ఇబ్రహీం రైసీకి ఇరాన్‌ వీడ్కోలు | Funeral Ceremony Of Iran President Ebrahim Raisi After He Died In Helicopter Crash | Sakshi
Sakshi News home page

Iran President Funeral Ceremony: ఇబ్రహీం రైసీకి ఇరాన్‌ వీడ్కోలు

Published Thu, May 23 2024 5:10 AM | Last Updated on Thu, May 23 2024 12:10 PM

Funeral ceremony of Iran ex-President Ebrahim Raisi

సంతాప సభలో నివాళులరి్పంచిన భారత ఉపరాష్ట్రపతి ధన్‌ఖఢ్‌ 

టెహ్రాన్‌: హెలికాప్టర్‌ ప్రమాదంలో ప్రాణాలుకోల్పోయిన ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీకి దేశ రాజధాని టెహ్రాన్‌ ప్రజలు ఘన తుది వీడ్కోలు పలికారు. ఇరాన్‌ సుప్రీంలీడర్‌ అయాతొల్లాహ్‌ అలీ ఖమేనీ సైతం నివాళులరి్పంచారు. బుధవారం సంతాప ర్యాలీలో టెహ్రాన్‌ సిటీ వీధుల గుండా భారీ వాహనం మీద రైసీ పారి్థవదేహాన్ని తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ఇరానీయన్లు పాల్గొని తమ నేతకు తుది వీడ్కోలు పలికారు.

 భారత్‌ తరఫున ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ బుధవారం టెహ్రాన్‌ వెళ్లి రైసీకి నివాళులర్పించారు.  మహిళా, మానవ హక్కుల హననానికి పాల్పడి ‘టెహ్రాన్‌ కసాయి’గా పేరుబడినందుకే రైసీ సంతాప ర్యాలీలో తక్కువ మంది పాల్గొన్నారని అంతర్జాతీయ మీడియా వ్యాఖ్యానించింది. సంతాప ర్యాలీలో ఖమేనీ పక్కనే తాత్కాలిక దేశాధ్యక్షుడు మహమ్మద్‌ మొఖ్బర్‌ ఏడుస్తూ కనిపించారు. బుధవారం ఖమేనీ మినహా మాజీ దేశాధ్యక్షులెవరూ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనకపోవడం గమనార్హం. రైసీ మృతికి సంతాపంగా భారత్‌లోనూ ఒక రోజు సంతాపదినం పాటించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement