Tributes
-
‘పుల్వామా’ అమరులకు ప్రధాని మోదీ ఘన నివాళులు
న్యూఢిల్లీ/హల్దా్వనీ: జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో 2019 ఫిబ్రవరి 14వ తేదీన జరిగిన ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లకు ప్రధాని మోదీ శుక్రవారం నివాళులర్పించారు. దేశం పట్ల వారు అచంచలమైన విశ్వాసాన్ని కనబరిచారని కొనియాడారు. వారి త్యాగాలను భవిష్యత్తు తరాలు గుర్తుంచుకుంటాయని ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఉగ్రవాదులను ఏరిపారేసేందుకు మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. పుల్వామా ఉగ్ర ఘటనలో అసువులు బాసిన జవాన్లకు ఆయన ఘనంగా నివాళులర్పించారు. వీరి త్యాగాల వల్లే మన దేశ సరిహద్దులు భద్రంగా ఉన్నాయన్నారు. మానవీయతకే అతిపెద్ద శత్రువైన ఉగ్రవాదంపై పోరుకు నేడు ప్రపంచమే ఏకమైందని శుక్రవారం హోం మంత్రి అమిత్ షా ‘ఎక్స్’లో తెలిపారు. పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ని ఆత్మాహుతి దళ బాంబర్ వాహనంతో ఢీకొట్టడంతో 40 మంది జవాన్లు అసువులు బాసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు ప్రతీకారంగా వైమానికదళం యుద్ధ విమానాలు పీవోకేలోని బాలాకోట్ ఉగ్ర స్థావరాన్ని నేలమట్టం చేశాయి. -
నేతాజీని స్ఫూర్తిగా తీసుకోండి
న్యూఢిల్లీ: భావిభారత పౌరులైన విద్యార్థులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. నేతాజీ జయంతిని పురస్కరించుకుని పరాక్రమ్ దివస్ కార్యక్రమంలో భాగంగా పాత పార్లమెంట్ భవంతిలో నేతాజీ చిత్రపటం వద్ద మోదీ నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులనుద్దేశించి తర్వాత మోదీ ప్రసంగించారు. ‘ నాడు స్వరాజ్యం కోసం ప్రజలు ఐక్యంగా మెలిగారు. నేడు ప్రజల మధ్య అదే ఐక్యత సాధిస్తే అది వికసిత భారత్కు బాటలు వేస్తుంది. దేశాన్ని బలహీనపరిచే, దేశ ఐక్యతను నీరుగార్చే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. నేతాజీ నుంచి స్ఫూర్తి పొందాలి. అభివృద్ధి చెందిన భారత్ను సాధించాలన్న లక్ష్యంగా ముందుకుసాగే మనందరికీ నేతాజీ సదా స్ఫూర్తినందిస్తూనే ఉంటారు. కంఫర్ట్ జోన్ను వీడదాంతర్వాత మోదీ కటక్లో జరిగిన పరాక్రమ్ దివస్ కార్యక్రమంలోనూ వర్చువల్గా మాట్లాడారు. ‘‘ నేతాజీ ఎప్పుడూ తాను సౌకర్యవంతమైన జీవితం(కంఫర్ట్జోన్లో) గడపాలనుకోలేదు. దేశ స్వాతంత్య్ర కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ సాకారం కావాలంటే మనందరం కంఫర్ట్ జోన్ను వీడి కష్టించి పనిచేయాలి. ప్రపంచస్థాయి అత్యుత్తమ పనితీరు కనబరచాలి. మెరుగైన పనితీరు మీద దృష్టిపెట్టాలి. అభివృద్ధి చెందిన భారత్నే సుభాష్ చంద్రబోస్ కలలుగన్నారు. వికసిత్ భారత్ను సాక్ష్యాత్కారింపజేసుకుని నేతాజీకి నిజమైన నివాళులు అర్పిద్దాం’’ అని అన్నారు. నిజమైన నేతచర్చలో పాల్గొన్న విద్యార్థులతో మోదీ మాట్లాడారు. నేతాజీ బోధనల్లో నీకేం ఇష్టం? అని ఒక అమ్మాయిని అడగ్గా.. ‘‘నాకు మీ రక్తం ఇవ్వండి. నేను మీకు స్వా తంత్య్రాన్ని ఇస్తా.. అనే మాటలు ఎంతో స్ఫూర్తివంతంగా ఉంటాయి. అన్నింటికన్నా ఆయనకు దేశమే ముఖ్యం. దేశంలో కర్భన ఉద్గారాల వెల్లడిని తగ్గించాలి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించాలి. ఇందుకోసం ఎలక్ట్రిక్ వాహనాలు, బస్సులు వాడాలి’’ అని అమ్మాయి చెప్పింది. దీంతో మోదీ కల్పించుకుని.. ‘‘ మా ప్రభుత్వం అదే బాటలో పయనిస్తోందికదా. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం 1,200 విద్యుత్ బస్సులను సమకూర్చింది. మరిన్ని అందుబాటులోకి తేనుంది. పీఎం సురక్షా యోజన సైతం తెచ్చాం. ఇంటి పైకప్పుపై సౌరఫలకాల వ్యవస్థ ఏర్పాటుచేసుకుంటే నెలనెలా విద్యుత్ బిల్లుల బాధ ఉండదు’’ అని మోదీ అన్నారు. -
కార్టర్కు కన్నీటి వీడ్కోలు
వాషింగ్టన్: దిగ్గజ అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్కు అమెరికా ప్రభుత్వం ఘన నివాళులర్పించింది. దేశ రాజధాని వాషింగ్టన్లో జరిగిన అధికారిక నివాళుల కార్యక్రమంలో దేశాధ్యక్షుడు జో బైడెన్ సెల్యూట్ చేసి తమ ప్రియతమ నేతకు తుది వీడ్కోలు పలికారు. గురువారం వాషింగ్టన్ సిటీలోని జాతీయ చర్చికు కార్టర్ పార్థివదేహాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ లాంఛనాలతో అధికారిక సంతాప కార్యక్రమాలు పూర్తిచేశారు. ఈ నివాళుల కార్యక్రమంలో అధ్యక్షుడు బైడెన్తోపాటు అగ్రరాజ్య మాజీ అధ్యక్షులు జార్జి బుష్, బిల్ క్లింటన్, బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షులుగా సేవలందించిన ఐదుగురు అగ్రనేతలు ఇలా ఒకే వేదికపై కనిపించడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. చివరిసారిగా 2018 డిసెంబర్లో మాజీ దేశాధ్యక్షుడు జార్జ్ హెచ్ డబ్ల్యూ బుష్ సంతాప కార్యక్రమానికి ఇలా ఒకే చోట ఐదుగురు అధ్యక్షులు హాజరయ్యారు. కార్టర్కు ఘనంగా అంజలి ఘటిస్తూ బైడెన్ తన సంతాప సందేశం చదివి వినిపించారు. ‘‘ అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన వారు తదనంతర కాలంలో ఎలాంటి నిరాడంబర జీవించాలో, హుందాగా ఉండాలో కార్టర్ ఆచరించి చూపారు. అంతర్జాతీయ సమాజానికి సేవ చేయాలన్న ఆయన సంకల్పానికి రాజకీయాలు ఏనాడూ ఆయనకు అడ్డురాలేదు’’ అని బైడెన్ అన్నారు. నివాళుల కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ దంపతులు సైతం పాల్గొన్నారు. మాజీ అధ్యక్షునిగా నివాళిగా సైనికులు తుపాకులతో ‘21 గన్ సెల్యూట్’ సమర్పించారు. 39వ అధ్యక్షుడిగా సేవలందించిన కార్టర్ 100 ఏళ్లు జీవించి డిసెంబర్ 29వ తేదీన తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. కార్టర్ భౌతిక కాయాన్ని మూడు రోజులపాటు అమెరికా పార్లమెంట్ భవనంలో మూడు రోజుల పాటు ప్రజల సందర్శనార్థం ఉంచారు. గురువారం ఉదయం నేషనల్ క్యాథడ్రల్కు తీసుకొచ్చి ఈ అధికారిక నివాళుల కార్యక్రమం చేపట్టారు. దీంతో ప్రభుత్వ అధికారిక వీడ్కోలు కార్యక్రమం గురువారంతో ముగిసింది. తర్వాత కార్టర్ భౌతికకాయాన్ని గురువారం జార్జియాలోని స్వస్థలం పెయిన్స్ గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ భార్య రొజలిన్ కార్టర్ సమాధి పక్కనే కార్టర్ను ఖననం చేస్తారు. రోజలిన్ 77 ఏళ్ల వయస్సులో 2023 నవంబర్లో కన్నుమూశారు. -
మన్మోహన్కు అంతర్జాతీయ మీడియా నివాళులు
మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ మరణానికి అంతర్జాతీయ మీడియా సంతాపం తెలిపింది. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి బాటన నడిపిన నాయకుడని ప్రపంచ మీడియా ప్రశంసించింది. ఆర్థిక సంస్కరణల రూపశిల్పి: బీబీసీ 1991లో ఆర్థిక మంత్రిగా, 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా భారత ఆర్థిక వ్యవస్థను ఆధునీకరించడంలో మన్మోహన్సింగ్ కీలక పాత్ర పోషించారు. ఆయన కీలక సరళీకృత ఆర్థిక సంస్కరణల రూపశిల్పి. భారత అత్యున్నత పదవిని నిర్వహించిన మొదటి సిక్కుగా చారిత్రక ప్రాముఖ్యత కలిగిన నేత. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పారు. పదవులు నచ్చని రాజు: రాయిటర్స్ మన్మోహన్ సింగ్.. పదవులు నచ్చని రాజు. భారత్లో అత్యంత విజయవంతమైన నాయకులలో ఒకరు. ఆయన పాలనలో జరిగిన ఆర్థిక వృద్ధి లక్షలాదిమందిని పేదరికం నుండి బయటకు తీసుకొచ్చింది. గొప్ప ప్రధానిగా ప్రపంచవ్యాప్తంగా గౌరవం పొందినా.. సోనియాగాంధీ చేతిలోనే ప్రభుత్వం ఉందనే విమర్శలను ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. దూరదృష్టిగల నేత: న్యూయార్క్ టైమ్స్ మన్మోహన్సింగ్ భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక వేదికపైకి నడిపించిన దూరదృష్టి గల నేత, మృదుభాíÙ. పాకిస్తాన్తో సయోధ్య కోసం ఆయన అనేక ప్రయత్నాలు చేశారు. సమగ్రతకు చిహ్నం: వాషింగ్టన్ పోస్ట్ మన్మోహన్సింగ్ టెక్నోక్రాట్ నుంచి ప్రధాని స్థాయికి నాటకీయంగా ఎదిగారు. భారత్–అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్రను పోషించారు. ఆయన హయాంలో జరిగిన ఇండో–యూఎస్ పౌర అణు ఒప్పందం ఒక మైలురాయి. సమగ్ర నాయకుడైన ఆయన శక్తిహీనులని ప్రత్యర్థుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన వ్యక్తి: బ్లూమ్బర్గ్ మన్మోహన్సింగ్ గొప్ప సంస్కర్త. 1990లలో భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో కీలక పాత్ర పోషించారు. అవినీతి కుంభకోణాలతో రెండో పర్యాయంలో ఆయన సవాళ్లు ఎదుర్కొన్నారు. ఇది పెట్టుబడిదారులను నిరాశపరిచింది. ఆయన ప్రతిష్ఠను దెబ్బతీసింది. ఎల్లలెరుగని స్నేహితుడు: ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడంలో మన్మోహన్సింగ్ పాత్ర అమోఘం. వేగవంతమైన ఆర్థిక వృద్ధికి ఆయన చేసిన కృషి, సంస్కరణలు ఆయన పదవీకాలంలో మైలురాళ్లు. సామాజిక విధానం, దౌత్యంలో ఆయన నాయకత్వం గొప్పది. 2జీ స్పెక్ట్రమ్ కేసు, బొగ్గు కుంభకోణం వంటి వివాదాలు ఆయన తర్వాతి కాలాన్ని దెబ్బతీశాయి. సౌమ్యుడైన నాయకుడు: అల్ జజీరా మన్మోహన్ సింగ్ సౌమ్య ప్రవర్తన కలిగిన టెక్నోక్రాట్. గొప్ప వ్యక్తిగత సమగ్రత కలిగిన నాయకుడు. దూర దృష్టితో సామాజిక, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. -
అసాధారణ వ్యక్తి
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన జ్ఞాపకాలు ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’పుస్తకంలో మన్మోహన్ సింగ్ (Manmohan Singh) అసాధారణ నాయకత్వానికి నివాళులు అర్పించారు. ‘‘అసాధారణ జ్ఞానం ఉన్న వ్యక్తి. ఆర్థిక సంస్కరణల పట్ల. భారత ప్రజల శ్రేయస్సు పట్ల ఆయనకు నిబద్ధత, అంకితభావం, అచంచలమైన చిత్తశుద్ధి ఉంది. ఆయన లక్షలాది మందిని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చారు. తెలివైన వ్యక్తి. ఆలోచనాపరుడు. నిజాయితీపరుడు. భారత ఆర్థిక వ్యవస్థపై (Indian Economy) మన్మోహన్ సింగ్ ప్రభావం మరిచిపోలేనిది. వృద్ధిని ప్రోత్సహించే, పేదరికాన్ని తగ్గించే, విద్య, ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యతనిచ్చే విధానాలను అమలు చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (నరేగా), సమాచార హక్కు చట్టం వంటి తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు దేశంపై శాశ్వత ప్రభావాన్ని చూపాయి. తన పదవీకాలంలో విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ, ఆయన భవిష్యత్ పట్ల ఆశాజనకంగా ఉన్నారు’’. – అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆయన అంకితభావాన్ని గుర్తుంచుకుంటాం : అమెరికా మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల భారత ప్రజలకు అమెరికా ప్రగాఢ సంతాపం తెలిపింది. ‘‘అమెరికా–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి దారులేసిన గొప్ప ఛాంపియన్లలో మన్మోహన్ సింగ్ ఒకరు. గత రెండు దశాబ్దాల్లో మన దేశాలు కలిసి సాధించిన అనేక అంశాలకు ఆయన కృషి పునాది వేసింది. అమెరికా–భారత్ పౌర అణు సహకార ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లారు. భారత వేగవంతమైన ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చిన ఆర్థిక సంస్కరణలకు స్వదేశంలో మన్మోహన్ సింగ్ గుర్తుండిపోతారు. డాక్టర్ సింగ్ మృతికి సంతాపం తెలుపుతున్నాం. అమెరికా, భారత్లను మరింత దగ్గర చేయడానికి ఆయన చూపిన అంకితభావాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాం’’అని అమెరికా ప్రకటించింది. ఆయన పర్యటన మైలురాయి ‘‘మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణానికి మాల్దీవుల ప్రజల తరపున సంతాపం తెలుపుతున్నా. 2011 నవంబరులో మాల్దీవుల్లో ఆయన చేసిన చారిత్రాత్మక పర్యటన మన ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. అభివృద్ధి పట్ల డాక్టర్ మన్మోహన్సింగ్కు ఉన్న నిబద్ధత, ‘లుక్ ఈస్ట్ పాలసీ’ని బలోపేతం చేయడంలో ఆయన నాయకత్వం దక్షిణాసియా ప్రాంత అభివృద్ధికి, సహకారం పెంపొందించడంలో కీలక పాత్ర పోషించాయి. ఈ విపత్కర సమయంలో ఆయన కుటుంబానికి, భారత ప్రజలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా’’ – డాక్టర్ మొహమ్మద్ ముయిజు, మాల్దీవుల అధ్యక్షుడు మన్మోహన్సింగ్ నాకు గురువు ‘‘డాక్టర్ మన్మోహన్ సింగ్ను నేను గురువుగా భావిస్తా. జర్మనీ మాజీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ కూడా ఆర్థిక అంశాలపై డాక్టర్ సింగ్ సలహాలు తీసుకున్నారు. 2013లో యూరోజోన్ క్రైసిస్ మీటింగ్ నిర్వహించినప్పుడు ఆమె డాక్టర్ సింగ్ సహాయం కోరారు’’ – జపాన్ మాజీ ప్రధాని షింజో అబే -
ఆర్థిక సంస్కర్తకు అశ్రు నివాళి
సాక్షి, న్యూఢిల్లీ: దివికేగిన ఆర్థిక సంస్కర్త మన్మో హన్ సింగ్కి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధా నమంత్రి నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ తదితర ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. త్రివర్ణ పతాకం చుట్టిన మన్మోహన్ పార్థివదేహాన్ని ఢిల్లీలోని ఆయన నివాసమైన 3, మోతిలాల్ నెహ్రూ రోడ్డుకు తరలించారు. నివాళులర్పించడానికి శుక్రవారం పార్టీలకు అతీతంగా పెద్ద సంఖ్యలో నాయకులు, కేంద్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, పలువురు ప్రముఖులు తరలివచ్చారు. ఈ సందర్భంగా దేశాభివృద్ధికి మన్మోహన్ అందించిన సేవలను స్మరించుకున్నారు. మన్మోహన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన భార్య గురుశరణ్ కౌర్ను ఓదార్చారు. ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జె.పి.నడ్డాతోపాటు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాందీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తదితరులు మన్మోహన్ భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్, హిమాచల్ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖూ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఢిల్లీ సీఎం అతిశీ, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్, ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే కూడా నివాళులర్పించారు. నేడు నిగమ్బోధ్ ఘాట్లో అంత్యక్రియలు దివంగత మాజీ ప్రధాని అంత్యక్రియలు శనివారం ఉదయం జరుగుతాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ చెప్పారు. మన్మోహన్ పారి్థవదేహాన్ని ఉదయం 8 గంటలకు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తరలిస్తామని, ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు ప్రజలు సందర్శించవచ్చని తెలిపారు. 9.30 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమవుతుందని అన్నారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయని వెల్లడించారు. శనివారం ఉదయం 11.45 గంటలకు ఢిల్లీలోని నిగమ్బోధ్ ఘాట్ శ్మశాన వాటికలో మన్మోహన్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కేంద్ర హోంశాఖ తెలియజేసింది. పూర్తి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని రక్షణ శాఖకు సూచించినట్లు పేర్కొంది. కేంద్ర మంత్రివర్గం సంతాపం మన్మోహన్ మృతి పట్ల కేంద్ర మంత్రివర్గం సంతాపం ప్రకటించింది. ప్రధాని మోదీ నేతృత్వంలో కేబినెట్ శుక్రవారం సమావేశమైంది. మన్మోహన్ ఆత్మశాంతి కోసం తొలుత రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. ప్రభుత్వంతోపాటు యావత్తు దేశం తరఫున సంతాపం తెలియజేశారు. అనంతరం సంతాప తీర్మానం ఆమోదించారు. మహోన్నత రాజనీతిజు్ఞడు, ఆర్థికవేత్త, గొప్ప నాయకుడిని దేశం కోల్పోయిందని తీర్మానంలో పేర్కొన్నారు. ప్రధానమంత్రిగా ఆయన మనందరిపై బలమైన ముద్ర వేశారని కొనియాడారు. మన్మోహన్ గౌరవార్థం ప్రభుత్వం ఏడు రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించింది. సీడబ్ల్యూసీలో సంతాప తీర్మానం ఆమోదం మన్మోహన్ సింగ్కు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) నివాళులర్పించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన సీడబ్ల్యూసీ శుక్రవారం ఏఐసీసీ ప్రధాన కార్యా లయంలో భేటీ అయ్యింది. సోనియా గాం«దీ, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ హాజరయ్యారు. మన్మోహన్కు సంతాపం ప్రకటిస్తూ ఒక తీర్మా నం ఆమోదించారు. భారత రాజకీయాల్లో, ఆర్థిక వ్యవస్థలో అగ్రగణ్యుడు మన్మోహన్ అని కొనియాడారు. ఆయన కృషితో ప్రపంచస్థాయిలో మన దేశానికి ప్రత్యేక గుర్తింపు, గౌరవం లభించాయని పేర్కొన్నారు. దేశంలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టిన మన్మోహన్ చిరస్మరణీయులని ఉద్ఘాటించారు. ప్రజల తలరాతలు మార్చేలా ఎన్నో విప్లవాత్మక పథకాలు, కార్యక్రమాలు తీసుకొచ్చిన ఘనత ఆయనదేనని ప్రశంసించారు. ఢిల్లీలో స్మారక చిహ్నం మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు దేశ రాజధాని ఢిల్లీలో స్మారక చిహ్నం నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమాచారాన్ని కాంగ్రెస్కు కూడా అందించినట్లు శుక్రవారం ప్రభుత్వ వర్గాలు వివరించాయి. ఇందుకు అనువైన స్థలాన్ని ఎంపిక చేసేందుకు కొంత సమయం పడుతుందని తెలిపాయి. అయినప్పటికీ ఈ అంశంపై కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని విమర్శించాయి.అదే సంప్రదాయం పాటించాలి: ఖర్గే ఢిల్లీలో మన్మోహన్ సింగ్కు స్మారకం నిర్మించడానికి వీలైన చోటేఆయన అంత్యక్రియలు నిర్వహించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరారు. ఈ మేరకు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీకి రెండు పేజీల లేఖ రాశారు. మన మాజీ ప్రధానమంత్రులకు, రాజనీతిజు్ఞలకు అంత్యక్రియలు జరిగిన చోటే స్మారకం నిర్మించారని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా అదే సంప్రదాయం పాటించాలని విజ్ఞప్తి చేశారు. దేశానికి మన్మోహన్ అందించిన విశిష్టమైన సేవలను ఖర్గే తన లేఖలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంతకముందు ఆయన ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడారు. మన్మోహన్ స్మారక నిర్మాణంపై చర్చించారు. మన్మోహన్ శాశ్వత విశ్రాంతి తీసుకొనే ప్రదేశాన్ని గొప్పగా తీర్చిదిద్దాలని, అదొక పవిత్రమైన స్థలంగా ఉండాలని పేర్కొన్నారు. -
దేశం మరువలేని దార్శనికుడు
చరిత్ర సృష్టించటం, దాన్ని తిరగరాయటం, వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టడం అందరివల్లా కాదు. ప్రపంచాన కోట్లమందిలో ఒక్కరికి కూడా ఆ అవకాశం అంత సులభంగా దక్కదు. కొన్ని తరాలకు ఒకరైనా అలాంటివారు ఉద్భవిస్తారంటే నమ్మలేం. అలాంటి అరుదైన విశిష్ట వ్యక్తుల్లో గురువారం రాత్రి కన్నుమూసిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఒకరు. పేదింట పదిమంది సంతానంలో ఒకరిగా, కిరోసిన్ లాంతరు దగ్గర చదువుకున్న మన్మోహన్ జీవితంలో అధిరోహించిన శిఖరాలు ఉన్నతమైనవి. 1991లో నాటి ప్రధాని పీవీ నరసింహారావు ఆయనను ఆర్థికమంత్రిగా ప్రకటించినప్పుడు అందరూ విస్తుపోయారు. ఆయనే నమ్మలేదు. అప్పటికే ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనా మిక్స్లో అధ్యాపకుడిగా పనిచేశారు. జెనీవా కేంద్రంగా పనిచేసే స్వతంత్ర ఆర్థిక మేధావుల బృందం సౌత్ కమిషన్కు సెక్రటరీ జనరల్గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా, రిజర్వ్బ్యాంక్ గవర్నర్గా ఉన్నారు. యూజీసీ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. రాజకీయాల్లో మనుగడ సాగించటానికి అవసరమైన వాగ్ధాటి, సులభంగా చొచ్చుకుపోయే తత్వంలేని ఒక విద్యావేత్త, ఆర్థిక నిపుణుడు దేశానికి ఆర్థికమంత్రేమిటని ఆశ్చర్యపోయారు. కానీ అందరూ అనుకున్నట్టు ఆయన సాధారణ వ్యక్తి కాదని త్వరలోనే అర్థమైంది. దేశాన్ని ప్రగతి పట్టాలెక్కించి శరవేగంతో పరుగులెత్తించగల నూతన ఆర్థిక విధానాలను సృజించటంలో అసాధారణ ప్రజ్ఞాపాటవాలు గలవాడని సర్వులూ గ్రహించారు. కేంద్ర ఆర్థికమంత్రిగా 1991లో ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ స్వతంత్ర భారతంలో ఎన్నడూ ఎరుగనిది. ఫేబియన్ సోషలిజం భావనల ఆధారంగా నెహ్రూ విరచించిన సామ్యవాద ఆర్థిక విధానాల నుంచి లేశమాత్రం వైదొలగినా దేశం అధోగతి పాలవుతుందని అప్పట్లో కాంగ్రెస్ విశ్వసించేది. మరోపక్క రకరకాల నియంత్రణలతో ‘లైసెన్స్ రాజ్’గా అపకీర్తి పాలైంది మన వ్యవస్థ. ఎన్నో ఆర్థిక క్లేశాలతో, మరెన్నో ఒడుదొడుకులతో ఉన్న ఆ వ్యవస్థకు తన వినూత్న బడ్జెట్తో సంపూర్ణ జవసత్వాలిచ్చినవారు మన్మోహన్. అన్యుల కీర్తిని అపహరించటానికి ససేమిరా ఇష్టపడని పీవీ... ఆర్థిక సంస్కరణల కర్త, కర్మ, క్రియ కూడా ఆయనేనని చాటారు. అందువల్లే సారథిగా పీవీయే ఉన్నా సంస్కరణల ఆద్యుడిగా మన్మోహన్నే గుర్తిస్తారు. ఆయన విధానాల పర్యవసానంగా అంతవరకూ నిలువెల్లా ఆవరించిన నిర్ణయ రాహిత్యత కనుమరుగైంది. ఒక్కుమ్మడిగా ప్రైవేటు పెట్టుబడి రెక్కలు విప్పుకుంది. లాభార్జన మాత్రమే ధ్యేయంగా భావించే విదేశీ పెట్టుబడులు వెల్లు వెత్తాయి. పబ్లిక్ రంగ సంస్థలు సైతం పోటీలో దీటుగా నిలిస్తే తప్ప మనుగడ లేదని గ్రహించాయి.‘చరిత్ర అయినా నన్ను దయతో గుర్తుపెట్టుకుంటుందని ఆశిస్తాను’ అని ఒక సందర్భంలో అన్నారాయన. తనపై వచ్చిపడుతున్న విమర్శల జడికి ఆ హృదయం ఎంతగా తల్లడిల్లిందో చెప్పే మాట అది. నిజం... ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టినప్పుడైనా, పార్టీలోనూ వెలుపలా వచ్చిన అవాంతరాలను అధిగమించి దృఢంగా అమలు చేసినప్పుడైనా ఆయనకు శాపనార్థాలు ఎదుర య్యాయి. సొంత పార్టీలోనే వ్యతిరేకులు తయారయ్యారు. తొలినాళ్లలోనే ఏదోరకంగా పక్కకు తప్పించాలన్న ప్రయత్నాలూ జరిగాయి. మన రహస్యాలను ఐఎంఎఫ్కు చేరేస్తున్నారనీ, ఆ సంస్థ కనుసన్నల్లో విధానాలు రూపొందిస్తున్నారనీ ఎలాంటి ఆధారాలూ లేకుండానే కొందరు వండి వార్చారు. పార్లమెంటులో అలజడి ఖాయమనుకున్నారు. కానీ అప్పటికే మన్మోహన్ నిజాయితీ, నైతిక నిష్ఠ, నిష్కాపట్యత, సచ్ఛీలత అందరికీ అర్థమయ్యాయి గనుక అవన్నీ దూదిపింజñ ల్లా తేలిపోయాయి. వాటిని విపక్షం సభలో ప్రస్తావించినా పెద్దగా పట్టుబట్టలేదు. ఆ తర్వాత పీవీ సహచర మంత్రుల్లో కనీసం 20 మందిపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చినా మన్మోహన్ను వేలెత్తిచూపే సాహసం ఎవరూ చేయలేదు. ఆ సుగుణాలే మన్మోహన్ను అనంతర కాలంలో ప్రధానిగా ఎంచుకునేందుకు దోహదపడ్డాయి. దేన్నయినా సాధించటంలో ఆయన పట్టుదల ఎంత టిదో చెప్పటానికి అమెరికాతో కుదిరిన అణు ఒప్పందమే ఉదాహరణ. మద్దతునిస్తున్న వామ పక్షాలూ, ఇతర పార్టీలూ ససేమిరా కాదన్నా ఆ ప్రతిపాదనను పార్లమెంటు ముందుంచి ఆమోదింపజేసుకున్న సాహసి ఆయన.మన్మోహన్ అత్యున్నత స్థాయి ఆర్థిక నిపుణుడు కావొచ్చు... ఆ రంగంలో ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారం విప్పిచెప్పిన అనేకానేక విశ్లేషణాత్మక గ్రంథాల రచయిత కావొచ్చు. కానీసిద్ధాంత రాద్ధాంతాల్లో కూరుకుపోకుండా కళ్లెదుటి వాస్తవాలను ఆచరణీయ దృక్పథంతో పరిశీలించి సరిగా స్పందించగల విశాల దృక్పథం ఉన్న నాయకుడు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో ఉచిత విద్యుత్ ప్రతిపాదన చేసినప్పుడు మొదట్లో దాన్ని ఇష్టపడకున్నా సాగు సంక్షోభాన్ని అధిగమించటానికి అది తోడ్పడిన తీరు గుర్తించాక మన్మోహన్ దాన్ని స్వాగతించిన తీరు మరువలేనిది. ప్రజాజీవన రంగంలో పారదర్శకత కోసం సమాచార హక్కు చట్టం, విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించే విద్యాహక్కు చట్టం, రెక్కాడితేగానీ డొక్కాడని బడుగుజీవులకు కరువురోజుల్లో పని కల్పన కోసం ఉపాధి హామీ చట్టం వంటివి తీసుకొచ్చి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టినా ఏనాడూ ఆయన కీర్తిప్రతిష్ఠలను ఆశించలేదు. తన విధానాలతో దేశాన్ని వైభవోజ్జ్వల శకానికి తీసుకెళ్లినా చివరివరకూ నిగర్విగా, వినమ్రుడిగా జీవించిన దార్శనికుడు మన్మోహన్ను ఈ దేశం ఎన్నటికీ మరిచిపోదు. ఆ అసాధారణ, అపురూప విజ్ఞాన ఖనికి ‘సాక్షి’ నివాళులర్పిస్తోంది. -
మాజీ ప్రధానికి క్రీడాలోకం శ్రద్ధాంజలి
న్యూఢిల్లీ: అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్కు క్రీడాలోకం నివాళులు అర్పించింది. పలువురు దిగ్గజాలు, మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, రెజ్లర్ వినేశ్ ఫొగాట్, షట్లర్ సింధు, గోల్ఫర్ జీవ్ మిల్కాసింగ్లు ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మాజీ ప్రధాని మన్మోహన్ మృతి దేశానికి తీరని లోటు. ఆయన సేవల్ని జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. –సచిన్ టెండూల్కర్రెస్ట్ ఇన్ పీస్ మన్మోహన్జీ. మీ జీవితం మా అందరికీ స్ఫూర్తిదాయకం. 2013లో మీతో ముచ్చటించిన క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేను. మీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. –షట్లర్ పీవీ సింధు మన్మోహన్ సింగ్ మరణవార్త నన్ను తీవ్రంగా బాధించింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో స్వర్ణం గెలిచాక ఆయనతో నేను భేటీ అయ్యాను. ఆయన నాయకత్వం, ప్రధానిగా ఎంచుకున్న దీర్ఘకాలిక లక్ష్యాలవల్లే భారత్ వృద్ధి సాధించింది. ఆయన సేవలు జాతి ఎన్నటికీ మరువదు. –షూటర్ అభినవ్ బింద్రా నా జీవితంలో నేను కలిసి అతిగొప్ప వ్యక్తుల్లో మన్మోహన్ ఒకరు. దార్శనికతలో ఆయన్ని మించినవారు లేరు. ప్రపంచం గొప్ప జ్ఞానిని కోల్పోయింది. –గోల్ఫర్ జీవ్ మిల్కాసింగ్ మన్మోహన్ ప్రధాని మాత్రమే కాదు. దేశ ప్రగతి కోసం నిరంతరం పాటుపడిన ఆర్తికవేత్త. ఆయన దూరదృష్టి, ప్రవేశపెట్టిన సంస్కరణలు దేశాన్ని ముందుకు నడిపించాయి. –మాజీ రెజ్లర్, ఎమ్మెల్యే వినేశ్ ఫొగాట్ మాజీ ప్రధాని మన్మోహన్ గొప్ప రాజనీతిజ్ఞుడు. భారత్ను ప్రగతిపథంలో నిలిపేందుకు అలుపెరగని కృషి చేశారు. బరువెక్కిన హృదయంతో ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. –యువరాజ్ సింగ్ -
NRI: జాకీర్ హుస్సేన్ మృతిపై ఐఎఎఫ్ సంతాపం
డాలస్, టెక్సస్: తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ మృతి పట్ల ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ (ఐఎఎఫ్సి) ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కార్యవర్గ సమావేశంలో తీవ్ర సంతాపం ప్రకటించింది. ఐఎఎఫ్సి అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ "సంగీతరంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత పురస్కారంగా భావించే గ్రామీ పురస్కారన్ని నాల్గు పర్యాయాలు అందుకున్నవారు, ప్రపంచ ప్రఖ్యాత తబలా వాయిద్య విద్వాంసుడు, పద్మవిభూషణ్ జాకీర్ మృతి ప్రపంచంలోని సంగీత ప్రియులందరికీ తీరని లోటని అన్నారు. పసి ప్రాయంలో ఏడు సంవత్సరాల వయస్సునుండే ఎంతో దీక్షతో తన తండ్రి, సంగీత విద్వాంసుడు అయిన అల్లా రఖా వద్ద తబలా వాయించడంలో మెళుకువలు నేర్చుకుని, విశ్వ వ్యాప్తంగా మేటి సంగీత విద్వాంసులైన రవిశంకర్, ఆలీ అఖ్బర్ ఖాన్, శివశంకర శర్మ, జాన్ మేక్లెగ్లిన్, ఎల్. శంకర్ లాంటి వారెందరితోనో 6 దశాబ్దలాగా పలు మార్లు, ఎన్నో విశ్వ వేదికలమీద సంగీతకచేరీలు చేసి అందరి అభిమానాన్ని చూరగొన్న జాకీర్ మృతిపట్ల వారి కుటుంబ సభ్యులుకు తీవ్ర సంతాపం తెలియజేస్తూ, జాకీర్ తో తనకున్న ప్రత్యక్ష పరిచయాన్ని, తాను జరిపిన ముఖా-ముఖీ కార్యక్రమ లంకెను పంచుకున్నారు. ఈ సమావేశంలో ఐఎఎఫ్సి ఉపాధ్యక్షులు తాయబ్ కుండా వాలా, రావు కల్వ ల, కార్యదర్శి మురళి వెన్నం, కోశాధికారి రన్నా జానీ, బోర్డ్ సభ్యులు రాంకీ చేబ్రోలు హాజరయ్యారు. -
వల్లభాయ్ పటేల్ వర్ధంతి.. వైఎస్ జగన్ నివాళులు
సాక్షి, తాడేపల్లి: నేడు సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. పటేల్కు నివాళులు అర్పించారు. భారతదేశ అభివృద్దికి ఆయన ఆలోచనలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని కొనియాడారు.నేడు సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్థంతి సందర్భంగా వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘భారతదేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నాను. భారతదేశానికి ఏకత్వం, సామాజిక సంస్కరణలను అందించిన విజన్ ఉన్న నాయకుడు వల్లభాయ్ పటేల్. దేశాన్ని ఆయన ఉన్నతంగా తీర్చిదిద్దారు. భారతదేశ అభివృద్దికి ఆయన ఆలోచనలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి’ అంటూ కామెంట్స్ చేశారు. Remembering Sardar Vallabhbhai Patel Ji, the Iron Man of India, on his death anniversary. A visionary leader whose contributions to the unification of India and social reforms shaped the nation we are today. His legacy continues to inspire the spirit of unity and progress.— YS Jagan Mohan Reddy (@ysjagan) December 15, 2024 -
పొట్టి శ్రీరాములు వర్ధంతి.. వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: నేడు పొట్టి శ్రీరాములు వర్ధంతి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. పొట్టి శ్రీరాములుకు నివాళులు అర్పించారు. తెలుగు వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని అన్నారు.పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు. తెలుగు వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన అమరజీవి శ్రీ పొట్టిరాములుగారి వర్ధంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించి తెలుగు వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన అమరజీవి శ్రీ పొట్టిశ్రీరాములుగారి వర్ధంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులు. pic.twitter.com/hiEfSCdvln— YS Jagan Mohan Reddy (@ysjagan) December 15, 2024 -
పార్లమెంట్పై ఉగ్రదాడి ఘటన..
న్యూఢిల్లీ: 2001 డిసెంబర్ 13వ తేదీన పార్లమెంట్పై జరిగిన ఉగ్రదాడిని ఎదుర్కొని ప్రాణ త్యాగం చేసిన భద్రతా సిబ్బందికి లోక్సభ శుక్రవారం ఘనంగా నివాళులర్పించింది. సభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే అమరుల గౌరవార్థం సభ్యులంతా లేచి నిలబడి కొద్దిసేపు మౌనం పాటించారు. అనంతరం పాత పార్లమెంట్ సంవిధాన్ సదన్ వెలుపల జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అమరులకు పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ధన్ఖడ్, ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. సీఐఎస్ఎఫ్ జవాన్లు అమరులకు సెల్యూట్ చేశారు. అనంతరం మౌనం పాటించారు. బాధిత కుటుంబాల సభ్యులతో నేతలు మాట్లాడారు. కాగా, అప్పటి ఘటనలో పార్లమెంట్ భద్రతా విభాగం, ఢిల్లీ పోలీసులు, సీఆర్పీఎఫ్లకు చెందిన 8 మంది సిబ్బందితోపాటు సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ శాఖకు చెందిన ఓ ఉద్యోగి నేలకొరిగారు. పార్లమెంట్లోకి ప్రవేశించి మారణ హోమం సృష్టించేందుకు తెగబడిన పాకిస్తాన్కు చెందిన మొత్తం ఐదుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు.సర్వదా రుణపడి ఉంటాం: రాష్ట్రపతి ముర్ము 2001లో ఉగ్ర మూకల దాడి నుంచి పార్లమెంట్ను రక్షించే క్రమంలో ప్రాణత్యాగం చేసిన వారికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఘనంగా నివాళులర్పించారు. అమరులకు సర్వదా రుణపడి ఉంటామని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. ఉగ్రమూకలను జాతి యావత్తూ కలిసి కట్టుగా ఎదుర్కొందని, ఉగ్రవాదంపై పోరుకు దేశం కట్టుబడి ఉంటుందని ఆమె ‘ఎక్స్’లో తెలిపారు. -
వీర జవాను సుబ్బయ్యకు వైఎస్ జగన్ నివాళులు
సాక్షి,తాడేపల్లి: వీర జవాను సుబ్బయ్యకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నివాళులర్పించారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్(ట్విటర్)లో బుధవారం(డిసెంబర్11) ఒక పోస్టు చేశారు.‘రియల్ హీరో సుబ్బయ్యకు సెల్యూట్. జమ్మూలో విధి నిర్వహణలో సుబ్బయ్య వీరమరణం చెందారు.ల్యాండ్మైన్ నుంచి 30 మంది జవాన్లను కాపాడి తాను మాత్రం ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. సుబ్బయ్య కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నివాళులర్పిస్తున్నా’అని వైఎస్ జగన్ ట్వీట్లో పేర్కొన్నారు.— YS Jagan Mohan Reddy (@ysjagan) December 11, 2024 -
అంబేద్కర్కు వైఎస్ జగన్ నివాళులు
సాక్షి,తాడేపల్లి:రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నివాళులర్పించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం(డిసెంబర్6) జరిగిన కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వైఎస్ జగన్.ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తి ఎల్లవేళలా సమాజానికి మార్గదర్శకంగా నిలిచేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయమని కొనియాడారు. విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ గారి సామాజిక న్యాయ మహాశిల్పాన్ని తమ హయాంలో ఏర్పాటు చేసిన విషయాన్ని వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కమార్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్,మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, నెడ్ క్యాప్ మాజీ ఛైర్మన్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
జ్యోతిరావు పూలే వర్ధంతి.. వైఎస్ జగన్ నివాళులు
సాక్షి, తాడేపల్లి: బడుగు బలహీన వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడిన మహానీయుడు సామాజిక ఉద్యమ కారుడు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. గురువారం తాడేపల్లిలోని ఆయన నివాసంలో పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. స్త్రీలకు విద్య ఎందుకు అంటున్న రోజుల్లో స్త్రీల కోసం పాఠశాలను ప్రారంభించి వారికి విద్యాబుద్ధులు నేర్పించిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే అని ప్రశంసించారు. విద్యలో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయ ఇంఛార్జ్, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ ఆర్. రమేష్ యాదవ్, మాజీ మంత్రులు జోగి రమేష్, విడదల రజిని, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి అంకంరెడ్డి నారాయణమూర్తి పాల్గొన్నారు.మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా శ్రీ వైయస్ జగన్ నివాసంలో ఆయన చిత్రపటానికి పుప్పాంజలి ఘటించి నివాళులర్పించిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షులు శ్రీ @ysjagan ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయ ఇంఛార్జ్, ఎమ్మెల్సీ లేళ్ళ… pic.twitter.com/2pE6xHV50l— YSR Congress Party (@YSRCParty) November 28, 2024 -
#NimratKaur 30 ఏళ్ల కల నెరవేరింది : నటి నిమ్రత్ కౌర్ (ఫొటోలు)
-
కడసారి వీడ్కోలు.. రతన్ టాటా అంతిమ యాత్ర (ఫోటోలు)
-
లాల్ సలాం.. లాల్ సలాం
సాక్షి, న్యూఢిల్లీ: అశ్రునయనాల మధ్య, కడసారి చూపు కోసం తరలివచ్చిన వేలాదిమంది అభిమానులు, కార్యకర్తల మధ్య కామ్రేడ్ సీతారాం ఏచూరి నివాళులు పూర్తి అయ్యాయి. దేశవ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులు, నేతలు ఏచూరికి తుది వీడ్కోలు పలికారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాం«దీ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సీపీఎం పోలిట్బ్యూరో సభ్యులు ప్రకాశ్ కారత్, బృందా కారత్, వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, తదితర ప్రముఖులు ఏచూరి పారి్థవ దేహానికి ఘన నివాళులు అర్పించారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, సచిన్ పైలట్, డీఎంకే పార్టీ మంత్రి ఉదయనిధి స్టాలిన్, ఎంపీ కనిమొళి, టీఆర్ బాలు, దయానిధి మారన్, ఆప్ నేత మనీశ్ సిసోడియా, కాంగ్రెస్ నేతలు చిదంబరం, జైరాం రమేష్, అజయ్ మాకెన్, రాజీవ్ శుక్లా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, ఎమ్మార్పిఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ, బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి తదితరులు నివాళులు అర్పించారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, చైనా, వియత్నాం రాయబారులు నివాళులర్పించారు. అనంతరం ఏచూరి భార్య సీమాచిస్తీ, కుమార్తె అఖిల, కుమారుడు డాని‹Ùలను పరామర్శించి మనోధైర్యం కల్పించారు. ఏచూరిని కడసారి చూసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ఎస్ఎఫ్ఐ బృందం, ఢిల్లీ జేఎన్యూ విద్యార్థి సంఘాలు, వివిధ రాష్ట్రాలకు చెందిన పార్టీ కార్యకర్తలు, విదేశాలకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఢిల్లీ గోల్మార్కెట్లోని సీపీఎం కేంద్ర కార్యాలయం నుంచి ఎయిమ్స్ వరకు అంతిమ యాత్ర నిర్వహించారు. జోరు వానను లెక్కచేయకుండా ‘ఇక సెలవు కామ్రేడ్, రెడ్ సెల్యూట్ ఏచూరి’అంటూ నినాదాలు చేశారు. సాయంత్రం 6 గంటలకు వైద్య విద్యార్థుల పరిశోధనల నిమిత్తం ఏచూరి పార్థివ దేహాన్ని కుటుంబీకులు, పార్టీ నేతలు ఎయిమ్స్కు అప్పగించారు. -
AP: వైఎస్ఆర్కు రాష్ట్రవ్యాప్తంగా నేతల ఘన నివాళులు
సాక్షి,విశాఖపట్నం: దివంగత నేత వైఎస్రాజశేఖరరెడ్డి ఒక వ్యక్తి కాదని ఒక వ్యవస్థ శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం(సెప్టెంబర్2) వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా విశాఖపట్నం బీచ్రోడ్డులో ఉన్న ఆయన విగ్రహానికి వైఎస్ఆర్సీపీ నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్ఆర్కు ఉన్న ప్రజాదరణ దేశంలో మరే సీఎంకు లేదు: బొత్సవైఎస్ పేరు చెప్పగానే అనేక సంక్షేమ పథకాలు గుర్తొస్తాయి.ఆరోగ్యశ్రీ ఫీజు రీయింబర్స్మెంట్లాంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు.అన్ని వర్గాల ప్రజలకు వైఎస్ హయాంలో మేలు జరిగింది.పార్టీలకతీతంగా వైఎస్ను ప్రజలు ఆరాధిస్తారు.వైఎస్ అడుగుజాడల్లోనే వైఎస్జగన్ పయనిస్తున్నారు. ఆయన ఆశయాల కోసం పనిచేస్తున్నారు.వైఎస్ ఆశయాలను మేమంతా కలిసి ముందుకు తీసుకువెళ్తామని ప్రమాణం చేస్తున్నాంప్రజల గుండెల్లో దేవుడిగా వైఎస్.. రాజ్యసభ సభ్యులు గొల్లబాబురావుపేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు.వైఎస్ ఆశయాలను వైఎస్ జగన్ కొనసాగిస్తున్నారు.మళ్లీ వైఎస్ జగన్ ను మనమంతా కలిసి ముఖ్యమంత్రిగా చేసుకోవాలివైఎస్ఆర్ జిల్లాలో.. వైఎస్రాజశేఖర్రెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ జిల్లాలోని పొద్దుటూరు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి,మునిసిపల్ ఛైర్మన్ లక్ష్మీదేవి, మాజీ ఆప్కోబ్ చైర్మన్ మల్లెల జాన్సీ,కౌన్సిలర్లు, నాయకులు వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన -
ఇబ్రహీం రైసీకి ఇరాన్ వీడ్కోలు
టెహ్రాన్: హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలుకోల్పోయిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీకి దేశ రాజధాని టెహ్రాన్ ప్రజలు ఘన తుది వీడ్కోలు పలికారు. ఇరాన్ సుప్రీంలీడర్ అయాతొల్లాహ్ అలీ ఖమేనీ సైతం నివాళులరి్పంచారు. బుధవారం సంతాప ర్యాలీలో టెహ్రాన్ సిటీ వీధుల గుండా భారీ వాహనం మీద రైసీ పారి్థవదేహాన్ని తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ఇరానీయన్లు పాల్గొని తమ నేతకు తుది వీడ్కోలు పలికారు. భారత్ తరఫున ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ బుధవారం టెహ్రాన్ వెళ్లి రైసీకి నివాళులర్పించారు. మహిళా, మానవ హక్కుల హననానికి పాల్పడి ‘టెహ్రాన్ కసాయి’గా పేరుబడినందుకే రైసీ సంతాప ర్యాలీలో తక్కువ మంది పాల్గొన్నారని అంతర్జాతీయ మీడియా వ్యాఖ్యానించింది. సంతాప ర్యాలీలో ఖమేనీ పక్కనే తాత్కాలిక దేశాధ్యక్షుడు మహమ్మద్ మొఖ్బర్ ఏడుస్తూ కనిపించారు. బుధవారం ఖమేనీ మినహా మాజీ దేశాధ్యక్షులెవరూ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనకపోవడం గమనార్హం. రైసీ మృతికి సంతాపంగా భారత్లోనూ ఒక రోజు సంతాపదినం పాటించారు. -
సేవా తత్పరుడు జేఎస్ రెడ్డి
శివాజీనగర: జేఎస్ రెడ్డిగా అందరికీ సుపరిచితులైన జక్కా శ్రీనివాసులురెడ్డి గొప్ప సేవా తత్పరుడని ప్రముఖులు అన్నారు. ఈ నెల 1వ తేదీన బెంగళూరులో తుదిశ్వాస విడిచిన జేఎస్ రెడ్డి దశదిన కర్మ కార్యక్రమాన్ని బుధవారం బెంగళూరులోని ఇందిరా నగర్ క్లబ్లో నిర్వహించారు. మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడుతో పాటు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్ర«భాకర్రెడ్డి, నెల్లూరు మాజీ ఎమ్మెల్యే జే.కే.రెడ్డి, బెంగళూరు తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షుడు డాక్టర్ ఏ.రాధాకృష్ణరాజు, వైఎస్సార్సీపీ నాయకుడు భక్తవత్సలరెడ్డి, భాస్కర్రెడ్డి, వెంకట్, నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు రాజకీయ నాయకులు, బెంగళూరుకు చెందిన వివిధ రంగాల ప్రముఖులు పాల్గొని జేఎస్ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించారు. సమాజానికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. సినీ నిర్మాత, దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి మాట్లాడుతూ జేఎస్ రెడ్డి తన పుట్టినగడ్డకు విశేష సేవలు అందించారన్నారు. జేఎస్ రెడ్డి ఉత్తమ వ్యక్తిత్వం కలిగి స్వశక్తితో ఎదిగారన్నారు. కాంట్రాక్టర్గా ఆయన ప్రతిభ అపారమన్నారు. గుజరాత్లో నర్మదా నది కాలువల నిర్మాణంలో ఆయన ప్రతిభను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మెచ్చుకొని జేఎస్ రెడ్డిని ప్రభుత్వం తరఫున సన్మానించారన్నారు. కాంట్రాక్టర్లకు అలాంటి గౌరవం దక్కడం అరుదైన విషయమన్నారు. కర్ణాటక రీజియన్లో అత్యధిక ఆదాయపు పన్ను చెల్లించిన వ్యాపారవేత్తగా ఆయనకు బిరుదు లభించిందన్నారు. రెడ్క్రాస్ ఆస్పత్రి భవన నిర్మాణానికి సొంత డబ్బు వెచ్చించడమే కాకుండా ఆస్పత్రి నిర్వహణను చూశారన్నారు. క్యాన్సర్ ఆస్పత్రిలో తన సొంత డబ్బుతో వేలాది మంది పేద రోగులకు వైద్యం అందించేందుకు కృషి చేశారని గుర్తు చేశారు. కోట్ల రూపాయలతో చిల్డ్రన్స్ పార్కు నిర్మించారన్నారు. రైతుల సంక్షేమానికి దాదాపు రూ.15 కోట్లు వ్యయం చేశారన్నారు. ఎన్నో అభివృద్ధి పనులకు సహకరించారన్నారు. దాన ధర్మాలు సమాజ బాధ్యతగా భావించారన్నారు. ఆయన మృతి నెల్లూరు జిల్లాకు తీరని లోటని స్మరించుకున్నారు. జేఎస్ రెడ్డి మృతి సమాజానికి తీరని లోటు: ఎం.వెంకయ్య నాయుడు జేఎస్ రెడ్డి తనకు మంచి మిత్రుడని, గొప్ప సేవాతత్పరుడని, ఆయన మృతి వారి కుటుంబానికి, సమాజానికి పెద్ద లోటని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. జేఎస్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులరి ్పంచి మాట్లాడారు. జేఎస్ రెడ్డి భౌతికంగా లేకపోయినా అందరి హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారన్నారు. పెద్దల మాటలను గౌరవిస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారన్నారు. జేఎస్ రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని ప్రారి్థస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. కార్యక్రమంలో జేఎస్ రెడ్డి కుమారుడు భక్తవత్సలరెడ్డి, కుమార్తె ఇందిర తదితరులు పాల్గొన్నారు. -
సోషల్ జస్టిస్కు నిలువెత్తు సాక్ష్యం..
సాక్షి, అమరావతి: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నిలువెత్తు స్ఫూర్తి సామాజిక న్యాయ మహా శిల్పం రూపంలో సగర్వంగా నిలిచింది. విజయవాడ నగరం నడిబొడ్డున స్వరాజ్ మైదానం 18.81 ఎకరాల్లో రూ.404.35 కోట్లతో విగ్రహ నిర్మాణాన్ని పూర్తిచేయడం విశేషం. అలాగే 81 అడుగుల ఎత్తులో కాంక్రీట్ పీఠం(ఫెడస్టల్)పై 125 అడుగుల ఎత్తుగల ఈ అంబేడ్కర్ కాంస్య విగ్రహం కొలువై ఉంది. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్(సామాజిక న్యాయ మహా శిల్పం)ను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారు. గత టీడీపీ ప్రభుత్వం ఎక్కడో మారుమూల ప్రాంతంలో అంబేడ్కర్ స్మృతివనాన్ని నిర్మిస్తామని స్థలం ఎంపిక చేసి కనీస కార్యాచరణ లేకుండా గాలికొదిలేసింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం చెప్పింది చేసి చూపించేలా సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ఆవిష్కరించి చరిత్ర సృష్టించారు. దేశీయంగా తయారైన ఈ కాంస్య విగ్రహం ప్రపంచంలోనే ఎత్తయినది, దేశంలోని మతాతీత విగ్రహాల్లో ఇదే అతి పెద్దది కావడం మరో విశేషం. అంతటి స్ఫూర్తివంతమైన సామాజిక న్యాయ మహాశిల్పం ప్రాంగణంలో అంబేడ్కర్ 133వ జయంతి కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు శనివారం సమీక్షించారు. ఈ కార్యక్రమాన్ని ఎన్నికల కోడ్కు లోబడి నిర్వహించేలా చర్యలు చేపట్టారు. ప్రజలు, సామాజికవేత్తలు, అంబేడ్కర్ వాదులు విగ్రహాన్ని సందర్శించి నివాళులర్పించేలా ఏర్పాట్లు చేశారు. దర్శనీయక్షేత్రంగా.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్ఫూర్తిని రాష్ట్ర ప్రజలకు అందించేలా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఇది ప్రముఖ దర్శనీయ క్షేత్రంగా అందరికీ అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో విజయవాడ నగర నడిబొడ్డున చరిత్రాత్మక స్వరాజ్ మైదానాన్ని ప్రభుత్వం ఎంచుకుంది. సాధారణ ప్రజలు ఉదయం, సాయంత్రం నడక కోసం ఈ ప్రాంతాన్ని అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేశారు. పచ్చని ప్రకృతి ప్రతిబింబించేలా సౌందర్యవంతంగా దీనిని తీర్చిదిద్దారు. సామాజిక న్యాయ మహాశిల్పం ప్రాంతంలో మరెన్నో ప్రత్యేకతలను ఏర్పాటు చేశారు. అంబేడ్కర్ ఎక్స్పీరియన్స్ సెంటర్, రెండు వేల మంది కూర్చునేలా కన్వెన్షన్ సెంటర్, ఫుడ్ కోర్ట్, చి్రల్డన్స్ ప్లే ఏరియా, వాటర్ బాడీస్, మ్యూజికల్ ఫౌంటెన్, లాంగ్ వాక్ వేస్తో సహా మొత్తం ప్రాంతాన్ని తీర్చిదిద్దడం విశేషం. -
కేశినేని భవన్లో ఎన్టీఆర్కు నివాళుల్పరించిన కేశినేని నాని
-
President Droupadi Murmu: వారి త్యాగాలకు దేశం రుణపడింది
న్యూఢిల్లీ: ఇరవై రెండేళ్ల క్రితం పార్లమెంట్పై దాడి ఘటనలో అమరులైన భద్రతాబలగాలకు దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యాఖ్యానించారు. బుధవారం పార్లమెంట్ దాడి మృతులకు ఆమె నివాళులర్పించారు. ‘‘ ప్రజాస్వామ్య దేవాలయంపైనే దాడికి తెగబడి అత్యున్నత స్థాయి రాజకీయనేతలను అంతంచేయాలని ఉగ్రవాదులు హేయమైన కుట్రపన్నారు. ఆ కుట్రను భారత భద్రతాబలగాలు వమ్ముచేసి ఆ క్రమంలో ప్రాణత్యాగంచేశాయి. ఆ ధైర్యశాలులకు నా నివాళులు. మాతృభూమి కోసం మీరు చేసిన ప్రాణత్యాగానికి దేశం సదా రుణపడి ఉంటుంది. ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు సిద్ధమని అందరం ప్రతినబూనుదాం’’ అని సామాజిక మాధ్యమ ఖాతా ‘ఎక్స్’లో ట్వీట్చేశారు. మానవాళికి ముప్పుగా పరిణమించిన ఉగ్రవాదం ఏ దేశంలో ఏ రూపంలో ఉన్నాసరే దానిని సమూలంగా తుదముట్టించాలని వ్యాఖ్యానించారు. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ నేత సోనియా గాంధీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, ప్రహ్లాద్ జోషి, పియూశ్ గోయల్, జితేంద్ర సింగ్, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలో అమరులకు నివాళులర్పించారు. అమరుల త్యాగాన్ని భారత్ సదా స్మరించుకుంటుందని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అన్నారు. త్యాగాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి: ప్రధాని పార్లమెంట్లో అమరులకు బుధవారం ప్రధాని మోదీ సైతం నివాళులర్పించారు. ‘‘ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వీరోచిత భద్రతా సిబ్బందికి నా హృదయపూర్వక నివాళులు. ఆపత్కాలంలో తెగువ చూపిన వారి త్యాగాలను యావత్ దేశం చిరస్థాయిగా గుర్తుంచుకుంటుంది’’ అని మోదీ వ్యాఖ్యానించారు. అమరులకు లోక్సభ నివాళులర్పించింది. లోక్సభ కార్యకలా పాలు బుధవారం మొదలవగానే స్పీకర్ బిర్లా మాట్లాడారు. ‘ ఉగ్రవాదులతో పోరాటంతో ప్రాణాలు కోల్పోయిన భద్రతా బలగాల కుటుంబాలకు భారత ప్రభుత్వం అండగా ఉంటుంది. ఉగ్రవాదంపై భారత పోరు కొనసాగుతుంది’’ అని అన్నారు. ఈ సందర్భంగా సభ్యులంతా లేచి నిల్చుని కొద్దిసేపు మౌనం పాటించారు. -
నేడు అంబేడ్కర్ వర్ధంతి.. సీఎం జగన్ నివాళులు
సాక్షి, తాడేపల్లి: నేడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. నివాళులు అర్పించారు. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి అంబేడ్కర్ చేసిన సేవలు నిరుపమానమని సీఎం జగన్ అన్నారు. కాగా, సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా..‘భారత రాజ్యాంగ ప్రదాత, దేశ పాలనా మార్గదర్శకాల విధాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి నేడు. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు నిరుపమానం. ఆ మహనీయుని అడుగుజాడల్లో నడుస్తూ మన ప్రభుత్వం బడుగు బలహీనవర్గాల సంక్షేమానికి అహర్నిశలూ కృషి చేస్తోంది. బాబా సాహెబ్ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగ ప్రదాత, దేశ పాలనా మార్గదర్శకాల విధాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి నేడు. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు నిరుపమానం. ఆ మహనీయుని అడుగుజాడల్లో నడుస్తూ మన ప్రభుత్వం బడుగు బలహీనవర్గాల సంక్షేమానికి అహర్నిశలూ కృషి చేస్తోంది. బాబా సాహెబ్ గారి… pic.twitter.com/P3v4M1kxqT — YS Jagan Mohan Reddy (@ysjagan) December 6, 2023 మరోవైపు.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాయలంలో సీఎం జగన్.. అంబేడ్కర్కు నివాళులు అర్పించారు. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన సీఎం జగన్. ఈ కార్యక్రమానికి మంత్రులు తానేటి వనిత, మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు. -
‘26/11’ మృతులకు రాష్ట్రపతి నివాళులు
న్యూఢిల్లీ: 2008 నవంబర్ 26న ముంబైలో ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా దాడిలో మృతిచెందిన భద్రతా సిబ్బందికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం ఘనంగా నివాళులరి్పంచారు. మాతృభూమి సంరక్షణ కోసం వారు ప్రాణాలరి్పంచారని కొనియాడారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానికి వ్యతిరేకంగా పోరాడుతామంటూ ప్రతిజ్ఞ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు రాష్ట్రపతి ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
గాంధీ జయంతి సందర్బంగా సీఎం జగన్ నివాళులు
-
Father of Green Revolution: ఎం.ఎస్. స్వామినాథన్ కన్నుమూత
సాక్షి, చెన్నై: భారత హరిత విప్లవ పితామహుడు, ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, పద్మవిభూషణ్ డాక్టర్ ఎం.ఎస్.స్వామినాథన్(98) అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. దేశంలో ఆకలితో అలమటించే అభాగ్యులు ఉండకూడదన్న లక్ష్యంతో జీవితాంతం పోరాటం సాగించిన మహా మనిషి తమిళనాడు రాజధాని చెన్నైలోని తన స్వగృహంలో గురువారం ఉదయం 11.15 గంటలకు శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. ఆయన కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు డాక్టర్ సౌమ్యా స్వామినాథన్, మధుర స్వామినాథన్, నిత్యా రాయ్ ఉన్నారు. భార్య మీనా స్వామినాథన్ గతంలోనే మృతిచెందారు. భారత్లో 1960వ దశకం నుంచి హరిత విప్లవానికి బాటలు వేసి, ఆహారం, పౌష్టికాహార భద్రత కోసం అలుపెరుగని కృషి చేసిన స్వామినాథన్ను ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్, రామన్ మెగసెసే, మొట్టమొదటి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ సహా ఎన్నెన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు వరించాయి. స్వామినాథన్ పారీ్థవదేహాన్ని చెన్నై తేనాంపేట రత్నానగర్లో ఉన్న నివాసం నుంచి గురువారం రాత్రి తరమణిలోని ఎం.ఎస్.స్వామినాథన్ ఫౌండేషన్కు తరలించారు. శుక్రవారం అప్తులు, ప్రముఖుల సందర్శనార్థం పారీ్థవ దేహాన్ని ఇక్కడే ఉంచుతారు. విదేశాల్లో ఉన్న కుమార్తె చెన్నైకి రావాల్సి ఉండడంతో శనివారం స్వామినాథన్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సన్నిహితులు చెప్పారు. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి ఎం.ఎస్.స్వామినాథన్ మృతిపట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. దేశానికి ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. మానవాళి కోసం భద్రమైన, ఆకలికి తావులేని భవిష్యత్తును అందించే దిశగా ప్రపంచాన్ని నడిపించడానికి మార్గదర్శిగా పనిచేశారని స్వామినాథన్పై రాష్ట్రపతి ముర్ము ప్రశంసల వర్షం కురిపించారు. ఘనమైన వారసత్వాన్ని మనకు వదిలి వెళ్లారని చెప్పారు. స్వామినాథన్ మరణం తనకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. మన దేశం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన హరిత విప్లవానికి నాంది పలికారని, కోట్లాది మంది ఆకలి తీర్చారని, దేశంలో ఆహార భద్రతకు పునాది వేశారని కొనియాడారు. వ్యవసాయ రంగంలో స్వామినాథన్ కృషితో కోట్లాది మంది జీవితాలు మారాయని మోదీ గుర్తుచేశారు. మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు గురువారం స్వామినాథన్ పారీ్థవదేహానికి అంజలి ఘటించారు. ఆయన మరణం దేశానికి, రైతు ప్రపంచానికి తీరని లోటు అని పేర్కొన్నారు. స్వామినాథన్ మరణం పట్ల తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి, ముఖ్యమంత్రి స్టాలిన్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మాజీ ప్రధానమంత్రి హెచ్.డి.దేవెగౌడ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాం«దీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్, భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ తికాయత్ తదితరులు సంతాపం ప్రకటించారు. -
గల్ఫ్ దేశాల్లో వైఎస్సార్కు ఘన నివాళి
సాక్షి,అమరావతి/కడప కార్పొరేషన్: గల్ఫ్ దేశాలైన కువైట్, దుబాయ్, ఖతార్లలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ కువైట్ కన్వినర్ ఎం.బాలిరెడ్డి ఆధ్వర్యంలో కువైట్లో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దుబాయ్ కన్వీనర్ సయ్యద్ అక్రమ్, ఖతార్ కన్వీనర్ దొండపాటి శశికిరణ్ ఆధ్వర్యంలో వైఎస్సార్ చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రజలకు సువర్ణ పాలన అందించారని గుర్తుచేశారు. తండ్రి ఆశయ సాధన కోసం వైఎస్సార్సీపీని స్థాపించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయన కంటే మరో రెండు అడుగులు ముందుకేసి సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేరవేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమాల్లో గల్ఫ్ కో కన్వినర్ గోవిందు నాగరాజు, యూఏఈ అడ్వైజరీ కమిటీ సభ్యులు సోమిరెడ్డి, ఏపీఎన్ఆర్టీఎస్ రీజనల్ కో ఆర్డినేటర్ ఎన్.మహేశ్రెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు ఎం.చంద్రశేఖర్రెడ్డి, ఖతార్ కో కన్వినర్ జాఫర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. న్యూజిలాండ్లో రక్తదానం, అన్నదానం ‘నా అనుకున్న వాళ్ల కోసం ఎందాకైనా వెళ్లే గొప్ప వ్యక్తిత్వం, ఎంతైనా సాయం చేసే గుణం డాక్టర్ వైఎస్సార్ది అని ఏపీ ఎన్ఆర్టీ సోసైటీ అధ్యక్షుడు వెంకట్ ఎస్ మేడపాటి కొనియాడారు. న్యూజిల్యాండ్ దేశం ఆక్లాండ్ నగరంలోని వెస్లీ కమ్యూనిటీ సెంటర్లో వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం న్యూజిలాండ్ ఆధ్వర్యంలో ఆదివారం వైఎస్సార్ వర్ధంతి నిర్వహించారు. జూమ్ మీటింగ్లో పాల్గొన్న వెంకట్ మేడపాటి ప్రసంగిస్తూ విదేశాల్లో ఉన్న ఎంతో మందికి ఎన్నో రకాలుగా వైఎస్సార్ సాయం చేశారని గుర్తుచేశారు. ఫీజు రీయింబర్స్మెంట్తో నిరుపేదలకు సరస్వతీ కటాక్షం కల్పించి.. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఉద్యోగాలు చేసుకుని స్థిరపడేలా చేసిన మహా మనిషి వైఎస్సార్ అని కొనియాడారు. అనంతరం రక్తదానం, అన్నదానం చేశారు. వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం న్యూజిలాండ్ కన్వినర్ బుజ్జె బాబు, ప్రాంతీయ కోఆర్డినేటర్ ఆనంద్ యెద్దుల, పార్టీ ప్రతినిధులు సుస్మిత చిన్నమల్రెడ్డి, సుమంత్ డేగపూడి, ప్రభాకర్ వాసివల్లి, ప్రణవ్ అన్నమరాజు, ఆరోన్ శామ్యూల్ పాల్గొన్నారు. -
మనసుతో పాలించిన మహానేత వైఎస్సార్
సాక్షి, అమరావతి/సాక్షి, నెట్వర్క్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, అభిమానులు, వైఎస్సార్సీపీ శ్రేణులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ ఆ మహానేతకు ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు.. అందించిన మానవీయ, సుపరిపాలనను స్మరించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల అభిమానులు, కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రక్తదానం, అన్నదానం, వస్త్రాల పంపిణీ తదితర కార్యక్రమాలు చేపట్టారు. పేదల అభివృద్ధి, సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేశారంటూ వైఎస్సార్ను గుర్తుచేసుకున్నారు. అభిమాన నేతను తలచుకొంటూ.. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల వ్యాప్తంగా వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. మహానేత విగ్రహాలు, చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. వాడవాడలా ప్రజలు తమ అభిమాన నేత విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. అమలాపురంలో మంత్రి పినిపే విశ్వరూప్, రామచంద్రపురంలో మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, అల్లవరం మండలం కోడూరుపాడులో అమలాపురం ఎంపీ చింతా అనురాధ, కాకినాడలో ఎంపీ వంగా గీత, కొవ్వూరులో హోం మంత్రి తానేటి వనిత, రాజమహేంద్రవరంలో ఎంపీ మార్గాని భరత్రామ్ వైఎస్ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వాడవాడలా సేవా కార్యక్రమాలు ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వాడవాడలా దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. పలుచోట్ల రక్తదాన శిబిరాలు, అన్నదానం, వస్త్రదానం కార్యక్రమాలు నిర్వహించారు. నూజివీడు నియోజకవర్గంలో ఎంపీ కోటగిరి శ్రీధర్, తాడేపల్లిగూడెంలో ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోరంకిలో జరిగిన కార్యక్రమాల్లో ఎంపీ వల్లభనేని బాలÔౌరి పాల్గొన్నారు. ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్తో పాటు హెలికాప్టర్ ప్రమాదంలో అశువులు బాసిన ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ జాన్ వెస్లీ విగ్రహానికి కూడా ప్రజలు పూల మాలలు వేశారు. పల్నాడులో మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేమూరులో మంత్రి మేరుగు నాగార్జున, రేపల్లెలో ఎంపీ మోపిదేవి వైఎస్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. నెల్లూరులోని మాగుంట లేఅవుట్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పాల్గొన్నారు. మహానేతకు ఘన నివాళి ఉమ్మడి చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వైఎస్సార్ వర్థంతి కార్యక్రమాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేశారు. రక్తదాన కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. కడపలో డిప్యూటీ సీఎం అంజద్బాషా, తన నివాసంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి క్యాంప్ కార్యాలయంలో ఎంపీ గురుమూర్తి, కుప్పం బస్టాండు వద్ద ఎంపీ రెడ్డప్ప, నంద్యాలలో ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, దేవనకొండలో మంత్రి గుమ్మనూరు జయరాం, బ్రహ్మసముద్రంలో మంత్రి ఉషశ్రీ చరణ్, అనంతపురంలో ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్ వైఎస్సార్కు నివాళులర్పించారు. ఆత్మకూరు వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి వైఎస్సార్ స్మృతి వనం వరకు భారీ బైక్ర్యాలీ నిర్వహించారు. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం కార్యాలయంలో మహానేత వైఎస్సార్కు నివాళులర్పించారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో.. సంక్షేమ పాలనతో రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దిన మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి కొనియాడారు. తన తండ్రి బాటలోనే రాష్ట్రంలో పేదరిక నిర్మూలన, సంక్షేమ పాలనలో సీఎం వైఎస్ జగన్ కూడా తనదైన ముద్ర వేశారని ప్రశంసించారు. మనసున్న వ్యక్తి పాలకుడైతే ప్రజలు సంతోషంగా ఉంటారనేదానికి వైఎస్సార్ పాలనా కాలమే నిదర్శనమన్నారు. శనివారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సజ్జలతోపాటు మంత్రులు, పలువురు పార్టీ నేతలు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. అన్నదానం, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ బాటలోనే సీఎం జగన్ కూడా మడమ తిప్పకుండా పరిపాలిస్తున్నారని గుర్తు చేశారు. వైఎస్సార్ ఇప్పటికీ ప్రజల మనసుల్లో జీవించి ఉన్నారని కొనియాడారు. మంత్రులు మేరుగు నాగార్జున, జోగి రమేశ్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
YSR : ఇడుపులపాయలో వైఎస్సార్కు సీఎం జగన్ నివాళి
సాక్షి, అమరావతి/ వైఎస్సార్: దివంగత మహానేత, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. సతీసమేతంగా ఇడుపులపాయ వెళ్లిన సీఎం జగన్.. తల్లి వైఎస్ విజయమ్మ, మరికొందరు కుటుంబ సభ్యులు, మంత్రులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు ఆయన తన ట్విటర్ ఖాతాలో తండ్రి వైఎస్సార్ను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు నాన్నా… మీరు లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది. భౌతికంగా మా మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో చిరకాలం జీవించే లీడర్ మీరు. మీ పట్ల ప్రజలకున్న ప్రేమాభిమానాలు నాకు కొండంత అండగా నిలిచాయి. మీ ఆశయాలే సంక్షేమం, సమగ్రాభివృద్ధి లక్ష్యాల సాధనలో నన్ను చేయిపట్టి నడిపిస్తున్నాయి. వర్ధంతి… pic.twitter.com/Fq1Ngg4f5Q — YS Jagan Mohan Reddy (@ysjagan) September 2, 2023 ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, మేడా మల్లికార్జున రెడ్డి, రఘురామిరెడ్డి, పీజేఆర్ సుధాకర్ బాబు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్ మల్లికార్జున రెడ్డి, మేయర్ సురేష్ బాబు హాజరయ్యారు. చదవండి: Johar ysr: అజేయుడు -
ట్యాంక్ బండ్పై గద్దర్ విగ్రహం పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: ప్రజా గాయకుడు గద్దర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై పెట్టాలని వైఎస్సా ర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం అల్వాల్ భూదేవి నగర్లోని గద్దర్ నివాసానికి వెళ్లిన ఆమె ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, సమాధి వద్ద నివాళులర్పించారు. గద్దర్ కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెల్పిన షర్మిల... ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా ముద్రించాల్సిన అవసరం ఉందని, గద్దర్ సొంత ఊరు తూప్రాన్లో ఆయన పేరిట స్మారక భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. గద్దర్ చేత కంటతడి పెట్టించిన కేసీఆర్, ఆయ న కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పాలన్నా రు. 9 ఏళ్లలో ఒక్కసారి కూడా గద్దర్కి కేసీఅర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని.. ఆయన విష యంలో కేసీఆర్ ఒక నియంతలా వ్యవహరించారన్నారు. ప్రగతి భవన్ దగ్గర రోజంతా ఎదురు చూసినా లోపలకు పిలవకపోవడంతో.. ఇందుకేనా తెలంగాణ తెచ్చుకున్నది అని గద్దర్ కన్నీళ్లు పెట్టుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైఎస్సార్ అంటే గద్దర్కి చాలా ప్రేమ అని, నాతో చాలాసార్లు వైఎస్సార్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారన్నారు. -
ప్రజా యుద్ధ నౌక ఆగిపోయింది..
ప్రజా యుద్ధ నౌక ఆగిపోయింది నిత్యం ప్రజల కోసం, పీడిత - తాడిత వర్గాల కోసం పాటుపడిన గుమ్మడి విఠల్ రావు ఉరఫ్ గద్దర్ గారు ఈరోజు శివైక్యం చెందారు. తాను నమ్మిన సిద్ధాంతం వేలాది మందిని, ఉద్యమాల వైపు నడిపించినా, చివర్లో తాను నమ్మిన సిద్ధాంతం బుల్లెట్ కంటే, బ్యాలెట్ మాత్రమే ప్రజల తలరాతలను మార్చుతుందని... నమ్మిన అతి అరుదైన ఉద్యమ నాయకుడు. తన కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకు తీవ్ర వ్యతిరేకమైన…దేవతారాధనను, తన జీవిత చరమాంకంలో... నమ్మిన, కనపడని ఆధ్యాత్మికవాది శ్రీ గద్దర్ గారు. గడిచిన 15 సంవత్సరాల పరిచయంలో ప్రతి నిత్యం నా శ్రేయస్సును కాంక్షించారు. తన కుమారుడు సూర్యం ద్వారా, నేను ఆ కుటుంబానికి దగ్గరయ్యాను. అనేక సందర్భాల్లో శ్రీ గద్దర్ గారిని కలుస్తూ, అనేక విషయాలపై చర్చిస్తూ.. “అరే నాన్న” అని పిలిచే వారు. తన జీవితంలో అత్యంత కీలకమైన దశలో కుమారుడిని రాజకీయ రంగ ప్రవేశం చేయించాలనుకున్నప్పుడు... తనను నమ్ముకున్న, తనతో ఉద్యమ సహచర్యం చేసిన అనేక మంది వ్యక్తులను ఇంటికి పిలిచి వారితో ప్రజాస్వామ్యం మీద, పార్టీ రాజకీయాలపైనా, తన కుమారుడి భవిష్యత్తు పై నాతో గంటల పాటు చర్చించి, చివరకు తన కుమారుడిని రాజకీయరంగ ప్రవేశం చేయించిన వ్యక్తి శ్రీ గద్దర్. చివరిసారిగా కాంగ్రెస్ శాసనసభాపక్షనాయకుడు మల్లు భట్టివిక్రమార్కతో కలిసి సంగీత దర్శకుడు మణిశర్మ గారి ఆఫీసులో వారిని కలిశాను. అప్పుడు కూడా ఆయన సామాజిక, రాజకీయ అంశాలు ఎన్నో చర్చించారు. వెన్నులో బుల్లెట్ తనను నిత్యం ఇబ్బందిపెడుతున్నా, హైదరాబాద్ నగరం దాటి రాలేని పరిస్థితుల్లో నా తమ్ముడి వివాహం కోసం ఒకరోజు ముందుగానే “మే నెల” ఎండల్లో హైదరాబాద్ నుంచి గుంటూరు వచ్చి రెండ్రోజులుపాటు మా ఆతిధ్యం స్వీకరించి, మా ఇంట్లో శుభకార్యానికి హాజరైన వ్యక్తి ఈ రోజు లేకపోవడం నన్నెంతో వేదనకు గురిచేస్తోంది. కానీ పుట్టిన వారికి మరణం తప్పదు… శ్రీ గద్దర్ గారు, ఏ లోకంలో ఉన్న వారి ఆత్మ శాంతించాలని … తిరిగి పీడిత, తాడిత జనుల కోసం, ఇదే గడ్డపై జన్మించాలని మనసారా కోరుకుంటా... -మీ ఆరా మస్తాన్, సెఫాలజిస్ట్ -
అల్లూరి సీతారామరాజు వర్ధంతి.. సీఎం జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు సీఎం జగన్. స్వాతంత్య్రం కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అలుపెరుగని పోరాటం చేసిన వీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. ఆయన త్యాగాన్ని ఎల్లప్పుడూ స్మరించుకునేలా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆయన పేరు మీద జిల్లాను ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. నేడు ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. స్వాతంత్య్రం కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అలుపెరుగని పోరాటం చేసిన వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు. ఆయన త్యాగాన్ని ఎల్లప్పుడూ స్మరించుకునేలా మన ప్రభుత్వంలో ఆయన పేరు మీద జిల్లాను ఏర్పాటు చేశాము. నేడు ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి. — YS Jagan Mohan Reddy (@ysjagan) May 7, 2023 చదవండి: ‘మార్గదర్శి’ అక్రమాలు, నిజానిజాలు.. రామోజీ గురించి ఏం చెప్పారంటే? -
భగీరథ మహర్షి జయంతి సందర్భంగా సీఎం జగన్ నివాళులు
-
భగీరథ మహర్షి జయంతి.. సీఎం జగన్ నివాళులు
సాక్షి, తాడేపల్లి: భగీరథ మహర్షి జయంతి సందర్బంగా క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా భగీరథ మహర్షి చిత్రపటానికి సీఎం జగన్ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్ధానం ఛైర్మన్ కర్నాటి రాంబాబు, ఏపీ సగర, ఉప్పర వెల్ఫేర్, డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్పర్సన్ జి.రమణమ్మ, గిద్దలూరు వైఎస్ఆర్సీపీ పరిశీలకుడు బంగారు శీనయ్య హాజరయ్యారు. ఇది కూడా చదవండి: శింగనమల నియోజకవర్గానికి వరాల జల్లు -
బాదల్కు నేతల ఘన నివాళి
చండీగఢ్: పంజాబ్ రాజకీయ కురు వృద్ధుడు, ఐదుసార్లు పంజాబ్ సీఎంగా సేవలందించిన ప్రకాశ్ సింగ్ బాదల్ను కడసారి చూసేందుకు పార్టీలు, ప్రాంతాలకతీతంగా వందలాది మంది నేతలు, స్థానికులు చండీగఢ్కు తరలివచ్చారు. ఆయన పార్థివదేహం వద్ద ఘన నివాళులర్పించారు. తీవ్ర అనారోగ్యంతో బుధవారం తుదిశ్వాస విడిచిన తమ అభిమాననేతను చివరిసారి చూసేందుకు చండీగఢ్లోని శిరోమణి అకాలీదళ్ పార్టీ ప్రధాన కార్యాలయానికి ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. గురువారం మధ్యాహ్నం బాదల్ గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
వీరేశలింగం పంతులు జయంతి.. సీఎం జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: సంఘ సంస్కర్త వీరేశలింగం పంతులు జయంతి సందర్భంగా ఆయనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ‘‘మూఢ నమ్మకాలపై.. వితంతువుల పునర్వివాహం కోసం.. స్త్రీల విద్య కోసం పోరాటం చేసిన మహనీయులు కందుకూరి వీరేశలింగం పంతులు’’ అని సీఎం ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘‘సాహితీవేత్తగా, సంఘ సంస్కర్తగా ఆయన సేవలు చిరస్మరణీయం. నేడు వీరేశలింగం పంతులు గారి జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. చదవండి: రామోజీ ఓ విషసర్పం.. తోడల్లుడు డాల్ఫిన్ అప్పారావు సంచలన వ్యాఖ్యలు మూఢ నమ్మకాలపై.. వితంతువుల పునర్వివాహం కోసం.. స్త్రీల విద్య కోసం పోరాటం చేసిన మహనీయులు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. సాహితీవేత్తగా, సంఘ సంస్కర్తగా ఆయన సేవలు చిరస్మరణీయం. నేడు వీరేశలింగం పంతులు గారి జయంతి సందర్భంగా నివాళులు. — YS Jagan Mohan Reddy (@ysjagan) April 16, 2023 -
అణగారిన వర్గాల ఆశాజ్యోతి
న్యూఢిల్లీ: రాజ్యాంగ నిర్మాత, సామాజిక సంస్కర్త డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు. సమాజంలో నిరుపేద, అణగారిన వర్గాల అభ్యన్నతికోసం అంబేడ్కర్ తన జీవితాన్ని అంకితం చేశారని మోదీ కొనియాడారు. పార్లమెంట్ ప్రాంగణంలో అంబేడ్కర్ జయంతి వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ నేత సోనియా గాంధీ తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద నేలంతా ఘనంగా నివాళులర్పించారు. ప్రమాదకర ధోరణి: ఖర్గే ప్రత్యర్థులపై జాతి వ్యతిరేక ముద్ర వేయడం, బలవంతంగా నోరు మూయించడం వంటి ప్రమాదకర ధోరణులు పాలకుల్లో నానాటికీ పెరిగిపోతున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆందోళన వెలిబుచ్చారు. ఇది అంతిమంగా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని నాశనం చేస్తుందన్నారు. పార్లమెంటు చర్చా వేదికను కూడా అధికార బీజేపీ పోరాటస్థలిగా మార్చిందని దుయ్యబట్టారు. ఖర్గే, కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ తదితరులు అంబేడ్కర్కు నివాళులర్పించారు. ఖర్గే, కాంగ్రెస్ నేతలు రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీ వద్రా తదితరులు అంబేడ్కర్కు నివాళులర్పించారు. రాజ్యాంగ విలువలపై వ్యవస్థీకృత దాడి జరుగుతోందంటూ ప్రియాంక ట్వీట్ చేశారు. -
నందమూరి తారకరత్న మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం
నందమూరి తారకరత్న మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఆయన అకాల మరణం తనను బాధించిందని విచారం వ్యక్తం చేశారు. తారకరత్న సినీ ప్రపంచంలో తనకుంటూ ఓ ముద్ర వేసుకున్నారని కొనియాడారు. ఇలాంటి బాధాకర సమయంలో తారకరత్న కుటుంబసభ్యులకు, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నట్లు మోదీ పేర్కొన్నారు. ఈమేరకు ప్రధాని కార్యాలయం పీఎంఓ ట్వీట్ చేసింది. Pained by the untimely demise of Shri Nandamuri Taraka Ratna Garu. He made a mark for himself in the world of films and entertainment. My thoughts are with his family and admirers in this sad hour. Om Shanti: PM @narendramodi — PMO India (@PMOIndia) February 19, 2023 రేవంత్ రెడ్డి సంతాపం.. తారకరత్న మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణవార్త తనను బాధించిందన్నారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబసభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు. Deeply saddened by the untimely demise of shri #Tarakaratna garu… My deepest condolences to the friends and family.I pray God to give them strength in this hour of grief. pic.twitter.com/SmPINq1PZb — Revanth Reddy (@revanth_anumula) February 19, 2023 గుండెపోటుతో 23 రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన తారకరత్న శనివారం బెంగళూరులోని హృదయాలయలో కన్నుమూశారు. ఆయన భౌతికకాయాన్ని ఆదివారం ఉదయం హైదరాబాద్కు తీసుకొచ్చారు. అంత్యక్రియలు సోమవారం నిర్వహించనున్నారు. బండి సంజయ్ ట్వీట్.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా తారకరత్న మృతికి సంతాపం తెలిపారు. తెలుగు సినిమా నటుడు నందమూరి తారకరత్న గారి అకాల మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. తన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతున్ని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి 🙏 pic.twitter.com/BXEIVTXwIM — Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) February 18, 2023 హరీశ్రావు.. తారకరత్న మరణవార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలంగాణ మంత్రి హరీశ్రావు ట్వీట్ చేశారు. ఆయన కుటుంసభ్యులు, స్నేహితులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. Deeply saddened to know the demise of actor Nandamuri Taraka Ratna. Heartfelt condolences to his family and friends at this time of grief. May his Soul Rest in Peace. Om Shanti🙏🏾 pic.twitter.com/XRn28J6afq — Harish Rao Thanneeru (@BRSHarish) February 18, 2023 డీకే అరుణ బీజేపీ నేత డీకే అరుణ కూడా తారకరత్న మృతికి ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు. Extremely saddened to learn about the passing of #Telugu actor Shri Nandamuri #TarakaRatna Ji. His sudden demise has left the entire Telugu film industry in a state of shock and mourning. My deepest condolences to his family. Om Shanti 🙏🏻 pic.twitter.com/6q9bD2ZelS — D K Aruna (@aruna_dk) February 19, 2023 చంద్రబాబు సంతాపం.. తారకరత్న తమ కుటుంబానికి తీవ్ర విషాదం మిగిల్చి వెళ్లిపోయాడని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. 23 రోజుల పాటు మృత్యువు తో పోరాడిన తారకరత్న... చివరికి మాకు దూరం అయ్యి మా కుటుంబానికి విషాదం మిగిల్చాడు. తారకరత్న ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.(2/2) — N Chandrababu Naidu (@ncbn) February 18, 2023 నారా లోకేష్.. తారకరత్న మృతి తమ కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఆయన మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. బావ అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక నాకు వినిపించదు. నేనున్నానంటూ నా వెంట నడిచిన ఆ అడుగుల చప్పుడు ఆగిపోయింది. నందమూరి తారకరత్న మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగుదేశం యువతేజం తారకరత్న మృతి మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీరని లోటు.(1/2) pic.twitter.com/MLLlp3p60G — Lokesh Nara (@naralokesh) February 18, 2023 -
దేశం గర్వించదగ్గ ఆధ్యాత్మికవేత్త సంత్ సేవాలాల్
సాక్షి, హైదరాబాద్: బంజారాలు, లంబాడాల ఆరాధ్యదైవం, సంత్ సేవాలాల్ మహారాజ్ గొప్ప సంఘ సేవకులు, దేశం గర్వించదగ్గ ఆధ్యాత్మికవేత్తని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ 284 వ జయంతి సందర్భంగా కేసీఆర్ ఘనంగా నివాళులర్పించారు. లంబాడా, బంజారా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 3 శతాబ్దాల కింద సేవాలాల్ మహారాజ్ నడయా డిన బంజారాహిల్స్ నేలమీద సంత్ మహారాజ్ పేరుతో నిర్మించిన భవన్లో రాష్ట్ర ప్రభు త్వం అధికారికంగా జయంతి ఉత్సవాలను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. -
పుల్వామా అమర వీరులకు ప్రధాని మోదీ నివాళులు..
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. ఈ ఘటన జరిగి నాలుగేళ్లయిన సందర్భంగా వారిని స్మరించుకున్నారు. పుల్వామా అమరుల త్యాగాన్ని దేశం ఎన్నిటికీ మరువదని, దేశాభివృద్ధికి వీర సైనికుల శౌర్యమే స్ఫూర్తిదాయకమన్నారు. ఈమేరకు ఆయన మంగళవారం ఉదయం ట్వీట్ చేశారు. Remembering our valorous heroes who we lost on this day in Pulwama. We will never forget their supreme sacrifice. Their courage motivates us to build a strong and developed India. — Narendra Modi (@narendramodi) February 14, 2023 2019 ఫిబ్రవరి 14న జమ్ముకశ్మీర్ పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 40 మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఇందుకు ప్రతీకారంగా పాకిస్తాన్ బాలాకోట్లోకి ప్రవేశించి భారత సైన్యం మెరుపుదాడులు చేసింది. ఉగ్ర శిబిరాలను పేల్చి వేసింది. ఈ ఘటనలో దాదాపు 250 మంది తీవ్రవాదాలు హతమైనట్లు అమిత్ షా ఓ ఎన్నికల ర్యాలీలో తెలిపారు. చదవండి: ‘అదానీ’పై అదే దుమారం -
మూగబోయిన వాణి
‘తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ’.. ఎంత కమ్మని గొంతు. ఉషోదయం వేళ మనసుని ఉల్లాసంగా తట్టిలేపే మృదు మధురమైన కంఠస్వరం వాణీ జయరామ్ సొంతం.. అలాంటి ఆ కంఠస్వరం మూగబోయింది. ప్రముఖ గాయని వాణీ జయరామ్ (78) కన్నుమూశారు. చెన్నైలోని నుంగంబాక్కమ్లో ఉన్న తన సృగృహంలో అనుమానాస్పద స్థితిలో మరణించారామె. వాణి నుదురు, భుజంపై రక్తపు గాయాలు ఉండడంతో ఆమె మృతిపై అనుమానాలు నెలకొన్నాయి. పోలీసులు ఐపీసీ 174 సెక్షన్ కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఆమె ఇంటిలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అలాగే ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. వాణి మృతదేహానికి ఓమందూరార్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన అనంతరం కేసు విచారణ ముమ్మరం అయ్యే సూచనలున్నాయి. తమిళనాడులోని వెల్లూరులో దురైస్వామి, పద్మావతిలకు 1945 నవంబరు 30న జన్మించారు వాణీ జయరామ్. ఆమె అసలు పేరు కలైవాణి. పదకొండు మంది పిల్లల్లో వాణి ఎనిమిదో సంతానం. ఆమె తల్లి పద్మావతి కర్నూలులో జన్మించడంతో వాణికి తెలుగులో పాడటం అలవాటైంది. రంగరామానుజ అయ్యంగార్ వారి వద్ద పద్మావతి సంగీత శిక్షణ పొందారు. తన కుమార్తె వాణిని కూడా ఆయన వద్దే కర్ణాటక సంగీత శిక్షణ కోసం చేర్పించారామె. వెల్లూరులో వాణి నాలుగో తరగతి పూర్తయ్యాక, ఆమెకు మరింత మంచి సంగీత శిక్షణ ఇప్పించేందుకు వారి కుటుంబం చెన్నైకి తరలి వెళ్లింది. ప్రఖ్యాత సంగీత విద్వాంసులు జీఎన్ బాలసుబ్రహ్మణ్యం శిష్యుడైన టీఆర్ బాలసుబ్రహ్మణ్యం వద్ద సంగీతం నేర్చుకున్నారు వాణి. తన ఎనిమిదవ ఏటనే మద్రాసులో ఆకాశవాణిలో పాడారు. పదేళ్ల నుంచే పూర్తి స్థాయి కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరీలు చేశారామె. స్కూలులో 22 వేర్వేరు కళలతో బహుముఖ ప్రజ్ఞ కలిగిన స్టూడెంట్గా అవార్డును పొందారు వాణి. బీఏ ఎకనామిక్స్ చదువుతున్న సమయంలో కళాశాలల స్థాయిలో డిబేట్ కార్యక్రమాల్లో బహుమతులు పొందారామె. చదువు పూర్తయ్యాక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెన్నై బ్రాంచిలో ఉద్యోగంలో చేరారు వాణి. 1967లో ఉద్యోగ రీత్యా హైదరాబాద్కు బదిలీ అయ్యారు. ఆ తర్వాత 1969లో జయరామ్ని వివాహం చేసుకుని, ముంబయ్కి వెళ్లారు వాణి. భర్త జయరామ్ ప్రోత్సాహంతో ఉస్తాద్ అబ్దుల్ రెహ్మాన్ ఖాన్ వద్ద హిందుస్తానీ శాస్త్రీయ సంగీత శిక్షణను పొందారామె. ఆ సమయంలోనే బ్యాంకు ఉద్యోగానికి స్వస్తి చెప్పి పూర్తి స్థాయి సంగీత సాధనకు సమయాన్ని వెచ్చించారామె. కర్ణాటిక్, హిందుస్థానీ సంగీతాలను నేర్చుకున్న ఆమె 1969లో ముంబయ్లో తొలి కచేరి ఇచ్చారు. సంగీత దర్శకుడు వసంత్ దేశాయ్కి ఆమె గొంతు నచ్చడంతో 1971లో హృషికేశ్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన ‘గుడ్డి’ చిత్రంలో తొలిసారి పాట పాడే అవకాశమిచ్చారు. ఆ చిత్రం కోసం వాణీ జయరామ్ పాడిన ‘బోలె రే పపీ హరా..’ పాటకు మంచి స్పందన వచ్చింది. వాణికి ‘తాన్సేన్ సమ్మాన్, బెస్ట్ ప్రామిసింగ్ సింగర్, ఆలిండియా సినీగోయర్స్’ వంటి అవార్డులు దక్కాయి. ఇక ‘అభిమానవంతుడు’ (1973) చిత్రంలో ‘ఎప్పటివలె కాదురా స్వామి’ అనే పాటను వాణీ జయరామ్తో పాడించారు దర్శకుడు ఎస్.పి. కోదండపాణి. తెలుగులో ఆమెకు ఇదే తొలి చిత్రం. 1974లో ముంబయ్ నుండి చెన్నైకి వచ్చి స్థిరపడిన ఆమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, భోజ్పురి, మరాఠీ, ఒరియా.. ఇలా 14 భాషల్లో పదివేలకుపైగా పాటలు పాడారు. కేవీ మహదేవన్, ఎం.ఎస్. విశ్వనాథన్ , ఇళయరాజా, పెండాల్య, చక్రవర్తి, సాలూరి రాజేశ్వరరావు వంటి సంగీత దర్శకుల సినిమాల్లో ఎక్కువ పాటలు పాడారామె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘అపూర్వ రాగంగళ్’ చిత్రానికి తొలిసారి జాతీయ పురస్కారం అందుకున్నారామె. ఆ తర్వాత ‘శంకరాభరణం’ చిత్రంలోని ‘మానస సంచరరే..’ గీతానికి ఆమెకు రెండోసారి జాతీయ పురస్కారం దక్కింది. ‘స్వాతికిరణం’లోని ‘ఆనతి నీయరా హరా..’ పాటకు ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డు అందుకున్నారు వాణి. జాతీయ స్థాయిలోనే తెలుగు, గుజరాతీ, ఒడియా, తమిళ భాషల్లో ప్రాంతీయ స్థాయి ఉత్తమ గాయని అవార్డులు పొందారామె. ‘కలైమామణి, సంగీత పీఠ్ సమ్మాన్, ఎంకే త్యాగరాజ భాగవతార్ జీవన సాఫల్య పురస్కారం, ఫిలింఫేర్ జీవన సాఫల్య పురస్కారం, కాముకర అవార్డు, సుబ్రహ్మణ్య భారతి అవార్డు, ఘంటసాల జాతీయ పురస్కారం, దక్షిణ భారత మీరా అవార్డు’ వంటి ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు వాణీ జయరామ్. సినిమా పాటలే కాదు.. ఎన్నో భక్తి గీతాలను, లలిత గీతాలను ఆలపించారు వాణి. ‘మొరటోడు’ చిత్రంలోని ‘హే కృష్ణా మళ్లీ నీవే జన్మిస్తే’ పాటతో పాటు ‘ప్రేమలేఖలు’లోని ‘ఈరోజు మంచిరోజు’ అంటూ సుశీలతో కలసి పాడిన పాట తనకెంతో ఇష్టం అని వాణి గతంలో పేర్కొన్నారు. తమకు పిల్లలు లేకున్నా ఆ లోటును సంగీతమే తీర్చిందని చెప్పేవారామె. వాణి భర్త జయరామ్ 2018లో మృతి చెందారు. కాగా సంగీత రంగానికి ఆమె చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2022కిగాను ఇటీవల ‘పద్మ భూషణ్’ అవార్డు ప్రకటించింది. అయితే ఆ పురస్కారాన్ని స్వీకరించకుండానే వాణి ఈ లోకాన్ని వదిలి వెళ్లడం బాధాకరం. ఆమె మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. నేడు ఆమె భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. భర్త ప్రోత్సాహంతో... ప్రతి మగాడి విజయం వెనక మహిళ ఉంటుందంటారు. కానీ వాణీ జయరామ్ విజయం వెనక ఆమె భర్త జయరామ్ ఉన్నారు. పెళ్లి తర్వాత కూడా సంగీతంలో ఆమెను ఎంతగానో ప్రోత్సహించారు. ముంబయ్లోని ఇండో–బెల్జియం చాంబర్ ఆఫ్ కామర్స్లో ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా చేసిన జయరామ్ సంగీతప్రియులు. పండిట్ రవిశంకర్ దగ్గర ఆరేళ్లు ఆయన సితార్ నేర్చుకున్నారు. వాణీతో వివాహం తర్వాత తన భార్యలోని సంగీత ప్రావీణ్యతను గుర్తించారు జయరామ్. ఆల్రెడీ కర్ణాటిక్, శాస్త్రియ సంగీతాలను ఔపోసన పట్టిన ఆమెను హిందుస్థానీ సంగీతాన్ని కూడా నేర్చుకోవాలని కోరారు జయరామ్.కేవలం నేర్చుకోమని చెప్పడమే కాకుండా.. ఉస్తాద్ అబ్దుల్ రహమాన్ దగ్గర సంగీత పాఠాలు నేర్పించారు. ఉస్తాద్ అబ్దుల్ రహమాన్ శిష్యరికంలో ఆరు నెలల కఠోర శిక్షణ తర్వాత హిందుస్థానీ సంగీతంలో కూడా వాణి ప్రతిభ చూపారు. 18 గంటల పాటు ఏకధాటిగా శిక్షణ తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఇక బ్రహ్మాండంగా కచేరీలు చేసుకోవచ్చని వాణీకి భరోసా ఇచ్చారు రహమాన్. ఆత్మవిశ్వాసం, గురువు రహమాన్ ఇచ్చిన భరోసాతో చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగానికి స్వస్తి పలికారు వాణి. 1969లో తొలిసారిగా ముంబయ్లో కచేరి ఇచ్చారామె. ఆ తర్వాత సినీ గాయనిగా ఎంతో బిజీ అయ్యారు. సంగీతమే సంతానం... వాణీ జయరామ్ దంపతులకు సంతానం లేరు. సంగీతాన్నే సంతానంలా భావించారు. ‘‘సంగీతంతో సంతానం లేని లోటు తీరిపోయిందనుకుంటాం’’ అని పలు సందర్భాల్లో వాణి పేర్కొన్నారు. కొత్త నాయికలకు ఆ వాణీయే... ఓ కొత్త హీరోయిన్ వెండితెరకు పరిచయం అవుతుందంటే వెంటనే వాణీ జయరామ్కు కబురు వెళ్లేది. అలా పలువురు హీరోయిన్లు నటించిన తొలి సినిమాకు పాటలు పాడారు వాణీ జయరామ్. శ్రీదేవి హీరోయిన్గా పరిచయమైన తొలి తమిళ (‘మూండ్రు ముడుచ్చు – ‘ఆడి వెళ్లి’), హిందీ (సోల్వా సావన్ – గోరియా హో గోరియా) చిత్రాల్లో పాటలు పాడారు వాణీ జయరామ్. అలాగే షబానా ఆజ్మీ, జూహీ చావ్లా, పర్విన్ బాబీ, జయబాధురీ హీరోయిన్లుగా పరిచయం అయిన తొలి చిత్రాలకు వాణీ జయరామ్ పాటలు పాడారు. వాణి తెలుగు హిట్ సాంగ్స్ కొన్ని... ► అభిమానవంతులు – ‘ఎప్పటివలె కాదురా నా సామి...’ ► ‘స్వాతి కిరణం’ – తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ, ఆనతినీయరా హరా.., శివానీ భవానీ.. ► ‘శంకరాభరణం’ – దొరకునా ఇటువంటి సేవ.., ఏ తీరుగ నను.., ► పలుకే బంగారమాయెనా.. ► ‘పూజ’ – పూజలు చేయ పూలు తెచ్చాను... ► ‘సీతామాలక్ష్మి’ – ఏ పాట నే పాడను... ► శ్రుతిలయలు – ఆలోకయే శ్రీ బాలకృష్ణమ్... ► ‘తిరుపతి’ – తప్పెట్లోయి తాళాలోయి ► ‘సీతాకోక చిలుక’ – సాగర సంగమమే..., అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి ► ‘స్వర్ణకమలం’ – అందెల రవమిది పదములదా... ► ‘మంగమ్మగారి మనవడు’ – శ్రీ సూర్యనారాయణ మేలుకో... ► ‘గుప్పెడు మనసు’ – నేనా పాడనా పాట.. మీరా అన్నదీ మాట.. ► ‘ఘర్షణ’– ఒక బృందావనం సోయగం... అది దైవ సంకల్పం 1970 నుంచి 1990 వరకూ బిజీ గాయనిగా సాగిన వాణీ జయరామ్ ఆ తర్వాత కాస్త స్లో అయ్యారు. కాగా పలు భాషల సినిమాలకు పాడుతూనే మరోవైపు ఎన్నో భజన పాటలు కూడా పాడారు వాణి. ‘అది పూర్తిగా దైవ సంకల్పం. ఆ దేవుడికి ధన్యవాదాలు. భజనలు పాడినప్పుడు నా మనసెంతో ఆనందంగా ఉంటుంది’ అని పలు సందర్భాల్లో ఆమె పేర్కొన్నారు. హిందీలో తొలి చిత్రం ‘గుడ్డి’కి తొలుత ఆమె పాడినది భజన పాటే. అయితే సినిమా విడుదల తర్వాత చూస్తే సిల్వర్ స్క్రీన్పై ఆ పాట వినబడలేదు. అలా ఎందుకు జరిగిందో ఎప్పటికీ అర్థం కాలేదని ఓ సందర్భంలో వాణి పేర్కొన్నారు. ఈ ఒక్క పాటే కాదు.. వాణి పాడిన పాటల్లో తెరపై వినిపించనవి ఎన్నో ఉన్నాయి. ‘ఇలాంటివాటి గురించి తలచుకుంటే బాధ రెట్టింపు అవుతుందే కానీ, తగ్గదు. అందుకే వాటి గురించి ఆలోచించను’ అని ఓ సందర్భంలో వాణి పేర్కొన్నారు. వాణీ జయరామ్ అంత పాజిటివ్ పర్సన్. ప్రముఖుల నివాళి తన మధురమైన గాత్రంతో సినీ సంగీతానికి విశేష సేవలందించి ఎంతోమంది హృదయాలను గెలిచారు వాణీ జయరామ్గారు. పాన్ ఇండియా స్థాయిలో బలమైన శాస్త్రీయ పునాదిని నిర్మించారామె. వాణీగారి మృతి భారత సినీ పరిశ్రమకు, సంగీత ప్రపంచానికి తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి కలగాలి.. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. – వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వాణీ జయరామ్గారి మృతి బాధాకరం. 14 భాషల్లో 10 వేలకుపైగా పాటలు పాడిన ఆమె సినీ రంగానికి అందించిన సేవలు మరువలేనివి. ఆమె మృతి భారత సినీ పరిశ్రమకు, సంగీత ప్రపంచానికి తీరని లోటు.. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. – కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి ప్రఖ్యాత భారతీయ సినీ సంగీత గాయనీమణిగా ఖ్యాతి సంపాదించుకున్న ‘కలైమామణి’ వాణీ జయరామ్ మరణ వార్త చాలా బాధించింది. ఆమె లేని లోటును భారతీయ సినిమాలో ఎవరూ భర్తీ చేయలేరు. వాణీ జయరామ్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. – ఎంకే స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి పదాలకు పదోన్నతి చేకూరేలా ఒక వినూత్నమైన బాణీతో ప్రపంచానికి ఎన్నో పాటలను బహుమతిగా ఇచ్చిన కోకిలలా జీవించిన వాణీ జయరామ్గారు ఇప్పుడు ప్రశాంతించారు. ఆవిడ పాటలు మనతోనే ఉంటాయి. – కమల్హాసన్ మీరు (వాణీని) నాకు పాడిన తొలి పాటనే మీకు నివాళిగా అర్పిస్తున్నాను. ‘మేఘమే మేఘమే.. పాల్ నిలా తేయందదే. దేగమే తేయినుమ్ తేనొళీ వీసుదే.. ఎనక్కొరు మలర్ మాలై నీ వాంగ వేండుమ్’ (తమిళ చిత్రం ‘పాలవన్న చోలై’లోని పాట.. ఈ చిత్రం తెలుగులో ‘మంచు పల్లకి’గా రీమేక్ అయింది. తెలుగులో ‘మేఘమా..’ పాటని ఎస్. జానకి పాడారు). పాటలో ‘ఎనక్కొరు మలర్ మాలై నీ వాంగ వేండుమ్’ అంటే నాకోసం నువ్వొక పూలదండ కొనాలని అర్థం. ఈ సాహిత్యాన్ని ‘ఉనక్కొరు మలర్ మాలై నాన్ వాంగ వేండుమ్’.. (నీకోసం నేనో పూలదండ కొనాలని అర్థం) అని మార్చి... ‘ఆ పూలదండ దీనికోసమేనా?’ (వాణి మరణాన్ని ఉద్దేశించి) అంటూ ముగించారు. తమిళ ప్రముఖ రచయిత వైరముత్తు. చాలా షాక్కి గురి చేసే వార్త ఇది. నమ్మశక్యంగా లేదు. జస్ట్ రెండు రోజుల క్రితమే వాణీ అమ్మతో మాట్లాడాను. నిజమైన లెజెండ్. బలమైన శాస్త్రీయ పునాదితో బహుముఖ ప్రతిభ గల బహు భాషా గాయనిని కోల్పోయాం. – చిత్ర నిన్న (శుక్రవారం) రాత్రే కె. విశ్వనాథ్ సార్ సినిమాల్లో వాణీగారి పాటలు వింటూ, ‘ఎంత అద్భుతంగా పాడారో వినండీ.. అని మా ఆయన (నటుడు శరత్కుమార్)తో అన్నాను. ఆ మర్నాడే ఆమె మరణ వార్త విని షాకయ్యాను. – రాధికా శరత్కుమార్ ఎంత గొప్ప గాత్రం. చివరిసారిగా ఆమెను కలిసినప్పుడూ ఆ గాత్రంలో అదే స్పష్టత. ‘ఏళు స్వరంగళ్, మల్లిగై, నానే నానా వంటి పాటలతో పాటు నాకు పాడిన ‘మేఘమే మేఘమే’... ఇలా ఆమె పాడిన ఎన్నో పాటలు హృదయాల్లో నిలిచిపోతాయి. – సుహాసినీ మణిరత్నం ► భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ప్రసంశలు పొందారు వాణీ జయరామ్. ఓ కచేరీలో ఇందిరా గాంధీ తన ప్రతిభను ఎంతగానో మెచ్చుకున్నట్లు పలు సందర్భాల్లో వాణి స్వయంగా చెప్పారు. ► హేమమాలిని, వినోద్ ఖన్నా ప్రధాన తారాగణంగా గుల్జార్ దర్శకత్వంలో 1979లో హిందీలో ‘మీరా’ అనే చిత్రం వచ్చింది. ఈ సినిమాలో ఉన్న 13 పాటల్లో 12 పాటలను వాణీ జయరామ్ పాడటం విశేషం. ► గంగామహోత్సవ్, స్వామి హరిదాస్ ఫెస్టివల్, ఛండీఘడ్లోని పంచకుల, ఛిత్తోడ్ఘడ్లో మీరా ఫెస్టివల్స్.. ఇలా పలు పండగలకు ఆమె కచేరిలు చేశారు. బద్రినాథ్లో రెండుసార్లు పాడారు. -
కళాతపస్వికి కన్నీటి వీడ్కోలు
ప్రముఖ దర్శకుడు కాశీనాథుని విశ్వనాథ్కు అశేష అభిమానగణం కన్నీటి వీడ్కోలు పలికింది. ఆయన అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నం పంజగుట్ట హిందూ శ్మశానవాటికలో జరిగాయి. శుక్రవారం ఆయన నివాసం నుంచి పంజగుట్ట శ్మశానవాటిక వరకు అంతిమయాత్ర సాగింది. అంతకుముందు ఆయనకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. కళాతపస్విని కడసారి చూసేందుకు అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చి అంతిమయాత్రలో పాల్గొన్నారు. బంజారాహిల్స్/సాక్షి, హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు కాశీనాథుని విశ్వనాథ్ (92)కు అశేష అభిమానగణం కన్నీటి వీడ్కోలు పలికింది. ఆయన అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నం పంజగుట్ట హిందూ శ్మశాన వాటికలో సంప్రదాయబద్ధంగా జరిగాయి. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి అపోలో ఆస్పత్రిలో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. విశ్వనాథ్ పార్థివ దేహాన్ని ఆస్పత్రి నుంచి గురువారం రాత్రి ఒంటి గంటకు ఫిలింనగర్లోని స్వగృహానికి తరలించారు. రాత్రి నుంచే విశ్వనాథ్ భౌతికకాయాన్ని సందర్శించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులతోపాటు అభిమానులు భారీగా విచ్చేయడంతో పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. శుక్రవారం ఆయన నివాసం నుంచి పంజగుట్ట శ్మశాన వాటిక వరకు అంతిమయాత్ర సాగింది. కళాతపస్విని కడసారి చూసేందుకు అభిమానులు పెద్దసంఖ్యలో అంతిమయాత్రలో పాల్గొన్నారు. అనంతరం శ్మశాన వాటికలో ఆయన పార్థివదేహాన్ని ఖననం చేశారు. కన్నీరుమున్నీరైన చంద్రమోహన్ విశ్వనాథ్ భౌతికకాయాన్ని శుక్రవారం మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఎంపీ సంతోష్ కుమార్, సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, పవన్ కల్యాణ్, శరత్కుమార్, రాధిక, రాజశేఖర్, జీవిత, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, కె.రాఘవేంద్రరావు, త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి, అల్లు అరవింద్, బోయపాటి శ్రీను, శేఖర్ కమ్ముల, ఆది శేషగిరిరావు, దగ్గుబాటి సురేష్బాబు తదితరులు సందర్శించి నివాళులర్పించారు. విశ్వనాథ్ కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. విశ్వనాథ్ దర్శకత్వంలో సిరిసిరిమువ్వ సినిమాలో హీరోగా నటించిన చంద్రమోహన్ కన్నీరుమున్నీరయ్యారు. విశ్వనాథ్ భౌతికకాయాన్ని చూడటంతోనే ఆయన విలపిస్తూ అక్కడే కుప్పకూలిపోయారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. విశ్వనాథ్ మృతి బాధాకరం: మంత్రి తలసాని కళాతపస్వి విశ్వనాథ్ మృతి బాధాకరమని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. తలసాని ఆయన నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలు, కళల విశిష్టతను చాటేలా అనేక చిత్రాలు నిర్మించిన గొప్ప దర్శకులంటూ కొనియాడారు. ఏపీ ప్రభుత్వం తరపున.. విశ్వనాథ్ అంత్యక్రియల్లో ఏపీ ప్రభుత్వం తరపున బీసీ సంక్షేమ, సమాచార, సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు. ఆయన విశ్వనాథ్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను, సంగీత సాహిత్యాలను సృజనాత్మక శైలిలో ప్రేక్షకులకు అందించిన కళాతపస్వి మరణించడం సినీ పరిశ్రమకు తీరని లోటని చెప్పారు. బహుముఖ ప్రజ్ఞాశాలి విశ్వనాథ్: ప్రధాని మోదీ సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ‘సినీ ప్రపంచంలో కె.విశ్వనాథ్ ఒక దిగ్గజం. సృజనాత్మక దర్శకుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా సినీలోకంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. వివిధ ఇతివృత్తాలతో తీసిన అతని సినిమాలు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించాయి’.. అని శుక్రవారం ట్విట్టర్లో పేర్కొన్నారు. అసమాన ప్రతిభావంతుడు: గవర్నర్ తమిళిసై కె.విశ్వనాథ్ మృతిపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక దిగ్గజ దర్శకుడు, నటుడిని తెలుగు సినీ పరిశ్రమ కోల్పోయిందని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఆయన తన అసమాన ప్రతిభతో సినీ పరిశ్రమపై చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. అరుదైన దర్శక దిగ్గజం: కేసీఆర్ ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ మృతికి సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం తెలిపారు. అతి సా మాన్యమైన కథను ఎంచుకొని.. తన అద్భుతమైన ప్రతిభతో.. వెండి తెర దృశ్య కావ్యంగా మలిచిన అరుదైన దర్శ కుడు కె.విశ్వనాథ్ అని కొనియాడారు. గతంలో విశ్వనాథ్ ఆరోగ్యం బాగా లేనప్పుడు ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించిన సమయంలో.. సినిమాలు, సంగీతం, సాహిత్యంపై తమ మధ్య జరిగిన చర్చను సీఎం గుర్తు చేసుకున్నారు. తెలుగువారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారు: జగన్ సాక్షి, అమరావతి: సినీ దర్శక దిగ్గజం కె. విశ్వనాథ్ తెలుగు వారి గుండెల్లో కళాతపస్విగా శాశ్వతంగా నిలిచిపోతారని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కొనియాడారు. ఈ మేరకు శుక్రవారం ఆయన తన ట్విట్టర్ ఖాతాల్లో ట్వీట్ చేశా రు. ‘విశ్వనాథ్ గారి మరణం తీవ్ర విచారానికి గురిచేసింది. తెలుగు సంస్కృతికి, బారతీయ కళలకు నిలువుటద్దం విశ్వనాథ్ గారు. ఆయన దర్శకత్వం రూపుదిద్దుకున్న చిత్రాలు తెలుగు సినీ రంగానికి అసమాన గౌరవాన్ని తెచ్చాయి’ అని పేర్కొన్నారు. స్పీకర్, మంత్రుల సంతాపం కె.విశ్వనాథ్ మరణంపై స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఇంద్రకరణ్రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, శ్రీనివాస్గౌడ్, ఎర్రబెల్లి దయాకర్రావు, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. సినిమా తీయాలనుకున్నా విశ్వనాథ్తో సినిమా తీయాలన్న తన ఆశ కలగానే మిగిలిపోయిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. కె.విశ్వనాథ్ మృతికి టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ వేర్వేరు ప్రకటనల్లో తీవ్ర సంతాపం తెలిపారు. -
కూతుర్ని హీరోయిన్గా చూడాలనుకున్న జమున, కానీ..
తెలుగువారి సత్యభామగా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన జమున (86) ఇకలేరు. వయోభారం, అనారోగ్య కారణాలతో హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని తన స్వగృహంలో శుక్రవారం ఉదయం 7.30 ని‘‘లకు తుదిశ్వాస విడిచారామె. అమెరికాలో ఉంటున్న కుమారుడు వంశీకృష్ణ హైదరాబాద్ చేరడానికి ఆలస్యం కావడంతో కుమార్తె స్రవంతి తల్లికి అంత్యక్రియలు నిర్వహించారు. నిప్పాణి శ్రీనివాసరావు, కౌసల్యాదేవి దంపతులకు 1936 ఆగస్ట్ 30న హంపిలో జన్మించారు జమున. తండ్రికి గుంటూరులో పొగాకు, పసుపు వ్యాపారాలుండేవి. శ్రీనివాసరావు వ్యాపార రీత్యా జమున బాల్యమంతా గుంటూరు జిల్లాలోని దుగ్గిరాలలో గడిచింది. చక్కని సంగీత విద్వాంసురాలు అయిన కౌసల్యాదేవి జమునకి శాస్త్రీయ సంగీతం, హార్మోనియంలలో శిక్షణ ఇప్పించారు. దుగ్గిరాల గ్రామస్తులు వేసిన ‘ఛలో ఢిల్లీ’ నాటకంలో తొలిసారి వసుంధర అనే పాత్ర వేశారు జమున. ఆ తర్వాత ‘మా భూమి, ఖిల్జీ రాజ్యపతనం..’ ఇలా పలు నాటకాలు వేశారు జమున. దుగ్గిరాలకు చెందిన శ్రీమన్నారాయణమూర్తి అనే నటుడు జమున గురించి నిర్మాత బీవీ రామానందంకు (‘వరూధిని’ సినిమా తీశారు) చెప్పారు. దీంతో ఆయన నిర్మిస్తున్న తర్వాతి చిత్రం ‘జై వీర భేతాళ’(1952 మార్చిలో స్టార్ట్ అయింది) అనే సినిమాలో హీరోయిన్గా జమునకు అవకాశం ఇచ్చారు. ఈ చిత్రంలో గుమ్మడి హీరోగా ఎంపికయ్యారు. అయితే ఆ సినిమా ఎందుకో ఆగిపోయింది. ఆ తర్వాత గరికపాటి రాజారావు దర్శకత్వం వహించిన ‘పుట్టిల్లు’ (1953) సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయమయ్యారు జమున. ఆ తర్వాత ఎన్టీఆర్, ఏఎన్ఆర్, జగ్గయ్య వంటి అగ్రహీరోల సరసన కథానాయికగా నటించారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంతో పాటు పలు హిందీ సినిమాల్లో నటించి భేష్ అనిపించుకున్నారామె. దాదాపు 200 సినిమాల్లో ఎన్నో పాత్రల్లో జమున నటించినా బాగా పేరు తెచ్చినవాటిలో సత్యభామ పాత్రని ప్రముఖంగా చెప్పుకోవాలి. ఆ పాత్రలో ఆమెను తప్ప ఎవర్నీ ఊహించుకోలేం అన్నట్టుగా జీవించారు జమున. ‘సంతోషం, మిస్సమ్మ, చిరంజీవులు, తెనాలి రామకృష్ణుడు, దొంగరాముడు, బంగారు పాప, వద్దంటే డబ్బు, చింతామణి, భూకైలాస్, భాగ్యరేఖ, గుండమ్మకథ’ వంటి పలు హిట్ చిత్రాల్లో నటించారు జమున. ‘తెలుగు ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ అనే సంస్థ నెలకొల్పి 25 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారామె. లెక్చరర్తో పెళ్లి... హీరోయిన్లు సినిమా ఇండస్ట్రీలోని వారిని కాకుండా ఇతర రంగంలోని వారిని వివాహం చేసుకోవడం నటి పద్మినీతో ఆరంభమైంది. అలా వివాహం చేసుకున్న రెండో హీరోయిన్ జమున. దూరపు బంధువైన రమణారావుతో 1965లో జమున వివాహం తిరుపతిలో జరిగింది. రమణారావు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయంలో పీహెచ్డీ చేస్తూ, జువాలజీ లెక్చరర్గా చేసేవారు. డాక్టరేట్ అందుకున్న తర్వాత ఉస్మానియా విశ్వ విద్యాలయానికి బదిలీ అయ్యారాయన.. దీంతో కాపురాన్ని హైదరాబాద్కి మార్చారు. జమున కూడా మద్రాసు (చెన్నై) నుంచి హైదరాబాద్కి వచ్చేశారు. 1976లో బంజారాహిల్స్లో సొంత ఇల్లు కట్టుకుని స్థిరపడ్డారామె. రమణారావు–జమునలకు వంశీకృష్ణ, స్రవంతి సంతానం. తొలి సంతానం వంశీకృష్ణ పుట్టిన తర్వాత కూడా పదేళ్లపాటు హీరోయిన్గా బిజీగానే కొనసాగారు జమున. వంశీకృష్ణ శాన్ఫ్రాన్సిస్కో విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పని చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. బర్కిలీలోని స్టెయిన్డ్ గ్లాస్ గార్డెన్లో గ్లాస్ పెయింటింగ్లో శిక్షణ పొంది, అదే రంగంలో స్రవంతి స్థిరపడ్డారు. స్రవంతిని హీరోయిన్ చేయాలనుకున్నారు జమున. అయితే ఇండస్ట్రీలో వచ్చిన మార్పులతో ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారామె. కాగా ఓ నవల ఆధారంగా సినిమా తీయాలని, దానికి తనే దర్శకత్వం వహించాలని సంకల్పించారు జమున. నాలుగు పాటలు రికార్డు చేసిన తర్వాత ఈ సినిమా ఆగిపోయింది. అయితే దర్శకత్వంపై తనకున్న మమకారంతో ‘డాక్టర్ మమత’ అనే సీరియల్ని తెరకెక్కించారామె. దూరదర్శన్లో 15 ఎపిసోడ్స్గా ఆ సీరియల్ ప్రసారం అయింది కూడా! రాజకీయ రంగంలో... 1980లలో నాటి ప్రధాని రాజీవ్ గాంధీ ప్రోత్సాహంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు జమున. పార్టీ కార్యవర్గ సభ్యురాలిగా ఎన్నికై 1983లో ఆ పార్టీ తరఫున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేశారామె. తర్వాత రాజీవ్ గాంధీ సపోర్ట్తో 1989లో రాజమండ్రి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు జమున. ఆ తర్వాత వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొన్నాళ్లు చేసిన ఆమె ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి బయటికొచ్చేశారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వ్యవహార శైలి నచ్చి భారతీయ జనతా పార్టీలో చేరారు.. 1990వ దశకంలో ఆ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం చేశారు. ఆ తర్వాత ‘రంగస్థల వృత్తి కళాకారుల సమాఖ్య’ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రంలో పర్యటించి, పదివేల మంది కళాకారుల వివరాలు సేకరించారామె. అంతేకాదు.. ‘రంగస్థల వృత్తి కళాకారుల సమాఖ్య’కు 26 శాఖలు ఏర్పాటు చేశారు. నిరుపేద కళాకారులకు ఇళ్ల స్థలాలు, గృహ రుణాలు, పెన్షన్లు మంజూరు చేయించి పెద్ద మనసు చాటుకున్నారు జమున. అవార్డులు... 1964లో విడుదలైన ‘మూగమనసులు’ (తెలుగు), 1968లో రిలీజైన ‘మిలన్’ (హిందీ) చిత్రాలకు ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డులు, 2008లో ‘ఎన్టీఆర్ జాతీయ పురస్కారం’ అందుకున్నారామె. అలాగే 2021 సంవత్సరానికిగాను ‘సాక్షి’ మీడియా గ్రూప్ ఎక్స్లెన్స్ అవార్డుల్లో భాగంగా ‘జీవిత సాఫల్య పురస్కారం’ అందుకున్నారు జమున. దాదాపు ఏడు దశాబ్దాల కెరీర్లో అద్వితీయమైన పాత్రలు చేసిన జమునకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే‘పద్మ’ పురస్కారం వరించలేదు. అయినా అవార్డులకు అతీతంగా ‘సత్యభామ’గా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేసిన ఈ అద్భుత నటి చరిత్ర ఎప్పటికీ నిలిచిపోతుంది. కూతురే కుమారుడై... 2014 నవంబరు 10న జమున భర్త రమణారావు గుండెపోటుతో మృతి చెందారు. అప్పటినుంచి కుమార్తె స్రవంతి దగ్గరే ఉంటున్నారు జమున. తల్లికి అన్నీ తానయ్యారు స్రవంతి. శుక్రవారం ఉదయం జమున మరణించగా, మధ్యాహ్నం ఆమె పార్థివ∙దేహాన్ని ఫిలిం చాంబర్లో అభిమానుల సందర్శనార్థం ఉంచారు. ఆ సాయంత్రం 4.30 గంటలకు ఫిలిం చాంబర్ నుంచి జమున అంతిమ యాత్ర మహాప్రస్థానానికి చేరింది. అమెరికాలో ఉంటున్న కుమారుడు వంశీకృష్ణ నేడు (శనివారం) హైదరాబాద్ చేరుకుంటారు. దాంతో అన్నీ తానై అశ్రునయనాల మధ్య తల్లికి స్రవంతి అంత్యక్రియలు నిర్వహించారు. సినీ ప్రముఖులు, కుటుంబసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి ఆర్కే రోజాతోపాటు పలువురు పాల్గొని అశ్రునివాళులు అర్పించారు. గాయం చేసిన లేత మనసులు... ‘లేత మనసులు’ సినిమా తమిళ వెర్షన్ చేస్తుండగా జరిగిన ఓ ప్రమాదం వల్ల జమున మెడ బాగా దెబ్బతింది. ‘అందాల ఓ చిలుకా..’ పాట తమిళంలో తీస్తున్నారు. హీరో గడ్డిమేట మీద నుంచి జారుకుంటూ వచ్చి జమున పక్కన చేరాలి. అయితే కొత్తవాడైన ఆ చిత్ర హీరో జయశంకర్.. సీనియర్ హీరోయిన్ జమునతో చేస్తున్నాననే కంగారుతో అడ్డదిడ్డంగా వచ్చి జమున తలపై పడ్డారు.. దీంతో ఆమె మెడ విరిగినంత పనయింది. షూటింగ్ నిలిచిపోయింది. సున్నితమైన మెడ నరాలు దెబ్బతినడంతో కొన్నాళ్లు చికిత్స తర్వాత మళ్లీ షూటింగ్లో పాల్గొన్నారు జమున. అయితే కొన్నేళ్ల తర్వాత ఆ సమస్య మళ్లీ మొదటికొచ్చింది.. దీంతో ఆమె మెడ ఎక్కువగా ఊగిపోయేది. ‘రాజపుత్ర రహస్యం’ సినిమాలో ఈ ఇబ్బంది ఆమెలో బాగా కనిపించేది. ఎన్ని చికిత్సలు తీసుకున్నా తల ఊగడం తగ్గలేదు. 1978లో విడుదలైన ‘శ్రీరామ పట్టాభిషేకం’ తర్వాత సినిమాల నుంచి గౌరవంగా తప్పుకున్నారు జమున. ఆ తర్వాత ‘బంగారు కొడుకు’(1982), ‘జల్సా రాయుడు’(1983), ‘రాజకీయ చదరంగం’(1989) వంచి చిత్రాల్లో ముఖ్యమైన పాత్రలు చేశారు. కాగా ఆమె నటించిన చివరి చిత్రం ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’ 2021 జనవరి 29న విడుదలైంది. నటి జమునతో తన అనుబంధాన్ని ‘సాక్షి’తో నటి కాంచన ప్రత్యేకంగా పంచుకున్నారు. నన్ను ఏడిపించేశావ్ కాంచీ అన్నారు – కాంచన ► వారానికి మూడు నాలుగు సార్లు జమున అక్క, నేను మాట్లాడుకునేవాళ్లం. అయితే ఈ నెల నాకు తీరిక లేకపోవడం, అక్క కూడా ఫోన్ చేయకపోవడంతో మాట్లాడుకోలేదు. మామూలుగా ఫోన్ చేసి, అప్పటి సినిమాల గురించి మాట్లాడుకుంటుంటాం. ‘భోజనం చేశావా.. వంట ఏంటి?’.. ఇవన్నీ కూడా చెప్పుకునేవాళ్లం. ► జమున అక్క నా సీనియర్. నేను కాలేజీ డేస్ నుంచే సీనియర్లతో జూనియర్లు మాట్లాడకూడదా అనుకునేదాన్ని. ఆ ఫీలింగ్తో సీనియర్లతో కూడా బాగా మాట్లాడేదాన్ని. సినిమాల్లోకి వచ్చాక కూడా అంతే. పైగా మేం చిన్నవాళ్లం అనే ఫీలింగ్ ఏమీ పెట్టుకోకుండా జమునక్క, సావిత్రక్క బాగా మాట్లాడేవారు. ► ఇక దసరా వచ్చిందంటే చాలు... బొమ్మల కొలువు సందడి ఉండేది. ఒకరింటికి ఒకరు వెళ్లడం.. సుండల్ (శెనగలు) తినడం... అంతా బాగుండేది. పైగా జమున అక్క భలే డ్రెస్ చేసుకునేవారు. ఆవిడకు బాగా రెడీ అవ్వడం అంటే ఇష్టం. నా డ్రెస్సింగ్ డిఫరెంట్గా ఉండేది. సింపుల్గా రెడీ అయ్యేదాన్ని. బాగున్నావని మెచ్చుకునేవారు. ► అట్లతద్దిని అయితే ఎప్పటికీ మరచిపోలేను. అప్పట్లో అందరం మదరాసు (చెన్నై)లో ఉండేవాళ్లం కదా. అట్లతద్ది నాడు ఒకళ్లు అట్లు వేసేవాళ్లం. ఇంకొకరు చట్నీ చేసేవాళ్లం. ఇంకొకరు పులుసు.. జమున అక్క, నేను అందరం మెరీనా బీచ్కి వెళ్లిపోయేవాళ్లం. అక్కడ ఉయ్యాల కుదరదు కదా. పరుగు పందేలు పెట్టుకుని, చాలా హ్యాపీగా గడిపేవాళ్లం. ► ఆ మధ్య ఒకసారి జమున అక్క ఫోన్ చేసి, ‘నన్ను ఇవాళ బాగా ఏడిపించేశావ్..’ అంటే, నాకేం అర్థం కాలేదు. ‘నేనేం ఏడిపించాను అక్కా...’ అంటే... నువ్వు యాక్ట్ చేసిన ‘కల్యాణ మంటపం’ సినిమా చూశాను. ‘ఎంత బ్రహ్మాండంగా యాక్ట్ చేశావ్. ఎమోషనల్ సీన్స్లో ఏడిపించావ్’ అంటే నాకు పట్టరానంత ఆనందం కలిగింది. ► జమునక్క యాక్ట్ చేసినవాటిలో నాకు ‘మూగ మనసులు’ చాలా ఇష్టం. ఇక ‘మిస్సమ్మ’లో ‘బృందావనమది అందరిదీ..’ పాటకి ఎంతో నాజూకుగా డ్యాన్స్ చేసింది. మనకు ఏమీ తెలియనప్పుడు టీచర్ చెప్పింది చెప్పినట్లు చేస్తాం... ఆ సినిమాలో డ్యాన్స్ నేర్చుకునే స్టూడెంట్గా టీచర్ చెప్పింది చెప్పినట్లు చేసే క్యారెక్టర్ని అక్క అద్భుతంగా చేసింది. ► మేం కలిసి నాటకాలు కూడా వేసేవాళ్లం. ముఖ్యంగా ‘శ్రీకృష్ణ తులాభారం’ నాటకం చాలాసార్లు వేశాం. అందరూ ఆడవాళ్లే నటించాలన్నది అక్క ఆశ. అలానే ఆడవాళ్లందరం కలిసి నటించాం. సినిమాలో కృష్ణుడిగా ఎన్టీఆర్ నటించారు. నాటకంలో ఆ పాత్ర నాది. సత్యభామగా జమున అక్క నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటిది కృష్ణుడిగా నా నటనను మెచ్చుకునేది. ► మేమంతా సత్య సాయిబాబా భక్తులం. జీవితం అనేది పోరాటం. ఈ పోరాటంలో గెలిచి నిలబడటం చాలా కష్టమైన విషయం. జమున అక్క నిలబడింది. ఈ గెలుపు కన్నా కూడా బతికున్నంతవరకూ పోరాటం చేసే మనిషి పోయేటప్పుడు ప్రశాంతంగా పోవడమనేది ముఖ్యం. ఆ ప్రశాంతత అక్కకు దక్కింది. ‘దేవుడా.. ఆస్పత్రిపాలు కాకుండా ప్రశాంతంగా తీసుకెళ్లు’ అని కోరుకుంటాం. ఆ సత్య సాయిబాబా ఆశీస్సులతో అక్క ఎలాంటి ఇబ్బంది పడకుండా వెళ్లిపోయింది. ఆ జీవుడు చివరి నిమిషంలో ఎలాంటి బాధ పడకుండా నిష్క్రమించింది. ప్రశాంతమైన మనిషికి ప్రశాంతమైన నిష్క్రమణ దక్కింది. ఇది కదా కావాల్సింది (గద్గద కంఠంతో..) పేరు మారిందిలా... జమున పేరు వెనక ఓ విశేషం ఉంది. ఆమె తల్లిదండ్రులు తీర్థయాత్రలు చేస్తూ, పండరీపురంలోని పాండురంగని దర్శనం చేసుకున్న తర్వాతే కౌసల్య కడుపులో పడ్డారట జమున. ఈ కారణం చేత ‘జనాబాయి’ అని పేరు పెట్టుకోవాలనుకున్నారు జమున తల్లిదండ్రులు. కానీ జన్మరాశి ప్రకారం ఏదైనా నది పేరు రావాలని పెద్దలు చెప్పడంతో ‘జ’కి ‘న’కు మధ్యలో ‘ము’ అక్షరాన్ని చేర్చి ‘జనాబాయి’ పేరును ‘జమున’గా మార్చారు. ఉత్తరాదిలో ‘యుమున’ నదిని ‘జమున’ అంటారు. ‘ఇంత నాజుకైన పేరు పెట్టి సినిమారంగం కోసం మళ్లీ పేరు మార్చుకునే అవసరం లేకుండా చేసిన మా అమ్మను నిజంగా అభినందించాల్సిందే’ అని పలు సందర్భాల్లో జమున గుర్తుచేసుకుని హ్యాపీ ఫీలయ్యేవారు. సావిత్రితో ప్రత్యేక అనుబంధం ‘మిస్సమ్మ’, ‘దొంగరాముడు’, ‘అప్పుచేసి పప్పుకూడు’, ‘గుండమ్మకథ’ వంటి చిత్రాల్లో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న సావిత్రి, జమునల మధ్య మంచి అనుబంధం ఉంది. అక్కాచెల్లెళ్లుగా అన్ని విషయాలను అరమరికలు లేకుండా చర్చించుకునేవారు. అయితే కొందరు వ్యక్తులు కావాలని వీరిద్దరి మధ్యలో తగువులు పెట్టడంతో ఏడాది పాటు సావిత్రి, జమున మాట్లాడుకోలేదు. ఆ తర్వాత అసలు విషయం గ్రహించి మునుపటిలానే ఉండసాగారు. ఈ విషయాన్ని జమున ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాదు.. తన కొడుకు బారసాల వేడుకకు సావిత్రి వచ్చారని, ఆ సమయంలో ఆమె (సావిత్రి) జీవితం సజావుగా సాగనందుకు చాలా బాధపడి ఏడ్చారని, అప్పుడు తానే సావిత్రిని ఓదార్చినట్లుగా కూడా జమున ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. అలాగే ఒకానొక స్థితిలో సావిత్రి పరిస్థితిని చూసి తనకు చాలా బాధకలిగిందని కూడా జమున పేర్కొన్నారు. నటన–డైరెక్షన్–మ్యూజిక్: జమున! చిన్నతనం నుంచే జమునకు కళల పట్ల మక్కువ ఎక్కువ. అందుకే తొమ్మిదేళ్లు వచ్చేలోపే నాటకాల్లో నటించారు. ప్రజా నాట్యమండలి ఆధ్వర్యంలో తిరునగరి రామాంజనేయులు, బుర్రకథ పితామహుడు నాజర్ తదితరుల నాయకత్వంలో ‘మా భూమి’, ‘ముందడుగు’ ‘దిల్లీ’, ‘ఛలో’, ‘విందు’ వంటి నాటకాల్లో నటించారు జమున. ముఖ్యంగా ‘మా భూమి’ నాటికలోని జమున నటనకు మంచి మార్కులు పడ్డాయి. మరో విశేషం ఏంటంటే... ‘విందు’ అనే నాటికలో యశోదగా నటించడమే కాదు.. ఆ నాటికకు దర్శకత్వం వహించడంతో పాటు, మ్యూజిక్ను కూడా కంపోజ్ చేశారట జమున. ఇలా నటనలో ఎదగడానికి సరిపడా ఓనమాలు నేర్చుకున్నది నాటక రంగం నుంచేనని చెబుతారు జమున. ఆ తర్వాత ‘ఖిల్జీ రాజ్యపతనం’ నాటకంతో జమున పేరు మరింత ప్రాచుర్యంలోకి వచ్చి, తొలి సినిమా ‘పుట్టిల్లు’లో అవకాశం వచ్చేలా చేసింది. ఎస్వీరంగారావు సలహా సినిమా ఇండస్ట్రీలో బాగా రాణిస్తున్న సమయంలో ఓ హీరోను పెళ్లి చేసుకోవాలనుకున్నారట జమున. కానీ ఓ సందర్భంలో అప్పటి సీనియర్ నటులు ఎస్వీ రంగారావు జీవితం గురించి కొన్ని విషయాలు చెప్పి, అన్నీ ఆలోచించుకుని ముందడుగు వేయాలన్నట్లుగా హితబోధ చేశారట. దీంతో అప్పటి ఆ హీరోతో వివాహాన్ని వద్దనుకున్నారట జమున. ఆ తర్వాత రమణారావును పెళ్లి చేసుకున్నారు జమున. తల్లి స్ఫూర్తితో... ఇండస్ట్రీలో జమున చాలా ధైర్యంగా, ఆత్మాభిమానంతో ఉండేవారు. ఈ లక్షణాలతో పాటుగా ఆత్మవిశ్వాసం, వ్యక్తితాన్ని నిలబెట్టుకోవడం వంటి వాటిని తన తల్లి కౌసల్యాదేవి నుంచే అలవరచుకున్నారట జమున. విశేషం ఏంటంటే.. జమున తల్లి స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని రెండు రోజులు జైల్లోనే ఉన్నారట. ప్రముఖుల నివాళి జమున మృతికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ విచారం వ్యక్తం చేశారు. 70ఏళ్ల నట జీవితంలో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించిన ఆమె చిరస్మరణీయంగా నిలిచిపోతారన్నారు. జమున కుటుంబ సభ్యులకు గవర్నర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారని రాజ్భవన్ వర్గాలు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపాయి. తెలుగు చలన చిత్ర పరిశ్రమ మొదటి తరం నటీమణుల్లో అగ్రనాయికగా వెలుగొందిన సీనియర్ నటి జమున తెలుగు వారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు. ఆమె మృతి తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు. ఆమె కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టుగా ట్విట్టర్ ద్వారా సీఎం వైఎస్ జగన్ తన సంతాపాన్ని తెలియజేశారు. నటి జమున మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ , ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం వ్యక్తం చేశారు. జమున మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని సీఎం కేసీఆర్ అన్నారు. తొలి తరం నటిగా వందలాది చిత్రాల్లో నటించి, తెలుగువారి అభిమాన తారగా వెలుగొందిన జమున జ్జాపకాలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడంలోనే కాకుండా హిందీ సినిమాల్లోనూ నటించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన జమున, నటిగా కళా సేవనే కాకుండా పార్లమెంటు సభ్యురాలిగా ప్రజాసేవ చేయడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా జమున కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సీనియర్ హీరోయిన్ జమునగారు స్వర్గస్తులయ్యారనే వార్త విచారకరం. ఆవిడ బహుభాషా నటి. మాతృభాష కన్నడం అయినా ఎన్నో విజయవంతమైన చిత్రాలతో తెలుగువారి మనసుల్లో చెరగని ముద్రవేశారు. మహానటి సావిత్రిగారితో జమునగారి అనుబంధం ఎంతో గొప్పది. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. – చిరంజీవి అల్లరి పిల్లగా, ఉక్రోషంతో ఊగిపోయే మరదలిగా, ఉత్తమ ఇల్లాలిగా, అన్నిటికీ మించి తెలుగువారి సత్యభామగా మనల్ని ఎంతో మెప్పించారు జమునగారు. చిన్ననాటి నుంచే నాటకాల అనుభవం ఉండటంతో నటనకే ఆభరణంగా మారారామె. కేవలం దక్షిణాది సినిమాలకే పరిమితం కాకుండా ఆ రోజుల్లోనే హిందీ సినిమాల్లోనూ నటించి ఔరా అనిపించి అందరి ప్రశంసలు పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి జమునగారు. – బాలకృష్ణ జమునగారు మహానటి. ఆవిడతో కలిసి నేను ఆర్టిస్ట్గా పని చేశాను. ఆ మహానటి మరణం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. నాకు సన్నిహితురాలు. మేం కలిసినప్పుడు ఎంతో ఆప్యాయంగా, ప్రేమగా మాట్లాడేవారు. ఆవిడ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. – మంచు మోహన్బాబు భారతీయ సినీ పరిశ్రమకు జమునగారి మరణం తీరని లోటు. సినిమా ఇండస్ట్రీలో ఆమె ఒక మహానటి. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్, శివాజీగణేశన్.. వంటి ఎంతోమంది మహానటులతో నటించి మెప్పించారామె. అన్ని భాషల్లో ఆమె ఒక సూపర్ స్టార్. కళాకారులకు పెన్షన్ ఇవ్వాలని పోరాడారు. జమునగారికి కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డు ప్రకటించాలని కోరుతున్నాను. – ఆర్. నారాయణమూర్తి జమునగారు దివంగతులు కావడం బాధాకరం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అలనాటి తరానికి ప్రతినిధిగా ఉన్నారామె. వెండితెరపై విభిన్న పాత్రలు పోషించిన జమునగారు తెలుగు ప్రేక్షకులకు సత్యభామగానే గుర్తుండిపోయారు. ఆ పౌరాణిక పాత్రకు జీవం పోశారామె. ఠీవి, గడుసు పాత్రల్లోనే కాకుండా అమాయకత్వం ఉట్టిపడే పాత్రల్లోనూ ప్రేక్షకుల మెప్పు పొందారు. ప్రజా జీవితంలో లోక్సభ సభ్యురాలిగా సేవలందించారు. – పవన్ కల్యాణ్ జమునగారి మరణవార్త విని తీవ్రంగా కలత చెందాను. సినీ పరిశ్రమకు ఆమె చేసిన సేవలు, పోషించిన వైవిధ్యమైన పాత్రలతో ఎప్పటికీ గుర్తుండిపోతారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. – మహేశ్బాబు దాదాపు 30 సంవత్సరాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహారాణిగా కొనసాగారు జమునగారు. ‘గుండమ్మకథ’, ‘మిస్సమ్మ’లాంటి ఎన్నో మరపురాని చిత్రాలు, మరెన్నో వైవిధ్యమైన పాత్రలతో మా మనసుల్లో చెరపలేని ముద్ర వేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి. – ఎన్టీఆర్ జమునగారి మరణవార్త విని నా హృదయం ముక్కలైంది. క్లాసికల్ తెలుగు సినిమాకు ఆమె సేవలు మరువలేనివి. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాను. – అల్లు అర్జున్ జమునగారు లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నాను. కొంతకాలంగా ఆమె క్యాన్సర్తో బాధపడుతున్నారు. ‘మూగమనసులు’ సినిమాలో ఆమె నటన అద్భుతం. సినిమాలతోపాటుగా రాజకీయాల్లోనూ ముందున్నారామె. జమునగారి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగి ఉంటే బాగుండేది. – అలీ -
Veteran actor Jamuna: నివాళి: అలిగితివా సత్యభామ
తెలుగు అలక నీవే.. తెలుగు మొలక నీవే వాల్జడను విసిరి వలపు చూపును దూసేది నీవే అతిశయము నీవే.. స్వాతిశయము నీవే కనుచూపులో ధిక్కరింపు దుడుకువు నీవే నీవు సత్యభామవు.. నీవే సతీ అనసూయవు నీవే రాణి మాలినీదేవివి.. నీవే కలెక్టర్ జానకివి. పాతికేళ్లపాటు తెలుగు తెరను ఏలావు. నీ మార్గము నీదయ్యి నీ దుర్గము నీకు నిలిచింది. ప్రజల అభిమానమే నీకు పద్మభూషణ్. ప్రేక్షకుల ఆరాధనే రఘుపతి వెంకయ్య. నీకు అలంకారమైన అలకతో మా నుంచి వీడ్కోలు తీసుకున్నావని సర్ది చెప్పుకుంటున్నాము. మరోసారి దుగ్గిరాల నుంచి పద్యమై పలుకు. మరోసారి అపర సత్యభామవై మువ్వల సడి చెయ్యి. అలక తీరాక తిరిగి వస్తావు కదూ! సత్రాజిత్తు కుమార్తె సత్యభామ. తప్పు. నిప్పాణి శ్రీనివాసరావు కుమార్తె సత్యభామ. ఒప్పు. తెలుగువారికి సంబంధించినంత వరకు సత్యభామది దుగ్గిరాల. ‘అమ్మా... కాఫీ’... బంగారు బుగ్గలతో, మెరిసే కళ్లతో, గారాబంగా పెరిగి, పెంకిగా మారి, కాలు నేలన పెట్టకుండా, నిద్ర కళ్లతో లేచి కాఫీ అడిగే గారాల పట్టి ఎవరు? ఇంకెవరు జమున. ‘గుండమ్మ కథ’లో ఆ పాత్రను జమునే చేయాలి. కానీ... ‘గుండమ్మ కథ’ సినిమా తీయబోయే ముందు. నిర్మాత చక్రపాణి ఇంట్లో పంచాయితీ. ఒక గదిలో ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్. మరో గదిలో జమున, ఆమె తండ్రి నిప్పాణి శ్రీనివాసరావు. ‘క్షమాపణ పత్రం రాసివ్వమనండి సరిపోతుంది... జమునతో కలిసి పని చేస్తాం’ అని ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్ల గది నుంచి ప్రతిపాదన వచ్చింది. ‘క్షమాపణ రాసేది లేదు. నా తప్పేమిటో చెప్పమనండి’ జమున నుంచి జవాబు. ఈ తగాదా తీర్చకపోతే గుండమ్మ కథ పట్టాలెక్కదు. చక్రపాణి రెండు గదుల వైపు మార్చి మార్చి చూశాడు. ‘భూకైలాస్’ క్లయిమాక్స్ సీన్. మద్రాసు సముద్ర ఒడ్డున తీస్తున్నారు. ఆత్మలింగం చేజార్చుకున్న రావణుడు అంతకంతకూ పెరిగి పెద్దదవుతున్న ఆ లింగాన్ని మోయలేక, తనతో తీసుకెళ్లలేక, దానికి తల కొట్టుకుని ఆత్మత్యాగం చేయబోతున్న దృశ్యం అది. ఎన్.టి.ఆర్ మీద తీస్తున్నారు. ఆ సమయంలో నారదుడైన అక్కినేని పరిగెత్తుకొని రావాలి. మండోదరి పాత్ర పోషిస్తున్న జమున కూడా పరిగెత్తుకుని రావాలి. ఎండ మండిపోతోంది. అప్పటికే జమున షూటింగ్కి ఆలస్యంగా వస్తున్నదని అక్కినేనికి అభ్యంతరం ఉంది. కాలు మీద కాలు వేసుకుని కూచుంటున్నదని ఎన్.టి.ఆర్కు అసౌకర్యం ఉంది. జమునకు ఇవన్నీ తెలియవు. ఆ ఎండలో ఇంకా రాని జమున కోసం ఎదురు చూస్తూ అక్కినేని, ఎన్.టి.ఆర్ ఒక నిర్ణయం తీసుకున్నారు. మరునాడు ఇండస్ట్రీ అంతా ఆ నిర్ణయం విని హాహాకారాలు చేసింది. అచ్చొచ్చోలు విడిచింది. ఇక మీదట ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్లు జమునతో నటించబోవడం లేదు. బాయ్కాట్ ట్రెండ్ ఇటీవల మొదలైంది. కాని తెలుగులో బాయ్కాట్ చూసిన తొలి హీరోయిన్ జమున. ఊ... అంటావా మావా ఉహూ అంటావా మావా. కొత్త పాట. విశేషం ఏముంది? ఊ అను ఉఊ అను ఔనను ఔనవునను... జమున పాట. ఏనాడో జమున ఉఊ అంది. ఔనవునని అనలేకపోయింది. పెద్ద హీరోలు బాయ్కాట్ చేస్తే ఏంటి? తానొక నటి. తనకు సామర్థ్యం ఉంది. తను పని చేయగలదు. ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్లు లేకపోతే ఇక హీరోలే లేరా? అయినా తెర మీద జమున ఉంటే ఇక ఆవిడే ఒక హీరో లెక్క. 1959, 60, 61... దాదాపు మూడేళ్ల పాటు అక్కినేని, ఎన్.టి.ఆర్ జమునతో పని చేయలేదు. జమున ఆగిందా... ఆగలేదు. హిందీకి వెళ్లింది. జూబ్లీ హీరో రాజేంద్ర కుమార్తో ‘హమ్రాహీ’ చేసి హిట్ కొట్టింది. అందులో ‘ముజ్ కో అప్ నే గలే లగాలో’ పాటకు ముబారక్ బేగం, ‘మన్రే తూహీ బతా క్యా గావూ’ పాటకు లతా మంగేష్కర్ జమునకు ప్లేబ్యాక్ ఇచ్చారు. ‘మూగ మనసులు’ హిందీ రీమేక్ మిలన్లో అదే గౌరి పాత్రను వేసి ఫిల్మ్ఫేర్ అవార్డు సాధించింది. ‘బేటి బేటె’ సినిమాలో సునీల్ దత్కు హీరోయిన్గా చేసింది. తెలుగులో జగ్గయ్య, జె.వి.రమణమూర్తి, కృష్ణ, శ్రీధర్, హరనాథ్ వీరితో పని చేసింది. ఈలోపు జమున లాంటి గ్లామర్ స్టార్ లేక కొన్ని సినిమాలు ఏ.ఎన్.ఆర్, ఎన్.టి.ఆర్లవి వెలవెలబోయాయి. ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్లు లేక జమున పెద్ద సినిమాలు చేయలేకపోయింది. ఇరు పక్షాలా నష్టం. ఈ నష్టాన్ని నివారించి అందరినీ కలిపి ‘గుండమ్మ కథ’ తీయాలని చక్రపాణి నిశ్చయం. ‘సార్. క్షమాపణలు వద్దు ఏమొద్దు. వాళ్లనూ కూచోబెట్టండి. నన్నూ కూచోబెట్టండి. కావాలంటే నన్ను నాలుగు చివాట్లు పెట్టండి. ఏదో తెలియని రోజుల్లో తెలియని ప్రవర్తన. ఇక మీదట జాగ్రత్తగా ఉంటాను’ అంది జమున, చక్రపాణితో. ‘ఏమయ్యా రామారావు, నాగేశ్వరరావూ. ఈ బాయ్కాట్ వల్ల భవిష్యత్తు తరాలకు మీరో తప్పు మార్గం చూపిస్తున్నారు. ఇలా వద్దు. అంతా కలిసి పని చేయండి. నా గుండమ్మ ఇప్పటికే ఆలస్యమై ఏడుస్తోంది’ అన్నాడు చక్రపాణి. సమస్య సద్దుమణిగింది. జమున గెలవకపోయి ఉండవచ్చు. కాని ఓడలేదు. గుంటూరు జిల్లాలో పక్కపక్క ఊళ్ల నుంచి ఇద్దరు హీరోయిన్లు వచ్చారు. సావిత్రి, జమున. కృష్ణా జిల్లాలో పక్క పక్క ఊళ్ల నుంచి ఇద్దరు హీరోలు వచ్చారు. అక్కినేని, ఎన్.టి.ఆర్. ఈ నలుగురు తెలుగు సినిమాలకు ‘స్వర్ణచతుష్టయం’. ఆ స్వర్ణ చతుష్టయం నటించి సూపర్హిట్ కొట్టిన సినిమా గుండమ్మ కథ. జమున తండ్రి నిప్పాణి శ్రీనివాసరావు మధ్వ బ్రాహ్మణులు. కన్నడిగులు. జమున తల్లి కౌసల్యాదేవి వైశ్యులు. తెలుగు. వ్యాపారం నిమిత్తం శ్రీనివాసరావు హంపిలో ఉండగా పెద్ద కూతురుగా జమున పుట్టింది. ఆమెకు ఆరేడేళ్లు ఉండగా శ్రీనివాసరావు పసుపు, పొగాకు వ్యాపారానికి వీలుగా ఉంటుందని కాపురాన్ని ‘దుగ్గిరాల’కు మార్చాడు. అలా దుగ్గిరాల జమునకు రెండో జన్మస్థలం అయ్యింది. జమున తల్లికి హరికథలు చెప్పడం వచ్చు. ఆమె కచ్చేరీల్లో మధ్య మధ్య చిన్నారి జమునను స్టేజీ ఎక్కించి పాట పాడించేది. దుగ్గిరాలలో చదువుతూ స్కూల్లో కూడా జమున ఆడేది, పాడేది. నాటకాల వాళ్లు విని బాలనటిగా బతిమిలాడి తీసుకెళ్లేవారు. ‘ఢిల్లీ చలో’, ‘మా భూమి’, ‘ఖిల్జీ రాజ్య పతనం’... వీటిలో జమున బాలనటి. మండూరులో ‘ఖిల్జీ రాజ్యపతనం’ నాటకం వేయాలని ఒక తెలుగు మాస్టారు వచ్చి జమునను తీసుకెళ్లాడు. రైలు దిగి పొలాల మీద నడుస్తూ మండూరు చేరుకోవాల్సి ఉంటే జమున నడవలేక మారాము చేసింది. పాపం... ఆ తెలుగు మాస్టారు జమునను ఎత్తుకొని అంతదూరమూ నడిచి వెళ్లాడు. ఇది జరిగిన కొన్నాళ్లకు ఒక సినిమాలో జమున– అనురాగము విరిసేనా ఓ రేరాజా అనుతాపము తీరేనా... అనే పాటకు అభినయించింది. ఆ రోజు ఆమెను భుజాల మీద ఎత్తుకుని నడిచిన తెలుగు మాస్టారు ఆ పాటలో పడక్కుర్చీలో కూచుని ఆస్వాదిస్తుంటాడు. అతని పేరు జగ్గయ్య. గరికపాటి రాజారావు నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన ‘పుట్టిల్లు’ జమున మొదటి సినిమా. షాపుకారు జానకి, కృష్ణకుమారి, జమున... వీరు మాత్రమే స్ట్రయిట్గా హీరోయిన్ వేషాలతో చిత్ర ప్రవేశం చేశారు. మిగిలిన వారు చిన్న పాత్రలు వేసి, ఎదిగి, హీరోయిన్లు అయ్యారు. 16 ఏళ్ల వయసులో జమున ‘పుట్టిల్లు’ లో చాలా మెచ్యూరిటీ ప్రదర్శించాల్సిన పాత్రను పోషించింది. కాని గరికపాటి, జమునల జంటను ప్రేక్షకులు మెచ్చలేదు. ‘పతియే ప్రత్యక్షదైవమే’ థీమ్తో సినిమాలు వస్తున్న ఆ రోజుల్లో ‘పుట్టిల్లు’ సినిమా వ్యసనపరుడైన భర్తను నిరాకరించి తనకు తాను నిలబడే భార్య పాత్రను చూపించేసరికి జనం హడలెత్తి తెరను చింపేస్తామన్నారు. మూడ్రోజుల్లో బాక్సులు తిరిగొచ్చేసరికి క్లయిమాక్స్ మార్చి తీసి మళ్లీ అతికించినా ఫలితం రాలేదు. ఆ తర్వాత జమున నటించిన రెండు మూడు సినిమాలు ఆడలేదు. వెనక్కు వెళ్లిపోదామనుకుంటూ ఉండగా ‘మిస్సమ్మ’ సినిమాలో మెరిసి నిలబడింది. ఆ సినిమా నాటికే స్టార్లుగా మారిన అక్కినేని, ఎన్.టి.ఆర్, సావిత్రిల సరసకు అతి త్వరగా చేరింది. అయితే ప్రతి నటికి ఒక సిగ్నేచర్ కేరెక్టర్ దొరకాలి. అలాంటి కేరెక్టర్ జమునకు దొరికింది. ఆ పాత్రే సత్యభామ. సత్యభామ పాత్రంటే తెలుగు నాటకాల్లో పాపులర్. స్థానం నరసింహారావు ఆ పాత్రను పోషిస్తూ పాత్ర ఆంగిక, అభినయ, ఆహార్యాలను స్థిరపరిచేశాడు. ప్రేక్షకులు ఎవరైనా ఆయనతో పోల్చి వెండితెర సత్యభామను అంచనా కడతారు. జమున సత్యభామ పాత్రను మొదట తెలిసీ తెలియని వయసులో ‘వినాయక చవితి’ చిత్రంలో పోషించింది. అసలైన సత్యభామగా ఎన్.టి.ఆర్తో ‘శ్రీ కృష్ణ తులాభారం’లో నటించింది. స్థానం నాటకాల్లో పాపులర్ చేసిన ‘మీరజాల గలడా నా యానతి’ పాటను అంతకు దీటుగా అభినయించింది. పెంకితనం, మొండితనం, స్వాతిశయం వీటితో పాటు తెలియని అమాయకత్వాన్ని సత్యభామకు జోడించడంతో జమున సత్యభామ అయ్యింది. సత్యభామ జమున అయ్యింది. కృష్ణుడి వేషంలో ఉన్నా ఎన్.టి.ఆర్ అంతటి వాడి కిరీటాన్ని కాలితో తన్నాలి. జమున ధైర్యంగా తన్నగలిగింది. అలాంటి షాట్ చేశాక సీనియర్ ఆర్టిస్ట్కు ‘సారీ’ చెప్పాలన్న పరిణితి అప్పటికే ఆమెకు వచ్చేసింది. ‘సారీ సార్’ అని ఎన్.టి.ఆర్తో అంటే ‘ఇట్స్ ఆల్రైట్... యాక్టింగే కదా’ అని ఆయన ఈజీగా తీసుకున్నారు. తెలుగువారికి కృష్ణుడు ఎన్.టి.ఆర్. సత్యభామ జమునే. తెలుగువారి తొలి గ్లామర్ స్టార్ కాంచన మాల. తర్వాతి గ్లామర్ స్టార్ జమున. భానుమతి, సావిత్రి, అంజలి... వీరంతా పెర్ఫార్మర్లు. వీరి పక్కన అందరూ సరిపోరు. కాని ఎవరి పక్కనైనా అందంగా సరిపోయే స్టార్గా జమున తెలుగు సినిమా పరిశ్రమలో దాదాపు 25 ఏళ్లు ఏలింది. హరనాథ్తో ‘లేత మనసులు’ పెద్ద హిట్ సాధించింది. అందులోని ‘హలో మేడమ్ సత్యభామా’, ‘అందాల ఓ చిలుకా అందుకో నా లేఖ’ పాటల్లో జమున జాంపండులా ఉందని ప్రేక్షకులు మురిసిపోయారు. ఒక సీనియర్ హీరోయిన్ అయి ఉండి, పెద్ద స్టార్ అయి ఉండి చలంతో ‘మట్టిలో మాణిక్యాలు’ హిట్ కొట్టింది జమున. అందులో ‘నా మాటే నీ మాటై చదవాలి’ పాట అతి మధురం. ముచ్చటం. ఫీల్డ్కు వచ్చిన కొత్తల్లో జమునను ‘హంపీ సుందరి’ అని, ‘ఆంధ్రా నర్గిస్’ అని పిలిచేవారు. చిత్రంగా నర్గిస్కు చిరఖ్యాతి తెచ్చి పెట్టిన ‘మదర్ ఇండియా’ను జమునే తెలుగులో చేసింది. ఆ సినిమా పేరు ‘బంగారు తల్లి’. సినిమా వాళ్లు సినిమా వాళ్లనే చేసుకుంటున్న రోజుల్లో ఆ ఆనవాయితీని తప్పించి లెక్చరర్ను వివాహం చేసుకుంది జమున. కొడుకు పుడితే అక్కినేని భార్య అన్నపూర్ణ వచ్చి ‘సిజేరియన్ అటగదా. ఇన్నాళ్లూ నువ్వొక్కదానివే సన్నగా ఉన్నావనుకున్నాను. ఇకపై లావెక్కిపోతావు’ అని నిట్టూర్చి వెళ్లింది. కాని జమున మారలేదు. కొడుకు పుట్టిన తర్వాత కూడా పదేళ్ల పాటు హీరోయిన్గా కొనసాగింది. సగటు ప్రేక్షకుడి డ్రీమ్ గర్ల్గానే ఉంది. ఒక ఔత్సాహికుడికి జీవితంలో ఒకసారైనా జమున పక్కన నటించి ఆమెతో ఒక డ్యూయెట్ పాడాలని కోరిక. అందుకోసం ఆ ఔత్సాహికుడు భారీ డబ్బు ఖర్చు పెట్టి, పెద్ద తారాగణంతో సినిమా తీశాడు. జమునకు వారితో వీరితో రికమండేషన్ చేయించి తన పక్కన నటించేలా ఒప్పించాడు. ఆమె ఆకర్షణ అలా ఉండేది. అన్నట్టు ఆ సినిమా పేరు ‘బొబ్బిలి యుద్ధం’. ఆ ఔత్సాహికుడు సీతారామ్. మురిపించే అందాలే అవి నన్నే చెందాలే... ‘మిస్సమ్మ’, ‘చిరంజీవులు’, ‘సతీ అనసూయ’, ‘గులే బకావళి కథ’, ‘మంగమ్మ శపథం’, ‘రాముడు భీముడు’, ‘మూగనోము’.... జమున హిట్లు ఎన్నో ఉన్నాయి. ‘మూగ మనసులు’ స్క్రిప్ట్ మొత్తం తయారయ్యాక సావిత్రి విని ఇందులో గౌరి పాత్ర నేను వేస్తాను... రాధ పాత్రను జమునకు ఇవ్వండి. గౌరి పాత్ర చాలా బాగుంది’ అన్నదట. ‘గౌరిగా నువ్వు బాగోవు. అది జమునకే కరెక్ట్’ అని అక్కినేని సర్దిచెప్పారట. ‘మూగ మనసులు’ సినిమాలో జమున విశ్వరూపం చూపింది. గోదారి గట్టు మీద తన పాద ముద్రలను శాశ్వతంగా విడిచింది. రాయీ రప్పా కాని మామూలు మనుషులను కదిలించింది. కొత్త తరం వచ్చాక తన ప్రాభవాన్ని కాపాడుకుంటూ పక్కకు తప్పుకుంది జమున. చిల్లర మల్లర క్యారెక్టర్లు వేయలేదు. ఆమె వేసే క్యారెక్టర్ ‘పండంటి కాపురం’లో రాణి మాలినీ దేవిలా ఉండాలి. అంత పవర్ఫుల్గా ఉండాలి. ఉంది. పండంటి కాపురం సూపర్ హిట్ కావడంలో జమున పాత్ర ఒక ముఖ్య కారణం. జమున తాను రిటైరై పోయినా ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ ప్రేక్షకులకు దగ్గరగానే ఉంది. చివరి నిమిషం వరకూ గ్లామర్తోనే కనిపించింది. తెల్లజుట్టు జమునను ఎవరూ చూడలేదు. ఉత్సాహం లేని జమునను ఎవరూ చూడలేదు. స్వాతిశయం తప్పిన జమునను ఎవరూ చూడలేదు. సినిమా రంగంలో ఎన్నో ప్రతికూలతలు దాటి, ఎదురు నిలిచి, తన స్థానాన్ని పొందింది జమున. ఆమె రాకతో ఒక వెన్నెల వచ్చింది. ఆమె వీడ్కోలుతో ఆ వెన్నెల జ్ఞాపకాల్లోనే మిగిలింది. పగలే వెన్నెల... జగమే ఊయల కదలే ఊహలకే కన్నులుంటే... జమున హిట్ సాంగ్స్లో కొన్ని.. 1. గౌరమ్మా నీ మొగుడెవరమ్మా... (మూగ మనసులు) 2. నీ మది చల్లగా స్వామీ నిదురపో... (ధనమా దైవమా) 3. ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి... (దొరికితే దొంగలు) 4. అంతగా నను చూడకు.. ఇంతగా గురి చూడకు... (మంచి మనిషి) 5. ఈ వేళ నాలో ఎందుకో ఆశలు... (మూగనోము) 6. తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ గుట్టు తెలిసిందిలే... (రాముడు భీముడు) 7. మళ్లీ మళ్లీ పాడాలి ఈ పాట... (మట్టిలో మాణిక్యం) 8. వసంత గాలికి వలపులు రేగ... (శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు కథ) 9. నన్ను దోచుకొందువటే... (గులేబకావళి కథ) 10. బులి బులి ఎర్రని బుగ్గల దానా... (శ్రీమంతుడు) 11. మనసా కవ్వించకే నన్నిలా... (పండంటి కాపురం) 12. రివ్వున సాగే రెపరెపలాడే... (మంగమ్మ శపథం) 13. పచ్చని చెట్టు ఒకటి వెచ్చని చిలుకలు రెండు .. (రాము) 14. బృందావనమది అందరిదీ గోవిందుడు అందరివాడేలే... (మిస్సమ్మ) 15. ప్రేమ యాత్రలకు బృందావనమూ నందనవనమూ ఏలనో.. (గుండమ్మ కథ) 16. నువ్వూ నేనూ నడిచేది ఒకే బాట... ఒకే మాట (డబ్బుకు లోకం దాసోహం) ఖదీర్ -
చౌమహల్లా ప్యాలెస్లో సీఎం కేసీఆర్.. నిజాం రాజు ముకరం జాకు నివాళులు..
-
Mukarram Jha: నిజాం రాజు ముకరం జాకు సీఎం కేసీఆర్ నివాళులు..
శంషాబాద్/చార్మినార్: టర్కీలోని ఇస్తాంబుల్లో ఈ నెల 14న తుదిశ్వాస విడిచిన ఎనిమిదో నిజాం ముకరంజా బహదూర్ పార్థివదేహం మంగళవారం సాయంత్రం శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంది. ఇస్తాంబుల్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్కు తెచ్చారు. భారీ బందోబస్తు నడుమ చౌమహల్లా ప్యాలెస్కు తీసుకెళ్లారు. రాత్రి 7 గంటలకు ముకరంజా భౌతికకాయాన్ని సందర్శించి సీఎం కేసీఆర్ నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే మంత్రులు మహ్మద్ మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డితోపాటు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తదితరులు ముకరంజా భౌతికకాయానికి నివాళులర్పించారు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్యాలెస్ లో ముకరంజా భౌతిక కాయాన్ని సందర్శించేందుకు ప్రజలను అనుమతించనున్నారు. మధ్యాహ్నం ప్యాలెస్ నుంచి మక్కా మసీదు వరకు నిజాం అంతిమ యాత్ర నిర్వహించనున్నారు. మక్కా మసీదులో తన పూర్వీకులైన నిజాం సమాధుల పక్కన ముకరంజా పార్థివదేహాన్ని ఖననం చేయనున్నారు. అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 1967లో ఎనిమిదో నిజాంగా.. భారత యూనియన్లో హైదరాబాద్ చేరిన తర్వాత, ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ జనవరి 26, 1950 నుంచి అక్టోబర్ 31, 1956 వరకు రాష్ట్ర రాజ్ ప్రముఖ్గా పనిచేశారు. ఫిబ్రవరి 1967లో ఆయన మరణానంతరం ఏప్రిల్ 6, 1967లో ఎనిమిదవ అసఫ్ జాహీగా ముకరం జాకు పట్టాభిషేకం చేశారు. నిజాం చారిటబుల్ ట్రస్ట్, ముకరంజా ట్రస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్కు ముకరంజా చైర్మన్గా వ్యవహరించారు. ఏడో నిజాం వారసుడిగా 1967 భారీ సంపదను ముకరంజా వారసత్వంగా పొందారు. -
చివరి చూపు కోసం...
సావోపాలో: బ్రెజిల్ ఆరాధ్య ఫుట్బాలర్ పీలేను కడసారి చూసేందుకు అభిమానులు సోమవారం ఉదయం నుంచే ఆయన పార్థివదేహం ఉంచిన విలా బెల్మిరా స్టేడియం ముందు క్యూ కట్టారు. 82 ఏళ్ల సాకర్ సూపర్స్టార్ గురువారం క్యాన్సర్తో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే! సావోపాలో శివారులో ఉన్న స్టేడియం సామర్థ్యం 16000 మాత్రమే! కానీ పెద్ద సంఖ్యలో అభిమానులు, సాంటోస్ క్లబ్ ఆటగాళ్లు, బ్రెజిల్ జాతీయ ఆటగాళ్లు తమ దిగ్గజానికి తుది నివాళులు అర్పించారు. ‘ఫిఫా’ అధ్యక్షుడు ఇన్ఫాంటినో, అధికారులు శ్రద్ధాంజలి ఘటించారు. మంగళవారం సాంటోస్ వీధుల గుండా అంతిమయాత్ర ముగించాక మెమోరియల్ నెక్రొపొలె ఎక్యుమెనికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. దీనికి బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో హాజరవుతారు. -
సంకుచిత భావనలొదిలేస్తే సమున్నతంగా ఎదుగుతాం
న్యూఢిల్లీ: గత కాలపు సంకుచిత భావనలను చెరిపేస్తేనే చరిత్రను తిరగరాసే స్థాయికి భారత్ అద్భుత విజయాలను ఒడిసిపట్టుకోగలదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సోమవారం ఢిల్లీలో జరిగిన తొలి ‘వీర్ బాల్ దివస్’ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. గురు గోవింద్ సింగ్ తనయులు జోరావార్ సింగ్, ఫతే సింగ్లకు ఈ సందర్భంగా మోదీ ఘన నివాళులర్పించి ప్రసంగించారు. ‘ సంకుచిత భావన బంధనాలను తెంచుకుని భారత్ అద్భుత ప్రగతి పథంలో దూసుకుపోవాల్సిన తరుణం వచ్చేసింది. ‘గురు గోవింద్ సింగ్ చిన్నారులను మతం మార్చాలని లేదంటే ఖడ్గానికి పనిజెప్తానని ఆనాటి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు హూంకరించడంతో విధిలేక తన ఇద్దరు కుమారులను గురు గోవింద్ బలివ్వక తప్పలేదు. గురు గోవింద్ సింగ్ నమ్మిన సిద్ధాంతం కోసం మేరునగంలా నిలిచారు. ఆ చిన్నారుల సాహసం, త్యాగనిరతిని కీర్తించేటపుడు వయసును లెక్కలోకి తీసుకోవద్దు. భక్త ప్రహ్లాదుడు, ధ్రువుడు, బలరాముడు, లవకుశ, చిన్నికృష్ణుడు అందరూ చిన్నతనంలోనే తమ పరాక్రమాన్ని ప్రదర్శించినవారే’ అని అన్నారు. అభివృద్ధిలో అత్యున్నత శిఖరాలపై నిలపాలి ‘వీర్ బాల్ దివస్ను స్ఫురణకు తెచ్చుకుంటే గత భారతదేశ ఘన చరిత మనకు తెలుస్తుంది. ఇది యువతకు స్ఫూర్తిగా ఉంటూ భవిష్యత్కు దిశా నిర్దేశకంగా నిలుస్తోంది. ‘ ఘన చరిత గల దేశం ఎప్పుడూ ఆత్మస్థైర్యం, ఆత్మగౌరవంతో ముందడుగు వేయాలి. కానీ కొందరు మన పూర్వ చరిత్రలో పెద్దస్థాయిలోనే ఆత్మన్యూనత భావాలను నింపేశారు. అమృతకాలంలో ఈ బానిసత్వపు ఆలోచనలకు స్వస్తిపలికి దేశాన్ని అభివృద్ధిలో సమున్నత శిఖరాలపై నిలిపేందుకు కృషిచేయాలి’ అని ప్రజలకు మోదీ హితవు పలికారు. ‘ఒంటరిగా పోరాడారే తప్ప మొఘల్స్కు తలవంచలేదు. ఈ అసమాన ధీరత్వమే దేశానికి శతాబ్దాలుగా స్ఫూర్తిగా నిలుస్తోంది’ అని వ్యాఖ్యానించారు. -
విలువల రాజకీయానికి మారుపేరు వాజ్పేయి
సాక్షి, హైదరాబాద్: భారత రత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 98వ జయంతి సందర్భంగా బీజేపీ నేతలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగి న కార్యక్రమంలో వాజ్పేయి చిత్రపటానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ పార్లమెంట రీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, జాతీయ కార్య వర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనారెడ్డి, డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి ఇతర నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కె.లక్ష్మణ్ మాట్లాడుతూ, తెలంగాణలో రాబోయేది బీజేపీ సర్కారేనని ధీమా వ్యక్తంచేశారు. దేశంలో రెండుసార్లు బీజేపీ అధికారంలోకి రావడానికి వాజపేయి సిద్ధాంతాలే కారణమన్నారు. ఒక్క ఓటుతో అధికారం కోల్పోతామని తెలిసి కూడా వాజపేయి వెనకడుగు వేయలేదని గుర్తుచేశారు. విలువలతో కూడిన రాజకీయాలకు వాజపేయి పెట్టింది పేరని పేర్కొన్నారు. ప్రధానిగా వాజ్పేయి ఎన్నో సాహాసోపేత నిర్ణయాలు తీసుకున్నారని, ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆయన స్ఫూర్తితోనే పనిచేస్తున్నారని బండి సంజయ్ కొనియాడారు. వాజపేయి జయంతి సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు చింతల రామచంద్రారెడ్డి, గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, బంగారు శ్రుతి, కాసం వెంకటేశ్వర్లు, బండా కార్తీకరెడ్డి, కె.రాములు, భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం 2023 క్యాలెండర్ని బండి సంజయ్ విడుదల చేశారు. -
పార్లమెంట్ సమావేశాల్లోనే పీవీకి భారతరత్న ప్రకటించాలి
సనత్నగర్: ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే మాజీ ప్రధానమంత్రి దివంగత పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించాలని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ డిమాండ్ చేశారు. పీవీ నరసింహారావు 18వ వర్ధంతి సందర్భంగా పీవీ మార్గ్లోని పీవీ జ్ఞానభూమిలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ వాణీదేవి రచించిన ‘నిజాం రాష్ట్రంలో మహాత్ముని పర్యటనలు’, ‘హైదరాబాద్ నగరంలో రాజకీయ సభలు’, ‘భాగ్యనగర్ రేడియో’అనే పుస్తకాలను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం తలసాని మాట్లాడుతూ ప్రధానిగా పీవీ సంస్కరణలను తీసుకువచ్చి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా అంచెలంచెలుగా ఎదుగుతూ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసి సమర్ధవంతమైన పాలనను అందించారని గుర్తుచేసుకున్నారు. దేశానికి, రాష్ట్రానికి ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఏడాదిపాటు పీవీ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. 26 అడుగుల కాంస్య విగ్రహాన్ని హుస్సేన్సాగర్ తీరాన ఏర్పాటు చేయడంతోపాటు నెక్లెస్ రోడ్డుకు పీవీ మార్గ్గా నామకరణం చేసినట్లు చెప్పారు. నివాళులు అర్పించినవారిలో ఎమ్మెల్సీ వాణీదేవి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, మాజీ కార్పొరేటర్లు అరుణగౌడ్, శేషుకుమారి తదితరులు ఉన్నారు. పీవీకి నివాళులు అర్పించిన గవర్నర్ పీవీ జ్ఞానభూమిలో జరిగిన వర్ధంతి కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై హాజరై నివాళులు అర్పించారు. కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ సీనియర్ నేతలు దిగ్విజయ్సింగ్, కేవీపీ, పొన్నం ప్రభాకర్, మల్లు రవి, శ్రీధర్బాబు, అంజన్కుమార్యాదవ్, బీజేపీ నుంచి మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్రావు, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ తదితర ప్రముఖులు పీవీకి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. -
వల్లభాయ్ పటేల్, పొట్టి శ్రీరాములుకు సీఎం జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: భారతరత్న సర్ధార్ వల్లభాయ్ పటేల్, అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం ఇరువురి చిత్రపటాలకు పూలు సమర్పించి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఐ కమిషనర్ రేపాల శ్రీనివాసరావు, ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ పాల్గొన్నారు. చదవండి: (రాష్ట్రానికి విశాఖే భవిష్యత్.. త్వరలోనే వైజాగ్ నుంచి పరిపాలన) -
మీ త్యాగాన్ని జాతి మరువదు
న్యూఢిల్లీ: 2001లో పార్లమెంట్పై ఉగ్ర దాడి ఘటనలో నేలకొరిగిన వారికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా జాతి యావత్తూ మంగళవారం నివాళులర్పించింది. పార్లమెంట్ భవనం వెలుపల జరిగిన కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అన్ని పార్టీల ఎంపీలు ఘనంగా నివాళులర్పించారు. 2001 పార్లమెంట్ దాడి ఘటనలో వీరమరణం పొందిన వారికి జాతి ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని రాష్ట్రపతి ముర్ము అనంతరం ట్వీట్ చేశారు. దేశం కోసం ప్రాణాలను ఫణంగా పెట్టిన వారి త్యాగాన్ని, ధైర్యసాహసాలను ఎన్నడూ మరువబోమని ప్రధాని మోదీ ట్విట్టర్లో తెలిపారు. ఘనంగా నివాళులర్పించిన రాజ్యసభ అంతకుముందు, పార్లమెంట్పై దాడి ఘటనలో ప్రాణాలర్పించిన వారికి రాజ్యసభ నివాళులర్పించింది. సభ్యులు తమ స్థానాల నుంచి లేచి నిలబడి మౌనం పాటించారు. సభా కార్యకలాపాలు ప్రారంభం కాగానే డిప్యూటీ చైర్మన్ హరివంశ్ రాయ్ మాట్లాడారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో డిసెంబర్ 13వ తేదీ ఎప్పటికీ విషాదకరమైన రోజుగానే గుర్తుండిపోతుందన్నారు. 2001 డిసెంబర్ 13వ తేదీన లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థలకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు పార్లమెంట్ వద్ద కాల్పులకు తెగబడ్డారు. పార్లమెంట్ భవనంలోకి చొచ్చుకుపోయేందుకు వారు చేసిన యత్నాన్ని బలగాలు తిప్పికొట్టాయి. ఈ ఘటనలో ఐదుగురు ఢిల్లీ పోలీసులు, సీఆర్పీఎఫ్ మహిళా జవాను ఒకరు, పార్లమెంట్ సిబ్బంది ఇద్దరు, జర్నలిస్ట్ ఒకరు ప్రాణాలు కోల్పోగా భద్రతా బలగాల కాల్పుల్లో ఉగ్రవాదులందరూ హతమయ్యారు. -
మళ్లీ వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమే
నాగోలు (హైదరాబాద్): అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టి సారించి వివిధ కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్నందున వచ్చే ఎన్నికల్లోనూ ప్రజలు టీఆర్ఎస్నే గెలిపిస్తారని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. రాష్ట్రంలో గత ఎనిమిదేళ్లుగా అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల మాదిరిగా సాగుతున్నాయన్నాయని తెలిపారు. మంగళవారం ఎల్బీనగర్ నియోజకవర్గంలో సుమారు రూ.55 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఫతుల్లగూడలో జరిగిన సభలో మాట్లాడారు. పేదల్ని ఆదుకుంటున్న పథకాలు పేదల ముఖాల్లో చిరునవ్వు చూడాలని, సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో సంతృప్తికర స్థాయిలో ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలకు రూపకల్పన చేశామని కేటీఆర్ చెప్పారు. కల్యాణలక్ష్మి, ఆసరా పథకం, కేసీఆర్ కిట్ వంటి వంద రకాల సంక్షేమ పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది పేదలను ఆదుకుంటున్నాయని తెలిపారు. మెట్రో రైలు మొదటి దశలో నాగోలు వరకు నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగిందని, నాగోలు నుంచి ఎల్బీ నగర్ వరకు మిగిలిపోయిన 5 కిలోమీటర్ల మెట్రోను రెండో దశలో చేపడతామని తెలిపారు. వచ్చే ఎన్నికల తర్వాత ఎల్బీనగర్ నుంచి హయత్నగర్ వరకు మెట్రోను విస్తరిస్తామన్నారు. పెరిగిన తలసరి ఆదాయం.. తెలంగాణ వచ్చిన సమయంలో రాష్ట్ర తలసరి ఆదాయం 1.24 లక్షలని, తెలంగాణ వచ్చిన ఏడేళ్లలో 2.78 లక్షల తలసరి ఆదాయంతో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందని కేటీఆర్ తెలిపారు. జీఎస్డీపీ తెలంగాణ వచ్చిన సమయంలో 5.6 లక్షల కోట్లని, అదే ఈ రోజు 11.55 లక్షల కోట్లుగా ఉందన్నారు. దేశంలో అత్యుత్తమ 20 గ్రామ పంచాయతీలు ఎక్కడ ఉన్నాయని సర్వే చేస్తే..19 గ్రామాలు తెలంగాణలో ఉన్నాయని స్వయంగా కేంద్రమే చెబుతోందని అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో రాష్ట్రానికి అత్యధికంగా 26 అవార్డులు కేంద్రం ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేశారు. 31.7 శాతానికి పెరిగిన గ్రీన్ కవర్.. రాజకీయ నాయకులు ఎన్నడూ చెట్లు, మొక్కలు, పర్యావరణం గురించి మాట్లాడరని కేటీఆర్ అన్నారు. చెట్లకు ఓట్లు ఉండవని, వాటితో ఎక్కువ లాభం ఉండదు కాబట్టే మాట్లాడరన్నారు. కానీ కేసీఆర్ నాయకత్వంలో 240 కోట్ల మొక్కలు నాటి సంరక్షిస్తుండడంతో గతంలో 24 శాతం ఉన్న గ్రీన్ కవర్ ఇవాళ 31.7 శాతానికి చేరిందని, ఇది రాష్ట్రానికే గర్వకారణమని పేర్కొన్నారు. గతంలో ఫతుల్లగూడ ఏరియా అడుగుపెట్ట వీల్లేకుండా దుర్వాసనతో అటవీ ప్రాంతంలా ఉండేదని, ప్రస్తుతం డంప్యార్డ్ను అపురూపమైన పార్క్గా తీర్చిదిద్దామని, దేశంలోని ఎక్కడా లేని విధంగా ముక్తిఘాట్ను ఏర్పాటు చేసి రూ.16 కోట్లతో అన్ని కులాలకు, మతాలకు చెందిన వారు ఒకే చోట దహన సంస్కారాలను చేసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మంత్రి మల్లారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
చావనైనా చస్తాం... కేసీఆర్ను వదిలివెళ్లం...
సాక్షి, హైదరాబాద్: చావనైనా చస్తాం, కానీ సీఎం కేసీఆర్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి వెళ్లబోమని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. పార్టీ మారే శాసనసభ్యుల నియోజకవర్గాలు అంటూ బాన్సువాడ పేరు మీడియాలో వచ్చిందని, కానీ బాన్సువాడ శాసనసభ్యుడిగానే తన వైఖరిని స్పష్టం చేస్తున్నానని అన్నారు. మంగళవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 66వ వర్థంతి సందర్భంగా అసెంబ్లీ ఆవరణలోని అంబేడ్కర్ విగ్రహానికి స్పీకర్ పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ‘తెలంగాణ శాసనసభ్యులు ఎవరు కూడా డబ్బులకు అమ్మడుపోయేవారు కాదు. అది ఊహాజనితం మాత్రమే, ఎవరైనా ఆశపడితే చేతులు కాల్చుకుని భంగపడతారు’ అని వ్యాఖ్యానించారు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ను బలపరచడంతోపాటు సీఎంగా ఆయన తీసుకునే నిర్ణయాలను అమలు చేస్తాం. ప్రభుత్వాలను కూల్చడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేయాలి’అని అన్నారు. అంబేడ్కర్ ఆశయాలను నూరు శాతం అమలు చేయడంలో కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ముందున్నదని స్పీకర్ పేర్కొన్నారు. ఆరోపణలు చేసేవారు కాకుండా ఆలోచించేవారే పారిపాలన చేయగలరని పేర్కొన్నారు. పాదయాత్రల పేరిట విమర్శలు, అసత్యాలు ప్రచారం చేయకుండా ప్రజలకు ఏం చేస్తారో నాయకులు చెప్పాలన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమల్లో దేశానికే తెలంగాణ ఆదర్శంగా ఉందన్నారు. కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు ఎంఎస్ ప్రభాకర్రావు, దండె విఠల్, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నరసింహాచార్యులు పాల్గొన్నారు. -
ఘంటసాల శతజయంతి ఉత్సవాలు: సింగపూర్లో ఘన నివాళి
శ్రీ సాంస్కృతిక కళాసారథి - సింగపూర్, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, వంశీ ఇంటర్నేషనల్- ఇండియా, ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్, శుభోదయం గ్రూప్ సంయుక్త ఆధ్వర్యంలో, అమర గాయకులు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు శతజయంతి ఉత్సవాలు సింగపూర్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. వంశీ అధ్యక్షులు డాక్టర్ వంశీ రామరాజు, శుభోదయం గ్రూప్ చైర్మన్ డాక్టర్ శ్రీలక్ష్మీ ప్రసాద్ కలపటపు, ప్రముఖ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్, హాంకాంగ్ తెలుగు సమాఖ్య వ్యవస్థాపకురాలు జయ పీసపాటి, "శ్రీ సాంస్కృతిక కళాసారథి" వ్యవస్థాపకులు కవుటూరు రత్నకుమార్, కార్యక్రమం ప్రధాన సమన్వయకర్త రాధిక మంగిపూడి, నిర్వాహకబృంద సభ్యులు శ్రీధర్ భరద్వాజ్, చామిరాజు రామాంజనేయులు పాతూరు రాంబాబు జ్యోతి ప్రకాశనం గావించి ఘంటసాల మాస్టారు చిత్రపటానికి పూవులతో నివాళులు అర్పించారు. "గత సంవత్సరం డిసెంబర్ 4వ తేదీన ప్రారంభించి, 366 రోజుల పాటు నిర్విరామంగా అంతర్జాల మాధ్యమంలో నిర్వహిస్తూవస్తున్న 'ఘంటసాల స్వరరాగ మహాయాగం' కార్యక్రమం సమాపనోత్సవంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. భారతదేశం నుండి అతిథులు గాయనీగాయకులు, వాద్య బృందం సింగపూర్కు విచ్చేయడం చాలా ఆనందంగా ఉందని, ఈ కార్యక్రమం తమ సంస్థ ద్వారా జరగడం అదృష్టంగా భావిస్తున్నామని" రత్నకుమార్ కవుటూరు తెలియజేశారు. కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి సందేశాన్ని పంపిన వామరాజు సత్యమూర్తికి కృతజ్ఞతలు తెలిపారు. కిషన్ రెడ్డి తమ అభినందన వీడియో సందేశంలో "ఈ కార్యక్రమం సింగపూర్ లో నిర్వహించడం అభినందనీయమని తమ హర్షాన్ని వ్యక్తం చేస్తూ, సింగపూర్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. భారత కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రధాని నరేంద్ర మోడీ గారి తరఫున, కార్యక్రమానికి ప్రత్యేక అభినందనలు కూడా అందించారు." ఘంటసాల సతీమణి సావిత్రమ్మ, కుమార్తె సుగుణ ఈ కార్యక్రమానికి అభినందన సందేశాలు పంపుతూ "పైనుండి ఘంటసాల వారు ఈ కార్యక్రమాన్ని చూసి సంతోషిస్తారన్నారు." శుభోదయం సమర్పణలో, మాధవపెద్ది సురేష్ సారధ్యంలో జరిగిన ప్రత్యేక సంగీత విభావరిలో, ప్రముఖ నేపథ్య గాయనీగాయకులు చంద్రతేజ, సురేఖ మూర్తి, చింతలపాటి సురేష్ అద్భుతమైన పాటలను ఆలపించగా, ప్రముఖ వాద్య కళాకారులు సాయి కుమార్ పవన్ కుమార్ సోదరులు, యుగంధర్, చక్రపాణి సోమేశ్వరరావు చక్కటి వాద్య సహకారాన్ని అందించారు.దుబాయ్ నుండి విచ్చేసిన నాట్య కళాకారిణి కుమారి తెన్నేటి శ్రావణి శాస్త్రీయ నృత్య ప్రదర్శన అందరిని ఆకర్షించింది. ఈ వేదికపై శుభోదయం వారి "షడ్రుచి" శాఖ ప్రకటనను సింగపూర్ లో విడుదల చేశారు. వారు నిర్మించిన 'ఘంటసాల ది గ్రేట్' బయోపిక్ దర్శకులు రామారావు నిర్మాత జి వి భాస్కర్ లను శ్రీ సాంస్కృతిక కళాసారథి వారు ప్రత్యేకంగా సత్కరించారు. వంగూరి ఫౌండేషన్ వారి ప్రచురణగా పీఎస్ గోపాలకృష్ణ రచించిన 'మన ఘంటసాల' అనే పుస్తకాన్ని ఈ వేదికపై అతిధులు అందరూ కలిసి ఆవిష్కరించారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపకులు వంగూరి చిట్టెన్ రాజు ఈ సందర్భంగా కార్యక్రమానికి అభినందనలు తెలియజేస్తూ సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ పర్యటనకు ఏర్పాట్లన్నీ గావించిన శుభోదయం బాలసుబ్రమణ్యానికి నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సింగపూర్ గాయనీ గాయకులు అలనాటి అందమైన పాటలను పాడి ఘంటసాలవారికి జోహార్లు అర్పించగా, ఈ కార్యక్రమానికి ప్రధాన సమన్వయకర్త అయిన రాధిక మంగిపూడి సభా నిర్వహణ గావించారు. సింగపూర్లో పంగోల్ లోని జిఐఐయస్ ప్రాంగణంలో సుమారు 5 గంటలపాటు జరిగిన ఈ కార్యక్రమానికి సింగపూర్ లో వివిధ తెలుగు సంస్థల ప్రతినిధులు హాజరవగా, గణేశ్న రాధాకృష్ణ, కాత్యాయని, శిష్ట్లా వంశీ సాంకేతిక నిర్వహణా బాధ్యతలు వహించి ప్రత్యక్ష ప్రసారాన్ని అందించారు. -
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన మర్రి చెన్నారెడ్డి
కవాడిగూడ: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన వ్యక్తి మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి అని పలువురు వక్తలు కొనియాడారు. ప్రస్తుతం కొంతమంది తామే ఉద్యమాలు చేశామని గొప్పలు చెప్పుకుంటూ వారికి వారే తెలంగాణ జాతిపితగా చెలామణి అవుతున్నారని అన్నారు. కానీ తెలంగాణ సమాజానికి మర్రి చెన్నారెడ్డి చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి 26వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఇందిరాపార్కులోని రాక్గార్డెన్లో ఆయన సమాధికి విగ్రహానికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు, మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె అరుణ, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, మాజీ మంత్రి కృష్ణయాదవ్, మాజీ ఎమ్మెల్యే చెన్నారెడ్డి తనయుడు మర్రి శశిధర్రెడ్డి, మర్రిచెన్నారెడ్డి మనుమలు ఆదిత్యరెడ్డి, పురూరవరెడ్డి, కృష్ణారెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు పెద్దఎత్తున హాజరై నివాళులర్పించారు. -
Constitution Day: ప్రాథమిక విధులే ప్రాథమ్యం
న్యూఢిల్లీ: ప్రాథమిక విధుల నిర్వహణే పౌరుల ప్రథమ ప్రాథమ్యంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. అప్పుడే దేశం ఉన్నత శిఖరాలకు చేరుతుందన్నారు. వాటిని పూర్తి అంకితభావంతో, చిత్తశుద్ధితో పాటించాలని పిలుపునిచ్చారు. నాడు గాంధీ మహాత్ముడు కూడా ఈ మేరకు పిలుపునిచ్చారని గుర్తు చేశారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శనివారం సుప్రీంకోర్టులో జరిగిన వేడుకల్లో ఆయన మాట్లాడారు. అన్ని రంగాల్లోనూ వృద్ధి పథంలో శరవేగంగా దూసుకుపోతున్న భారత్వైపే ప్రపంచమంతా చూస్తోందన్నారు. వచ్చే ఏడాది జీ 20 శిఖరాగ్ర సదస్సుకు భారత్ అధ్యక్షత వహించనుండటాన్ని ప్రపంచ శ్రేయస్సులో మన పాత్రను అందరి ముందుంచేందుకు అతి గొప్ప అవకాశంగా అభివర్ణించారు. ‘‘ప్రపంచం దృష్టిలో దేశ ప్రతిష్టను మరింత ఇనుమడింపజేసేందుకు మనమంతా కలసికట్టుగా కృషి చేయాలి. ఇది మనందరి బాధ్యత. కేంద్రం అనుసరిస్తున్న ప్రజానుకూల విధానాలు పేదలను, మహిళలను సాధికారత దిశగా నడుపుతున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తిని, ప్రాచీనకాలం నుంచి వస్తున్న విలువలను కొనసాగిస్తూ ప్రజాస్వామ్యానికి మాతృకగా భారత్ అలరారుతోంది. ఈ గుర్తింపును మరింత బలోపేతం చేయాలి’’ అని పిలుపునిచ్చారు. స్వాతంత్య్రానంతరపు కాలంలో జాతి సాంస్కృతిక, నైతిక భావోద్వేగాలన్నింటినీ మన రాజ్యాంగం అద్భుతంగా అందిపుచ్చుకుందని కొనియాడారు. స్వతంత్ర దేశంగా భారత్ ఎలా మనుగడ సాగిస్తుందోనన్న తొలినాటి అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ భిన్నత్వమే అతి గొప్ప సంపదగా అద్భుత ప్రగతి సాధిస్తూ సాగుతోందన్నారు. ‘‘వందేళ్ల స్వతంత్ర ప్రస్థానం దిశగా భారత్ వడివడిగా సాగుతోంది. ఇప్పటిదాకా నడిచింది అమృత కాలమైతే రాబోయే పాతికేళ్లను కర్తవ్య కాలంగా నిర్దేశించుకుందాం. ప్రాథమిక విధులను పరిపూర్ణంగా పాటిద్దాం. రాజ్యాంగంతో పాటు అన్ని వ్యవస్థల భవిష్యత్తూ దేశ యువతపైనే ఆధారపడి ఉంది. రాజ్యాంగంపై వారిలో మరింత అవగాహన పెంచాల్సిన అవసరముంది. అప్పుడే సమానత్వం, సాధికారత వంటి ఉన్నత లక్ష్యాలను వారు మరింతగా అర్థం చేసుకుని ఆచరిస్తారు’’ అని చెప్పారు. రాజ్యాంగ పరిషత్తులో మహిళా సభ్యుల పాత్రకు తగిన గుర్తింపు దక్కలేదని ఆవేదన వెలిబుచ్చారు. ‘‘అందులో 15 మంది మహిళలుండేవారు. వారిలో ఒకరైన దాక్షాయణీ వేలాయుధన్ అణగారిన వర్గాల నుంచి వచ్చిన మహిళామణి’’ అని గుర్తు చేశారు. దళితులు, కార్మికులకు సంబంధించి పలు ముఖ్యమైన అంశాలు రాజ్యాంగంలో చోటుచేసుకునేలా ఆమె కృషి చేశారన్నారు. 26/11 మృతులకు నివాళి 2008 నవంబర్ 26న ముంబైపై ఉగ్ర దాడికి 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వాటిలో అసువులు బాసిన వారిని మోదీ గుర్తు చేసుకున్నారు. వారికి ఘనంగా నివాళులర్పించారు. ఇ–కోర్టు ప్రాజెక్టులో భాగంగా తీసుకొచ్చిన వర్చువల్ జస్టిస్ క్లాక్, జస్ట్ఈజ్ మొబైల్ యాప్ 2.0, డిజిటల్ కోర్ట్, ఎస్3వాస్ వంటి సైట్లు తదితరాలను ప్రారంభించారు. వీటిద్వారా కక్షిదారులు, లాయర్లు, న్యాయవ్యవస్థతో సంబంధమున్న వారికి టెక్నాలజీ ఆధారిత సేవలందించేందుకు వీలు కలగనుంది. వేడుకల్లో కేంద్ర న్యాయ మంత్రి కిరణ్ రిజిజు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
Suzlon Energy: ‘సుజ్లాన్’ తులసి తంతి తుది శ్వాస
న్యూఢిల్లీ: పవన విద్యుత్ రంగ దిగ్గజం సుజ్లాన్ ఎనర్జీ వ్యవస్థాపకుడు, విండ్ మ్యాన్గా పేరొందిన తులసి తంతి (64) కన్నుమూశారు. ఆయన శనివారం గుండెపోటుతో మరణించినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు కంపెనీ తెలిపింది. తులసి తంతికి భార్య (గీత), ఇద్దరు సంతానం (కుమారుడు ప్రణవ్, కుమార్తె నిధి) ఉన్నారు. ఆయన మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ సంతాపం వ్యక్తం చేశారు. ‘దేశ ఆర్థిక పురోగతికి తోడ్పడిన దిగ్గజాల్లో తులసి తంతి ఒకరు. ఆయన అకాల మరణంపై కుటుంబసభ్యులకు నా సంతాపం తెలియజేస్తున్నాను’ అని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో ప్రధాని ట్వీట్ చేశారు. విలేకరుల సమావేశంలో పాల్గొని అహ్మదాబాద్ నుంచి పుణెకు వస్తుండగా ఛాతీలో నొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లాలంటూ కారు డ్రైవరుకు తులసి తంతి సూచించారు. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందేలోగానే ఆయన కన్నుమూశారు. పవన విద్యుత్లో దిగ్గజం.. తులసి తంతి 1958లో రాజ్కోట్లో జన్మించారు. గుజరాత్ యూనివర్సిటీలో బీకామ్ చదివారు. 1995లో సుజ్లాన్ ఎనర్జీ ఏర్పాటుతో పవన విద్యుత్ రంగంలోకి ప్రవేశించారు. ఈ రంగంలో ప్రవేశించడానికి ముందు ఆయనకు టెక్స్టైల్ వ్యాపారం ఉండేది. దాన్ని 2001లో విక్రయించారు. అటు పైన 2003లో అమెరికన్ సంస్థ డాన్మర్ అండ్ అసోసియేట్స్ నుంచి 24 టర్బైన్లకు సుజ్లాన్కు భారీ ఆర్డరు దక్కింది. ఆ తర్వాత కంపెనీ వేగంగా విస్తరించడంలో తులసి తంతి కీలక పాత్ర పోషించారు. 2006 నుంచి బెల్జియంకు చెందిన టర్బైన్ విడిభాగాల తయారీ సంస్థ జెడ్ఎఫ్ విండ్ పవర్ యాంట్వెర్పెన్కు చైర్మన్గా వ్యవహరించారు. అలాగే ఇండియన్ విండ్ టర్బైన్ తయారీదారుల సమాఖ్యకు ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. కష్టకాలంలో కంపెనీ.. సుజ్లాన్ ఎనర్జీ ఆర్థిక సమస్యల్లో ఉన్న తరుణంలో తంతి అకాల మరణం ప్రాధాన్యం సంతరించుకుంది. 2005లో స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ అయిన తర్వాత శరవేగంగా కార్యకలాపాలు విస్తరించిన సుజ్లాన్ ఎనర్జీ ఒక దశలో రూ. 65,474 కోట్ల మార్కెట్ వేల్యుయేషన్ దక్కించుకుంది. కంపెనీలో మెజారిటీ వాటాలున్న తంతి సంపద విలువ దాదాపు రూ. 43,537 కోట్లకు పెరిగింది. అయితే, ఆ తర్వాత అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం తలెత్తడం, ఆ తర్వాత పరిణామాలతో పవన విద్యుత్ రంగం కుదేలైంది. దీనికి టర్బైన్లలో లోపాల ఫిర్యాదులు మొదలైనవి కూడా తోడు కావడంతో సుజ్లాన్పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. కంపెనీ విలువ రూ. 8,536 కోట్లకు పడిపోయింది. భారీగా రుణాలు పేరుకుపోయాయి. వాటిని తీర్చేందుకు వర్కింగ్ క్యాపిటల్, ఇతరత్రా అవసరాల కోసం నిధులను సమకూర్చుకునేందుకు సుజ్లాన్ అక్టోబర్ 11న రూ. 1,200 కోట్ల రైట్స్ ఇష్యూకు రానుంది. ఈ తరుణంలో తంతి హఠాన్మరణంతో తలెత్తబోయే పరిణామాలపై ఆసక్తి నెలకొంది. అయితే, అనుభవజ్ఞులైన బోర్డు డైరెక్టర్లు, సీనియర్ మేనేజ్మెంట్ సారథ్యంలో తంతి ఆకాంక్షలను నెరవేరుస్తామని సుజ్లాన్ ఎనర్జీ పేర్కొంది. -
గాంధీజీ, శాస్త్రిలకు ప్రముఖుల నివాళి
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిలకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. ఇద్దరు నేతల జయంతిని పురస్కరించుకుని ప్రధాని ఆదివారం వారి సమాధులున్న రాజ్ఘాట్, విజయ్ఘాట్లను సందర్శించి పుష్పాంజలి ఘటించారు. ప్రతి ఒక్కరూ ఖాదీ, హస్తకళల ఉత్పత్తులను కొనుగోలు చేసి గాంధీజీకి నివాళులర్పించాలని ప్రధాని ప్రజలను కోరారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేళ గాంధీ జయంతి మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. బాపు సిద్ధాంతాలను అన్ని వేళలా ఆచరించాలి’అని ట్వీట్ చేశారు. లాల్ బహదూర్ శాస్త్రి నిరాడంబరత, స్థిరమైన నిర్ణయాలు తీసుకోగల శక్తి దేశ ప్రజలకు ప్రేరణగా నిలుస్తాయన్నారు. ‘కీలకమైన సమయంలో శాస్త్రి నాయకత్వ పటిమ దేశ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నాను’ అని మరో ట్వీట్లో పేర్కొన్నారు. శాస్త్రి జీవన ప్రయాణం, సాధించిన విజయాలపై ‘ప్రధానమంత్రి సంగ్రహాలయ’లో ఉంచిన కొన్ని చిత్రాలను ప్రధాని షేర్ చేశారు. గాంధీజీకి కాంగ్రెస్ నేత రాహుల్ ట్విట్టర్ ద్వారా నివాళులర్పించారు. ‘అన్యాయానికి వ్యతిరేకంగా దేశాన్ని ఏకం చేసిన గాంధీజీ మాదిరిగా దేశాన్ని ఐక్యంగా ఉంచుతామంటూ ప్రతిన బూనుదాం. సత్యం, అహింసా మార్గంలో నడవాలని ఆయన మనకు నేర్పించారు. ప్రేమ, కరుణ, సామరస్యం, మానవత్వం అర్థాన్ని బాపు వివరించారు’ అని ట్వీట్ చేశారు. -
గాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించిన సీఎం వైఎస్ జగన్
-
Gandhi Jayanti 2022: మహాత్ముడికి సీఎం కేసీఆర్ నివాళి
సాక్షి, హైదరాబాద్: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అహింస, సత్యాగ్రహమనే సిద్ధాంతాలను ఆచరించి విజయం సాధించి చూపటం ద్వారా ప్రపంచానికి సరికొత్త పోరుబాటను మహాత్మా గాంధీ పరిచయం చేశారని సీఎం పేర్కొన్నారు. గాంధీ ఆచరించిన బాటలో పయనించిన ఎన్నో దేశాలు బానిసత్వం నుంచి విముక్తి పొందాయని తెలిపారు. భారతదేశాన్ని గాంధీ పుట్టిన దేశంగా చెప్పుకునే స్థాయి కలిగిన మహా పురుషుడు అని కీర్తించారు. గాంధీజీ స్ఫూర్తితో శాంతియుత మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న విషయాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. -
‘హుందాతనంతో కృష్ణంరాజు ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు’
సాక్షి, హైదరాబాద్: రెబల్ స్టార్ కృష్ణం రాజు అకాల మరణం అందరనీ దిగ్భ్రాంతికి గురిచేసింది. అనారోగ్యం కారణంగా తుదిశ్వాస విడిచిన కృష్ణం రాజుకు ప్రమువురు ప్రముఖులు నివాళులు అర్పించి.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. కాగా, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. సోమవారం ఉదయం కృష్ణం రాజు భౌతికకాయానికి నివాళులు అర్పించారు. రెబల్ స్టార్ కుటుంబ సభ్యులకు వెంకయ్య నాయుడు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. కృష్ణం రాజు మరణవార్త విని చాలా బాధపడ్డాను. చలన చిత్ర పరిశ్రమలోనే కాదు పాలిటిక్స్లో కూడా కృష్ణంరాజు తనదైన ముద్ర వేశారు. హుందాతనం కూడిన నటనతో ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. విలక్షణ నటుడుగా మన్ననలను పొందారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు వెల్లడించారు. మరోవైపు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. కృష్ణం రాజు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం, సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణం రాజు మరణం బీజేపీకి, సినీ రంగానికి, రాజకీయ రంగానికి తీరని లోటు. రెబల్ స్టార్ రాజకీయాల్లో చురకుగా పాల్గొన్నారు. దివంగత ప్రధాన మంత్రి వాజ్పేయి ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. -
కృష్ణం రాజు పార్థివ దేహనికి అల్లు అర్జున్ నివాళులు
సీనియర్ నటుడు కృష్ణంరాజు(83) పార్ధివ దేహనికి అల్లు అర్జున్ నివాళులర్పించారు. ఆయన మరణ వార్త తెలియగానే బెంగళూరి నుంచి హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్న బన్ని.. నేరుగా కృష్ణంరాజు నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహనికి నివాళులర్పించారు. అనంతరం ప్రభాస్ దగ్గరకెళ్లి ఓదార్చాడు. తదనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణంరాజు గారి మరణ వార్త తెలియగానే ఎంతో డిస్టర్బ్ అయ్యాను, ఆయన మరణం తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటు. 50 సంవత్సరాలకు పైగా ఆయన ఇండస్ట్రీకి ఎన్నో సేవలు అందించారు. సినీ రంగం పై ఆయన తనదైన ముద్ర వేశారు. అలాంటి అద్భుతమైన ఒక లెజెండ్ ను కోల్పోవడం టాలీవుడ్ కు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను ’ అన్నారు -
కృష్ణంరాజు వివాద రహిత వ్యక్తి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: అనారోగ్యం కారణంగా రెబల్స్టార్ కృష్ణంరాజు(83) ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కాగా, ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు కృష్టంరాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా కృష్ణంరాజు భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కృష్టంరాజు గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. తన విలక్షణ నటనతో ప్రజల గుండెల్లో నిలిచారు. కృష్ణంరాజు వివాద రహిత వ్యక్తి. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరిపిస్తాము అని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కృష్టంరాజు కుటుంబ సభ్యులకు కేటీఆర్.. ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం
కవాడిగూడ: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏడాది పాటు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో అధికారికంగా నిర్వహించనున్నామని కేంద్ర పర్యాటక సాంస్కృతిక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖమంత్రి జి.కిషన్రెడ్డి తెలిపారు. ఈ నెల 17న పరేడ్ గ్రౌండ్లో త్రివిధ దళాల పరేడ్ ఉంటుందని ఆయన వెల్లడించారు. నిజాం రజాకర్ల దమన కాండకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చాకలి ఐలమ్మతో పాటు ఎంతో మంది వీరులు ప్రాణ త్యాగం చేశారని వారందరినీ ఏడాది పాటు స్మరించుకుంటూ వారి ఆశయాల స్ఫూర్తితో నేటి సమాజం ముందుకు సాగాలని కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. చాకలి ఐలమ్మ వర్ధంతిని తెలంగాణ రజకాభివృద్ధి (ధోబీ) సంస్థ ఆధ్వర్యంలో శనివారం లోయర్ ట్యాంక్బండ్లోని ఆమె విగ్రహం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ విగ్రహానికి కిషన్రెడ్డి, కవాడిగూడ కార్పొరేటర్ జి.రచనశ్రీ, రాంనగర్ కార్పొరేటర్ రవిచారి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ రజక అభివృద్ధి సంస్థ అధ్యక్షుడు బొమ్మరాజు కృష్ణమూర్తి, రాష్ట్ర వర్కింగ్ కమిటీ చైర్మన్ మందలపు గాంధీ, గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ ఎం.నర్సింహ్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపల్లి రాజశేఖర్, వైస్ చైర్మన్ నర్సింహ్మ, బీజేపీ రాష్ట్ర నాయకులు పరిమళ్కుమార్, రంగరాజ్గౌడ్, శ్యాంసుందర్గౌడ్, రమేష్రాం తదితరులు పాల్గొన్నారు. ఐలమ్మ ఆశయ సాధనకు ప్రభుత్వం కృషి తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. లోయర్ ట్యాంక్బండ్లోని ఆమె విగ్రహానికి ఎమ్మెల్యే ముఠా గోపాల్, రాంనగర్ మాజీ కార్పొరేటర్ వి.శ్రీనివాస్రెడ్డిలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ముఠా గోపాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విలీనం వేడుకలను ఏడాది పాటు నిర్వహిస్తుందన్నారు. టీఆర్ఎస్ నాయకులు ముఠా జైసింహ, డివిజన్ అధ్యక్షుడు శ్యామ్యాదవ్, నాయకులు ఆర్.రాంచందర్, రాజేష్, హరి తదితరులు పాల్గొన్నారు. – ఎమ్మెల్యే ముఠా గోపాల్ -
ఆదర్శపాలన అందించిన మహనీయుడు వైఎస్సార్
సాక్షి, హైదరాబాద్/పంజ గుట్ట: దేశానికి ఆదర్శవంత మైన పాలన అందించిన మహనీయుడు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి (వైఎస్సార్) అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డి కొనియాడారు. వైఎస్సార్ దీర్ఘ కాలం ప్రజాజీవితంలో ఉన్న నాయకుడని, ఆయన మర ణం ఒక్క కాంగ్రెస్పార్టీకే కాక, తెలుగు ప్రజలందరికీ తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ స్ఫూర్తితో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తామన్నారు. జీవితాంతం కాంగ్రెస్ సిద్ధాంతాన్ని త్రికరణశుద్ధిగా పాటించి ప్రజల అభీష్టమే లక్ష్యంగా పరిపాలన అందించిన వైఎస్సార్ ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతారని పేర్కొన్నారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఇక్కడ గాంధీభవన్లో ఆయన చిత్రపటా నికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అదే విధంగా పంజాగుట్టలోని వైఎస్ విగ్రహం వద్ద సహచర నేతలు, కార్య కర్తలతో కలిసి నివాళులర్పించారు. రేవంత్రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ తర్వాత పేదలకు అంతటిస్థాయిలో సంక్షేమపథకాలు అందించిన ఘనత వైఎస్సార్కే దక్కుతుందని రేవంత్ అన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, జలయజ్ఞం, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలు పేదలకు ఎంతో ఉపయోగ పడ్డాయని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీతో పేదలందరికీ కార్పొరేట్ వైద్యాన్ని అందించారని, మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించారని కొనియాడారు. నాడు వైఎస్ చేపట్టిన జలయజ్ఞం వల్లే వ్యవసాయం లాభసాటిగా మారిందని స్పష్టం చేశారు. మళ్లీ అలాంటి పాలన రావాలంటే దేశంలో యూపీఏ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేశ్కుమార్ గౌడ్, అంజన్కుమార్ యాదవ్, మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య, పార్టీ నేతలు కుమార్రావు, కోదండరెడ్డి, ఈ.అనిల్, అనిల్ కుమార్ యాదవ్, సంగిశెట్టి జగదీశ్, మల్రెడ్డి రాంరెడ్డి, రోహిణ్రెడ్డి, మెట్టు సాయి కుమార్,కల్వ సుజాత, పద్మ వరలక్ష్మి, కత్తి కార్తీక, బొల్లు కిషన్, నగేశ్ ముదిరాజ్, కార్పొరేటర్ పి.విజయారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సర్వాయి పాపన్న తెలంగాణకు గర్వకారణం
గన్ఫౌండ్రీ (హైదరాబాద్): బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తోందని రాష్ట్రమంత్రి వి.శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. సర్వాయి పాపన్న యావత్ తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమన్నారు. రవీంద్ర భారతిలో గురువారం బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 372వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ...తెలంగాణ వాడి వేడిని నాడే చాటిచెప్పిన శౌర్యుడు పాపన్నని కొనియాడారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గీత కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు తీసుకొచ్చామని తెలిపారు. ట్యాంక్బండ్పై నీరా కేంద్రం, గౌడ ఆత్మగౌరవ భవనాలను వచ్చే నెలలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ బహుజన ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలకు నగరంలో విలువైన భూములను ఇవ్వడంతోపాటు రూ.95 కోట్లను విడుదల చేశారని వెల్లడించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పేదల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుంటే వాటి మీద కనీసం అవగాహన లేని వ్యక్తులే విమర్శలు చేస్తున్నారని దుయ్య బట్టారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంక టేశం, ఎక్సైజ్ శాఖ కమి షనర్ సర్పరాజ్ అహ్మద్, ఎస్.హరిశంకర్ గౌడ్, పల్లె లక్ష్మణ్ రావుగౌడ్, వివిధ సంఘాలకు చెందిన బీసీ నాయకులు పాల్గొన్నారు. -
భారతీయతే మన ఐక్యత
కంటోన్మెంట్ (హైదరాబాద్): భిన్నత్వంలో ఏకత్వమే మన దేశాన్ని మిగతా ప్రపంచానికి ఆదర్శంగా నిలబడేలా చేస్తోందని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇంత విభిన్నత ఉన్నా భారతీయతే మన ఐక్యత అని చెప్పారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఆర్మీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో కేటీఆర్ పాల్గొన్నారు. కాలికి తగిలిన గాయం వల్ల మూడు వారాలుగా ఇంటికే పరిమితమైన తాను.. బయటికి వచ్చాక మొదట ఆర్మీ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరమన్నారు. ‘‘నేను ఐటీ, పరిశ్రమల మంత్రిగా వివిధ దేశాలు తిరిగినప్పుడు చాలా మంది మన దేశాన్ని చైనాతో పోల్చి మాట్లాడారు. అధిక జనాభా, వనరులున్న చైనా, భారత్ అన్నింటా పోటీపడటం సహజమే. అయితే విభిన్న మతాలు, కులాలు, ప్రాంతాలు, సంస్కృతులు కలిగిన మన దేశంలో ప్రతి 100 కిలోమీటర్లకు అన్నీ మారిపోతూ ఉంటాయి. భాష, యాస, కట్టుబొట్టు, ఆహార అలవాట్లు అన్నింటా వ్యత్యాసం ఉంటుంది. కానీ అందరినీ ఒక్క తాటిపై నిలిపేది మాత్రం భారతీయతే. 75 ఏళ్లలో మనం సాధించిన విజయాలకు తోడు.. మన ఐక్యత, ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. దీన్ని భవిష్యత్లోనూ కొనసాగించాలి..’’అని కేటీఆర్ పిలుపునిచ్చారు. పరేడ్ గ్రౌండ్లో సైనికులు, కళాకారులు, విద్యార్థుల విన్యాసాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయని.. ఇంత మంచి కార్యక్రమానికి తనను ఆహ్వానించిన ఆర్మీ దక్షిణ భారత్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్, లెఫ్టినెంట్ జనరల్ అరుణ్ కుమార్కు ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. ఆకట్టుకున్న లెఫ్టినెంట్ జనరల్ ప్రసంగం పరేడ్ గ్రౌండ్లో ఆర్మీ కార్యక్రమాల ముగింపు సందర్భంగా లెఫ్టినెంట్ జనరల్ అరుణ్కుమార్ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. తెలుగు వ్యక్తి అయిన ఆయన మన భాషతోపాటు హిందీ, ఇంగ్లిష్లోనూ మాట్లాడుతూ ఉత్తేజపరిచారు. ప్రసంగం మధ్యలో ఆర్మీ జవాన్లు త్రివర్ణ పతాకంతో గగనంలో ఎగురుతూ చేసిన విన్యాసాన్ని తిలకించాల్సిందిగా ఆహుతులను కోరారు. అమర జవానులకు నివాళి పరేడ్ గ్రౌండ్స్లో కార్యక్రమాల సందర్భంగా తెలంగాణ–ఏపీ ఆంధ్రా సబ్ ఏరియా ప్రాంతానికి చెందిన అమర జవాన్ల కుటుంబాలకు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రత్యేక పురస్కారాలు అందజేశారు. కల్నల్ సంతోష్బాబు సతీమణి సంతోషి, మేజర్ పద్మపాణి ఆచార్య సతీ మణి చారులత, కంటోన్మెంట్కు చెందిన లాన్స్నాయక్ రాంచందర్ సతీమణి ఎంఆర్ దివ్యతోపాటు అమరవీరుల కుటుంబ సభ్యులు విమలారావు, లక్ష్మీదేవి, నస్రీన్ ఖాన్, గీత మాధవ్, సుభాషిణీ, నీలం దేష్కర్, సర్వాహ్జా, శివలీల, కిరణ్ గుప్తా, సుహాసినీ మహేశ్వర్, నసీమ్ సుల్తానా తదితరులకు మంత్రి పురస్కారాలు అందజేశారు. ఇక ఇటీవల జరిగిన మిలటరీ ఆపరేషన్లలో ఉత్తమ ప్రతిభ కనబర్చి, సేవా పురస్కారాలు పొందిన టీఎన్ సాయికుమార్, కల్నల్ సురేంద్ర పోలా, కల్నల్ రాహుల్ సింగ్ తదితరులకు సైతం మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రశంసా పురస్కారాలు అందజేశారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు పరేడ్ గ్రౌండ్స్లో ఆర్మీ ఏర్పాటు చేసిన యుద్ధ ట్యాంకులు, ఆయుధ ప్రదర్శన ఆకట్టుకుంది. పెద్ద సంఖ్యలో ప్రజలు వాటిని సందర్శించి, ఆర్మీ విన్యాసాలను తిలకించారు. కలరిపయట్టు, పేరిణి నృత్యాలు, ఆర్మీ బ్యాండ్ ప్రదర్శనలు, బొల్లారం ఆర్మీ స్కూల్ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. -
ఫైరింగ్పై కక్కుర్తి రాజకీయాలు
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్)/గన్ఫౌండ్రీ: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో చోటుచేసుకున్న ఘటనపై కొందరు కక్కుర్తి రాజకీయాలు చేస్తున్నారని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. బీసీలు రాజకీయంగా ఎదిగితే ఓర్వలేని కొన్ని రాజకీయ పార్టీలు అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం రవీంద్రభారతిలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తొలి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ మహారాజ్ 372వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంత్రి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాలతో పాటు విలువైన స్థలాలను కేటాయించినట్లు తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఆదివారం మహబూబ్నగర్లోని టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీకి చెందిన పలువురు కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా జరిగిన ఫ్రీడం రన్ను ప్రారంభించేందుకు చేసిన ఫైరింగ్ను అనవసర వివాదం చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం వివిధ పార్టీల నేతలు టీఆర్ఎస్లో చేరారు. కర్వెన, ఉదండాపూర్ రిజర్వాయర్లు సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని ఆయన తెలిపారు. -
అసెంబ్లీ హాల్లో జయశంకర్ జయంతి వేడుకలు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ హాల్లో శనివారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి శాసన మండలి చైర్మన్ గుత్తాసుఖేందర్ పులమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో శాసన మండలి విప్ ఎంఎస్ ప్రభాకర్, శాసనసభ చీఫ్ విప్, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, శేరి సుభాష్రెడ్డి, కాటేపల్లి జనార్దన్రెడ్డి, భానుప్రసాద్, తాతా మధు, దండే విఠల్, తెలంగాణ లెజిస్లేచర్ సెక్రెటరీ నరసింహా చార్యులు, టీఆర్ఎస్ఎల్పీ కార్యదర్శ రమేశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉమామహేశ్వరికి ప్రముఖుల నివాళి
బంజారాహిల్స్ (హైదరాబాద్): దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి భౌతికకాయానికి మంగళవారం జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 9లోని ఆమె నివాసంలో బంధుమిత్రులు, పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో పాటు ఉమామహేశ్వరి సోదరీమణులు గారపాటి లోకేశ్వరి, నారా భువనేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నందమూరి బాలకృష్ణ ఆయన సతీమణి వసుంధర, రామకృష్ణ, నందమూరి కల్యాణ్ రామ్ తదితరులు నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఎన్టీ రామారావు గారి కుటుంబంతో తనకు మొదటి నుంచి సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పారు. ఉమామహేశ్వరి మృతిపై సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. అమెరికా నుంచి పెద్ద కుమార్తె విశాల అర్ధరాత్రి ఇక్కడికి చేరుకున్నారు. బుధవారం ఉదయం ఉమామహేశ్వరి భౌతిక కాయానికి అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. గతంలో రెండుసార్లు ఆత్మహత్యాయత్నం ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి కొంతకాలంగా అనారోగ్యం, తీవ్ర మానసిక ఒత్తిడి, ఒంటరితనంతో బాధపడుతున్నారు. మానసిక ఒత్తిడికి సంబంధించి వైద్యం కూడా చేయించుకుంటున్నారు. అయితే ఒంటరితనం ఆమెను తీవ్రంగా బాధిస్తున్నట్లు గతంలో జరిగిన రెండు సంఘటనలు వెల్లడిస్తున్నాయి. మూడు నెలల కాలంలో ఆమె రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు సమాచారం. ఒకసారి 40 నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా సకాలంలో కుటుంబ సభ్యులు గుర్తించి ఆస్పత్రికి చేర్చగా ప్రాణాలతో బయటపడ్డారు. తర్వాత కొద్ది రోజులకే మరోసారి నిద్రమాత్రలు మింగారు. ఆ సమయంలో కూడా కుటుంబ సభ్యులు గుర్తించడంతో చికిత్స అనంతరం ఆమె బయటపడ్డారు. చిన్న కూతురు దీక్షిత పెళ్లి జరిగిన అనంతరం ఉమామహేశ్వరి మరింత ఒంటరితనానికి గురైనట్లు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. -
న్యూజెర్సీలో వైఎస్సార్ జయంతి వేడుకలు: మహానేతకు ఘన నివాళి
న్యూ జెర్సీ: డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో న్యూ జెర్సీలో మన్రోలో థాంప్సన్ పార్కులో వైస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు. జులై పదిన జరిగిన కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఆళ్ళ రామిరెడ్డి, డాక్టర్ రాఘవ రెడ్డి , హరి వెళ్కూర్, అన్నారెడ్డి, రఘురామి రెడ్డి, ప్రభాకర్ చీనేపల్లి, రామమోహన్ రెడ్డి ఎల్లంపల్లి, సత్య పాతపాటి, ద్వారక వారణాసి, సహదేవ్ రెడ్డి, భానోజీ రెడ్డి, నగేష్ ముక్కమల్లతో పాటు పలువురు వై ఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు. డా. వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాలలో వైఎస్సార్ జయంతి జరుపుకోవడం ఆయనకిచ్చే ఘన నివాళి అని ఆళ్ళ రామిరెడ్డి అన్నారు. వైఎస్సార్ను స్మరించుకుంటూ ఫౌండేషన్ తరపున వాటర్ ప్లాంట్స్, హెల్త్ క్యాంప్స్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, మెడికల్ కిట్స్, కూరగాయల సరఫరా లాంటి ఎన్నో కార్యక్రమాల నిమిత్తం వైస్సార్ అభిమానులు ఈ రెండేళ్లలో రెండు కోట్లకు పైగా సహాయం చేశారన్నారు. నాటా ప్రెసిడెంట్ డాక్టర్ రాఘవ రెడ్డి గోసల మాట్లాడుతూ వైఎస్సార్ పధకాలు ఎంతో మంది పేదలకు ఉపయోగపడితే ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పథకాలతో పాటుగా ‘నాడు నేడు’, ఇంగ్లీష్ మీడియం మరింత సమర్ధ వంతంగా అమలుచేయడం గర్వకారణమన్నారు. వైఎస్సార్ అభిమానులు ఉభయ తెలుగు రాష్ట్రాలలో వున్నారని అందుకు ఉదాహరణే ఇక్కడకు వచ్చిన అభిమానులని ప్రభాకర్ చీనేపల్లి పేర్కొన్నారు. డా.మూలే రామమునిరెడ్డి రాసిన కవితను కృష్ణమోహన్ రెడ్డి చదివి వినిపించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మనోహర్ కడివెటి, అనిల్ రెడ్డి, బాలకృష్ణ బోడిరెడ్డి, ఆళ్ళ బసివి రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి పాల్వాయి, చంద్ర రెడ్డి, ఇందిరా శ్రీరామ్ రెడ్డి, కోటి రెడ్డి, కృష్ణ కళ్ళం, లక్ష్మారెడ్డి, నాగరాజా రెడ్డి, నాగేంద్ర ముక్కమల్ల, నాగిరెడ్డి భీమవరపు, నాగిరెడ్డి ఉయ్యురు, నరేష్ అన్నం, పద్మనాభ రెడ్డి, రామ్ వేమిరెడ్డి, సంజీవ రెడ్డి బెక్కం, శ్రీధర్ గుడేటి, శ్రీనివాస్ గుండేటి, సూరి తాడి, తాతా రెడ్డి, తిమ్మా రెడ్డి, విజయ్ గోలి, వీర ప్రతాప్ రెడ్డి, వెంకటరెడ్డి కాగితాల, వెంకట శివ మద్దిగపు, ఆళ్ళ వికాస్ రెడ్డి, వినయ్ వాసిలి, వినోద్ ఎరువతో పాటు 300కి పైగా అభిమానులు పాల్గొని మహానేతకు ఘన నివాళులర్పించారు. -
పీవీ గౌరవాన్ని పెంచేలా కార్యక్రమాలు: కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్/రాంగోపాల్పేట్: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 101వ జయంతిని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు మంగళవారం నెక్లెస్రోడ్లోని పీవీ ఘాట్లో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, సత్యవతి రాథోడ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్సీ వాణీదేవి, పీవీ కుటుంబసభ్యులు తదితరులు ఆయన సేవలను స్మరించుకున్నారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ దివంగత మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు గౌరవాన్ని పెంచే కార్యక్రమాల్లో భాగంగా ఆజాదీకా అమృతోత్సవ్ సందర్భంగా పీవీ పేరుపై త్వరలోనే తపాలా బిళ్లను విడుదల చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ పరిపాలన దక్షతతో దేశ గౌరవాన్ని ఇనుమడింపజేసిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన ఆర్థిక, సరళీకృత విధానాలతో దేశానికి దశ, దిశ చూపిన మాజీ ప్రధాని పీవీ.. భారత జాతిరత్నమని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి కొనియాడారు. పీవీ స్వగ్రామమైన వంగరలో ఆయన స్మారకంగా చేపట్టిన అభివృద్ధి పనులు అసంపూర్తిగా మిగిలాయని, వాటిని పూర్తి చేయాలని కోరారు. పీవీ నరసింహారావులాంటి గొప్ప వ్యక్తిని స్మరించుకుని, గౌరవించే తీరిక ముఖ్యమంత్రి కేసీఆర్కు లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. అంతకుముందు పీవీ ఘాట్లో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. కాగా, గాంధీభవన్లో జరిగిన కార్యక్రమంలో పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ పీవీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శాసనసభ ప్రాంగణంలో .,. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 101వ జయంతి వేడుకలను శాసనసభ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లాబీహాల్లో ఏర్పాటు చేసిన పీవీ చిత్రపటానికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మండలి విప్ ఎంఎస్ ప్రభాకర్రావు, లెజిస్లేచర్ సెక్రటరీ నరసింహాచార్యులు పాల్గొన్నారు. ప్రపంచం లోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి పరిపాలనాదక్షుడు పీవీ అని, ఈరోజు దేశం ఆర్థిక సమస్యలను తట్టుకుని నిలబడుతుందంటే ఆయన ప్రారంభించిన సంస్కరణలే కారణమని గుత్తా కొనియాడారు. -
రాజీవ్ మార్గంలో వెళ్లడమే ఆయనకు ఘన నివాళి
సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చూపిన మార్గంలో వెళ్లడమే ఆయనకు అర్పించే ఘనమైన నివాళి అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాజీవ్గాంధీ 31వ వర్ధంతి సందర్భంగా శనివారం గాంధీభవన్లో ఆయన చిత్రపటానికి మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్లతో కలసి భట్టి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అవినీతి మరక లేకుండా దేశంలో శాస్త్ర, సాంకేతిక రంగాలను పరుగులు పెట్టించిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందన్నారు. ప్రపంచంలోని గొప్ప సంస్థలకు దేశానికి చెందిన వారు సీఈవోలుగా ఉన్నారంటే అందుకు రాజీవ్ అమల్లోకి తెచ్చిన విధానాలే కారణమన్నారు. 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించి, ఇంటింటికి తాగునీటి సౌకర్యం కల్పించారని, ఆయన హయాంలోనే దేశంలో సెల్ఫోన్లు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. జాతి సమైక్యత కోసం నాడు దేశవ్యాప్తంగా సద్భావన యాత్ర చేసిన ఘనత రాజీవ్ గాంధీదేనని, ఆయన బాటలోనే ఇప్పుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపడుతున్నారని అన్నారు. కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై స్పందిస్తూ రాష్ట్రాల పర్యటన సీఎం వ్యక్తిగతమని, ఆయన ఎక్కడ పర్యటించినా రాష్ట్రంలోని రైతాంగం పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. నకిలీ విత్తనాలు, రుణమాఫీతో పాటు ఇతర రైతాంగ సమస్యలకు పరిష్కారం చూపి ఆయన దేశంలో పర్యటిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. కేంద్రం నేరుగా గ్రామపంచాయతీలకు నిధులివ్వడంలో తప్పులేదని భట్టి అభిప్రాయపడ్డారు. -
ప్రజాస్వామ్య రూపశిల్పి అంబేడ్కర్
సాక్షి, హైదరాబాద్: మనదేశం అత్యుత్తమ ప్రజాస్వామ్య వ్యవస్థగా రూపుదిద్దుకోవడంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ది అత్యంత కీలక పాత్ర అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ అన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యు న్నతి కోసం, వారి హక్కుల కోసం అంబేద్కర్ అహర్నిశలు శ్రమించారన్నారు. రాష్ట్ర బార్ కౌన్సిల్, హైకోర్టు న్యాయవాదుల సంఘం సంయుక్తంగా గురువారం నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దళిత కుటుంబం నుంచి వచ్చి అత్యున్నత శిఖరాలకు చేరారని, ఆయన జీవి తం పౌరులందరికీ ఆదర్శప్రాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ నందా, రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసా ద్, బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ.నర్సింహారెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్య క్షుడు పొన్నం అశోక్ గౌడ్ ప్రసంగించారు. -
Ambedkar Jayanti 2022: అంబేడ్కర్కు ఘన నివాళి
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో బుధవారం అమీర్పేట గ్రీన్పార్క్ మ్యారీగోల్ట్ హోటల్లో నిర్వహించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలకు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంబేడ్కర్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఉత్తమ పారిశ్రామికవేత్తలకు కేటీఆర్ అవార్డులను ప్రదానం చేశారు. అంబేడ్కర్ దేశానికే గర్వకారణం: గవర్నర్ దేశం పూర్వవైభవం సాధించేందుకు రాజ్యాంగ ఆదర్శాలు, ఆదేశాలను అనుసరిస్తూ భారత రాజ్యాంగానికి లోబడి ఏర్పడిన చట్టబద్ధ కార్యాలయాలు, సంస్థలను గౌరవించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. గురువారం భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా గవర్నర్ ఆయనకు నివాళులర్పించారు. భారత రాజ్యాంగానికి రూపకల్పన చేసిన అంబేడ్కర్ దేశానికే గర్వకారణమని, చురుకైన సంఘ సంస్కర్తగా, ప్రముఖ న్యాయవాదిగా చిరస్మరణీయుడని గవర్నర్ కొనియాడారు. అణచివేతపై మానవత్వం సాధించిన విజయానికి అంబేడ్కర్ అసలైన ఉదాహరణ అని, సమాజంలో అట్టడుగు వర్గాలు, పేదలతో పాటు ప్రతీఒక్కరికీ రాజ్యాంగ హక్కులు దక్కేలా అంబేడ్కర్ ఎనలేని కృషి చేశారని గవర్నర్ కీర్తించారు. అంబేడ్కర్కు సీఎం నివాళి డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 131వ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నివాళులర్పించారు. అంబేడ్కర్ స్ఫూర్తితోనే తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలు, వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా వేల కోట్ల రూపాయలతో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తోందని సీఎం పేర్కొన్నారు. దళిత బంధు పథకం ద్వారా అర్హులైన దళిత కుటుంబానికి రూ.10 లక్షల మొత్తాన్ని నూటికి నూరు శాతం రాయితీ కింద అందిస్తోందని తెలిపారు. -
‘బడుగుల కోసం పోరాడిన మహానుభావుడు పూలే’
గన్ఫౌండ్రీ: విద్యను ఆయుధంగా మార్చుకోవాలని సూచించిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే అని పలువురు ప్రముఖులు కొనియాడారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పూలే 196వ జయంతి వేడుకలను సోమవారం రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల జీవితాల్లో సమూల మార్పుల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు జ్యోతిబా పూలే అని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పూలే సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ పార్లమెంట్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీసీ జనగణనను నిర్వహించాలని డిమాండ్ చేశారు. పలు పోటీపరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ఈనెల 16న ఆన్లైన్ వేదికగా పరీక్షను నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. కార్యక్రమంలో బీసీ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి భట్టు మల్లయ్య, బీసీ కమిషన్ సభ్యుడు ఉపేంద్రచారి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్, పూలే జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్లు ఆనంద్కుమార్ గౌడ్, నీల వెంకటేశ్, రాజేందర్, బడేసాబ్ పాల్గొన్నారు. -
మల్లు స్వరాజ్యానికి ఆత్మీయ నివాళి
రాయదుర్గం(హైదరాబాద్): భూస్వామ్య కుటుంబంలో పుట్టి పేదల కోసం ఆయుధం చేతపట్టి రజాకార్లను గడగడలాడించిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యానికి పార్టీలకతీతంగా నేతలు ఘనమైన నివాళులు అర్పించారు. రాయదుర్గంలోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ‘అమ్మకు వందనం’పేరిట ఆత్మీయ సమ్మేళనాన్ని స్వరాజ్యం కుమార్తె పాదూరి కరుణ, రాంసుందర్రెడ్డి, ఇతర కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వివిధ పార్టీల నాయకులు మల్లు స్వరాజ్యంతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. పేదల పక్షాన ఆమె జీవితాంతం చేసిన పోరాటాలను గుర్తుచేసుకున్నారు. మల్లు స్వరాజ్యం చిత్రపటానికి ఎదురుగా ఉంచిన పుస్తకంలో ఆమె గురించిన జ్ఞాపకాలను నాయకులు, ప్రజాప్రతినిధులు నమోదు చేశారు. కార్యక్రమంలో హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మాజీమంత్రి కె.జానారెడ్డి, రాష్ట్ర ప్రణాళికా మండలి వైస్ చైర్మన్ బి.వినోద్కుమార్, ఎంపీ ధర్మపురి అరవింద్, మాజీ ఎంపీలు వివేక్, కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఏపీ జితేందర్రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ప్రజాగాయకుడు గద్దర్, ఆయా పార్టీల నాయకులు డాక్టర్ కె.నారాయణ, ఎన్.ఇంద్రసేనారెడ్డి, దాసోజు శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.