ఏపీ హైకోర్టులో సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డిలకు ఊరట | AP High Court Granted Anticipatory Bail To Sajjala Ramakrishna Reddy And Bhargav Reddy, Details Inside | Sakshi
Sakshi News home page

ఏపీ హైకోర్టులో సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డిలకు ఊరట

Published Thu, Mar 27 2025 8:33 PM | Last Updated on Fri, Mar 28 2025 11:00 AM

Sajjala Ramakrishna Reddy and Bhargav Reddy Granted Anticipatory Bail

సాక్షి,గుంటూరు: ఏపీ హైకోర్టులో వైఎస్సార్‌సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన తనయుడు సజ్జల భార్గవరెడ్డిలకు ఊరట దక్కింది. ఇద్దరు నేతలకు హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. 

సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా తమను అరెస్టు చేసే అవకాశం ఉందని, తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని సజ్జల రామకృష్ణ రెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డిలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఆ పిటిషన్లపై గురువారం ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. సజ్జల రామకృష్ణ రెడ్డి, సజ్జల భార్గవ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement