అమర జవాన్లకు బాలీవుడ్‌ నివాళి | Bollywood Pays Tribute To Pulwama Martyrs | Sakshi
Sakshi News home page

అమర జవాన్లకు బాలీవుడ్‌ నివాళి

Aug 14 2019 4:53 PM | Updated on Aug 14 2019 4:55 PM

Bollywood Pays Tribute To Pulwama Martyrs - Sakshi

న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ఘనంగా నివాళులర్పించేందుకు బాలీవుడ్‌ తారలు సిద్దమయ్యారు. అందుకోసం వారంతా ఓ వీడియో సాంగ్‌లో కనిపించనున్నారు. ‘తూ దేశ్‌ మేరా’ అని సాగే ఈ పాటలో అమితాబ్‌ బచ్చన్‌, షారుఖ్‌ఖాన్‌, అమీర్‌ఖాన్‌, ఐశ్వర్య రాయ్‌, రణబీర్‌ కపూర్‌, కార్తీక్‌ ఆర్యన్‌, టైగర్‌ ష్రాఫ్‌లు కనిపించనున్నారు. ఎంతో బిజీగా ఉండే తారలు.. అమర జవాన్లకు నివాళులర్పించడానికి తమ సమయాన్ని ఈ వీడియో కోసం కేటాయించినట్టుగా తెలుస్తోంది.

73వ స్వాతంత్ర్యదినోత్సవానికి ఒక్క రోజు ముందుగా ఈ వీడియో సాంగ్‌కు సంబంధించి కవర్‌ పోస్టర్‌ను సీఆర్పీఎఫ్‌ ట్విటర్‌ ద్వారా  విడుదల చేసింది. అలాగే ఇందులో పాలుపంచుకున్న బాలీవుడ్‌ తారలకు ధన్యవాదాలు తెలిపింది. సీఆర్పీఎఫ్‌ విడుదల చేసిన ఈ పోస్టర్‌లో బాలీవుడ్‌ తారలు జవాన్లకు సెల్యూట్‌ చేస్తూ కనిపించారు. ఈ పాట కోసం సింగర్లు జావేద్ అలీ, జుబిన్ నౌటియల్, షబాబ్ సబ్రి, కబీర్ సింగ్‌లు తమ గళం విప్పారు. మీట్ బ్రోస్ సంగీతం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement