YSR : ఇడుపులపాయలో వైఎస్సార్‌కు సీఎం జగన్‌ నివాళి | YSR Death Anniversary: CM Jagan Idupulapaya Tour Updates - Sakshi
Sakshi News home page

YSR : ఇడుపులపాయలో వైఎస్సార్‌కు సీఎం జగన్‌ నివాళి

Sep 2 2023 7:28 AM | Updated on Sep 2 2023 4:11 PM

YSR Death Anniversary: Cm Jagan Idupulapaya Tour Updates - Sakshi

దివంగత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని నివాళి అర్పిస్తారు.

సాక్షి, అమరావతి/ వైఎస్సార్‌: దివంగత మహానేత, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో సీఎం జగన్‌ పాల్గొన్నారు. 

సతీసమేతంగా ఇడుపులపాయ వెళ్లిన సీఎం జగన్‌.. తల్లి వైఎస్‌ విజయమ్మ, మరికొందరు కుటుంబ సభ్యులు, మంత్రులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు ఆయన తన ట్విటర్‌ ఖాతాలో తండ్రి వైఎస్సార్‌ను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు

ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, మేడా మల్లికార్జున రెడ్డి, రఘురామిరెడ్డి, పీజేఆర్ సుధాకర్ బాబు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్ మల్లికార్జున రెడ్డి, మేయర్ సురేష్ బాబు హాజరయ్యారు.
చదవండి: Johar ysr: అజేయుడు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement