![అసమానతలు ఉన్నంత వరకూ రిజర్వేషన్లు: భాగవత్](/sites/default/files/styles/webp/public/article_images/2017/09/2/51410120682_625x300.jpg.webp?itok=hnquQLXl)
న్యూఢిల్లీ: సమాజంలో అసమానతలు, వివక్ష కొనసాగుతున్నంత కాలం రిజర్వేషన్లు అవసరమేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ పేర్కొన్నారు. అయితే ఈ రిజర్వేషన్ల కోటా విషయంలో రాజకీయాలు తగవని వ్యాఖ్యానించారు. ఆదివారం భాగవత్ ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.
‘‘మేం రిజర్వేషన్లను సమర్థిస్తాం. సమాజంలో అసమానతలు ఉన్నంత కాలం రిజర్వేషన్లు అవసరమే. అసమానత, వివక్షలతో బాధపడుతున్నవారు సమాన అవకాశాలు పొందడానికి రిజర్వేషన్లు అవకాశం కనిపిస్తాయి. కానీ, ఈ విషయంలో రాజకీయాలు ఏ మాత్రం తగవు’’ అని ఆయన పేర్కొన్నారు.