలున్నాయని చూపేందుకు మరిన్ని సాక్ష్యాలు కావాలంటూ పాక్ ఇచ్చిన సమాధానంపై భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. పుల్వామా దాడిని ఉగ్ర ఘటనగా గుర్తించేందుకు కూడా పాక్ సిద్ధంగా లేకపోవడాన్ని ఆయన ఖండించారు. -
మసూద్ను బ్లాక్ లిస్ట్లో పెట్టండి : అమెరికా
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ను ఐక్యరాజ్యసమితి(ఐరాస) అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే విషయంపై అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు మరో అడుగు ముందుకేశాయి. ఐక్యరాజ్యసమితి భద్రత మండలిలో చైనాపై ఒత్తిడి తెచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. రెండు వారాల క్రితమే అమెరికా ప్రతిపాదనను తన వీటో అధికారంతో చైనా అడ్డుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మళ్లీ బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల సహకారంతో అమెరికా.. ఐక్యరాజ్య సమితిలో అజర్ నిషేధంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. భద్రతా మండలిలో ఉన్న 15 సభ్యదేశాలకు బ్రిటన్, ఫ్రాన్స్ సంతకం చేసిన తీర్మానాన్ని అమెరికా సర్క్యూలేట్ చేసింది. అజర్పై ట్రావెల్ బ్యాన్ విధించాలని, అతని ఆస్తులను స్తంభింపచేయాలని కోరింది. మళ్లీ చైనా అడ్డుపుల్ల ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆంక్షల కమిటీ ప్రకారం మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని ఫ్రాన్స్, యూకే, అమెరికాలు ఫిబ్రవరి 27న ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనపై కారణాలను సాకుగా చూపుతూ భద్రతామండలిలో మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించకుండా చైనా నాలుగోసారి అడ్డుకుంది. దీంతో ఈ సారి కచ్చితంగా అజహర్ను నిషేదించేలా అమెరికా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల జరిగిన పుల్వామాలో దాడిలో తమ పాత్ర ఉనట్లు జైషే అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ఉగ్రవాదిపై నిషేధం విధించేందుకు అగ్ర రాజ్యం అమెరికా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. -
‘బాలాకోట్’ రిపీట్కు పాక్ యత్నం!
న్యూఢిల్లీ: ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ శిక్షణా శిబిరాలపై భారత వైమానిక దళం బాంబులు జారవిడిచిన మరుసటి రోజు అదే తరహాలో భారత భూభాగంలో దాడులకు పాకిస్తాన్ విఫలయత్నం చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా అదే నెల 26న పాకిస్తాన్ భూభాగంలోని బాలాకోట్లో భారత వైమానిక దళం దాడులు నిర్వహించి ముష్కరులకు భారీగా నష్టం కలిగించినట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తరువాతి రోజు అంటే ఫిబ్రవరి 27న పాకిస్తాన్ ప్రతీకార దాడుల్ని తిప్పికొట్టే క్రమంలో వింగ్ కమాండర్ అభినందన్ పాకిస్తాన్ సైన్యానికి చిక్కారు. వార్తా సంస్థ ఏఎన్ఐ కథనం ప్రకారం..ఆ రోజు పాకిస్తాన్ సుమారు 20 యుద్ధ విమానాలతో భారత్పై బాలాకోట్ తరహా దాడికి ప్రయత్నించినట్లు తెలిసింది. అమెరికా నుంచి కొనుగోలు చేసిన ఎఫ్–16తో పాటు ఫ్రెంచ్ మిరాజ్–3, చైనీస్ జేఎఫ్–17 విమానాల సాయంతో సుమారు 1000 కిలోల బాంబులను పూంచ్, దాని సమీపంలోని మూడు చోట్ల భారత ఆర్మీ శిబిరాల వైపు విసిరింది. సరిహద్దుకు 50 కిలో మీటర్ల పరిధిలోని తన భూభాగం నుంచే పాకిస్తాన్ ఆర్మీ ఈ దాడులకు పాల్పడింది. అయితే భారత యుద్ధ విమానాలు సకాలంలో స్పందించడంతో పాకిస్తాన్ లక్ష్యం నెరవేరలేదు. దీంతో ఆ బాంబులను అక్కడికక్కడే వదిలి వెళ్లిపోయారని పేరు వెల్లడించడానికి ఇష్టపడని అధికారి ఒకరు చెప్పారు. కశ్మీర్లోని ఓ సైనిక స్థావరంపై బాంబులు జారవిడిచినప్పుడు అక్కడ ఉన్న పెద్ద చెట్టు అడ్డుకుందని తెలిపారు. ఆ సమయంలో అదే భవనంలో సీనియర్ అధికారులు ఉన్నట్లు చెప్పారు. -
‘మోదీ ఫోన్ చేసుంటే సరిపోయేది’
సాక్షి, న్యూఢిల్లీ: ‘మోదీతో నాకు మంచి పరిచయం ఉంది. బాలాకోట్ దాడులను ఉద్దేశించి నేను చేసిన వ్యాఖ్యలపై ఆయనకు అభ్యంతరాలుంటే నాకు ఫోన్ చేసుంటే సరిపోయేద’ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సలహాదారు శ్యామ్ పిట్రోడా అన్నారు. బాలాకోట్లో వాయుసేన జరిపిన దాడులపై ఇటీవల పిట్రోడా చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రాజేశాయి. ఈ వివాదానికి సంబంధించిన వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ.. ‘నేను చెప్పిన మాటల్ని వక్రీకరించారు. నేనొకవేళ తప్పుగా మాట్లాడి ఉంటే క్షమాపణలు అడిగేవాడ్ని. నేను గాంధీ తత్వాన్ని పాటించే గుజరాతీ కుటుంబంలో పుట్టాను. హింసను విడనాడి.. సత్యం, ప్రేమకు దగ్గరగా ఉండాలని నమ్మే సిద్ధాంతం మాది. ఒకరి మీద ఇంకొకరు బాహ్య దాడి చేయడాన్ని సమర్థించను. దాని బదులు మన అంతరంగాన్ని బలపరుచుకోవడమే మేలని నమ్ముతాను. నేను స్వతహాగా హింసను వ్యతిరేకిస్తాను. ముంబై ఉగ్రఘాతుకం తర్వాత ముష్కరులపై అప్పటి మన్మోహన్ ప్రభుత్వం ప్రతిదాడులకు దిగకపోవడాన్నీ సమర్థిస్తా.. అలాగే ఇప్పటి పుల్వామా ఘటనకు ప్రతీకారంగా బాలాకోట్లో మన వాయుసేన జరిపిన దాడులకూ మద్దతిస్తాను. ఈ రెండు సంఘటనలు ఆయా ప్రభుత్వాల నిర్ణయమని నేనన్నాను. ఒకసారి సర్కార్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికి నేను కట్టుబడి ఉంటాను. హింసతో దేన్నీ సాధించలేము. ఇవి నేను పార్టీపరంగా కాకుండా వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలు. ప్రధాని హోదాలో మోదీ అలా వ్యవహరించి ఉండాల్సింది కాదు. వీటిపై అభ్యంతరాలుంటే మోదీ నన్ను సంప్రదించి ఉండాల్సింద’ని పిట్రోడా వివరించారు. -
మరోసారి అంకిత భావం చాటుకున్న అభినందన్
న్యూఢిల్లీ : పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని కూల్చి భారతావని నీరాజనాలు అందుకున్న భారత వాయుసేన పైలట్ అభినందన్ వర్థమాన్ మరోసారి దేశ సేవ పట్ల తనకున్న అంకిత భావాన్ని చాటుకున్నారు. నాలుగు వారాల పాటు సెలవులు లభించినప్పటికీ ఇంట్లో గడపకుండా తన స్క్వాడ్రాన్తో కలిసి ఉండటానికే మొగ్గు చూపారు. ఈ క్రమంలో ఆయన శ్రీనగర్లోని వాయుదళం చెంతకు చేరుకున్నట్లు సమాచారం. పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో.. పాక్ వైమానిక దాడులను తిప్పి కొట్టే క్రమంలో అభినందన్ విమానం కూలిపోగా...ఆయన పాక్ భూభాగంలో దిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అనేక పరిణామాల అనంతరం జెనీవా ఒప్పందం ప్రకారం ఆయన భారత్కు చేరుకున్నారు.(చదవండి : ఎవరీ విక్రమ్ అభినందన్?) ఈ నేపథ్యంలో శత్రు సైన్యం చెర నుంచి విముక్తి పొందిన అభినందన్ మానసిక స్థితిని విశ్లేషించేందుకు డీబ్రీఫింగ్ సెషన్(తీవ్రమైన ఒత్తిడికి గురైన సైనికుడికి నిర్వహించే వైద్య పరీక్షలు) నిర్వహించారు. ఇందులో భాగంగా కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకోవాలని అభినందన్కు వైద్యులు సూచించారు. ఆర్మీ ఆసుపత్రిలో నిపుణులైన వైద్యుల బృందం ఆధ్వర్యంలో దాదాపు రెండు వారాల పాటు వైద్య పరీక్షలన్నీ పూర్తైన అనంతరం 12 రోజుల క్రితం ఆయనకు సెలవు ఇచ్చారు. ఈ క్రమంలో కుటుంబంతో గడిపేందుకు అభినందన్ చెన్నైకి వెళ్లాల్సి ఉంది. అయితే చెన్నైకి వెళ్లకుండా తన స్క్వాడ్రాన్, మిషన్లతో కలిసి పనిచేయడమే తనకు ఇష్టమని ఆయన చెప్పినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.(చదవండి : ‘అభినందన్ దగ్గర గన్ లేకుంటే కొట్టి చంపేవాళ్లం’) కాగా ప్రస్తుతం అభినందన్ అభీష్టం ప్రకారం ఆయన శ్రీనగర్ చేరుకున్నప్పటికీ నాలుగు వారాల సిక్ పీరియడ్ పూర్తైన తర్వాత మెడికల్ బోర్డు ఆయనకు మరోసారి ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తుంది. వీటి ఫలితంపైనే అభినందన్ యుద్ధ విమానాన్ని నడపగలరా లేదా అన్న విషయం ఆధారపడి ఉంటుంది.(పాక్ విమానాన్ని అభినందన్ నేలకూల్చాడిలా..!) -
సీఆర్పీఎఫ్ ఇక మరింత బలోపేతం
న్యూఢిల్లీ: కశ్మీర్ లోయలో జవాన్ల భద్రతా చర్యల్లో భాగంగా కీలక ముందడుగు పడింది. వారి భద్రత కోసం మందుపాతర రక్షిత వాహనాలను (ఎమ్పీవీ), 30 సీటర్ బస్సులను సమకూర్చనున్నట్లు భద్రతా దళాధికారి ఒకరు తెలిపారు. అలాగే కశ్మీర్ లోయలో ఉగ్రవాద నిర్మూలన, శాంతి భద్రతల విధులను నిర్వహిస్తున్న 65 బెటాలియన్లలో బాంబులను గుర్తించే, నిర్వీర్యం చేసే స్క్వాడ్ బృందాలను పెంచాలని కూడా పారామిలిటరీ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్పై పేలుడు పరికరం ఉపయోగించి చేసిన బాంబు దాడిలో 40 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో సీఆర్పీఎఫ్లో ఈ మేరకు చర్యలు చేపట్టారు. ‘కశ్మీర్లో మాకున్న ప్రతికూలతల నివారణకు చర్యలు చేపడుతున్నాం. బుల్లెట్ ప్రూఫ్ బస్సులు, ఎక్కువ మొత్తంలో ఎమ్పీవీలను సేకరిస్తున్నాం. పెద్ద బస్సులకు భద్రత కష్టంగా ఉంటుంది. అందుకే 30 మంది మాత్రమే కూర్చోడానికి వీలుండే బస్సులను సమకూరుస్తున్నాం’అని సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ ఆర్.ఆర్.భట్నాగర్ పేర్కొన్నారు. -
‘మోదీ.. బీఫ్ బిర్యానీ తిని పడుకున్నావా’
హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుల్వామా ఉగ్రదాడి సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ బీఫ్ బిర్యానీ తిని పడుకున్నారా? అని ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్లో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ‘భారత వాయు సేన బాల్కోట్లోని ఉగ్రస్థావరాలపై బాంబులు వేసింది. ఈ దాడుల్లో 250 మంది ఉగ్రవాదులు హతమయ్యారని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అంటే.. హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ మాత్రం ఎన్టీఆర్పీ 300 ఫోన్లను ట్యాప్ చేసిందంటారు. బాలకోట్లో 300 ఫోన్లు కనిపించిన మీకు.. ఓ ఉగ్రవాది 50 కేజీల ఆర్డీఎక్స్ను పుల్వామాకు తరలించడం మాత్రం కనిపించదు. ఏ ఎందుకు.. అప్పుడు బీఫ్ బిర్యాని తిని పడుకున్నారా?’ అని మండిపడ్డారు. తన పోరాటం సెక్యులరిజం,సోదర భావాన్ని అంతం చేయాలనుకునే వారిపైనేనని స్పష్టం చేశారు. ‘ఎవరినైనా జాతీయ పార్టీలు ఎన్నని అడిగితే రెండు లేదా మూడు అని చెబుతారు. కానీ నేను మాత్రం ఒక్కటే జాతీయపార్టీ ఉందని అది బీజేపీ అంటాను. ఎందుకంటే కాంగ్రెస్ కూడా 1.5 బీజేపీనే. రెండు పార్టీలకు ఎలాంటి వ్యత్యాసం లేదని, రెండు ఒకటేని ’ అని తెలిపారు. పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. -
భద్రతా దళాలకు బీసీసీఐ రూ. 20 కోట్లు వితరణ
చెన్నై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం దేశ రక్షణ కోసం ప్రాణాలనే పణంగా పెట్టే భద్రతా దళాలకు రూ. 20 కోట్ల విరాళాన్ని అందజేసింది. ఇటీవల పుల్వామాలో ఉగ్రదాడికి 40 మంది భారత సీఆర్పీఎఫ్ జవాన్లు బలయ్యారు. ఈ విషాద ఘటన నేపథ్యంలో బీసీసీఐ, లీగ్ పాలక మండలి 12వ ఐపీఎల్ సీజన్ ప్రారంభోత్సవ వేడుకల్ని రద్దు చేసింది. ఆ వేడుకలకు వెచ్చించే మొత్తానికి మరికొంత జతచేసి సాయుధ బలగాలకు ఇవ్వాలని బీసీసీఐ గతంలోనే నిర్ణయించింది. అనుకున్నట్లే శనివారం రూ. 11 కోట్లను భారత ఆర్మీకి, రూ. 7 కోట్లను సీఆర్పీఎఫ్కు, రూ. కోటి చొప్పున నావిక దళం, వాయు సేనలకు అందజేశామని బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘వేడుకల్ని రద్దు చేసి ఆ మొత్తాన్ని అమర జవాన్లకు విరాళమివ్వాలని బీసీసీఐ, పరిపాలక కమిటీ (సీఓఏ) ఏకగ్రీవంగా తీర్మానించాయి’ అని సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ అన్నారు. ఇది స్వాగతించాల్సిన విషయమని బోర్డు ఇకముందు కూడా జాతి అభీష్టం మేరకు నడుచుకుంటుందని సీఓఏ సభ్యురాలు డయానా ఎడుల్జీ అన్నారు. సీఎస్కే తరఫున రూ. 2 కోట్లు... భారత క్రికెటర్లు ఇప్పటికే ఒక మ్యాచ్ ఫీజు మొత్తాన్ని పుల్వామాలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లకు అందజేశారు. ఇప్పుడు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కూడా అలాంటి పనే చేసింది. తమ సొంతగడ్డపై జరిగిన తొలి మ్యాచ్లో టికెట్ల విక్రయం ద్వారా వచ్చిన రూ. 2 కోట్లను జవాన్ల కుటుంబాలకు అందజేసింది. -
పాక్పై ఐఏఎఫ్ దాడి తప్పు
న్యూఢిల్లీ: పుల్వామా ఘటనకు ప్రతీకారంగా పాక్పై ఐఏఎఫ్ జరిపిన దాడులను కాంగ్రెస్ ఓవర్సీస్ విభాగం అధ్యక్షుడు శామ్ పిట్రోడా తప్పుపట్టారు. బాలాకోట్లోని ఉగ్ర శిక్షణ శిబిరాలపై దాడికి సంబంధించి మరిన్ని వివరాలను ముఖ్యంగా మృతుల సంఖ్యను వెల్లడించాలని పిట్రోడా శుక్రవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘వాళ్లు(ఐఏఎఫ్) 300 మంది ఉగ్రవాదులను చంపడం సరే. దీనిని నిరూపించేందుకు తగిన ఆధారాలు చూపగలరా?. సరిహద్దు అవతలి నుంచి కొందరు ఇక్కడికి వచ్చి దాడులు చేశారు. ఇంతకు ముందు ఇలాంటివి ఎన్ని జరగలేదు? ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయి. ముంబైలోనూ దాడి జరిగింది. దీనిపై స్పందించిన అప్పటి యూపీఏ వెంటనే సరిహద్దుల్లోకి విమానాలను పంపించలేదు. కానీ, ఒక సంఘటన ఆధారంగా ఇలా చేయడం దాడి చేయడం సరైన విధానం కాదు’ అన్నారు. ‘కొందరు ఉగ్రవాదులు జరిపిన దాడికి పాక్ను శిక్షించడం సరికాదు. 8మంది ఉగ్రవాదులు వచ్చి ముంబైలో దాడి చేశారు. అంతమాత్రాన పాక్పై విరుచుకుపడతారా? కొందరు వ్యక్తులు చేసిన పనికి దేశ ప్రజలందరినీ తప్పుపడతారా? ప్రధాని తీరు నిరాశ కలిగించింది ‘నేను కొన్ని వివరాలు మాత్రమే అడిగా. అదీ వ్యక్తిగతంగానే, ఇందులో కాంగ్రెస్ ప్రమేయమేమీ లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరికీ ప్రశ్నించే హక్కుంది. దానిపై అంతగా స్పందించాల్సిన అవసరం లేదు. అదీకూడా ప్రధానిస్థాయి వ్యక్తి. ఆయన సమాధానంతో నిరాశ చెందా’ అన్నారు. ‘మోదీ ప్రభుత్వ వైఫల్యం కారణంగానే పుల్వామా ఘటన చేసుకుంది. బాలాకోట్పై ఐఏఎఫ్ జరిపిన దాడి మన బలగాల సాహసానికి ప్రతీక. ప్రధాని మోదీ, బీజేపీ తమ వ్యక్తిగత అభిప్రాయాలను విద్వేషాన్ని ప్రచారం చేసుకోవడానికి వాడుకోవడం ఆపాలి. సైనిక బలగాల త్యాగాలను స్వార్థానికి వాడుకోవడం మానాలి’ అని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ప్రజలు క్షమించబోరు: మోదీ శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై ప్రధాని విరుచుకుపడ్డారు. ఆయన తన మాటలతో పాక్ జాతీయ దినోత్సవాలకు అంకురార్పణ చేశారంటూ ఎద్దేవా చేశారు. ఉగ్రవాదులను క్షమించే సహజ స్థావరాలుగా మారాయంటూ ప్రతిపక్షాలను విమర్శించారు. శుక్రవారం ఆయన ట్విట్టర్లో ప్రజలు క్షమించరు(జన్తా మాఫ్ నహీ కరేగీ)అనే హ్యాష్ట్యాగ్తో స్పందించారు. ‘కాంగ్రెస్ రాచ కుటుంబానికి విశ్వాసపాత్రుడొకరు ప్రజలకు ఇప్పటికే తెలిసిన విషయాన్ని మరోసారి అంగీకరించారు. ఉగ్ర మూకల చర్యలకు దీటుగా బదులివ్వడం కాంగ్రెస్కు ఇష్టం లేదు. ఉగ్రవాద చర్యలకు వారికి అర్థమయ్యే భాషలో బదులిచ్చాం. మన బలగాల త్యాగాలను అవమానిస్తూ ప్రకటనలు చేస్తున్న ప్రతిపక్ష నేతలను ప్రశ్నించాలని భారతీయులకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతిపక్షాల చేష్టలను 130 కోట్ల మంది భారతీయులు క్షమించబోరు, మర్చిపోరు’ అని అన్నారు. -
ప్రశ్నించడం మా హక్కు: అఖిలేష్ యాదవ్
లక్నో: బీజేపీ భారత ఆర్మీలా వ్యవహరించడం మానాలని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తర్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ శుక్రవారం మండిపడ్డారు. ఆర్మీని అవమానిస్తున్నాయని ప్రధాని మోదీ ప్రతిపక్ష పార్టీలపై ఎదురుదాడికి దిగిన నేపథ్యంలో అఖిలేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మోదీ ప్రభుత్వం ఆర్మీలా వ్యవహరిస్తోంది. రాజకీయ నాయకులను ప్రశ్నించడం ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు. తమనెవరూ ప్రశ్నించొద్దని భావించే ప్రభుత్వాలు ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదకరమైనవ’’ని మోదీకి ఘాటుగా జవాబిచ్చారు. ఇదిలా ఉండగా.. ‘‘పుల్వామా లాంటి దాడులు కాంగ్రెస్ హయాంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ ప్రభుత్వంలో కూడా పలుమార్లు జరిగాయి. 2008లో ముంబైలో ఉగ్రదాడి జరిగినప్పుడు అప్పటి యూపీఏ ప్రభుత్వం పాక్పై సైనిక యుద్ధ విమానాలను పంపింది. కానీ కొందరు ఉగ్రవాదులు చేసిన పనికి మొత్తం పాకిస్తాన్పై దాడి చేయడాన్ని సరైన చర్యగా తాను భావించలేద’’ని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సలహాదారు శ్యామ్ పిట్రోడా ఇటీవల చేసిన వ్యాఖ్యలకు జవాబుగా మోదీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది. ‘కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలు అందరికీ తెలిసినవే. ఉగ్రవాదులకు దీటుగా కాంగ్రెస్ ఎప్పుడూ బదులివ్వలేదు. కానీ ఇది నూతన భారతదేశం. మేం టెర్రరిస్టులకు వారి భాషలో వారికి అర్థమయ్యేలా సరైన జవాబులు ఇవ్వగలమని పరోక్షంగా ప్రతి దాడులు చేస్తామ’ని మోదీ విరుచుకుపడ్డారు. -
‘పిట్రోడా.. దేశం మిమ్మల్ని క్షమించదు’
న్యూఢిల్లీ : పాకిస్థాన్లోని బాలాకోట్పై భారత వాయుసేన జరిపిన దాడులను తప్పు పడుతూ కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా మండిపడ్డారు. భారత బలగాలను కించపరిచేలా మాట్లాడటం సిగ్గుచేటన్నారు మోదీ. శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై స్పందించిన మోదీ కాంగ్రెస్ను విమర్శిస్తూ వరుస ట్వీట్లు చేశారు. ‘ఉగ్రదాడికి దీటుగా బదులివ్వడం కాంగ్రెస్కు ఇష్టం లేదు. ఇప్పుడు ఆ విషయాన్ని కాంగ్రెస్ రాజకుటుంబానికి అత్యంత విశ్వసనీయమైన వ్యక్తి కూడా ఒప్పుకున్నారు. ఉగ్రవాదుల పక్షాన మాట్లాడటం, మన సాయుధ బలగాలను ప్రశ్నించడం విపక్షాలకు అలవాటుగా మారింది. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేస్తున్న జవాన్లను ప్రతిపక్ష నేతలు పదే పదే అవమానిస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిని ఈ దేశ ప్రజలు క్షమించర’ని హెచ్చరించారు. అంతేకాక ‘ఈ దేశ ప్రజలను నేను కోరేది ఒక్కటే.. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రతిపక్ష నేతలను ప్రశ్నించండి. ఇలాంటి అవమానకర వ్యాఖ్యలను క్షమించబోమని వారికి అర్థమయ్యేలా వారి భాషలోనే చెప్పండి. జవాన్లకు ఈ దేశం మద్దతుగా నిలుస్తుంది’ అని మోదీ పేర్కొన్నారు. (పాక్పై దాడి చేయడం సరి కాదు : పిట్రోడా) Loyal courtier of Congress’ royal dynasty admits what the nation already knew- Congress was unwilling to respond to forces of terror. This is a New India- we will answer terrorists in a language they understand and with interest! https://t.co/Mul4LIbKb5 — Chowkidar Narendra Modi (@narendramodi) March 22, 2019 -
పాకిస్తాన్పై దాడి చేయడం మంచి పద్దతి కాదు
-
పాక్పై దాడి చేయడం సరి కాదు : పిట్రోడా
న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రతిపక్షాలు ఈ దాడులను ఎన్నికల జిమ్ముక్కుగా విమర్శిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శామ్ పిట్రోడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రదాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్పై దాడులు చేయడం మంచి పద్దతి కాదన్నారు. పుల్వామా ఉగ్రదాడిపై స్పందిస్తూ.. ‘ఈ దాడుల గురించి నాకు పూర్తిగా తెలీదు. కానీ ఇలాంటి దాడులు గతంలో జరిగాయి. ముంబైలో కూడా చోటు చేసుకున్నాయి. ఇలాంటి దాడులు జరిగిన వెంటనే ప్రతీకారంగా మనం మన విమానలను పాకిస్తానపై దాడులకు పంపడం చేస్తాం. కానీ కొందరు ఉగ్రవాదులు చేసిన పనికి మొత్తం పాకిస్తాన్పై దాడి చేయడం మంచి పద్దతి కాదు. ఇలాంటి దాడులు చేసే వారు ప్రపంచంతో ఎలా వ్యవహరిస్తారో నాకు అర్థం కావడం లేద’ని తెలిపారు. ఈ సందర్భంగా ముంబై దాడులను గుర్తు చేసుకుంటూ.. ‘ఓ 8 మంది వచ్చి మన దేశంలో దాడులు చేసి వెళ్లారు. ఈ చర్యలకు ఆ దేశాన్ని మొత్తం నిందించడం సరికాదు. ప్రతీకార దాడులను నేను నమ్మన’ని స్పష్టం చేశారు. (‘పుల్వామా’ను మర్చిపోం: దోవల్) Sam Pitroda,Indian Overseas Congress Chief on #PulwamaAttack:Don’t know much about attacks,it happens all the time,attack happened in Mumbai also,we could have then reacted and just sent our planes but that is not right approach.According to me that’s not how you deal with world. pic.twitter.com/QZ6yXSZXb2 — ANI (@ANI) March 22, 2019 -
మళ్లీ భారత్పై దాడి జరిగితే..
వాషింగ్టన్: భారత్పై మరో ఉగ్రదాడి కనుక జరిగితే పాక్ ప్రమాదంలో పడినట్లేనని అమెరికా హెచ్చరించింది. జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రసంస్థలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. భారత ఉపఖండంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకూడదని అమెరికా కోరుకుంటున్నట్లు బుధవారం వైట్హౌజ్లో సీనియర్ అధికారి చెప్పారు. ‘ఉగ్రసంస్థలపై పాకిస్తాన్ సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల భారత్పై మళ్లీ ఉగ్రదాడి జరిగితే పాకిస్తాన్కు అది తీవ్ర సమస్యాత్మకంగా మారుతుంది. దీనివల్ల భారత్, పాక్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే ఆస్కారం ఉంది’అని ఆయన పేర్కొన్నారు. ‘గతంలో కూడా చాలా మంది ఉగ్రవాదులను పాకిస్తాన్ అరెస్ట్ చేయడం చూశాం. కానీ కొద్ది నెలలకే వారిని విడుదల చేశారు. కొందరు ఉగ్రవాద నేతలు దేశవ్యాప్తంగా ప్రయాణించేందుకు ఇంకా అనుమతి ఉంది’అని చెప్పారు. ఆర్థికంగా అందుతున్న సహాయసహకారాలు కావాలో వద్దో పాకిస్తానే తేల్చుకోవాలని ఆయన సూచించారు. పాక్ను చైనా కాపాడొద్దు.. పాకిస్తాన్ను కాపాడటం చైనా బాధ్యత కాదని, దీనికి బదులు ప్రపంచ దేశాలతో కలసి ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాల్సిందిగా పాక్పై ఒత్తిడి తీసుకురావాలని ట్రంప్ కార్యాలయానికి చెందిన సీనియర్ అధికారి పేర్కొన్నారు. జైషే మహ్మద్ ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పెట్టిన ప్రతిపాదనను చైనా వీటో అధికారంతో అడ్డుకోవడం ఎంతో నిరాశ కలిగించిందని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు సాంకేతిక కారణాలు చూపి నాలుగు సార్లు ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. -
పుల్వామా బాధిత కుటుంబాలకు సీఎస్కే విరాళం
చెన్నై: భారత క్రికెటర్లు ఇప్పటికే ఒక మ్యాచ్ ఫీజు మొత్తాన్ని పుల్వామాలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లకు అందజేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కూడా అలాంటి పనే చేయబోతోంది. తమ సొంతగడ్డపై జరిగే తొలి మ్యాచ్లో టికెట్ల విక్రయం ద్వారా వచ్చిన ఆదాయాన్ని జవాన్ల కుటుంబాలకు అందజేయనుంది. ఈ నెల 23న చెన్నైలో జరిగే ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్తో సీఎస్కే తలపడుతుంది. ధోని, కోహ్లి జట్ల మ్యాచ్ కావడంతో టికెట్లన్నీ హాట్కేకుల్లా అమ్ముడుపోయాయి. దీంతో సమకూరిన మొత్తాన్ని చెక్ రూపంలో చెన్నై కెప్టెన్ ధోని చేతుల మీదుగా అదేరోజు అందజేస్తారని ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి. -
కాల్పులకు దిగిన పాక్..జవాను మృతి
శ్రీనగర్ : దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి బరితెగించింది. జమ్మూకశ్మీర్లోని రాజౌరీలో కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. గురువారం ఉదయం జరిగిన ఈ ఘటనలో భారత జవాను యశ్ పాల్(24 ) ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు పోలీసు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. కాగా పుల్వామా ఉగ్రదాడి, బాలాకోట్పై మెరుపు దాడుల నేపథ్యంలో భారత్-పాక్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి దాదాపు ప్రతిరోజూ పాకిస్తాన్ సైన్యం నియంత్రణ రేఖ వెంబడి కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఈ క్రమంలో జనవరి నాటి నుంచి ఇప్పటిదాకా మొత్తం 110 సార్లు కాల్పులకు తెగబడింది. ఇదిలా ఉండగా.. గత సోమవారం నియంత్రణ రేఖ వెంబడి అఖ్నూర్, సుందర్బనీ సెక్టార్లలో పాక్ సైన్యం బాంబులతో విరుచుకు పడినట్లు ఆర్మీ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ ఘటనలో కరమ్జీత్ సింగ్ అనే జవాను మరణించారని పేర్కొన్నారు. గతేడాది పాక్ 2936 సార్లు కాల్పులకు దిగిందని, గత పదిహేనేళ్లలో ఇదే అత్యధికమని తెలిపారు. -
సర్జికల్ స్ట్రయిక్స్.. ఓట్లు కురిపిస్తుందని బీజేపీ ఆశ
రాజస్తాన్, యూపీ, మధ్యప్రదేశ్లలో కాంగ్రెస్ చేతిలో ఓటమి.. మందకొడిగా ఆర్థిక వ్యవస్థ.. పతాకస్థాయికి నిరుద్యోగం.. ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఇలాంటి పరిస్థితిని ఏ పార్టీ కూడా కోరుకోదు. సీన్ కట్ చేస్తే... పుల్వామా ఉగ్రదాడి.. అందుకు ప్రతిగా భారత్ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్.. భారతీయ జనతా పార్టీకి కలిసొచ్చేలా మారిపోయాయా? అయితే.. ఓటర్లను వర్గాలుగా వేరు చేసే ఇలాంటి అంశాలకు రెండువైపులా పదునే అన్నది విశ్లేషకుల అంచనా!! సర్జికల్ స్ట్రైక్స్కు కొన్ని రోజుల ముందు ఓ ప్రముఖ దినపత్రిక ఓ సర్వే నిర్వహించింది. అందులో తేలిందేమిటంటే బీజేపీ భవిష్యత్తు ఏమంత గొప్పగా లేదూ అని! గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి ప్రభావం సార్వత్రిక ఎన్నికల్లోనూ ఉంటుందని ఆ పత్రిక అంచనా వేసింది కూడా. అయితే రెండు వారాలు గడిచాయో లేదో.. పుల్వామాదాడి జరగడం.. అందుకు ప్రతిగా భారత వాయుసేన పాకిస్తాన్ లోపలికి చొచ్చుకుపోయి బాలాకోట్పై బాంబులు కురిపించడంతో పరిస్థితి మొత్తం తారుమారైంది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ, ఇతర ప్రతిపక్షాలు బాలాకోట్ దాడికి సంబంధించిన రుజువులు కోరడంతో పరిస్థితి బీజేపీకి మరింత అనుకూలంగా మారింది. దశాబ్దాలుగా కశ్మీర్ అంశంపై ఇబ్బంది పెడుతున్న పాకిస్తాన్కు దీటైన సమాధానం చెప్పగలిగిన వాడు మోదీ ఒక్కడే అన్న అభిప్రాయం ఒక వర్గంలో బలపడగా.. ఇవన్నీ గిమ్మిక్కులేనని నమ్మేవాళ్లు ఇంకో వర్గంలో చేరిపోయారు. ఈ రకమైన పోలరైజేషన్ కారణంగా ఓటేసే సమయానికి సామాన్యుడు ఇతర వాటన్నింటినీ పక్కనబెట్టి దేశ భద్రత అంశంవైపే మొగ్గు చూపుతాడని నిపుణులు చెబుతారు. జాతీయవాదం బీజేపీకి అనుకూలం? ప్రతిపక్షాలను దేశద్రోహులుగా చిత్రీకరించి మెజార్టీ ప్రజలను తమకనుకూలంగా తిప్పుకునేందుకు జాతీయ వాదులు ప్రయత్నాలు చేస్తున్నారు. సరిహద్దుల్లో సైనికులు మరణిస్తుంటే మీరు అలా చేస్తారా? ఇలా చేస్తారా? అని తన సోషల్ మీడియా సైన్యంతో ప్రతిపక్షాలపై ఈ జాతీయవాదులు ఓ స్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. జాతీయ వాదమన్న అంశాన్ని ముందుంచడం ద్వారా మోదీ ప్రతిపక్షాల కంటే రెండు అడుగులు ముందు ఉన్నారని, మోదీ ప్రసంగాల్లో హిందుత్వం కంటే, జాతీయ వాద భావజాలమే ఎక్కువగా ఉండటం ఈ వ్యూహంలో భాగమే కావచ్చునని కొంతమంది నిపుణులు విశ్లేషిస్తున్నారు. సైనిక చర్యలతో నష్టమూ లేకపోలేదు బాలాకోట్ దాడుల వల్ల ఎన్నికల్లో అధికార పార్టీకి లాభం చేకూరడంతోపాటు నష్టం కూడా జరిగే అవకాశముంది. భారతదేశంలోనే కాదు.. ఇతర దేశాల్లోనూ ఇలాంటి సైనిక చర్యల వల్ల అధికారంలో ఉన్న పార్టీలకు మిశ్రమ ఫలితాలు వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత 1993లో జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ అధికారం కోల్పోవడం.. మరోవైపు గోద్రా మారణకాండ తరువాత 2002లో అసెంబ్లీ రద్దు తరువాత జరిగిన ఎన్నికల్లో మోదీ మళ్లీ విజయం సాధించడం.. ఈ రెండు ఎన్నికల్లోనూ బీజేపీ ఓట్ల శాతం పెరగడాన్ని చూస్తే.. పోలరైజేషన్ అన్నది ఆ పార్టీకి అనుకూలంగా మారిందని తెలుస్తుంది. అయితే బాబ్రీ ఘటన తరువాతి యూపీ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీలు జట్టుకట్టడం వల్ల బీజేపీ అధికారం కోల్పోయింది. మొత్తమ్మీద ఒక అంశం ఆధారంగా ఓటర్లు రెండు వర్గాలుగా చీలిపోవడం అధికార పార్టీకి లాభమా? నష్టమా అనేది చెప్పడం కష్టం. బాలాకోట్ దాడి ఘటనల తరువాత.. ఎన్నికల నోటిఫికేషన్ తరువాత జరిగిన రెండు ఒపీనియన్ పోల్స్లోనూ భిన్నమైన ఫలితాలు వచ్చాయి. ఇండియా టీవీ సీఎన్ఎక్స్ సంస్థ చేసిన సర్వేలో బీజేపీకి గత ఎన్నికల కంటే దాదాపు 50 సీట్లు తగ్గుతాయని చెప్పడం.. సీవోటర్ ఒపీనియన్ పోల్లో 15 సీట్ల తగ్గుదల మాత్రమే నమోదు రావడం ఇక్కడ చెప్పుకోవాలి. -
పుల్వామా దాడి : హోలీకి కేంద్ర బలగాలు దూరం
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్లోని పుల్వామాలో ఫిబ్రవరి 14న జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన క్రమంలో సీఆర్పీఎఫ్కు బాసటగా పది లక్షల మందికి పైగా సైనికులతో కూడిన కేంద్ర సాయుధ దళాలు దేశవ్యాప్తంగా హోలీ వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించాయి. సరిహద్దు భద్రతా దళం, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం, సస్త్ర సీమా బల్లు ఈ ఏడాది హోలీని జరుపుకోరాదని నిర్ణయించాయి. కాగా, చత్తీస్గఢ్లోని సుక్మా దాడి ఘటన నేపథ్యంలో 2017లోనూ హోలీ వేడుకలను కేంద్ర బలగాలు రద్దు చేసుకున్నాయి. అదే ఏడాది ఏప్రిల్లో సుక్మా జిల్లాలో సీఆర్పీఎఫ్ సిబ్బందిపై మావోయిస్టులు జరిపిన దాడిలో 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. మరోవైపు పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లకు నివాళిగా హోలీ వేడుకలు జరుపుకోవడం లేదని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. -
జవాన్ల కుటుంబాలను ఆదుకున్న ఐపీఎల్ జట్టు
చంఢీగడ్ : ఇటీవల జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో వీర మరణం పొందిన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలను ఐపీఎల్ జట్టు కింగ్స్ పంజాబ్ ఆదుకుంది. పంజాబ్, హిమాచల్ప్రదేశ్ రాష్ర్టాలకు చెందిన ఐదుగురు జవాన్ల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున మొత్తం రూ. 25 లక్షలను విరాళంగా అందజేసింది. ఈ చెక్కులను ఉగ్రదాడిలో అసువులు బాసిన జవాన్లు జైమాల్ సింగ్, సుఖిజిందర్ సింగ్, మహిందర్ సింగ్, కుల్విందర్ సింగ్, తిలక్ రాజుల కుటుంబాలకు పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్, సీఆర్పీఎఫ్ డీఐజీ వీకే కౌందాల్లు అందజేశారు. గత ఫిబ్రవరి 14న చోటు చేసుకున్న ఈ ఉగ్రదాడిలో 40 మందికిపైగా సీర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. గత ఏడాది అశ్విన్ నాయకత్వంలో కొత్తగా కనిపించిన కింగ్స్ పంజాబ్ జట్టు తొలి 9 మ్యాచ్ల్లో 6 గెలిచి దూసుకుపోయింది. కానీ తర్వాతి ఐదు మ్యాచ్లు ఓడి అనూహ్యంగా లీగ్ దశకే పరిమితమైంది. అయితే ఈ సారి మాత్రం నిలకడైన ప్రదర్శనతో రాణించి టైటిల్ కొట్టాలని భావిస్తోంది. కాగా ఈ నెల 23న చెన్నైలో చెన్నై సూపర్ కింగ్స్, బెంగళూరు మధ్య మ్యాచ్తో ఐపీఎల్ 12వ సీజన్కు తెరలేవనున్న విషయం తెలిసిందే. ఇక పంజాబ్ తన తొలి మ్యాచ్ను మార్చి 25న రాజస్తాన్రాయల్స్తో ఆడనుంది. చదవండి: పంజాబ్కు ‘ఆ ఇద్దరి’ బలం... మే 12న ఐపీఎల్ ఫైనల్ -
‘పుల్వామా’ను మర్చిపోం: దోవల్
గుర్గావ్: ‘పుల్వామా ఘటనను దేశం మరిచిపోలేదు, మర్చిపోదు. ఇటువంటి చర్యలపై దేశ నాయకత్వం సమర్థంగా, దీటుగా బదులిస్తుంది’ అని జాతీయ భద్రత సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ అన్నారు. సీఆర్పీఎఫ్ 80వ వ్యవస్థాపక దినోత్సవంలో దోవల్ మాట్లాడారు. ఈ సందర్భంగా పుల్వామా ఘటనలో అమరులైన 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు నివాళులర్పించారు. ‘ఇది చాలా దురదృష్టకరమైన ఘటన. అమరులైన జవాన్లు, వారి కుటుంబాలకు దేశం ఎన్నడూ రుణ పడి ఉంటుంది’ అని పేర్కొన్నారు. ‘మీరు నిండైన ఆత్మస్థైర్యంతో ఉంటే దేశ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. చరిత్ర చెప్పేది కూడా ఇదే. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బలహీనమైన అంతర్గత రక్షణ వ్యవస్థలున్న 60 వరకు దేశాల్లో రాజ్యాంగ సంక్షోభం తలెత్తడం, అస్థిర ప్రభుత్వాలు ఏర్పడటం, సార్వభౌమత్వం కోల్పోవడం వంటివి సంభవించాయి’ అని తెలిపారు. దేశ అంతర్గత భద్రత విషయంలో సీఆర్పీఎఫ్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తోందన్నారు. సంక్షోభ ప్రాంతాల నుంచి యుద్ధ క్షేత్రాలకు సత్వరం తరలివెళ్లి బాధ్యతలు చేపట్టడంలో సీఆర్పీఎఫ్ ముందుందని కొనియాడారు. దేశంలో భద్రతాపరమైన సవాళ్లు తలెత్తిన ప్రతిచోటా సీఆర్పీఎఫ్నే కీలకంగా ఉంటుందని చెప్పారు. గణతంత్ర దినం సందర్భంగా ప్రకటించిన సాహస అవార్డులను ఈ సందర్భంగా దోవల్ జవాన్లకు అందజేశారు. కాగా, 1939లో బ్రిటిష్ పాలనలో ‘క్రౌన్ రిప్రజెంటేటివ్స్ పోలీస్’ పేరుతో ఏర్పాటైన ఈ విభాగం పేరును దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1949లో సీఆర్పీఎఫ్గా మార్చారు. ప్రస్తుతం 246 బెటాలియన్లు, 3 లక్షల మంది జవాన్లతో దేశ వ్యాప్తంగా వివిధ రకాలైన కీలక విధులను నిర్వహిస్తోంది. -
‘పుల్వామా దాడిని మర్చిపోయేది లేదు’
న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిని ఎన్నటికి మర్చిపోమని.. మరిన్ని చర్యలు తీసుకుంటామని జాతీయా భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాక్ను హచ్చరించారు. 80 సీఆర్పీఎఫ్ రైజింగ్ డే కార్యక్రమానికి హాజరైన దోవల్ ఉగ్రవాదాన్ని దీటుగా ఎదుర్కోనే శక్తి, సామర్థ్యాలు దేశ నాయకత్వానికి ఉన్నాయన్నారు. పుల్వామా ఉగ్రదాడిని భారతీయులు ఎప్పటికీ మరచిపోరని ఆయన అభిప్రాయపడ్డారు. అలాంటి దాడులను తిప్పికొట్టడంలో నాయకులు దీటుగా స్పందిస్తారని తెలిపారు. శత్రుమూకలకు ఎప్పుడు.. ఎలా.. సమాధానం చెప్పాలో నిర్ణయించడానికి మన నాయకుల ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారన్నారు. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న దేశాలకు సైతం దీటుగా సమాధానం చెప్పే సత్తా మన దేశానికి ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంతేకాక ‘క్లిష్ట పరిస్థితుల్లో ఏ బలగాలను పంపాలనే అంశం చర్చకు వచ్చినప్పుడు మాకు టక్కున గుర్తుకు వచ్చేది సీఆర్పీఎఫ్ పేరే. ఈ బలగాల పట్ల మాకు చాలా విశ్వాసం ఉంది. ఏళ్లుగా ఆ విశ్వాసాన్ని అలా నిలుపుకుంటున్నాయ’ని తెలిపారు. అంతేకాక దేశ భద్రతకు జవాన్లు అహర్నిశలు శ్రమిస్తున్నారని.. ప్రాణ త్యాగానికి సైతం సిద్దపడుతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు ఆయన నివాళులర్పించారు. -
అరేబియా జలాల్లో నేవీ హై అలర్ట్
న్యూఢిల్లీ: పుల్వామా ఆత్మాహుతి దాడి నేపథ్యంలో భారత నావికా దళం అప్రమత్తమైంది. పాకిస్తాన్ పాల్పడే ఎలాంటి దుస్సాహసాన్నైనా తిప్పికొట్టేందుకు అణు జలాంతర్గాములు సహా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలతో కూడిన భారీ ఆయుధ సంపత్తిని ఉత్తర అరేబియా సముద్ర జలాల్లో మోహరించింది. పుల్వామా దాడి సమయంలో ట్రాపెక్స్–2019 పేరుతో నేవీ భారీ యుద్ధ విన్యాసాలు కొనసాగుతున్నాయి. ఇందులో యుద్ధ వాహన నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య, అణు జలాంతర్గాములు ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ చక్రం, 60 యుద్ధ నౌకలు, 12 తీరరక్షక ఓడలు, 60 యుద్ధ విమానాలు పాల్గొంటున్నాయి. ఘటన జరిగిన వెంటనే ఈ మొత్తం ఆయుధ సంపత్తిని రక్షణ శాఖ పాక్తో సరిహద్దు జలాల్లోకి తరలించి యుద్ధ సన్నద్ధతను ప్రకటించింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఈ బలగాలు ఇంకా అక్కడే ఉన్నాయని నేవీ ప్రతినిధి తెలిపారు. -
దావూద్, సలాహుద్దీన్లను అప్పగించాలి
న్యూఢిల్లీ: ఉగ్రవాదాన్ని నిర్మూలించాలన్న చిత్తశుద్ధి పాకిస్తాన్కు ఉంటే దావూద్ ఇబ్రహీం, సయీద్ సలాహుద్దీన్లతో పాటు ఇతర ఉగ్రవాదులను భారత్కు అప్పగించాలని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. పుల్వామా వంటి ఉగ్రదాడి జరిగిన తర్వాత అందుకు బాధ్యత వహించిన జైషే మహ్మద్, ఇతర ఉగ్ర సంస్థల నిర్మూలనకు చర్యలు చేపట్టడంలో పాక్ విఫలమైందని ఆరోపించాయి. ఉగ్రవాదంపై భారత్ ఆందోళనలను పాక్ పరిగణలోకి తీసుకున్నట్లయితే భారత్కు చెందిన దావూద్, సలాహుద్దీన్లతో పాటు ఇతర ఉగ్రవాదులను అప్పగించాలని స్పష్టం చేశాయి. పాక్ ఇటీవల ఉగ్రవాద నిర్మూలనలో భాగంగా కొందరిని ముందస్తు నిర్బంధంలోకి తీసుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ అది కేవలం అలంకారప్రాయంగా చేపట్టిన చర్య మాత్రమేనని, దాంతో ఎలాంటి ప్రయోజనం లేదని తెలిపాయి. భారత్లో జరిగిన వరుస ఉగ్రదాడులతో సంబంధమున్న దావూద్, సలాహుద్దీన్లను అప్పగించాల్సిందిగా భారత్ గత కొంతకాలంగా పాక్ను కోరుతోంది. -
ఓపిగ్గా వ్యవహరిస్తాం
న్యూఢిల్లీ/వాషింగ్టన్/న్యూయార్క్: జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ను ఐక్యరాజ్యసమితి(ఐరాస) అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే విషయంలో ఓపిగ్గా వ్యవహరిస్తామని భారత్ తెలిపింది. అయితే ఉగ్రవాదంపై పోరాటం విషయంలో ఎక్కడా రాజీపడబోమని స్పష్టం చేసింది. పాక్ భూభాగంలో ఆశ్రయం పొందుతున్న కొన్ని ఉగ్రసంస్థలు చైనా ప్రయోజనాలకూ వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని గుర్తుచేసింది. ఇటీవల సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ భద్రతామండలిలో మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించకుండా చైనా నాలుగోసారి అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు భారత్–పాకిస్తాన్ల మధ్య మరే దేశమయినా మధ్యవర్తిత్వం చేయొచ్చన్న వాదనలను తోసిపుచ్చారు. మసూద్ అజహర్ విషయంలో చైనా మెతకవైఖరి నేపథ్యంలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దౌత్యాధికారులు మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే విషయమై చైనా ప్రతినిధులతో చర్చలు ప్రారంభించారు. మసూద్ను చైనా భద్రతామండలిలో కాపాడటంపై అమెరికాకు చెందిన వాల్స్ట్రీట్ జర్నల్ పత్రిక తన సంపాదకీయంలో ఘాటుగా విమర్శించింది. -
రాయని డైరీ.. టామ్ వడక్కన్ (బీజేపీ!)
ముప్పై ఏళ్లుగా కాంగ్రెస్లో ఉన్నాను. కాంగ్రెస్లో ఒక్కరికీ నేనెవరో తెలీదు. బీజేపీలోకి వచ్చి ఒక్కరోజైనా కాలేదు. ముప్పై ఏళ్లుగా నేను బీజేపీలో ఉన్నట్లే అంతా నన్ను పలకరిస్తున్నారు సంస్కారవంతమైన పార్టీ. ఎంత చక్కటి సంస్కారాన్ని అలవరిచారు మోదీజీ తన పార్టీకి!! నేనొచ్చాక, నా వెనుకే ఇంకో ఇద్దరు బీజేపీలోకి వచ్చారు. ఎవరో భార్యాభర్తలు. ‘‘ఎవరు వీళ్లు? ఎక్కడా చూడనట్లుందే?’’ అని శ్రీధరన్ పిళ్లైని అడిగాను. కేరళ బీజేపీ ప్రెసిడెంట్ ఆయన. ‘‘ఎవరైనా.. ‘ఎక్కడో చూసినట్లుందే’ అంటారు. మీరు మాత్రం ‘ఎక్కడా చూడన ట్లుందే’ అంటున్నారు. మీ ప్రశ్నలోనే సమా ధానం ఉంది.. వాళ్లెవరో’’ అన్నాడు పిళ్లై. ‘‘గాటిట్’’ అని పెద్దగా అరిచాను. ‘‘ఏమిటి గాటిట్’’ అన్నాడు పిళ్లై. ‘‘ఎక్కడా చూడనట్లుంటే.. వాళ్లు కాంగ్రెస్ వాళ్లై ఉంటారు. అంటే వీళ్లిద్దరూ కాంగ్రెస్ నుంచే కదా వచ్చారు బీజేపీలోకి’’ అన్నాను. ‘‘బ్రిలియంట్’’ అన్నాడు పిళ్లై! అది నా బ్రిలియన్స్ కాదు. కాంగ్రెస్ పార్టీ బ్రిలియన్స్. రాజీవ్ గాంధీ దగ్గర పని చేశాను. నేనెవరో ఎవరికీ తెలీదు. సోనియా గాంధీ దగ్గర పని చేశాను. నా పేరేమిటో ఎవరికీ తెలీదు. రాహుల్ దగ్గర పని చేశాను. నేనెవరో నేనే మర్చిపోయాను. రాహుల్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అయినప్పుడు.. ఆ సభలో.. ‘ఎక్స్క్యూజ్మీ.. నా పేరేమిటో చెప్పగలరా?’ అని టెస్టింగ్ కోసం ఇద్దరుముగ్గుర్ని అడిగాను. తెలీదన్నారు! ‘పోనీ, టామ్ వడక్కన్ ఇక్కడెక్కడైనా మీకు కనిపించారా?’ అని అడిగాను. ‘మీపేరేమిటో కనుక్కుని మీకు చెప్పమంటే చెప్పగలం కానీ, టామ్ వడక్కన్ కనిపించాడా అని అడిగితే ఎలా చెప్పగలం? ఆ పేరే వినలేదు’’ అన్నారు!స్టన్ అయ్యాను! ఆ ఇద్దరుముగ్గురికికాస్త దూరంగా వెళ్లి, ఇంకో ఇద్దరుముగ్గుర్ని కదిలించాను. ‘‘చూడండీ.. అక్కడున్న ఆ ఇద్దరుముగ్గురు టామ్ వడక్కన్ పేరే వినలేదంటున్నారు. ఆశ్చర్యంగా లేదూ..’’ అన్నాను.‘‘ఆశ్చర్యం ఏముందీ.. వాళ్లకే కాదు, మాకూ తెలీదు.. టామ్ వడక్కన్ ఎవరో’’ అన్నారు. హర్ట్ అవ్వాలో అవకూడదో తెలీలేదు. ‘‘హర్ట్ అవనవసరం లేదు’’ అనే మాట వినిపించింది! తలతిప్పి చూశాను. ‘‘మీరు వడక్కన్ కదా!’’ అన్నాడు ఆ వ్యక్తి. నివ్వెరపోయాను. నిశ్చేష్టుడినయ్యాను. నాకు నేనే కొత్తగా అనిపించాను.‘‘మీరు టామ్ వడక్కన్ కదా!’’ అన్నాడు ఆ వ్యక్తి మళ్లీ. ఆరాధనగా అతడి వైపు చూశాను. ‘‘మీరెవరు?’’ అని అడిగాను. ‘‘నేనెవరో మీకు తెలియనవసరం లేదు. మీరెవరో ఈ ప్రపంచానికి తెలియాలి. మీది త్రిశ్సూర్ అని తెలియాలి. కార్పొరేట్ ఉద్యోగం మానేసి కాంగ్రెస్లో చేరారని తెలియాలి. ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తానని ముప్పై ఏళ్లుగా అడుగుతున్నా కాంగ్రెస్ మీకు టికెట్ ఇవ్వలేదని తెలియాలి. పుల్వామా ఎటాక్ల మీద కాంగ్రెస్ పార్టీ యాంటీ–ఆర్మీ కామెంట్స్ మమ్మల్ని బాధించాయని తెలియాలి. అందుకే మీరు బీజేపీలో చేరారని తెలియాలి’’ అన్నాడా వ్యక్తి ఆవేశంగా! కన్నీళ్లొచ్చేశాయి నాకు. ‘‘మీరెవరో చెప్పారు కాదు’’ అన్నాను చేతులు జోడిస్తూ. ‘‘రవిశంకర్ ప్రసాద్ అంటారు నన్ను. మోదీ దగ్గర మినిస్టర్ని’’ అన్నాడు. ‘‘కేరళలో మిమ్మల్ని పిళ్లై మీట్ అవుతాడు’’ అని చెప్పాడు. చెప్పినట్లే పిళ్లై నన్ను కలిశాడు.‘‘ఏంటి పిళ్లై.. ఆ చప్పుళ్లు?’’ అని అడిగాను. ‘‘ఆ భార్యాభర్తలు వచ్చారు కదా. వాళ్లను ఆహ్వానిస్తూ డప్పులు కొడుతున్నారు’’ అన్నాడు! నిజంగానే పార్టీకి ఎంత మంచి సంస్కారం నేర్పించారు మోదీజీ!!. మాధవ్ శింగరాజు -
నేను బతికే ఉన్నా.. మరేం పర్లేదు!
ఇస్లామాబాద్ : ‘నేను బతికే ఉన్నాను... పూర్తి ఆరోగ్యంగా ఉన్నా.. మరేం పర్లేదు. మాపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీతో పోలిస్తే నేను చాలా ఫిట్గా ఉన్నా. నాతో ఆయన ఏ ఆట ఆడతానన్నా సరే సిద్ధంగా ఉన్నా. సవాల్ విసురుతున్నా’ అంటూ ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ అధినేత మసూద్ అజహర్ తన పత్రికలో పేర్కొన్నాడు. మసూద్ మరణించాడంటూ ఇటీవల సోషల్ మీడియా, పాక్ మీడియాలలో వార్తలు ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జైషే మహ్మద్ అధికార పత్రిక ఆల్-కలాంలో సాది అనే కలం పేరిట కథనం రాసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ కథనం ప్రకారం... తన గురించి వస్తున్న వదంతులను నమ్మవద్దని మసూద్ పేర్కొన్నాడు. పుల్వామా దాడిని జైషే సాధించిన గొప్ప విజయంగా అతడు అభివర్ణించాడు. దాడికి పాల్పడి 40 మందికి పైగా భారత జవాన్లను పొట్టనబెట్టుకున్న తమ కమాండర్ ఆదిల్ అహ్మద్ దార్ను ప్రశంసిస్తూ.. ‘కశ్మీర్లో ఆదిల్ ఓ గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టాడు. తను రగిల్చిన మంట ఇప్పట్లో చల్లారే ప్రసక్తే లేదు’ అంటూ ద్వేషపూరిత కథనంలో పేర్కొన్నాడు. అదే విధంగా ఆఫ్గనిస్తాన్ ప్రజల పరిస్థితిపై కూడా మసూద్ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఇందుకు సంబంధించి కచ్చితమైన సమాచారం తెలియాల్సి ఉంది.(ఇంతకు మసూద్ ఎవరు? ఎక్కడ పుట్టాడు?) కాగా కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఆత్మాహుతికి పాల్పడి ఆదిల్ అనే ఉగ్రవాది భారత జవాన్ల కాన్వాయ్పై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు ప్రతీకారంగా భారత వైమానిక దళం బాలాకోట్లోని జైషే స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. ఈ నేపథ్యంలో భారత్- పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ ఉగ్రవాదాన్ని విడనాడాలంటూ భారత్తో పాటు అగ్ర దేశాలన్నీ హెచ్చరిస్తున్నా పాక్ తీరు మార్చుకోవడం లేదు. తమ దేశంలో ఆశ్రయం పొందుతున్న మసూద్ అజహర్ను మాత్రం భారత్కు అప్పగించడం లేదు. మరోవైపు... జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్న భారత్కు ఆ దిశగా భారీ ఊరట లభించింది. మసూద్ అజర్ ఆస్తులను స్తంభింపచేస్తామని శుక్రవారం ఫ్రాన్స్ ప్రకటించింది. ఈ దిశగా ఫ్రాన్స్ దేశీయ, ఆర్థిక, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు సంయుక్త ప్రకటన చేశాయి. ఉగ్రవాదంతో ప్రమేయమున్న వ్యక్తిగా మసూద్ అజర్ పేరును ఐరోపా యూనియన్ జాబితాలో చేర్చేందుకు ఫ్రాన్స్ చొరవ చూపుతుందని అధికారిక ప్రకటన వెల్లడించింది. -
భారీ విరాళం.. బీసీసీఐ ‘సెల్యూట్’
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సైనిక సంక్షేమ నిధికి రూ.20 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించింది. ఈ నెల 23న జరగనున్న ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్లో ఈ భారీ మొత్తాన్ని అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు త్రివిధ దళాలకు సంబంధించిన ఉన్నతాధికారిని మ్యాచ్కు అతిథిగా పిలిచి ఈ విరాళాన్ని అందించాలని బీసీసీఐ ఆలోచిస్తుంది. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు అండగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు బోర్డు ఉన్నతాధికారి తెలిపారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఐపీఎల్ ప్రారంభ వేడుకలను బీసీసీఐ రద్దు చేసింది. ప్రారంభ వేడుకలకు అయ్యే ఖర్చు రూ. 15 కోట్ల(గతేడాది అయిన ఖర్చు)తో పాటు అదనంగా మరో ఐదు కోట్లు జతచేసి సంక్షేమ నిధికి ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది. చెన్నై వేదికగా జరగనున్న ప్రారంభ మ్యాచ్లో ధోనీ, కోహ్లి సమక్షంలో భద్రతా దళాల అధికారులకు చెక్ను అందించనున్నారు. ఇక భారత్, ఆస్ట్రేలియా వన్డే సిరీస్ సందర్భంగా.. రాంచీ వన్డేలో ఆర్మీ క్యాప్తో బరిలో దిగిన టీమిండియా ఆటగాళ్లు.. మ్యాచ్ ఫీజును అమర జవాన్ల కుటుంబాలకు విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే. -
పాక్ మరెంతో చేయాల్సి ఉంది : అమెరికా
న్యూఢిల్లీ : ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నారని పాకిస్తాన్పై అమెరికా మండిపడింది. ఉగ్రవాదుల ఏరివేతకు పాక్ తీసుకుంటున్న చర్యలు సరిపోవని, చేయాల్సింది మరెంతో ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియా అన్నారు. ఫిబ్రవరిలో 14న భారత్లోని పుల్వామాలో జరిగిన ఘాతుకాన్ని అమెరికా చూసిందని, పాక్ నుంచి వచ్చిన ఉగ్రవాదులే ఈ చర్యకు పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు. గతంలో ఏ అమెరికా ప్రభుత్వం తీసుకోని విధంగా పాక్ ఆగడాలపై ట్రంప్ సర్కారు చర్యలు చేపట్టిందని శుక్రవారం ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఉగ్రవాదుల పీచమణిచేలా చర్యలు చేపట్టాలని భారత్, అమెరికా శుక్రవారం పాకిస్తాన్కు స్పష్టం చేశాయి. ఉగ్రవాద అంతానికి పోరాడుతున్న భారత్కు అమెరికా దన్నుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు అమెరికా రక్షణశాఖ సలహాదారు జాన్ బోల్టన్, భారత విదేశీ వ్యవహారాల కార్యదర్శి విజయ్ గోఖలే మధ్య గురువారం భేటీ కూడా అయింది. (మళ్లీ మోకాలడ్డిన చైనా) కాగా, జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ యూఎన్ భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని చైనా అడ్డుకున్న సంగతి తెలిసిందే. అయితే, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్న భారత్కు ఆ దిశగా భారీ ఊరట లభించింది. మసూద్ అజర్ ఆస్తులను స్తంభింపచేస్తామని శుక్రవారం ఫ్రాన్స్ ప్రకటించింది. ఈ దిశగా ఫ్రాన్స్ దేశీయాంగ, ఆర్థిక, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు సంయుక్త ప్రకటన చేశాయి. ఉగ్రవాదంతో ప్రమేయమున్న వ్యక్తిగా మసూద్ అజర్ పేరును ఐరోపా యూనియన్ జాబితాలో చేర్చేందుకు ఫ్రాన్స్ చొరవ చూపుతుందని అధికారిక ప్రకటన వెల్లడించింది. (బెడిసికొడుతున్న మన దౌత్యం) -
మళ్లీ మోకాలడ్డిన చైనా
ఆర్థిక ప్రయోజనాలు తప్ప మరేమీ పట్టని ప్రపంచంలో చైనా భిన్నంగా ఉంటుందని ఆశించడం పొరపాటే. అది ఎప్పటిలాగే జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ను ‘అంతర్జాతీయ ఉగ్రవాది’గా ప్రకటించాలన్న ప్రతిపాదనను భద్రతామండలి సమావేశంలో అడ్డుకుంది. మండలిలో శాశ్వత సభ్య దేశంగా తనకున్న వీటో అధికారాన్ని వినియోగించుకుని, ‘సాంకేతిక కారణాలు’ సాకుగా చూపి ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికాల ప్రతిపాదనను బుట్టదాఖలా చేసింది. ఇలా చేయడం చైనాకు కొత్తగాదు. పదేళ్లుగా ఇదే పని చేస్తూనే ఉంది. అందుకు పాకిస్తాన్ నుంచి ప్రతిఫలం పొందుతూనే ఉంది. ప్రపంచంలో అత్యధిక దేశాలు ‘ఉగ్రవాదం’ మహమ్మారి బారినపడుతున్నా ఆ పదానికి అంతర్జాతీయంగా అందరూ అంగీకరించిన చట్టబద్ధమైన నిర్వచనం ఇంతవరకూ లేకపోవడం వల్ల చైనా చాలా సునాయాసంగా ఇలాంటి ‘సాంకేతిక కారణాలు’ చూపగలుగుతోంది. ఇలాంటి నిర్వ చనం లేకపోబట్టే చైనా పాలకులు తమ ఏలుబడిలోని జిన్జియాంగ్ ప్రాంతంలో స్వయంపాలన కోసం, మత స్వేచ్ఛ కోసం శాంతియుతంగా పోరాడుతున్న వీగర్ జాతీయవాదుల్ని ఉగ్రవాదులుగా ముద్రేసి తీవ్రంగా అణిచేయగలుగుతున్నారు. అక్కడ ఉగ్రవాద వ్యతిరేక చట్టమంటూ లేకపోయినా నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ముందున్న ముసాయిదా ప్రకారం సమాజానికి హాని తలపెట్టే పనులు చేసినా, ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసినా, ఆర్థిక నష్టాలకు కారణమైనా ఉగ్రవాదులే అవుతారు. ఇలా స్వదేశంలో ఎందరో ఉగ్రవాదుల్ని ‘చూడగలుగుతున్న’ చైనా పాలకులకు మసూద్ అజర్లో అలాంటి లక్షణాలు కాస్తయినా కనబడటం లేదు! కశ్మీర్లోని పుల్వామాలో 43మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉగ్ర దాడి జరిగిన కొద్దిసేపటికే అది తమ ఘనతేనని జైషే సంస్థ ప్రకటించుకుంది. ఆ దాడికి కారకుడైన యువకుడి పేరు సైతం ప్రకటించింది. తాము ఎప్పటిలాగే‘బాధ్యతాయుతమైన’ వైఖరితో ఉన్నామని, ఈ సమ స్యపై సంబంధిత పక్షాలన్నిటితో మాట్లాడాకే నిర్ణయించాలని భావిస్తున్నామని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి లూ కాంగ్ చెబుతున్నారు. 2008 నవంబర్లో ముంబైపై ఉగ్రదాడి జరిగాక మసూద్ అజ ర్ను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చాలని ఆ మరుసటి ఏడాది మన దేశం ప్రతిపాదిం చింది. అప్పుడూ ఇదే తరహాలో చైనా ఆ ప్రతిపాదనకు అడ్డుపుల్ల వేసింది. 2016లో పఠాన్కోట్ వైమానిక దళ స్థావరంపై దాడి జరిగాక మరోసారి ఇదే ప్రతిపాదన తీసుకురాగా అప్పుడు సైతం చైనా అడ్డగించింది. ఆ మరుసటి ఏడాది అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్లు తీర్మానం తీసుకొచ్చిన ప్పుడూ చైనా ఈ వైఖరే తీసుకుంది. జైషే సంస్థ భారత్లో దాడులకు పాల్పడిన ప్రతిసారీ తానే కారణమని చెప్పుకుంటోంది. భారత్ను బెదిరిస్తూ మసూద్ చేసిన ప్రసంగాలున్నాయి. కానీ ఇంకేదో కావాలని చైనా కోరుతోంది. ఆ దేశానికి తనపై ఇంత వల్లమాలిన విశ్వాసం ఉన్నందుకు మసూద్ కూడా ఆశ్చర్యపోతూ ఉండొచ్చు. కానీ చైనాకు వేరే ప్రయోజనాలున్నాయి. పాక్లో వివిధ ప్రాజెక్టుల్లో అది వేల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ఆ ప్రాజెక్టుల్లో పనిచేసేవారిలో అత్యధికులు చైనా జాతీయులే. వారంతా ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పనిచేయవలసి వస్తోంది. వారికి ఉగ్రవాద బెడద తప్పడంలేదు. పెట్టుబడులు భద్రంగా ఉండటానికి అక్కడి ప్రభుత్వంతో... తమ పౌరులు క్షేమంగా ఉండటానికి పాకిస్తాన్ సైన్యంతో మంచి సంబంధాలు కొనసాగించడం చైనాకు అవసరం. ఇక సెంట్రల్ ఆసియా, యూరప్, ఆఫ్రికాలతో నేరుగా వాణిజ్యబంధం ఏర్పరచుకోవడానికి భారీయెత్తున తల పెట్టిన అధునాతన సిల్క్ రూట్ బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్(బీఆర్ఐ) ప్రాజెక్టులో పాకిస్తాన్ను చేర్చుకుని ఇప్పటికే చైనా పనులు ప్రారంభించింది. అది ఏ మాత్రం అడ్డం తిరిగినా చైనా నిండా మునుగుతుంది. అలాగే మన దేశానికి ఎంతో కొంత చెక్ పెట్టడానికి పాకిస్తాన్ తోడ్పడుతుందన్న నమ్మకం దానికుంది. కనుకనే ఏదో ఒక సాకుతో మసూద్ అజర్ విషయంలో భద్రతామండలి చర్య తీసుకోకుండా అది అడ్డుపడుతోంది. వాస్తవానికి పుల్వామా దాడి జరిగిన వెంటనే చైనా స్పందిం చిన తీరు గతంలో కంటే భిన్నంగా ఉంది. ఉగ్రవాదం బెడదపై ఈ ప్రాంత దేశాలన్నీ సహకరించు కుని దాన్ని అరికట్టడానికి పూనుకోవాలని, శాంతిసుస్థిరతలు సాధించాలని ఆ ప్రకటన సూచిం చింది. ఉగ్రవాదం బెడద పోవడానికి తాను భద్రతామండలిలో సహకరించదు. అజర్పై ఈగ వాలనీయదు. కానీ భారత్–పాకిస్తాన్లు మాత్రం మాట్లాడుకుని శాంతిసుస్థిరతలు సాధించాలి. ఇదెలా సాధ్యమవుతుందో, ఈ తర్కాన్ని ఏమంటారో చైనాయే చెప్పాలి. భద్రతామండలి 1998లో భద్రతామండలి ఆమోదించిన 1267 తీర్మానం పరిధిలోకి మసూ ద్ను తీసుకురావడం పదేళ్లుగా మన దేశం సాగిస్తున్న ప్రయత్నం సారాంశం. ఆ పని చేస్తే అతడి ఆర్థిక మూలాలు దెబ్బతింటాయని, ఆయుధాల సేకరణ అసాధ్యమవుతుందని భావించడమే ఇందుకు కారణం. 1267 తీర్మానం తర్వాత మండలి ఈ రెండు దశాబ్దాల్లోనూ ఉగ్రవాదుల కట్టడికి అనేక తీర్మానాలు చేసింది. కానీ నిషేధించిన సంస్థల్ని మూసేసి కొత్త పేర్లతో రావడం, యధావిధిగా తమ కార్యకలాపాలు సాగించడం ఉగ్రవాదులకు అలవాటు. గతంలో 1267 తీర్మానం కింద అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ప్రకటించిన జమా ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్, మరో అయి దుగురు పాకిస్తాన్లో అరెస్టయినా కొన్ని నెలలకే విడుదలయ్యారు. ఐక్యరాజ్యసమితి ముస్లిం దేశా లకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నదని, భారత్ ప్రభావంతో ఇలాంటి తీర్మానాలు చేస్తున్నదని, సార్వభౌమాధికారం ఉన్న పాక్ దీన్నెలా అనుసరిస్తుందని హఫీజ్ చేసిన వాదనను లాహోర్ హైకోర్టు అంగీకరించి అతగాడిని విడుదల చేసింది. కనుక కశ్మీర్లో శాంతికి ప్రయత్నాలు చేయడం, సరిహద్దుల్లో ఉగ్రవాదులు ప్రవేశించకుండా కట్టడి చేయడంపై దృష్టి పెట్టడం అవసరం. ఆ దిశగా అడుగులేస్తే ఉగ్రవాదం బెడద చాలావరకూ అరికట్టడం సాధ్యమవుతుంది. -
అంతా నా ఇష్టం!
ఈ ఎన్నికల తరుణంలో ఓటరు మనోగతం ఏమిటి? ఎవరికి ఓటెయ్యాలో ఎప్పుడు నిర్ణయించుకుంటాడు? ఓటరుపై పనిచేసే అంశాలేమిటి? పొత్తులతో చిత్తు చేయవచ్చా? ‘పుల్వామా’ ప్రభావం చూపుతుందా? పథకాలకు ఓట్లు కుమ్మరించే సత్తా ఉందా? కుర్రకారు ఆలోచన తీరెలా ఉంది? ఇవన్నీ ఇప్పుడు ఎన్నికల ముందు తలెత్తుతోన్న సవాలక్ష సందేహాలు. ఓటరునాడిని పట్టుకునేందుకు రాజకీయ పార్టీలూ, నేతలూ తలలు పట్టుకుంటున్నారు. పరిశీలకులూ, పరిశోధకులూ రంగంలోకి దిగి జల్లెడపడతారు. వచ్చే ఎన్నికల్లో ఓటరు ఆలోచనా తీరు ఎలా ఉండబోతోందో వివిధ సందర్భాల్లో వివిధ ఎన్నికల గణాంకాల నిపుణులు వెల్లడించిన అనేక అంశాలను క్రోడీకరిస్తే ఆసక్తికర అభిప్రాయాలు వెల్లడయ్యాయి. ముందే నిర్ణయం.. 2004 సార్వత్రిక ఎన్నికల వరకూ ప్రజలు ఓటు వేయడానికి కేవలం మూడు నాలుగు రోజుల ముందే ఓ నిర్ణయానికి వచ్చేవారని, అయితే ఇప్పుడా పరిస్థితి మారిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు ప్రజలు ఓటింగ్కి మూడు నాలుగు రోజుల ముందు మాత్రమే స్థిరమైన నిర్ణయానికి వచ్చేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఫలానా పార్టీకి వ్యతిరేకంగా ఓటెయ్యాలనో, లేదంటే ఫలానా పార్టీని గెలిపించాలనో ఎన్నికలకు చాలా ముందుగానే నిశ్చితాభిప్రాయానికి వస్తున్నారు. 2009–2014 లోక్సభ ఎన్నికల ఫలితాలు అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికలకు చాలా ముందుగానే ప్రజలు స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారు. మనోళ్లు ఓడిపోయే వాళ్లకి ఓటెయ్యరు.. ఏ పార్టీకీ సంపూర్ణ మెజారిటీ వస్తుందన్న ఆశలేని సందర్భాల్లో ఎటు వీలైతే అటు మొగ్గుచూపే ఫ్లోటింగ్ ఓటర్లు 20 శాతమే అయినా పార్టీల గెలుపోటములను ప్రభావితం చేయడానికి ఆ సంఖ్య చాలు. ఎన్నికల్లో ప్రతి పార్టీ తామే గెలుస్తామని ప్రచారం చేస్తుంది. ఇదంతా ఓటర్లను ప్రభావితం చేయడానికే. అలాగే సాధారణ భారతీయ ఓటర్లు ఓడిపోయే వారికి ఓటు వేయడానికి ఇష్టపడరు. ఎన్నికలు అయిపోయిన తరువాత మీరు ఎక్కడికైనా వెళ్ళి అడగండి. 80 నుంచి 90 శాతం మంది మేం గెలిచే పార్టీకే ఓటు వేసామని చెపుతారు. దీన్ని బట్టి గెలిచే వారికే మన ప్రజలు ఓటెయ్యాలనుకుంటారు. తప్ప ఓడిపోతారనుకున్నవారికి ఓటు వేస్తే తమ ఓటు వృథా అవుతుందని కూడా భావిస్తారు. చివరి నిమిషంలో.. కేవలం 20 శాతం మంది మాత్రమే ఎవరికి ఓటు వేయాలనే విషయంలో ఆలస్యంగా నిర్ణయం తీసుకుంటారు. అందుకే తమ పార్టీయే గెలుస్తుందన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించడం అన్ని పార్టీలకూ అవసరం. 2014 ఎన్నికల్లో ఈ అవగాహనే ఎక్కువగా పనిచేసింది. నిజానికి ప్రజల్లో ఒక బలమైన అభిప్రాయాన్ని కల్పించడం ఈ దేశంలో ఏ ఎన్నికలనైనా ప్రభావితం చేస్తుంది. ఒకసారి ప్రజల్లో బలమైన అభిప్రాయాన్ని కలగజేయగలిగితే ఓటు వేయడానికి ముందు గతంలో ఆ ప్రభుత్వం చేసిన పనులను ప్రజలు పెద్దగా పట్టించుకోరు. పెద్ద పెద్ద ప్రదర్శనలూ, హోర్డింగులూ ప్రజాభిప్రాయాన్ని మలచడానికి ఉపయోగపడతాయి, విజయానికి సాయపడతాయి. ఏదైనా పార్టీ పెద్ద పెద్ద ర్యాలీలు నిర్వహించకపోతే అది ఓటమిని అంగీకరిస్తున్నట్టు లెక్కకడతారు ప్రజలు. ఎన్నికలకు ముందు.. ఎన్నికల్లో ఎవరికి ఓటు వెయ్యాలి అనే అభిప్రాయాన్ని అప్పటికప్పుడు మార్చుకునేవారు 40–45 శాతం నుంచి 20–25 శాతానికి తగ్గారు. ఎన్నికల తేదీలను ప్రకటించటానికన్నా ముందుగానే జనం తామెవరి పక్షమో నిర్ణయించుకుంటున్నారు. ఈ ఒరవడి ప్రతి ఎన్నికల్లోనూ పెరుగుతూ వస్తోంది. 2014 ఎన్నికల్లోనైతే 50 శాతం మంది ఓటర్లు ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. పొత్తుల పొడగిట్టని జనం.. పొత్తులపై ప్రజల్లో విశ్వాసం పెద్దగా లేదు. ఎన్నికల్లో గెలుపు కోసం ఈ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న వారు వచ్చే ఎన్నికల్లో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటారు. ఇలాంటి వారిపట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లడం సహజం. మోదీకి వ్యతిరేకంగా ఒక్కటవుతున్న పార్టీలతో ప్రజలకు పెద్దగా సమస్యలేదు. ఎందుకంటే రాబోయే రెండు మూడేళ్ళలో తిరిగి ఆయా పార్టీలు ఒకరికి వ్యతిరేకంగా ఒకరు మారడం ఖాయమని వారు భావిస్తున్నారు. ఒకవేళ పొత్తులతో వారు గెలిచినప్పటికీ ప్రభుత్వాన్ని కొనసాగించగలరన్న విశ్వాసం ప్రజలకు కలగడం లేదు. అందుకే కొన్ని రాష్ట్రాల్లో స్థానికంగా ప్రాంతీయ పార్టీల పొత్తులు బీజేపీని నిరోధించగలిగినా మహాఘటబంధన్ వంటి భారీ పొత్తులు మాత్రం ప్రజలను అంతగా ఆకర్షించలేవు. వ్యతిరేక ప్రచారమే మోదీకి అనుకూలంగా మారే అవకాశం ఉంది. రైతు.. అటా? ఇటా? ఎటు? రైతు అన్ని చోట్లా రైతు కాదు. రైతులంతా ఒక్కటీ కాదు. రైతాంగ సమస్యలు ఉత్పన్నమైనప్పుడు రైతులు సంఘటితంగా ముందుకొస్తారు. గ్రామాల్లో మాత్రం రైతులను కులాలో, మతాలో నడిపిస్తాయి. గ్రామాల్లో పెద్ద రైతులు, చిన్న, సన్నకారు రైతులు, మధ్యతరగతి రైతులు ఉంటారు. పెద్ద రైతులతో పోలిస్తే వ్యవసాయ సంక్షోభం కారణంగా బాగా నష్టపోయేది చిన్న, సన్నకారు రైతులే. మిగిలిన రైతులు చిన్నా చితకా వ్యాపారాల్లోనో, ఇతర ఆర్థిక వనరులపైనో ఆధారపడి ఉంటారు. అలాగే చిన్న సన్నకారు రైతులతో పోల్చుకుంటే పెద్దరైతులు చాలా తక్కువ మంది ఉంటారు. అందుకే సంక్షేమ పథకాలన్నీ చిన్న సన్నకారు రైతులనుద్దేశించినవే అయి ఉంటాయి. వంద మందికి మేలు జరిగే పథకం ఉన్నదీ అంటే అది ప్రభుత్వానికి ఎన్నికల్లో పనికొచ్చే అంశమే. అయితే రాజకీయ పార్టీలు భావిస్తున్నంతగా పథకాలు పనిచేయవు. ఎందుకంటే ప్రజలకు సదరు పథకం వల్ల ప్రయోజనం కలుగుతున్నా అది రాష్ట్రప్రభుత్వం ఇస్తోందా? లేక కేంద్రం నుంచి వస్తోందా అన్న గందరగోళం ఉంటుంది. ఎగువ మధ్య తరగతికి ‘అవినీతి సమస్య’ ఎగువ మధ్యతరగతి జనం మాత్రమే అవినీతిని గురించి ఎక్కువగా పట్టించుకుంటారు. కానీ మిగిలిన వారికి అవినీతి అంశం పెద్ద సమస్య కాదు. అయితే అవినీతికీ, ధరల పెరుగుదలకీ ఉన్న సంబంధాన్ని రాజకీయ పార్టీలు ప్రచారం చేయగలిగితే తప్ప అవినీతిని గురించి వారు పట్టించుకోరు. 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసిందదే. 1989లో వీపీ సింగ్ చేసింది కూడా ఇదే. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకూ ఈ విషయాన్ని ప్రచారంలోకి తేలేకపోయింది. అవినీతి అనేది సాధారణంగా ప్రతి ఎన్నికల్లోనూ ప్రచారాస్త్రమే.. మీడియా ‘కీ’ రోల్ ఏదైనా ఒక పార్టీపై ప్రజల్లో బలమైన ముద్ర వేయడంలో మీడియా పాత్ర కీలకం అంటున్నారు నిపుణులు. పార్టీ అభిప్రాయాలు ఏ మేరకు ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతున్నారనే విషయం కూడా ఆ పార్టీ గెలుపుఓటములను ప్రభావితం చేస్తుంది. మీడియా ప్రచారం ప్రజాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మార్చుకోగలుగుతుంది. అలాగే ఇతర పార్టీలపై అభిప్రాయాలను కూడా ప్రభావితం చేయగలుగుతుంది. ఒకే అబద్ధాన్ని పదే పదే చెబితే ఆ అబద్ధాన్ని సాధారణ ప్రజలు నిజమని నమ్మే ప్రమాదం ఉంటుంది. చివరకు అదే విషయం ప్రజలను ప్రభావితం చేస్తుంది కూడా. ఇది గెలుపోటములపై ప్రభావం చూపుతుంది. ముస్లింల మొగ్గెటు? ముస్లింలలోని ఉన్నత వర్గం వారు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే మొత్తంగా గత కొన్ని ఎన్నికల్లో జాతీయస్థాయిలో 38 నుంచి 39 శాతం ముస్లింలు కాం్ర Vð స్కే ఓటు వేసారు. ప్రాంతీయ పార్టీలూ, ఇతర పార్టీలూ కలిపి 56 నుంచి 57 శాతం ముస్లింల ఓట్లను పొందగలిగాయి. అక్కడ స్థానిక రాజకీయాల వల్ల, లేదా పార్టీ అభ్యర్థి కారణంగా 6 శాతం ముస్లింలు బీజేపీకి ఓటేసారు. అయితే ఉత్తర ప్రదేశ్, బిహార్లలో కాంగ్రెస్కి ముస్లింలు పెద్దగా ఓటు వేయలేదు. కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ ఉండే రాష్ట్రాల్లో మాత్రం ముస్లింల ఓట్లు అత్యధికంగా 75 నుంచి 80 శాతం ఓట్లు కాంగ్రెస్ కి పడతాయి. బెంగాల్..రూటే సెపరేట్ బెంగాల్లో మమతకి అనుకూలురు, వ్యతిరేకులూ అనే స్పష్టమైన విభజన రేఖ ఉంటుంది. మమతకు వ్యతిరేకంగా ఉన్న వారు బీజేపీ వెనుక సంఘటితమౌతారు. అక్కడ వామపక్షాలా లేక కాంగ్రెస్ పార్టీనా అన్నదానితో సంబంధం ఉండదు. బెంగాల్లో బీజేపీకి సీట్లు పెరిగే అవకాశం ఉంది. దీనర్థం మమత పాపులారిటీ తగ్గుతోందని కాదు. ఇదంతా మమత వ్యతిరేకుల వల్ల బీజేపీ లాభపడుతుందని మాత్రమే దీనర్థం. మూడున్నర దశాబ్దాల కమ్యూనిస్టుల కంచుకోటని బద్దలుకొట్టిన దీదీ వ్యతిరేకులంతా బీజేపీ వెనుక సంఘటితమౌతున్నారు. యువోత్సాహం..బీజేపీకే సొంతం 18 నుంచి 23 ఏళ్ళ మధ్య వయస్సు వారు, తొలిసారి ఓటు హక్కు వచ్చిన వారు దాన్ని వినియోగించుకున్నది 1996–2009లో 4 నుంచి 5 శాతం మంది మాత్రమే. అయితే మోదీ ప్రభావంతో 2014లో తొలిసారి ఓటు హక్కుని వినియోగించుకున్నవారు 68 శాతం. దీనర్థం యువతను మోదీ బాగా ఆకర్షించగలిగారు. అయితే మోదీ ప్రధాని కావాలనుకునే వారు అన్ని వయస్సుల వారూ కలిపి మొత్తం 36 శాతం మంది ఉన్నారు. ఇందులో తొలిసారి ఓటు హక్కుని వినియోగించుకుంటున్నవారు 45 శాతం మంది. అయితే ఈసారి మాత్రం తొలిసారి ఓటర్లలోనూ మోదీ ప్రభావం తగ్గింది. అయితే ఇది కాంగ్రెస్కి ఉపయోగపడకపోవచ్చు. మొత్తంగా మోదీ ప్రభావం తగ్గినప్పటికీ తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్లు మాత్రం రాహుల్కంటే మోదీనే ఇష్టపడుతున్నారు. ప్రియాంక అరంగేట్రం.. ఎవరికి నష్టం? బీజేపీ కంటే ఎస్పీ, బీఎస్పీకే ప్రియాంక రాజకీయ రంగ ప్రవేశం నష్టం చేకూరుస్తుంది. ఎందుకంటే బీజేపీకి బలమైన సంప్రదాయ ఓటు బ్యాంకు ఉంది. అయితే ఎస్పీకీ, బీఎస్పీకీ సంప్రదాయ ఓటు బ్యాంకు లేదని కాదు. బీజేపీకి నిజమైన జాతీయ ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేనని భావించే ముస్లిం కమ్యూనిటీ మాత్రం ఉత్తరప్రదేశ్లో ప్రియాంక రాకతో గందరగోళంలో పడే అవకాశం ఉంది. అందుకే యూపీలో ఈసారి ముస్లింలు వ్యూహాత్మకంగా ఓటు వేస్తారని ప్రజలు భావిస్తున్నారు. యూపీలో ఎవరు బలంగా ఉన్నారు అనే విషయాన్ని ముస్లిం కమ్యూనిటీ ఏ ప్రమాణాలతో చూస్తున్నారు అనే దాన్ని బట్టి వారి వ్యూహాత్మక ఓటింగ్ ఉంటుంది. దీన్ని అంచనావేయడం కష్టం. అందుకే యూపీలో ముస్లింల ఓట్లు చీలడానికి ఇది దారితీస్తుంది. అందుకే ప్రియాంకా గాంధీ ఎంట్రీ బీజేపీకి అనుకూలిస్తుంది. ‘ప్రియాంక’ ఎఫెక్ట్.. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ బలం అట్టడుగున ఉంది. 2017లో కేవలం 7 అసెంబ్లీ సీట్లే వచ్చాయి. రాహుల్ చెల్లెలు ప్రియాంక రాకతో కాంగ్రెస్కి ఆ రాష్ట్రంలో మరో 6 నుంచి 7 శాతం ఓట్లు అదనంగా రావచ్చు. మొత్తం కలిపినా కాంగ్రెస్కి రాబోయేది 15 నుంచి 16 శాతం ఓట్లే అని పరిశీలకుల అంచనా. 2014లో బహుజన్ సమాజ్ పార్టీకి 20 శాతం ఓట్లొచ్చాయి. అయినా ఒక్క సీటు కూడా రాలేదు. ‘పుల్వామా’ బీజేపీకి కలిసొస్తుందా? పుల్వామా ఘటన బీజేపీకి వ్యతిరేకత తెచ్చిపెట్టదు. దీని ద్వారా ప్రభుత్వం లబ్ధి పొందుతుంది. పాకిస్తాన్కి సరైన బుద్ధిచెప్పాలని ప్రజలు కోరుకుంటున్నారు. అందుకే పాకిస్తాన్కి గుణపాఠం చెప్పగల సత్తా వుందని నిరూపిస్తే చాలు. అది బీజేపీకి అనుకూలిస్తుందనడంలో సందేహంలేదు. ఏం చేసినా చెయ్యకపోయినా పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రజలు ఉవ్విళ్ళూరుతున్నారు. అది కచ్చితంగా మోదీ అనుకూలతకు నిదర్శనం. అసంతృప్తి ఉంది.. కోపం లేదు.. మోదీని తొలగించాలన్న నినాదం గట్టిగా వినిపిస్తున్నా.. నిజానికి క్షేత్రస్థాయిలో జనం మోదీపై అంత కోపంగా ఏమీ లేరు. అయితే ప్రజల్లో కొంత విరక్తి ఉన్నమాట వాస్తవం. మోదీ అనుసరించిన విధానాల వల్ల దళితులు, ఆదివాసీలు, విద్యార్థులు, రైతులు నిరాశతో ఉన్నారు. ఒకరకంగా చెప్పాలంటే ప్రజలు అసంతృప్తితోనూ, విరక్తితోనూ ఉన్నమాట వాస్తవమే. అయితే మోదీపైన కోపంగా మాత్రం లేరు. రాహుల్.. రా..రా! గతంలో రాహుల్గాంధీ ప్రధాని కావాలని 18 నుంచి 20 శాతం మంది కోరుకున్నారు. రాహుల్ ప్రధాని కావాలనుకునేవారి సంఖ్య కొద్దిగా పెరిగింది. ఇప్పుడు 27 నుంచి 28 శాతం మంది రాహుల్ గాంధీ రావాలని కోరుకుంటున్నారు. అయితే ఇది వాస్తవానికి రాహుల్ పాపులారిటీ కాదు. కాంగ్రెస్ని కోరుకునే జనం పెరుగుతున్నారని మాత్రమే అర్థం. అచ్చంగా రాహుల్ పాపులారిటీ అయితే 22 నుంచి 23 శాతం వరకే ఉంది. ఇందుకు భిన్నంగా దేశంలో 32 నుంచి 33 శాతం మంది బీజేపీకి ఓటెయ్యాలనుకుంటున్నారు. అయితే 50 శాతం మంది మాత్రం మోదీయే ప్రధానిగా ఉండాలని భావిస్తున్నారు. దీన్ని బట్టి మోదీ పాపులారిటీ బీజేపీకి చాలా వరకు కలిసివస్తోంది. కానీ రాహుల్ పాపులారిటీ కాంగ్రెస్కి పెద్దగా ఉపయోగపడుతున్నట్టు లేదు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
వారి త్యాగం అపూర్వం.. మరి రాజకీయమో?
పుల్వామా దాడి ఉగ్రవాద ఉన్మాదం. ఇటువంటి రాక్షస చర్యలు భారతీయ సైన్యం, భరత ప్రజల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయలేవు. ఒక చెంపమీద కొడితే ఇంకో చెంప చూపించే రోజులు పోయాయి. వాస్తవాధీన రేఖ దాటివెళ్లి ఉగ్ర శిబిరా లను మట్టుబెట్టిన వాయుసేనను చూసి దేశం గర్వి స్తోంది. త్రివిధ దళాలకు యావత్తు దేశం సెల్యూట్ చేస్తోంది. రక్షణ దళాల త్యాగాల మీద, అసమాన శౌర్య సాహసాల మీద ఎటువంటి మచ్చ లేదు. ఉన్న దల్లా ఓ విషాదం అలుముకున్న వేళ.. కాశ్మీర్ చుట్టూ అల్లుకున్న వివాదాస్పద రాజకీయాల గురించే చర్చ. కాశ్మీర్ అశాంతి ఇప్పటిది కాదు, స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచే అలుముకుంది. దానికిౖ వెపు పాకిస్తాన్ ఉగ్రవాదం, మరో వైపు స్వార్థపూరిత రాజ కీయ పార్టీల వైఖరి తోడయింది. కాశ్మీర్ చిన్న రాష్ట్రమే, భారత చిత్రపటంలో హిమాలయాల్లోకి విసి రేసినట్టున్న ఒక మంచు రాష్ట్రమే... కానీ దేశ రాజకీ యాలను వేగంగాప్రభావితం చేయగల రాష్ట్రం అది. దేశం ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ.. మళ్లీ కాశ్మీర్ అల్లకల్లోలమే ముందుకొచ్చింది. మోదీకి మరో రాజకీయ అవకాశం దొరికింది. హిందుత్వ ఎజెండాతో రాజ్యాధికారంలోకి వచ్చిన బీజేపీ మోదీ ప్రభుత్వం ఉత్తరాది రాష్ట్రాల్లో మత హింసను పురిగొ ల్పింది. కషాయపు భావజాలాన్ని వ్యతిరేకించిన వారిపై గోవధ పేరుతో మూక దాడులకు పాల్పడ్డది. మేధావులు, ప్రజా సంఘాలు, పౌర హక్కుల నేతల మీద దేశ ద్రోహం కేసులు మోపి జైల్లో పెట్టింది. హిందూమతోద్ధారకుణ్ణి నేనే, సనాతన ధర్మ వ్యాప్తి అంతా తన భుజస్కంధాలపైనే ఉందన్నట్లు ఫోజు కొట్టే మోదీ, అమిత్ షాలు జమ్మూకశ్మీర్, పొరుగు దేశం పాక్లోని హిందువుల గురించి ఎందుకు పట్టిం చుకోలేదన్నది ఆశ్చర్యం కలిగించే ప్రశ్న. పాక్లో హిందూ మహిళల దుస్థితి దారుణంగా ఉంది. భారత్ నుంచి పాక్ విడివడిన నాటి నుంచి అక్కడ హిందూ మహిళలపై అకృత్యాలు జరుగు తూనే ఉన్నాయి. పాక్లో మైనారిటీలుగా ఉన్న హిందువుల రక్షణకు సరైన చట్టాలు లేవు. హిందూ మహిళలు అత్యాచారాలు, కిడ్నాపులు, బలవంతపు మతమార్పిడుల బారిన పడి, సెక్స్ బానిసలుగా బతుకీడుస్తున్నారు. అక్కడ హిందూ మహిళలెవరూ తమకు వివాహం జరిగిందని నిరూపించుకోలేని దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఏ కారణంగా నైనా భర్త మరణిస్తే, అతని ఆస్తిపాస్తుల్లో వాటా కూడా అతని భార్యకు దక్కదు. కనీసం అక్కడి హిందువులకు పాక్ ప్రభుత్వం అందజేసే ’నేషనల్ డేటా బేస్ రెగ్యులేషన్ అథారిటీ’ గుర్తింపు కార్డులు పొందే వెసులుబాటు కూడా లేదు. పాక్–భారత్ దేశాల మధ్య ఎన్నోసార్లు చర్చలు జరిగాయి, జరు గుతున్నాయి. ఈ చర్చల్లో రాజకీయ ఎజెండా తప్ప, పాక్లోని హిందువుల రక్షణ మీద ఇప్పటి వరకు ఎందుకు చర్చలు జరుపలేదు? భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015 డిసెంబర్ 25న తన రష్యా, ఆప్ఘనిస్థాన్ పర్యటన ముగించుకొని న్యూఢిల్లీకి వస్తూ.. మార్గమధ్యంలో ఉన్నట్టుండి లాహోర్లో ల్యాండైపోయారు. మోదీ ఆకస్మికంగా లాహోర్లో అడుగుపెట్టడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. భారత్లో జిందాల్ గ్రూపు నకు చెందిన సజ్జన్ జిందాల్ అనే పారిశ్రామికవేత్త ఒత్తిడి మేరకే ఆయన పాకిస్తాన్ వెళ్లినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఏ దేశం వెళ్లినా అక్కడి ప్రవాస భారతీయులతో కలిపి ‘ఛాయ్ పే చర్చ’ పెట్టటం మోదీకి అలవాటు. హిందుత్వ ఎజెండాతోనే అధికారంలోకి వచ్చిన మోదీ∙పాక్ వెళ్లినప్పుడు అక్కడి హిందూవులను ఎందుకు కలవలేకపోయారు? అక్కడ వారికి జరుగు తున్న అన్యాయాలను ఎందుకు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు? ఆయన పాక్లో అడుగు పెట్టేటప్పటికే ఇరు దేశాలమధ్య ద్వైపాక్షిక చర్చలపై ప్రతిష్టంభనతోపాటు.. సరిహద్దుల్లో పాక్ రేంజర్లు య«థేచ్చగా కాల్పులకు తెగబడుతున్నారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొని వుంది. మోదీ పాక్ వెళ్లి, నాటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ను కలిసినప్పుడు కశ్మీర్ అంశాన్ని కనీసం ప్రస్తావించలేదు. 2014 నుంచి 2019 వరకు కశ్మీర్ రక్షణలో దాదాపు 900 మంది సైనికులు అశువులు బాశారు. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో అధి కారిక లెక్కల ప్రకారం 527 మంది సైనికులు చని పోయారు. 1,363 మంది గాయపడ్డారు. ఒకరు యుద్ధ ఖైదీగా చిక్కారు. మళ్లీ యుద్ధం వస్తే ఎంత మంది వీరుల ప్రాణాలను తింటుందో తెలియదు. సైనికుడు అంటే యుద్ధంలో ప్రాణాలు అర్పించే మర మనుషులు కాదు. వాళ్లకు భార్య పిల్లలు ఉన్నారు. వాళ్లకు ఓ కుటుంబం ఉంది. ఏడాదికి ఓ మారైనా వారి కుటుంబం ఆత్మీయ కౌగిలి కోరుకుంటుంది. ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం కశ్మీర్ అంశాన్ని అధి కార పీఠాన్నిచ్చే అక్షయ పాత్రగా చూడకుండా ఓ శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచన చేయాలి. వ్యాసకర్త : సోలిపేట రామలింగారెడ్డి, సీనియర్ జర్నలిస్టు, దుబ్బాక ఎమ్మెల్యే మొబైల్: 94403 80141 -
పుల్వామా దాడి తర్వాత: మోదీ 46.. రాహుల్ 23..!
సాక్షి, న్యూఢిల్లీ : కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఉగ్ర ఆత్మాహుతి దాడి అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి జాతీయవాదం గురించి పదే పదే వినిపించారు. మిగతా బీజేపీ నాయకులు కూడా పార్టీ కార్యక్రమాల్లో, సభల్లో జాతీయవాదం గురించే ఎక్కువగా మాట్లాడారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) కథనం ప్రకారం ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మార్చి 12వ తేదీ (26 రోజుల్లో) మధ్యన ప్రధాని నరేంద్ర మోదీ 46 కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన అనేక ప్రభుత్వం చేపట్టిన అభివద్ధి కార్యక్రమాలు, స్కీములు ప్రారంభించడంతోపాటు అవార్డుల కార్యక్రమాల్లో, మీడియా సమ్మేళనంలో పాల్గొన్నారు. ఇదే సమయంలో ఇదే కాలానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 23 కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ ట్విట్టర్ టైమ్లైన్ ప్రకారం వాటిలో 11 రాజకీయ ర్యాలీలు కాగా, రెండు విలేకరుల సమావేశాలు ఉన్నాయి. పార్టీ కార్యకర్తల సమావేశాల్లో, చిన్న, సూక్ష్మ కంపెనీల పారిశ్రామిక వేత్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చత్తీస్గఢ్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, పంజాబ్, గోవా.. మొత్తం 11 రాష్ట్రాల్లో పర్యటించారు. పుల్వామా ఉగ్ర దాడిలో కేంద్ర ప్రభుత్వ విభాగాల వైఫల్యాన్ని విమర్శించకుండా సంయమనం పాటించిన రాహుల్ గాంధీ తాను పాల్గొన్న పలు రాజకీయ సభల్లో పుల్వామా బాధితులకు నివాళులర్పించారు. ఫిబ్రవరి 26వ తేదీన భారత వైమానిక దళం పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకుపోయి జరిపిన బాంబు దాడుల సంఘటనను నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజకీయం చేయడం ప్రారంభించాకే రాహుల్ గాంధీ, అందులోని ఔచిత్యాన్ని, తీవ్రతను ప్రశ్నించారు. దాదాపు అన్ని సభల్లో ఆయన రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంలోని అవినీతిని, పెద్ద నోట్ల రద్దు వల్ల జరిగిన నష్టం, జీఎస్టీ భారం, రైతుల దుస్థితి, ఆదివాసీల భూమి హక్కుల గురించే ఎక్కువగా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కనీస ఆదాయ హామీ పథకాన్ని తీసుకొస్తుందని చెప్పారు. పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సైనికులు మరణిస్తే నరేంద్ర మోదీ ఓ డాక్యుమెంటరీ చిత్రీకరణలో నిమగ్నమయ్యారని కూడా రాహుల్ గాంధీ విమర్శించారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ అన్ని కార్యక్రమాల్లో ప్రభుత్వం చేపట్టిన అభివద్ధి కార్యక్రమాలతోపాటు ఉగ్రవాదాన్ని ప్రస్తావించారు. తాను ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు ప్రయత్నిస్తుంటే ప్రతిపక్షాలు తనను తప్పించేందుకు ప్రయత్నిస్తున్నాయంటూ విమర్శిస్తూ వచ్చారు. -
ఎవరు పదిలం?
ఓట్ల పండుగ రానే వచ్చింది..ఓటరు దేవుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు నాయక గణం.. మాటల మూటలు సిద్ధంచేసుకుంటుంటే.. ఐదేళ్ల పాలన సమీక్షకు, తప్పొప్పులలెక్కలకు సామాన్యుడూ రెడీ అవుతున్నాడు. దాయాది పాక్పై చేసిన సర్జికల్ స్ట్రైక్స్ ఓట్లు, సీట్లు తెచ్చిపెడతాయా...? చేసినవాగ్దానాలు నెరవేర్చలేదన్న అసంతృప్తి ఓటరులో ఎంతుంది? ఐదేళ్ల పాలన చివరి ఏడాదిలో రైతులపై కురిపించిన వరాల జల్లు ప్రభావం ఎంత? యువ ఓటర్ రూట్ ఎటు? ఎఫ్బీ, ట్విట్టర్ పక్షులైన నగర ప్రజల మది మెప్పించేదెవరు? తదితర పది అంశాలు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి. అవేమింటే.. బ్యాలెట్పై సర్జికల్ స్ట్రయిక్.. దశాబ్దాలుగా రగులుతున్న కశ్మీర్ సమస్య పరిష్కారానికి గత ప్రభుత్వాల కంటే భిన్నమైన మార్గం ఎంచుకున్న ఘనత మోదీదనడంలో సందేహం లేదు. చెప్పా పెట్టకుండా పొరుగుదేశంలో వాలిపోయి తేనీటి ఆతిథ్యం స్వీకరించడంతో మొదలైన మోదీ మార్కు దౌత్యం.. ఆఖరకు పుల్వామా ప్రతీకార దాడుల దశకు వచ్చేసింది. రెండేళ్ల క్రితం యూరి ఉగ్రవాద దాడికి ప్రతిగా చేసిన సర్జికల్ స్ట్రైక్స్ దేశవ్యాప్తంగా ఓ సంచలనం. 1990 ఎన్నికల కాలం నుంచి ఎన్నికల ముందు ఇరుదేశాల మధ్య కవ్వింపు చర్యలు.. కార్గిల్ లాంటి పరిమిత యుద్ధాలు కొత్త కాకపోయినా.. సరిహద్దులు దాటుకుని లోనికి చొచ్చుకుపోయి మరీ చేసిన బాలాకోట్ దాడులు సామాన్యుడికి ఒకింత ధైర్యం ఇచ్చాయనే చెప్పాలి. భద్రతా వైఫల్యమన్న ప్రతిపక్షాల మాటలను ఓటు వేసే సామాన్యుడు పట్టించుకునేది కొంతే. ఇటీవల జరిగిన కొన్ని సర్వేల్లోనూ బాలాకోట్ దాడులను దేశ రక్షణకు తీసుకున్న మేటి చర్యగా అభివర్ణించడం.. బీజేపీకి శుభసూచకమే. దృఢ, కఠిన నిర్ణయాలు తీసుకో గలిగిన నేత కావాలనుకునే వారు మోడీ వైపు మొగ్గుచూపితే.. శాంతి సామరస్యాలు కోరేవారు మరోలా ఆలోచించే అవకాశం ఉంది. పట్టాలెక్కని ఘట్బంధన్.. ఐదేళ్ల సుస్థిర ప్రభుత్వాన్ని అందించిన మోదీ ఇంకోసారి గద్దెనెక్కాలంటే... ఎన్డీయే కంటే ప్రత్యర్థి పార్టీల పొత్తులపై ఒక కన్నేసి ఉంచాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటారా? చాలా సింపుల్. గత ఎన్నికల్లో 282 సీట్లు సాధించిన బీజేపీ ఓట్ల శాతం కొంచెం అటుఇటుగా 31 శాతం మాత్రమే. కాంగ్రెస్తోపాటు అనేక ప్రాంతీయ పార్టీలు సొంతబలంతోనే పోటీ చేశాయి. ఫలితంగా బీజేపీ వ్యతిరేక ఓట్లు చెల్లా చెదురయ్యాయి. ఇది అర్థం చేసుకున్న ప్రతిపక్షాలు ఈసారి ఎక్కడికక్కడ పొత్తులతో మోదీని ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నాయి. యూపీలో బువా– భతీజా పేరుతో బీఎస్పీ, ఎస్పీలు జట్టు కట్టినా... పశ్చిమ బెంగాల్లో లెఫ్ట్తో కలిసి పోటీ చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతుండటం, తమిళనాడులో యూపీఏ భాగస్వామి డీఎంకే, కర్ణాటకలో జేడీ(ఎస్)తో దోస్తీలు ఇందుకోసమే అన్నది సుస్పష్టం. అయితే బీజేపీయేతర పార్టీలన్నింటినీ ఒక ఛత్రం కిందకు తెచ్చేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు అంతగా విజయవంతం కాలేదు. ఫలితంగా ఈ పొత్తుల వల్ల కాంగ్రెస్కు లాభించేది తక్కువే. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్కు మజ్లిస్తోపాటు మరికొన్ని పార్టీలు తోడైతే పరిస్థితి జటిలంగా మారుతుంది. ‘సోషల్’ యుద్ధాలు... ఒకప్పుడు ఎన్నికలంటే మైకులు, లౌడ్స్పీకర్లు... ర్యాలీలు, సభలు,సమావేశాలు!! ఊరొక్కటే కాదు.. దేశమంతా సందడే సందడి.. ఎన్నికల నియమావళి అనండి.. ఓటరు చైతన్యం అనండి.. ఇంకేదైనా చెప్పండిగానీ.. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లే వేదికగా ప్రచారం హోరెత్తుతోంది. ఈ అస్త్రాలన్నింటినీ ఎన్నికల రణరంగానికి పరిచయం చేసిన ఘనత బీజేపీదే అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రచారానికి మాత్రమే కాకుండా పార్టీ బలోపేతానికి.. ప్రజలతో మమేకమయ్యేందుకూ వాడుకుని బీజేపీ లబ్ధి పొందగా.. ఈ సారి పరిస్థితి భిన్నమైపోయింది. జాతీయపార్టీలతోపాటు ప్రాంతీయ పార్టీలు కూడా బీజేపీ చూపిన మార్గంలోనే సోషల్ బాట పట్టేయడం.. తమ వాదనను వినిపిస్తూనే ప్రత్యర్థులపై విమర్శలు సంధించడం మొదలుపెట్టేశాయి. తప్పుడు వార్తలు ఓటరును ముంచెత్తేశాయి కూడా. అయితే అమెరికా ఎన్నికల్లో చెలరేగిన వివాదాలను దృష్టిలో ఉంచుకుని సోషల్ మీడియా ప్లాట్ఫాంలు మన ఎన్నికల్లో కొన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి. ఫేక్ న్యూస్తోపాటు అభ్యంతకరమైన పోస్టులను తొలగించేందుకు, నియంత్రించేందుకు ఫేస్బుక్, ట్విట్టర్తోపాటు ఇతర ప్లాట్ఫాంలు కూడా ప్రత్యేక అధికారులను నియమించడం, ప్రభుత్వంతో సహకరించేందుకు అంగీకరించడంతో ఈ సారి సోషల్ మీడియా వార్ కాస్తాఆసక్తికరంగా మారింది!! ఆ గట్టునుంటావా..ఈ గట్టునుంటావా? గత ఐదేళ్లలో దేశం వర్గాలుగా చీలిపోయాయి అని కొంతమందిఅంటూ ఉంటారు. ప్రభుత్వం పనితీరును ప్రశ్నిస్తున్న వారిని అర్బన్ నక్సలైట్లు.. సిక్యులరిస్ట్లు, దేశద్రోహుల్లాంటిబోలెడన్ని పేర్లు పెట్టి ఎద్దేవా చేయడంతోమొదలైన ఈ వర్గీకరణ ఎన్నికలసమయానికి పూర్తిస్థాయికి చేరుకుంది. గత ఎన్నికల సమయానికి ఈ పద్ధతిబీజేపీకి అనుకూలంగానూ, కాంగ్రెస్కు వ్యతిరేకంగానూ పనిచేసింది కూడా.పాకిస్తాన్, జమ్మూ కశ్మీర్ల పేరిటకొన్ని చోట్ల దేశభక్తిని ప్రేరేపించడం.. ఆవుల సంరక్షణ పేరుతో సమాజంలోని కొన్ని వర్గాల వారిని లక్ష్యంగా చేసుకుని దాడులు జరగడం ఆయా వర్గాల వారు మోదీకి దూరమయ్యేందుకు కారణాలవుతున్నాయి. ఈ లోటును అధిగమించే ఉద్దేశంతోనే పదవీకాలం చివరిదశలో మోదీ సర్కారు బాలాకోట్ దాడులను వాడుకుంటుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే మైనార్టీ ఓటర్లు వ్యతిరేకంగా పడితే ఎన్డీయేకు సమస్యలు తప్పవన్నది కొంతమంది రాజకీయ విశ్లేషకుల అంచనా. నోట్ల రద్దు.. ఓట్ల పద్దు! పెద్దనోట్ల రద్దు... దేశమంతటా ఏకరీతి పన్నులు.. ఐదేళ్ల మోదీ పాలనలో తీసుకున్న కీలకమైన ఆర్థిక విధాన నిర్ణయాలు. గత ఎన్నికల్లో ద్రవ్యోల్బణ ప్రభావంతో నిత్యావసరాల ధరలు కొండెక్కడం అతిపెద్ద ఎన్నికల అంశంగా మారితే... ఈసారి ఎన్నికల్లో దీని ప్రస్తావన కూడా వచ్చే అవకాశాలు లేకుండా పోయాయి. ఇటీవలి కాలంలో ద్రవ్యోల్బణం నెగటివ్ స్థాయికి పడిపోవడం ఇందుకు కారణం. అయితే వ్యవసాయ ఉత్పత్తుల ధరలను అణగదొక్కడం ద్వారా సాధించిన ఈ నెగటివ్ ద్రవ్యోల్బణం గాలిబుడగ చందమన్నది ప్రత్యర్థుల వాదన. నగరాల్లో ధరలు పెద్దగా పెరగకపోవడం గ్రామీణ ప్రాంతాల్లో విపరీతమైన అసంతృప్తికి కారణమైందని... దీని ప్రభావం బీజేపీపై ఉంటుందని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. పేదరిక నిర్మూలనకు దేశం కనీసం ఏడు శాతం వృద్ధి రేటు సాధించాలన్నది నిపుణుల అభిప్రాయం. అయితే.. పెద్దనోట్ల రద్దు... జీఎస్టీ అమల్లో ఒడిదుడుకుల కారణంగా వృద్ధి రేటు ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. ఆర్థిక వృద్ధి సూచీల లెక్కల్లో తరచూ జరిగిన మార్పులు ప్రభుత్వ విశ్వసనీయతపై అనుమానాలు రేకెత్తించాయి. ఇదే సమయంలో విదేశీ పెట్టుబడులు ఆశించినంత రాకపోవడం.. వ్యవసాయ, తయారీ రంగం మందగతిలో సాగుతూండటం కూడా ఎన్నికలపై ప్రభావం చూపనున్నాయి. మోదీ వర్సెస్ రాహుల్గాంధీ... గత ఎన్నికల్లో దేశం మొత్తం మోదీ హవాపై నడిచిపోతే.. ఈసారి మాత్రం పరిస్థితుల్లో కొంత మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగానూ ఎన్నికలు ఎదుర్కోబోతున్న రాహుల్ గాంధీలో రాజకీయంగా వచ్చిన పరిణతి ఇందుకు కారణం. సోషల్మీడియాలో పప్పుగా అందరినోళ్లల్లోనూ నానిన రాహుల్... ఆ బరువును దించేసుకుని సరికొత్త అవతారమెత్తేందుకు కొంత సమయం పట్టినా... ఆ తరువాతి కాలంలో వేర్వేరు అంశాలను లేవనెత్తే విషయంతోపాటు పదునైన విమర్శలు సంధించడంలోనూ చురుకుగా ఉన్నాడని పరిశీలకులే అంటున్నారు. కాపలాదారుడినన్న మోదీ వ్యాఖ్యను కాపలాదారుడే దొంగ (చౌకీదార్ చోర్ హై) అని తిప్పి కొట్టడం.. జీఎస్టీని గబ్బర్ సింగ్ ట్యాక్స్గా అభివర్ణించడం... రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు వివాదాన్ని భిన్న కోణాల్లో ప్రజల్లో చర్చకు ఉంచడం రాహుల్ పప్పు కాదనేందుకు తాజా ఉదాహరణలన్నది వీరి అంచనా. మరి ఇవన్నీ కాంగ్రెస్కు లాభిస్తాయా? అంటే వేచిచూడాల్సిందేనన్న సమాధానం వీరి నుంచి వస్తోంది. ఎందుకంటే అమిత్ షా వ్యూహ చతురత, పార్టీ సంస్థాగత నిర్మాణం తదితరరాలు బీజేపీకి మేలు చేయవచ్చునని అంటున్నారు. తిరగబడిన రైతన్న లక్షల మంది రైతులు కాలికి చెప్పుల్లేకుండా ముంబై వీధుల్లో నిరసన గళం ఎత్తడం.. ప్రధాని నరేంద్రమోదీ ఇంటికి దగ్గర్లోని జంతర్ మంతర్ వద్ద నెలల తరబడి... రోజుకో రీతిలో నిరసన వ్యక్తం చేయడం.. మధ్యప్రదేశ్లోని మాండోసర్లో గిట్టుబాటు ధరల కోసం ఉద్యమించిన రైతులపై కాల్పులు... ఈ ఐదేళ్లలో రైతుల ధర్మాగ్రహానికి కొన్ని మచ్చుతునకలు. మునుపెన్నడూ లేనంతగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుదేలైందన్న ఆర్థికవేత్తల అంచనాలు ఎన్నికల్లో ఏ రకమైన ప్రభావం చూపనున్నాయనేది ఆసక్తికరంగా మారింది. 2016 నాటి పెద్దనోట్ల రద్దు ప్రభావంతో రైతు కూలీలు ఉపాధి కోల్పోయారన్న అంచనాలు అప్పట్లో చాలానే వచ్చాయి. పంటకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయడంలో జాప్యం జరగడం.. ఆ తరువాత కొన్ని మార్పులు చేర్పులతో వాటిని అమల్లోకి తేవడం రైతును ఏ మాత్రం సంతృప్తి పరచలేకపోయాయి. వ్యవసాయ రంగంలో పెట్టుబడుల మాట సరేసరి! గత నవంబరు, డిసెంబరులలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్కు ఆధిక్యం వచ్చేందుకు కూడా గ్రామీణ ఓటర్ల అసంతృప్తి కారణమని విశ్లేషకుల అంచనా. నష్ట నివారణ చర్యల్లో భాగంగానే మోదీ సర్కారు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లోనూ పెట్టుబడి సాయంతో రైతుల మనసు గెలుచుకునే ప్రయత్నం చేసిందని అంచనా. ఈ చర్యలతో రైతు శాంతిస్తాడా అన్నది ఇప్పుడు ఆసక్తికరం. 2009నాటితో పోలిస్తే బీజేపీ గ్రామీణ ప్రాంత ఓట్ల శాతం 21 నుంచి 30కు చేరుకోగా.. అత్యధిక ఓట్లు, సీట్లు గెలిచింది మాత్రం నగర, పట్టణ ప్రాంతాల్లోనే కావడం ప్రస్తావించాల్సిన అంశం. ఉద్యోగాలెక్కడ? ఏటా రెండు కోట్ల కొత్త ఉద్యోగాలన్న నినాదంతో 2014 ఎన్నికల బరిలోకి దిగిన ఎన్డీయే ఈ ఐదేళ్ల కాలంలో ఆ వాగ్దానాన్ని ఎంతమేరకు నిలబెట్టుకుందన్న విషయంలో చాలా సందేహాలు ఉన్నాయి. ప్రభుత్వ అంచనాల మేరకు కూడా నిరుద్యోగిత ఐదేళ్లలో గరిష్టస్థాయికి చేరడం కమలనాథులకు కొంత ఆందోళన కలిగించే అంశమే. పెద్దనోట్ల రద్దుతో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కుదేలైపోయాయని, కోట్ల మంది చిరు ఉద్యోగులు ఉపాధి కోల్పోయారన్న ప్రతిపక్షాల విమర్శలను పాలకపక్షం ఒకదశలో ఎద్దేవా చేసింది కూడా. పకోడీలు అమ్ముకోవడమూ ఒక ఉద్యోగమే అని అమిత్ షా లాంటి వారు చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ప్రభుత్వం సమస్య తీవ్రతను అర్థం చేసుకోకుండా సమాచారాన్ని వక్రీకరించి తనకు అనుకూలంగా మార్చుకుందన్న ఆరోపణలూ వచ్చాయి. ఉద్యోగాల సంఖ్య పెరిగిందనేందుకు నిదర్శనంగా ప్రభుత్వం పీఎఫ్ ఖాతాదారుల సంఖ్య పెరగడాన్ని, ముద్ర రుణాలను చూపితే.. ఇవేవీ వాస్తవ పరిస్థితికి అద్దం పట్టవని ప్రతిపక్షం పెదవి విరిచేసింది. ఇండియా టుడే ఇటీవల నిర్వహించిన ఒక సర్వే కూడా ఈ ఎన్నికల్లో ఉద్యోగాల కల్పన అన్నది అతిపెద్ద అంశంగా నిలుస్తుందని తేల్చడం గమనార్హం. భారతీయ రైల్వే గత ఏడాది 63 వేల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తే.. ఏకంగా కోటీ 90 లక్షల మంది దరఖాస్తు చేయడం మహారాష్ట్రలో ఐదంటే ఐదు ఆఫీస్ బాయ్ ఉద్యోగాలకు 23 వేల మంది పట్టభద్రులు, ఇంజనీరింగ్ చదివిన వారు దరఖాస్తు చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. ఏటా దాదాపు పది లక్షల మంది చదువులు ముగించుకుని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుండగా.. అదేస్థాయిలో ఉద్యోగాలు లేవన్నది మాత్రం నిష్టూర సత్యం. మోదీ సర్కారు ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియాలు కూడా తగినన్ని ఉద్యోగాలు కల్పించలేకపోయాయని.. ఈ పరిస్థితి జాతీయ విపత్తుకు ఏమాత్రం తక్కువ కాదని ప్రతిపక్ష కాంగ్రెస్ మండిపడుతోంది. ఈ అంశాలన్నీ ఈసారి ఓటు వేసే యువతీయువకులపై కచ్చితంగా ప్రభావం చూపుతాయని నమ్ముతోంది. దళితులు.. గిరిజనులు... కొన్నేళ్ల క్రితం ఉత్తర ప్రదేశ్లోని ఉన్నావ్ గ్రామం పతాకశీర్షికలకు ఎక్కింది. గో సంరక్షణ పేరుతో కొంతమంది దళితులపై దాడిచేయడంతో వివాదం మొదలైంది. ఈ సంఘటనను నిరసిస్తూ గుజరాత్లో జిగ్నేష్ మెవానీ లాంటి వారు భారీ ర్యాలీలు నిర్వహించడం.. జంతు కళేబరాలను తొలగించే పనిని బహిష్కరించాలన్న మెవానీ పిలుపునకు మంచి స్పందన రావడం మోదీ ప్రభుత్వానికి.. దళితులకు మధ్య అంతరం పెరుగుతోందనేందుకు నిదర్శనంగా మారింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల ఆత్మహత్య.. అతడి కులంపై వివాదాలు కూడా ఎన్డీయే సర్కారుకు ప్రయోజనమైతే కలిగించలేదు. తరువాతి కాలంలోనూ అనేక అంశాలు బీజేపీ అగ్రవర్ణాలకు కొమ్ముకాస్తుందనే భావనను కల్పించాయని.. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టాల పదును తగ్గించడం లాంటివి ఇందుకు ఉదాహరణ అని విశ్లేషకులు చెబుతారు. అయితే ఆర్ఎస్ఎస్ వనవాసీ కళ్యాణ్ ఆశ్రమ్ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమాలు గిరిజనులను బీజేíపీకి దగ్గర చేసే ప్రయత్నం చేసింది. కానీ గిరిజనులు ఎక్కువగా ఉన్న ఛత్తీస్గఢ్లో బీజేపీ ఓటమిపాలవడం, భూ యాజమాన్య హక్కుల చట్టంలో మార్పుల ద్వారా జార్ఖండ్లోనూ గిరిజనులు అసంతృప్తికి గురికావడం బీజేపీకి పడే ఈ వర్గాల ఓట్లపై ప్రభావం చూపనున్నాయని అంచనా వేస్తున్నారు. అడవుల్లో నివసిస్తున్న దాదాపు పదిలక్షల కుటుంబాలను అక్కడి నుంచి తరలించాలన్న సుప్రీంకోర్టు తాజా ఉత్త్తర్వు బీజేపీకి గోరుచుట్టుపై రోకటిపోటు అన్నచందంగా మారిపోయింది. ఆమె.. ఎటువైపు? గత ఐదేళ్లలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు తీవ్ర రూపం దాల్చాయి. ముఖ్యంగా మహిళా రైతులు, కూలీలు నిరసన ప్రదర్శనలకు దిగుతున్నారు. పల్లెల్లో బిందెడు నీళ్ల కోసం మైళ్లకి మైళ్లు నడిచే పరిస్థితులు తొలగిపోలేదు. ఇక మహిళలపై నేరాలు ఘోరాల సంగతి చెప్పక్కర్లేదు. భారత్లో మహిళలకు భద్రత కరువైందని విమర్శలు వస్తున్నాయి. ఇటీవల మహిళల్లో ఓటు హక్కుపై చైతన్యం బాగా పెరిగింది. కొన్ని రాష్ట్రాల్లో వారి ఓటింగ్ శాతం పురుషుల కంటే అధికంగా ఉంది. మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రభుత్వం బేటీ బచావో, బేటీ పడావో, మహిళలకు ఉచితంగా గ్యాస్ స్టౌలు పంపిణీ చేసే ఉజ్వల్ పథకం, స్వచ్ఛభారత్లో భాగంగా మరుగుదొడ్లు కట్టి ఇవ్వడం వంటి చర్యలు చేపట్టింది. కానీ మహిళా రిజర్వేషన్ బిల్లును మాత్రం ఇంకా త్రిశంకు స్వర్గంలోనే ఉంచింది. మరి 43 కోట్ల మంది మహిళా ఓటర్లు ఈసారి ఎవరి వైపు ఉంటారు? ఇప్పుడిదే మిలియన్ డాలర్ల ప్రశ్న. -
భారత్ మా అనుమతి తీసుకుంది: ఐసీసీ
-
అనంత్నాగ్ సీటుకు ఎందుకు ఎన్నికలు?
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రం పాలనలో ఉన్న జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి ఇప్పుడు ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని, శాంతి భద్రతల పరిస్థితులు అందుకు అనుకూలించడం లేదని ఆదివారం ఎన్నికల షెడ్యూల్ ప్రకటన సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా సునీల్ అరోరా చెప్పారు. అలాంటప్పుడు 2016 నుంచి ఖాళీగా ఉన్న అనంత్నాగ్ లోక్సభ స్థానానికి ఎందుకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు ? 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను బలిగొన్న ఉగ్ర ఆత్మాహుతి దాడి జరిగిన పుల్వామా జిల్లా కూడా ఈ లోక్సభ నియోజక వర్గం పరిధిలోనే ఉంది. శాంతి భద్రతల దృష్ట్యా అనంత్నాగ్ నియోజక వర్గానికి మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. కల్లోలిత కశ్మీర్ అయినాసరే, మూడు విడతలుగా ఓ నియోజక వర్గానికి ఎన్నికలు నిర్వహించడం అన్నది అసాధారణ విశయం. ఇక్కడ శాంతి భద్రతల పరిస్థితి సవ్యంగా లేదన్నప్పుడు ఎందుకు అనంత్నాగ్ లోక్సభ స్థానానికి ఎన్నికలు నిర్వహిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్కు చెందిన సీనియర్ నాయకుడు మొహమ్మద్ సాగర్ ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి కావాలనుకున్న మెహబూబా ముఫ్తీ రాష్ట్ర అసెంబ్లీకి పోటీ చేసేందుకు ఈ లోక్సభ స్థానానికి రాజీనామా చేశారు. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ప్రముఖ హిజుబుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వాని మరణించడంతో ఈ నియోజకవర్గంలో నిరసనలు, ఘర్షణలు, కాల్పులు చోటుచేసుకొని పలువురు పౌరులు మరణించారు. దాంతో అప్పట్లో ఎన్నికలు నిర్వహించ కూడదని అనుకున్నారు. 2017, ఏప్రిల్ నెలలో అనంత్నాగ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించానుకున్నారు. అప్పుడు తలెత్తిన అల్లర్లలో ఎనిమిది మంది పౌరులు మరణించారు. దాంతో ఈ ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేశారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు నిర్వహించడం వెనక దురుద్దేశం ఉందని బీజేపీయేతర పార్టీలు విమర్శిస్తున్నారు. కశ్మీర్ ప్రజలు ఈ ఎన్నికలను పెద్ద ఎత్తున బహిష్కరిస్తారుకనుక, కొద్ది మంది బీజేపీ కార్యకర్తల ఓటింగ్తో ఈ సీటును అతి సులభంగా దక్కించుకోవచ్చన్నది బీజేపీ వ్యూహమని ఆ పార్టీలు విమర్శిస్తున్నారు. -
హే పాక్.. వాళ్లు మా అనుమతి తీసుకున్నారు!
దుబాయ్ : పుల్వామా ఉగ్రదాడి అమర జవాన్ల స్మారకార్థం టీమిండియా ఆటగాళ్లు మిలిటరీ క్యాపుల ధరించడాన్ని తప్పుబడుతూ గగ్గోలు పెట్టిన దాయాదీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. ఇటీవల ఆస్ట్రేలియాతో రాంచీ వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత ఆటగాళ్లు ఆర్మీ క్యాప్లు ధరించడంతో పాటు తమ మ్యాచ్ ఫీజును నేషనల్ డిఫెన్స్ ఫండ్కు విరాళంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని భూతద్దంలో చూసిన పీసీబీ భారత క్రికెట్ నియంత్రణ మండలి బోర్డు(బీసీసీఐ) క్రికెట్ను స్వార్థ రాజకీయాలకు వాడుకుంటోందని ఆరోపిస్తూ ఐసీసీకీ ఫిర్యాదు చేసింది. గతంలో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఇమ్రాన్ తాహిర్, మొయిన్ అలీ మైదానంలో రాజకీయాల గురించి మాట్లాడరని, వారిపై ఐసీసీ తీసుకున్న చర్యలే టీమిండియా ఆటగాళ్లపై కూడా తీసుకోవాలని పీసీబీ చైర్మన్ ఎహ్సాన్ మణి డిమాండ్ చేశారు. క్రికెట్లో రాజకీయాలను మిళితం చేసి బీసీసీఐ తనకు ఉన్న విశ్వసనీయతను కోల్పోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే పీసీబీ లేఖపై ఐసీసీ స్పందించింది. ఉగ్రదాడిలో అమరులైన సైన్యానికి నివాళులుగా ఆర్మీ క్యాప్లతో బరిలోకి దిగుతున్నట్లు బీసీసీఐ తమ దగ్గర అనుమతి తీసుకుందని స్పష్టం చేసింది. దీనికి ఐసీసీ కూడా సమ్మతం తెలిపిందని ఓ ప్రకటనలో పేర్కొంది. బీసీసీఐ.. ఐసీసీ దగ్గర అనుమతి తీసుకున్న ఉద్దేశానికి.. ఆచరణకు చాలా తేడా ఉందని, ఈ విషయంలో తమ లాయర్లతో చర్చించి ఐసీసీకి మరోసారి లేఖ రాస్తామని పీసీబీ పేర్కొంది. -
‘పుల్వామా’ సూత్రధారి హతం
శ్రీనగర్: పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను బలిగొన్న పుల్వామా దాడికి సూత్రధారిగా భావిస్తున్న ఉగ్రవాది ముదాసిర్ అహ్మద్ ఖాన్ను భద్రతా బలగాలు ఎన్కౌంటర్లో సోమవారం మట్టుపెట్టాయి. ఈ ఘటనలో మరణించిన మరో ఉగ్రవాదిని పుల్వామా దాడిలో వాడిన మినీ వ్యానును కొనుగోలు చేసిన సజ్జద్ భట్ అని భావిస్తున్నారు. పుల్వామా జిల్లా పింగ్లిష్లో ఆదివారం సాయంత్రం ప్రారంభమైన ఎన్కౌంటర్ సోమవారం వేకువజాము వరకు సాగింది. ఉగ్రవాదులు దాక్కున్న ఇంట్లో లభ్యమైన సామగ్రి, ఆధారాల్ని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కి అందజేస్తామని కశ్మీర్ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సుదీర్ఘ ఎన్కౌంటర్.. పింగ్లిష్లో ఉగ్రవాదులు సంచరిస్తున్నారని సమాచారం అందడంతో ఆదివారం సాయంత్రం నుంచే భద్రతా బలగాలు అక్కడ సోదాలు ముమ్మరం చేశాయి. తొలుత ముష్కరులు కాల్పులకు దిగడంతో భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. దీంతో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. సుదీర్ఘంగా కొనసాగిన ఎన్కౌంటర్ ముగిసిన తరువాత సంఘటనా స్థలంలో ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలను గుర్తించారు. అందులో ఒకరు పుల్వామా మాస్టర్మైండ్ ముదాసిర్ అహ్మద్ ఖాన్ కాగా, రెండో వ్యక్తి వివరాలు స్పష్టంగా తెలియరాలేదు. అతడిని పుల్వామా దాడికి 10 రోజుల ముందే, ఆ వాహనాన్ని కొనుగోలు చేసిన సజ్జద్ భట్గా భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రెండో ఉగ్రవాదిగా భావిస్తున్న సజ్జద్ భట్ వివరాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదని, అతడు పాకిస్తానీయుడు అని భావిస్తున్నట్లు కశ్మీర్ రేంజ్ ఐజీ స్వయం ప్రకాశ్ పాణి చెప్పారు. ఎలక్ట్రీ్టషియన్ నుంచి ఉగ్రవాదిగా పుల్వామా నివాసి అయిన 23 ఏళ్ల ముదాసిర్ అహ్మద్ ఖాన్ డిగ్రీ పూర్తిచేసి ఎలక్ట్రీషియన్గా పనిచేశాడు. 2017లో జైషేలో సాధారణ కార్యకర్తగా చేరి తరువాత నూర్ మహ్మద్ తంత్రాయ్ ప్రేరణతో ఉగ్రవాదిగా మారాడు. అదే ఏడాది డిసెంబర్లో తంత్రాయ్ హతమయ్యాక 2018 జనవరిలో ఇంటి నుంచి పరారై క్రియాశీలకంగా మారాడు. 2018, ఫిబ్రవరిలో ఆరుగురు భద్రతా సిబ్బందిని బలితీసుకున్న సుంజవాన్ ఆర్మీపై దాడిలో అతని పాత్ర ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ ఘటనకు నెల రోజుల ముందు ఐదుగురు సీఆర్పీఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన లీత్పురా దాడిలోనూ అతని ప్రమేయం ఉన్నట్లు తెలిసింది. -
శవాలు కాల్చి.. నదిలో పడేసి!
న్యూఢిల్లీ: బాలాకోట్ వైమానిక దాడిలో తమవైపు పెద్దగా నష్టం జరగలేదని చెప్పుకుంటున్న పాకిస్తాన్ది వట్టి బుకాయింపేనని తేటతెల్లమైంది. ఫిబ్రవరి 26న భారత వైమానిక దళం ఉగ్ర శిబిరాలపై బాంబులు జారవిడిచిన తరువాత పాకిస్తాన్ ఆర్మీ రంగంలోకి దిగి ముష్కరుల మృతదేహాల్ని కాల్చివేసి సమీపంలోని నదిలో పడేసిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు వెల్లడించాడు. భారత వైమానిక దళం దాడి ఆనవాళ్లను కప్పిపుచ్చుకునేందుకు పాకిస్తాన్ చేసిన ప్రయత్నాల్ని అతడు పూసగుచ్చాడు. సుమారు 3 నిమిషాల వ్యవధి గల ఆ వీడియోను రిపబ్లిక్ టీవీ తాజాగా వెలుగులోకి తెచ్చింది. ఆధారాల్ని మాయం చేసేందుకు బాలాకోట్ గ్రామానికి వచ్చిన పాకిస్తాన్ ఆర్మీ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి వారి ఫోన్లు లాక్కున్నట్లు తెలిసింది. దాడికి సంబంధించి ఎలాంటి వీడియోలు, ఫొటోలు బయటికి రాకుండా ఇంటర్నెట్ సేవల్ని కూడా నిలిపేసినట్లు వీడియోలో ఉంది. బాలాకోట్ దాడి తరువాత ఉగ్రవాదులకు భయం పట్టుకుందని, వారంతా అఫ్గానిస్తాన్–వజీరిస్తాన్ సరిహద్దులోకి పారిపోయారని ప్రత్యక్ష సాక్షి అందులో చెప్పారు. బాలాకోట్ సమీప నివాసిగా భావిస్తున్న సదరు వ్యక్తి ఈ దాడిలో మొత్తం ఎందరు హతమయ్యారో వెల్లడించకున్నా అందులో కొందరు తనకు తెలుసని, వారి చరిత్రతో సహా పేర్లు చదివి వినిపించాడు. వీడియోలో చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. అమానవీయంగా వ్యవహరించిన సైన్యం.. భారత వైమానిక దళం మిగిల్చిన నష్టాన్ని కప్పిపుచ్చుకునేందుకు పాకిస్తాన్ ఆర్మీని రంగంలోకి దింపారు. బాలాకోట్ను పూర్తిగా తమ అదుపులోకి తీసుకున్న సైన్యం స్థానికులను భయపెట్టింది. వారి మొబైల్ ఫోన్లను లాక్కుంది. గాయపడిన ఉగ్రవాదుల పట్ల అమానవీయంగా వ్యవహరిస్తూ వారికి చికిత్స అందించడానికి వైద్యులను కూడా అనుమతించలేదు. వైద్యం అందించాలని వారు ఎంతో ప్రాధేయపడినా కనికరించలేదు. కార్ల నుంచి తీసిన పెట్రోల్తో చాలామటుకు శవాల్ని మూకుమ్మడిగా తగలబెట్టారు. మరి కొన్నింటిని సంచుల్లో చుట్టి సమీపంలోని కున్హర్ నదిలో పడేశారు. మృతిచెందిన ఉగ్రవాదుల్లో చాలా మంది జైషే సభ్యులే. ప్రాణాలతో బయటపడిన వారిని వెంటనే అఫ్గానిస్తాన్–వజీరిస్తాన్ సరిహద్దుకు తరలించారు. ఈ దాడితో ఐఎస్ఐ, జైషే సభ్యులను భయం పట్టుకుంది. ఫొటోలు, వీడియోలు బయటికి రాకుండా నివారించేందుకు అక్కడ మొబైల్, ఇంటర్నెట్ సేవల్ని నిలిపేశారు. అయినా కొన్ని చిత్రాలు వెలుగుచూశాయి. పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్ర శిబిరాలపై భారత్ ఇలాగే దాడికి దిగుతూ ముష్కరులను చంపుతూ ఉంటే, మాకు త్వరలోనే ఉగ్రవాదం బెడద తొలగిపోతుంది. అక్కడ 263 మంది ఉగ్రవాదులు భారత యుద్ధవిమానాలు దాడికి దిగడానికి ఐదు రోజుల క్రితం బాలాకోట్ శిబిరంలో 263 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు తెలిసింది. ఆ సమయంలో ముష్కరులకు శిక్షణ ఇచ్చేందుకు 18 మంది సీనియర్ కమాండర్లు అక్కడే ఉన్నట్లు టైమ్స్ నౌ మీడియా తెలిపింది. ప్రాథమిక శిక్షణకు 83 మంది, అడ్వాన్స్ శిక్షణకు 91 మంది, ఆత్మాహుతి దాడిలో శిక్షణకు 25 మంది ఆæ శిబిరానికి వచ్చినట్లు వెల్లడించింది. మరో 18–20 మంది దాకా వంటగాళ్లు, క్షురకులు, ఇతర సిబ్బంది ఉన్నట్లు పేర్కొంది. బాలాకోట్లో 263 మంది ఉగ్రవాదులు ఆవాసం పొందుతున్నట్లు ధ్రువీకరించుకున్న తరువాతే వైమానిక దళం దాడికి దిగిందని తెలిపింది. అక్కడ 300 ఫోన్లు క్రియాశీలకంగా ఉన్నాయని కేంద్ర హోం శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, వైమానిక దాడిలో కనీసం నలుగురు పాకిస్తాన్ సైనికులు కూడా మృత్యువాతపడినట్లు తెలిసింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)పోలీసులు, బాలాకోట్ మత గురువులకు ఫోన్చేయగా భారత వైమానిక దళం బాంబులు జారవిడిచిన సంగతి నిజమేనని చెప్పినట్లు ఇండియా టుడే టీవీ తెలిపింది. -
ఎన్కౌంటర్లో పుల్వామా ఉగ్రదాడి నిందితుడు హతం
-
ఉగ్ర నీడలను పసిగడుతూ పంజా..
సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు నేలకొరిగిన నేపథ్యంలో పాకిస్తాన్లోని బాలకోట్లో జైషే మహ్మద్ ఉగ్ర శిబిరంపై భారత వైమానిక దళం జరిపిన దాడుల్లో 263 మంది ఉగ్రవాదులు మరణించినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేశాయి. మృతుల్లో దాదాపు 18 నుంచి 20 మంది ఉగ్రవాదులకు సాయం అందించేందుకు వచ్చిన క్షురకులున్నారని సమాచారం. ఉగ్రవాదుల కదలికలను ఐదు రోజుల పాటు గ్రౌండ్ ఇంటెలిజెన్స్ ద్వారా పసిగట్టిన తర్వాత ఫిబ్రవరి 26న తెల్లవారుజామున మెరుపు దాడులతో విరుచుకుపడినట్టు వైమానిక దళ వర్గాలు చెబుతున్నాయి. ఉగ్ర కదలికలపై ఆరా.. బాలకోట్లోని జైషే మహ్మద్ ఉగ్రవాదుల శిబిరంలో నాలుగు భవనాల్లో సమావేశమైన టెర్రరిస్టుల సంఖ్యపై ఇంటెలిజెన్స్ వర్గాలు వివరాలు వెల్లడించాయి. దౌరా ఈ మౌలాత్ అనే భవనంలో 30 మంది టెర్రరిస్టులు సమావేశమయ్యారని, ఫిబ్రవరి 25న బాలకోట్లో ఉగ్రవాదులకు శిక్షణ కార్యక్రమం ప్రారంభమైనట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఆత్మాహుతి దాడులకు ప్రణాళిక దౌరా ఈ ఖాస్ అనే భవనంలో ఫిబ్రవరి 26న 91 మంది ఉగ్రవాదుల భేటీలో భారత్లో ఆత్మాహుతి దాడులకు పాల్పడేందుకు 25 మంది ఉగ్రవాదులకు ఈ శిబిరంలో శిక్షణ కోసం ఎంపిక చేసినట్టు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. ఇక ఫిబ్రవరి 14న పుల్వామాలో ఉగ్రదాడి అనంతరం ఇతర ప్రాంతాలకు వెళ్లి ఐదు రోజుల్లో ఫిబ్రవరి 19న తిరిగి బాలకోట్లోని ఉగ్ర స్ధావరానికి టెర్రరిస్టులు చేరుకున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఇదే స్ధావరంలో ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చేందుకు 18 మంది సీనియర్ కమాండర్లను ఈ శిబిరానికి జైషే చీఫ్ పంపినట్టు ఇంటెలిజెన్స్ వర్గాల పసిగట్టాయి. ఉగ్ర కదలికలపై అనుక్షణం నిఘా వేసి ఉగ్రవాదులకు భారీ నష్టం కలిగించేలా మెరుపు దాడులతో వైమానిక దళం ఫిబ్రవరి 26 తెల్లవారుజామున విరుచుకుపడింది. -
అజిత్ దోవల్పై ఆరోపణలు తోసిపుచ్చిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ : జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ను 1999లో భారత్ విడుదల చేయడంలో ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాత్ర గురించి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసిన నేపథ్యంలో మసూద్ అజర్ను అప్పటి వాజ్పేయి ప్రభుత్వం విడుదల చేసిన వ్యవహారంలో అజిత్ దోవల్కు ఎలాంటి ప్రమేయం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 1999లో ఇంటెలిజెన్స్ బ్యూరోలో సీనియర్ అధికారిగా ఉన్న అజిత్ దోవల్.. మసూద్ అజర్ విడుదలపై సంప్రదింపులు జరిపేందుకు కాందహార్కు వెళ్లిన నలుగురు సభ్యులతో కూడిన కమిటీలో ఒకరు. అజర్ విడుదలను దోవల్ అప్పట్లో వ్యతిరేకించారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కాగా కాందహార్లో విడుదల చేసిన ముగ్గురు ఉగ్రవాదుల వెంట అజిత్ దోవల్ ఉన్న ఫోటోలను కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడిపై ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించిన రాహుల్ ఈ దాడిలో 40 మంది జవాన్ల ప్రాణాలు కోల్పోయాయని, వారిని హత్య చేసిన మసూద్ అజర్ను ఎవరు విడుదల చేశారో వారి కుటుంబాలకు ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మసూద్ అజర్తో పాటు ముగ్గురు ఉగ్రవాదులను పాకిస్తాన్కు అప్పగించేందుకు కాందహార్లో అజిత్ దోవల్ నెరిపిన ఒప్పందం గురించి కూడా వారికి చెప్పాలని రాహుల్ నిలదీశారు. -
పుల్వామా ఉగ్రదాడి: సూత్రధారి హతం
శ్రీనగర్ : పుల్వామా ఉగ్ర దాడికి ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న జైషే ఉగ్రవాది ముదస్సర్ అహ్మద్ ఖాన్ అలియాస్ మహ్మద్ భాయ్ దక్షిణ కశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించాడని అధికారులు పేర్కొన్నారు. ఈ ఎన్కౌంటర్లో మరణించిన ముగ్గురు ఉగ్రవాదుల్లో పుల్వామా దాడి సూత్రధారి, 23 ఏళ్ల ఎలక్ర్టీషియన్ మహ్మద్ భాయ్ కూడా ఉన్నాడని వెల్లడించారు. ఎన్కౌంటర్లో హతమైన ముగ్గురి మిలిటెంట్ల మృతదేహాలు దగ్ధమయ్యాయని, గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయని, వారిని గుర్తించేందుకు చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల కదలికలపై ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు పింగ్లిష్ ప్రాంతంలో చేపట్టిన గాలింపు చర్యల్లో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులకు దిగడంతో ఎన్కౌంటర్ చోటుచేసుకుందని అధికారులు పేర్కొన్నారు. కాగా, పుల్వామాలో ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ వాహనశ్రేణిపై జరిగిన ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు మరణించిన ఘటన వెనుక 23 ఏళ్ల జైషే మహ్మద్ ఉగ్రవాది ముదసర్ అహ్మద్ ఖాన్ అలియాస్ మహ్మద్ భాయ్ ప్రమేయం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. జైషే మానవ బాంబు పాల్పడిన ఈ భీకర దాడికి వాహనం, పేలుడు పదార్ధాలను ఖాన్ సమకూర్చినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ట్రాల్ ప్రాంతంలోని మిర్ మొహల్లా నివాసైన ఖాన్ పాక్కు చెందిన జైషే మహ్మద్ ఉగ్ర సంస్థలో 2017లో అజ్ఞాత కార్యకర్తగా చేరాడని చెప్పారు.పుల్వామాలో ఆత్మాహుతి దాడికి పాల్పడిన జైషే కార్యకర్త అదిల్ అహ్మద్ దార్ నిత్యం ఖాన్తో సంప్రదింపులు జరిపినట్టు అధికారులు తెలిపారు. డిగ్రీ వరకూ చదివిన అహ్మద్ ఖాన్ అలియాస్ మహ్మద్ భాయ్ ఆ తర్వాత ఐటీఐలో ఎలక్ర్టీషియన్ కోర్సు చేశాడు. కశ్మీర్లో జరిగిన పలు ఉగ్రదాడుల్లో ఖాన్ పాల్గొన్నట్టు అధికారులు వెల్లడించారు. -
ఏళ్లుగా భరించాం.. ఇక ఊరుకోం
ఘజియాబాద్: ‘అయిందేదో అయింది. ఏళ్లుగా భరించాం. ఇక ఊరుకునే ప్రసక్తే లేదు’అని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదాన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ లక్ష్యంగా జరుగుతున్న ఉగ్రకుట్రలకు తగిన గుణపాఠం చెప్పి తీరతామని స్ప ష్టం చేశారు. పుల్వామా, ఉడి ఘటనలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆదివారం ఇక్కడ జరిగిన కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాల (సీఐఎస్ఎఫ్) 50వ వ్యవస్థాపక దినోత్సవంలో ప్రధాని ప్రసంగించారు. దేశ భద్రతను కాపాడుతున్న సీఐఎస్ఎఫ్ జవాన్ల కృషి అభినందనీయమని కొనియాడారు. స్వాతంత్య్రం అనంతరం దేశం కోసం ప్రాణాలర్పించిన 35 వేల మంది పోలీసుల్లో పాలమిలటరీ దళాలకు చెందిన వారు 4 వేల మంది ఉన్నారని పేర్కొ న్నారు. వీరి శౌర్యం, అంకితభావం ప్రజలందరికీ ఆదర్శనీయమని ప్రశంసించారు. ఉగ్రదాడులకు వ్యతిరేకంగా తమ ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. పుల్వామా ఉగ్రదాడికి వ్యతిరేకంగా పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై వైమానిక దాడులకు పాల్పడిన విషయాన్ని ప్రస్తావించారు. దేశప్రజల మద్దతుతోనే ఇదంతా సాధ్యమైందని పేర్కొన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమ ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకొచ్చిందన్నారు. ఉగ్రదాడు లను సమర్థంగా ఎదుర్కొనేందుకు అధునాతన గాడ్జెట్లను కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ఇక వీఐపీ సంస్కృతిపై మోదీ విమర్శల వర్షం కురిపించారు. వీఐపీలకు భద్రతను అందించే సీఐఎస్ఎఫ్ బలగాలతో వారు వ్యవహరించే తీరు దారుణంగా ఉంటోం దన్నారు. సీఐఎస్ఎఫ్ జవాన్ల గురించి ప్రజలకు తెలిసేలా వారి చరిత్ర, విధివిధానాలతో డిజిటల్ మ్యూజియాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజల ఆశీర్వాదం కోరుతున్నా: మోదీ న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను మరోసారి ఆశీర్వదించాల్సిందిగా ప్రజలను తాను కోరుతున్నానని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ‘అందరితోపాటుగా, అందరి అభివృద్ధి అనే మా మార్గంలో వెళ్తూ మరోసారి మీ ఆశీర్వాదం కోరుతున్నా. గత 70 ఏళ్లలో నాటి ప్రభుత్వాలు తీర్చలేకపోయిన కనీస అవసరాలను మా ప్రభుత్వం తీర్చింది. ఇప్పుడు మనం మరింత బలమైన, వృద్ధి దాయకమైన, భద్రమైన ఇండియాను నిర్మించాలి’అని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలను మోదీ ప్రస్తావించారు. -
మసూద్ను విడుదల చేసిందెవరు?
న్యూఢిల్లీ: ఉగ్రదాడికి బాధ్యత వహిస్తున్న మసూద్ అజార్ను విడుదల చేసిందెవరో పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు చెప్పాలని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీని నిలదీశారు. ప్రస్తుతమున్న జాతీయ భద్రతా సలహాదారే కాందహార్కు వెళ్లి అజార్ను పాకిస్తాన్కు అప్పగించినట్లు రాహుల్ ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. కాందహార్లో ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ ఐసీ–814ను ఉగ్రవాదులు హైజాక్ చేసి అందులో ప్రయాణిస్తున్న 150 మంది ప్రయాణికులను బందీలుగా పట్టుకున్నారు. వీరిని విడిపించడానికి బదులుగా అప్పటి భారత ప్రభుత్వం 1999, డిసెంబర్లో అజార్తో పాటు మరి కొంతమంది ఉగ్రవాదులను విడుదల చేసింది. ‘మోదీ జీ మసూద్ను విడుదల చేసిందెవరో 40 మంది జవాన్ల కుటుంబాలకు చెప్పండి. అలాగే కాందహార్ వెళ్లి అజా ర్ను పాకిస్తాన్కు అప్పగించింది కూడా జాతీ య భద్రతా సలహాదారేనని చెప్పండి’అని రాహుల్ ట్వీట్ చేశారు. -
పుల్వామా దాడి వెనుక ‘మహ్మద్ భాయ్’
శ్రీనగర్ : పుల్వామాలో ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ వాహనశ్రేణిపై జరిగిన ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు మరణించిన ఘటన వెనుక 23 ఏళ్ల జైషే మహ్మద్ ఉగ్రవాది ముదసర్ అహ్మద్ ఖాన్ అలియాస్ మహ్మద్ భాయ్ ప్రమేయం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. పుల్వామా జిల్లాకు చెందిన ఎలక్ట్రీషియన్ అహ్మద్ఖాన్ పుల్వామా ఉగ్రదాడిలో కీలక పాత్ర పోషించాడు. కాగా, జైషే మానవ బాంబు పాల్పడిన ఈ భీకర దాడికి వాహనం, పేలుడు పదార్ధాలను ఖాన్ సమకూర్చినట్టు అధికారులు గుర్తించారు. ట్రాల్ ప్రాంతంలోని మిర్ మొహల్లా నివాసైన ఖాన్ పాక్కు చెందిన జైషే మహ్మద్ ఉగ్ర సంస్థలో 2017లో అజ్ఞాత కార్యకర్తగా చేరాడని చెప్పారు. పుల్వామాలో ఆత్మాహుతి దాడికి పాల్పడిన జైషే కార్యకర్త అదిల్ అహ్మద్ దార్ నిత్యం ఖాన్తో సంప్రదింపులు జరిపినట్టు అధికారులు తెలిపారు. డిగ్రీ వరకూ చదివిన అహ్మద్ ఖాన్ అలియాస్ మహ్మద్ భాయ్ ఆ తర్వాత ఐటీఐలో ఎలక్ర్టీషియన్ కోర్సు చేశాడు. కశ్మీర్లో జరిగిన పలు ఉగ్రదాడుల్లో ఖాన్ పాల్గొన్నట్టు అధికారులు వెల్లడించారు. -
జరిగిందేదో జరిగిపోయింది.. : మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : భారత్ లక్ష్యంగా దాడులకు తెగబడుతున్న ఉగ్రవాద సంస్థలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా హెచ్చరించారు. ఉగ్ర దాడులకు బాధిత దేశంగా కొనసాగే ఓపిక ఇక భారత్కు లేదని ఆయన తేల్చిచెప్పారు. పుల్వామా, ఉరి ఉగ్రదాడులను ప్రస్తావిస్తూ ‘జరిగిందేదో జరిగిపోయింది..ఇక శాశ్వతంగా ఉగ్రదాడులకు బలయ్యే పరిస్థితిలో తాము లే’మని ఘజియాబాద్లో ఆదివారం కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాల (సీఐఎస్ఎఫ్) 50వ వ్యవస్ధాపక దినోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరైన ప్రధాని పేర్కొన్నారు. దేశంలో అస్థిరత సృష్టించాలనే పొరుగు దేశాల ఉగ్ర కుట్రలను సీఐఎస్ఎఫ్ వంటి భద్రతా దళాలు దీటుగా ఎదుర్కొంటున్నాయని కితాబిచ్చారు. యుద్ధంలో గెలిచే సామర్ధ్యం లేని పొరుగు దేశం భారత్లో అస్థిర వాతావరణ నెలకొనేందుకు ఉగ్రవాదులను ప్రేరేపిస్తున్న క్రమంలో దేశ భద్రత, వ్యవస్థలను కాపాడుకోవడం సవాల్గా మారిందన్నారు. దేశంలో వేళ్లూనుకున్న వీఐపీ సంస్కృతి కొన్నిసార్లు దేశం భద్రతా వ్యవస్థలకు అవరోధంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం నిర్ధిష్ట నిర్ణయాలు చేపట్టాల్సి ఉన్నందున, ఈ దిశగా కొన్ని కఠిన నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుందని ప్రధాని పేర్కొన్నారు. -
కాంగ్రెస్ నేతగా సిగ్గుపడుతున్నా..
పట్నా: ఉగ్రవాదుల స్థావరాలపై భారత వైమానిక దళం జరిపిన దాడులకు ఆధారాలు చూపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నా విషయం తెలిసిందే. దీనిపై బీజేపీనే కాక సొంత పార్టీ నేతలే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఐఎఎఫ్ దాడులపై కాంగ్రెస్ పార్టీ తీరుకు వ్యతిరేకంగా ఆపార్టీ బిహార్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ రాజీనామా చేశారు. ‘‘వైమానిక దళాలు జరిపిన దాడులకు కాంగ్రెస్ పార్టీ ఆధారాలు అడిగింనందుకు ఆపార్టీ వ్యక్తిగా సిగ్గుపడుతున్నా. పార్టీ తీరుకు వ్యతిరేకంగా కాంగ్రెస్కు రాజీనామా చేస్తున్నా’’అని ఆనంద్ శర్మ తెలిపారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి పంపినట్లు శర్మ వెల్లడించారు. ఐఎఎఫ్ దాడులపై బీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం సాగుతోన్న విషయం తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం పాకిస్తాన్లోని బాలాకోట్ ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు జరిపాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై సరైన ఆధారాలు చూపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న విషయం విధితమే. సైనికుల త్యాగాలను ప్రధాని మోదీ రాజకీయంగా ప్రచారం చేసుకుంటున్నారని కాంగ్రెస్ విమర్శించగా.. జవాన్లను అవమానించే విధంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని బీజేపీ ప్రతివిమర్శలు చేస్తోంది. -
మరో పుల్వామా ఘటన జరగొచ్చు..!
సాక్షి, ముంబై: లోక్సభ ఎన్నికలలోపు పుల్వామా ఉగ్రదాడి లాంటి ఘటన మరోకటి జరిగే అవకాశం ఉందని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ ఠాక్రే అభిప్రాయపడ్డారు. సైనికుల త్యాగాలను ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ లబ్ధికోసం ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. ఎంఎన్ఎస్పీ 13వ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా శనివారం పార్టీ ముఖ్యనేతల సమావేశంలో రాజ్ ఠాక్రే మాట్లాడారు. పాక్పై మరోసారి దాడి చేసి లోక్సభ ఎన్నికల్లో గెలవాలని మోదీ ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. గతంలో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే పాక్పై మెరుపు దాడులు చేశారని అన్నారు. అంతకుమందే భారత ప్రధాని మోదీ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ను కూడా కలిసినట్లు ఠాక్రే గుర్తుచేశారు. భారత వైమానిక దాడుల్లో 250 మంది ఉగ్రవాదులు హతమైనట్లు అమిత్ షా ఎలా ప్రకటిస్తారని, ఆయన ఏమైనా కో ఫైలట్టా అని ప్రశ్నించారు. పాక్తో ఉగ్రదాడి పొంచిఉందని ఇంటిలిజెన్స్ హెచ్చరించినప్పటికీ సరిహద్దుల్లో భద్రతను ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. -
పాక్ డ్రోన్ పరార్
జైపూర్: పాక్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. పాక్ మిలటరీకి చెందిన డ్రోన్ శనివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో భారత భూభాగంలోకి దూసుకొచ్చేందుకు యత్నించిందని బీఎస్ఎఫ్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. రాజస్తాన్లోని హిందుమాల్కోట్లోకి పాక్ డ్రోన్ రావడంతో బీఎస్ఎఫ్ జవాన్లు దానిపై కాల్పులు జరిపారు. దీంతో వెంటనే ఆ డ్రోన్ వెనక్కు మళ్లింది. కాగా, నియంత్రణ రేఖ (ఎల్వోసీ) సమీపంలో శనివారం పెను ప్రమాదం తప్పింది. ఉదయం పదింటికి అఖ్నూర్ సెక్టార్లో నంద్వాల్చౌక్ వద్ద రోడ్డు పక్కన ఉగ్రవాదులు అమర్చిన ఇంప్రోవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్(ఐఈడీ)ను సైన్యం గుర్తించింది. వెంటనే ఆప్రాంతంలోని వారిని ఖాళీచేయించి ఐఈడీని నిర్వీర్యం చేశారు. ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో అలాంటివి ఇంకా ఏమైనా అమర్చారా అనే అనుమానంతో బలగాలు క్షుణ్నంగా తనిఖీలు చేపట్టాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాంబు అమర్చిన వారిని పట్టుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. -
యుద్ధాలు అధికారానికి సోపానాలా?
ఉగ్రవాదుల ఏరివేతకు వైమానిక దళం బాలాకోట్పై జరిపిన దాడి నుంచి రాజకీయ లబ్ధి పొందేందుకు అధికార బీజేపీ ప్రయత్నిస్తోందంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ దాడితో లోక్సభ ఎన్నికల్లో తమకు మరో పాతిక సీట్లు ఎక్కువ వస్తాయని బీజేపీ నేత యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలు వీరి ఆరోపణకు బలాన్నిచ్చాయి. అయితే, సైనిక ఘర్షణలు నిజంగానే పార్టీలు అధికారంలోకి రావడానికి దోహదపడతాయా అంటే కచ్చితంగా అవునని జవాబు చెప్పలేం. అయితే, వీటి వల్ల దేశంలో రాజకీయ ముఖ చిత్రంలో మార్పులు జరిగినట్టు గత యుద్ధాలు, సైనిక ఘర్షణల తదనంతర పరిణామాలు తెలియజేస్తున్నాయి. దేశ విభజన జరిగిననాటి నుంచి ఇంత వరకు భారత్ పాకిస్తాన్తో నాలుగుసార్లు, చైనాతో ఒకసారి యుద్ధానికి దిగింది. శ్రీలంకలో అంతర్యుద్ధం నివారణకు సైనిక జోక్యం చేసుకుంది. వీటి తర్వాత జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీకి మళ్లీ విజయం దక్కినా దక్కకపోయినా రాజకీయ సమీకరణాలు గణనీయంగా మారాయి. ఉదాహరణకు భారత్ 1962లో చైనాతో, 1965లో పాకిస్తాన్తో తలపడింది. చైనా యుద్ధంలో ఓడిపోతే, పాకిస్తాన్పై విజయం సాధించింది. ఈ రెండు యుద్ధాలు కూడా 1962, 1967 సార్వత్రిక ఎన్నికల మధ్యనే జరిగాయి. ఆ సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ యుద్ధాల తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓట్లు, సీట్లు కూడా తగ్గాయి. 1971లో జరిగిన బంగ్లాదేశ్ కోసం భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరిగింది. ఇందిరా గాంధీ హయాంలో జరిగిన ఈ యుద్ధం తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ బలం భారీగా పెరిగింది. వాజ్పేయి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో కార్గిల్ యుద్ధం జరిగింది. దీంట్లో భారత్ విజయం సాధించింది. తర్వాత కొన్ని నెలలకు జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారం కైవసం చేసుకుంది. అయితే, సీట్లు మాత్రం ఏమీ పెరగలేదు. కేవలం యుద్ధాల వల్లే రాజకీయ పార్టీల తలరాత మారిందని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఎన్నికల్లో ఆర్థిక, సామాజికాంశాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. మూడో భారత్–పాక్ యుద్ధం(1971) బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన ఈ యుద్ధంలో భారత్ గెలిచింది. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉండగా ఈ యుద్ధం జరిగింది. 1971 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన కొన్ని నెలలకు ఈ యుద్ధం జరిగింది. తర్వాత 1977లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకంగా 158 సీట్లు కోల్పోయింది. 1971 ఎన్నికల్లో 352 సీట్లు సాధించిన కాంగ్రెస్ ఈసారి 154 సీట్లతో సరిపెట్టుకుంది. ఈ ఎన్నికల్లో జనతా పార్టీ గెలిచింది. స్వాతంత్య్రం తర్వాత కేంద్రంలో ఏర్పడ్డ తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఇది. మొదటి భారత్–పాక్ యుద్ధం(1947) కశ్మీర్ యుద్ధంగా పేరొందిన ఇది 1947 అక్టోబర్– 1948 డిసెంబర్ల మధ్య జరిగింది. ఆ తర్వాత 1952లో జరిగిన మొదటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. భారత్–చైనా యుద్ధం (1962) 1962, అక్టోబర్ 20 నుంచి 1962 నవంబర్ 21 వరకు జరిగింది. దీంట్లో భారత్ ఓడింది. యుద్ధం సమయంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. 1962లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 361 సీట్లు సాధించింది. ఐపీకేఎఫ్ (1987) శ్రీలంకలో అంతర్యుద్ధాన్ని నివారించడం కోసం శాంతి పరిరక్షక దళాన్ని భారత్ అక్కడికి పంపి లంక సైనిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంది. నాటి ప్రధాని రాజీవ్ గాంధీ 1991లో హత్యకు గురయ్యారు. ఐపీకేఎఫ్ను పంపడానికి ముందు 1984లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ రికార్డు స్థాయిలో 404 సీట్లు గెలుచుకుంది. ఈ జోక్యం తర్వాత జరిగిన (1989) ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. రెండో భారత్–పాక్ యుద్ధం(1965) లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా ఉండగా, 1965లో ఈ యుద్ధం జరిగితే, రెండేళ్ల తర్వాత 1967లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి 283 సీట్లతో అధికారం దక్కించుకుంది. అయితే, అంతకుముందు ఎన్నికలతో పోలిస్తే 78 సీట్లు తక్కువ వచ్చాయి. కార్గిల్ యుద్ధం(1999) బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో కార్గిల్ యుద్ధం జరిగింది. 1999 మే నుంచి జూలై వరకు జరిగిన ఈ యుద్ధంలో భారత్దే గెలుపు.ఈ యుద్ధానికి ముందు 1998లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. కార్గిల్ యుద్ధం తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 138 సీట్లు మాత్రమే వచ్చాయి. అంతకుముందు ఎన్నికల్లో వచ్చిన సీట్ల కంటే ఇవి 44 తక్కువ. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా మెజారిటీ సీట్లు సాధించలేక పోయింది. అయినా కూడా ఇతర పార్టీలతో కలిసి యూపీఏ పేరుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. -
నీరవ్తో ప్రధానికి పోలికలు
హవేరి(కర్ణాటక)/న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) మోసం కేసులో నిందితుడు నీరవ్ మోదీకి ప్రధాని మోదీకి మధ్య అసాధారణమైన సారూప్యతలున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఎద్దేవా చేశారు. వీరిద్దరూ చట్టానికి అతీతులమని భావిస్తుంటారన్నారు. వేల కోట్ల రుణాలు ఎగొట్టిన నీరవ్ మోదీపై మీడియా కథనాలపై రాహుల్ స్పందించారు. ‘ వీరిద్దరి పేర్లు మోదీనే. ఇద్దరూ దేశాన్ని దోచుకుంటున్నవారే. చట్టానికి అతీతులమని వీరు భావిస్తున్నారు. వీరిని చట్టం ముందు నిలబెడతాం’ అని ట్వీట్ చేశారు. ఇలాంటి పరారైన నేరగాళ్ల కోసం మోదీ ప్రభుత్వం ‘మోసగాళ్ల సెటిల్మెంట్ యోజన’ను ప్రారంభించిందన్నారు. ఉగ్రవాదానికి కాంగ్రెస్ తలొంచదు అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజార్ను ఎన్డీఏ ప్రభుత్వం జైలు నుంచి ఎందుకు విడిచిపెట్టిందో ప్రజలకు వెల్లడించాలని ప్రధానిని డిమాండ్ చేశారు. ‘ ఏ ప్రభుత్వం అతడిని జైలు నుంచి వదిలిపెట్టింది?’ అంటూ ప్రశ్నించారు. కర్ణాటకలో హవేరీలో జరిగిన సభలో మాట్లాడారు.‘ఇటీవల కశ్మీర్లో సీఆర్పీఎఫ్ జవాన్లను ఉగ్రవాదులు చంపారు. ఈ జవాన్లను ఎవరు చంపారు? జైషే మొహమ్మద్ చీఫ్ ఎవరు? మసూద్ అజార్.. భారత్ జైలులో ఉన్న అతడిని పొరుగుదేశం పంపిందెవరు? వాజ్పేయి సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం కాదా? దీనిని గురించి మీరు ఎందుకు మాట్లాడరు? మీ ప్రభుత్వ హయాంలో జైలు నుంచి బయటకు వచ్చిన మసూదే ఇప్పుడు జవాన్లను చంపాడన్న విషయం ఎందుకు మీరు చెప్పడం లేదు?’ అంటూ ప్రశ్నించారు. ‘మోదీజీ..మీకు మాదిరిగా కాంగ్రెస్ ఉగ్రవాదులకు తలొంచదు’ అని రాహుల్ అన్నారు. -
కొత్తనీతి.. సరికొత్త రీతి
నోయిడా: బాలాకోట్ ఉగ్రదాడిపై ఆధారాలు చూపాలంటున్న ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. ఉగ్రమూకల ఏరివేత విషయంలో యూపీఏ ప్రభుత్వం ధైర్యం, తెగువ చూపలేకపోయిందని విమర్శించారు. కానీ ఎన్డీయే ప్రభుత్వం 2016లో సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా ఉగ్రమూకలకు వారికి అర్థమయ్యే భాషలోనే గుణపాఠం చెప్పిందని వ్యాఖ్యానించారు. భారత్ ఇప్పుడు ‘కొత్తనీతి–సరికొత్త రీతి’తో ముందుకుపోతోందన్నారు. ‘2008లో జరిగిన ముంబై మారణహోమాన్ని దేశం ఎన్నటికీ మర్చిపోదు. ఆ ఉగ్రదాడులకు భారత్ వెంటనే ప్రతిస్పందించి ఉంటే ప్రపంచం మొత్తం మనకు అండగా నిలిచేది. పాక్లో ఉగ్రసంస్థల పాత్రపై మనదగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. కానీ అప్పటి ప్రభుత్వం ధైర్యం, తెగువ చూపలేకపోయింది. ఉగ్రదుశ్చర్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి మన భద్రతాబలగాలు సిద్ధంగా ఉన్నప్పటికీ కేంద్రం మౌనం వహించింది’ అని అన్నారు. తెల్లవారుజామునే పాకిస్తాన్ ఏడ్చింది.. పాక్లోని బాలాకోట్లో జైషే ఉగ్రస్థావరంపై భారత వాయుసేన ఫిబ్రవరి 24న దాడిచేశాక తెల్లవారుజామున 5 గంటలకు ‘మోదీ మాపై దాడి చేశాడు’ అని పాక్ ఏడుపు అందుకుంది. దాడులతో ఇబ్బందిపెడుతూనే ఉండొచ్చనీ, ఇండియా ప్రతిస్పందించదని వాళ్లు భావిస్తున్నారు. 2014కు ముందున్న రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం కారణంగానే శత్రువులకు ఈ అభిప్రాయం బలంగా ఏర్పడింది. ఉడీ ఘటన తర్వాత మన బలగాలు ఉగ్రవాదుల ఇళ్లలోకి దూరి వాళ్లను హతమార్చాయి. యూపీలోని కుర్జాలో, బిహార్లోని బుక్సారిన్లో రెండు థర్మల్ విద్యుత్ కేంద్రాలను ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. 50ఏళ్ల పాత సామగ్రిని వాడటంతో విద్యుత్ ఉత్పత్తి వ్యయం యూనిట్కు రూ.10కు చేరుకుందని ప్రధాని తెలిపారు. కానీ సౌరశక్తి ద్వారా ఇప్పుడు యూనిట్ విద్యుత్ను రూ.2కే ఉత్పత్తి చేయొచ్చన్నారు. ఐదేళ్లలో మూడు దాడులు: రాజ్నాథ్ మంగళూరు: గత ఐదేళ్లలో భారత్ మూడు సార్లు దాడులు చేసిందని హోం మంత్రి రాజ్నాథ్ చెప్పారు. 2016లో ఉడి ఉగ్రవాద దాడి తర్వాత చేపట్టిన దాడి, ఇటీవల జరిపిన వైమానిక దాడుల గురించి వివరించిన రాజ్నాథ్ మూడో దాడి వివరాలు బయటపెట్టలేదు. శనివారం కర్ణాటక బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఉడిలో నిద్రపోతున్న సైనికులపై ఉగ్రవాదులు దాడి జరిపి 17 మందిని చంపివేశారని, దీనికి ప్రతీకారంగా పీవోకే భారత్ తొలి మెరుపుదాడి చేసిందన్నారు. పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఆత్మాహుతి దాడి తర్వాత వైమానిక దాడి జరిపి జైషే ఉగ్ర శిబిరాన్ని నాశనం చేసిందన్నారు. ఈ దాడులతో భారత్ బలహీన దేశం కాదని పాకిస్తాన్కు గట్టి సందేశం ఇచ్చామని వెల్లడించారు. -
ఎఫ్16ను కూల్చింది అభినందనే
న్యూఢిల్లీ / వాషింగ్టన్: పాకిస్తాన్కు చెందిన అత్యాధునిక ఎఫ్–16 యుద్ధ విమానాన్ని భారత్ పైలెట్, వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమానే కూల్చివేశారని భారత విదేశాంగ శాఖ తెలిపింది. అభినందన్ పాక్ విమానాన్ని కూల్చడాన్ని ప్రత్యక్ష సాక్షులు చూశారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్కుమార్ చెప్పారు. కూల్చడంపై ఎలక్ట్రానిక్ ఆధారాలు తమవద్ద ఉన్నాయన్నారు. ఎఫ్–16 ఫైటర్ జెట్లలో వాడే అమ్రామ్ క్షిపణి శకలాలను ఇప్పటికే మీడియా ముందు ప్రదర్శించిన విషయాన్ని గుర్తుచేశారు. వీడియో సాక్ష్యాలను ఎందుకు చూపలేదు? భారత్కు చెందిన రెండు యుద్ధవిమానాలను కూల్చివేశామని పాక్ చెప్పడాన్ని రవీశ్ తప్పుపట్టారు. పాక్తో ఘర్షణ సమయంలో మనం ఒక మిగ్–21 బైసన్ యుద్ధవిమానాన్ని మాత్రమే కోల్పోయిందని, దాన్ని నడుపుతున్న అభినందన్ పాక్ సైన్యానికి చిక్కారని చెప్పారు. నిజంగానే పాక్ మరో విమానాన్ని కూల్చివేస్తే, వారం రోజులైనా ఆ సాక్ష్యాలను అంతర్జాతీయ మీడియా ముందు ఎందుకు ప్రవేశపెట్టలేదని ప్రశ్నించారు. అదే నిజమైతే ఆ రెండో విమానం శకలాలు ఎక్కడున్నాయి? దాన్ని నడుపుతున్న పైలెట్లకు ఏమైంది? అనే విషయాలను పాక్ వెల్లడించాలన్నారు. పాక్లోనే ఉన్నాడని అందరికీ తెలుసు.. పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ పాక్లో ఉన్నాడని ఐక్యరాజ్యసమితిలోని భద్రతామండలి సభ్యులకు తెలుసని రవీశ్ చెప్పారు. 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతికి కారకులైన జైషే ఉగ్రశిబిరాలు పాక్లో స్వేచ్ఛగా నడుస్తున్నాయన్న విషయం భద్రతామండలికి తెలుసని స్పష్టం చేశారు. పుల్వామా ఉగ్రదాడి, తదనంత పరిణామాలతో భారత్–పాకిస్తాన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై అమెరికా విదేశాంగ మంత్రి పాంపియో, బ్రిటన్ జాతీయ భద్రతా సలహాదారు మార్క్తో చర్చించారు. -
రాజస్తాన్లో పాక్ డ్రోన్ కూల్చివేత
జైపూర్ : కశ్మీర్ సరిహద్దుల వెంబడి పదే పదే కాల్పులకు తెగబడుతున్న పాకిస్తాన్ మరో దుందుడుకు చర్యకు పాల్పడినట్లు సమాచారం. కశ్మీర్తో పాటు రాజస్తాన్లోని భారత్- పాకిస్తాన్ సరిహద్దుల కూడా దాయాది దేశం కవ్వింపు చర్యలకు దిగుతోంది. డ్రోన్ల ద్వారా భారత సైనిక రహస్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నించి ఇప్పటికే రెండుసార్లు విఫలమైనా పాక్ బుద్ధి మాత్రం మారలేదు. ఈ క్రమంలో శనివారం మరోసారి రాజస్తాన్లోని శ్రీ గంగానగర్ సెక్టార్ గుండా భారత గగనతలంలోకి పాక్ డ్రోన్ ప్రవేశించగా.. భారత సైన్యం దానిని కూల్చివేసింది.(చదవండి : తీరు మారని పాక్.. సరికొత్త నాటకాలు!!) కాగా పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్ అనంతరం భారత గగన తలంలోకి ప్రవేశించేందుకు పాక్ డ్రోన్లు ప్రయత్నించడం ఇది మూడోసారి. ఫిబ్రవరి 27న గుజరాత్లోని కచ్, మార్చి 4న రాజస్తాన్లోని బికనీర్ సరిహద్దు గుండా భారత్లోకి ప్రవేశించాలని చూసిన పాక్ డ్రోన్లను నేలకూల్చి భారత సైన్యం దీటుగా జవాబిచ్చిన సంగతి తెలిసిందే. -
‘జమ్మూ-కశ్మీర్కు ఎవరూ వెళ్లకండి’
వాషింగ్టన్: అమెరికా పౌరులెవరూ జమ్మూ-కశ్మీర్ పర్యటనకు వెళ్లవద్దని అమెరికా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు అమెరికా ట్రావెల్ అడ్వైజరీ స్థానిక ప్రజలకు పలు సూచనలు చేసింది. పుల్వామా ఉగ్రదాడి, బాల్కోట్లో ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దాడి అనంతరం భారత్-పాకిస్థాన్ల మధ్య యుద్ద వాతావరణం అలుముకుందని వివరించింది. దీంతో ఈ ప్రభావం జమ్మూ-కశ్మీర్లో ఎక్కువగా ఉందని.. ఇప్పట్లో శాంతియుతమైన పరిస్థితులు వచ్చేలా కనిపించడంలేదని పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉగ్రవాదులు పర్యాటక ప్రాంతాలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్, ఆఫీస్లను లక్ష్యంగా దాడులు చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేసింది. అందుకే ఈ సమయంలో కశ్మీర్కు వెళ్లకపోవడమే మంచిదని పర్యాటకులకు ట్రావెల్ అడ్వైజరీ సూచించింది. ఇరు దేశాల మధ్య ఉన్న పరిస్థితుల దృష్ట్యా పాక్-భారత్ సరిహద్దుకు కనీసం పది కిలోమీటర్ల దూరంలోనే ఆగిపోవాలని పేర్కొంది. జమ్మూ-కశ్మీర్లోనే ఎక్కువగా ఉగ్రదాడులు జరుగుతున్నాయని, అదేవిధంగా స్థానిక ప్రజలు కూడా ఆందోళనలు చేస్తున్న కారణంగా తూర్పు లడఖ్, లేహ్ మినహా కశ్మీర్లో ఏ ప్రదేశానికి వెళ్లకూడదని అడ్వైజరీ సూచించింది. ఇక ఈ ఆదేశాలు కశ్మీర్ పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇక పాకిస్తాన్లో అమెరికా లెవల్ 3 హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పాక్కు వెళ్లకపోవడమే మంచిదని పర్యాటకులకు అమెరికా సూచించినట్లయింది. -
తల్లులారా.. మీ పిల్లలను ఉగ్రవాదంలో చేరనివ్వకండి
జమ్మూ : ‘కశ్మీర్లోని ప్రతి తల్లిని వేడుకుంటున్నా.. మీ పిల్లలను దయచేసి ఉగ్రవాదం వైపు వెళ్లనివ్వకండి’ అని భారత ఆర్మీ లెఫ్ట్నెంట్ జనరల్ కాన్వాల్ జీత్ సింగ్ ధిలాన్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే ఉగ్రవాదానికి ప్రభావితమై.. వారి ఉచ్చులో చిక్కుకున్నవారు.. తిరిగి రావాలనుకుంటే వారికి భారత ఆర్మీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ‘నేను ప్రతి తల్లిని వేడుకుంటున్నా. హింసను ప్రేరేపిస్తూ అమయాకుల ప్రాణాలను తీసే ఉగ్రవాదం వైపు మీ పిల్లలు ఆకర్షితులు కాకుండా చూసుకోండి. ఇప్పటికే ఎవరైనా అలా చేరి.. తిరిగి రావాలంటే చెప్పండి. వారికి భారత సైన్యం అండగా ఉంటుంది. వారికి సాధారణ జీవితంలోకి తీసుకురావాడానికి కృషి చేస్తోంది.’ అని వ్యాఖ్యానించారు. ఆర్మీ పాసింగ్ పరేడ్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి చెందిన 152 మంది యువకులు భారత సైన్యంలో చేరారాని పేర్కొన్నారు. ఇక పుల్వామా ఉగ్రదాడి అనంతరం భావోద్వేగంగా మాట్లాడిన ధిలాన్.. తుపాకులతో తిరిగే యువకులను లొంగిపోవాలని, లేకుంటే కాల్చేస్తామని హెచ్చరించారు. అలాగే కశ్మీర్ సమాజంలో తల్లికి ఎంతో బాధ్యత ఉంటుందని, ఎవరైతే ఉగ్రవాదులతో చేయికలిపారో అలాంటి వారి తల్లులు ఒక్కసారి వారిని పిలిపించే ప్రయత్నం చేయాలని ఉగ్రవాదం వీడేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. -
పుల్వామా’ కుటుంబాలకు కోటి ఎక్స్గ్రేషియా
న్యూఢిల్లీ: పుల్వామాలో ఉగ్రదాడిలో అసువులు బాసిన 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు సర్వీస్ నిబంధనల ప్రకారం ఇప్పటి వరకు కోటి రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించినట్లు భద్రతాదళాధికారి ఒకరు చెప్పారు. వీటితోపాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన ఎక్స్గ్రేషియాను అదనంగా అందజేస్తామన్నారు. ఇందులో సీఏపీఎఫ్కి చెందిన సిబ్బంది విధి నిర్వహణ లో మృతి చెందినపుడు కేంద్రం ప్రకటించే ఎక్స్గ్రేషియా కింద రూ.35 లక్షలు, నష్ట నివారణ నిధి కింద రూ.21.50 లక్షలు, ‘భారత్ కే వీర్’నిధి కింద రూ.15 లక్షలు, ఎస్బీఐ పారామిలిటరీ సేవల బీమా నుంచి రూ.30 లక్షలు చెల్లించారు. ‘కొన్ని సంస్థలు జవాన్ల పిల్లల విద్యా బాధ్యతలను తీసుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చాయి’అని ఆయన చెప్పారు. కొన్ని సందర్భాల్లో మృతి చెందిన జవాన్ల కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించాయని, వారు సీఆర్పీఎఫ్లోని ఉద్యోగాలకూ అర్హులేనన్నారు. -
పాక్లో 22 ఉగ్ర శిబిరాలు
వాషింగ్టన్/ ఇస్లామాబాద్/జాబా: పాకిస్తాన్లో ఇప్పటికీ 22 ఉగ్రవాద శిక్షణ శిబిరాలు నడుస్తున్నాయని, వాటిలో తొమ్మిది శిబిరాలు జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినవేనని సీనియర్ భారతీయ అధికారి ఒకరు చెప్పారు. ఈ శిబిరాలపై పాక్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాషింగ్టన్లో ఉంటున్న ఆయన విలేకరుల సమావేశంలో అన్నారు. సరిహద్దు ఆవల నుంచి భారత దేశంలో మళ్లీ ఏమైనా ఉగ్రవాద సంబంధిత దాడులు జరిగితే ప్రభుత్వం బాలాకోట్ తరహా దాడులు చేస్తుందని ఆయన పాకిస్తాన్ను హెచ్చరించారు. ‘ఉగ్రవాదానికి అంతర్జాతీయ కేంద్రం పాకిస్తాన్. తీవ్రవాదులపై, తీవ్రవాద సంస్థలపై పాకిస్తాన్ నమ్మదగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది’అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ అధికారి అన్నారు. తన గడ్డపై 22 ఉగ్రవాద శిక్షణా శిబిరాలు నడుస్తున్నా వాటిపై ఏ చర్యా తీసుకోని పాకిస్తాన్ ప్రభుత్వం తమ దేశంలో తీవ్రవాదులు లేరని బుకాయిస్తోందని, రెండు దేశాల మధ్య యుద్ధోన్మాదాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. చట్టాలకు అనుగుణంగానే.. బాలాకోట్పై భారత్ దాడి ఉగ్రవాద వ్యతిరేక చర్య అని, అంతర్జాతీయ చట్టాలకు లోబడే ఈ దాడి జరిగిందని ఆయన పేర్కొన్నారు. పాక్ ప్రభుత్వం ఇటీవల పలు ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవడాన్ని ప్రస్తావిస్తూ.. భారత్లో ఉగ్రదాడి జరిగినప్పుడల్లా పాక్ ఇలాగే చేస్తుందని, ఇందులో విశేషమేమీ లేదని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులను గృహ నిర్బంధంలో ఉంచడమంటే వారికి విలాసాలు సమకూర్చడమేనని, పరిస్థితి సద్దుమణగగానే వారిని విడిచిపెడుతుందన్నారు. భారత్పై ఉగ్ర దాడికి పాక్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్న విషయాన్ని బాలాకోట్ దాడి ద్వారా భారత్ స్పష్టం చేసిందన్నారు. ఈ విషయంలో ట్రంప్ సర్కారు భారత్కు మద్దతిస్తోందన్నారు. పాక్ అభివృద్ధికి ఐఎంఎఫ్ 21 సార్లు ఆర్థిక సాయం చేస్తే ఆ దేశం ఇతర అవసరాలకు మళ్లించిందని పేర్కొన్నారు. చెట్లు కూల్చారని కేసు భారత వైమానిక దళానికి చెందిన గుర్తుతెలియని పైలట్లపై పాక్ కేసు వేసింది. బాలాకోట్లోని 19 చెట్లపై బాంబులు వేసి కూల్చివేసినందుకు శుక్రవారం ఈ కేసు వేసింది. జైషే మహమ్మద్ ఉగ్రసంస్థకు చెందిన శిక్షణ శిబిరంపై భారత వైమానిక దళం సర్జికల్ దాడులు చేసిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ అటవీ శాఖ ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని తెలిసింది. కాగా, బాలాకోట్లోని ఐఏఎఫ్ దాడి జరిపిన మదరసా, ఇతర భవనాల వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన మీడియా ప్రతినిధులను పాకిస్తాన్ భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. దాడి జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు రాయిటర్స్కు చెందిన ప్రతినిధులు మూడుసార్లు ప్రయత్నించినా పాక్ బలగాలు అడ్డుకున్నాయి. అప్పటి నుంచి కూడా ఆ మదరసా ఉన్న ప్రాంతానికి వెళ్లే దారులను మూసివేశారు. -
భేతాళ కథ
సిటీలో మంచి పేరున్నవాడు సైకాలజిస్టు. కొందరు సింపుల్గా ‘పిచ్చి డాక్టర్’ అని కూడా అంటారు. పిచ్చి ఆయనకని కాదు, పిచ్చి వారికి డాక్టరని గ్రహించాలి. మొన్న సాయంత్రం ఆ క్లినిక్ వైపు వెళ్లాను. పిచ్చి డాక్టర్ నాకు మంచి మిత్రుడు. అక్కడికి వెళితే మంచి కాలక్షేపం. అదో కొత్త లోకం. సరిగ్గా అప్పుడే కోటిరెడ్డి అనే పేషెంట్ని తీసుకొచ్చారు. నిజానికి ఈ బాపతు వాళ్లని పేషెంట్ అనడానికి లేదు. వాళ్ల నాన్నగారు యూనివర్సిటీలో ఇంగ్లిష్ ప్రొఫెసర్గా ఉద్యోగం చేసి రిటైరయ్యారట. ఇప్పుడు డెభ్బై ఏళ్లు. జనరల్ హెల్త్లో వంక పెట్టాల్సింది లేదు. పళ్లు, కళ్లు బాగున్నాయ్. గొప్ప చెప్పుకోదగ్గ బట్టతల కూడా కాదు. బీపీ, షుగర్ లాంటివి కూడా లేవు. విషయాలన్నీ వాళ్లబ్బాయ్ దగ్గర రాబట్టాడు డాక్టరు. ఈ పిచ్చి డాక్టర్లు చాలా తెలివిగా పేషెం ట్ని మచ్చిక చేసుకుని, వాళ్ల బుర్రని స్వాధీనం చేసుకుంటారు. ‘ఆ.. కోటిరెడ్డి గారూ! ఎట్లా ఉన్నారు? ఈ మధ్య రావడమే మానేశారు’ అన్నాడు చొరవగా మా ఫ్రెండు. ఆయన కొంచెం పెద్దగా నవ్వి, ‘తమ బొంద నేనసలెప్పుడూ ఇటు రాలేదు. మీ వెధవ మొహం చూడటం ఇప్పుడే. నా ధోరణిలో తేడా వచ్చిందని మా పండుగాడు ఏవేవో కబుర్లు చెప్పి మీ దగ్గరకి లాక్కొచ్చాడు’ అనగానే డాక్టర్ షాక్ తిని, తేరుకుని, అనవసరపు నవ్వునవ్వి– ‘చెప్పండి... ఏవిటి సమస్య’ అన్నాడు. ‘నాకేం సమస్య లేదు. ఈ మధ్య కొన్నాళ్లుగా ఏదో కొత్త భాష మాట్లాడుతున్నారు. అదేదో మంగోలియన్ జోన్ భాషకి కొద్దిగా కలుస్తోంది. పూర్తిగా అది కూడా కాదు. కొన్ని మాటలు పూర్తిగా కత్తిరించుకు పోతున్నాయ్. వాళ్లు వాళ్లు ఏమనుకుంటున్నారో మూడో వాడికి చచ్చినా అర్థం కాదు. మధ్య మధ్య ఊళ్ల పేర్లు, నాయకుల నామధేయాలు, పార్టీ పేర్లు మాత్రం స్పష్టంగా వినిపిస్తున్నాయ్. వాళ్ల ముఖ కవళికల్ని బట్టి పరస్పరం తీవ్రంగా ద్వేషించుకుంటున్నారని మాత్రం అర్థమవుతోంది. నాకీ సమస్య ఎందుకొచ్చిందో అర్థం కావడం లేదు’ అంటూ కోటిరెడ్డి నిట్టూర్చాడు. పెదవులు విరిచాడు నిస్పృహగా. డాక్టరు ఆయనవంక నిశితంగా చూస్తూ ‘ఎప్పట్నించీ అన్నారు ఈ సమస్య’ అని అడిగాడు. ‘దాదాపు ఏడాదిగా. అయితే మరీ మొన్న ఉగ్రదాడి, మన బాంబుదాడి తర్వాత తీవ్రమైంది. అసలే మైందో, అసలేమంటున్నారో, కౌంటర్లేమిటో, దేశభక్తుడెవడో, కుట్రదారుడెవడో సర్వం కలగాపులగం అయిపోయి బుర్రని ఇనపతెడ్లతో కెలికేసినట్టు అయిపోయింది. పులిమీద పుట్రలాగా దానిమీద డేటా చోరీ బాపతు ప్రకంపనలు రేగాయ్. అంతే! తర్వాత తెలుగు, ఇంగ్లిష్ భాషా పదాలన్నీ కప్పల బెకబెకల్లా వినిపిస్తున్నాయ్’ వివరంగా చెప్పగా విని మా ఫ్రెండు చాలా లైట్గా తీసుకుని తేలిగ్గా నవ్వేస్తూ, ‘ఏం లేదు రెడ్డిగారూ, మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. దట్సాల్’ అన్నాడు. ఆ ముక్కతో కోటిరెడ్డి రెచ్చిపోయాడు. ఒక్క క్షణం కంట్రోల్ చేసుకున్నాడు. ‘అయితే సరే, నేను తికమకపడ్డా. నీకేం అర్థమైందో చెప్పు. ఉగ్రదాడిని మోదీ ఏమన్నాడు. విమాన దాడిలో పైలట్ల పాత్ర గొప్పదా, మోదీ పాత్ర గొప్పదా? నిజంగా అవన్నీ జరిగాయా? సృష్టించారా? అసలీ భూమ్మీద ఆత్మాహుతి దాడులు చేసే మనుషులు ఉన్నారా? అసలు పాకిస్తాన్ మన సరిహద్దు దేశమేనా? మధ్యలో చైనాలాంటి దేశాలున్నాయా? తర్వాత డేటా అంటే ఏమిటి? పోలీసంటే ఎవరు? ఎవరికెవరు కాపలా? రెండు తెలుగు రాష్ట్రాలకి ఇనపకంచె వేసి కరెంటు పెట్టేసి మొత్తం ఆ రాష్ట్రాన్ని వీళ్లు, ఈ రాష్ట్రాన్ని వాళ్లు జైల్లో పెట్టేస్తారా? చెప్పండి డాక్టర్. వాళ్లు మాట్లాడుతోంది నిజంగా తెలుగు భాషై, అది మీకు అర్థమైతే నాకు విప్పి చెప్పండి. అర్థమై కూడా చెప్పకపోయారో మీ తల వేయి వక్కలవుతుంది’ అంటూ కోటిరెడ్డి వికటాట్టహాసం చేశాడు. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
యుద్ధ వాగాడంబరం ప్రమాదకరం
ప్రతీకారం తీర్చుకోవడమనే భావన ఒక తెలివితక్కువ వ్యూహాత్మక భావోద్వేగం మాత్రమే. ప్రతీకారం మూర్ఖుల వాంఛ కాగా వివేకవంతులు చర్చకు, సంయమనానికి ప్రాధాన్యత ఇస్తారు. భారత్, పాక్ ఇరుదేశాల ప్రజల భావోద్వేగాలు సరేసరి. ప్రధాని సైతం బహిరంగ సభలో భారీ జనసందోహం మధ్య తన ఛాతీని గట్టిగా తడుతూ తన విధి తనను ప్రతీకారం తీర్చుకోవడానికి ఎక్కువగా వేచి ఉండకుండా చేస్తోందని ప్రకటించడం పరిణతికీ, వివేచనకు చిహ్నం కాదు. యుద్ధోన్మాద రాజకీయాలకు సైనిక బలగాలను బలి తీసుకోవడం ఏమంత తెలివైన పని కాదు. ‘కిత్నే ఆద్మీ థీహై’ (అక్కడ ఎంతమంది శత్రువులున్నారు) అంటూ హిందీ సినిమాల్లో అతి భయంకరుడు, అదే సమయంలో ఆరాధనీయుడైన విలన్ గబ్బర్ సింగ్ మత్తులో ఊగుతున్న తన అనుచరులను ప్రశ్నించాడు. 1975లో రమేష్ సిప్పీ తీసిన క్లాసిక్ సినిమా షోలే లోనిదీ దృశ్యం. రెండు వారాల క్రితం భారత్–పాకిస్తాన్ మధ్య జరిగిన ఆ ‘90 గంటల యుద్ధం’ నేపథ్యంలో ఆ సినిమాలోని సంభాషణను మళ్లీ ఉపయోగిస్తున్నాను. లేదా, ఫిబ్రవరి 27 పరిణామాల అనంతరం మన రాజకీయ వ్యూహ ప్రక్రియ గబ్బర్సింగ్ తత్వంలోకి అడుగుపెడుతుండంలోని అవివేకాన్ని వర్ణించడానికి ఆ డైలాగ్ను వర్ణిస్తున్నాను. పాక్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దాడుల సంచలనం సద్దుమణిగిన తర్వాత కూడా, ఇప్పుడు మూడు ప్రశ్నలు మిగిలే ఉన్నాయి: మన బాంబులు/క్షిపణులు జైషే శిబిరాలపై దాడి చేశాయా లేదా? దాడి చేసి ఉంటే అవి ఎంతమందిని చంపాయి (అందుకే ఎంతమంది శత్రువులు ఉన్నారు అని ప్రశ్న)? మూడో ప్రశ్న. భారతీయ యుద్ధ విమానం పాకిస్తాన్కి చెందిన ఎఫ్–16 యుద్ధ విమానాన్ని కూల్చివేసిందా లేదా? ఈ ప్రాథమిక అంశాన్ని ఇది విస్మరిస్తోంది. పైన లేవనెత్తిన మూడు ప్రశ్నలూ ప్రతీకార మానసికధోరణినే ప్రతిబింబిస్తున్నాయి. మన దేశం పరిమాణం, శక్తి, మనపై ఉన్న బాధ్యత రీత్యా చూస్తే ఇలాంటి ధోరణి నిజంగా దురదృష్టకరమైనది. అందుకే ఈ తత్వాన్ని గబ్బర్సింగ్ తత్వం అని పిలుస్తున్నాం. చివరకు మన ప్రధాని నరేంద్రమోదీ సైతం బహిరంగ సభలో భారీ జనసందోహం మధ్య తన ఛాతీని గట్టిగా తడుతూ తన విధి తనను ప్రతీకారం తీర్చుకోవడానికి ఎక్కువగా వేచి ఉండకుండా చేస్తోందని ప్రకటించడం ద్వారా ఈ గబ్బర్సింగ్ తత్వానికి మరింత ఆజ్యం పోశారు. ఇది భారత వ్యూహాత్మక ప్రతిస్పందన ప్రమాదకరమైన రాజకీయీకరణకు స్పష్టమైన సంకేతం. ఇక రెండో అంశం. పాకిస్తాన్ని నిరోధించడానికి మీరు చేసినది సరిపోదన్న భావనకు ఇది స్పష్టమైన అంగీకారం. వైమానిక దాడిపై మన ప్రచారార్భాటాన్ని నేను మరీ ఎక్కువగా విమర్శిస్తూండవచ్చు కానీ వాగాడంబరం కూడా మీ అవకాశాలను పరిమితం చేయవచ్చని మర్చిపోవద్దు. మరోవైపున, ఈ సాహసోపేతమైన వైమానిక దాడులు ఇరుదేశాల మధ్య యుద్ద నియంత్రణకు తోడ్పడలేదని మన ప్రధాని భావిస్తున్నట్లయితే, మన ఉపఖండం ఎదుర్కోబోయే తాజా పరిస్థితి భారత్ ప్రయోజనాలకు పూర్తి విరుద్ధంగానే ఉండవచ్చు. ఉగ్రవాదం–ప్రతీకారం–మళ్లీ ఉగ్రవాద పురోగతి, దాన్ని మళ్లీ దెబ్బతీయడం అనే క్రమం రెండడుగులు ముందుకు నడుస్తున్నట్లు కనిపించవచ్చు కానీ ఆధీన రేఖ పొడవునా దశాబ్దాలుగా వృధాగా సాగుతున్న రక్తపాత చర్యల కంటే ఇదేమంత భిన్నమైనది కాదు. తేడా అల్లా ఏమిటంటే గతంలోవలే చిన్న ఆయుధాలు, మోర్టార్లు, స్నైపర్ రైఫిల్స్, కమాండో–కత్తులు ఉపయోగించడానికి బదులుగా ఇప్పుడు యుద్ధ విమానాలు, మారణాయుధాలను ఉపయోగించడమే. రక్షణరంగ మేధావులకు, తరుణ వయస్కులకు ఇది సాహసకృత్యంగా కనిపించవచ్చు. దురదృష్టవశాత్తూ ఇది మనకు ఓటమి కాకపోవచ్చు కానీ మన వ్యూహా త్మక ప్రయోజనాలతో రాజీపడుతోంది. అనుకూలాంశాలను ముందుగా వెలికి తీద్దాం. గతంలో పార్లమెంట్పై దాడి, ముంబైలో ఉగ్రవాదుల నరమేధం వంటివి పుల్వామా దాడి కంటే భీకరంగా సాగి రెచ్చిగొట్టినా భారత్ ప్రతీకార చర్యలకు దిగలేదు. ఇలాంటి ఘటనలు జరిగిన ప్రతిసారీ భారత్ ఇలాగే స్పందిస్తుందని అందరూ అంచనా వేసేవారు. ప్రపంచం కూడా విసుగెత్తిపోయింది. అందుకే ప్రత్యక్ష ప్రతీకారం ఇప్పుడు తార్కిక ఎంపిక అయిపోయింది. ప్రత్యేకించి బాలాకోట్పై వైమానికి దాడులు పాకిస్తాన్కు మూడు ముఖ్యమైన సందేశాలను పంపాయి. ఒకటి.. సహనంతో కూడిన పలు ఘటనల తర్వాత, పుల్వామాలో ఉగ్రవాదుల మతిహీన చర్యకు ప్రతిచర్యగా పాకిస్తాన్ భూభాగంలోనికి దూసుకొచ్చి భారత్ దాడి చేయగలదని స్పష్టమైంది. ఈ కోణంలో 1990 తర్వాత పాకిస్తాన్ చూపుతున్న అణ్వాయుధ బూచి గాలికెగిరిపోయింది. ఉగ్రవాదం ముగియలేదు కానీ, పాకిస్తాన్ ఈ కొత్త వాస్తవాన్ని పరిగణించాల్సిన పరిస్థితిని చవిచూస్తోంది. రెండు.. అలాంటి ప్రతీకారాన్ని తీసుకునే శక్తి, రహస్య సైనిక చర్యల గోప్యతను నిర్వహించే సామర్థ్యం భారత్కు ఉంది. ఇక మూడోది.. భారత్కు ప్రతీకార దాడులు చేసే హక్కు ఉందని ప్రపంచంలోని కీలకశక్తులు ఇప్పుడు అంగీకరిస్తున్నాయి. తదనుగుణంగా భారత్ కూడా తన వైపునుంచి బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం మనం ఆటను ఇలా ముగించాం. కాని దీనిలోని ప్రతికూలాంశాలను కూడా మనం పరిగణించాలి. ఇక్కడ సైతం మూడు ఉదాహరణలు ఉన్నాయి. దాడులు, ప్రతిదాడులు, భారత్ స్పందన అనేవి ఇరుదేశాల మధ్య సాంప్రదాయిక అసమానత్వం అనుకున్నంత బలంగా లేదని తేల్చిపడేశాయి. టెక్నాలజీ, ఆయుధాలు, సమర్థత వంటి అంశాల్లో ఈ రెండు పక్షాలూ కొన్ని సందర్భాల్లో తప్పితే దాదాపు సమాన స్థితిలో ఉంటున్నాయి. కానీ యుద్ధం చాలాకాలం కొనసాగినట్లయితే, భారత్ సులభంగా పాకిస్తాన్ను అధిగమించగలదు. క్లుప్తంగా చెప్పాలంటే భారత్ పాకిస్తాన్పై సాంప్రదాయకమైన ఆధిక్యతను కలిగి ఉంది. కాని ఆ దేశాన్ని కఠినంగా దండించే పరిస్థితి భారత్కు లేదు. కాందహార్ హైజాక్ ఘటనలో లాగే భారతీయ ప్రజాభిప్రాయం ఒక బలహీనమైన లింకుగా మళ్లీ నిరూపితమైంది. పాకిస్తాన్ కస్టడీలో ఒక భారత యుద్ధ ఖైదీ ఉన్నంతమాత్రానే అటు ఇటో తేల్చుకునే యుద్ధం చేయాల్సిందే అంటూ ప్రజలు ఉన్మాదంతో ఊగిపోయారు. గగనంలో సంకులయుద్ధం జరిగిన సాయంత్రానికి ‘అభినందన్ని వెనక్కు తీసుకురండి’ స్థానంలో ‘పాకిస్తాన్ని శిక్షించండి లేక నలిపివేయండి’ వంటి హ్యాష్టాగ్లు ట్విట్టర్లో వెల్లువెత్తాయి. ఉడీ తరహా సినిమాల్లో ప్రదర్శితమయ్యే ‘స్వదేశాభిమాన యుద్ధోన్మాదం’ తలకెక్కిన భారతీయ ప్రజారాశులు నిజమైన యుద్ధంలో ఇరుదేశాలూ లేక ఇరుపక్షాలూ నష్టపోతాయనే వాస్తవాన్ని విస్మరించాయి. కొన్నిసార్లు మనమే ఎదురుదెబ్బ తినొచ్చు కూడా. క్లుప్తంగా చెప్పాలంటే, ప్రస్తుత సంక్షోభం ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో భాగంగా పాకిస్తాన్ పట్ల కాస్త సహనంతో, తక్కువ దండనాత్మక దృష్టితో కొత్త దృక్పథంతో వ్యవహరించాల్సి ఉందనే పాఠాన్ని భారత్కు నేర్పింది. కాబట్టి భారతీయ నాయకులు ఏదైనా విజయాన్ని సాధించడంపై మొదటగా దృష్టి పెట్టి తర్వాతే భావోద్వేగానికి స్థానం కల్పించాలి. ప్రస్తుత సంక్షోభం తాలూకూ పరిణామాలు ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే సంభవిస్తాయి. చరిత్ర విరామాన్ని కోరుకోదు. అలాగే పాకిస్తాన్ వైఖరిని సులభంగా సంస్కరించడం కష్టం. వాస్తవానికి ఇది కొత్త ప్రమాణం అయితే పాకిస్తాన్, అంతర్జాతీయ సమాజం కూడా దాన్ని ఉపయోగించుకుంటాయి. నేను దాడి చేస్తాను, దానికి మీరు ప్రతిదాడి చేస్తారు, తర్వాత నేను ప్రతీకారానికి దిగుతాను. ఇద్దరం ఏదో ఒక అంశాన్ని పట్టుకుని ఘనంగా ఇంటికి వెళతాం. దీంతో తమ తమ జాతీయ సైన్యాలను ప్రేమిస్తూనే, పెద్దగా విశ్వసించని ఇరుదేశాల ప్రజల ముందూ విజయాన్ని ప్రకటించుకుని మురిసిపోతాం. అందుకే యుద్ధం అంటే ఏమిటో ప్రభుత్వం తన ప్రజలకు అర్థం చేయిం చగలగాలి. గగనయుద్ధంలో పూర్తి నియంత్రణ సాధించే అమెరికన్ యుద్ధ, డ్రోన్ దాడుల వీడియో దృశ్యాలు చూసి మనలో చాలా మందిమి మతిపోగొట్టుకున్నాం. లేక ఉడీ సినిమాల్లో చూపించేటటువంటి మూర్ఖపు యుద్ధ సన్నివేశాలను బాగా తలకెక్కించుకున్నాం. కానీ వాస్తవంగా జరిగే యుద్ధం చిన్నపిల్లల టాయ్ షాపులోకి అడుగెట్టడమంత సులభం కాదు. మన సైనికులు సన్నీ డయోల్ లేక విక్కీ కౌశల్ వంటి అసమానధీరులు కావచ్చు కానీ అదే సమయంలో పాకిస్తానీ సైనికులు జానీ వాకర్ తరహా వంటివారు కాదు. వారు కూడా యుద్ధంలో భీకరంగా పోరాడే తత్వం కలవారే. వారు కూడా తమ మాతృభూమి పుత్రులే. భారత వృత్తిగత సైనికులు పాక్ సైనికులను తేలిగ్గా చూడటం లేదు. అందుకే వారు నిజమైన యుద్ధాల్లో గెలుస్తున్నారు. కానీ ప్రజల మనస్సుల్లో ఈ వాస్తవ చిత్రణను చొప్పించాల్సిన బాధ్యత మన నేతలపైనే ఉంది. కాని తమ యుద్ధోన్మాద రాజకీయాలకు సైనిక బలగాలను బలి తీసుకోవడం ఏమంత తెలివైన పని కాదు. చివరగా యుద్ధం కంటే యుద్ధాన్ని నివారించే, నిరోధించే తరహా వ్యూహం ఉన్నతమైనది. మన వ్యూహం పాకిస్తాన్ని నిరోధించే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. కాకుంటే ఇరుదేశాలూ సరికొత్త ఉప–అణు నిరోధకతకు సన్నద్ధం కావాలి. నీవు నిరంతర ఘర్షణాత్మక యుద్ధంలో ఓడిపోతావని భారత్ పాకిస్తాన్కు చెప్పగలగాలి. సైనిక ఘర్షణల్లో నీవు గెలవవచ్చు కానీ ఆర్థికంగా నీకే ఎక్కువ నష్టం సంభవిస్తుందని పాక్ కూడా భారత్కు చెప్పగలగాలి. కాబట్టి ఇరుదేశాలకు ఒకే దారి ఉంది. మొత్తం జీడీపీలో రక్షణ బడ్జెట్ని 2 శాతానికే పరిమితం చేయాలి. అంటే ప్రస్తుతం ఇరుదేశాలు వెచ్చిస్తున్న రక్షణ రంగ బడ్జెట్లో ఇది 25 శాతం మాత్రమే. అలాగే సైనిక బలగాలను సంస్కరించాలి. సాంప్రదాయికమైన, నిర్ణయాత్మకమైన దండనా చర్యలకు వారిని సన్నద్ధం చేయాలి. ఐఎంఎఫ్ నుంచి తీసుకున్న 12 బిలియన్ డాలర్ల రుణ భారం వారిని తిరిగి ఆలోచింపజేస్తుంది. ప్రపంచంలోనే ఉత్తమమైన సైన్యాలు ఒకప్పుడు అతిశక్తివంతంగానూ, ఆధిపత్యంతోనూ ఉండేవే. వాటిని మనం ఇంతవరకు ఉపయోగించుకోలేదు. భారత్ అలాంటి ఉత్తమ సైన్యాల్లో ఒకటి కావచ్చు కూడా. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
‘పాక్ పాట పాడుతున్న కాంగ్రెస్ నేతలు’
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్లో భారత్ చేపట్టిన వైమానిక దాడులపై సందేహాలు వ్యక్తం చేస్తున్న విపక్ష నేతలపై బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల ప్రకటనలపై పాకిస్తాన్ అంతటా చర్చ జరుగుతోందని, పాక్ మీడియా సైతం పాక్కు అనుకూలంగా మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతల ప్రకటనలను ప్రస్తావిస్తోందని ఆరోపించారు. ఉగ్రవాదంపై పాక్ వైఖరికి అనుకూలంగా, భారత ప్రయోజనాలకు విరుద్ధంగా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఉగ్రవాదానికి సంబంధించి కాంగ్రెస్ నేతల తీరు పాకిస్తాన్ పోస్టర్ బాయ్స్లా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై పాక్ తీరును సమర్ధించేలా దిగ్విజయ్ సింగ్, సిద్ధూ వంటి కాంగ్రెస్ నేతల ప్రకటనలున్నాయని ఆరోపించారు. కాగా, పాకిస్తాన్లోని బాలాకోట్లో జైషే ఉగ్రవాద శిక్షణా శిబిరంపై భారత వైమానిక దళం చేపట్టిన మెరుపు దాడుల్లో మరణించిన ఉగ్రవాదుల సంఖ్యపై పాలక, విపక్ష నేతల మధ్య వాగ్వాదం జరుగుతున్న నేపథ్యంలో రాంమాధవ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.