Idupulapaya
-
ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న వైయస్ జగన్
-
ఇడుపులపాయ : వైఎస్ఆర్కు నివాళులర్పించిన వైఎస్ జగన్ (ఫొటోలు)
-
వైఎస్ఆర్ ఘాట్ వద్ద జగన్ నివాళులు
-
ఇడుపులపాయకు జగన్
-
ఇడుపులపాయలో వైఎస్ జగన్ (ఫొటోలు)
-
నేడు పులివెందులకు వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం వైఎస్సార్ జిల్లా పులివెందులలో పర్యటించనున్నారు. ఆయన ఉదయం 10.45 గంటల ప్రాంతంలో ఇడుపులపాయకు చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి పులివెందుల వెళతారు. 3 రోజులపాటు పులివెందులలోనే అందుబాటులో ఉంటారు. -
నాన్నకు కన్నీటి నివాళి
-
వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ జగన్ నివాళులు
వైఎస్సార్, సాక్షి: సంక్షేమ ప్రదాత.. అభివృద్ధి విధాత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి 15వ వర్ధంతి నేడు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. వైఎస్సార్ సతీమణి విజయమ్మ, తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నేతలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని మహానేతను స్మరించుకున్నారు.ఈ ప్రార్థనా కార్యక్రమంలో ఎంపీలు వైఎస్ అవినాష్ రెడ్డి, గురుమూర్తి, జిల్లా పార్టీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, దాసరి సుధ, మాజీ డిప్యూటీ సిఎం ఆంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యేలు కోరుముట్ల శ్రీనివాస్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మహానేత వైఎస్సార్కు వైఎస్ జగన్ ఘన నివాళి
సాక్షి కడప: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతిని పురస్కరించుకుని సోమవారం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయకు జనవాహిని పోటెత్తింది. రాష్ట్రవ్యాప్తంగా తరలి వచ్చిన అభిమానులు వైఎస్సార్ ఘాట్ వద్ద ఘన నివాళులర్పించారు. ముందుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన మాతృమూర్తి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతీరెడ్డి, మేనత్త వైఎస్ విమలమ్మ, చిన్నాన్న వైఎస్ సుధీకర్రెడ్డి, అత్తమ్మ ఈసీ సుగుణమ్మ, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డితో కలసి ఇడుపులపాయలో వైఎస్సార్కు నివాళులర్పించారు. సమాధి ఘాట్కు పూలమాలలు వేసి నివాళులర్పించిన వైఎస్ జగన్ కాసేపు అక్కడే మోకాళ్లపై కూర్చొని తండ్రిని స్మరించుకున్నారు. నివాళులర్పించే సమయంలో వైఎస్ విజయమ్మ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు.ప్రత్యేక ప్రార్థనలు..సమాధి ఘాట్ వద్ద వైఎస్ జగన్, వైఎస్సార్ కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రానున్న కాలంలో కొన్ని సమస్యలు ఎదురైనా రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో జగన్ ధైర్యంగా ఎదుర్కొనేలా దేవుడు ఆశీర్వదించాలని మేనత్త విమలమ్మ ప్రార్థన చేశారు. కష్టాలు తాత్కాలికమేనని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడి మీద భారం వేసి ముందుకు వెళ్లడం ద్వారా ఎదిరించే శక్తిని ప్రసాదిస్తాడని చెప్పారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైఎస్సార్, వైఎస్ జగన్ చేసిన మంచిని ప్రస్తావించారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన రమేష్, హేమ దంపతులు వైఎస్ జగన్ను కలిసి తమ మూడు నెలల చిన్నారికి పేరు పెట్టాలని కోరగా విజయశ్రీగా నామకరణం చేశారు.వైఎస్సార్ విగ్రçహం వద్ద నివాళులు..ఇడుపులపాయలోని ఘాట్ ప్రాంగణంలో వైఎస్సార్ విగ్రహానికి వైఎస్ జగన్ పూలమాల వేసి నివాళులర్పించారు. కొద్దిసేపు అక్కడే నిలబడి వైఎస్సార్ను స్మరించుకున్నారు. వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతిరెడ్డి, విమలమ్మ, వైఎస్ సుధీకర్రెడ్డి తదితరులు పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, అరకు, తిరుపతి ఎంపీలు తనూజారాణి, గురుమూర్తి, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల పార్టీల అధ్యక్షులు కె.సురేష్బాబు, గడికోట శ్రీకాంత్రెడ్డి, ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథరెడ్డి, డాక్టర్ సుధ, టి.చంద్రశేఖర్, ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, రామచంద్రారెడ్డి, గోవిందరెడ్డి, మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్, మాజీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, పోచిమరెడ్డి రవీంద్రనాథ్రెడ్డి, రఘురామిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు ఎస్వీ సతీష్కుమార్రెడ్డి, ఆర్టీసీ మాజీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, సంబటూరు ప్రసాద్రెడ్డి, జడ్పీ చైర్మన్ శారదాదేవి, పులివెందుల మాజీ మున్సిపల్ చైర్మన్ వైఎస్ ప్రమీలమ్మ, వైఎస్ మ«ధురెడ్డి సతీమణి వైఎస్ మాధవి, వైఎస్సార్సీపీ నాయకులు యువరాజ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పురుషోత్తమరెడ్డి కుమారుడు థామస్రెడ్డి, స్టాన్లీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.అందరికీ అభివాదం.. అభిమానులతో సెల్ఫీఇడుపులపాయలో వైఎస్సార్ సమాధి ఘాట్ ప్రాంగణానికి తరలి వచ్చిన జనవాహినికి వైఎస్ జగన్ అభివాదం చేశారు. వైఎస్సార్ అమర్రహే, వైఎస్ జగన్ నాయకత్వం వర్థిల్లాలి అంటూ నినాదాలతో ఘాట్ ప్రాంగణం హోరెత్తింది. పలువురి వద్దకు స్వయంగా వెళ్లి పలుకరించిన వైఎస్ జగన్ అడిగిన వారందరితో సెల్ఫీ దిగారు. భారీగా వచ్చిన ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. మూడు రోజుల జిల్లా పర్యటన ముగించుకుని అనంతరం అక్కడి నుంచి ఉదయం 11.10 గంటలకు గన్నవరం చేరుకున్న వైఎస్ జగన్కు విమానాశ్రయంలో పలువురు పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కాపు కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ అడపా శేషు, గౌడ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ మాదు శివరామకృష్ణ గన్నవరం ఎయిర్పోర్టుకు వచ్చారు. గొల్లపూడి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ కొమ్మ కోటేశ్వరరావు(కోట్లు), జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ గౌసాని, విజయవాడ రూరల్ ఎంపీపీ చెన్ను ప్రసన్నకుమారి, జడ్పీటీసీ కాకర్లమూడి సువర్ణరాజు, నిడమానూరు సర్పంచి శీలం రంగారావు, పార్టీ నాయకులు దేవభక్తుని చక్రవర్తి, అశోక్, మేచినేని బాబు, కాట్రు శేషు, రామిశెట్టి వెంకటేశ్వరరావు, సమ్మెట సాంబశివరావు, నిడమర్తి రామారావు, పలువురు విజయవాడ కార్పొరేటర్లు, కార్యకర్తలు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. వారందరినీ ఆప్యాయంగా పలకరించిన వైఎస్ జగన్ రోడ్డు మార్గంలో తాడేపల్లికి బయలుదేరారు. -
ప్రజల పక్షాన పోరాటానికి ఎప్పుడూ సిద్ధమే: సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి, అమరావతి: ప్రజల పక్షాన పోరాటానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టంచేశారు. సమకాలీన చరిత్రను మనం ప్రత్యక్షంగా చూశామని, ఆ సంక్షోభం, ప్రజల కష్టాల్లో నుంచి పుట్టిందే వైఎస్సార్సీపీ అని గుర్తుచేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద సోమవారం దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతిని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. వైఎస్సార్ రక్తం పంచుకున్న బిడ్డగానే కాకుండా ఆయన ఆశయాలకు వారసుడిగా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాటాల మధ్యనే ఈ పార్టీని ప్రారంభించారని గుర్తుచేశారు. ఆ రోజు నుంచి కోట్ల మందికి జగన్ ఆశాదీపం అయ్యారన్నారు. వైఎస్సార్కి మించి అడుగులు ముందుకు వేసే బిడ్డగా జగన్ ఈ రాష్ట్రానికి 30 ఏళ్లలో జరగాల్సిన అభివృద్ధిని తన ఐదేళ్ల పాలనా కాలంలో అందరూ గర్వపడేలా చేసి చూపించారన్నారు. వైఎస్సార్ ఆశయ సాధన కోసం జగన్ ఎంతో కృషిచేస్తున్నారన్నారు. సజ్జల ఇంకా ఏమన్నారంటే...విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు..రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేశాం. ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం. అసాధ్యమైన హామీలతో ప్రత్యర్థులు అందలమెక్కారు. హామీలిచ్చి మోసం చేయటం, ప్రజలను భ్రమల్లో ఉంచటం వైఎస్ జగన్కి చేతకాదు. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలతో పనిలేకుండా ఆయన పాలించారు. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఇళ్ల ముంగిటకే ఆయన పరిపాలన అందించారు. ప్రజల్లో మమేకమైన పార్టీగా మన ప్రయాణం అనంతం. అది ఆగిపోదు. ఎన్నికల ఫలితాలపై అనుమానాలున్నా లోతుకుపోవటం సరైంది కాదు. మరోసారి మోసానికి బాబు శ్రీకారం..ఇక అధికారంలోకి వచ్చి నెల దాటిందో లేదో ఇచ్చిన హామీలు ఇప్పట్లో నెరవేర్చటం కష్టమని అప్పుడే చంద్రబాబు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా ప్రజల్ని మోసం చేసి ఎన్నికల్లో గెలిచేందుకు ఆయన అలవిగాని హామీలిచ్చారు. ఆసాధ్యమైన హామీలిచ్చి 2014లో ప్రజలను ఎలా మోసం చేశారో ఇప్పుడు ఆదే రీతిలో మరోసారి మోసానికి బాబు శ్రీకారం చుట్టారు. ఖజానా ఇంత ఖాళీ అయి ఉంటుంది అనుకోలేదని అప్పుడే చంద్రబాబు అంటున్నారు. ఖజానా బాగాలేదు కాబట్టి హామీలు నెరవేర్చటం కష్టమని ఆయన చెప్పకనే చెబుతున్నారు. ఇది అత్యంత మోసం, దగా.రాష్ట్రం రావణకాష్టం..అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి రాష్ట్రంలో ఎలా ఆరాచకం సృష్టిస్తున్నారో చూస్తున్నాం. రాష్ట్రాన్ని ఎలా రావణకాష్టం చేస్తున్నారో, ఎలా దాడులు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. సామాన్యులు తిరగలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఐదేళ్లలో రూపుదిద్దుకున్న ఆరోగ్య, విద్యా వ్యవస్థలకు గండికొట్టడం ప్రారంభమైంది. వైద్యంలో స్పెషలిస్టు సేవలను నిర్వీర్యం చేస్తున్నారు. రాష్ట్రాన్ని మళ్లీ పదేళ్లు వెనక్కి తీసుకెళ్లేలా చంద్రబాబు చేస్తున్నారు. మన లోటుపాట్లు సరిదిద్దుకుని ముందుకెళ్దాం. మళ్లీ రాష్ట్రానికి పూర్వవైభవం తీసుకొద్దాం. బాబు తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లకుండా, ప్రజల దృష్టి మళ్లించేందుకు జగన్పైన, వైఎస్సార్సీపీపైన కూటమి నేతలు దాడిచేస్తున్నారు.తాను అమలుచేయాల్సిన హామీల నుంచి తప్పించుకోవాలని బాబు చూస్తున్నారు. అది జరగకుండా.. మనం ఎక్కడా డీలాపడకుండా కలిసికట్టుగా అడుగులు వేయాలి. ప్రజల పక్షాన నిలబడే పార్టీగా మనమంతా పునరంకితం అవుదామని శపథం చేద్దాం. ఇందుకు ఇంతకంటే మంచి రోజు, వైఎస్సార్ జయంతిని మించిన రోజులేదు. అనంతరం.. మాజీమంత్రి అంబటి రాంబాబు కూడా మాట్లాడారు.ఈ కార్యక్రమంలో.. మాజీమంత్రి జోగి రమేష్, నాయకులు పుత్తా ప్రతాప్రెడ్డి, అంబటి మురళీ, మలసాని మనోహర్రెడ్డి, చిల్లపల్లి మోహనరావు, బత్తుల బ్రహ్మానందరెడ్డి, చల్లా మధు, కొమ్మూరి కనకారావు, ఎ.నారాయణమూర్తి, బందెల కిరణ్రాజ్, న్యాయవాది కొమ్మసాని శ్రీనివాస్రెడ్డి, మహిళా నేతలు నారమల్లి పద్మ, రజనీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘అపర భగీరథుడు వైఎస్సార్’ పుస్తకాన్ని సజ్జల ఆవిష్కరించారు. పార్టీ కార్యాలయంలో సేవా కార్యక్రమాలు..ఇదిలా ఉంటే.. వైఎస్ జయంతి సందర్భంగా పుత్తా ప్రతాప్రెడ్డి ఏర్పాటుచేసిన భారీ కేక్ను సజ్జల రామకృష్ణారెడ్డి కట్ చేశారు. పేదలకు వస్త్ర, అన్నదానం నిర్వహించారు. వికలాంగులకు, వృద్ధులకు చేతి కర్రలను పంపిణీ చేశారు. తొలుత.. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి అందరూ ఘనంగా నివాళులర్పించారు. -
సంక్షేమాభివృద్ధి సారథి వైఎస్సార్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమానంగా ముందుకు తీసుకెళ్తూ పరిపాలనలో సమానత్వాన్ని చాటుకుంటూ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుని పాలకుడంటే ఎలా ఉండాలో చాటిచెప్పిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అని ప్రజలు, అభిమానులు, వైఎస్సార్సీపీ శ్రేణులు కొనియాడారు. దివంగత వైఎస్ 75వ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఘనంగా నివాళులర్పించారు. ‘జోహార్ వైఎస్సార్.. వైఎస్సార్ అమర్ రహే’ అంటూ వాడవాడలా నినదించారు.ఈ సందర్భంగా మహానేత అందించిన పథకాలను ప్రజలు గుర్తుచేసుకున్నారు. గ్రామ గ్రామాన, వాడవాడలా కేక్లు కట్చేసి, పేదలకు వస్త్ర, అన్నదానం చేసి మహానేతపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. రాష్ట్రంలో 26 జిల్లాలు, 175 నియోజకవర్గాల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు పండుగలా నిర్వహించారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ సహా వివిధ రాష్ట్రాల్లో మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయంలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తదితరులు కేక్ కట్చేసి వైఎస్సార్ చిత్రపటానికి నివాళులర్పించారు.ఇడుపులపాయలో..ఇక ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్ తన తండ్రికి ఘన నివాళులర్పించారు. ఆయనతోపాటు వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మహానేతకు నివాళులర్పించారు. అలాగే, పామర్రు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కైలే అనిల్కుమార్ ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహాలకు భారీ పూలమాలలు వేసి నివాళులర్పించారు.విదేశాల్లోనూ ఘనంగా..వివిధ దేశాల్లోనూ ప్రవాసాంధ్రులు వైఎస్కు ఘనంగా నివాళులు అర్పించారు. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, యూకే, జర్మనీ, దక్షిణాఫ్రికా, సింగపూర్, మలేసియా, ఒమన్, యూఏఈ, సౌదీ అరేబియా తదితర దేశాల్లో ప్రవాసాంధ్రులు, భారతీయులు వైఎస్సార్ సేవలను గుర్తుచేసుకున్నారు. మెల్బోర్న్లో వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా కన్వీనర్ చింతలచెరువు సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో కేక్ను కట్ చేశారు. తెలుగు ప్రజల గుండెల్లో వైఎస్సార్: డాక్టర్ ప్రదీప్ చింతా తెలుగుజాతి ఉన్నంత వరకు తెలుగు ప్రజల హృదయాల్లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పదిలంగా ఉంటారని వైఎస్సార్సీపీ యూకే కన్వీనర్ డాక్టర్ ప్రదీప్ చింతా తెలిపారు. పేదల దేవుడు వైఎస్సార్ అని, మనసున్న మారాజు వైఎస్సార్కు నీరాజనం పలుకుతున్నామన్నారు. ఇక యూకే టీం ఆధ్వర్యంలో నంద్యాలలోని పరివర్తన్ లైఫ్ సెంటర్లోనూ వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పిల్లలకు మందులు, దుస్తులు, ఫ్రిజ్, మంచాలు, బెడ్స్ పంపిణీ చేసి అన్నదానం చేశారు. అలాగే, ఆయన కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో వైఎస్సార్ జిల్లా ముద్దనూరులోని సాంఘిక సంక్షేమ హాస్టల్లో కేక్ కట్చేసి దుప్పట్లు పంపిణీ చేశారు. -
వైఎస్సార్ జయంతి: జనహృదయ నేతకు వైఎస్ జగన్ నివాళి (ఫోటోలు)
-
ఇడుపులపాయకు భారీగా తరలివచ్చిన YSR అభిమానులు
-
ఇడుపులపాయ: మహానేత వైఎస్సార్కు వైఎస్ జగన్ ఘన నివాళి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: దివంగత మహానేత, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఆయనతో పాటు వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, పలువురు కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొని వైఎస్సార్కు ఘనంగా నివాళులర్పించారు.కార్యక్రమం అనంతరం అరకు ఎంపీ తనూజ రాణి మీడియాతో మాట్లాడుతూ, పేద ప్రజల గుండెల్లో దివంగత మహానేత వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచిపోతారని.. ముఖ్యంగా మా గిరిజన ప్రాంత ప్రజల్లో గుండెల్లో వైఎస్ ఎప్పటికీ ఉంటారని ఆమె అన్నారు. పోడు భూములు విషయం లో గిరిజనులకు చేసిన మేలు మరిచి పోలేము. గిరిజనుల ఆరాధ్య దైవం మోద కొండమ్మ చిత్ర పటంతో పాటు , మా గిరిజనుల ప్రతి ఇంటిలో వైఎస్సార్ చిత్ర పటం ఉంది.. రాష్ట్రంలో ఎప్పుడూ ఎన్నికలు జరిగిన మా గిరిజన గ్రామాల్లో, ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని తనూజ రాణి అన్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతిని రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నాయి. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. దివంగత ముఖ్యమంత్రి, రక్తదానం, పేదలకు వస్త్రాల పంపిణీ, ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ, రహదారుల పక్కన మొక్కలు నాటడం వంటి సేవా కార్యక్రమాలను భారీ ఎత్తున చేపట్టేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశాయి. -
నేడు మహానేత వైఎస్సార్ 75వ జయంతి
సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతిని సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు వైఎస్సార్సీపీ సిద్ధమైంది. రక్తదానం, పేదలకు వస్త్రాల పంపిణీ, ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ, రహదారుల పక్కన మొక్కలు నాటడం వంటి సేవా కార్యక్రమాలను భారీ ఎత్తున చేపట్టేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశాయి. వైఎస్సార్ జిల్లాలోని ఇడుపులపాయలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులు అర్పించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. -
రేపు ఇడుపులపాయకు వైఎస్ జగన్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(సోమవారం) ఇడుపులపాయలో పర్యటించనున్నారు. దివంగత మహానేత వైఎస్సార్ 75వ జయంతి కార్యక్రమంలో పాల్గొనున్నారు. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించనున్నారు. అనంతరం తాడేపల్లికి రానున్నారు.కాగా, వైఎస్సార్ జిల్లాలో రెండో రోజు పర్యటనలో భాగంగా నేడు(ఆదివారం) పార్టీ నేతలను, కార్యకర్తలను క్యాంపు కార్యాలయంలో కలిశారు. వారి నుంచి వినతులను స్వీకరించారు. కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో వైఎస్ జగన్ మమేకమయ్యారు. ఈ సందర్భంగా అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. పులివెందులలో పాముకాటుకు గురై మరణించిన బాలిక కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్. చిన్నారికి నివాళులర్పించి, కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. -
#MemanthaSiddham : జైత్రయాత్ర ఆరంభం
మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: మండుటెండనూ లెక్క చేయకుండా కి.మీ. కొద్దీ రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన జనం.. నిప్పులు చిమ్ముతున్న సూరీడుతో పోటీపడుతూ చంటిబిడ్డలను చంకనేసుకుని బస్సు వెనుక పరుగులు తీసిన ఆడబిడ్డలు.. రోడ్డుకు ఇరువైపులా గ్రామాల్లో టెంట్లు వేసి వంటలు వండుకుని, సామూహికంగా భోజనాలు చేసి గంటల తరబడి నిరీక్షించిన ప్రజానీకం..! వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ ఇడుపులపాయ నుంచి ప్రారంభించిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో తొలిరోజు కనిపించిన దృశ్యాలు ఇవి. సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో బలంగా నాటుకుపోయిన నమ్మకానికి ఈ దృశ్యాలు ప్రతీకగా నిలిచాయి. వైఎస్సార్ జిల్లాలోని ఇడుపులపాయ నుంచి వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచార భేరిని సీఎం జగన్ బుధవారం మోగించారు. తాడేపల్లి నివాసం నుంచి ఉదయం 11.50 గంటలకు బయలుదేరిన సీఎం జగన్ ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్దకు మధ్యాహ్నం ఒంటి గంటకు చేరుకున్నారు. తన మాతృమూర్తి వైఎస్ విజయమ్మతో కలిసి వైఎస్సార్కు నివాళులు అర్పించారు. అనంతరం తల్లి విజయమ్మ ఆశీస్సులు తీసుకున్నారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించి భారీ ఎత్తున తరలివచ్చిన వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల నినాదాల నడుమ బస్సు యాత్రను సీఎం జగన్ ప్రారంభించారు. ఇడుపులపాయ నుంచి కుమారునిపల్లి వద్దకు బస్సు యాత్ర చేరుకునే సరికి రోడ్డుకు ఇరువైపులా భారీ ఎత్తున జనం బారులు తీరారు. భారీ క్రేన్తో గజమాల వేసి సీఎం జగన్కు ఆత్మీయ స్వాగతం పలికారు. జనసంద్రమైన వేంపల్లి.. ప్రజలు భారీ ఎత్తున తరలిరావడంతో వేంపల్లి జనసంద్రంగా మారింది. వేంపల్లి అడ్డ రోడ్డు నుంచి హనుమాన్ సర్కిల్ వరకూ సీఎం జగన్ రోడ్ షో నిర్వహించారు. సీఎం జగన్ను చూడగానే అవ్వాతాతల నుంచి చిన్న పిల్లల వరకూ హర్షద్వానాలతో ఘనస్వాగతం పలికారు. హనుమాన్ సర్కిల్ వరకూ కి.మీ. కొద్దీ ఇసుకేస్తే రాలనంత స్థాయిలో రోడ్డుపై కిక్కిరిసిన జనం సీఎం జగన్ బస్సు యాత్రకు నీరాజనాలు పలికారు. మండటెండను కూడా లెక్క చేయకుండా చంటిబిడ్డలను ఎత్తుకుని బస్సు వెంట నడుస్తూ సీఎం జగన్ను చూసేందుకు పోటీపడ్డారు. బస్సు యాత్ర సాగుతున్న రహదారికి ఇరువైపులా మారుమూల గ్రామాల ప్రజలు భారీ ఎత్తున రోడ్డుపైకి తరలివచ్చి టెంట్లు వేసుకుని, వంటలు వండుకుని, సామూహికంగా భోజనాలు చేస్తూ సీఎం జగన్ రాక కోసం గంటల కొద్దీ నిరీక్షించారు. బస్సు యాత్ర తమ వద్దకు చేరుకోగానే సీఎం జగన్పై బంతిపూల వర్షం కురిపిస్తూ అడుగడుగునా నీరాజనాలు పలకడంతో యాత్ర ఆలస్యంగా ముందుకు సాగింది. అమ్మ భావోద్వేగం... పులివెందుల: ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర ప్రారంభం సందర్భంగా వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రార్థన నిర్వహించిన వైఎస్ విజయమ్మ భావోద్వేగానికి గురయ్యారు. ‘నా బిడ్డను నీకే అప్పజెబుతున్నా దేవుడా..! నా బిడ్డ కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా ఉన్నావు..! ప్రతి బాధలోనూ తోడుగా ఉన్నావు..! నా బిడ్డ తలపెట్టిన కార్యక్రమాలను జయప్రదం చేయాలి..! నా బిడ్డను మళ్లీ సీఎంగా చేయాలని కోరుకుంటున్నా..!’ అంటూ ప్రార్థన చేసిన అనంతరం సీఎం జగన్ను ఆప్యాయంగా ముద్దాడగా.. ఆయన భావోద్వేగంతో తన తల్లిని ఆలింగనం చేసుకున్నారు. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన వారిలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు, మేడా రఘునాథరెడ్డి, ఎంపీలు వైఎస్ అవినాష్రెడ్డి, మిథున్రెడ్డి, చింతా అనూరాధ, ఎమ్మెల్యేలు రవీంద్రనాథరెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, శ్రీకాంత్రెడ్డి, సుధాకర్బాబు, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ఎమ్మెల్సీలు రమేష్యాదవ్, రామచంద్రారెడ్డి, ప్రభాకర్, తలశిల రఘురాం, జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు, జడ్పీ ఛైర్మన్ అమర్నాథరెడ్డి, చల్లా మధుసూదన్రెడ్డి, దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీష్రెడ్డి, వైఎస్ కొండారెడ్డి, సీఎం కార్యాలయ కోఆర్డినేటర్ జనార్దన్రెడ్డి, ఎన్ఆర్ఐ రత్నాకర్ తదితరులున్నారు. జిల్లా చరిత్రలో అతి పెద్ద ప్రజాసభ.. ప్రొద్దుటూరులో బహిరంగ సభ షెడ్యూలు ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం కావాలి. కానీ.. రహదారి పొడవునా జనం బారులు తీరి స్వాగతం పలకడంతో బైపాస్ రోడ్డు సమీపంలోని సభా ప్రాంగణానికి సాయంత్రం 6.30 గంటలకు సీఎం చేరుకున్నారు. అప్పటికే 30 ఎకరాల్లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. సీఎం జగన్ వేదికపైకి చేరుకుని ర్యాంప్ వాక్ చేస్తూ అభివాదం చేస్తున్నంత సేపు ప్రాంగణం ప్రజల హర్షధ్వానాలతో మారుమోగిపోయింది. గత 58 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో చేసిన మంచిని వివరిస్తూ.. టీడీపీ– జనసేన–బీజేపీ కూటమి సర్కార్ 2014–19 మధ్య చేసిన మోసాలను ఎండగడుతూ సీఎం జగన్ చేసిన ప్రసంగానికి విశేష స్పందన లభించింది. ప్రొద్దుటూరులో సీఎం జగన్ నిర్వహించిన సభ వైఎస్సార్ కడప జిల్లా చరిత్రలో అతి పెద్ద ప్రజాసభగా నిలిచింది. ప్రచండ భానుడితో పోటీపడుతూ.. నిప్పులు గక్కుతున్న సూరీడుతో పోటీపడుతూ సీఎం జగన్ కోసం రహదారిపై భారీ ఎత్తున జనం గంటల కొద్దీ నిలబడ్డారు. కమలాపురం నియోజకవర్గంలో వీరపునాయునిపల్లె, గంగిరెడ్డిపల్లి, సంగాలపల్లిలో బస్సు యాత్రకు నీరాజనాలు పలికారు. మండల కేంద్రమైన వీరపునాయునిపల్లిలో సీఎం జగన్ నిర్వహించిన రోడ్ షోకు విశేష స్పందన లభించింది. జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్లలోని మెయిన్ రోడ్డు జనసంద్రంగా మారింది. ఎర్రగుంట్లలో సీఎం జగన్ నిర్వహించిన రోడ్ షో సూపర్ హిట్ అయ్యింది. రాత్రి పూట జన నీరాజనం.. ప్రొద్దుటూరు సభ రాత్రి 8 గంటలకు ముగిసింది. అనంతరం బస్సు యాత్ర మైదుకూరు నియోజకవర్గం దువ్వూరుకు చేరుకునే సమయంలో దారిలో రాత్రి పూట కూడా జనం భారీ ఎత్తున రహదారిపై గంటల తరబడి నిరీక్షించారు. సీఎం జగన్పై బంతి పూలవర్షం కురిపించి అభిమానాన్ని చాటుకున్నారు. వైఎస్సార్ కడప జిల్లాలో బస్సు యాత్ర ముగిసి బుధవారం రాత్రి 9.20 గంటలకు నంద్యాల జిల్లా చాగలమర్రిలో ప్రవేశించింది. చాగలమర్రిలో జనం సీఎం జగన్కు నీరాజనాలు పలికారు. దారి పొడవునా ఘనస్వాగతాల నడుమ ఆళ్లగడ్డ క్రాస్లో బస చేసేందుకు ఏర్పాటు చేసిన శిబిరానికి రాత్రి 10 గంటలకు చేరుకున్నారు. బస్సు యాత్ర తొలి రోజు గ్రాండ్ సక్సెస్ కావడంతో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నయా జోష్ నెలకొంది. నేడు నంద్యాలలో సీఎం జగన్ సభ ఆళ్లగడ్డ నుంచి రెండో రోజు మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభం సాక్షి, అమరావతి: మేమంతా సిద్ధం బస్సు యాత్ర రెండో రోజైన గురువారం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో సీఎం జగన్మోహన్రెడ్డి నైట్ హాల్ట్ ప్రాంతం నుంచి ప్రారంభంకానుంది. యాత్ర గురు వారం షెడ్యూల్ను పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం.. ఉదయం 9 గంటలకు ఆళ్లగడ్డ నుంచి బయలుదేరి నల్లగట్ల, బత్తలూరు, ఎర్రగుంట్ల చేరుకొని గ్రామ స్థులతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. అనంతరం గోవిందపల్లి మీదుగా ప్రయాణించి చాబోలు శివారులో భోజన విరామం తీసుకుంటారు. తర్వాత నూనేపల్లి మీదుగా నంద్యాల చేరుకుని గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం పాణ్యం, సుగాలిమిట్ట, హుస్సేనాపురం, ఓర్వకల్, నన్నూర్, పెద్దటేకూరు, చిన్నకొట్టాల, కె.మార్కాపురం క్రాస్, నాగలాపురంలో ప్రజలతో మమేకమవుతూ పెంచికలపాడులో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. -
కదిలిన జగన్నాథ రథ చక్రాలు
-
సీఎం జగనన్ను ఆశీర్వదించిన విజయమ్మ
-
ఇడుపులపాయలో అడుగుపెట్టిన పులి
-
జగన్ ఎక్కడుంటే అక్కడ జన జాతర
-
Watch Live: ఇడుపులపాయలో సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం
-
మా జగన్ దమ్మున్న మొగోడు..
-
ఇడుపులపాయకి బయలుదేరిన సీఎం జగన్
-
సీఎం జగన్ కోసం ప్రత్యేకమైన పాదరక్షలు చేసిన అభిమాని
-
జన గణ మన లోని శక్తి మా జగన్ లో ఉంది
-
ఐదున్నర కోట్ల మందికి అభయం ఇచ్చే యాత్ర..
-
సీఎం జగన్ బస్సు యాత్ర..ఇడుపులపాయలో భారీ ఏర్పాట్లు
-
ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టునున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇంకా ఇతర అప్డేట్స్
-
బస్సు యాత్రకు కౌంట్ డౌన్..
-
Bus Yatra: ఇడుపులపాయ నుంచి ప్రచార భేరి
సాక్షి, అమరావతి: పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచారభేరి మోగించనున్నారు. బుధవారం ఉదయం 10.56 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మధ్యాహా్ననికి ఇడుపులపాయ చేరుకుని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద ప్రార్థనలు చేసి నివాళులు అరి్పస్తారు. అనంతరం ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రను ప్రారంభిస్తారు. తొలిరోజు బస్సు యాత్ర కడప పార్లమెంట్ నియోజకవర్గంలో జరగనుంది. ఇడుపులపాయ నుంచి వేంపల్లి, వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల మీదుగా సాయంత్రం ప్రొద్దుటూరు చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి దువ్వూరు, చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. గురువారం నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బస్సు యాత్ర నిర్వహిస్తారు. ప్రజాక్షేత్రంలోనే జననేత.. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకూ 21 రోజులపాటు సీఎం జగన్ బస్సుయాత్రను నిర్వహించనున్నారు. ఒక్కో రోజు ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో యాత్ర జరగనుంది. సిద్ధం సభలు జరిగిన నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు మినహా మిగతా 21 ఎంపీ స్థానాల పరిధిలో బస్సు యాత్ర నిర్వహిస్తారు. యాత్రలో రోజూ ఉదయం వివిధ వర్గాల ప్రజలు, మేధావులతో సీఎం జగన్ సమావేశమవుతారు. ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపర్చుకోవడానికి సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. సాయంత్రం ఆయా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. బస్సు యాత్రలో 21 రోజులు ప్రజలతో సీఎం జగన్ మమేకమవుతారు. పూర్తిగా ప్రజాక్షేత్రంలోనే ఉంటారు. విప్లవాత్మక మార్పులను వివరిస్తూ.. నాటి అరాచకాలను ఎండగడుతూ.. వైఎస్సార్సీపీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడం కోసం భీమిలి(ఉత్తరాంధ్ర), దెందులూరు(ఉత్తర కోస్తా), రాప్తాడు(రాయలసీమ), మేదరమెట్ల(దక్షిణ కోస్తా)లలో సీఎం జగన్ నిర్వహించిన సిద్ధం సభలకు ప్రజలు ఒకదానికి మించి మరొకటి పోటీపడుతూ పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల చరిత్రలో రాప్తాడు, మేదరమెట్ల సభలు అతి పెద్ద ప్రజాసభలుగా చరిత్రలో నిలిచాయి. అదే సమయంలో టీడీపీ–జనసేన పొత్తు లెక్క తేలాక తాడేపల్లిగూడెంలో నిర్వహించిన జెండా సభ, బీజేపీతో జతకలిశాక మూడు పారీ్టలు చిలకలూరిపేటలో ప్రజాగళం పేరుతో నిర్వహించిన సభ జనం లేక అట్టర్ ప్లాప్ అయ్యాయి. సిద్ధం సభల ఊపుతో 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించిన సీఎం జగన్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేలోగా బస్సు యాత్ర ద్వారా తొలి విడత ప్రచారాన్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. గత 58 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా ప్రతి ఇంటా, ప్రతి గ్రామం, ప్రతి నియోజకవర్గంలో చోటు చేసుకున్న విప్లవాత్మక మార్పులను వివరిస్తూ 2014–19 మధ్య చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ–జనసేన–బీజేపీ సర్కార్ అరాచకాలను మరోసారి గుర్తు చేయనున్నారు. ఇప్పుడు మళ్లీ అదే కూటమి జట్టు కట్టటాన్ని ఎండగడుతూ బస్సు యాత్రలో ప్రచారం చేయనున్నారు. -
ఇడుపులపాయ నుంచి వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచార భేరీ. 27న బస్సు యాత్రకు సీఎం జగన్ శ్రీకారం.. .ఇంకా ఇతర అప్డేట్స్
-
27 నుంచి సీఎం వైఎస్ జగన్ 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర
సాక్షి, అమరావతి: పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు.. మరోసారి చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుని అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 27న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రచార భేరి మోగించనున్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించి.. ఎన్నికల సంగ్రామానికి ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు దాదాపు 21 రోజులపాటు బస్సు యాత్ర కొనసాగనుంది. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి సిద్ధం సభలు నిర్వహించిన నాలుగు జిల్లాలు (విశాఖపట్నం, ఏలూరు, అనంతపురం, బాపట్ల) మినహా మిగతా జిల్లాల్లో బస్సు యాత్ర జరగనుంది. ప్రతి రోజూ ఒక పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బస్సు యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో ఉదయం పూట వివిధ వర్గాలు, రంగాల ప్రజలతో సీఎం జగన్ సమావేశమవుతారు. ప్రభుత్వ పనితీరును మరింతగా మెరుగు పర్చుకోవడానికి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. కొందరు పార్టీ కార్యకర్తలను, అభిమానులను కూడా కలుస్తారు. సాయంత్రం పార్లమెంట్ నియోజకవర్గంలో బహిరంగ సభ ఉంటుంది. ఆ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఈ సభకు తరలి రానున్నారు. బస్సు యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు సీఎం జగన్ పూర్తిగా ప్రజలతో మమేకం కానున్నారు. యాత్రలోనే ఎక్కడికక్కడ విడిది చేయనున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశామని చెబుతూ.. ప్రతి ఇంటికీ మేలు చేశామని వివరించనున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో వ్యవసాయ రుణాల మాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి వంటి వాటితోపాటు 650 హామీలు ఇచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి.. వాటిని అమలు చేయకుండా మోసం చేయడాన్ని కూడా ప్రజలకు విశదీకరించి చెప్పనున్నారు. అప్పట్లో మోసం చేసిన కూటమి మరోసారి జట్టుకట్టి మళ్లీ వస్తోందంటూ ప్రజలను అప్రమత్తం చేయనున్నారు. మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మీ ఇంటికి మంచి జరిగి ఉంటే.. మీ బిడ్డకు అండగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేయనున్నారు. కదనోత్సాహంలో పార్టీ శ్రేణులు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసిన సీఎం జగన్.. గత 58 నెలల్లో డీబీటీ రూపంలో 2.70 లక్షల కోట్లు, నాన్ డీబీటీ రూపంలో రూ.1.79 లక్షల కోట్లు వెరసి రూ.4.49 లక్షల కోట్ల ప్రయోజనాన్ని 87 శాతం కుటుంబాలకు చేకూర్చారు. విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణల ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ, జిల్లాల పునర్ వ్యవస్థీకరణ ద్వారా గుమ్మం వద్దకే ప్రజలకు ప్రభుత్వ సేవలను అందిస్తున్నారు. చేసిన మంచిని ప్రతి ఇంటా వివరించి.. ఆశీర్వాదం తీసుకోవడానికి చేపట్టిన ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గత 58 నెలల పాలనలో వచ్చిన విప్లవాత్మక మార్పులు ప్రతి నియోజవకర్గం, ప్రతి గ్రామం, ప్రతి ఇంటా కనిపిస్తున్నప్పుడు 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్సభ స్థానాల్లో విజయం సాధించడం సుసాధ్యమేనని సీఎం జగన్.. శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్లలో నిర్వహించిన సిద్ధం సభలకు సముద్రంతో పోటీ పడుతూ జనం హాజరయ్యారు. రాప్తాడు, మేదరమెట్ల సభలు రాష్ట్ర చరిత్రలో అతి పెద్ద ప్రజా సభలుగా నిలిచాయి. ఎన్నికలకు ముందే వైఎస్సార్సీపీ ప్రభంజనం ‘సిద్ధం’ సభల్లో కళ్లకు కట్టినట్లు కన్పించడంతో పార్టీ శ్రేణులు కదనోత్సాహంతో కదం తొక్కుతున్నాయి. క్లీన్ స్వీపే లక్ష్యంగా అడుగులు టీడీపీ–జనసేన–బీజేపీ శ్రేణులు నైతిక స్థైర్యం కోల్పోయి కకావికలమైతే.. వైఎస్సార్సీపీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. ఈ దశలో సీఎం జగన్ బస్సు యాత్ర వారిలో మరింత ఉత్సాహాన్ని నింపనుంది. క్లీన్ స్వీప్ లక్ష్యంగా ముఖ్యమంత్రి అడుగులు ముందుకు వేస్తున్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులను ‘మేం సిద్ధం.. మా బూత్ సిద్ధం.. ఎన్నికల సమరానికి మేమంతా సిద్ధం’ పేరుతో గ్రామ స్థాయి నుంచి మరింత పటిష్టంగా ఎన్నికలకు సన్నద్ధం చేసేలా సీఎం జగన్ దిశా నిర్దేశం చేస్తారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 18న విడుదల కానున్న నేపథ్యంలో, ఆలోగా తొలి దశ ప్రచారంగా బస్సు యాత్ర పూర్తి చేయాలని నిర్ణయించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాక మలి విడత ప్రచారాన్ని చేపట్టనున్నారు. టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి కకావికలు వైఎస్సార్సీసీ సిద్ధం సభలు సూపర్ హిట్ కావడంతో టీడీపీ శ్రేణులు కకావికలమయ్యాయి. జననేతతో టీడీపీ పొత్తు లెక్క తేలాక, రెండు పార్టీలు ఉమ్మడిగా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన జెండా సభ జనం లేక అట్టర్ప్లాప్ కావడంతో ఆ పార్టీల శ్రేణులు నైతిక స్థైర్యం కోల్పోయాయి. ఈ క్రమంలోనే ఒకే రోజు 175 శాసనసభ, 24 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన సీఎం వైఎస్ జగన్.. అందులో వంద స్థానాలు అంటే 50 శాతం స్థానాలను బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాలకు ఇవ్వడంతో ఆ వర్గాల్లో హర్షాతిరేకాలు మిన్నంటాయి. శాసనసభ, లోక్సభ నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఇంటింటా ప్రచారం చేస్తూ ప్రజా క్షేత్రంలో దూసుకెళ్తున్నారు. మరో వైపు నైతిక స్థైర్యం కోల్పోయిన శ్రేణుల్లో ధైర్యాన్ని నింపేందుకు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దల కాళ్లావేళ్లా పడి ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకున్నాక.. మూడు పార్టీలు కలిసి చిలకలూరిపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో ప్రధాని మోదీ పాల్గొన్నప్పటికీ జనం మొహం చాటేయడంతో అట్టర్ ప్లాప్ అయ్యింది. దాంతో మూడు పార్టీల కార్యకర్తలే కాదు నేతలూ పూర్తిగా డీలాపడ్డారు. -
సగర్వంగా ఎగిరిన సామాజిక జెండా
సాక్షి, అమరావతి : సార్వత్రిక ఎన్నికల్లో 175 శాసనసభ, 25 లోక్సభ మొత్తం 200 స్థానాలకుగాను సరిగ్గా సగం అంటే 100 స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యర్థులను బరిలోకి దించుతూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం జగన్ సామాజిక న్యాయ పతాకాన్ని ఎగరేశారు. దేశ చరిత్రలో ఇదో రికార్డు. గత ఎన్నికల తరహాలోనే శనివారం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని మహానేత వైఎస్సార్ సమాధి వద్ద నివాళులు అర్పించిన సీఎం జగన్.. మంత్రి ధర్మాన, ఎంపీ నందిగం సురేష్ లతో ఒకేసారి 175 శాసనసభ, 24 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటింపజేశారు. సామాజిక మహా విప్లవం ► నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ ఆ వర్గాలను అక్కున చేర్చుకుంటూ వారి సాధికారతకు బాటలు వేసిన సీఎం జగన్.. సార్వత్రిక ఎన్నికల్లో 175 శాసనసభ స్థానాలకుగాను 29 స్థానాల్లో ఎస్సీ, 7 స్థానాల్లో ఎస్టీ, 48 స్థానాల్లో బీసీ వర్గాలకు చెందిన అభ్యర్థులను బరిలోకి దించారు. మొత్తం 84 శాసనసభ స్థానాలను ఆ వర్గాలకు కేటాయించారు. ఇందులో 7 స్థానాల్లో మైనార్టీలకు, మొత్తంగా మహిళలకు 19 స్థానాల్లో అవకాశం ఇచ్చారు. గత ఎన్నికల్లో ఎస్సీలకు 29, ఎస్టీలకు 7, బీసీలకు 41 స్థానాలు వెరసి ఆ వర్గాలకు 77 స్థానాలను కేటాయించారు. వీటిని పరిశీలిస్తే గత ఎన్నికల కంటే ఇప్పుడు 7 స్థానాలు అధికంగా ఆ వర్గాలకు కేటాయించారు. గత ఎన్నికల కంటే ఇప్పుడు మహిళలకు అదనంగా 4 స్థానాలు, మైనార్టీలకు అదనంగా 2 స్థానాలు కేటాయించారు. ► 25 ఎంపీ స్థానాలకుగాను 4 స్థానాల్లో ఎస్సీ, ఒక స్థానంలో ఎస్టీ, 11 స్థానాల్లో బీసీ వర్గాలకు చెందిన వారిని అభ్యర్థులుగా ఎంపిక చేశారు. అంటే.. మొత్తం 16 లోక్సభ స్థానాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించినట్లు స్పష్టమవుతోంది. గత ఎన్నికల్లో ఎస్సీలకు 4, ఎస్టీలకు 1, బీసీలకు ఏడు వెరసి 12 స్థానాలను ఆ వర్గాలకు కేటాయించారు. వీటిని పరిశీలిస్తే గత ఎన్నికల కంటే ఇప్పుడు ఆ వర్గాలకు అదనంగా 4 స్థానాలు కేటాయించారు. గత ఎన్నికల్లో లోక్సభ అభ్యర్థినులుగా 4 చోట్ల మహిళలకు అవకాశం కల్పిస్తే.. ఇప్పుడు 5 స్థానాలను కేటాయించారు. చంద్రబాబు, పవన్ సామాజిక ద్రోహం సీఎం జగన్ను ఒంటరిగా ఎదుర్కోవడానికి చంద్రబాబు భయపడి జనసేనతో జట్టుకట్టారు. అయినా ఘోర పరాజయం తప్పదని గ్రహించి.. అవినీతి కేసుల నుంచి బయటపడొచ్చనే వ్యూహంతో బీజేపీ పెద్దల కాళ్లావేళ్లాపడి వార్టితో పొత్తు పెట్టుకుని జనసేనకు 21, బీజేపీకి పది శాసనసభ స్థానాలు కేటాయించారు. 144 స్థానాల్లో టీడీపీ పోటీ చేసేలా లెక్క తేల్చారు. ఈ కూటమి ఇప్పటిదాకా 135 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తే అందులో బీసీలు కేవలం 25 (టీడీపీ 24, జనసేన 1) మంది, మైనార్టీలు కేవలం ముగ్గురే ఉండటం గమనార్హం. ఆ మూడు పార్టీలు ఖరారు చేయాల్సిన స్థానాలు ఇంకా 40 మాత్రమే మిగిలాయి. వాటిలో ఒకట్రెండు స్థానాలు మాత్రమే బీసీలకు కేటాయించే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు, పవన్ మరోసారి బీసీలకు వెన్నుపోటు పొడిచి, ఆ వర్గాలకు ద్రోహం చేసినట్లు స్పష్టమవుతోంది. చట్టం చేసి మరీ నామినేటెడ్ పదవులు ఇచ్చిన తరహాలోనే.. మంత్రివర్గం కూర్పుతోనే సామాజిక న్యాయానికి నాంది పలికిన సీఎం జగన్.. కేబినెట్ నుంచి స్థానిక సంస్థల వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, మహిళలకు పెద్దపీట వేసి, పరిపాలనలో భాగస్వామ్యం కల్పిస్తూ సామాజిక విప్లవాన్ని ఆవిష్కరించారు. నామినేటెడ్ పదవుల్లో, పనుల్లో 50 శాతం రిజర్వేషన్ చేస్తూ చట్టం చేయడం దేశ చరిత్రలోనే ప్రథమం. నా నా అంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు.. మహిళలకు పదవులు, పనులు ఇచ్చారు. ఇప్పుడు 175 అసెంబ్లీ, 24 ఎంపీ స్థానాలు కలిపి 200 స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారికి 50 శాతం కేటాయించి సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించారు. దేశ చరిత్రలో ఎన్నడూ కనివిని ఎరుగని రీతిలో సీఎం జగన్ సామాజిక న్యాయం చేశారని రాజకీయ పరిశీలకులు ప్రశంసిస్తున్నారు. అన్ని వర్గాలకు ఊతం.. అందుకే గెలుపు ఖాయం గత 58 నెలలుగా అర్హతే ప్రామాణికంగా.. వివక్ష, అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో అన్ని వర్గాల పేదల ఖాతాల్లో రూ.2.70 లక్షల కోట్లను సీఎం జగన్ జమ చేశారు. నాన్ డీబీటీ రూపంలో మరో రూ.1.79 లక్షల కోట్లు.. వెరసి రూ.4.49 లక్షల కోట్ల ప్రయోజనం చేకూర్చడం ద్వారా అన్ని వర్గాల పేదల అభివృద్ధికి ఊతమిచ్చారు. విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక మార్పులతో రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే.. అందులో 2.13 లక్షల ఉద్యోగులను గత 58 నెలల్లోనే నియమించారు. గత 58 నెలల పాలనలో ప్రతి ఇంట్లో ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు కళ్లకు కట్టినట్లు కని్పస్తున్నాయి. మీ బిడ్డ పాలనలో మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డను ఆశీర్వదించండి అంటూ వినమ్రంగా కోరుతూ సార్వత్రిక ఎన్నికల్లో 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా సీఎం జగన్ సమర భేరి మోగించారు. ఇందులో భాగంగా భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్లలో నిర్వహించిన సిద్ధం సభలు ఒకదానికి మంచి మరొకటి విజయవంతమయ్యాయి. టీడీపీ–జనసేన తొలిసారిగా తాడేపల్లిగూడంలో ఉమ్మడిగా నిర్వహించిన జెండా సభ జనం లేక అట్టర్ ఫ్లా్లప్ అయ్యింది. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించడం తథ్యమని టైమ్స్నౌ–ఈటీజీ, జీన్యూస్–మారిటైజ్ వంటి డజనుకుపైగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థల సర్వేలు తేల్చి చెబుతున్న నేపథ్యంలో ఎన్నికల్లో జగన్ ఎగరేసిన సామాజిక న్యాయ పతాకం రెపరెపలాడటం ఖాయమని రాజకీయ పరిశీలకులు విశ్లేíÙస్తున్నారు. -
ఇడుపులపాయలో సీఎం వైఎస్ జగన్ (ఫోటోలు)
-
అభ్యర్థుల ప్రకటన తర్వాత సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
-
మహిళా ప్రాతినిధ్యం మరింత పెంచుతాం: సీఎం జగన్
సాక్షి, ఇడుపులపాయ: వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల జాబితా చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. రాష్ట్రంలో మహిళల కోసం ఎంతో చేశాం. వారికి ఎంతో సామాజిక న్యాయం చేసినా అది కూడా నాకు సంతృప్తిని ఇవ్వడంలేదన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో మహిళల కోసం మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తామన్నారు. ఈ స్థాయిలో మార్పులు చేయగలిగిన ధైర్యం ఎవరికీ ఉండకపోవచ్చు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఇంత ధైర్యం ఉందని, ప్రజల మీద ఆ మేరకు నమ్మకం ఉందని కూడా చెప్పడానికి సంతోషపడుతున్నాను అని అన్నారు. కాగా, ఇడుపులపాయలో వైఎస్సార్సీపీ అభ్యర్థుల ప్రకటన అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈరోజు రిలీజ్ చేస్తున్న ఈ లిస్టు 25 పార్లమెంట్ స్థానాలకు, 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన లిస్టు ఇది. ఇందులో ఒకే ఒక అనకాపల్లి ఎంపీ స్థానం ఒక్కటి పెండింగ్ పెట్టాం. మిగతావి లిస్ట్ అనౌన్స్ అయినట్లే. ఎప్పుడూ చూడని విధంగా సామాజిక న్యాయం అన్నది మాటల్లోనే కాదు.. చేతల్లో కూడా చేసి చూపించగలిగాం దేవుడి దయతో అని చెప్పడానికి సంతోషపడుతున్నా. 50 శాతం కచ్చితంగా నా అని సంబోధిస్తూ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు కచ్చితంగా అమలయ్యేలా చట్టం చేసిన ప్రభుత్వం మనది. మొత్తం ఈరోజు 200 స్థానాలకు గానూ 100 స్థానాలు అంటే 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చాం నా అని పిలుచుకుంటూ 50 శాతం సీట్లు ఏకంగా వీరికే ఇవ్వగలగడం ఇది చరిత్రలో, ఆంధ్ర రాష్ట్ర హిస్టరీలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని ఘట్టం. ఏకంగా 59 స్థానాలు బీసీలకే కేటాయింపులు చేశాం. 175 అసెంబ్లీ స్థానాలకు 48 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు గానూ 11 స్థానాలుబీసీలకే కేటాయింపులు జరిగింది. మహిళలకు ఇంతకుముందుకన్నా బెటర్గా చేశాం. ఇది కూడా నాకు సంతృప్తిని కలిగించడం లేదు. వచ్చే ఎన్నికలు వచ్చే సరికి ఇంకా వేగంగా అడుగులు వేయించే కార్యక్రమం చేస్తున్నాం. 200 స్థానాలకు 22 స్థానాలు అంటే 12 శాతం అక్కచెల్లెమ్మలకు ఇవ్వగలిగాం. లాస్ట్ టైమ్ కన్నా బెటర్గా చేశాం, 19ఇస్తే ఈసారి 24 దాకా తీసుకుపోగలిగాం. ఇది కూడా ఒక విశేషం అనే చెప్పాలి. వచ్చే ఎన్నికలు వచ్చేటప్పటికి ఇంకా పెద్ద సంఖ్యలో నంబర్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఏకంగా 77 శాతం మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు.. గ్రాడ్యుయేట్లు, ఆపై చదువులు చదివిన వారు. ఎమ్మెల్యేలకు సంబంధించి 175 మంది ఎమ్మెల్యేలకు గానూ 75 శాతం గ్రాడ్యుయేట్లు, ఆ పై చదువులు చదివిన వారిని మనం ఎంపిక చేయగలిగాం. మైనార్టీలకు ఇంతకు ముందు 5 స్థానాలిస్తే ఇవాళ 7 స్థానాలకు పెంచగలిగాం. మొత్తం మీద 50 శాతం నా నా నా అని పిలుచుకుంటూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇవ్వడం చరిత్రలో నిలిచిపోతుందని చెబుతున్నా. ఈ ఎన్నికల్లో దాదాపు 81 స్థానాల్లో ఎమ్మెల్యేల మార్పు, 18 ఎంపీ స్థానాల మార్పు జరిగింది. దాదాపుగా 50 శాతం స్థానాల్లో మార్పులు చేశాం. ఇది కూడా చరిత్రలో నిలిచిపోయే ఘట్టమే. ఈ స్థాయిలో మార్పులు చేయగలిగిన ధైర్యం ఎవరికీ ఉండకపోవచ్చేమో. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ధైర్యం ఉందని, ప్రజల మీద ఆ మేరకు నమ్మకం ఉందని కూడా చెప్పడానికి సంతోషపడుతున్నా. మార్పు కాబడిన వారికి, టికెట్ రాని వారికి మనస్పూర్తిగా చెబుతున్నా. రాబోయే రోజుల్లో దేవుడి దయతో, ప్రజలందరి ఆశీస్సులతో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్లందరికీ సముచిత స్థానం ఇస్తూ ఏదో ఒక రూపంలో దగ్గరకు తీసుకునే కార్యక్రమం జరుగుతుందని వాళ్లందరికీ భరోసా ఇస్తున్నా. కనీవినీ ఎరుగని విప్లవాత్మక మార్పులతో ఈ ఐదు సంవత్సరాల పాలన జరిగింది. రూ.2.70 లక్షలకోట్లు నేరుగా బటన్ నొక్కడం, ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్లి పోవడం జరిగింది. రాష్ట్ర చరిత్రలో ఇది ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడూ జరగని ఘట్టం. లంచాలు లేకుండా ఇవ్వడం సాధ్యమేనా? వివక్ష లేకుండా ఇవ్వగలుగుతారా? అనే పరిస్థితి నుంచి కాదు.. ఇది సాధ్యమే అని 5 సంవత్సరాల పరిపాలనలో గ్రామ స్థాయిలో గ్రామ సచివాలయాలు, 50-60 ఇళ్లకు వాలంటీర్ వ్యవస్థ తీసుకుని రావడం, వీటన్నిటి ద్వారా పారదర్శకత, లంచాలు, వివక్షకు చోటు లేని వ్యవస్థ ద్వారా రూ.2.70 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెయ్యడం అనేది దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విషయంగా గుర్తుండిపోతుంది. ఈ ఒక్కటే కాకుండా గ్రామాలు మారాయి, గ్రామాల్లో పరిస్థితులుమారాయి, స్కూళ్లు, ఆస్పత్రులు బాగుపడ్డాయి. వ్యవసాయం బాగుపడింది. ఉమెన్ ఎంపవర్ మెంట్ జరిగింది. సామాజిక న్యాయం అన్నది మాటలకు కాదు.. మొట్టమొదటిసారిగా సాధ్యమే అని చేసి చూపించిన ప్రభుత్వంగా ఈరోజు వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడగలిగిందని చెప్పడానికి గర్వపడుతున్నా. వీటన్నిటివల్ల ప్రస్పుటమైన మార్పులు ప్రతి గ్రామంలో కనిపిస్తున్నాయి. ఈ మార్పులన్నింటి వల్ల దేవుడి ఆశీస్సులతో మళ్లీ 2-3 నెలల్లో కచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తాం. సామాజిక న్యాయం అన్నది ఇంకా గొప్ప స్థాయిలోకి తీసుకుని పోయే అడుగులు కూడా వేస్తాం అని చెబుతూ అందరితో సెలవు తీసుకుంటున్నా’ అని అన్నారు. -
భావోద్వేగంతో తండ్రి ముందు మోకరిల్లిన సీఎం జగన్
-
YSRCP సిద్ధం : 175 ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా
వైఎస్సార్, సాక్షి: అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల జాబితాను ప్రకటించింది వైఎస్సార్సీపీ. శనివారం ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వేదికగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ప్రకటన వెలువడింది. 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాల్ని చదివి వినిపించారు ధర్మాన ప్రసాదరావు. సామాజిక సమీకరణాలు.. సర్వేల ఆధారంగా సేకరించిన అభ్యర్థుల గెలుపోటములను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేసినట్లు ప్రకటించింది పార్టీ అధిష్టానం. 175 అసెంబ్లీ సీట్లు గెలవడమే లక్ష్యంగా వైనాట్ 175 నినాదంతో ఈ ఎన్నికలకు వెళ్తున్నట్లు పార్టీ ప్రకటించింది. (జిల్లా మీద నొక్కండి.. అభ్యర్థుల పేర్లను చూడండి) శ్రీకాకుళం అభ్యర్థుల జాబితా విజయనగరం అభ్యర్థుల జాబితా పార్వతీపురం మన్యం జిల్లా అభ్యర్థుల జాబితా విశాఖపట్నం అభ్యర్థుల జాబితా అనకాపల్లి అభ్యర్థుల జాబితా అల్లూరి అభ్యర్థుల జాబితా కాకినాడ అభ్యర్థుల జాబితా తూర్పు గోదావరి అభ్యర్థుల జాబితా కోనసీమ అభ్యర్థుల జాబితా పశ్చిమ గోదావరి అభ్యర్థుల జాబితా ఏలూరు అభ్యర్థుల జాబితా ఎన్టీఆర్ అభ్యర్థుల జాబితా కృష్ణా అభ్యర్థుల జాబితా గుంటూరు అభ్యర్థుల జాబితా పల్నాడు అభ్యర్థుల జాబితా బాపట్ల అభ్యర్థుల జాబితా ప్రకాశం జిల్లా అభ్యర్థుల జాబితా నెల్లూరు అభ్యర్థుల జాబితా తిరుపతి అభ్యర్థుల జాబితా చిత్తూరు అభ్యర్థుల జాబితా అన్నమయ్య అభ్యర్థుల జాబితా వైఎస్సార్ జిల్లా అభ్యర్థుల జాబితా నంద్యాల అభ్యర్థుల జాబితా కర్నూలు అభ్యర్థుల జాబితా అనంతపురం అభ్యర్థుల జాబితా శ్రీసత్యసాయి అభ్యర్థుల జాబితా ఏపీ 175.. అన్ని పార్టీల పూర్తి జాబితా కోసం క్లిక్ చేయండి -
Watch Live: ఇడుపులపాయలో వైఎస్సార్ సీపీ అభ్యర్థుల ప్రకటన
-
సీఎం జగన్ ఇడుపులపాయ షెడ్యూల్
-
ఇడుపులపాయ:క్రిస్మస్ ప్రార్థనల్లో సీఎం జగన్
-
ఇడుపులపాయలో సీఎం వైఎస్ జగన్
-
ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్లను ప్రారంభించిన సీఎం జగన్
-
ఇడుపులపాయలో రెండో రోజు సీఎం జగన్ (ఫొటోలు)
-
నాన్నా.. మీ ఆశయాలే నన్ను నడిపిస్తున్నాయ్: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: దివంగత మహానేత వైస్ రాజశేఖర్రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భావోద్వేగంగా స్పందించారు. ‘‘నాన్నా... మీరు లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది’’ అంటూ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారాయన. భౌతికంగా మా మధ్య లేకపోయినా.. ప్రజల గుండెల్లో చిరకాలం జీవించే లీడర్ మీరు. మీ పట్ల ప్రజలకున్న ప్రేమాభిమానాలు నాకు కొండంత అండగా నిలిచాయి. మీ ఆశయాలే సంక్షేమం, సమగ్రాభివృద్ధి లక్ష్యాల సాధనలో నన్ను చేయిపట్టి నడిపిస్తున్నాయి. వర్ధంతి సందర్భంగా మీకు ఘనంగా నా నివాళులు నాన్నా అంటూ ట్వీట్లో పేర్కొన్నారాయన. నాన్నా… మీరు లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది. భౌతికంగా మా మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో చిరకాలం జీవించే లీడర్ మీరు. మీ పట్ల ప్రజలకున్న ప్రేమాభిమానాలు నాకు కొండంత అండగా నిలిచాయి. మీ ఆశయాలే సంక్షేమం, సమగ్రాభివృద్ధి లక్ష్యాల సాధనలో నన్ను చేయిపట్టి నడిపిస్తున్నాయి. వర్ధంతి… pic.twitter.com/Fq1Ngg4f5Q — YS Jagan Mohan Reddy (@ysjagan) September 2, 2023 ఇక వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయకు కుటుంబ సభ్యులతో పాటు వైఎస్సార్ అభిమానగణం తరలివెళ్తోంది. సీఎం జగన్ కూడా వైఎస్సార్ ఘాట్ వద్దకు వెళ్లి నివాళులు అర్పించనున్నారు. -
YSR : ఇడుపులపాయలో వైఎస్సార్కు సీఎం జగన్ నివాళి
సాక్షి, అమరావతి/ వైఎస్సార్: దివంగత మహానేత, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. సతీసమేతంగా ఇడుపులపాయ వెళ్లిన సీఎం జగన్.. తల్లి వైఎస్ విజయమ్మ, మరికొందరు కుటుంబ సభ్యులు, మంత్రులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు ఆయన తన ట్విటర్ ఖాతాలో తండ్రి వైఎస్సార్ను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు నాన్నా… మీరు లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది. భౌతికంగా మా మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో చిరకాలం జీవించే లీడర్ మీరు. మీ పట్ల ప్రజలకున్న ప్రేమాభిమానాలు నాకు కొండంత అండగా నిలిచాయి. మీ ఆశయాలే సంక్షేమం, సమగ్రాభివృద్ధి లక్ష్యాల సాధనలో నన్ను చేయిపట్టి నడిపిస్తున్నాయి. వర్ధంతి… pic.twitter.com/Fq1Ngg4f5Q — YS Jagan Mohan Reddy (@ysjagan) September 2, 2023 ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, మేడా మల్లికార్జున రెడ్డి, రఘురామిరెడ్డి, పీజేఆర్ సుధాకర్ బాబు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్ మల్లికార్జున రెడ్డి, మేయర్ సురేష్ బాబు హాజరయ్యారు. చదవండి: Johar ysr: అజేయుడు -
Idupulapaya YSR Ghat: వైఎస్సార్కు సీఎం జగన్ నివాళులు (ఫొటోలు)
-
Idupulapaya YSR Ghat: వైఎస్సార్కు సీఎం జగన్ నివాళులు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దివంగత మహానేత వైఎస్సార్కు నివాళులర్పించారు. ఈరోజు(శనివారం) అనంతపురం జిల్లా పర్యటన ముగించుకుని నేరుగా సీఎం జగన్ వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులర్పించారు. జూలై 8న దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి. ఈ నేపథ్యంలో తన అనంత పర్యటన ముగిసిన వెంటనే.. వైఎస్సార్ ఘాట్కు చేరుకుని నివాళులు అర్పించారు. సీఎం జగన్తో పాటు ఆయన సతీమణి వైఎస్ భారతి, తల్లి వైఎస్ విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. చదవండి: మీ స్ఫూర్తి చేయిపట్టి నడిపిస్తోంది నాన్న.. సీఎం జగన్ భావోద్వేగ ట్వీట్ -
వైఎస్సార్కు నివాళులర్పించిన వైఎస్ విజయమ్మ, షర్మిల
సాక్షి, వైఎస్సార్ జిల్లా: దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి 74వ జయంతి వేడుకలను ఇడుపులపాయలో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ విజయమ్మ, షర్మిల నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుటుంబసభ్యులు, బంధువులు, అభిమానులు పాల్గొన్నారు. ►పులివెందులలో వైఎస్సార్ విగ్రహానికి ఎంపీ అవినాష్రెడ్డి పూలమాల వేసి నివాళర్పించారు. ►దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా కళ్యాణదుర్గంలో అనంతపురం జిల్లా నిర్వహించే వైఎస్సార్ రైతు దినోత్సవంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. 2022 ఖరీఫ్లో నష్టపోయిన రైతులకు పంటల భీమా పరిహారాన్ని అందించనున్నారు. ఏపీ మోడల్ స్కూల్ సమీపంలో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు చేరుకుని డాక్టర్ వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ను ప్రారంభిస్తారు. ► అనంతపురం జిల్లాలో కార్యక్రమం అనంతరం వైఎస్సార్ జిల్లా పర్యటనకు సీఎం జగన్ బయలుదేరనున్నారు. మధ్యాహ్నం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్కు చేరుకుని మహానేత వైఎస్సార్కు నివాళులర్పిస్తారు. నేటి నుంచి 10వ తేదీ వరకు ఆ జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. -
ఇంటింటికెళ్లి సంక్షేమ పథకాల అమలు తీరుపై ఆరా తీసిన ఎంపీ అవినాష్ రెడ్డి
-
YSR Kadapa: కడప జిల్లా పర్యటనకు సీఎం జగన్
సాక్షి, వేంపల్లె (వైఎస్సార్ కడప): సెప్టెంబర్ 1, 2 తేదీలలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా ఇడుపులపాయకు రానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజు పేర్కొన్నారు. మంగళవారం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్, గెస్ట్ హౌస్, నెమళ్ల పార్కు తదితర ప్రాంతాలను ఆయన జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ, పాడా ఓఎస్డీ అనిల్కుమార్రెడ్డి, పులివెందుల ఆర్డీఓ వెంకటేశులు, జెడ్పీటీసీ రవికుమార్రెడ్డిలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం పర్యటనకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నిర్ణయించిన మేరకే అధికారులను, ప్రజాప్రతినిధులను అనుమతించాలన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సీఎం పర్యటనను విజయవంతం చేయాలని తెలిపారు. ఇంకా అధికారికంగా ముఖ్యమంత్రి షెడ్యూల్ వివరాలు రావాల్సి ఉందన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా ఉండకుండా చురుగ్గా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డబ్లు్యఎస్ ఈఈ సిద్ధారెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖరరెడ్డి, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. చదవండి: (మహనీయులకు మరణం ఉండదు: సీఎం జగన్) -
ఐరన్లెగ్ అన్నారు.. ఇప్పుడు మంత్రిని అయ్యా: ఆర్కే రోజా
సాక్షి, వైఎస్సార్ కడప: మహానేతతో కలిసి పని చేసే అదృష్టం దక్కకపోయినా.. వైఎస్ జగన్ ఆశీర్వాదంతో మంత్రిని అయ్యానని సంతోషం వ్యక్తం చేశారు పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. శుక్రవారం ఇడుపులపాయలో దివంగత నేత వైఎస్సార్కు నివాళులు అర్పించిన అనంతరం.. ఆమె మీడియాతో మాట్లాడారు. కడప నేను పుట్టిన ఊరు. టీడీపీలో ఉన్నప్పుడే మహానేత వైఎస్సార్ నన్ను తన పార్టీలోకి రమ్మని ఆహ్వానించారు. ఆయనతో కలిసి రాజకీయాల్లో పని చేయాలని కలగన్నా. ఆయన అకాలమరణంతో ఆ అవకాశం రాకపోవడంతో చాలా బాధపడ్డా. ఆ టైంలో ఐరన్ లెగ్ అంటూ నన్ను టీడీపీ వాళ్లు అవహేళన చేశారు. వైఎస్సార్ నాకు దేవుడు. ఆయన ఆశయాల సాధన కోసం పుట్టిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్. ఆ దివంగత మహానేత ఆశీస్సుల కోసమే ఇడుపులపాయనూ సందర్శించా. ఎమ్మెల్యే కావాలన్నది తన కల అని, ఏకంగా రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యానని, ఇప్పుడు సీఎం జగన్ ఆశీర్వాదరంతో మంత్రిని కూడా అయ్యానంటూ ఆమె సంతోషం వ్యక్తం చేశారు. జగనన్న మంత్రి వర్గంలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్న మంత్రి ఆర్కే రోజా.. పార్టీ విజయం కోసం అహర్నిశలు పని చేస్తానని చెప్పారు. గతంలో ఒంటిమిట్ట రథోత్సవానికి వచ్చినప్పుడు.. వైఎస్ జగన్ను సీఎం చేయాలని భగవంతుడ్ని వేడుకున్నానని, ఆ కోరిక నెరవేర్చినందుకు కళ్యాణోత్సవానికి హజరయ్యానని ఆమె చెప్పారు. ఇకపై జబర్దస్త్ చేయరా అని చాలా మంది అడుతున్నారని, కానీ.. పది మందికి ఉపయోగ పడటం కోసం ఒకటి వదులుకోక తప్పదని ఆమె చెప్పారు. ఆర్థిక పురోగతి సాధించే విధంగా ఏపీలో పథకాలు అమలు అవుతున్నాయని పేర్కొన్న మంత్రి రోజా.. లోకల్ బాడీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అవడానికి జగనన్న అమలు చేసిన సంక్షేమ పథకాలే కారణమని స్పష్టం చేశారు. -
క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న సీఎం జగన్
Live Updates: 11.20 AM ► ప్రత్యేక క్యాలెండర్ను ఆవిష్కరించిన సీఎం జగన్ ► చర్చి కాంపౌండ్లో షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం ► క్రిస్మస్ సందర్భంగా చర్చ్లో కేక్ కట్ చేసిన సీఎం జగన్ 9.45 AM ► పులివెందుల భాకరాపురం సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ► క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, వైఎస్ అవినాష్రెడ్డి పాల్గొన్నారు. సాక్షి, వైఎస్సార్ కడప: ఉదయం 9.05 గంటలకు సీఎం వైఎస్ జగన్ ఇడుపుల పాయ హెలిప్యాడ్ నుంచి బయలుదేరి 9.25 గంటలకు పులివెందులకు చేరుకుంటారు. 9.45 నుంచి 11.05 గంటల వరకు సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొంటారు. 11.15 గంటల వరకు సీఎస్ఐ చర్చి కాంపౌండ్లో ఏర్పా టు చేసిన షాపింగ్ కాంప్లెక్స్ను ప్రారంభిస్తారు. 11.25 గంటలకు విజయా గార్డెన్స్కు చేరుకుని సారెడ్డి వరప్రసాద్రెడ్డి కుటుంబ సభ్యుల వివాహ రిసెప్షన్కు హాజరవుతారు. 11.50 నుంచి 12.50 గంటల వరకు భాకరాపురంలోని నివాసంలో గడుపుతారు.1.35 గంటలకు కడప ఎయిర్పోర్టుకు చేరుకుని విజయవాడకు వెళతారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) –పులివెందుల -
మహానేత వైఎస్సార్కు సీఎం ఘన నివాళి
వేంపల్లె : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా రెండోరోజు శుక్రవారం ఉదయం ఇడుపులపాయలోని మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు. అంతకు ముందు వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డిలు నివాళులర్పించారు. అనంతరం ఇడుపులపాయలోని నెమళ్ల పునరుత్పత్తి కేంద్రం పక్కన ఉన్న చర్చిలో ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో సీఎం జగన్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. పాస్టర్లు బెనహరబాబు, నరేష్, మృత్యుంజయలు ప్రార్థనలు చేశారు. అనంతరం సీఎం జగన్ బంధువులతో కొద్దిసేపు ముచ్చటించారు. ఆ తర్వాత వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పులివెందుల వెళ్లారు. తిరిగి సాయంత్రం 5.45 గంటలకు ఇడుపులపాయ చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద సుమారు గంటపాటు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులతో ఆప్యాయంగా మాట్లాడారు. ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం గెస్ట్హౌస్ చేరుకుని రాత్రికి అక్కడే బస చేశారు. నేడు శనివారం పులివెందుల సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్నారు. ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి -
వైఎస్ఆర్ ఘాట్ లో నివాళులు అర్పించిన వైఎస్ విజయమ్మ
-
ఇడుపులపాయకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్
వేంపల్లె: తన మామ, దివంగత డాక్టర్ ఈసీ గంగిరెడ్డి ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం గన్నవరం నుంచి బయలుదేరి సాయంత్రం 4.40 గంటలకు వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయకు చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రికి కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. వారందరినీ ఆయన ఆప్యాయంగా పలకరించారు. వారు ఇచ్చిన వినతులు స్వీకరించారు. సాయంత్రం 5.28 గంటలకు ఇడుపులపాయలోని అతిథి గృహానికి బయలుదేరి వెళ్లారు. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ చేరుకొని స్థానికులతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదివారం ఉదయం పులివెందులలో జరిగే డాక్టర్ ఈసీ గంగిరెడ్డి సంస్మరణ సభకు హాజరు కానున్నారు. ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో ఎమ్మెల్సీలు జకియా ఖానం, రమేష్ యాదవ్, వెన్నపూస గోపాల్రెడ్డి, ఎమ్మెల్యేలు ఎస్.రఘురామిరెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, రవీంద్రనాథరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, రఘురామిరెడ్డి, బిజేంద్రనాథరెడ్డి, పరిశ్రమల శాఖ సలహాదారు రాజోలి వీరారెడ్డి, ఆర్టీసీ చైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ నేత వైఎస్ మనోహర్రెడ్డి, పాడా ఓఎస్డీ అనిల్కుమార్రెడ్డి, పలువురు స్థానిక నేతలు ఉన్నారు. -
ఇడుపులపాయకు చేరుకున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి: రెండు రోజుల వైఎస్సార్ కడప జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్లో ఇడుపులపాయకు చేరుకున్నారు. ఇడుపులపాయ హెలిప్యాడ్ వద్ద నేతలు, ప్రజలను కలిసిన సీఎం జగన్.. సమస్యలపై వారి నుంచి వినతులు స్వీకరిస్తూ ఆప్యాయంగా పలకరించారు. బుధవారం రాత్రి ఇక్కడి గెస్ట్హౌస్లో సీఎం వైఎస్ జగన్ బస చేస్తారు. అంతకుముందు కడప విమానాశ్రయంలో సీఎం జగన్కు జిల్లా కలెక్టర్ విజయరామ రాజు, ఎస్పీ అన్బురాజన్ ఎమ్మెల్యే లు రవీంద్రనాధ్ రెడ్డి, సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీలు రామచంద్రయ్య, అధికారులు స్వాగతం పలికారు. గురువారం తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని ఉదయం 9.35 గంటలకు వైఎస్సార్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్ నివాళులర్పిస్తారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. తార్వత పార్టీ నాయకులతో మాట్లాడి.. తిరిగి అక్కడి నుంచి బయల్దేరి, మధ్యాహ్నం 12.45కు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. చదవండి: విత్తనం నుంచి విక్రయం వరకు రైతుకు అండగా నిలవాలి: సీఎం జగన్ -
సీఎం జగన్ రెండు రోజుల కడప జిల్లా పర్యటన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (బుధవారం), ఎల్లుండి(గురువారం) వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కడప బయలుదేరనున్నారు. సాయంత్రం 4.50 గంటలకు ఇడుపులపాయ చేరుకుని పార్టీ నాయకులతో మాట్లాడి, వైఎస్సార్ ఎస్టేట్లోని గెస్ట్హౌస్లో రాత్రికి బస చేస్తారు. గురువారం దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి వర్ధంతి సందర్భంగా ఉదయం 9.30 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొని నివాళులు అర్పించనున్నారు. ఆ తర్వాత పార్టీ నాయకులతో సీఎం జగన్ భేటీ అవుతారు. అదే రోజు ఉదయం 11.30 గంటలకు కడప ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 12.45 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. చదవండి: మూడు రాజధానులకు ప్రభుత్వం కట్టుబడి ఉంది : మేకపాటి గౌతమ్ రెడ్డి -
మహానేత వైఎస్సార్కు వైఎస్ భారతి నివాళి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఇడుపులపాయలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్సార్ జయంతి వేడుకలు నిర్వహించారు. దీనిలో భాగంగా సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి.. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్సార్ జిల్లాలో వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజంపేట మండలంలో రైతు దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జున రెడ్డి, రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్ రెడ్డి రాజంపేట ఎమ్మెల్యే కార్యాలయంలో పార్టీ జెండాను ఎగురవేశారు. -
వైఎస్సార్కు నివాళులర్పించిన వైఎస్ విజయమ్మ, షర్మిల
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఇడుపులపాయలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్సార్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల నివాళర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. తెలంగాణలో మరో రాజకీయ పార్టీ అధికారికంగా ఆవిర్భవిస్తోంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఆయన జయంతి రోజున గురువారం ప్రారంభిస్తున్నారు. పార్టీ ఆవిర్భావ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. జూబ్లీహిల్స్లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో సాయంత్రం 5 గంటలకు వేలాది మంది వైఎస్సార్ అభిమానుల సమక్షంలో వైఎస్ షర్మిల పార్టీ జెండాను ఆవిష్కరించడంతోపాటు ఎజెండాను, తెలంగాణలో ఏ కారణాలతో పార్టీ ఏర్పాటు చేయాల్సి వచ్చిందన్న అంశాన్ని ఈ సందర్భంగా వెల్లడించనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఇడుపులపాయకు చేరుకున్న సీఎం జగన్ ఫొటోలు
-
ఇడుపులపాయకు చేరుకున్న సీఎం జగన్
సాక్షి, వైఎస్సార్: మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇడుపులపాయకు చేరుకున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకున్న సీఎం అక్కడ నుంచి హెలీకాప్టర్ ద్వారా ఇడుపులపాయకు వెళ్లారు. ఆయన వెంట కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాష, ఇంచార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, విప్ కొరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు రవీంద్రారెడ్డి, రఘురామి రెడ్డి, మేడా మలికార్జున రెడ్డి, సుధీర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ జఖియా ఖనం, కత్తి నరసింహ రెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, జిల్లా కలెక్టర్ హరికిరణ్, కర్నూలు రేంజ్ డిఐజి వెంకట్రామి రెడ్డి, స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం జగన్కు ఘన స్వాగతం పలికారు. నేటి రాత్రికి ఇడుపులపాయలోని వైఎస్సార్ అతిథి గృహంలో ముఖ్యమంత్రి బస చేయనున్నారు. (చదవండి: సీఎం వైఎస్ జగన్ కడప పర్యటన షెడ్యూల్) అభివృద్ధి పనులకు శ్రీకారం వైఎస్సార్ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ మూడు రోజుల పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ వివరాలు... ► రూ.3115 కోట్లతో గండికోట-సీబీఆర్, గండికోట-పైడిపాలెం లిఫ్ట్ స్కీంకు శంకుస్థాపన ► రూ.1256 కోట్లతో మైక్రో ఇరిగేషన్కు శంకుస్థాపన ► రూ.34 కోట్లతో పులివెందులలో నూతన ఆర్టీసీ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన ► రూ.36 కోట్లతో తొండూరు బీసీ రెసిడెన్షియల్ స్కూల్కు శంకుస్థాపన ► రూ.46 కోట్లతో పాడా పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనకు శంకుస్థాపన ► రూ.184 కోట్లతో మల్టీ కెనెక్టివిటీ బిటి రోడ్స్కు శంకుస్థాపన ► రూ.14.5 కోట్లతో గండి ఆంజనేయస్వామి క్షేత్రంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన ► రూ.180 కోట్లతో పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన -
వైఎస్సార్కు స్మృత్యంజలి
సాక్షి, కడప: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆయన తనయుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. బుధవారం వైఎస్ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద పూల మాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. బుధవారం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పిస్తున్న సీఎం జగన్, విజయమ్మ, భారతీ రెడ్డి, ఇతర కుటుంబసభ్యులు ► సీఎం వైఎస్ జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి, తల్లి వైఎస్ విజయమ్మ, దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణమ్మ, వైఎస్ సోదరులు వైఎస్ రవీంద్రనాథ్రెడ్డి, వైఎస్ సుధీకర్రెడ్డి తదితరులు ఉదయం 8.50 గంటలకు ఘాట్ వద్దకు చేరుకున్నారు. ► పాస్టర్ రెవరెండ్ నరేష్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్ను స్మరించుకోవడంతోపాటు ప్రజలకు జరిగిన మేలును గుర్తు చేసుకున్నారు. ► వైఎస్ అందించిన విధంగానే ఆయన తనయుడు రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. అదే సందర్భంలో వైఎస్ సతీమణి వైఎస్ విజయమ్మ ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. ► ప్రత్యేక ప్రార్థనల అనంతరం సీఎం వైఎస్ జగన్తోపాటు తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతిరెడ్డి, వైఎస్ జగన్ అత్తమామలు ఈసీ సుగుణమ్మ, ఈసీ గంగిరెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు వైఎస్ ఘాట్ వద్ద పూల మాలలు ఉంచి అంజలి ఘటించారు. ► డిప్యూటీ సీఎం ఎస్బీ అంజాద్బాషా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి, విప్ కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథ్రెడ్డి, ప్రసాద్రాజు, కడప, రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు సురేష్బాబు, ఆకేపాటి అమర్నాథరెడ్డి, ఎమ్మెల్సీలు వెన్నపూస గోపాలరెడ్డి, జకియాఖానమ్, చక్రాయపేట ఇన్చార్జ్ వైఎస్ కొండారెడ్డి, పరిశ్రమల మౌలిక సదుపాయాలు..పెట్టుబడి సలహాదారు రాజోలి వీరారెడ్డి, కలెక్టర్ హరి కిరణ్, డీఐజీ వెంకట్రామిరెడ్డి, ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్, జేసీ గౌతమి, వైఎస్ స్నేహితుడు అయ్యపురెడ్డి సతీమణి సరళాదేవి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ► అందరూ కొద్దిసేపు వైఎస్సార్ను స్మరించుకుంటూ మౌనం పాటించారు. సమీపంలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి సీఎం వైఎస్ జగన్తోపాటు కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ► ఇడుపులపాయలోని గెస్ట్హౌస్ వద్ద పులివెందులకు చెందిన జ్యోతి తన బిడ్డను ఆశీర్వదించాలని కోరగా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైఎస్ భారతిరెడ్డిలు బిడ్డను ఒడిలోకి తీసుకుని ఆశీర్వదించారు. హెలిప్యాడ్ వద్ద సీఎం ప్రజల వినతులు స్వీకరించారు. అనంతరం ముఖ్యమంత్రి విజయవాడకు బయలుదేరారు. పులివెందులకు చెందిన జ్యోతి బిడ్డను ఎత్తుకొని ఆశీర్వదిస్తున్న సీఎం వైఎస్ జగన్ దంపతులు మహానేత జ్ఞాపకాలకు, పథకాలకు ఎప్పటికీ మరణం ఉండదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ట్వీట్ మహానేత వైఎస్సార్ శరీరానికి మరణం ఉంటుంది కానీ, ఆయన జ్ఞాపకాలు, పథకాలకు ఎప్పుడూ మరణం ఉండదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. తన తండ్రి 11వ వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం ఆయన ట్విట్టర్లో... ‘నాన్న మన మధ్య నుంచి దూరమై నేటికి 11 ఏళ్లు. ఆ మహానేత శరీరానికి మరణం ఉంటుంది కానీ ఆయన జ్ఞాపకాలకు, పథకాలకు ఎప్పుడూ మరణం ఉండదు. నా ప్రతి అడుగులోనూ నాన్న తోడుగా ఉంటూ ముందుకు నడిపిస్తూనే ఉన్నారు’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
చిన్నారికి సీఎం దంపతుల ఆశీర్వాదం
సాక్షి, వైఎస్సార్ కడప: సంక్షేమ సారథిగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా నేతగా మన్ననలందుకుంటున్నారు. అన్ని వర్గాల ప్రజలకు ఆప్తుడిగా మారి చేయూతనందిస్తున్నారు. ప్రజా రంజక పాలనతోపాటు తన వద్దకు వచ్చే అభిమానులను చిరునవ్వుతో పలకరిస్తూ తండ్రిని తలపిస్తున్నారు. ఇక ఇడుపులపాయలో మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్ పార్టీ కార్యకర్తలు, స్థానికులతో మాట్లాడారు. వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈక్రమంలోనే జ్యోతి అనే మహిళా అభిమాని సీఎం జగన్ దంపతులను కలుసుకుని తన బాబును ఆశీర్వదించాలని కోరారు. సీఎం వైఎస్ జగన్, వైఎస్ భారతి చిన్నారిని చేతుల్లోకి తీసుకుని ఆశీర్వదించారు. (చదవండి: అంబులెన్స్కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్) -
అదే స్ఫూర్తి.. అదే లక్ష్యం.. అదే గమ్యం
సాక్షి, అమరావతి: ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రతిపక్ష నేత హోదాలో చెప్పిన మాటలను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక నిజం చేస్తూ ప్రజాభ్యుదయమే లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి వడివడిగా అడుగులు వేస్తున్నారు. ‘పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం మా నాన్న గారు ఒక అడుగు ముందుకు వేస్తే.. ఆయన కొడుకుగా నేను రెండు అడుగులు ముందుకు వేస్తాను’ అని చెప్పిన మాటలను నిలుపుకుంటున్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదున్నరేళ్లపాటు ముఖ్యమంత్రిగా పని చేశారు. సంక్షేమానికి సరికొత్త నిర్వచనం ఇచ్చారు. కోటి ఎకరాలకు నీళ్లందించి.. రాష్ట్రాన్ని సుభిక్షం చేయడానికి జలయజ్ఞం కింద 84 ప్రాజెక్టులను చేపట్టి, సింహభాగం పూర్తి చేశారు. రికార్డు స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులు సాధించడం ద్వారా అన్నపూర్ణ నామధేయాన్ని రాష్ట్రానికి సార్థకం చేశారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టులను పూర్తి చేసి.. ఐటీ రంగం, పారిశ్రామికాభివృద్ధికి బాటలు వేయడం ద్వారా ప్రగతి రథాన్ని కొత్త పుంతలు తొక్కించారు. సంక్షేమాభివృద్ధి పథకాల అమలులో టార్చ్ బేరర్(మార్గ నిర్దేశకుడు)గా నిలిచిన వైఎస్ రాజశేఖరరెడ్డి అమరుడై నేటికి 11 ఏళ్లు. ఆ మహానేత దిశానిర్దేశం చేసిన మార్గంలోనే గత 15 నెలలుగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక రీతిలో సంక్షేమాభివృద్ధి పథకాలను పరుగులు పెట్టిస్తున్నారు. మహానేత అడుగుజాడల్లో మచ్చుకు కొన్ని... ► పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నిలుపుకునే దిశగా సీఎం వైఎస్ జగన్ చర్యలు చేపట్టారు. నవరత్నాలతోపాటు 90 శాతం హామీలను ఇప్పటికే అమలు చేస్తున్నారు. ► మహానేత చేపట్టిన ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను మరింత బలోపేతం చేశారు. ఫీజు ఎంతైనా సరే రీయింబర్స్ చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి రెండు వేల చికిత్సలను చేర్చి.. చికిత్స బిల్లు రూ.1,000 దాటితే.. ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. త్వరలో రాష్ట్రమంతటా ఈ విధానం అమలు కానుంది. ► అవ్వాతాతల పెన్షన్ను రూ.వెయ్యి నుంచి రూ.2,250కు పెంచి.. ఏటా రూ.250 చొప్పున రూ.మూడు వేలకు పెంచే ఫైలుపై సంతకం చేశారు. ప్రతి నెలా ఒకటో తేదీన ఉదయాన్నే అర్హులైన అవ్వాతాతలు, వికలాంగులు, వితంతవులకు వలంటీర్ల ద్వారా ఇళ్ల వద్దకే పెన్షన్ అందిస్తున్నారు. ► మహానేత తరహాలోనే ఉచిత విద్యుత్.. తక్కువ వడ్డీకే పంట రుణాలు.. తదితర విషయాల్లో సీఎం వైఎస్ జగన్.. అన్నదాతలకు దన్నుగా నిలుస్తున్నారు. రైతు భరోసా కింద రూ.13,500ను పెట్టుబడిగా ఇస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుతో వ్యవసాయాన్ని పండగగా మార్చారు. ► మహానేత పొదుపు సంఘాలకు భారీ ఎత్తున రుణాలను పావలా వడ్డీకే అందిస్తే.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో అడుగు ముందుకేసి వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు. 2019 ఏప్రిల్ 11 నాటికి బ్యాంకుల్లో పొదుపు సంఘాల మహిళలకు ఉన్న రుణాలను నాలుగు విడతల్లో చెల్లించేలా వైఎస్సార్ ఆసరా పథకాన్ని చేపట్టారు. 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వైఎస్సార్ చేయూత పథకం కింద ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలను అందించే పథకానికి శ్రీకారం చుట్టారు. ఇడుపులపాయ చేరుకున్న సీఎం జగన్ సాక్షి ప్రతినిధి కడప: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబ సభ్యులతో కలసి ఇడుపులపాయకు చేరుకున్నారు. కడప విమానాశ్రయం, ఇడుపులపాయ హెలిప్యాడ్లో ఆయనకు ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, నేతలు ఘన స్వాగతం పలికారు. ఇడుపులపాయ హెలిప్యాడ్ వద్ద సీఎం ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. అక్కడి నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులు, నేతలతో కలిసి నడుస్తూ అతిథి గృహానికి చేరుకున్నారు. బుధవారం ఉదయం 9.45 గంటలకు వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం వైఎస్ జగన్ కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించి, ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు తిరిగి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి చేరుకోనున్నారు. (వేగంగా నైపుణ్యాభివృద్ధి కాలేజీలు) -
మీ ప్రతిభను విన్నాం.. ఇప్పుడు స్వయంగా చూశాం
సాక్షి, కొత్తపేట: వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయ రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ట్రిపుల్ ఐటీ) ప్రముఖ జాతీయ శిల్పి డి.రాజ్కుమార్ వుడయార్ శిల్పకళా ప్రతిభను ప్రశంసించింది. శిల్పి రాజ్కుమార్ తయారు చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కాంస్య విగ్రహాన్ని ఈ నెల 8న ఆయన జయంతి సందర్భంగా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించిన విషయం తెలిసిందే. చాన్సలర్ కేసీ రెడ్డి శిల్పి రాజ్కుమార్ను సీఎం జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రత్యేకంగా సన్మానించేందుకు ఆ కార్యక్రమానికి ఆహ్వానించారు. అయితే కరోనా వైరస్ ఉద్ధృతి నేపథ్యంలో శిల్పి ఆ కార్యక్రమానికి హాజరుకాలేదు. దానితో ట్రిపుల్ ఐటీ తరఫున చాన్సలర్ డాక్టర్ కేసీ రెడ్డి శిల్పి రాజ్కుమార్ ప్రతిభను ప్రత్యేకంగా ప్రశంసిస్తూ లేఖ పంపారు. చిరునవ్వుతో జీవకళ ఉట్టిపడేలా విగ్రహాన్ని రూపొందించారని, మీరు ఎన్నో వైఎస్ విగ్రహాలు తయారుచేసి ఉండవచ్చు గానీ మీరు ఇచ్చిన విగ్రహం మా ట్రిపుల్ ఐటీకి మరింత శోభను తెచ్చిందని పేర్కొన్నారు. శిల్ప కళలో మీ ప్రతిభను విన్నాం.. ఈ విగ్రహం ద్వారా స్వయంగా చూశాం.. మీ ప్రతిభ ఎంతో ప్రశంసనీయం.. మీకు ఇంకా ఎంతో గొప్ప భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాం.. అని ఆ లేఖలో పేర్కొన్నారు. -
మదిలో మహానేత
-
ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ను ఆదర్శంగా తీసుకోవాలి
-
నాలో..నాతో..YSR
-
వైఎస్సార్కు ముఖ్యమంత్రి జగన్ నివాళి
-
వైఎస్సార్కు కుటుంబ సభ్యుల నివాళి
-
‘అమ్మ నాన్నను చూసిన విధానమే ఈ పుస్తకం’
సాక్షి, ఇడుపులపాయ: దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజమమ్మ రాసిన "నాలో.. నాతో వైఎస్సార్" పుస్తకాన్ని ముఖ్యమంత్రి జగన్ బుధవారం ఆవిష్కరించారు. అంతకుముందు వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు. పుస్తకావిష్కరణ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘నాన్న జయంతిని పురస్కరించుకుని అమ్మ.. నాన్నను చూసిన విధంగా.."నాలో.. నాతో వైఎస్ఆర్'' రచన చేశారు. గొప్ప రాజకీయ నేతగా అందరికీ పరిచయం అయిన వ్యక్తి వైఎస్సార్. ఆయనలో ఉన్న గొప్పతనాన్ని అమ్మ ఆవిష్కరించారు. ఇది ఒక మంచి పుస్తకం’అని పేర్కొన్నారు. (చదవండి: ఎన్నటికీ మరువం రాజన్న!) వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ.. ‘నాకు వైఎస్సార్లో ఉన్న మానవత్వం రాయాలనిపించింది. ఆయన మాటకు ఇచ్చే విలువ రాయాలనిపించింది. ఎంతో మంది జీవితాలకు వైఎస్సార్ వెలుగు ఇచ్చారు. ఆ వెలుగును నేను చూశాను. ఆయన ప్రతి అడుగు ఒక ఆలోచన. వైఎస్సార్ పిలుపు ఒక భరోసా, ఆయన మాట విశ్వసనీయతకు మారు పేరు. ఆయన మాట, సంతకం ఎన్నో జీవితాలను నిలబెట్టింది. వైఎస్సార్ జీవితం నుంచి నేను, నాపిల్లలు చాలా నేర్చుకున్నాం. ప్రతి ఒక్కరు వైఎస్సార్ జీవితాన్ని తెలుసుకోవాలనుకుంటున్నా. ఆయన స్ఫూర్తిని అందరు పాటించాలని కోరుతున్నా’ అని విజయమ్మ పేర్కొన్నారు. వైఎస్సార్ అందరికీ ఒక స్ఫూర్తి అని వైఎస్ షర్మిల అన్నారు. "నాలో.. నాతో వైఎస్సార్'' పుస్తకాన్ని అందరూ చదవాలని కోరారు. (స్నేహ పరిమళాలకు చిహ్నం) -
వైఎస్సార్కు ముఖ్యమంత్రి జగన్ నివాళి
సాక్షి, ఇడుపులపాయ: దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆయన కుటుంబసభ్యులు బుధవారం ఘనంగా నివాళులు అర్పించారు. నేడు వైఎస్సార్ 71వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి రెడ్డి, వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డితో పాటు పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. (చదవండి: ఎన్నటికీ మరువం రాజన్న!) నాలో.. నాతో వైఎస్సార్... వైఎస్సార్కు నివాళి అనంతరం "నాలో.. నాతో వైఎస్సార్" పుస్తకాన్ని ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని వైఎస్ విజయమ్మ రచించారు. వైఎస్సార్ స్వర్గస్థులైన నాటి నుంచి కలిగిన భావోద్వేగాల సమాహారం "నాలో.. నాతో వైఎస్సార్". వైఎస్సార్ సహధర్మచారిణిగా వైఎస్ విజయమ్మ జీవితసారమే ఈ పుస్తకం. వీటితోపాటు ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొంటారు. ట్రిపుల్ ఐటీ వద్ద వైఎస్ఆర్ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరిస్తారు. సీఎం పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కాగా, వైఎస్సార్ జయంతిని రాష్ట్ర రైతు దినోత్సవంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. థర్మల్ స్క్రీనింగ్ తర్వాతే.. ఇడుపులపాయలో నిర్వహిస్తున్న వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం అడుగడుగునా ప్రత్యేక చర్యలు చేపట్టింది. అక్కడ పకడ్బందీగా కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తోంది. ఎమ్మెల్యేలను సైతం థర్మల్ స్కానింగ్ చేసిన తర్వాత జయంతి కార్యక్రమానికి అనుమతిస్తున్నారు. ఇప్పటికే కార్యక్రమానికి హాజరైన మీడియా సిబ్బంది, ఎమ్మెల్యేలకు కలెక్టర్ హరికిరణ్ కోవిడ్ పరీక్షలు చేయించారు. (నాలో... నాతో.. వైఎస్సార్) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నేడు మహానేత వైఎస్ఆర్ 71వ జయంతి
-
నేడు వైఎస్సార్ 71వ జయంతి
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, కడప: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 71వ జయంతిని పురస్కరించుకుని బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలు జరగనున్నాయి. తన తండ్రికి నివాళులర్పించడానికి సీఎం వైఎస్ జగన్ కుటుంబ సభ్యులతో కలసి మంగళవారం సాయంత్రం ఇడుపులపాయకు చేరుకున్నారు. బుధవారం ఉదయం 8.10 గంటలకు తన కుటుంబసభ్యులు, బంధువులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలసి వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం వైఎస్ జగన్ నివాళులర్పిస్తారు. అనంతరం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇడుపులపాయలో పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీఎం పాల్గొనే కార్యక్రమాలివీ... ► గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు సాంకేతిక విద్యనందించేందుకు ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో రూ.139.83 కోట్ల వ్యయంతో అత్యాధునికంగా నిర్మించిన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తరగతి భవనాలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ► ట్రిపుల్ ఐటీకి వాడే విద్యుత్ వ్యయాన్ని తగ్గించేందుకు ఇడుపులపాయ నెమళ్ల పార్కు పక్కన మూడు మెగావాట్ల సామర్థ్యంతో రెస్కో కోలబ్రేషన్ సిస్టమ్తో సోలార్ విద్యుత్ ప్లాంటు నిర్మించారు. ఇందుకు 18 ఎకరాల ట్రిపుల్ ఐటీ స్థలాన్ని కేటాయించారు. ప్రస్తుతం ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీకి యూనిట్కు రూ.7.66తో విద్యుత్ బిల్లును చెల్లిస్తున్నారు. ఈ సోలార్ ప్లాంటు ద్వారా యూనిట్కు రూ.3.45తో బిల్లును చెల్లించవచ్చు. దీంతో ఏటా రూ.1.81 కోట్ల మేరకు ఆర్జీయూకేటీ యూనివర్సిటీకి ఆదా అవుతుంది. ఇందుకు సంబంధించిన శిలాఫలాకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు. ► ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ క్యాంపస్లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని కూడా ఆయన ఆవిష్కరిస్తారు. ► ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో చదివే విద్యార్థులు ప్రపంచస్థాయికి ఎదగాలనే లక్ష్యంతో రూ.10.10 కోట్లతో ఏర్పాటు చేసే కంప్యూటర్ సెంటర్కు శంకుస్థాపన చేస్తారు. ► అలాగే క్యాంపస్లో రూ.40 కోట్ల అంచనా వ్యయంతో 2,500 మంది విద్యార్థులు పట్టేలా ఏర్పాటు చేస్తున్న వైఎస్సార్ ఆడిటోరియంకు కూడా శంకుస్థాపన చేస్తారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో... ఇదిలా ఉండగా, వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఉదయం 9.15 గంటలకు మహానేతకు ఘనంగా నివాళులర్పిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డితోపాటుగా పలువురు సీనియర్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. -
ఇడుపులపాయ: మహానేతకు నివాళులర్పించిన సీఎం జగన్
-
మహానేతకు నివాళులర్పించిన సీఎం జగన్
సాక్షి, వైఎస్సార్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఉదయం ఇడుపులపాయలో తన తండ్రి, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించారు. వైఎస్సార్ ఘాట్పై పూల మాల ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అలాగే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రులు ఆదిమూలపు సురేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, వైఎస్ ఎంపీ అవినాష్రెడ్డి, ఎమ్మెల్సీ గంగులా ప్రభాకర్రెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.00 గంటలకు సీఎం వైఎస్ జగన్ రాయచోటికి వెళతారు. రాయచోటి జూనియర్ కళాశాల మైదానం సమీపంలో పలు అభివృద్ది పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి, సోదరి వైఎస్ షర్మిల ఇతర కుటుంబ సభ్యులు కూడా వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన విజయమ్మ.. అంతకుముందు వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. అలాగే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. -
ఇడుపులపాయ టూరిజం సర్క్యూట్పై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి : ఇడుపులపాయ టూరిజం సర్క్యూట్పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలోకడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, బ్యూటిఫికేషన్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు టూరిజం ప్రాజెక్టులపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వైఎస్సార్ మెమోరియల్ గార్డెన్, గండి టెంపుల్ కాంప్లెక్స్, ఐఐటీ క్యాంపస్, ఎకో పార్క్, జంగిల్ సఫారీ, పీకాక్ బ్రీడింగ్ సెంటర్ ఎస్టిమేషన్ వివరాలను సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. బ్యూటిఫికేషన్ పెరిగే విధంగా ఆర్కిటెక్చర్ ఉండాలని అధికారులకు సూచించారు. ఏ పని చేసినా దీర్ఘకాలికంగా మన్నికతో పాటు ప్రాజెక్టు ఆకర్షణీయంగా ఉండేలా రూపొందించాలని చెప్పారు. కాలక్రమేణా సుందరీకరణ ప్రాజెక్టు వన్నె తగ్గకుండా చూసుకోవడంతో పాటు ఆకర్షణీయంగా ఉండేందుకు కావాల్సిన అన్ని పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కడప, పులివెందులను మోడల్టౌన్స్గా తీర్చిదిద్దాలని సూచించారు. పైలెట్ ప్రాజెక్టుగా పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన సహాయాన్ని పులివెందుల ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ(పాడా) నంచి తీసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా పులిచింతలలో వైఎస్సార్ ఉద్యానవనం ప్రణాళికను , విశాఖపట్నంలో లుంబినీ పార్క్ అభివృద్ధిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇదే తరహాలో పోలవరం వద్ద కూడా పార్క్ రూపొందించాలని అధికారులకు సూచించారు. -
ఇడుపులపాయ : మహానేత వైఎస్సార్కు సీఎం జగన్ నివాళి
-
మహానేత వైఎస్సార్కు సీఎం జగన్ నివాళి
సాక్షి, వైఎస్సార్ కడప : దివంగత మహానేత, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 10వ వర్ధంతి సందర్భంగా సీఎం జగన్మోహన్రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి జగన్, వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, వైఎస్ షర్మిల వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. వారితో పాటు వైఎస్సార్సీపీ నాయకులు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్డ్డి, వైఎస్సార్ అభిమానులు నివాళులర్పించారు. వివేకానందరెడ్డి విగ్రహావిష్కరణ ఇడుపులపాయ నుంచి బయల్దేరిన అనంతరం ముఖ్యమంత్రి జగన్ భాకరాపురం చేరుకుని వైఎస్ వివేకానందరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. సొంత నియోజకవర్గం పులివెందుల అభివృద్ధిపై మధ్యాహ్నం 12 గంటలకు సీఎం సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం పులివెందుల నియోజకవర్గంలో నిర్వహించే వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు విజయవాడలోని పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పర్యాటక కేంద్రంగా ఇడుపులపాయ
ప్రొద్దుటూరు : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ ఉన్న ఇడుపులపాయ ప్రాంతాన్ని రాష్ట్రంలోనే గొప్ప పర్యాటక కేంద్రంగా మార్చుతామని ఏపీ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఎండీ నరాల చంద్రమోహన్రెడ్డి తెలిపారు. ఆయన తన సిబ్బందితో కలిసి గురువారం ఇడుపులపాయ ప్రాంత పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడారు. గతంలో తాము శ్రీశైలం సమీపంలోని నల్లకాలువ వద్ద వైఎస్సార్ స్మృతివనాన్ని గొప్పగా అభివృద్ధి చేశామన్నారు. నిధుల మంజూరులో ఆలస్యం కావడంతో కొంత జాప్యం జరిగిందన్నారు. వైఎస్సార్ స్మృతివనానికి గూగుల్ రేటింగ్ 4.3గా ఉందన్నారు. గత వారంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి ఇడుపులపాయ అభివృద్ధి గురించి చర్చించామన్నారు. కేవలం వైఎస్ఆర్ ఘాట్ మాత్రమే కాకుండా పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేస్తే పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకుంటుందన్నారు. గతంలోనే ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభమైనా.. నిధులు లేని కారణంగా ఆగిపోయాయని తెలిపారు. ఇడుపులపాయ అభివృద్ధిలో భాగంగా రెస్టారెంట్, ఆట వస్తువులు, జిమ్, ఆడియో విజువల్ థియేటర్ను నిర్మించాలనే యోచనలో ఉన్నామన్నారు. పచ్చదనాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. సమీపంలో ఉన్న గండి క్షేత్రం, పాపాగ్ని నది, నెమళ్ల ప్రాజెక్టు, చుట్టూ ఉన్న కొండలు ఇడుపులపాయకు అదనపు ఆకర్షణగా నిలిచాయని తెలిపారు. మళ్లీ ఇడుపులపాయను సందర్శించిన తర్వాత నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. నిధులు మంజూరైన తర్వాత ప్రాజెక్టు పనులు చేపడుతామన్నారు. ఎప్పటిలోగా పనులు పూర్తవుతాయనే విషయంపై ఇప్పుడే అంచనాకు రాలేమని చెప్పారు. ఎండీ వెంట ప్రిన్సిపల్ ల్యాండ్ స్కేప్ ఆర్కెటెక్ బలరామిరెడ్డి, జనరల్ మేనేజర్లు శివరాం, బాలసుబ్రహ్మణ్యం, టూరిజం డిపార్ట్మెంట్ ఈఈ ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. -
మహానేతకు నివాళులు అర్పించిన వైఎస్ జగన్
-
ఇడుపులపాయ చేరుకున్న వైఎస్ జగన్
-
కడప సీఎస్ఐ చర్చిలో వైఎస్ జగన్ ప్రార్థనలు
-
మహానేత ఆశీస్సులు తీసుకున్న వైఎస్ జగన్
సాక్షి, ఇడుపులపాయ: మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డికి ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డి ఘనంగా నివాళులు అర్పించి ఆశీర్వాదం పొందారు. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ సమాధిపై పూలమాల వేసి ఆయన కొద్దిసేపు మౌనంగా ప్రార్థనలు చేశారు. జగన్తో పాటు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పలువురు పార్టీ నేతలు ఉన్నారు. అంతకు ముందు ఇడుపులపాయ చేరుకున్న జననేతకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. వైఎస్ జగన్ను కలుసుకునేందుకు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. వారందరికీ అభివాదం చేస్తూ ఆయన ముందుకు కదిలారు. అంతకు ముందు జగన్ పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఇక సాయంత్రం ఇడుపులపాయ నుంచి హెలికాప్టర్లో కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ బయల్దేరి వెళతారు. కాగా వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయతో వైఎస్ఆర్ కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది. ఇడుపులపాయ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఇష్టమైన తన వ్యవసాయ భూమి ఉన్న ప్రాంతం. ఇప్పుడు ఆయన సమాధి ఉన్న నేల అది. అందుకే జగన్ ఏ కార్యక్రమం తలపెట్టినా ఇడుపులపాయ కేంద్రం అవుతోంది. అక్కడ వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించి తండ్రి ఆశీర్వాదం తీసుకున్న తర్వాతే తొలి అడుగు వేయడం జగన్మోహన్రెడ్డికి ఆనవాయితీగా మారింది. గురువారం విజయవాడలో 'జగన్ అనే నేను' అంటూ.. ప్రమాణస్వీకారం చేసి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తున్న సందర్భంగా ఆయన తండ్రి వైఎస్ఆర్ ఆశీస్సులు తీసుకుంటున్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : మహానేతకు నివాళులు అర్పించి వైఎస్ జగన్ -
సీఎస్ఐ చర్చిలో వైఎస్ జగన్ ప్రార్థనలు
సాక్షి, పులివెందుల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, నిశ్చయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ జిల్లా పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీతో గెలుపొందడంతో చర్చి పాస్టర్లు జగన్ను ఆశ్వీరదించారు. కడప నుంచి పులివెందుల చేరుకున్న ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. వైఎస్ జగన్తో పాటు ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ప్రార్థనల్లో పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం ఇడుపులపాయకు చేరుకుని తన తండ్రి, దివంగత నేత వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పిస్తారు. సాయంత్రం తిరిగి విజయవాడ చేరుకోనున్నారు. కాగా అంతకు ముందు తిరుపతి నుంచి కడప చేరుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్ద దర్గాను సందర్శించారు. ఆయనకు పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, దర్గా పీఠాధిపతి ఘన స్వాగతం పలికారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : కడప సీఎస్ఐ చర్చిలో వైఎస్ జగన్ ప్రార్థనలు -
రేపు తిరుమల వెళ్లనున్న వైఎస్ జగన్
-
రేపు తిరుమలకు వైఎస్ జగన్
సాక్షి, తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్కు కాబోయే ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్రెడ్డి తిరుమల వెళ్లనున్నారు. ఈనెల 28వ తేదీ (మంగళవారం) సాయంత్రం 5 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో ఆయన తిరుమలకు బయలుదేరి వెళతారు. సాయంత్రం ఏడు గంటలకు తిరుమలకు చేరుకుంటారు. రాత్రికి తిరుమలలో బసచేసి 29వ తేదీ ఉదయం స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం వైఎస్సార్ జిల్లాలోని ఇడుపులపాయకు చేరుకుని దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధికి నివాళులర్పించి ఆశీస్సులు తీసుకుంటారు. అనంతరం కడప పెద్ద దర్గాను దర్శించి ఆశీస్సులు పొందుతారు. ఆ తర్వాత తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. 30వ తేదీ మధ్యాహ్నం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : రేపు తిరుమల వెళ్లనున్న వైఎస్ జగన్ టీటీడీ పాలకమండలిని రద్దు చేయాలి కాగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న వైఎస్ జగన్ శ్రీవారిని దర్శించుకోనున్నట్లు జీడీ నెల్లూరు ఎమ్మెల్యే నారాయణ స్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం రద్దు అయిన వెంటనే నామినేటెడ్ పోస్ట్ల్లో ఉన్నవారు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే టీడీపీ పాలకమండలిని కూడా వెంటనే రద్దు చేయాలని, వారు తమ పదవులుకు రాజీనామా చేయాలన్నారు. అలాగే రేపు ఉదయం జరిగే పాలకమండలి సమావేశాన్ని కూడా రద్దు చేయాలని నారాయణస్వామి అన్నారు. రాజీనామా చేసిన రాఘవేంద్రరావు శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ పదవికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రాజీనామా చేశారు. వయోభారం వల్ల చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్టు ఆయన తెలిపారు. టీటీడీ యాజమాన్యానికి, సిబ్బందికి ఆ తిరుమలేశుడి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. తనకు ఇన్నాళ్లు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
మహానేతకు వైఎస్ జగన్ ఘన నివాళి
-
వైఎస్ఆర్కు నివాళులు అర్పించిన వైఎస్ విజయమ్మ
-
విలువలు, విశ్వసనీయతకు పట్టం కట్టాలి: వైఎస్ విజయమ్మ
సాక్షి, వైఎస్సార్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ శుక్రవారం ఉదయం ఇడుపులపాయలోని దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించారు. అనంతరం విజయమ్మ మీడియాతో మాట్లాడుతూ.. ‘వైఎస్సార్ పాలనతో పోల్చినప్పుడు ప్రస్తుత పాలన చూస్తే చాలా బాధ వేస్తుంది. రాజన్న పాలన మళ్లీ చూడాలంటే అది వైఎస్ జగన్తోనే సాధ్యమని నమ్ముతాను. ఈ పదేళ్ల పాటు వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబం మధ్య కంటే ప్రజలతోనే ఎక్కువ మమేకమై ఉన్నారు. ప్రజాసంకల్పయాత్రలో ప్రజల కష్టాలు చూశాడు.. విన్నాడు. ప్రతి ఒక్కరికి నేనున్నానే భరోసా ఇచ్చాడు. విలువలకు, విశ్వసనీయతకు ప్రజలు పట్టం కట్టాలి. తాను చేసిన అభివృద్ధి కూడా చెప్పుకోలేని చంద్రబాబు.. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు వైఎస్ జగన్ జపం చేస్తున్నార’ని తెలిపారు. నేడు ప్రకాశం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో విజయమ్మ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు కందుకూరులో జరిగే ప్రచార సభలో ఆమె పాల్గొన్ని ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు కనిగిరిలో జరిగే సభలో విజయమ్మ పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు మార్కాపురంలో జరిగే ప్రచార సభలో పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రికి విజయమ్మ మర్కాపురంలోనే బస చేస్తారు. శనివారం ఉదయం 10 గంటలకు యర్రగొండపాలెంలో జరిగే ఎన్నికల ప్రచార సభలో విజయమ్మ పాల్గొననున్నారు. -
టీడీపీకి ఘోర పరాజయం తప్పదని బాబుకు ఇండికేషన్ వచ్చింది
-
40 ఏళ్ల రాజకీయ అనుభవం.. ఏమైంది..!
సాక్షి, ఇడుపులపాయ : నలభై ఏళ్ల రాజకీయం అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని చూస్తే భయం పట్టుకుందని ఆ పార్టీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. ఒకేసారి మొత్తం అసెంబ్లీ సానాలకు వైఎస్సార్సీపీ అభ్యర్థుల్ని ప్రకటించడం నిజంగా గొప్ప విషయమని అన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేతుల మీదుగా 175 మంది వైఎస్సాసీపీ ఎమ్మెల్యే అభ్యుర్థుల జాబితా చదివి వినిపించిన అనంతరం ధర్మాన మాట్లాడారు. ఇప్పటికే టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి వలసల వరద కొనసాగుతోందని, జాబితా విడుదల చేస్తే మరింత మంది తమ పార్టీలో చేరతారనే భయంతో చంద్రబాబు జాబితా విడుదల చేయడం లేదని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదనే విషయం బాబుకు నిన్నటి శ్రీకాకుళం తొలి ఎన్నికల ప్రచార సభలోనే అర్థమైందని అన్నారు. ‘శ్రీకాకుళం సభలో చంద్రబాబు మాట్లాడుతూ..మీరందరూ ఇంత నిస్తేజంగా ఉంటే ఎలా.. అని అన్నారు. అంటే, వాళ్లు నిస్తేంజంగా, టీడీపీ పట్ల సరైన భావన లేకుండా ఉన్నారని బాబుకు తెలుసు. బాబు ప్రసంగిస్తూ.. ఒకచేయి ఎత్తితే సరిపోదు. రెండు చేతులు ఎత్తండీ అని పిలుపునిచ్చారు. కానీ, ఎవరూ స్పందించలేదు. టీడీపీకి ఘోర పరాజయం తప్పదని బాబుకు ఇండికేషన్ వచ్చింది’ అని ధర్మాన చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. ఇక 41 మంది బీసీలకు కేటాయించడంతో పాటు అన్ని వర్గాల వారికి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రాధాన్యం కల్పించారని అన్నారు. బీసీలకు సీట్లు కేటాయించకుండా మభ్యపెట్టాలని చూస్తున్నారని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్వార్డ్ క్లాస్ జాబితాలో వెనకబడిన తరగతుల సీట్లను చేర్చి అసత్యాలు చెప్తున్నారని టీడీపీ తీరును ఎండగట్టారు. ఫార్వార్డ్ క్లాస్కు తాము వ్యతిరేకం కాదని, కానీ బీసీలకు టికెట్లు కేటాయించామని టీడీపీ అబద్ధాలు చెబుతోందని మండిపడ్డారు. -
వైఎస్సార్సీపీ అభ్యర్థుల ప్రకటన..
-
వైఎస్సార్సీపీ అభ్యర్థుల ప్రకటన..
సాక్షి, కడప: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు. అనంతరం వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ నేతలు విలేకరుల సమావేశంలో పార్టీ తరఫున శాసనసభ, లోక్సభ స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల జాబితాలను విడుదల చేశారు. మొదట లోక్సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను నందిగం సురేశ్ ప్రకటించారు. ఆ తర్వాత 175 అసెంబ్లీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల జాబితాను సీనియర్ నేత ధర్మాన ప్రకటించారు. (చదవండి : వైఎస్సార్సీపీ లోక్సభ అభ్యర్థుల జాబితా ఇదే..!) ఇప్పటికే వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేసే 9 మంది లోక్సభ అభ్యర్థుల జాబితాను శనివారం విడుదల చేయగా.. మిగతా అభ్యర్థుల జాబితాను నందిగం సురేశ్ ప్రకటించారు. ఇక విశాఖ జిల్లా నర్సీపట్నంలో 12.30 గంటలకు ఎన్నికల తొలి బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని డెంకాడ బహిరంగ సభ, సాయంత్రం 4.30 గంటలకు తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట బహిరంగ సభల్లో వైఎస్ జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. జిల్లాల వారీగా అసెంబ్లీ అభ్యర్థుల జాబితా.. వైఎస్సార్ కడప పులివెందుల - వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జమ్మలమడుగు - ఎం సుధీర్ రెడ్డి ప్రొద్దుటూరు - రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మైదుకూరు - శెట్టిపల్లి రఘురామిరెడ్డి కమలాపురం - పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి బద్వేలు ( ఎస్సీ) - జి. వెంకట సుబ్బయ్య కడప - షేక్ అంజాద్ బాషా రాజంపేట - మేడా వెంకట మల్లికార్జున రెడ్డి కోడూరు(ఎస్సీ) - కొరుముట్ల శ్రీనివాసులు రాయచోటి - గడికోట శ్రీకాంత్రెడ్డి కర్నూలు ఆళ్లగడ్డ - గంగుల బీజేంద్రరెడ్డి శ్రీశైలం - శిల్పా చక్రపాణిరెడ్డి నందికొట్కూరు (ఎస్సీ) - అర్తుర్ కర్నూలు - అబ్దుల్ హాఫీజ్ ఖాన్ పాణ్యం - కాటసాని రాంభూపాల్ రెడ్డి నంద్యాల - శిల్పా రవిచంద్రారెడి బనగానపల్లె - కాటసాని రామిరెడ్డి డోన్ - బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పత్తికొండ - కంగటి శ్రీదేవి కోడుమూరు (ఎస్సీ) - డాక్టర్ సుధాకర్ బాబు ఎమ్మిగనూరు - కె. చెన్నకేశవరెడ్డి ఆదోని - వై. సాయి ప్రసాద్రెడ్డి ఆలూరు - పి. జయరామ్( గుమ్మనూర్ జయరాం) మంత్రాలయం - వై. బాలనాగి రెడ్డి అనంతపురం తాడిపత్రి - కేతిరెడ్డి పెద్దారెడ్డి అనంతపురం అర్బన్ - అనంత వెంకట్రామిరెడ్డి కళ్యాణదుర్గం - కె.వి. ఉష శ్రీచరణ్ రాయదుర్గం - కాపు రామచంద్రారెడ్డి శింగనమల (ఎస్సీ) - జొన్నలగడ్డ పద్మావతి గుంతకల్ - వై. వెంకటరామిరెడ్డి ఉరవకొండ - వై. విశ్వేశ్వర్ రెడ్డి హిందూపురం - కె. ఇక్బాల్ అహ్మద్ ఖాన్ రాప్తాడు - తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పెనుగొండ - ఎం. శంకర్నారాయణ ధర్మవరం - కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మడకశిర ( ఎస్సీ) - ఎం. తిప్పేస్వామి కదిరి - డాక్టర్ పీవీ సిద్ధారెడ్డి పుట్టపర్తి - దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి చిత్తూరు కుప్పం - కె.చంద్రమౌళి నగరి - ఆర్కే రోజా చంద్రగిరి - డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చిత్తూరు - జంగాలపల్లి శ్రీనివాసులు పూతలపట్టు (ఎస్సీ) - ఎంఎస్ బాబు గంగాధర నెల్లూరు (ఎస్సీ) - కె.నారాయణస్వామి పలమనేరు - ఎన్. వెంకటయ్య గౌడ పీలేరు - చింతల రామచంద్రారెడ్డి మదనపల్లి - నవాజ్ బాషా తంబళ్లపల్లి - పెద్దిరెడ్డి ద్వారకానాథ్రెడ్డి పుంగనూరు - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతి - భూమన కరుణాకర్ రెడ్డి శ్రీకాళహస్తి - బియ్యపు మదుసూదన్ రెడ్డి సత్యవేడు (ఎస్సీ) - కె.ఆదిమూలం తూర్పుగోదావరి తుని- దాడిశెట్టి రామలింగేశ్వర్ రావు(రాజా) ప్రత్తిపాడు- పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్ పిఠాపురం- పెండెం దొరబాబు కాకినాడ రూరల్- కురసాల కన్నబాబు పెద్దాపురం- తోట వాణి అనపర్తి- ఎస్. సూర్యనారాయణ రెడ్డి కాకినాడ సిటీ- ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రామచంద్రాపురం: చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ముమ్మిడివరం- పొన్నాడ వెంకట సతీష్ కుమార్ అమలాపురం(ఎస్సీ)- పి. విశ్వరూప్ రాజోలు(ఎస్సీ)- బొంతు రాజేశ్వర్ రావు గన్నవరం(ఎస్సీ)- కొండేటి చిట్టిబాబు కొత్తపేట- చిర్ల జగ్గిరెడ్డి మండపేట- పిల్లి సుభాష్చంద్ర బోస్ రాజానగరం- జక్కంపుడి రాజా రాజమండ్రి సిటీ- రౌతు సూర్యప్రకాష్ రావు రాజమండ్రి రూరల్- ఆకుల వీర్రాజు జగ్గంపేట- జ్యోతుల చంటిబాబు రంపచోడవరం(ఎస్టీ)- నాగులపల్లి ధనలక్ష్మి పశ్చిమగోదావరి కొవ్వురు(ఎస్సీ)- తానేటి వనిత నిడదవోలు- జి. శ్రీనివాస నాయుడు ఆచంట- చెరుకువాడ శ్రీరంగనాథరాజు పాలకొల్లు- డాక్టర్ బాబ్జీ నరసాపురం- ముదునురి ప్రసాద్ రాజు భీమవరం- గ్రంథి శ్రీనివాస్ ఉండి- పీవీఎల్ నరసింహరాజు తణుకు- కరుమురి వెంకట నాగేశ్వరరావు తాడేపల్లిగూడెం- కొట్టు సత్యనారాయణ ఉంగుటురు- పుప్పాల శ్రీనివాసరావు దెందులురు- కొఠారు అబ్బాయి చౌదరి ఏలురు- కృష్ణ శ్రీనివాసరావు గోపాలపురం(ఎస్సీ)- తలారి వెంకట్రావు పోలవరం(ఎస్టీ)- తెల్లం బాలరాజు చింతలపుడి(ఎస్సీ)- ఎలిజా కృష్ణా తిరువూరు (ఎస్సీ)-కొక్కిలగడ్డ రక్షణనిధి గన్నవరం-యార్లగడ్డ వెంకట్రావు గుడివాడ-కొడాలి వెంకటేశ్వరరావు (నాని) కైకలూరు-దూలం నాగేశ్వరరావు పెడన-జోగి రమేష్ మచిలీపట్నం-పేర్ని వెంకట్రామయ్య (నాని) అవనిగడ్డ-సిహాంద్రి రమేష్బాబు పామర్రు (ఎస్సీ)-కైలే అనిల్కుమార్ పెనమలూరు-కొలుసు పార్థసారథి విజయవాడ వెస్ట్-వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడ సెంట్రల్-మల్లాది విష్ణు విజయవాడ ఈస్ట్-బొప్పన బావ్కుమార్ మైలవరం-వసంత కృష్ణ ప్రసాద్ నందిగామ (ఎస్సీ)-డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు జగ్గయ్యపేట-సామినేని ఉదయభాను నూజివీడు-మేక వెంకటప్రతాప్ అప్పారావు గుంటూరు పెదకూరపాడు-నంబూరి శంకరరావు తాడికొండ (ఎస్సీ)-ఉండవల్లి శ్రీదేవి మంగళగిరి-ఆళ్ల రామకృష్ణరెడ్డి పొన్నూరు-కిలారి రోషయ్య వేమూరు (ఎస్సీ)-మేరుగ నాగార్జున రేపెల్ల-మోపిదేవి వెంకటరమణరావు తెనాలి-అన్నాబత్తుని శివకుమార్ బాపట్ల-కోన రఘుపతి ప్రత్తిపాడు (ఎస్సీ)-మేకతోటి సుచరిత గుంటూరు వెస్ట్-చంద్రగిరి యేసురత్నం గుంటూరు ఈస్ట్-షేక్ మహమ్మద్ ముస్తఫా చిలకలూరిపేట-విడదల రజని నరసరావుపేట-గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సత్తెనపల్లి-అంబటి రాంబాబు వినుకొండ-బొల్లా బ్రహ్మనాయుడు గురజాల-కాసు మహేష్రెడ్డి మాచర్ల-పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రకాశం ఎర్రగొండపాలెం (ఎస్సీ)-డాక్టర్ ఆదిమూలపు సురష్ దర్శి-మద్దిశెట్టి వేణుగోపాల్ పరచూరు-దగ్గుబాటి వెంకటేశ్వరరావు అద్దంకి-బచ్చన చెంచు గరటయ్య చీరాల-ఆమంచి కృష్ణమోహన్ సంతనూతలపాడు (ఎస్సీ)-టీజేఆర్ సుధాకర్బాబు ఒంగోలు-బాలినేని శ్రీనివాసరెడ్డి కందుకూరు-మానుగుంట మహిధర్రెడ్డి కొండపి(ఎస్సీ)-డాక్టర్ ఎం.వెంకయ్య మార్కాపురం-కేపీ నాగార్జున రెడ్డి గిద్దలూరు-అన్నా వెంకట రాంబాబు కనిగిరి-బుర్రా మధుసూధన్ యాదవ్ నెల్లూరు కావలి-రామిరెడ్డి ప్రతాప్కుమార్ రెడ్డి ఆత్మకూరు-మేకపాటి గౌతమ్కుమార్ రెడ్డి కోవూరు-నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నెల్లూరు సిటీ-పోలుబోయిన అనిల్కుమార్ నెల్లూరు రూరల్-కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి సర్వేపల్లి-కాకాని గోవర్ధన్రెడ్డి గూడూరు (ఎస్సీ)-వరప్రసాద్ సూళ్లూరుపేట (ఎస్సీ)-కిలివేటి సంజీవయ్య వెంకటగిరి-ఆనం రామనారాయణరెడ్డి ఉదయగిరి-మేకపాటి చంద్రశేఖర్రెడ్డి శ్రీకాకుళం ఇచ్ఛాపురం- పిరియ సాయిరాజ్ పలాస- డాక్టర్ సీదిరి అప్పలరాజు టెక్కలి- పేరాడ తిలక్ పాతపట్నం-రెడ్డిశాంతి శ్రీకాకుళం -ధర్మాన ప్రసాదరావు ఆముదాలవలస- తమ్మినేని సీతారం ఎచ్చెర్ల-గొర్లె కిరణ్కుమార్ నరసన్నపేట-ధర్మాన కృష్ణదాస్ రాజాం (ఎస్సీ)- కంబాల జోగులు పాలకొండ(ఎస్టీ) -వి కళావతి విజయనగరం కురుపాం(ఎస్టీ)- పాముల పుష్పవాణి పార్వతీపురం(ఎస్సీ)- ఎ జోగరాజు చీపురుపల్లి- బొత్స సత్యనారాయణ గజపతినగరం- బొత్స అప్పలనర్సయ్య బొబ్బిలి-ఎస్వీసీ అప్పలనాయుడు సాలూరు(ఎస్టీ)-పీడిక రాజన్నదొర నెల్లిమర్ల- అప్పల నాయుడు విజయనగరం- కోలగట్ల వీరభద్రస్వామి శృంగవరపు కోట- కే శ్రీనివాస్ విశాఖపట్నం విశాఖ ఈస్ట్-విజయ నిర్మల విశాఖ సౌత్-ద్రోణం రాజు శ్రీనివాస్ విశాఖ వెస్ట్- విజయ ప్రసాద్ మళ్ల విశాఖనార్త్-కమ్మిల కన్నపరాజు అరకు(ఎస్టీ)-శెట్టి ఫాల్గుణ పాడేరు(ఎస్సీ)-భాగ్యలక్ష్మి పెందుర్తి-అన్నం రెడ్డి అదీప్రాజ్ గాజువాక-తిప్పల నాగిరెడ్డి అనకాపల్లి-గుడివాడ అమర్నాథ్ యలమంచిలి-యువీ. రమణమూర్తి రాజు పాయకరావుపేట(ఎస్సీ)- గొల్ల బాబురావు నర్సీపట్నం- పి. ఉమశంకర్ గణేష్ చోడవరం-కరణం ధర్మశ్రీ మడుగుల-బి. ముత్యాల నాయుడు భీమిలి-అవంతి శ్రీనివాస్ -
ఇడుపులపాయకు బయల్దేరిన వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్/కడప: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ నుంచి ఇడుపులపాయకు బయలుదేరారు. అక్కడ తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి.. నివాళులర్పిస్తారు. అనంతరం పార్టీ తరఫున శాసనసభ, లోక్సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను ఉదయం 10 గంటలకు విడుదల చేసి ఎన్నికల ప్రచార పర్వానికి శ్రీకారం చుడతారు. ఇప్పటికే వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేసే 9 మంది లోక్సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా.. మిగిలిన 16 ఎంపీ స్థానాలకు 175 ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో 12.30 గంటలకు ఎన్నికల తొలి బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని డెంకాడ బహిరంగ సభ, సాయంత్రం 4.30 గంటలకు తూర్పుగోదావరి జిల్ల పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట బహిరంగ సభల్లో వైఎస్ జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. -
ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్కు వైఎస్ జగన్
-
వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ జగన్ నివాళి
సాక్షి, ఇడుపులపాయ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కొద్దిసేపటి క్రితం ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించారు. వైఎస్ విగ్రహానికి కూడా పూలమాల వేసి అంజలి ఘటించారు. తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి అంత్యక్రియలు ముగిసిన తర్వాత వైఎస్ జగన్.. నేరుగా ఇడుపులపాయకు వెళ్లారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద కాసేపు గడిపారు. మరికాసేపట్లో వైఎస్ జగన్ ఇడుపులపాయ నుంచి హైదరాబాద్ బయలుదేరనున్నారు. ఈ సాయంత్రం వైఎస్ జగన్ నేతృత్వంలోని పార్టీ ప్రతినిధి బృందం రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ను కలవనుంది. మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో సహా టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రాజకీయ హత్యలను, రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతల అంశాన్ని గవర్నర్ దృష్టికి ప్రతినిధి బృందం ఈ సందర్భంగా తీసుకెళ్లనుంది. -
గురజాల నియోజకవర్గంలో వైఎస్ జగన్ తొలిసభ
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 16 నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారని ఆ పార్టీ సీనియర్ నాయకుడు తలశిల రఘరాం స్పష్టం చేశారు. 16వ తేదీ ఉదయం ఇడుపులపాయలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం వైఎస్ జగన్ పార్టీ అభ్యర్థులను ప్రకటించనున్నారని పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్లోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ తొలుత రోజుకు మూడు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారని.. 25వ తేదీ తర్వాత రోజుకు నాలుగు నియోజకవర్గాల్లో ప్రచారం కొనసాగిస్తారని తెలిపారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి గురజాల నియోజకవర్గం పిడుగురాళ్లలో వైఎస్ జగన్ తొలిసభ ఉంటుందన్నారు. వైఎస్ జగన్తోపాటు వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, ఆయన సోదరి వైఎస్ షర్మిల కూడా పార్టీ తరఫున ప్రచారం చేస్తారని వెల్లడించారు. ప్రజాసంకల్పయాత్ర సాగని 41 నియోజకవర్గాలో వైఎస్ జగన్ ఎన్నికల పర్యటన సాగేలా ప్రణాళిక రచిస్తున్నట్టు తెలిపారు. అందుకు తగ్గట్టు షెడ్యూల్ సిద్ధం చేస్తున్నామని.. మరో మూడు రోజుల్లో పూర్తి స్థాయి షెడ్యూల్ విడుదల చేస్తామని అన్నారు. వారం రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేస్తామని పేర్కొన్నారు. -
వైఎస్సార్కు కుటుంబసభ్యులు ఘన నివాళి
-
పేరుకే ఒంగోలు.. ఇడుపులపాయలోనే పాఠాలు!
సాక్షి, కడప: ఒంగోలుకు ట్రిపుల్ ఐటీ మంజూరై మూడో విద్యా సంవత్సరం ప్రారంభమైనా.. ఇంకా వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోనే తరగతులు కొనసాగుతుండడం చంద్రబాబు ప్రభుత్వ ఉదాసీనతకు అద్దం పడుతోంది. ఇన్నాళ్లూ పట్టించుకోని ప్రభుత్వం..: ఎన్నికలకు ముందు హడావుడి చేస్తోంది..మూడేళ్లుగా నాన బెట్టి ఇప్పుడు తూతూ మంత్రంగా శంకుస్థాపనలకు శ్రీకారం చుడుతోంది. శంకుస్థాపన శిలాఫలకానికే మూడేళ్లు పడితే...భవన నిర్మాణాలకు ఇంకెన్నాళ్లు పడుతుందోనన్న ఆందోళన విద్యార్థులను వెంటాడుతోంది. ప్రకాశం జిల్లా పామురు మండల పరిధిలోని దూబగుంట్లలో 208.45 ఎకరాల స్థలాన్ని కేటాయించి..అదే స్థలంలో మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి గంటా శంకుస్థాపన చేయడం పలువురి విమర్శలకు గురవుతోంది. 2016లో కొత్త ట్రిపుల్ ఐటీలు మంజూరు: తెలుగుదేశం పార్టీ 2014లో అధికారంలోకి వచ్చాక 2016లో శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల ఏర్పాటుకు పూనుకుంది. అనుకున్నదే తడువుగా తరగతులు ప్రారంభించేలా చర్యలు చేపట్టారు తప్ప శాశ్వత పరిష్కారం దిశగా ఇప్పటివరకు అడుగులు వేయలేదు. పాత క్యాంపస్లోనే..: వేంపల్లె సమీపంలోని ఇడుపులపాయలోనే రెండు ట్రిపుల్ ఐటీల విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వైఎస్సార్ జిల్లాకు చెందిన ట్రిపుల్ ఐటీ విద్యార్థులు సొంత భవనాల్లో విద్యను అభ్యసిస్తుండగా..ఒంగోలు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు పాత క్యాంపస్లో ఉంటున్నారు. అక్కడ విద్యాబోధనతోపాటు హాస్టల్ వసతులు కల్పించారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటీ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించిన నేపథ్యంలో 2008లో తాత్కాలిక షెడ్లు వేసి ప్రారంభించారు. ప్రస్తుతం తాత్కాలిక షెడ్లలోనే పలు సమస్యల మధ్య ఒంగోలు విద్యార్థులు చదువును కొనసాగిస్తున్నారు. ఒంగోలు ట్రిపుల్ ఐటీలో 3,254మంది విద్యార్థులు జిల్లాలోని ఇడుపులపాయలో ఏర్పాటు చేసిన ఒంగోలు ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు 3,254 మంది విద్యను అభ్యసిస్తున్నారు. 2016, 2017, 2018 విద్యార్థులను కలుపుకుని దాదాపు 3,250 మందికి పైగా ఇడుపులపాయలోని ఒంగోలు ట్రిపుల్ఐటీలో చదువుకుంటున్నారు. ప్రతి ఏడాదికేడాదికి విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వారికి సౌకర్యాలు కల్పించడం యాజమాన్యానికి కష్టంగా మారుతోంది. -
‘ఒంగోలు’ ఇడుపులపాయకెళ్లింది!
సాక్షి, కడప : పాలకుల నిర్లక్ష్యం...ప్రభుత్వ అలసత్వం..వెరసి విద్యార్థులకు ఇబ్బందులు తెచ్చి పెడుతున్నాయి. అత్యున్నత సాంకేతిక విద్య అందించేందుకు ట్రిపుల్ ఐటీని మంజూరు చేసే విషయంలో ఉన్న శ్రద్ధ వసతులు కల్పించడంలో లేదు. 2016లో టీడీపీ సర్కార్ కొత్తగా శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల ఏర్పాటుకు పూనుకుంది. అనుకున్నదే తడువుగా తరగతులు ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. అయితే సమస్యలు శాశ్వత పరిష్కారం దిశగా ఇప్పటివరకు అడుగులు పడకపోవడం గమనార్హం. ఇడుపులపాయలోనే రెండేళ్లు విద్యా సంవత్సరం దాటి మూడో ఏడాది అడ్మిషన్ల ప్రక్రియ నడుస్తున్నా ఇప్పటికీ ఒంగోలులో ప్రత్యేక బోధనకు బీజం పడలేదు. ప్రస్తుతం వేంపల్లె సమీపంలోని ఇడుపులపాయలోనే రెండు ట్రిపుల్ ఐటీల విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వైఎస్సార్ జిల్లాకు చెందిన ట్రిపుల్ ఐటీ విద్యార్థులు సొంత భవనాల్లో విద్యను అభ్యసిస్తుండగా.. ఒంగోలు ట్రిపుల్ ఐటీ వారు పాత క్యాంపస్ (రేకుల షెడ్లు)లో ఉంటున్నారు. అక్కడ విద్యాబోధనతోపాటు హాస్టల్ వసతులు కల్పించారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటీ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించింది.ఈ నేపథ్యంలో 2008లో తాత్కాలిక షెడ్లు వేసి ప్రారంభించారు. ప్రస్తుతం రెండేళ్ల ఇంటర్ విద్యను పూర్తి చేసుకుని ఇంజినీరింగ్లోకి అడుగు పెడుతున్న విద్యార్థులకు భవనాల్లో చదువు ఏర్పాట్లకు ఒంగోలు ట్రిపుల్ ఐటీ యాజమాన్యం చర్యలు చేపట్టింది. ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్ విద్యార్థులను భవనాల్లో సర్దుబాటు చేయడం ద్వారా పాత క్యాంపస్లో రెండు వేల మందిని యథావిధిగా కొనసాగించేలా చర్యలు చేపడుతున్నారు. కొలిక్కి రాని ఒంగోలు వ్యవహారం ప్రస్తుతం ఎన్నికల హడావుడి ప్రారంభమవుతోంది.డిసెంబరులోనే ఎన్నికలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఒంగోలు ట్రిపుల్ ఐటీ శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేయలేదు. ప్రకాశం జిల్లాలో పలుచోట్ల భూముల అన్వేషణ ప్రారంభించింది. కనిగిరి నియోజకవర్గంలో దాదాపు 200కు పైగా ఎకరాల స్థలం సిద్ధంగా ఉన్నట్లు ప్రత్యేక బృందాలు గుర్తించాయి. ఈ విషయం మంత్రివర్గంలో చర్చించి జీఓ విడుదల చేయాల్సి ఉంది. ఇదంతా ఎప్పుడు కొలిక్కి వస్తుంది.. ఎప్పుడు ఆమోదముద్ర పడుతుందనేది అర్థం కావడం లేదు. ఎందుకంటే స్థలానికి సంబంధించి అన్ని అనుమతులు తీసుకోవాలంటేనే చాలా సమయం పడుతుంది. పైగా ఈ ఏడాది ఎన్నికల ఏడాదిగా భావిస్తున్న తరుణంలో యుద్ధ ప్రాతిపదికన పనులు జరగడం గగనమే. స్థల సేకరణకే దాదాపు రెండేళ్లుగా సమయం పడితే.. ఇక భవనాల నిర్మాణానికి ఎన్ని రోజులు వేచి చూడాల్సి వస్తుందోనని పలువురు విద్యార్థులు పేర్కొంటున్నారు. ఒంగోలు ట్రిపుల్ ఐటీలో 3 వేలమంది జిల్లాలోని ఇడుపులపాయలో ఏర్పాటు చేసిన ఒంగోలు ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు మూడు వేల సంఖ్యను దాటుతున్నారు. మొదటి సంవత్సరం వెయ్యి మందితోపాటు అదనంగా మరో 150 మంది..రెండో ఏడాది మరో వెయ్యి కలుపుకుని 2150 మందికి పైగా ఉండగా, ప్రస్తుత సంవత్సరంలో కూడా వెయ్యి మందికి అడ్మిషన్లు ఇస్తున్నారు. ఈ నేప«థ్యంలో ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో మూడు వేల మంది మార్కును దాటుతున్నారు. ప్రస్తుతం ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. విద్యార్థులకు తప్పని ఇబ్బందులు ఒంగోలు ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఇబ్బందులు తప్పడంలేదు. మొదటి, రెండు సంవత్సరాల వారికి మొదట్లో చాలా రోజులు ల్యాప్టాప్ల సమస్య వేధించింది. దీంతో స్క్రీన్ మీదనే పాఠాలు బోధిస్తూ ల్యాప్ట్యాప్లు లేకుండా విద్యా సంవత్సరాన్ని కొనసాగించారు. రేకుల షెడ్లలో సమస్యలు వెంటాడుతున్నాయి. తాత్కాలికం మాటున వారు అవస్థలు పడుతున్నారు. సొంత భవనాలు లేకపోవడంతో పాత క్యాంపస్లోనే ఉండాల్సి వస్తోంది. కోస్తాంధ్ర జిల్లాల్లోని ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు నూజివీడు, ఒంగోలు క్యాంపస్లు అనువుగా ఉంటాయి. ఉత్తరాంధ్ర జిల్లాల వారికి శ్రీకాకుళం, రాయలసీమ ప్రాంత విద్యార్థులకు ఇడుపులపాయ సౌకర్యంగా ఉంటుంది. అయితే శ్రీకాకుళం, ఇడుపులపాయ మినహాయిస్తే ఒంగోలు విద్యార్థులకు అటు, ఇటు వెళ్లిరావాలన్నా కూడా కష్టతరమైన పరిస్థితులు నెలకొన్నాయి. దూర ప్రయాణాలు చేయలేక అవస్థలు పడాల్సి వస్తోంది. సమస్యల్లేవు...భవనాల్లోకి మారుతున్నాం,ట్రిపుల్ ఐటీ ఇన్చార్జి డైరెక్టర్ నరసింహరాజు ఒంగోలు ట్రిపుల్ ఐటీలో విద్యను అభ్యసించే మూడో సంవత్సరం విద్యార్థులకు భవనాల్లో వసతి కల్పించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ట్రిపుల్ ఐటీ ఇన్చార్జి డైరెక్టర్ నరసింహారాజు తెలిపారు. సమస్యల విషయమై ‘సాక్షి’ ప్రతినిధి డైరెక్టర్ను వివరణ కోరగా పై విధంగా స్పందించారు. భవనాలకు సంబంధించి పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. ప్రస్తుతం ఒంగోలు ట్రిపుల్ ఐటీలో ఎలాంటి సమస్యలు లేవు. తాత్కాలిక క్యాంపస్లోనే ఒకటి, రెండు సంవత్సరాల విద్యార్థులకు వసతి ఉంటుందన్నారు. ఒంగోలు ట్రిపుల్ ఐటీకి సంబంధించి కనిగిరి వద్ద స్థల సేకరణ పూర్తయిందని, జీఓ రావడమే తరువాయి అని తెలిపారు. ప్రస్తుతానికి అడ్మిషన్లు ఇడుపులపాయలోనే చేసుకుంటున్నామని తెలిపారు. -
తెలుగు ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు
-
అడుగడుగో.. అన్నొస్తున్నాడు..
ఇడుపులపాయ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్రలో తొలి అడుగుపడింది. సోమవారం ఉదయం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రజల జయజయధ్వానాల మధ్య ప్రారంభమైంది. రావాలి జగన్.. కావాలి జగన్.. వైఎస్సార్ సీపీ జిందాబాద్.. కాబోయే ముఖ్యమంత్రి జగన్.. అనే ప్రజా నినాదాల మధ్య వైఎస్ జగన్ తన మూడువేల కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. భగవంతుడి ఆశీర్వాదాలు, తండ్రి వైఎస్సార్ దీవెనలు, మాతృమూర్తి విజయమ్మ ఆశీస్సులు, చెల్లి షర్మిలమ్మ ఆదరాభిమానాలు, అభిమానులు, పార్టీ కార్యకర్తల అభినందనల మధ్య పాదయాత్ర మొదలైంది. ప్రజా సమస్యలు తెలుసుకుని వారితో మమేకమయ్యేందుకు జగన్ ముందుకు కదిలారు. తొలిరోజు 8.9 కిలోమీటర్ల మేరకు ప్రజా సంకల్ప యాత్ర సాగింది. దారివెంట అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జగన్తో కలిసి వేలాది మంది నడిచారు. అడుగడుగునా సెల్ఫీలు వేదిక దిగిన జగన్ 15 మీటర్లు నడిచేందుకు 22 నిమిషాల సమయం పట్టింది. దారికిరువైపులా నిలిచిన ప్రజలు ప్రత్యేకించి యువతరం వైఎస్ జగన్మోహన్రెడ్డితో కరచాలనాలు, సెల్ఫీల కోసం పెద్దఎత్తున పోటీపడ్డారు. అడుగు తీసి అడుగేయడానికే వీల్లేకుండా సెల్ఫీలు తీసుకున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. ఒక దశలో తోపులాట సైతం జరిగింది. ముందుకొస్తున్న జనాన్ని అదుపు చేయడం భద్రతా సిబ్బందికి సైతం అలివిమాలిన పనయింది. ఇడుపులపాయ మొదలు ఎగువన ఉన్న వీరన్నగట్టు వరకూ దారిపొడవునా ఎటుచూసినా జనమే జనం. దూరం నుంచి చూసే వారికి చీమలవరుసలా బారులు తీరిన జనప్రభంజనమే కనిపించింది. రెండు కిలోమీటర్ల నడకకు సుమారు రెండున్నర గంటల సమయం పట్టిందంటే పరిస్థితిని ఊహించవచ్చు. హారతి పట్టి.. తిలకం దిద్ది.. మారుతీనగర్లో మహిళలు మంగళహారతులు పట్టి.. కుంకుమ తిలకాలు దిద్దారు. భోజనానంతరం మారుతీనగర్ నుంచి వీరన్నగట్టుపల్లి చేరుకున్నప్పుడు గ్రామీణ నిరుపేద మహిళలు స్వచ్ఛందంగా రోడ్డు మీదకు వచ్చి ఆశీర్వాదాలు అందించారు. ’అయ్యా.. ఈసారి నువ్వే ముఖ్యమంత్రివి కావాలయ్యా.. పాలనలో మీ నాన్నను మరిపించాలయ్యా..’ అంటూ బడుగు బలహీన వర్గాల మహిళలు తిలకాలు దిద్ది ఆశీర్వదించారు. సెల్ఫీలు దిగారు. కుమురంపల్లి, వేంపల్లిలోనూ మహిళలు జగన్కు ఎదురేగి స్వాగతం పలికారు. ఆయనతో పాటు కలిసి ముందుకుసాగారు. కాగా దూరప్రాంతాల నుంచి తరలివచ్చిన అశేష ప్రజానీకానికి వైఎస్సార్ స్మృతి వనంలో కల్పించిన భోజన వసతి పలువురి మన్నల్ని, ప్రశంసల్ని పొందింది. వచ్చిన వారందర్నీ భోజనం చేసి వెళ్లాలని నిర్వాహకులు పదేపదే విజ్ఞప్తి చేశారు. అక్కడే కాకుండా మారుతీనగర్, వేంపల్లె వద్ద కూడా భోజన వసతి కల్పించడం విశేషం. వరుణుడి ఆశీర్వాదం.. కదం తొక్కిన జనం జగన్ పాదయాత్రకు అటు జనం నుంచే కాక ఇటు ప్రకృతి నుంచీ ఆశీస్సులందాయి. తెల్లవారుజాము నుంచే ప్రారంభమైన వర్షాన్ని సైతం లెక్కచేయక జనం ప్రభంజనంలా తరలివచ్చారు. పాదయాత్రకు ముందు కొద్దిసేపు వరకూ పడిన వర్షం ఆ తర్వాత యాత్ర కోసమే అన్నట్టు ఆగింది. యాత్ర ప్రారంభమై మూడు గంటలు సాగాక మళ్లీ వరుణుడు పలకరించి ఆశీర్వదించాడు. అయినప్పటికీ ప్రజలు కొండ రాళ్ల కింద, చెట్ల వద్ద ఆగి జగన్కు ఎదురేగి స్వాగతం పలికారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఎలాగైనా సరే జగన్ను కలవాలనే కాంక్షతో అనేక చోట్ల కొండగుట్టలెక్కి ఎదురు చూడడం గమనార్హం. ఓ వైపు వర్షం పడుతున్నా లెక్క చేయకుండా ఉదయం 8 గంటల నుంచే జనం ఇడుపులపాయకు రావడం మొదలైంది. ఆ తర్వాత వర్షం తెరిపివ్వడం, వాతావరణం చల్లబడటంతో 9 గంటల కల్లా ఇడుపులపాయలోని వైఎస్ జగన్ నివాసం, ఇడుపులపాయ ప్రాంగణం ప్రజలు, కార్యకర్తలు, నాయకులతో కిక్కిరిసిపోయింది. ఉదయం సరిగ్గా 9.15 గంటలకు అమ్మ విజయమ్మ నుంచి జగన్ ఆశీస్సులు అందుకున్నారు. ఆ తర్వాత చెల్లి షర్మిలమ్మ ఆత్మీయ పలకరింపు అనంతరం 9.27 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి వైఎస్సార్ ఘాట్కు చేరారు. అక్కడ తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు. అప్పటికే ఆ ప్రాంతం యువత కేరింతలు.. అభిమానుల నినాదాలతో మార్మోగిపోతోంది. వారికి ముకుళిత హస్తాలతో అభివాదం తెలుపుతూ ఉదయం 9.55 గంటల ప్రాంతంలో తొలి అడుగులు వేసి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అక్కడి నుంచి ఇడుపులపాయ రహదారిపై ఏర్పాటుచేసిన బహిరంగ సభాస్థలికి రావడానికే సుమారు గంట సమయం పట్టిందంటే జనం ఎంతగా పాదయాత్రను ఆదరిస్తున్నారో అర్థంచేసుకోవచ్చు. 11.18 గంటలకు జగన్ వేదికపైకి చేరుకుని ప్రసంగం ప్రారంభించారు. సుమారు 40 నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో తాను పాదయాత్రను ఎందుకు చేపట్టాల్సి వచ్చిందో, యాత్ర లక్ష్యమేంటో వివరించడంతో పాటు ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యం చెందడం వల్లే తానీ యాత్రను చేపట్టాల్సి వచ్చిందని వివరించారు. తనను రాజకీయాల నుంచి దూరం చేసేందుకు చంద్రబాబు కుట్రలు, కుయుక్తులు చేస్తున్నా ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణే తనకు పెద్ద ఊరటని జగన్ అన్నప్పుడు సభికులు హర్షధ్వానాలు చేశారు. ప్రసంగానంతరం జగన్మోహన్రెడ్డి తన యాత్రను కొనసాగించారు. పార్టీ అగ్రనేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంఎల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, సహచరులు, వేలాది మంది కార్యకర్తలు వెంట రాగా ఆయన తన తొలిరోజు పాదయాత్రను కొనసాగించారు. పోటెత్తిన అభిమానం జగన్ పాదయాత్ర వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. జనం లక్షలాదిగా తరలివచ్చారు. రాష్ట్రంతో పాటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ప్రాంతాల నుంచి కూడా అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ అన్ని శ్రేణుల నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. బైకు ర్యాలీలతో వచ్చిన యువకులు.. ‘జగనన్నా.. నువ్వే రావాలన్నా..’ అంటూ నినదించారు. జగన్ చిత్రం, ప్రజా సంకల్పం పేరు ముద్రించిన టీ షర్ట్లను ధరించిన వలంటీర్లు వైఎస్సార్ సీపీ పతాకాలు చేబూని పాదయాత్రకు ముందు వేలాదిగా కదంతొక్కారు. ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. క్రమబద్ధీకరించేందుకు పోలీసులు లేకపోవడం గమనార్హం. -
బాబు అంతటి మోసగాడు దేశ చరిత్రలోనే ఉండడు
-
‘వైఎస్ఆర్ను చూసి గుంట నక్క పాదయాత్ర చేసింది’
-
‘వైఎస్ఆర్ను చూసి గుంట నక్క పాదయాత్ర’
సాక్షి, ఇడుపులపాయ : ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభ కార్యక్రమానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆశీర్వదించడానికి విచ్చేసిన ప్రజలకు వైఎస్ఆర్ సీపీ నేత కొడాలి నాని ధన్యవాదాలు తెలిపారు. ఇడుపులపాయలోని బహిరంగ సభలో ఆయన సోమవారం మాట్లాడారు. ‘పాదయాత్ర అంటే గుర్తుకొచ్చే పేరు వైఎస్. పెద్దపులి లాంటి వైఎస్ను చూసి ఓ నక్క పాదయాత్ర చేసింది. వైఎస్ పేదలకు న్యాయం చేయాలని చెప్పి పాదయాత్రను చేపట్టారు. అనేక మందిని విద్యార్థులను చదివించిన గొప్ప వ్యక్తి వైఎస్. రైతులకు ఉచిత కరెంటు ఇచ్చారు. విద్యుత్ బకాయిలను రద్దు చేశారు’. ఆరోగ్య శ్రీ కార్డులు ఇచ్చి పేదలను ఆసుపత్రికి పంపిన మహానుభావుడని అన్నారు. ఆయన్న చూసి పాదయాత్ర చేసిన బాబు.. పగలంతా బస్సులో పడుకుని రాత్రి నడిచారని విమర్శించారు. -
‘రాజన్న రక్తం వస్తోందని తొడగొట్టి చెప్పండి’
సాక్షి, ఇడుపులపాయ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుర్చీ కదిలేవరకూ, తెలుగుదేశంను ఇంటిదారి పట్టించే వరకూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ఆగదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఇడుపులపాయలోని సభా ప్రాంగణంలో సోమవారం ఆమె మాట్లాడారు. వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తానంటే తెలుగుదేశం పార్టీ నేతల్లో, మంత్రులకు దిమ్మతిరిగిందన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన చేస్తున్న ప్రభుత్వానికి యువత రాజన్న రక్తం వస్తోందని తొడగొట్టి చెప్పాలని పేర్కొన్నారు. రైతులను, మహిళలను, విద్యార్థులను మోసం చేసిన ప్రభుత్వాన్ని గద్దె దింపేదుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. వైఎస్ఆర్ కుటుంబం మాట తప్పదు.. మడమ తిప్పదు.. అంటూ ఈ విషయం పలు అంశాల్లో రుజువైందని గుర్తు చేశారు. పాదయాత్ర వృథా అని అంటున్న వారికి రాష్ట్రంలో సమస్యలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతులు గ్రామాల్లో తలెత్తుకు తిరిగారని అన్నారు. -
ఇడుపులపాయ నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభం
-
మహానేతకు వైస్ జగన్ నివాళులు..
-
మహానేతకు కుటుంబసభ్యుల నివాళులు..
-
ట్రిపుల్ ఐటీ విద్యార్థిని అదృశ్యం
-
జగన్ పాదయాత్రకు చురుగ్గా ఏర్పాట్లు
పులివెందుల/వేంపల్లె: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చే నెల 6 నుంచి చేపటనున్న పాదయాత్ర కోసం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. సభాస్థలితో పాటు బారికేడ్ల ఏర్పాటు, వాహనాల పార్కింగ్ తదితర పనులను జగన్ రాజకీయ కార్శదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్సార్ జిల్లా సమన్వయకర్త వైఎస్ వివేకానందరెడ్డి, ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్రెడ్డి, రఘురామిరెడ్డి, అంజాద్ బాషా, గడికోట శ్రీకాంత్రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, రాచమల్లు శివప్రసాద్రెడ్డి, వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, మేయర్ సురేశ్బాబు, జమ్మలమడుగు, బద్వేలు సమన్వయకర్తలు సుధీర్రెడ్డి, వెంకటసుబ్బయ్య, డీసీఎంఎస్ చైర్మన్ విష్ణువర్థన్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్రెడ్డి మంగళవారం పరిశీలించారు. అంతకుముందు వైఎస్సార్ ఘాట్ వద్ద దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి వారు నివాళులర్పించారు. -
నవంబర్ 2 నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర
సాక్షి ప్రతినిధి, అనంతపురం ఏపీలో నవంబర్ 2వ తేదీ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి చిత్తూరు మీదుగా ఇచ్ఛాపురం వరకూ దాదాపు 3 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తానని చెప్పారు. ఆరు నెలల పాటు సాగే ఈ యాత్రలో ఎక్కడికక్కడ జనంతో మమేకమవుతూ.. రాష్ట్రంలో సాగుతున్న ప్రజావ్యతిరేక పాలన గురించి అందరికీ వివరిస్తానన్నారు. మంగళవారం అనంతపురంలో నిర్వహించిన ‘యువభేరి’లో జగన్ మాట్లాడుతూ పాదయాత్ర గురించి ప్రస్తావించారు. ‘నవంబర్ 2 నుంచి నేను పాదయాత్ర ప్రారంభిస్తున్నా.. యువభేరిలో పాల్గొనకపోవచ్చు. ఇప్పటికే 10 జిల్లాల్లో ఆ కార్యక్రమం నిర్వహించాం. ఇకపై ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలకు ఆ బాధ్యత అప్పగిస్తున్నా. వారు వారి పరిధిలోని ప్రతీ కాలేజీకి వెళ్లి యువభేరి నిర్వహిస్తారు. పాదయాత్రలో కూడా ప్రత్యేక హోదా గురించి వివరించి ప్రజల మద్దతు కూడగడతా. జగన్ ఒక్కడే ఏమీ చేయలేడు. మీ అందరి తోడ్పాటు ఉంటే ఏదైనా సాధ్యమే’ అన్నారు. -
ఇడుపులపాయలో విద్యార్ధుల ఆందోళన
-
ట్రిపుల్ ఐటీలో అధ్యాపకుల ఆందోళన
వేంపల్లె : వైఎస్సార్ జిల్లా వేంపల్లె మండలంలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో అధ్యాపకుడు నాగరాజు మృతికి నిరసనగా తోటి అధ్యాపకులు మంగళవారం ఆందోళనకు దిగారు. నాగరాజు మృతికి ఆర్ జె యూ కె టి యూనివర్సిటీ అధికారులే బాధ్యత వహించాలని రోడ్డుపై బైఠాయించారు. వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంకు చెందిన బి. నాగరాజు ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో మెకానికల్ విభాగంలో కాంట్రాక్ట్ అధ్యాపకునిగా పనిచేసేవాడు. పర్మనెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ప్రకటించగా దరఖాస్తు చేసుకున్నారు. రిజర్వేషన్ ప్రకారం తనకు రావాల్సిన ఉద్యోగం వేరే వ్యక్తికి రావడంతో మనస్థాపం చెందాడు. సమాచార హక్కు చట్టం ద్వారా అవకతవకలు జరిగాయని యూనివర్సిటీపై హై కోర్టులో పిటిషన్ వేశాడు. కానీ యూనివర్సిటీ అధికారులు హైకోర్టును గడువు కోరారు. దీంతో ఈ ఏడాది జులై 19న ట్రిపుల్ ఐటీ ఉన్న తన నివాసంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. కడప రిమ్స్ లో చికిత్స పొంది ప్రాణాలతో బయట పడ్డాడు. కానీ మూడు నెలల తర్వాత మళ్ళీ నాగరాజు తన స్వగ్రామంలో తాడేపల్లి గూడెంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదిలా ఉండగా నాగరాజు మృతికి ట్రిపుల్ ఐటీ అధికారులు సంతాప సూచకంగా చిత్ర పటానికి నివాళులు అర్పించేందుకు సన్నాహాలు చేస్తుండగా మంగళవారం తోటి అధ్యాపకులు అడ్డుకుని ఆందోళనకు దిగారు. మూడు నెలల కిందట నాగరాజు ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలతో బయటపడితే అప్పుడైన నాగరాజుకు న్యాయం చేసి ఉంటే అతను బతికి వుండే వాడని, అధికారులు నిర్లక్ష్యం వల్లే చనిపోయాడని అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఇడుపులపాయలో వైఎస్ జగన్
సాక్షి, పులివెందుల(వైఎస్సార్ జిల్లా): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతి పక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు వేంపల్లె మండలం ఇడుపులపాయ గెస్ట్ హౌస్కు చేరుకున్నారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు వైఎస్ విజయమ్మ, షర్మిల, వైఎస్ భారతీరెడ్డి, బ్రదర్ అనిల్ కుమార్, రాజారెడ్డి, అంజలి, హర్ష, వర్షలు కూడా చేరుకున్నారు. శనివారం ఉదయం దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 9వ వర్ధంతిని పురస్కరించుకుని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి, ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. -
రేపు, ఎల్లుండి వైఎస్ఆర్ జిల్లాలో జగన్ పర్యటన
సాక్షి, హైదరాబాద్ : ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల పాటు (రేపు, ఎల్లుండి) వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. రేపు (సెప్టెంబర్ 2వ తేదీ) దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి. ఈ సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ జగన్తో పాటు కుటుంబసభ్యులు నివాళులర్పించనున్నారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు పులివెందులలో ‘వైఎస్ఆర్ కుటుంబం’ కార్యక్రమాన్ని జననేత ప్రారంభించనున్నారు. అలాగే 3వ తేదీ ఆదివారం పులివెందుల నియోజకవర్గ ప్రజలతో వైఎస్ జగన్ సమావేశం అవుతారు. -
ఇడుపులపాయ త్రిబుల్ ఐటీ విద్యార్థిని అదృశ్యం
-
వైఎస్ఆర్కు కుటుంబసభ్యుల ఘన నివాళి
ఇడుపులపాయ: మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 68వ జయంతి వేడుకలు శనివారం రెండు తెలుగు రాష్ట్రాలలో ఘనంగా ప్రారంభమయ్యాయి. మహానేత జయంతి సందర్భంగా వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. వైఎస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతి, కుమార్తె వైఎస్ షర్మిల, అల్లుడు బ్రదర్ అనీల్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి ఇతర కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మహానేత జయంతి సందర్భంగా తండ్రితో ఉన్న జ్ఞాపకాలను వైఎస్ జగన్ ట్విట్టర్ లో పంచుకున్నారు. ‘నేనేప్పడు ప్రజలను కలుసుకున్నా వారందిరిలోనూ నాన్నగారినే చూస్తున్నాను. వారి ఆదరాభిమానాలు, ఆప్యాయతల్లో నిత్యం ఆయనే కనిపిస్తున్నారు. ప్రజలు చూపిన మార్గంలో నేను నాన్న లాగానే నడుస్తాను. ఆయన కుమారుడిగా గర్వపడుతున్నాను.’ అని ఆయన ట్విట్ చేశారు. I see him, everytime I see people I feel him, everytime I feel their love I walk like him, as they guide me I am grateful #YSRForever pic.twitter.com/6o8wwpFbvB — YS Jagan Mohan Reddy (@ysjagan) 8 July 2017 అనంతరం వైఎస్ఆర్ ఘాట్ ప్రాంగణంలోని మహానేత విగ్రహానికి వైఎస్ జగన్ పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన అభిమానులు, కార్యకర్తలను ఆయన ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమానికి మహానేత కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు వైఎస్ఆర్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మరోవైపు మహానేత 68వ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాలలోని వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ అభిమానులు పెద్ద ఎత్తున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ట్రిపుల్ ఐటీలో సంక్షేమం గాలికి
వేంపల్లె: వేంపల్లె మండలం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల సంక్షేమం గాలిలో దీపంలా మారింది. ఇక్కడి అధికారుల నిర్లక్ష్యం అడుగడుగునా కొట్టొచ్చినట్లు కనిపిస్తోందనే విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా విద్యార్థుల సంక్షేమ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు కానీ.. ఏ ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా విద్యార్థుల సంక్షేమానికి పాటుపడలేదన్న అపవాదు తెచ్చుకున్నారు. అధికారులు సక్రమంగా విధులు నిర్వహించకపోవడంతో ట్రిపుల్ ఐటీలో ఇప్పటికే ముగ్గురు విద్యార్థులు వివిధ కారణాలవల్ల బలవన్మరణాలకు పాల్పడ్డారు. గత నాలుగేళ్ల కాలంలో దాదాపు ఐదారు మంది విద్యార్థులు ఆత్మహత్యకు యత్నించారు. కొంతమంది తీవ్ర గాయాలతో చదువులకు దూరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం రాజేష్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ చనిపోయిన విషయాన్ని తల్లిదండ్రులకు ఆలస్యంగా తెలియజేయడంతో అధికారులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. విద్యార్థుల సంక్షేమం గాలికి.. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ కార్యాలయం పేరుకు మాత్రమే ఉంది. స్టూడెంట్ వెల్ఫేర్ డీన్గా రత్నకుమారి కొనసాగుతుండగా.. డిప్యూటీ వార్డెన్లు అందరూ కలిపి దాదాపు 30మంది దాకా ఇక్కడ ఉన్నారు. కానీ వీరందరూ ఫ్యాకల్టీగా, మెంటర్స్గా ఉంటూ అదనపు బాధ్యతలు చేపడుతున్నారు. నిబంధనల ప్రకారం ట్రిపుల్ ఐటీలో దాదాపు 6వేల మందికిపైగా విద్యార్థులు ఉన్నారు. ప్రధానంగా వార్డెన్లు తరగతి గదులకు వెళ్లకుండా హాస్టల్లో ఉన్న విద్యార్థులను నిశితంగా పరిశీలిస్తూ ఉండాలి. ఒకవేళ దిగాలుగా కనిపిస్తే వారికి కౌన్సెలింగ్ నిర్వహించి వారి మనసు మార్చే ప్రయత్నం చేయాలి. తీరని సమస్య అయితే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలి. కానీ నిబంధనల ప్రకారం ఏ ఒక్కటి కూడా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో జరగలేదని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గతంలో జరిగిన సంఘటనలు ఇలా.. – 2015 ఆగస్టు 10వ తేదీన కర్నూలు జిల్లా కొమిలిగుండ్ల గ్రామానికి చెందిన వడ్డే భారతి (ఈ3 విద్యార్థిని) విషద్రావణం మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. – 2015 అక్టోబరు 30వ తేదీన తూర్పు గోదావరి జిల్లా అప్పనపల్లె గ్రామానికి చెందిన ఉమా జ్యోతి(ఈ3 విద్యార్థిని) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. – 2017 ఫిబ్రవరి 15వ తేదీన చిత్తూరు జిల్లా ఐరాల మండలం తాళంబేడువారిపల్లెకు చెందిన కొత్త రాజేష్(ఈ4 విద్యార్థి) ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. – 2016 ఫిబ్రవరి 6వ తేదీన సౌందర్య, నవీన్ అనే విద్యార్థులు శేషాచలం అడవుల్లోకి పారిపోయి మూడు రోజుల తర్వాత పొలతల వద్ద పోలీసుల గాలింపు చర్యలలో పట్టుబడ్డారు. వారం రోజులక్రితం జమ్మలమడుగుకు చెందిన పీ1 విద్యార్థిని మాస్ కాపీయింగ్కు పాల్పడటంతో దండించారని యాంటీ బయాటిక్ మాత్రలను మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇలాంటి సంఘటనలు కొన్ని తెరపైకి రాగా.. వెలుగు చూడని సంఘటనలు మరెన్నో ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. -
ట్రిపుల్ఐటీ విద్యార్థి ఆత్మహత్య
వేంపల్లె(వైఎస్సార్ జిల్లా): ఇడుపులపాయ ఐఐఐటీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న రాజేష్(20) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం మధ్యాహ్న సమయంలో హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమవ్యవహారామే ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. ఆత్మహత్యకు పాల్పడ్డ రాజేష్ స్వస్థలం చిత్తూరు జిల్లా. తోటి విద్యార్థులు చూసి అక్కడే ఉన్న ఆసుపత్రిలో చేర్పించారు. కానీ అప్పటికే రాజేష్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. -
ట్రిపుల్ ఐటీ ద్వితీయ స్నాతకోత్సవానికి సన్నాహాలు
వేంపల్లె : ఇడుపులపాయలోని ఆర్జీయూకేటీ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ ద్వితీయ స్నాతకోత్సవాన్ని జనవరి 4వ తేదీన నిర్వహించనున్నట్లు డైరెక్టర్ ఆచార్య గొడవర్తి భగవన్నారాయణ తెలియజేశారు. స్నాతకోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని తెలిపారు. గౌరవ అతిథులుగా మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆర్జీయూకేటీ కులపతి ఆచార్య రాజ్రెడ్డి, ఉప కులపతి ఆచార్య రామచంద్రరాజు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నారని చెప్పారు. గతనెల రోజుల నుంచి స్నాతకోత్సవ సమీక్షలు ఇక్కడ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం కూడా అధికారులకు, అధ్యాపకులకు, విద్యార్థులకు కేటాయించిన పనులపై సమీక్ష చేశారు. స్టేజీ నిర్మాణం, వచ్చిన అతిథులకు భోజన సౌకర్యం, విలేకరులకు ఆహ్వానం, తల్లిదండ్రులకు ఆహ్వాన పత్రాలు, మెడల్స్ తయారీ, ఇతరత్రా ఆహ్వాన పత్రికలతోపాటు స్నాతకోత్సవ బ్యానర్లువంటి అంశాలను పరిపాలన అధికారి అమరేంద్ర కుమార్ పండ్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్నాతకోత్సవ సమీక్షలో డైరెక్టర్ భగవన్నారాయణతోపాటు ఒంగోలు డైరెక్టర్ విశ్వనాథరెడ్డి, పరిపాలన అధికారి అమరేంద్ర పండ్ర, విద్యా సంరక్షణ అధికారి కొండారెడ్డి, ఆర్థిక అధికారి మోహన్ కృష్ణ, రత్నకుమారి, కెఎల్ఎన్రెడ్డి, వేణుగోపాల్రెడ్డి, నరసప్ప, అజీజ్, లక్ష్మణ్, ఎంఎన్ బ్రహ్మానందయ్య తదితర అధ్యాపకులు పాల్గొన్నారు. -
నేటి నుంచి వైఎస్సార్ జిల్లాలో జగన్ పర్యటన
-
పులివెందుల చేరుకున్న వైఎస్ జగన్
24న ఇడుపులపాయలో కుటుంబసభ్యులు, బంధువులతో ప్రత్యేక ప్రార్థనలు ► 25న క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్న వైఎస్ జగన్ ► మండల ఉపాధ్యక్షుడి కుటుంబసభ్యులకు పరామర్శ ► కడప, ప్రొద్దుటూరులలో పలు కార్యక్రమాలకు హాజరు ► 26న పీబీసీ నీటి విషయమై ధర్నా పులివెందుల: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం పులివెందుల చేరుకున్నారు. శనివారం నుంచి మూడు రోజుల పాటు వైఎస్ఆర్ జిల్లాలో ఆయన పర్యటిస్తారు. వైఎస్ జగన్ పర్యటన వివరాలను ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి 24వ తేదీన ఉదయం 9గంటలకు పులివెందులలోని వెంకటప్ప మెమోరియల్ స్కూల్ పదో వార్షికోత్సవ వేడుకలలో పాల్గొంటారు. 9.30కు పులివెందులలోని వీజే ఫంక్షన్ హాల్లో వైఎస్ఆర్సీపీ నాయకుడు రామట్లపల్లె భాస్కర్రెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుకల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి నేరుగా 10 గంటలకు ఇడుపులపాయకు చేరుకొని అక్కడ కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో కాసేపు మాట్లాడతారు. క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొంటారు. అక్కడ నుంచి 2 గంటలకు ప్రొద్దుటూరుకు చేరుకుని అక్కడ పార్టీ నాయకులు ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం కడపకు చేరుకుని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. 25వ తేదీ ఉదయం 8.30కు క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3గంటలకు వేంపల్లె మండలం అలవలపాడు గ్రామానికి చేరుకుని ఇటీవల ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురైన మండల ఉపాధ్యక్షుడు గజ్జెల రామిరెడ్డి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. 5.30కు కడపలో కార్పొరేటర్ మక్బుల్ నివాసానికి చేరుకొని ఆయన కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడ నుంచి పులివెందులకు చేరుకుంటారు. 26వ తేదీ ఉదయం 9.30కు పీబీసీ నీటి విషయమై పులివెందుల తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాలో పాల్గొంటారని ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి తెలిపారు. -
రేపటి నుంచి వైఎస్సార్ జిల్లాలో జగన్ పర్యటన
-
12మంది ఉద్యోగాలకు ఎంపిక
వేంపల్లె(ఇడుపులపాయ) : ఆర్కె వ్యాలీ ఇడుపులపాయ ట్రిపుల్ ఐటిలో శనివారం టెక్ మహేంద్ర సంస్థ ఇంటర్వ్యూలు నిర్వహించింది. 12మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందారని డైరెక్టర్ ఆచార్య భగవన్నారాయణ తెలిపారు.ఈసీఈ విభాగం నుంచి 8మంది,మెకానికల్ నుండి ముగ్గురు,సివిల్ నుంచి ఒకరు ఎంపికయ్యారు.వీరికి ఏడాదికి రూ.3.25 లక్షలు వేతనం అందజేయనున్నట్లు టెక్ మహేంద్ర అధికారులు శ్రీధర్,సుధాకర్,శ్యామ్సుందర్లు తెలిపారు. విద్యార్థులను డైరెక్టర్ భగవన్నారాయణ,కెయల్యన్ రెడ్డి,వేణుగోపాల్ రెడ్డి,ప్లేస్ మెంట్ అధికారులు లక్ష్మణ్ నాయక్,అశోక్ తదితరులు అభినందించారు. -
ట్రిపుల్ ఐటీలో చిరుత సంచారం
వేంపల్లె : ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ పరిసర ప్రాంతాలలో చిరుత సంచారం మొదలైంది. గురు, శుక్రవారాలలో వీరన్నగట్టుపల్లె, ట్రిపుల్ ఐటీ రహదారి మధ్యలో ఉన్న ఓ వంతెన వద్ద చిరుత కనిపించిందని అక్కడ ఉన్న మెంటర్స్.. ట్రిపుల్ ఐటీ అధికారులకు తెలియజేశారు. దీంతో ఏవో అమరేంద్రకుమార్ వేంపల్లె అటవీ శాఖాధికారి పీసీ రెడ్డయ్య, ఆర్కె వ్యాలీ ఎస్ఐ మస్తాన్బాషా, ట్రిపుల్ ఐటీ సెక్యూరిటీ ఆఫీసర్ రెడ్డిశేఖరరెడ్డిలకు చిరుత సంచారం గురించి శుక్రవారం తెలిపారు. ట్రిపుల్ ఐటీలో మెస్ల వద్ద కుక్కల తాకిడి ఎక్కువైందని.. దీంతో కుక్కలను తినేందుకు చిరుత ఆ ప్రాంతానికి వచ్చి ఉంటుందని అటవీ శాఖాధికారి రెడ్డయ్య తెలిపారు. అక్కడ కుక్కలను లేకుండా చూడాలని ట్రిపుల్ ఐటీ అధికారులకు తెలిపామని ఆయన పేర్కొన్నారు. ఇడుపులపాయ నుంచి పొలతల ఫారెస్ట్ వరకు ప్రతి కిలోమీటరుకు ఒక చిరుత ఉంటుందన్న అభిప్రాయం ఉందని రేంజర్ తెలిపారు. ఇదిలా ఉండగా.. ట్రిపుల్ ఐటీ క్యాంపస్కు ఇంతవరకు సక్రమంగా ప్రహరీ లేనందున చిరుతలు లోపలికి వచ్చే అవకాశం ఉంది. భద్రమైన రక్షణ గోడ నిర్మించుకొని పెన్సింగ్ వాల్ ఏర్పాటు చేసుకుంటే అక్కడికి చిరుతలు రావని అటవీ శాఖాధికారులు తెలిపారు. -
దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు: వైఎస్ జగన్
ఇడుపులపాయ: సీఎం చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో పూర్తిగా కూరుకుపోయారని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. పాలనను గాలికి వదిలేసి ఈ కేసు నుంచి బయట పడేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో శుక్రవారం పంట పొలాల్లో రెయిన్ గన్ల పనితీరును వైఎస్ జగన్ పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... ప్రత్యేక హోదా సాధనపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదన్నారు. ఓట్లుకు కోట్లు కేసులో ముఖ్యమంత్రి స్వయంగా పట్టుబడడం దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదని తెలిపారు. పట్టుబడిన తర్వాత కూడా చంద్రబాబు అరెస్ట్ కాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయనకున్న అధికారాలు, పరిచయాలను ఉపయోగించుకుని తప్పించుకుంటున్నారని ఆరోపించారు. తన కేసుల మాఫీ గురించి సుజనా చౌదరిని ఢిల్లీకి పంపారని అన్నారు. చంద్రబాబు పాత్రపై విచారణకు ప్రత్యేక కోర్టు ఆదేశించిన వెంటనే సుజనా చౌదరి పరుగున వెళ్లి అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, అమిత్ షాలను కలిశారని గుర్తు చేశారు. హైదరాబాద్ వచ్చి గవర్నర్ తో భేటీ అయ్యారని వెల్లడించారు. ప్రత్యేకహోదా గురించి కలిసామంటూ జనం చెవుల్లో పూలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాకు, గవర్నర్ కు సంబంధం ఉందా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు పాలన అంతా మోసం, అబద్ధం అని వ్యాఖ్యానించారు. డబ్బు సంపాదన, కేసుల నుంచి ఎలా బయటపడాలనే దాని గురించే చంద్రబాబు ఆలోచిస్తుంటారని అన్నారు. రైతులపై చంద్రబాబు ఏమాత్రం ప్రేమ లేదని వైఎస్ జగన్ అన్నారు. 2013-14లో రైతులకు ఇన్ఫుట్ సబ్సిడీ ఎగ్గొట్టారని చెప్పారు. 2014-15లో కలెక్టర్లు ఇచ్చిన నివేదికలను కుదించి రూ.600 కోట్లే ఇచ్చారని తెలిపారు. 11 ఏళ్ల క్రితమే రెయిన్ గన్లు వాడుకలోకి వచ్చాయన్నారు. నీళ్లు లేకుండా రెయిన్గన్లుతో ఏం ఉపయోగమని ప్రశ్నించారు. శ్రీశైలం నుంచి నీళ్లు అందించాల్సిన బాధ్యత సీఎం చంద్రబాబుపై ఉందన్నారు. పులిచింతల ప్రాజెక్టులో 45 టీఎంసీల నీళ్లకు అవకాశమున్నా కేవలం 15 టీఎంసీలే ఉంచుతున్నారని అన్నారు. కృష్ణా, గోదావరి డెల్టాలు, రాయలసీమ కరువుతో అల్లాడుతున్న పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. అన్నదాతలకు అండగా నిలవాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. -
దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు
-
మహానేతకు ఘన నివాళి
-
మహానేతకు ఘననివాళి
ఇడుపులపాయ: మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి ఏడవ వర్థంతిని ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు ఆయన తల్లి, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతీరెడ్డి, సోదరి షర్మిల తదితరులు వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఉదయం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ సీపీ నేతలు, అభిమానులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ వర్ధంతిని పురస్కరించుకుని ఇవాళ తెలుగురాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. -
నేడు రేపు వైఎస్ఆర్ జిల్లాలో జగన్ పర్యటన
-
తెలుగు రాష్ట్రాలో రేపు వైఎస్ఆర్ వర్థంతి కార్యక్రమాలు
హైదరాబాద్ : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి కార్యక్రమాలు శుక్రవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించనున్నారు. వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నారు. అలాగే వైఎస్ఆర్ కుటుంబసభ్యులు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించనున్నారు. మరోవైపు హైదరాబాద్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి కార్యక్రమానికి పార్టీ సీనియర్ నేతలు హాజరు కానున్నారు. -
2,3 తేదీల్లో వైఎస్ఆర్ జిల్లాలో జగన్ పర్యటన
పులివెందుల : ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సెప్టెంబర్ 2, 3 తేదీల్లో వైఎస్సార్ జిల్లాలో పర్యటిస్తారని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా రెండో తేదీన ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలసి జగన్మోహన్రెడ్డి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారని ఆయన వెల్లడించారు. మూడో తేదీన కడప కలెక్టరేట్ ఎదుట జరిగే రైతు మహాధర్నాలో ప్రతిపక్ష నేత పాల్గొంటారని తెలిపారు. ఇవిగాక ఇంకా పలు కార్యక్రమాల్లోనూ వైఎస్ జగన్ పాల్గొననున్నారని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత పర్యటన షెడ్యూలు ఇలా.. వైఎస్ జగన్ గురువారం సాయంత్రం బెంగళూరు నుంచి బయల్దేరి రాత్రికి నేరుగా ఇడుపులపాయకు చేరుకుంటారు. 2వ తేదీ శుక్రవారం ఉదయం 7.30కు తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని వైఎస్సార్ ఘాట్ వద్ద కుటుంబసభ్యులతో కలసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం 8.30 గంటల నుంచి 11 గంటల వరకు గెస్ట్హౌస్లో ప్రజలకు అందుబాటులో ఉంటారు. మధ్యాహ్నం వేంపల్లెకు చేరుకుని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడ్నుంచీ పులివెందులకు చేరుకుని మధ్యాహ్నం 2.30 గంటలకు స్థానిక రిలయన్స్ పెట్రోలుబంక్ నుంచి బెస్తవారిపల్లె వరకు పర్యావరణ పరిరక్షణకోసం మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. 3గంటలకు పులివెందుల మండలం ఎర్రిపల్లె సమీపంలో దెబ్బతిన్న వేరుశనగ పంటను పరిశీలిస్తారు. 3.30కు పులివెందులలోని సీఎస్ఐ చర్చి వద్ద నూతనంగా నిర్మించిన ఆర్వో ప్లాంటును ప్రారంభిస్తారు. 4.30కు కడప రోడ్డులో గల తన చిన్నాన్న వైఎస్ జోసఫ్రెడ్డి ఇంటిని సందర్శిస్తారు. జగన్మోహన్రెడ్డి 3వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు పులివెందుల నుంచి కడపకు రోడ్డుమార్గాన వెళ్లి 10.30 గంటలకు నూతన కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగే రైతు మహాధర్నాలో పాల్గొంటారు. సాయంత్రం 4.30 గంటలకు లింగాల మండలం ఇంటిఓబాయపల్లెలోని ఎంపీటీసీ రమణ ఇంటికి చేరుకుని ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రాత్రి 7గంటలకు పులివెందులలోని టీటీడీ కల్యాణ మండపానికి చేరుకుని పెద్దజూటూరు పార్టీ నాయకుడు రామచంద్రారెడ్డి కుమారుని వివాహ రిసెప్షన్లో పాల్గొంటారు. రాత్రి 9గంటలకు ముద్దనూరుకు చేరుకొని వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో హైదరాబాద్కు బయల్దేరి వెళతారు. -
2,3 తేదీల్లో వైఎస్ఆర్ జిల్లాలో జగన్ పర్యటన
-
వచ్చే ఏడాది అనంతపురంలో కొత్త ట్రిపుల్ ఐటీ
వేంపల్లె: గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించాలన్న ఉద్దేశంతో ట్రిపుల్ ఐటీలను నెలకొల్పామని.. ఇదే ఎంపిక విధానాన్ని కొనసాగిస్తామని.. కొత్త విధానం అమలు చేయడంవల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని ఆర్జీయూకేటీ చాన్స్లర్ ఆచార్య రాజిరెడ్డి వెల్లడించారు. సోమవారం ఆయన వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విలేకరులతో మాట్లాడారు. డైరెక్టర్ ఆచార్య భగవన్నారాయణ, ఏవో ఆచార్య విశ్వనాథరెడ్డి, అకడమిక్ డీన్ వేణుగోపాల్రెడ్డిలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరులు ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఎంపిక విధానాన్ని నేరుగా కాకుండా పోటీ పరీక్ష నిర్వహించి తీసుకోవాలని ఒక అభిప్రాయం వెల్లడవుతోందని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకు స్పందించిన ఆయన కేవలం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించాలన్న ఉద్దేశంతో ట్రిపుల్ ఐటీలను స్థాపించామన్నారు. ఎంపిక విధానం మార్చడం వల్ల అర్బన్ ఏరియాల్లో ఉన్న విద్యార్థులకు ఎక్కువ సీట్లు వస్తాయని.. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని.. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రస్తుత విధానాన్ని మార్చబోమన్నారు. వచ్చే ఏడాది రాయలసీమకు సంబంధించి అనంతపురంలో కొత్త ట్రిపుల్ ఐటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రతి మండలానికి నాలుగు సీట్లు దక్కే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు సంబంధించి ప్రస్తుతం నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీల్లో విద్యార్థులకు సాంకేతిక విద్యనభ్యసిస్తామన్నారు. -
సరదా తెచ్చిన తంటా
వేంపల్లె(ఇడుపులపాయ) : ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థి సరదాగా రైలింగ్ (మెట్ల వద్ద రక్షణగా వేసిన స్టీల్ పైపులు)పై జారుతుండగా.. ప్రమాదవశాత్తు నాల్గవ అంతస్తు నుంచి జారిపడి ప్రాణం మీదకు తెచ్చుకొన్నాడు. తలకు తీవ్ర గాయాలై పరిస్థితి విషమించడంతో తిరుపతి రమాదేవి ఆసుపత్రికి తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఇడుపులపాయ జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం కోనఅనంతపురం సుగాలి తాండాకు చెందిన రామయ్య నాయక్ ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో పీ–2 (ఇంటర్సెకండియర్) పూర్తి చేసుకొని ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదివేందుకు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో పాత క్యాంపస్ నుంచి కొత్త క్యాంపస్లో ఈ విద్యార్థులకు గదులు కేటాయించారు. బ్లాక్–1లో ఉన్న భవనంలో రామయ్య నాయక్ రెండవ అంతస్తులో తోటి విద్యార్థులతో ఉన్నాడు. మంగళవారం రాత్రి 10గంటల సమయంలో నాల్గవ అంతస్తులో ఉన్న స్నేహితులను కలిసేందుకు అక్కడికి వెళ్లాడు. తిరిగి వచ్చే క్రమంలో సరదాగా మెట్లకు రక్షణగా వేసిన స్టీల్ పైపులపై(రైలింగ్) జారుతూ గదికి చేరుకోవాలనుకున్నాడు. పైపులపై జారే ప్రయత్నంలో చేతిలో పుస్తకాలు ఉన్నందువల్ల అదుపు తప్పి కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అధికారులు స్థానిక ట్రిపుల్ ఐటీ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సలహా మేరకు తిరుపతి స్విమ్స్కు తరలించారు. అక్కడ చేర్చుకొనేందుకు నిరాకరించడంతో తిరుపతిలోని రమాదేవి ఆసుపత్రిలో చేర్పించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. -
ఇడుపులపాయలో ఘనంగా వైఎస్ జయంతి
నివాళులర్పించిన వైఎస్ జగన్, విజయమ్మ, షర్మిల, కుటుంబ సభ్యులు వేంపల్లె: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 67వ జయంతి సందర్భంగా శుక్రవారం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ జనసంద్రమైంది. ఉదయం 8.30 గంటలకు వైఎస్ఆర్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతిరెడ్డి, సోదరి షర్మిల, ఆమె భర్త బ్రదర్ అనిల్కుమార్, వైఎస్ మనుమడు వైఎస్ రాజారెడ్డి, మనుమరాళ్లు వర్ష, హర్ష, అంజలిలతో కలిసి ఘాట్కు చేరుకున్నారు. ఫాదర్ రెవరెండ్ డాక్టర్ నరేష్బాబు, రెవరెండ్ బెన్హర్, పాస్టర్ మృత్యుంజయరావులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భౌతికంగా వైఎస్ మన మధ్య లేకపోయినా.. ఎప్పటికీ అందరి హృదయాల్లో నిలిచి ఉంటారని, మహానేత ప్రేమకు ప్రతిరూపమని కుటుంబ సభ్యులందరూ స్మరించుకున్నారు. వైఎస్ ఘాట్పై పూల మాలలు ఉంచి, ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళుల ర్పించారు. వైఎస్ సోదరులు వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ సుధీకర్రెడ్డి, వైఎస్ జార్జిరెడ్డి సతీమణి భారతి, ప్రముఖ చిన్నపిల్లల వైద్యుడు ఈసీ గంగిరెడ్డి, ఆయన సతీమణి ఈసీ సుగుణమ్మ, కుమారుడు దినేష్రెడ్డి, వైఎస్ మేనత్త కమలమ్మ, సోదరి విమలమ్మ, మాజీ ఎమ్మెల్యే పురుషోత్తమరెడ్డి, వైఎస్ ప్రకాష్రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఆయన సతీమణి సమత, ఎమ్మెల్యేలు అంజాద్బాషా, శ్రీకాంత్రెడ్డి, కడప మేయర్ సురేష్బాబు, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, కమలాపురం సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, జెడ్పీ చైర్మన్ గూడూరు రవి, పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్రెడ్డి తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అభిమానులు, ప్రజలు వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. -
మహానేతకు ఘన నివాళి
-
ఇంటికో విమానం ఇస్తామని చెబుతాడు
పులివెందుల: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండేళ్ల పాలనలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఇడుపులపాయ గ్రామంలో గడప గడపకు వైఎస్ఆర్ సీపీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారని, మొత్తం లక్షా 45 వేల కోట్ల రూపాయల అవినీతికి శ్రీకారం చుట్టారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలిచ్చిన చంద్రబాబు ఒక్కదాన్ని కూడా నెరవేర్చలేదని వైఎస్ జగన్ చెప్పారు. హామీలపై చంద్రబాబును నిలదీయాలని, అప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుందని అన్నారు. లేకుంటే వచ్చే ఎన్నికల్లో ఇంటికో కారు లేదంటే ఏకంగా విమానమే ఇస్తామని చంద్రబాబు చెబుతారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు మోసాలను ఎండగట్టేందుకు ప్రజలకే బ్యాలెట్ ఇస్తున్నామని, వంద మార్కులకు ఎన్ని మార్కులు వేస్తారో చెప్పాలని కోరుతామని తెలిపారు. గత ఎన్నికల సమయంలో రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తామని చంద్రబాబు చెప్పారని, ఇప్పటివరకు ఎవరికీ రుణాలు మాఫీ చేయలేదని వైఎస్ జగన్ విమర్శించారు. మోసం చేసేవారిని ఎక్కడికక్కడ నిలదీస్తేనే మార్పు వస్తుందని అన్నారు. గడప గడపకు వైఎస్ఆర్ సీపీ కార్యక్రమంలో ప్రతిచోటా తాను పాల్గొంటానని చెప్పారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పులివెందులలో ప్రతి ఇంటికీ ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తారని వైఎస్ జగన్ తెలిపారు. -
ఇడుపులపాయ ట్రిపుల్ఐటీలో ఆందోళన
కడప: వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపలపాయ ట్రిపుల్ ఐటీలో శుక్రవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. అధ్యాపకుడు చేయి చేసుకున్నాడని విద్యార్థులు ధర్నాకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటీవలి కాలంలో కొత్తగా అమలులోకి వచ్చిన నిబంధనలను విద్యార్థులు అలక్ష్యం చేయడంతో.. కళాశాల సిబ్బంది ఈ అంశాన్ని అధ్యాపకుల దృష్టికి తీసుకెళ్లారు. కళాశాలలో ఈ-4 చదువుతున్న విద్యార్థి శుక్రవారం యూనిఫాం, గుర్తింపు కార్డు లేకుండా కళాశాలకు వచ్చాడు. దీంతో సిబ్బంది అధ్యాపకులకు విషయం తెలియ జేశారు. ఆ విద్యార్థిని తన గదికి పిలిపించిన రూపక్ కుమార్ అతనికి సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో విద్యార్థులకు ఉపాధ్యాయుడికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో రూపక్కుమార్ చేతి వాచీ విద్యార్థి తలకు తాకడంతో.. విద్యార్థికి తలకు గాయామైంది. దీంతో కోపోద్రిక్తులైన తోటి విద్యార్థులు ఆందోళనకు చేస్తున్నారు. -
ట్రీపుల్ ఐటీ విద్యార్థుల అదృశ్యం
వేంపల్లె : వైఎస్ఆర్ జిల్లాలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి, మరో విద్యార్థిని అదశ్యమయ్యారు. శనివారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో వీరు ట్రిపుల్ ఐటీ నుంచి వెళ్లినట్లు తెలుస్తోంది. విద్యార్థుల అదృశ్యంపై ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఏవో విశ్వనాథరెడ్డి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఆకువీడు గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు కుమారుడు పి.నవీన్, చిత్తూరు జిల్లా విజయపురం మండలానికి చెందిన విద్యార్థిని 2014లో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో చేరారు. వీరిద్దరూ ఏ-6 తరగతి గదిలో చదువుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో వీరు అదృశ్యమయ్యారు. ఉదయం 8 గంటలకు వీరు తరగతి గదిలోకి రాకపోవడంతో పలుచోట్ల గాలించారు. ఆచూకీ లేకపోవడంతో విషయాన్ని అధికారులు వారి తల్లిదండ్రులకు తెలిపారు. వీరి మొబైల్ ఫోన్లు ఇక్కడే వదిలేసి వెళ్లడంతో అందులో ఉన్న మెసేజ్లు, ఫోన్ నెంబర్ల ఆధారంగా కొంత సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ శేషయ్య తెలిపారు. -
వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ జగన్ నివాళులు
-
వైఎస్ఆర్కు కుటుంబ సభ్యుల నివాళి
-
వైఎస్ఆర్కు కుటుంబ సభ్యుల నివాళి
ఇడుపులపాయ : దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరో వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ, కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కోడలు వైఎస్ భారతి, కుమార్తె షర్మిల, అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్, ఇతర కుటుంబ సభ్యులతో పాటు పార్టీ నేతలు వైఎస్ సమాధి వద్ద అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నివాళులు అర్పించినవారిలో వైఎస్ఆర్ సోదరి వైఎస్ విమలమ్మ, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ సుధాకర్ రెడ్డి, వైఎస్ పురుషోత్తమరెడ్డి, వైఎస్ ప్రకాష్ రెడ్డి, మేయర్ సురేష్ బాబు తదితరులు ఉన్నారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. -
శోకం నడిచిన దారి!
-
నేడు మహానేత వైఎస్సార్ ఆరో వర్ధంతి
కడప: నేడు దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరో వర్ధంతి కార్యక్రమాన్ని వైఎస్సార్ ఘాట్ వద్ద నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయకు చేరుకున్నారు. వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ జగన్, ఇతర కుటుంబసభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. -
ఇడుపులపాయలో ఘనంగా వైఎస్ జయంతి
నివాళులర్పించిన వైఎస్ జగన్, విజయమ్మ, షర్మిల, ఇతర కుటుంబ సభ్యులు వేంపల్లె: వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ రాజశేఖరరెడ్డి 66వ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ కుమార్తె షర్మిల, బ్రదర్ అనిల్కుమార్, కోడలు వైఎస్ భారతిరెడ్డి, మనుమడు రాజారెడ్డి, మనుమరాళ్లు హర్ష, వర్ష, అంజలి, ఇతర కుటుంబ సభ్యులు వైఎస్ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉదయం 8 గంటల సమయంలో వైఎస్ ఘాట్కు చేరుకున్న వైఎస్ జగన్ చాలాసేపు సమాధివైపు తదేకంగా చూస్తూండిపోయారు. వైఎస్ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ నివాళులర్పించి.. గంట పాటు అక్కడ గడిపారు. వైఎస్ ఆశయ సాధనకు అందరం కృషి చేస్తామని ఈ సందర్భంగా వైఎస్ కుటుంబ సభ్యులు చెప్పారు. పాస్టర్లు నరేష్ బాబు, మృత్యుంజయరావు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ జార్జిరెడ్డి సతీమణి భారతమ్మ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్.పురుషోత్తమరెడ్డి, డాక్టర్ ఈసీ గంగిరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి వైఎస్ సౌభాగమ్మ, వైఎస్ సోదరుడు వైఎస్ సుధీకర్రెడ్డి, కుటుంబ సభ్యులు వైఎస్ ప్రకాష్రెడ్డి, కమలమ్మ, విమలమ్మ, పులివెందుల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ ప్రమీలమ్మ, వైఎస్ సోదరి రాజమ్మ, మరియమ్మ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి, ఎమ్మెల్యేలు అంజాద్ బాషా, శ్రీకాంత్రెడ్డి, కడప మేయర్ సురేష్బాబు పాల్గొన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అన్ని జిల్లాల్లోనూ వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఆయన అభిమానులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు నివాళులర్పించారు. రక్తదానం తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్ ఇచ్చిన కుటుంబమే నాకు స్ఫూర్తి: జగన్ సాక్షి, హైదరాబాద్ : ‘‘ప్రతి అడుగులోనూ నాన్న లేని లోటును చవిచూస్తున్నాను. అయి తే నాన్న నాకొక పెద్ద కుటుంబాన్ని ఇచ్చివెళ్లారు. ఆ కుటుంబమే కష్టకాలంలోనూ తోడుగా ఉంటూ నాకు దన్నుగా నిలిచింది, నిలుస్తోంది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్రెడ్డి తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజున స్మరించుకున్నారు. వైఎస్సార్ 66 వ జయంతిని పురస్కరించుకుని జగన్మోహన్రెడ్డి తనలోని భావాలను ట్వీటర్లో ఈ విధంగా స్పందించారు. ‘‘ఆయన (వైఎస్) గొప్పతనాన్ని నాకు గుర్తుచేస్తూ, ఆయన బాటలో నడిచేలా నాకు స్ఫూర్తినిస్తున్నారు. తద్వారా మీ నుంచి నేను రోజూ ధైర్యాన్నీ మద్దతునూ పొందుతున్నాను’’ అని అభిమానులందరినీ స్మరించుకున్నారు.