మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌కు వైఎస్సార్‌సీపీ నేతల నివాళి | YSRCP Leaders Tributes To Maulana Azad | Sakshi
Sakshi News home page

మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌కు వైఎస్సార్‌సీపీ నేతల నివాళి

Published Sat, Feb 22 2025 1:36 PM | Last Updated on Sat, Feb 22 2025 3:29 PM

YSRCP Leaders Tributes To Maulana Azad

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీసీ కేంద్ర కార్యాలయంలో మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా ఆజాద్‌ ఆలోచనలు, సిద్దాంతాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్తామని వైఎస్సార్‌సీపీ నేతలు తెలిపారు. భారత విద్యా వ్యవస్ధను ఉన్నతంగా తీర్చిదిద్దిన మహనీయుడు ఆజాద్‌ అని కొనియాడారు.

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖా మంత్రి మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ వర్ధంతి సందర్భంగా ఆ మహానీయుడికి వైఎస్సార్‌సీపీ ఘనంగా నివాళులర్పించింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆజాద్‌ చిత్రపటానికి వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేతలు పూలమాలలు వేసి ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు.

ఈ సందర్భంగా పార్టీ నేతలు మాట్లాడుతూ..‘విద్యాశాఖా మంత్రిగా విద్యా వ్యవస్ధను ఉన్నతంగా తీర్చిదిద్దిన గొప్పవాడిగా ఆయన నిలిచారని, ఆయన బాటలోనే పయనిస్తూ, ఆయన అడుగుజాడల్లో అందరూ ముందుకు వెళ్ళాలని కొనియాడారు. ఆజాద్‌ ఆలోచనలు, నిర్ణయాలు విద్యారంగాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాయి, విద్యారంగంలో దేశంలో ఎక్కడా లేని విధంగా సంస్కరణలు తీసుకురావడానికి గల కారణం కూడా ఆజాద్‌. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆలోచనలు, వైఎస్సార్‌సీపీ సిద్దాంతాలు ఆజాద్‌ స్పూర్తితోనే కొనసాగుతున్నాయని గర్వంగా చెప్పగలం. రాబోయే రోజుల్లో కూడా ఇదే స్పూర్తిని కొనసాగిస్తామని హామీ ఇస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు టీజేఆర్‌ సుధాకర్‌ బాబు, దూలం నాగేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ నాయకులు షేక్‌ ఆసిఫ్‌, డాక్టర్‌ మెహబూబ్‌ షేక్, మనోహర్‌ రెడ్డి, దొడ్డా అంజిరెడ్డి, మస్తాన్‌, గౌస్‌, రవిచంద్ర, కొమ్మూరి కనకారావు, పురుషోత్తం, పలువురు నాయకులు పాల్గొన్నారు.

మౌలానా అబుల్ కలాం ఆజాద్ కు YSRCP నేతలు నివాళులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement