2019 Pulwama attack: ‘పుల్వామా దాడి చేసింది మేమే’: పాకిస్తాన్‌ | Pakistan top air force official admits role in Pulwama | Sakshi
Sakshi News home page

2019 Pulwama attack: ‘పుల్వామా దాడి చేసింది మేమే’: పాకిస్తాన్‌

May 11 2025 5:48 PM | Updated on May 11 2025 6:00 PM

Pakistan top air force official admits role in Pulwama

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ (Pakistan) మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. 2019 ఫిబ్రవరి 14న కశ్మీర్‌లోని పుల్వామాలో (2019 Pulwama attack) 40మంది భారత సీఆర్‌పీఎఫ్‌ (central reserve police force) జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై దాడి వెనుక తమ హస్తం ఉందని అంగీకరించింది. ఇన్ని రోజులు పుల్వామా దాడిలో తమకు ప్రమేయం లేదన్న పాక్‌.. ఇప్పుడు బహిరంగంగా అంగీకరించడంపై అంతర్జాతీయ సమాజం నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ఏడాది ఏప్రిల్‌ 22న పహల్గాం ఉగ్రదాడిపై పాకిస్తాన్‌కు భారత్‌ తగిన గుణం పాఠం చెబుతోంది. ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor)తో ఇండియన్‌ ఆర్మీ.. పాక్‌,పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో క్షిపణి దాడులు చేసింది. లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్‌ ఉగ్ర స్థావరాల్ని, ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపేసింది. దీంతో భారత్‌ చేతిలో చావు దెబ్బ తిన్న పాకిస్తాన్‌ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. భారత్‌ కొనసాగిస్తున్న ఆపరేషన్‌ సిందూర్‌పై బహిరంగంగా స్పందించింది.

 

ఇటీవల ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీజీ ఐఎస్పిఆర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి,పాక్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఎయిర్‌ వైస్‌ మార్షల్‌,పాకిస్తాన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ డైరెక్టర్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఔరంగజేబ్‌ అహ్మద్‌ ఆపరేషన్‌ సిందూర్‌ గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే  పుల్వామా దాడితో మా ఎత్తుగడ ఎలాంటిదో చూపించాం. మా దేశ గగనతలం, భూమి, జలాలు, ప్రజలకు ముప్పు పొంచి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో రాజీపడబోం. దేశ ప్రజల రుణం తీర్చుకుంటాం. ఇప్పటికే పుల్వామాలో మా వ్యూహాత్మక చతురత ప్రదర్శించాం’ అని ఔరంగజేబ్ అహ్మద్ అన్నారు.

ఔరంగజేబ్‌ అహ్మద్‌ ప్రకటనతో ఇన్ని రోజులు పుల్వామా దాడి వెనుక తమ పాత్రలేదని బుకాయించిన పాకిస్తాన్‌ ఇప్పుడు బహిరంగంగా ఉగ్రవాదంతో నెరుపుతున్న సంబంధాల గురించి ప్రకటన చేయడంపై విమర్శలకు దారి తీసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement