reservations
-
పార్లమెంట్ను కుదిపేసిన డీకే శివకుమార్ వ్యాఖ్యలు
బెంగళూరు/న్యూఢిల్లీ: రిజర్వేషన్లపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు.. సోమవారం పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేశాయి. డీకేఎస్ వ్యాఖ్యలతో రాజ్యాంగాన్నే మార్చేయాలన్న కాంగ్రెస్ మనస్తత్వం బయటపడిందని బీజేపీ విమర్శించగా.. ప్రతిపక్ష కాంగ్రెస్ గట్టి కౌంటరే ఇచ్చింది. ఈ క్రమంలో రాజ్యసభ 2గం.దాకా కార్యకలాపాలకు దూరంగా ఉండగా, లోక్సభ పదే పదే వాయిదా పడుతూ వచ్చింది.కర్ణాటక ప్రభుత్వం మైనారిటీ కోటా కింద కాంట్రాక్టులలో నాలుగు శాతం ముస్లింలకు కేటాయించడంపై బీజేపీ, కాంగ్రెస్లు విమర్శలతో పార్లమెంట్ను వేడెక్కించాయి. ప్రత్యేకించి ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం శివకుమార్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇది రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు జేపీ నడ్డా అన్నారు. ‘‘మతం పేరుతో రిజర్వేషన్లను రాజ్యాంగం అనుమతించలేదు. మైనార్టీలను కాంగ్రెస్ మభ్యపెడుతోంది. ఇలాంటి చట్టాలను(కర్ణాటక తెచ్చిన చట్టం గురించి ప్రస్తావిస్తూ..), విధానాలను ఉపసంహరించుకోవాలి. బీఆర్ అంబేద్కర్ మార్గదర్శకత్వంలో రూపొందించిన రాజ్యాంగాన్ని ఎవరూ మార్చలేరు’’ అని నడ్డా అన్నారు.అయితే.. నడ్డా వ్యాఖ్యలకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కౌంటర్ ఇచ్చారు. రాజ్యాంగాన్ని మారుస్తానని డీకే శివకుమార్ అనలేదని.. ఆ మాటకి వస్తే బీజేపీ నేతలే రాజ్యాంగంపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేశారని అన్నారు. అంతేకాదు.. గతంలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ భారత రాజ్యాంగాన్ని మారుస్తానని బహిరంగంగా వ్యాఖ్యానించారని గుర్తు చేశారు.ఈ అంశం ఇటు లోక్సభలోనూ దుమారం రేపగా.. సభ పదే పదే వాయిదా పడుతూ వచ్చింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజ్జు డీకేఎస్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఇది రాజ్యాంగంపై జరుగుతున్న దాడిగా ఆయన అభివర్ణించారు. ఈ క్రమంలో.. కాంగ్రెస్ ఎంపీలు కౌంటర్లతో సభ హీటెక్కింది. మతపరమైన రిజర్వేషన్లు.. ప్రత్యేకించి ముస్లింల కోసం రాజ్యాంగానికి కొన్ని మార్పులు అవసరం అని శివకుమార్ అన్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాను అనలేదని తాజాగా నడ్డా విమర్శల నేపథ్యంలో శివకుమార్ స్పందించారు. బీజేపీ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోంది. నేను JP నడ్డా కంటే ఎక్కువ సెన్సిబుల్, సీనియర్ పొలిటీషియన్ అని అన్నారు. నేను గత 36 ఏళ్లుగా అసెంబ్లీలో ఉన్నాను. నాకు ప్రాథమిక ఇంగితజ్ఞానం ఉంది. వివిధ నిర్ణయాల (కోర్టు ద్వారా) తర్వాత మార్పులు ఉంటాయని క్యాజువల్గా చెప్పాను. రాజ్యాంగాన్ని మార్చబోతున్నామని నేను ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. మాది జాతీయ పార్టీ. మా పార్టీ ఈ దేశానికి రాజ్యాంగాన్ని తీసుకువచ్చింది అని అన్నారాయన. -
మతాధారిత రిజర్వేషన్లు... రాజ్యాంగ ఉల్లంఘనే
బెంగళూరు: మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడాన్ని రాజ్యాంగం అనుమతించలేదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబలె తెలిపారు. ఇలాంటి రిజర్వేషన్లు రాజ్యాంగానికి, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధమన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాతం కేటాయించాలంటూ కర్ణాటక ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయంపై చర్చ జరుగుతున్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.ఆర్ఎస్ఎస్ అత్యున్నత నిర్ణాయక విభాగం అఖిల భారతీయ ప్రతినిధి సభ మూడు రోజుల భేటీ ముగిసిన అనంతరం ఆదివారం హొసబలె బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర గతంలో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించేందుకు చేసిన ప్రయత్నాలను హైకోర్టులతో పాటు సుప్రీంకోర్టు అడ్డుకున్నాయని గుర్తు చేశారు. మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ను ఆదర్శమూర్తిగా మార్చారే తప్ప, పరమత సహనాన్ని బోధించిన ఆయన పెద్ద సోదరుడు దారా షికోను పట్టించుకోవడం లేదన్నారు. భారతీయ సంప్రదాయానికి వ్యతిరేకంగా నడుచుకున్న వారిని కీర్తించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ‘దురాక్రమణదారు మనస్తత్వం కలిగిన వారు దేశానికి ప్రమాదకరం, భారతీయ సంప్రదాయాన్ని గౌరవించే వారికి మనం మద్దతుగా నిలుద్దాం’అని హొసబలె పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ కొన్ని అంశాలపై తన అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని భావిస్తున్నారా అన్న ప్రశ్నకు హొసబలె.. ప్రతిదీ సజావుగానే నడుస్తున్నందున ఆ అవసరమే లేదని స్పష్టం చేశారు. ‘ప్రభుత్వానికి నిత్యం జరిగే అంశాల గురించి సంఘ్ ఏమీ చెప్పదు. ప్రజలేవైనా కొన్ని విషయాలపై ఆందోళన వ్యక్తం చేసిన సమయాల్లో మాత్రమే ఆ పనిచేస్తుంది. వివిధ సంస్థలు, రంగాల్లో పనిచేస్తున్న ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే ఈ పనిని నెరవేరుస్తారు. వీటిపై చర్చించే యంత్రాంగం మాకుంది’అంటూ హొసబలె వివరించారు. ‘‘అయోధ్య రామాలయ నిర్మాణం ఆర్ఎస్ఎస్ ఘనత కాదు.యావత్తు హిందూ సమాజం ఘనత. హిందువనే గుర్తింపు సిగ్గుపడే విషయం కాదు. అది గర్వకారణం. హిందువంటే మతపరమైన గుర్తింపే కాదు. జాతీయత, ఆధ్యాత్మికత, నాగరికతకు కూడా సంబంధించిన గుర్తింపు’’ అన్నారు. -
ఎంతకాలం ఈ ‘పంచాయతీ’!
రాష్ట్రాల్లో క్రమం తప్పకుండా అయిదేళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో గద్దెనెక్కేవారు పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల విషయంలో మీనమేషాలు లెక్కించటం పరిపాటయింది. దేశంలో దాదాపు అన్ని చోట్లా ఇదే పోకడ. పల్లెసీమల్లో ప్రజాతంత్ర భావన పెంపొందించి, పంచాయతీరాజ్ సంస్థలను స్థానిక ప్రభుత్వాలుగా పనిచేయనివ్వాలని... వాటికవే అభివృద్ధి ప్రణాళికలను స్వతంత్రంగా రూపొందించుకోవటానికి అవకాశమీయాలన్న సంకల్పంతో మూడున్నర దశాబ్దాల క్రితం 73వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. కానీ ఇప్పటికీ చాలా ప్రభుత్వాలు ఆ సంస్కృతికి పాతరేస్తున్నాయని పార్లమెంటరీ స్థాయీ సంఘం ఇటీవలి నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. గ్రామ పంచాయతీ కాలపరిమితి ముగిసేలోపు లేదా గడువుతీరిన ఆర్నెల్లలోగా ఎన్నికలు పూర్తి చేయాలని రాజ్యాంగంలోని 243 ఈ (3) నిర్దేశిస్తోంది. ఎన్నికలు సకాలంలో నిర్వహించని రాష్ట్రాలకు కేంద్రంనుంచి పంచా యతీలకు రావాల్సిన నిధులు ఆగిపోతున్నాయి. పర్యవసానంగా అభివృద్ధి కుంటుపడుతోంది. గ్రామాలు పారిశుద్ధ్య లేమితో, అందువల్ల కలిగే అంటువ్యాధులతో ఇబ్బంది పడుతున్నాయి.పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయటానికి రాష్ట్ర ప్రభుత్వాలు వేనవేల సాకులు చెబుతుంటాయి. అందులో రిజర్వేషన్ల నిర్ధారణ ఒకటి. పారదర్శకత పాటించకుండా, నిబంధనలకు విలు వీయకుండా రూపొందించే ఆ రిజర్వేషన్లు ఎటూ వివాదాస్పదంగా మారి న్యాయస్థానాల పరిశీలనకు వెళ్తాయని, దాన్ని సాకుగా చూపి ఎన్నికలు వాయిదా వేయొచ్చని చాలా ప్రభుత్వాలు అనుకుంటున్నాయి. ఈ విషయంలో కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అగ్రస్థానంలో ఉంది. ఆఖరుసారి 2006లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన ఆ కేంద్రపాలిత ప్రాంతం ఆ తర్వాతనుంచి ఏదో ఒక కారణం చూపిస్తూ వాయిదాల్లోనే కాలక్షేపం చేస్తోంది. సిగ్గుచేటైన సంగతేమంటే... అక్కడ ఫ్రెంచ్ పాలన సాగినన్నాళ్లు స్థానిక సంస్థలు అద్భుతంగా పనిచేశాయి. అభివృద్ధి పనుల ప్రణాళికలు ఒక క్రమపద్ధతిలో అమలయ్యాయి. తీరా స్వాతంత్య్రం వచ్చాక ఆ సంస్థలు నీరసించాయి. అధికారంలోకి ఎవరొచ్చినా ఏదో వంకతో వాటి ఎన్నికలు వాయిదా వేస్తూ పోయారు. 1954లో జరిగిన రిఫరెండమ్ ద్వారా భారత్లో విలీనానికి మెజారిటీ ప్రజలు సుముఖత వ్యక్తం చేయగా, 1962లో అది పూర్తి స్థాయి కేంద్రపాలిత ప్రాంతమైంది. 1968–2024 మధ్య కేవలం ఒకే ఒక్కసారి 2006లో పంచాయతీరాజ్ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలైనా మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల పుణ్యమే. అంటే గడిచిన 56 ఏళ్లలో ఒకే ఒక్కసారి మినహా పుదుచ్చేరిలోని 108 పల్లెల బాగోగులు చూసే ప్రజాతంత్ర వ్యవస్థలే లేవన్నమాట! చిత్రమేమంటే... వివిధ అంశాల్లో మొదటి పది స్థానాల్లో నిలిచిన కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు వంటివి కూడా సకాలంలో ఎన్నికలు నిర్వహించటంలో విఫలమయ్యాయి. ఇప్పటికి నాలుగేళ్లుగా కర్ణాటకలో పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలు లేవు. మహారాష్ట్ర మూడేళ్లనుంచీ, అస్సాం, జమ్మూ–కశ్మీర్ వంటివి రెండేళ్లనుంచీ ఎన్నికలు నిర్వహించటం లేదు. తెలంగాణ, తమిళనాడు, ఉత్తరాఖండ్లలో గతేడాది ఎన్నికలు జరగాల్సివుంది. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ అసెంబ్లీ సోమవారం ఏకగ్రీవ తీర్మానం చేసింది కనుక త్వరలోనే పంచా యతీ ఎన్నికలకు మార్గం సుగమం అవుతుందని ఆశించాలి. రాజ్యాంగంలో ఎన్ని ఉన్నతాశయాలున్నా ఆచరణ సరిగా లేనప్పుడు అవన్నీ నీరుగారి పోతాయి. అందులో పల్లెసీమల అభివృద్ధికి ఎంతగానో తోడ్పడే పంచాయతీరాజ్ సంస్థలను నిర్లక్ష్యం చేయటం ఒకటి. నిజానికి నిర్దిష్ట కాలంలో సక్రమంగా ఎన్నికలు జరిగేచోట సైతం ఆ సంస్థల పనితీరు ఏమంత ఆశాజనకంగా లేదు. నిధుల విడుదలలో జాప్యం, నాసిరకంగా పనులుండటం, సిబ్బంది కొరత వగైరాలు ఎన్నోవున్నాయి. ఇక మహిళలకు పంచాయతీరాజ్ వ్యవస్థలో పెద్ద పీట వేయాలని 73వ రాజ్యాంగ సవరణ ప్రతిపాదించింది. అందుకోసం వారికి మూడోవంతు స్థానాలు కేటాయించాలని నిర్దేశించింది. అయితే దీన్ని 50 శాతానికి మార్చాలని మెజారిటీ రాష్ట్రాలు భావించాయి. ఒక లెక్క ప్రకారం 21 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలు సగం స్థానాలు మహిళలకు కేటాయించాయి. కానీ విషాదమేమంటే... మహిళల పేరుమీద వారి భర్తలో, తండ్రులో అధికారం వెలగబెడుతున్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని తగిన చర్య తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై రెండేళ్ల క్రితం సుప్రీంకోర్టు నిస్సహాయత వ్యక్తం చేసింది. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈ సంగతి చూడాలని ఆదేశించింది. అటు తర్వాత ఈ సమస్య పరిష్కారానికి ఒక కమిటీ వేశారుగానీ జరిగిందేమీ లేదు. ప్రజా సేవారంగంలో మహిళలు చొరవగా పాల్గొనటా నికి ఉద్దేశించిన విధానం కాస్తా ఇలా దారితప్పుతోంది.దశాబ్దాల తరబడి పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తూ పోవటంవల్ల పల్లె సీమల్లో వర్ధిల్లాల్సిన ప్రజాస్వామిక వాతావరణం లోపిస్తోంది. తమకున్న వనరులేమిటో, తమ అవ సరాలేమిటో సమీక్షించుకుని ఏయే అభివృద్ధి పనులు చేపట్టాలో నిర్ణయించుకోవాల్సిన పంచాయతీ రాజ్ సంస్థలు నిధుల కోసం బేలగా ఎదురు చూస్తున్నాయి. పల్లెల్లో సమస్యలన్నీ అపరిష్కృతంగా ఉండిపోవటంవల్ల ఆ సంస్థలపై ప్రజలకు ఒక రకమైన చిన్నచూపు ఏర్పడుతోంది. అందుకే పార్లమెంటరీ స్థాయీ సంఘం సూచించినట్టు పంచాయతీరాజ్ ఎన్నికలు సకాలంలో జరిగేలా చూడాలి. పుదుచ్చేరి మాదిరి నిరవధికంగా వాయిదాలతో పొద్దుపుచ్చుతూ, పంచాయతీలను నామ మాత్రావశిష్టంగా మార్చే ప్రభుత్వాలను దారికి తీసుకొచ్చేందుకు కొత్త మార్గాలు వెదకాలి. -
ఓబీసీల కలను నిజం చేస్తాం..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిర్వహించిన సమగ్ర సామాజిక, ఆర్థిక, కులగణన సర్వేలో పాల్గొనని వారి కోసం మరోసారి సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా వారి వివరాలను కూడా సేకరించనుంది. ఈ నెల 16 నుంచి 28 వరకు ఈ సర్వే నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు, రిజర్వేషన్లకు సంబంధించి సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన బుధవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమావేశం జరిగింది. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను.. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్, సీఎస్ శాంతికుమారి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియాతో కలిసి భట్టి మీడియాకు వెల్లడించారు.బిల్లుకు పూర్తి చట్టబద్ధత కోసం చర్యలు‘రాష్ట్రంలోని బీసీలు, ఓబీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగ, తదితర రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు మార్చి మొదటి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా..దశాబ్దాల ఓబీసీల కలను నిజం చేసే దిశలో ఓబీసీల రిజర్వేషన్ బిల్లు ఆమోదింపజేసి పార్లమెంట్కు పంపిస్తాం. ఆ తర్వాత కలసి వచ్చే రాజకీయ పార్టీలతో సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీకి ప్రతినిధి బృందం వెళుతుంది. ప్రధానితో పాటు కేంద్ర ప్రభుత్వ పెద్దలను, అన్ని పార్టీల నేతలు, ఎంపీలను కలిసి ఈ బిల్లుకు పూర్తి చట్టబద్ధత కల్పించేందుకు చర్యలు చేపడతాం. పార్లమెంట్లో ఓబీసీల రిజర్వేషన్ బిల్లు పాస్ చేయించేందుకు దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలను, శక్తులను ఏకం చేస్తాం..’ అని డిప్యూటీ సీఎం చెప్పారు.మూడు పద్ధతుల్లో వివరాల నమోదు‘ఇటీవల నిర్వహించిన కులగణన సర్వేలో 3.1 శాతం మంది పాల్గొనలేదు. అలాంటి వారు ఈ నెల 16 నుంచి 28వ తేదీ వరకు తమ వివరాలు, సమాచారం నమోదు చేసుకోవచ్చు. మూడు పద్ధతుల్లో అంటే.. టోల్ ఫ్రీ నంబర్ (ఇంకా ప్రకటించలేదు)కు ఫోన్ చేసి, మండల కార్యాలయాల్లో ప్రజాపాలన అధికారుల వద్ద, ఆన్లైన్లో కుటుంబ వివరాల నమోదుకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్చేసి కోరితే అధికారులు వారి ఇంటికి వెళ్లి అన్ని వివరాలు నమోదు చేసుకుంటారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి వంటి వారు గతంలో ఉద్దేశపూర్వకంగా సమాచారం ఇవ్వలేదు. మరికొందరు అందుబాటులో లేకుండా పోయారు అలాంటి వారందరి కోసం మరోసారి అవకాశం కల్పిస్తున్నాం..’ అని భట్టి వివరించారు. బీసీల ప్రయోజనాల కోసం భారం మోసేందుకు సిద్ధం‘ఇప్పటికే ఏడాదికి పైగా ఎన్నికలు జరగకపోవడంతో పంచాయతీలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి. ఎన్నికలు ఆలస్యమైతే మరింత ఇబ్బంది అవుతుంది కదా..’ అని ఓ విలేకరి ప్రశ్నించారు. దీంతో ‘కులగణనలో రాష్ట్రంలో బీసీలు 56 శాతమున్నట్టుగా తేలిన నేపథ్యంలో వారి ప్రయోజనాల కోసం మరో 2, 3 నెలలు ఆర్థిక భారం పడినా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది..’ అని భట్టి బదులిచ్చారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా లక్ష మందికి పైగా సిబ్బందితో పూర్తి శాస్త్రీయంగా సమగ్ర ఇంటింటి సర్వే జరిగిందని చెప్పారు. బిల్లు ఆమోదం కోసం రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి అంతా కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. మరోసారి సర్వే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: జాజులసమగ్ర ఇంటింటి కులగణన సర్వేను మరోసారి చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ తెలిపారు. బీసీలు, ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడానికి చట్టం చేయాలని నిర్ణయించడం శుభ పరిణామమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
59 కులాలు 3 గ్రూపులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) జనాభాకు రిజర్వేషన్లను మూడు కేటగిరీలుగా అమలు చేయాలని ఏక సభ్య కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పునకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ షమీమ్ అక్తర్ ఏక సభ్య కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ గతేడాది నవంబర్ 11నుంచి 82 రోజుల పాటు వివిధ కోణాల్లో అధ్యయనం చేసింది.సోమవారం (Monday) 199 పేజీలతో కూడిన పూర్తిస్థాయి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పింపంచింది. ఈ నివేదికలోని వివరాలతో కూడిన ఒక ప్రకటనను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. 2011 జనగణన (Census) ఆధారంగా రాష్ట్రంలో ఎస్సీ కేటగిరీ కింద ఉన్న 59 కులాలను వారి సామాజిక స్థితిగతుల ఆధారంగా మూడు గ్రూపులుగా కమిషన్ వర్గీకరించింది. గ్రూప్–1లో 15 కులాలు, గ్రూప్–2లో 18 కులాలు, గ్రూప్–3లో 26 కులాలను చేర్చింది.మూడింటికి ఓకే.. ఒక సిఫారసుకు నో» ఎస్సీ వర్గీకరణ అమలుకు జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు సిఫారసులు చేసింది. ఇందులో మూడింటికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపగా, ఒక సిఫారసును తిరస్కరించింది.» ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉండగా, ఇందులో సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అత్యంత వెనుకబడిన, ఇంతవరకు పట్టించుకోని షెడ్యూల్డ్ కులాలను కమిషన్ గ్రూప్–1 కేటగిరీలోకి చేర్చింది. వీరి జనాభా మొత్తం ఎస్సీల్లో 3.288 శాతం ఉండడంతో వారికి ఒక (1)శాతం రిజర్వేషన్ అమలు చేయాలని సిఫారసు చేసింది.» ఎస్సీల్లో మధ్యస్తంగా లబ్ధి పొందిన షెడ్యూల్డ్ కులాలను గ్రూప్–2లో చేర్చింది. ఎస్సీల్లో వీరి జనాభా 62.748 శాతం ఉండగా, వారికి 9% రిజర్వేషన్ కల్పించాలని సిఫారసు చేసింది. » మెరుగైన ప్రయోజనం పొందిన షెడ్యూల్డ్ కులాలను గ్రూప్–3లో చేర్చింది. ఎస్సీ జనాభాలో 33.963%ఉన్న వీరికి 5% రిజర్వేషన్ ఇవ్వాలని సిఫారసు చేసింది.» ఎస్సీ రిజర్వేషన్లలో క్రీమీలేయర్ ప్రవేశపెట్టాలని కమిషన్ సిఫారసు చేసింది. ఎమ్మెల్యే, ఎంపీ, జెడ్పీ చైర్మన్, మేయర్ తదితర ప్రజాప్రతినిధులతో పాటు గ్రూప్–1 సర్వీ సుల్లో ఉన్న వారిని క్రీమీలేయర్ కేటగిరీగా పరిగణించాలని స్పష్టం చేసింది. ఈ వ్యక్తులకు సంబంధించి రెండో తరానికి రిజర్వేషన్ల ప్రయోజనం నుంచి మినహాయింపు ఇవ్వాలని సూచించింది. అయితే ఈ సిఫారసును రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది.» ఇక ఉద్యోగ నియామకాల్లో క్రమపద్ధతిలో అనుసరించేందుకు వన్మెన్ కమిషన్ ప్రాధాన్యత నమూనాను రూపొందించింది. గ్రూప్–1లో నోటిఫై చేసిన అలాగే భర్తీ చేయని ఖాళీలను తదుపరి ప్రాధాన్యత గ్రూప్లో అంటే గ్రూప్–2లో భర్తీ చేయాలి. ఇందులో భర్తీ చేయని ఖాళీలను గ్రూప్–3లో భర్తీ చేయాలి. అన్ని గ్రూపుల్లో తగిన అభ్యర్థులు అందుబాటులో లేకుంటే ఆ పోస్టులను క్యారీ ఫార్వర్డ్ చేయాలి. -
జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయి: మంత్రి సీతక్క
-
ఒకసారి రిజర్వేషన్లు పొందిన వారికి...ఆ సౌకర్యం నిలిపేయాలి
న్యూఢిల్లీ: రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే ఆ ఫలాలు పొంది, ఆ కారణంగా ఇతరులతో సమానంగా పోటీ పడే స్థాయికి చేరినవారికి రిజర్వేషన్లను తొలగించవచ్చని అభిప్రాయపడింది. అయితే ఇది శాసన, కార్యనిర్వహక వ్యవస్థలు తీసుకోవాల్సిన నిర్ణయమని స్పష్టం చేసింది. ఎస్సీల్లో క్రీమీ లేయర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీల ధర్మాసనం గురువారం ఈ మేరకు పేర్కొంది. ఎస్సీల్లో క్రీమీ లేయర్ ఏర్పాటు చేసే అధికారం రాజ్యాంగపరంగా రాష్ట్రాలకు ఉందంటూ గత ఆగస్ట్లో ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువరించిన మెజారిటీ తీర్పును జస్టిస్ గవాయ్ ఈ సందర్భంగా ఉటంకించారు. ఎస్సీల్లోని వెనకబడ్డ కులాలకు లబ్ధి చేకూర్చేందుకు వీలుగా వారికి ఉద్దేశించిన రిజర్వేషన్లలో ఉప వర్గీకరణ చేయొచ్చని ఆ తీర్పు స్పష్టం చేసింది. ఆ ధర్మాసనంలో జస్టిస్ గవాయ్ కూడా సభ్యుడే. మెజారిటీ నిర్ణయంతో సమ్మతిస్తూనే నాడు ఆయన విడిగా తీర్పు వెలువరించారు. ఎస్సీలతో పాటు ఎస్టీల్లో కూడా క్రీమీ లేయర్కు రిజర్వేషన్లను నిలిపేయాలని అందులో స్పష్టం చేశారు. ఇందుకోసం రాష్ట్రాలు విధిగా ఒక సమగ్ర విధానాన్ని రూపొందించాలని కూడా ఆదేశించారు. ఆ తీర్పును తాజా కేసు విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ ప్రస్తావించారు. ‘ఒకసారి లబ్ధి పొందినవారికి రిజర్వేషన్లను తొలగించాలి. గత 75 ఏళ్ల పరిణామాలను బేరీజు వేసిన మీదట ఈ అభిప్రాయం వెలువరిస్తున్నాం‘ అని పేర్కొన్నారు. రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించి ఆరు నెలలు గడిచినా ఎస్సీ, ఎస్టీల్లో క్రీమీ లేయర్ గుర్తింపునకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ‘ప్రభుత్వాలు ఆ పని చేయవు. చివరికి అత్యున్నత న్యాయస్థానమే జోక్యం చేసుకోవాల్సి వస్తుంది‘ అన్నారు. ఆ వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. ‘ఆ పని చేసేందుకు శాసన, కార్యనిర్వాహక విభాగాలు ఉన్నాయి. రాజ్యాంగ ధర్మాసనం తీర్పు అమలయ్యేలా వాళ్లు చట్టం చేయాలి‘ అని పునరుద్ఘాటించింది. అయితే సంబంధిత వర్గాలనే ఆశ్రయిస్తామని పిటిషనర్ తెలపడంతో కేసును ఉపసంహరించుకునేందుకు అనుమతించింది. -
రాజ్యాంగాన్ని మోసగించడమే
న్యూఢిల్లీ: కేవలం రిజర్వేషన్ ఫలాలు దోచేయాలనే దుర్భుద్దితో మతం మారిన విషయాన్ని దాచిపెట్టిన అంశాన్ని సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. ఇలాంటి చర్యలు రాజ్యాంగాన్ని మోసగించడంతో సమానమని అభివర్ణించింది. క్రైస్తవమతంలోకి మారిన తర్వాత కూడా ఒక మహిళ షెడ్యూల్ కులం సర్టిఫికేట్ కోసం తాను ఇంకా హిందువునేనని వాదించడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఈ అంశంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ఆర్ మహదేవన్ల సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం తీర్పు చెప్పింది. హిందువు అయిన సి.సెల్వరాణి క్రైస్తవమతం పుచ్చుకుంది. అయితే రిజర్వేషన్ లబ్ది పొందేందుకు, ఉద్యోగి సంబంధిత ప్రయోజనాలు పొందేందుకు తాను ఇంకా హిందువునేనని నమ్మించే ప్రయత్నంచేశారు. అయితే ఆమె నిజంగా క్రైస్తవ మతంలోకి మారిందని, తరచూ చర్చికి వెళ్తూ, క్రైస్తవ మత కార్యక్రమాల్లో పాల్గొంటూ, పూర్తి విశ్వాసంతో క్రైస్తవమతాన్ని ఆచరిస్తోందని సాక్ష్యాధారాలతో నిరూపితమైంది. దీంతో రిజర్వేషన్ కోసం ఆ మహిళ తన మతాన్ని దాచిపెట్టడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘‘బాప్టిజం పూర్తయ్యాక ఇంకా తాను హిందువును అని మహిళ చెప్పుకోవడంలో అర్థంలేదు. మతం మారాక కూడా రిజర్వేషన్ ప్రయోజనాలే పరమావధిగా ఇలా వ్యవహరించడం రిజర్వేషన్ లక్ష్యాలకే విఘాతం. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అమలుచేస్తున్న రిజర్వేషన్ల విధానం ఇలాంటి వారితో ప్రమాదంలో పడుతుంది’’అని కోర్టు వ్యాఖ్యానించింది. సెల్వరాణి తండ్రి హిందువుకాగా తల్లి క్రైస్తవురాలు. అయితే సెల్వరాణి చిన్నతనంలోనే బాప్టిజం తర్వాత క్రైస్తవురాలిగా మారారు. అయితే 2015లో పుదుచ్చెరిలో అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగం పొందేందుకు ఆమె ఎస్సీ సర్టిఫికేట్ సంపాదించారు. సెల్వరాణి తండ్రి వల్లువాన్ కులానికి చెందిన వ్యక్తి. స్థానికంగా ఈ కులం వారికి ఎస్సీ సర్టిఫికేట్ ఇస్తారు. కానీ సెల్వరాణి తండ్రి సైతం దశాబ్దాలక్రితమే క్రైస్తవమతం స్వీకరించారు. దీంతో తల్లిదండ్రులు క్రైస్తవులుకాగా తాను మాత్రం హిందువును అని ఈమె చేసిన వాదనల్లో నిజం లేదని కోర్టు అభిప్రాయపడింది. -
రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్లకు స్థానం లేదు
సాక్షి, న్యూఢిల్లీ: అంబేడ్కర్ రచించిన రాజ్యాంగంలో మత పరమైన రిజర్వేషన్లకు స్థానం లేదని... ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. తెలంగాణలో ముస్లింలకు ఇస్తున్నట్టుగానే మహారాష్ట్రలో కూడా 4శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్రెడ్డి చెప్పడం సరికాదన్నారు. మంగళవారం ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఆర్ఎస్ఎస్ వరిష్ట్ ప్రచారక్ నందకుమార్తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో హైకోర్టులు మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేశాయని, ఇది రాజ్యాంగ వ్యతిరేకమని చెప్పాయని గుర్తు చేశారు.దీనిపై సుప్రీంకోర్టులో స్టే తీసుకొచ్చి మతపరమైన రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్లకు స్థానం లేదు..ఇది రాజ్యాంగ వ్యతిరేకం అని కోర్టు తీర్పు ఇచి్చందని తెలిపారు. ఆ కోర్టు తీర్పును ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గౌరవించాలని సూచించారు. లగచర్ల అంశంపై చట్టం తనపని తాను చేస్తుందని, ఇది ముఖ్యంగా శాంతిభద్రతల సమస్య అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను రద్దు చేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు. టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నానని తెలిపారు. హిందూ దేవాలయాల్లో పనిచేసే ఇతర మతాల వారిని వేరేచోట్లకు బదిలీ చేయాలని కిషన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. -
మళ్లీ మణిపూర్లో నిప్పు
ఇంపాల్/గువాహటి: మెజారిటీ మైతేయ్లకు రిజర్వేషన్లను కల్పించాలన్న నిర్ణయంతో రాజుకున్న అగ్గికి 200 మందికిపైగా బలైన ఉదంతం నుంచి తేరుకుంటున్న మణిపూర్లో మళ్లీ విద్వేషాగ్ని రాజుకుంటోంది. గత వారం అపహరణకు గురైన ఆరుగురి మృతదేహాలు తాజాగా నదిలో బయటపడటంతో మైతేయ్ వర్గాల్లో ఆగ్రహం కట్టలుతెంచుకుంది.మైతేయ్ అనుకూల అల్లరిమూకలు ఎమ్మెల్యేల నివాసాలపై దాడులకు తెగబడ్డాయి. నిరసనలు, ఆందోళనలు ఒక్కసారిగా ఉధృతమవడంతో పుకార్లు, తప్పుడు వార్తల ప్రచారానికి అడ్టుకట్టవేసేందుకు మణిపూర్ ప్రభుత్వం వెంటనే ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపేసింది. ఘర్షణాత్మక, సున్నిత ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించింది. ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, బిష్ణుపూర్, తౌబాల్, కక్చింగ్, కంగ్పోక్పీ, చురాచాంద్పూర్ జిల్లాల్లో నెట్సేవలను ఆపేశారు. అసలేం జరిగింది? కుకీ–జో వర్గానికి చెందిన గ్రామవలంటీర్లుగా చెప్పుకునే 11 మంది సాయుధులు బొరోబెక్రా ప్రాంతంలోని పోలీస్స్టేషన్పైకి దాడికి తెగించారు. అయితే భద్రతాబలగాల ఎదురుకాల్పుల్లో ఈ 11 మంది చనిపోయారు. దీనికి ప్రతీకారంగా మైతేయ్ వర్గానికి చెందిన వారిని కుకీ సాయుధమూకలు నవంబర్ 11వ తేదీన అపహరించాయి. అపహరణకు గురైన వారిలో ఆరు గురి మృతదేహాలు శుక్రవారం జిరిబామ్ జిల్లాలో లభించాయి. అస్సాం–మణిపూర్ సరిహద్దు వెంట ఉన్న జిరిముఖ్ గ్రామ సమీప జిరి, బారక్ నదీసంగమ ప్రాంత జలాల్లో ఈ మృతదేహాలను కనుగొన్నారు. ముగ్గురు చిన్నారులు, ముగ్గురు మహిళల మృతదేహాలు లభించడంతో మైతేయ్ వర్గాల్లో ఆగ్రహజ్వాలలు పెల్లుబికాయి. ఇంఫాల్ లోయలోని చాలా ప్రాంతాల్లో వేలాది మంది నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. ఎమ్మెల్యేల నివాసాలపై దాడులు ఎమ్మెల్యేల నివాసాలపై మైతేయ్ వర్గీయులు శనివారం దాడులకు తెగబడ్డారు. ముగ్గురు రాష్ట్రమంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేలపై ఇళ్లపై దాడులు చేశారు. ఎమ్మెల్యే నిశికాంత్ ఇంటిపై దాడిచేశారు. -
వర్గీకరణ రివ్యూ పిటిషన్పై నేడు నిర్ణయం
న్యూఢిల్లీ, సాక్షి: ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మాల మహానాడు సవాల్ చేసింది. రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు మాలలకు వ్యతిరేకంగా ఉందని, తీర్పును రివ్యూ చేయాలంటూ మాల మహానాడు అధ్యక్షుడు చెన్నయ్య, మాజీ ఎంపీ హర్ష కుమార్లు పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ను న్యాయస్థానం విచారణకు స్వీకరిస్తుందా? లేదా? అనే ఉత్కంఠకు కాసేపట్లో తెరపడనుంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణపై సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తేదీన కీలక తీర్పు వెలువరించింది. విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. ఈమేరకు 2004లో ఐదుగురు సభ్యులు ఇచ్చిన తీర్పును తాజాగా విస్తృత ధర్మాసనం పక్కనబెడుతూ.. 6:1 మెజారిటీతో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. తాజా తీర్పును అనుసరించి ప్రభుత్వాలు దీనిపై తదుపరి మార్గదర్శకాలు రూపొందించుకోవాలని సూచించింది.‘‘వ్యవస్థాగతంగా ఎదుర్కొంటున్న వివక్ష కారణంగా ఎస్సీ/ఎస్టీ వర్గాల వారు పైకి రాలేకపోతున్నారు. ఒక కులంలో ఉపవర్గాలు చేసేందుకు రాజ్యాంగంలోని 14వ అధికరణ అనుమతి కల్పిస్తుంది. అందుకే 2004 నాటి ఈవీ చిన్నయ్య తీర్పును మేం వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్రాలు ఉపవర్గీకరణ చేసుకునేందుకు అనుమతి కల్పిస్తున్నాం’’ అని సీజేఐ ధర్మాసనం స్పష్టంచేసింది. అణగారిన వర్గాల వారికి మరిన్ని ప్రయోజనాలు కల్పించేందుకు రిజర్వ్డ్ కేటగిరీలో రాష్ట్రాలు ఉప వర్గీకరణ చేసుకోవచ్చని కోర్టు వెల్లడించింది. ధర్మాసనంలో దీనికి అనుకూలంగా ఆరుగురు న్యాయమూర్తులు తీర్పు చెప్పగా.. జస్టిస్ బేలా ఎం.త్రివేది మాత్రం ఉప వర్గీకరణ సాధ్యం కాదంటూ వ్యతిరేకించారు.కేసు వివాదం..ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ కోటా రిజర్వేషన్లలో 50శాతాన్ని వాల్మీకి, మజహబీ సిక్కు సామాజికవర్గాలకు తొలి ప్రాధాన్యంగా ప్రత్యేకిస్తూ 2006లో పంజాబ్ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. అయితే, ఎస్సీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ చెల్లదంటూ పంజాబ్, హరియాణా హైకోర్టు 2010లో తీర్పు వెలువరించింది. ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 2004లో వెలువరించిన తీర్పును ఉల్లంఘించేలా పంజాబ్ చట్టం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. షెడ్యూల్డ్ కులాల జాబితాలోకి ఏదైనా సామాజిక వర్గాన్ని చేర్చాలన్నా, తొలగించాలన్నా పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంటుందని, రాష్ట్రాల శాసనసభలకు కాదని ఈవీ చిన్నయ్య కేసులో సుప్రీంకోర్టు 2004లో తీర్పు చెప్పింది. దాన్నే పంజాబ్, హరియాణా తమ ఉత్తర్వులో హైకోర్టు ప్రస్తావించింది.దీంతో, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పంజాబ్ ప్రభుత్వం అప్పట్లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అనంతరం దీనిపై మరో 22 పిటిషన్లు దాఖలయ్యాయి. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కూడా ఇందులో వ్యాజ్యదారుగా ఉన్నారు. ఈ పిటిషన్లను విచారించిన అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం.. 2020లో ఈ వివాదాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. దీనిపై సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఏడాది ఆరంభంలో విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఉపవర్గీకరణ చేసుకొనేలా రాష్ట్రాలకు అనుమతినిస్తూ గురువారం కీలక తీర్పు వెలువరించింది. విచారణ సమయంలో కేంద్రం కూడా ఎస్సీ/ఎస్టీలో ఉపవర్గీకరణను సమర్థించింది. -
కులగణన చేసి తీరుతాం
గన్ఫౌండ్రీ(హైదరాబాద్): వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు న్యాయం జరిగే విధంగానే రిజర్వేషన్లు ఉంటాయని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గురువారం రవీంద్రభారతిలో మాజీ ఎంపీ వి.హన్మంతరావు ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ను సన్మానించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ కులగణనకు అంతా సిద్ధంగా ఉందని, దీనికి నిధులు కేటాయించినట్టు తెలిపారు. ఎవరెంత అరిచి గీ పెట్టినా రాష్ట్రంలో కులగణన చేయడం ఖాయమని స్పష్టం చేశారు. రాహుల్గాంధీ చెప్పిన మాటలకు అనుగుణంగానే అసెంబ్లీలో తీర్మానం చేశామని, వెనువెంటనే బీసీ కమిషన్ను కూడా నియమించామని గుర్తు చేశారు. కులగణనకు వ్యతిరేకంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందని, ఇదే పార్లమెంట్లో కులగణన తీర్మానం చేస్తామని రాహుల్గాంధీ చెప్పారన్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలు బీజేపీ అసలు స్వరూపం తెలుసుకోకపోతే రాబోయేతరాలకు నష్టం తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీలంతా ఐక్యంగా ఉండి కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. -
బీజేపీ ఉన్నంతకాలం రిజర్వేషన్లను ఎవరూ రద్దు చేయలేరు: అమిత్ షా
అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య పొలిటికల్ వార్ నడుస్తోది. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికా వేదికగా కేంద్రంలోని ప్రధాని మోదీ సర్కార్పై విమర్శలు గుప్పిస్తుంటే.. అదే స్థాయిలో కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు.. కాంగ్రెస్ నేత వ్యాఖ్యలను తప్పికొడుతున్నారు. తాజాగా రాహుల్పై కేంద్ర హోంమంత్రి అమిత్షా మండిపడ్డారు. దేశాన్ని విభజించేందుకు కుట్ర పన్నుతున్న శక్తులకు అండగా నిలబడటం రాహుల్కు, కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని అమిత్ షా విమర్శించారు. ‘దేశాన్ని విభజించేందుకు కుట్ర పన్నుతున్న శక్తులకు అండగా నిలవడం, దేశవ్యతిరేక ప్రకటనలు చేయడం రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి అలవాటైపోయింది. అది జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్కు చెందిన దేశ వ్యతిరేక, రిజర్వేషన్ వ్యతిరేక ఎజెండాకు మద్దతివ్వడమైనా సరే లేదా విదేశీ గడ్డపై భారత వ్యతిరేక ప్రకటనలు చేయడమైనా సరే.. రాహుల్ గాంధీ ఎప్పుడూ దేశ భద్రతను ముప్పులో పడేస్తున్నారు. ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారు.ప్రాంతీయవాదం, మతం, భాషా భేదాల తరహాలో చీలికలు తెచ్చే కాంగ్రెస్ రాజకీయాలను రాహుల్ గాంధీ ప్రకటన బయటపెట్టింది. దేశంలో రిజర్వేషన్ల రద్దు గురించి మాట్లాడటం ద్వారా.. కాంగ్రెస్కు, ఆయనకు రిజర్వేషన్పై ఉన్న వ్యతిరేకతను మరోసారి తెరపైకి తీసుకొచ్చారు. ఆయన మనసులో మెదిలే ఆలోచనలే చివరికి మాటల రూపంలో బయటపడ్డాయి. ఇక్కడ నేను రాహుల్కు ఒక విషయం స్పష్టంచేయాలని అనుకుంటున్నాను. బీజేపీ ఉన్నంతకాలం రిజర్వేషన్లను ఎవరూ రద్దు చేయలేరు. అలాగే దేశభద్రతతో ఎరూ ఆటలాడలేరు’ అంటూ మండిపడ్డారు. -
‘‘ఎలా చూసినా కులగణనే కీలకం’’
ఎన్నికల వేళ సందడి చేసిన కులగణన వాదం ఆ తర్వాత కూడా చర్చనీయాంశంగా కొనసాగుతూనే ఉంది. సుప్రీంకోర్టు దేశంలోని ఉపకులాలకు న్యాయం జరిగేలా ఓబీసీ/ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లను విభజించవచ్చని వెలువరించిన తీర్పు ఇప్పుడు ఎంతో కీలకంగా మారింది. అయితే ఈ తీర్పును అమలుపరచడానికి రాష్ట్రాలు వేటికవి తమ ప్రాంతాల్లో కులగణన చేస్తే కుదరదు. కేంద్రం మాత్రమే జనాభా లెక్కల్లో భాగంగా ఈ పని చేయాలి. లేదంటే కోర్టులో కొత్త వివాదాలు తలెత్తుతాయి. అయితే రిజర్వేషన్ల వల్ల అత్యధిక ప్రయోజనం పొందుతున్న కులాలవారూ, అలాగే స్థానికంగా బలంగా ఉన్న రిజర్వేషన్ వెలుపల ఉన్న శూద్ర కులాలవారూ కులగణనను వ్యతిరేకిస్తూనే ఉన్నారు.దేశంలోని ఉపకులాలకు న్యాయం జరిగేలా ఓబీసీ/ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లను విభజించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. పోతే ఆ విభజన న్యాయబద్ధ ఆబ్జెక్టివ్గా తేల్చిన జనాభా లెక్కల ప్రకారమే చెయ్యాలని కూడా తేల్చి చెప్పింది. ఈ జడ్జిమెంట్ ప్రకారం ఇటువంటి లెక్కలు రాష్ట్రాలు కమిషన్ల ద్వారానో, లేదా స్వంత రాష్ట్రస్థాయి జనాభా గణన చేపట్టి చెయ్యలేరు. ఏ కేంద్ర ప్రభుత్వమైతే సుప్రీంకోర్టు ముందు ఉపకులాలకు న్యాయబద్ధమైన రిజర్వేషన్ పంపకం అవసరమే అని ఒప్పుకుందో... ఆ ప్రభుత్వమే కేంద్ర స్థాయిలో కులాల వారీగా జనాభా లెక్కలు తీయించే వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ జడ్జిమెంట్ అమలుకు పూనుకోలేదు. ఒకవేళ ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం సొంత రాష్ట్ర ఉపకులాల లెక్కలు తీయించి, ఏదో ఒక రిజర్వేషన్ కేటగిరీలో రిజర్వేషన్ విభజిస్తే ఆ విభజన మళ్లీ హైకోర్టులో ఉపకుల లెక్కల యాక్యురసీ (కచ్చితత్వం) కొట్టివేయబడుతుంది. చివరకు సుప్రీంకోర్టుకు పోయినా అదే సమస్య ఎదురవుతుంది.ఇది ఎస్సీ, ఎస్టీల సమస్య మాత్రమే కాదు...ఇప్పటికే ఉప కులాల లెక్కలు తీసిన బిహార్ రిజర్వేషన్ విభజన, పెంపుదలను ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. రిజర్వేషన్ల ఉపకుల న్యాయపర విభజన కేవలం ఎస్సీలకో, ఎస్టీలకో సంబంధించింది మాత్రమే కాదు. ఓబీసీ కులాల్లో అన్ని రాష్ట్రాల్లో తమ తమ ఉపకులాల సంఖ్యకు అనుగుణంగా ఉద్యోగాలు, సీట్లు రావడం లేదని ఉద్యమాలు నడుస్తున్నాయి. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాల్లో మాదిగ, మాల కులాలకో; కోయ, గోండు, చెంచు, లంబాడాల మధ్య విభజనకో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పరిమితమై లేదు. బీసీ కులాల్లో ఉన్న ఏబీసీడీ గ్రూపుల్లో చాలా ఉప కులాలున్నాయి. డీ గ్రూపులో గొల్ల– యాదవులకు... మున్నూరు కాపులకు దొరికే అవకాశాలు దొరకడం లేదనీ, బీ గ్రూపులో కురుమలకు తమ వాటా తమకు దొరకడం లేదనే తీవ్ర అసంతృప్తి ఉంది. అందుకే వాళ్ళు తమ కులాన్ని సెమీ–నొమాడిక్ కమ్యూనిటీ (అర్ధ సంచార జాతి) లోకి మార్చాలని డిమాండ్ ఉంది.మహారాష్ట్రలో ధనగర్లు (గొర్రెల కాపర్లు) చాలా ఉద్యమాలు నడిపి తమ కులానికి మొత్తం ఓబీసీ రిజర్వేషన్లో 3 శాతం వాటా సంపాదించుకున్నారు. అక్కడి మరాఠాలు తమకూ రిజర్వేషన్లు కావాలని చాలా కాలంగా పోరాడుతున్నారు. కోర్టులు అందుకు అంగీకరించనందున తమకు కుంబి కులసర్టిఫికెట్లు ఇచ్చి రిజర్వేషన్లోకి చొప్పించండి అని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. గుజరాత్లో పటేళ్లు (పాటీదార్లు) తమకూ రిజర్వేషన్లు కావాలని చాలా కాలంగా ఉద్యమాలు చేస్తున్నారు. ఉపకుల రిజర్వేషన్ జడ్జిమెంట్ ద్వారా ఈ అన్ని రకాల డిమాండ్లకు పరిష్కారం వెతకాల్సి ఉంటుంది.2024 ఎన్నికల్లో ఓట్ల కోసం చాలా రాష్ట్రాల్లో బీజేపీ ఉపకులాలకు ‘మీ వాటా మీకు ఇప్పిస్తామని’ వాగ్దానం చేసింది. ప్రధానమంత్రి స్వయంగా ఆ మీటింగులో పాల్గొన్నారు. కానీ జాతీయ స్థాయిలో కుల గణన చేయించడాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నారు. అయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్... 1931 నాటి జనాభా లెక్కల్లో చేసినట్లు కులగణనను జనాభా లెక్కల్లో భాగంగా చెయ్యాల్సిన అవసరాన్ని కేంద్రం ముందు పెట్టింది. ఇక తప్పించుకోవడం సాధ్యం కాదు.కాంగ్రెస్ వెనక్కి తగ్గింది!కాంగ్రెస్ పార్టీ 2011 జనాభా లెక్కల్లో భాగంగా కులగణన ఒక ప్రత్యేక కుల లెక్కల షెడ్యూల్ను తయారుచేసి లెక్కలు తీయించారు. కానీ శుద్రాతీత అగ్రకులాల్లో (బ్రాహ్మణ, బనియా, క్షత్రియ, కాయస్థ, ఖత్రి కులాల వారి నుండి) వ్యతిరేకత రావడం వల్ల ఆ లెక్కలు బయట పెట్టకుండా ఆపేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో మేధావి వర్గమంతా ఈ ఐదు కులాల వారే! 2024 ఎన్నికల్లో రాహుల్ గాంధీ కులజనాభా లెక్కలు కావాలని కాంగ్రెస్ ఓట్ల శాతం పెంచే ప్రయత్నం చేశారు. కానీ రిజర్వేషన్ బయట ఉన్న కులాల నుండి అన్ని పార్టీల్లో వ్యతిరేకత వస్తోంది. ఈ కారణం వల్లనే కర్ణాటకలో కులాల లెక్కలు తీసి కూడా బయట పెట్టకుండా ఆపేశారు. కారణం బ్రాహ్మణ, బనియా, లింగాయత్, వక్కళి కులాల నుండి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది కనుక. వీటన్నిటికి మూలమేమంటే చాలా చిన్న శూద్రేతర కులాలు చాలా పెద్ద మొత్తంగా ఉద్యోగాలు, ప్రభుత్వరంగ ఐఐటీ, ఐఐఎమ్లు, మెడికల్ కాలేజీల్లో సీట్లు పొందుతున్నాయి. వీరి కులాల సంఖ్య జనాభా లెక్కల ద్వారా బయటికి వస్తే వారు దేశాన్ని తమ గుప్పిట్లో పెట్టుకొని నడుపడానికి వ్యతిరేకంగా చాలా పెద్ద తిరుగుబాటు వస్తుంది.మొత్తం మీద శూద్రుల వాటా తక్కువే!రెండు తెలుగు రాష్ట్రాల్లో రెడ్లు, కమ్మలు, వెలమలకు కూడా అర్థం కాని అంశమేమంటే... ఢిల్లీ అధికారంలోగానీ, బ్యూరాక్రసీలోగానీ; గవర్నర్లు, అంబాసిడర్ల వంటి పదవుల్లో కానీ వీరి వాటా చాలా తక్కువ అనేది. రిజర్వేషన్ బయట ఉన్న మొత్తం శూద్ర అగ్ర కులాలకు వారి జనాభా లెక్కల ప్రకారం చూస్తే కేంద్ర అధికారంలో కానీ, మోనోపలీ క్యాపిటల్లో కానీ అతి కొద్దిపాటి వాటా మాత్రమే ఉన్నది. కేంద్ర క్యాబినెట్ సెక్రటేరియట్లో కాని, ప్రధానమంత్రి సెక్రటేరియట్లో కాని వారు ఎవ్వరూ కనబడరు. వారు కేవలం రాష్ట్ర అధికారం కోసమే ఆరాటపడుతున్నారు. కానీ కేంద్రంలో మొత్తం శూద్రుల వాటా చాలా చిన్నదిగా ఉంది. కుల గణన... రెడ్డి, కమ్మ, వెలమ వంటి కులాలు జాతీయ స్థాయిలో వాటా పొందడానికి పనికొస్తుంది. ఇదే పరిస్థితి కర్ణాటకలోని లింగాయత్, వక్కళి కులస్థులది కూడా! వాళ్ళు రాష్ట్ర రిజర్వేషన్ సిస్టమ్లో భాగస్వాములే కానీ కులలెక్కలను వ్యతిరేకిస్తున్నారు. కేరళలో నాయనార్లు కుల లెక్కలే కాదు రిజర్వేషన్లను కూడా వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు తాము శూద్రులం కాదు క్షత్రియులమని చెప్పుకుంటున్నారు. ఇది కేవలం ఆ చిన్న రాష్ట్రంపై పెత్తనం చలాయించడానికి పనికొస్తుంది. కానీ కేంద్రంలో నాయనార్లకు కూడా వాటా లేదు. ప్రతి రాష్ట్రంలో ఉన్న శూద్ర పై కులాలు కులగణనను ఎందుకు స్వాగతించాలో ఆలోచించడం లేదు.1931లో బ్రిటిష్ ప్రభుత్వం కులాల లెక్కలు తీసి ఉండకపోతే దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న బ్రాహ్మణులు తామే దేశంలో అత్యధికులం అని నమ్మించేవారు. అంతకుముందు బ్రిటిష్ ప్రభుత్వాన్ని వాళ్ళు అలానే నమ్మించారు. దేశం మొత్తం మీద బ్రిటిష్ పాలక వ్యవస్థ (అడ్మినిస్ట్రేషన్)లో వాళ్ళే ఉండేవారు. జనాభా రీత్యా కూడా ‘మేమే అన్ని కులాల కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నామ’ని నమ్మించేవారు. ఆచరణలో కులం ఉన్నప్పుడు ఆ కులం సంఖ్య ఎంత ఉందో తెలిస్తే తప్ప కులాల అభివృద్ధి, దేశం అభివృద్ధి జరిగే ప్రణాళికలు తయారు చెయ్యడం సాధ్యం కాదు.తక్కువ సంఖ్యలో ఉండి ఎక్కువ ఉద్యోగాలు, విద్యారంగంలో సీట్లు సంపాదించే కులాలు, కులం లెక్కలు తియ్యొద్దని తప్పకుండా వాదిస్తాయి. ఈ ఆలోచనా ధోరణి నుండే రిజర్వేషన్లలో 50 శాతానికి మించి ఉండకూడదని వాదించాయి. సుప్రీంకోర్టులో తమకు అనుకూల జడ్జిమెంటును సంపాదించాయి. దానికి మెరిట్ అనే ఒక వాదనను ముందు పెట్టాయి. అసలు కులాన్ని ఈ దేశానికి బ్రిటిష్ వలసవాదులు తెచ్చారని వాదించాయి. ఉత్పత్తి కులాలు ముఖ్యంగా శూద్రులు ఢిల్లీలో పాలకులైతే తమ చరిత్ర తలకిందులవుతుందని భావించాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన ఉపకులాల వాటా జడ్జిమెంట్ చరిత్ర మలుపును మరో మెట్టు ఎక్కించేదనే అంశంలో సందేహం లేదు. ఇప్పుడు అన్ని శూద్ర కులాలు, దళితులు, ఆదివాసులు ఐక్యంగా కుల జనాభా లెక్కలు చెయ్యాలని పోరాడటమే వారి భవిష్యత్తుకు మార్గం. - ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
క్రీమీలేయర్ పేరిట చిచ్చు పెట్టొద్దు: ఖర్గే
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీల్లోని క్రీమీలేయర్కు రిజర్వేషన్లు వర్తింపజేయకూడదన్న ఆలోచనను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శనివారం చెప్పారు. ఈ అంశంపై ఇటీవల సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొన్న భాగాన్ని తొలగించాలని, ఇందుకోసం పార్లమెంట్లో చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. క్రీమీలేయర్ పేరిట ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేయొద్దని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలిస్తున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీల్లో క్రీమీలేయర్ను గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఒక విధానం రూపొందించాలని సుప్రీంకోర్టు తీర్పులో న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. క్రీమీలేయర్కు రిజర్వేషన్లు నిరాకరించాలని ఆయన సూచించారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో అస్పృశ్యత ఉన్నంతకాలం రిజర్వేషన్లు ఉండాల్సిందేనని మల్లికార్జున ఖర్గే తేలి్చచెప్పారు. రిజర్వేషన్ల అమలు కోసం పోరాడుతామని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల విధానానికి ముగింపు పలికేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. -
బంగ్లాదేశ్లో మళ్లీ హింస.. 91 మంది మృతి
ఢాకా: బంగ్లాదేశ్ మరోసారి హింసతో అట్టుడికింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ వివాదంపై ఆందోళనచేస్తున్న ఉద్యమకారులకు అధికార పార్టీ మద్దతుదారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో హింస చెలరేగింది. ఆదివారం(ఆగస్టు4) జరిగిన ఈ ఘర్షణల్లో ఇప్పటివరకూ 91 మంది దాకా మృతి చెందినట్లు బంగ్లాదేశ్ మీడియా వెల్లడించింది. ఘర్షణల్లో చాలా మందికి తీవ్ర గాయాలైనట్లు తెలిపింది. ఇటీవలే కోటా వివాదంపై చెలరేగిన హింసలో 200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. బంగ్లాదేశ్లో మళ్లీ హింస చెలరేగడంతో అక్కడ ఉన్న దేశ పౌరులను భారత రాయబార కార్యాలయం అలర్ట్ చేసింది. భారత పౌరులంతా సాయం కోసం తమతో టచ్లో ఉండాలని కోరింది. ఇందుకు పలు ఫోన్ నంబర్లను ప్రకటించింది. ఘర్షణల నేపథ్యంలో బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం నుంచి కర్ఫ్యూ విధించారు. హింసకు పాల్పడేవారు విద్యార్థులు కాదని అలాంటివారిని అణచివేయాలని ప్రధాని షేక్హసీనా పిలుపునిచ్చారు. -
ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పు చరిత్రాత్మకం
సనత్నగర్ (హైదరాబాద్): ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు చరిత్రాత్మకమైందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఎస్సీ వర్గీకరణపై వాదన లు వినిపించడానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రాను పంపించి బలమైన వాదనలు వినిపించేలా చేశారని గుర్తు చేశారు. ‘ఎస్సీ వర్గీకరణ–మాదిగల భవిష్యత్తు’ అనే అంశంపై శనివారం బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్లో మాదిగ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మేధావుల సమావేశం జరిగింది. ప్రొఫెసర్ జి.మల్లేశం అధ్యక్షతన జరిగిన సమావే శానికి హాజరైన దామోదర రాజనర్సింహ మాట్లాడు తూ, రాష్ట్రాలు ఎస్సీ, ఎస్టీల వర్గీకరణను చేసుకో వచ్చని తీర్పు రావడం ద్వారా అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. సుప్రీంకోర్టులో వాదనలకు పూర్తిగా సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఈ సభ ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేసిందన్నారు. న్యాయనిపుణులతో ఒక కమిటీ వేసి సుప్రీంకోర్టు తీర్పుపై అధ్యయనం చేసిన నివేదిక సీఎంకు అందజేస్తామని చెప్పారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిని మాదిగ ఎమ్మెల్యేలందరూ కలిసి ఒక కమిటీ వేయాల్సిందిగా కోరతామని, ఆ కమిటీ సూచనల మేరకు ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకు రావాలన్నారు. అంతేకాకుండా త్వరలో పెద్దఎత్తున మాదిగల సమ్మేళనం పేరుతో ఒక బహిరంగ సభను ఏర్పాటుచేసి సీఎంను ఆ సభకు ఆహ్వానించి సన్మా నించనున్నట్లు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ చట్టం అయ్యేవరకు జాతి పెద్దలుగా అందరం కలసిక ట్టుగా ముందుకుసాగుదామన్నారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ, మాదిగ లకు తగిన ప్రాధాన్యతనిచ్చి వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మొట్టమొదటి నేత ఎన్టీఆర్ అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్య నారాయణ, అడ్లూరి లక్ష్మణ్కుమార్, వేముల వీరేశం, మందుల సామేల్, లక్ష్మీకాంతరావు, కాలే యాదయ్య, ప్రొఫెసర్ కాశీం, కొండ్రు పుష్పలీల, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, పిడమర్తి రవి తదితరులు పాల్గొన్నారు. -
సామాజిక న్యాయం!! అవకాశవాదమా? అమలయ్యేనా?
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి లక్ష్యం నెరవేరింది. పట్టువదలకుండా కృషి చేస్తే ఎప్పటికైనా అనుకున్నది సాధించవచ్చని ఈ ఉద్యమం రుజువుచేసింది. ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగకు ఇది వ్యక్తిగత విజయం అని కూడా భావించవచ్చు. మాదిగ దండోరా పేరుతో సాగిన ఉద్యమం ఉమ్మడి ఎపిలో విశేష ప్రభావం చూపిందని చెప్పాలి.ఒకప్పుడు తమ పేరు చివర మాదిగ అని పెట్టుకుంటే సమాజంలో చిన్నతనం అవుతుందేమో అనుకునే దశ నుంచి మాదిగ అన్న పదానికి ఒక గౌరవాన్ని,గుర్తింపును తెచ్చిన ఘనత ఆయనది. వర్గీకరణ కన్నా మందకృష్ణ తీసుకు వచ్చిన పెద్ద సామాజిక మార్పు ఇది అని చెప్పాలి. .. గత ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్లో జరిగిన సభలో మంద కృష్ణను దగ్గరకు తీసుకుని తాను కూడా షెడ్యూల్ కులాల వర్గీకరణకు అనుకూలంగా పనిచేస్తానని ప్రకటించారు. కృష్ణను ఏకంగా తన నాయకుడుగా కూడా ఆయన ప్రకటించడం అందరిని ఆకర్షించింది. అయినా వర్గీకరణ సాధ్యమా? కాదా? అనే చర్చ కొనసాగింది. విశేషంగా గతంలో వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన సుప్రింకోర్టు ఇప్పుడు దానిని కొట్టివేసి అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ నిర్ణయానుసారం వర్గీకరణ చేసుకోవచ్చని అత్యున్నత న్యాయ స్థానం నిర్ణయం చేసింది. దీని ప్రకారం సామాజిక, ఆర్ధిక అంశాల ప్రాతిపదికన ఎస్సీలలో వర్గీకరణ చేయవచ్చని స్పష్టం చేసింది. తత్ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యావకాశాలలో వర్గీకరణ ప్రాతిపదికన అవకాశాలు లభిస్తాయి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి షెడ్యూల్ కులాలకు రిజర్వేషన్ లు ఉన్నాయి. కాని ఈ రిజర్వేషన్ అవకాశాలు ఎస్సీలలో బలమైన కొన్ని వర్గాలకే అధికంగా లభించాయన్న బావనతో దండోరా ఉద్యమం ఆరంభం అయింది. ప్రధానంగా మాల వర్గంకు చెందినవారికే ఈ రిజర్వేషన్ ల ఫలాలు అధికంగా దక్కుతున్నాయన్న అభిప్రాయం మాదిగ,తదితర ఉప కులాలలో ఏర్పడింది. రాజకీయ పదవులలో సైతం మాలల ఆదిపత్యం ఎక్కువగా ఉంటున్నదని, తమ సంఖ్యకు అనుగుణంగా పదవులు దక్కడం లేదన్న ప్రచారం జరిగేది. తెలంగాణలో మాదిగలు అధిక సంఖ్యలో ఉంటారు.అదే విభజిత ఆంద్ర ప్రదేశ్ లో మాల వర్గం వారు ఎక్కువగా ఉంటారని గణాంకాలు చెబుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని రాజకీయాలు కూడా ఉమ్మడి ఏపీలో సాగుతూ వచ్చాయి. తొలుత నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్గీకరణ ప్రక్రియ ఆరంభమైంది. మాలవర్గం నేతలు దీనిని పూర్తిగా వ్యతిరేకించారు. చంద్రబాబు ఎస్సీలలో విభజన చిచ్చు పెడుతున్నారని వారు ఆరోపించేవారు. ఎస్సీలలో ఎక్కువమంది కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంటారన్న అభిప్రాయం అప్పట్లో ఉంది. ఆ వర్గంలో తనకంటూ ఓటు బ్యాంకును తయారుచేసుకునే ఉద్దేశంతో వర్గీకరణ వైపు చంద్రబాబు మొగ్గుచూపారన్న విమర్శ కూడా అప్పట్లో ఉండేది. అయితే.. ఈ వర్గీకరణ తమకు మేలు చేస్తుందని మాదిగ,తదితర ఉపకులాలు భావించి, మంద కృష్ణ ఉద్యమానికి మద్దతు ఇచ్చాయి.దాంతో వివిధ రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఆయా రాజకీయ పక్షాలు ఎస్సీల వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయాలు చేశాయి. ఈ దశలో సుప్రింకోర్టులో వర్గీకరణ చెల్లదని తీర్పు రావడంతో ఇది అత్యంత జఠిల సమస్యగా మారింది. ఆ తరుణంలో ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా శాసనసభలో తీర్మానం చేసింది. కేంద్రంలోని యుపీఏ ప్రభుత్వం వద్దకు దీనిపై అఖిలపక్షాన్ని పంపించి ఆయన సమస్య పరిష్కారానికి కృషి చేశారు. దీనికి వ్యతిరేకంగా మాలమహానాడు నేతలు నిరాహార దీక్షలకు దిగగా, వైఎస్ ఆర్ వారిని ఒప్పించి విరమింప చేశారు. అప్పట్లో ఉషా మెహ్రా నేతృత్వంలో ఒక కమిషన్ ను ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ వర్గీకరణపై వివిధ రాష్ట్రాలలో అభిప్రాయాలు సేకరించింది. ఉత్తరాది రాష్ట్రాలలో ఉన్న పరిస్తితులను దృష్టిలో ఉంచుకునే కేంద్రం అప్పట్లో వ్యవహరించిందన్న భావన ఉంది. ఆ కమిషన్ కూడా వర్గీకరణకు సానుకూలమైన నిర్ణయాలు వెలువరించలేదు. దాంతో ఇది పెద్ద పెండింగ్ సమస్యగా మారింది. అయితే మాదిగ దండోరా ఉద్యమాన్ని మంద కృష్ణ నిలుపుదల చేయలేదు. మద్యలో దండోరాలో చీలికలు వచ్చినా, రాజకీయాల ప్రభావం పడినా, అవకాశం వచ్చినప్పుడల్లా ఆయన తన వాయిస్ వినిపిస్తూనే వచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత నాటి టీఆర్ఎస్(బీఆర్ఎస్) ప్రభుత్వం కూడా దీనిపై అనుకూలంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. బిజెపి అగ్రనేతలు దండోరాకు మద్దతు ఇవ్వడంతో ఇది ఒకరకంగా కొత్తరూపు దాల్చిందని చెప్పాలి. సీనియర్ నేత వెంకయ్యనాయుడు, ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వంటివారు కృష్ణకు సహకరించారు. ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ తాను ఎస్సీల వర్గీకరణకు అనుకూలంగా ఒక భారీ సభను నిర్వహించడంతో ఈ ఉద్యమం కొత్త మలుపు తిరిగింది.ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయంతీసుకుని కోర్టుకు ఆ విషయం తెలిపింది. ఒకసారి సుప్రింకోర్టు నిర్ణయం అయిన తర్వాత తిరిగి కేసును ఓపెన్ చేసి కోర్టు విచారణ జరపడం సంచలనమే అని చెప్పాలి. తదుపరి రెండు దశాబ్దాలకు సుప్రింకోర్టు తన తీర్పును మార్చుకుని వర్గీకరణపై రాష్ట్రాలకు అధికారం ఉందని తేల్చడంతో ఇది ఒక కొలిక్కి వచ్చినట్లయింది. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే.. ఒకప్పుడు రాజకీయ లక్ష్యంతో ఉమ్మడి ఏపీలో రిజర్వేషన్ లకు అనుకూలంగా నిర్ణయించిన టీడీపీ, రాష్ట్ర విభజన తర్వాత దాని జోలికి వెళ్లలేదు. 2014 టరమ్ లో చంద్రబాబు నాయుడు అమరావతి ప్రాంతంలో మాదిగ దండోరా ఉద్యమానికి అనుమతి ఇవ్వలేదు. దానికి కారణం ఏపీలో మాలవర్గం వారి ప్రాధాన్యత అధికంగా ఉండడమే అని భావిస్తారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలలో వీరి ప్రాబల్యం అధికంగా ఉంటుందని అంటారు.మాదిగ దండోరాకు వ్యతిరేకంగా మాల మహానాడు నేతలు కూడా ఆరోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించేవారు.దీంతో ఈ వ్యవహారం క్లిష్టమైన సమస్యగా ఉండేది. ఈ తరుణంలో సుప్రీంకోర్టు తాజా నిర్ణయం వెలువరించడంతో ఇది ఒక కొలిక్కివచ్చినట్లయిందనిపిస్తుంది. అయితే మాల మహానాడు నేతలు ఏ రకంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఇప్పుడు కొత్త సమస్య వచ్చే అవకాశం ఉంది. ఎస్సీ వర్గీయులలో ఏ ఉప కులంవారు ఎంత మంది ఉన్నారన్నదానిపై గణాంకాలు సేకరించవలసి ఉంటుందని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం వర్గీకరణ చేసి విద్య,ఉద్యోగ అవకాశాలలో రిజర్వేషన్ లు కల్పిస్తే సరిపోతుందా?లేదా?అనేది చూడాల్సి ఉంది. కాగా, ఎస్సీ వర్గీకరణపై సుప్రిం తీర్పును తెలంగాణలోని రాజకీయ పక్షాలు తమకు అనుకూలంగా మార్చుకోవడానికి తమ వంతు ప్రయత్నం సాగించాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ఒక ప్రకటన చేస్తూ తమ రాష్ట్రం వెంటనే దీనిని అమలు చేస్తుందని ప్రకటించారు.సుప్రింకోర్టులో సీనియర్ న్యాయవాదిని నియమించి కేసును బలంగా వినిపించడంతో తీర్పు అనుకూలంగా వచ్చిందని కాంగ్రెస్ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. మరో నేత కడియం శ్రీహరి టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు వర్గీకరణపై తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇది తమ ఘనతేనని బిజెపి పేర్కొంది. కాగా కాంగ్రెస్ పార్టీ మాదిగలను అణచివేసే ప్రయత్నం చేస్తే.. తమ అధినేత కేసీఆర్ వారిని ఆదుకున్నారని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాస్త ఆచితూచి స్పందించారనిపిస్తోంది. దీనిని సామాజిక న్యాయంగా వ్యాఖ్యానించారాయన. ఎస్సీలతో పాటు ఎస్టీ వర్గీకరణపై తీర్పు రావడంతో దాని ప్రభావం ఏ రకంగా ఉండేది అప్పుడే చెప్పజాలం. అంతా హర్షిస్తారా?లేక కొత్త ఆందోళనలు ఏమైనా వస్తాయా అన్నది చూడాలి. ఏది ఏమైనా ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం లభించిందని ఆశిద్దాం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
అడ్డంకులు అధిగమించాం.. విజయం సాధించాం
సాక్షి, న్యూఢిల్లీ: ‘మాదిగల 30 ఏళ్ల పోరాటానికి తెరపడింది. వర్గీకరణ పోరాటంలో అడుగడుగునా అరెస్టులు.. ఉద్యమాలను అడ్డుకున్నా, పట్టు వీడకుండా న్యాయమైన పోరాటానికి అడుగులు వేశాం. ఉద్యమం ప్రారంభించిన తొలిరోజుల్లో ఎన్ని అడ్డంకులు వచి్చనా వాటన్నింటినీ ఎదుర్కొని నిలబడి ఈ రోజు వర్గీకరణ సాధించాం. మాదిగల్లో పోరాట స్ఫూర్తిని నింపాం. గ్రామస్థాయి నుంచి నగరస్థాయి వరకు రిజర్వేషన్లపై చైతన్యం తెచ్చాం’ అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణపై గురువారం సుప్రీంకోర్టు తీర్పు ఇచి్చన నేపథ్యంలో మంద కృష్ణమాదిగను ‘సాక్షి’ పలకరించింది. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే.... ఎమ్మార్పీఎస్ కార్యకర్తల పోరాటం వల్లే..మాదిగల హక్కుల కోసం 1994 జూలై 7న ‘మాదిగ పోరాట సమితి’ని స్థాపించాను. గ్రామ, మండలస్థాయిలో ఎమ్మారీ్పఎస్ కార్యకర్తలు..రాజకీయపారీ్టల కార్యకర్తలకు దీటుగా నిలబడ్డారు. ఎంతోమంది మాదిగలు వర్గీకరణ కోసం బలిదానాలు చేసుకున్న సంఘటనలు నన్ను ప్రతిరోజూ కలచివేస్తుండేవి. ‘అన్నా మేం చనిపోతున్నాం..అయినా సరే పోరాటం ఆపొద్దు.మీరు ముందుండి ఉద్యమాన్ని నడపండి...ఏదో ఒకరోజు రిజర్వేషన్లు కచి్చతంగా సాధిస్తాం’అంటూ చనిపోయే ముందు కొందరు కార్యకర్తలు నాతో మాట్లాడిన మాటలు ప్రతిరోజూ నేను గుర్తు చేసుకుంటూ పోరాటాలకు పిలుపునిచ్చేవాడిని. వారి కన్నీళ్ల ప్రతిఫలమే ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు. 30 ఏళ్లుగా ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు బలంగా ఉంటూ, పోరాటాలు చేశారు. ఎంతో మంది నాయకులు మా కార్యకర్తలపై భౌతికంగా దాడులు చేసినా, వేధించినా, కేసులు పెట్టినా భయపడకుండా ధైర్యంగా నిలబడ్డారు. ఎమ్మారీ్పఎస్ పోరాటస్ఫూర్తి వల్లనే ఈరోజు విజయం సాధించాం. ఎంతో మంది సహకరించారుమేం చేసిన ఈ పోరాటానికి ఎంతోమంది మద్దతు పలికారు. అనేక పర్యాయాలు ఆర్థికపరమైన సాయం, మాట సాయం, న్యాయపరమైన సాయాలు ఎందరో చేశారు. వారందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆ ఐదుగురు అలా..ఈ ఐదుగురు ఇలా2004లో జస్టిస్ సంతోష్హెగ్డే నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం రిజర్వేషన్లు చెల్లవు అంటూ రద్దు చేసింది. ఆ తర్వాత 2020లో అరుణ్మిశ్రాతో కూడిన ఐదుగురు సభ్యుల «ధర్మాసనం రాష్ట్రప్రభుత్వం రిజర్వేషన్లు అమలు చేయొచ్చని తీర్పు ఇచ్చింది.ఇదే సందర్భంలో ఏడుగురు సభ్యుల ధర్మాసనం దీనిపై న్యాయం చెప్పాలని సూచనలు చేసింది. ఆ సూచనల కారణంగానే తాజాగా రిజర్వేషన్లపై తీర్పు రావడం ఆనందంగా ఉంది. ముందేమో ఐదుగురు సభ్యులున్న ధర్మాసనం వ్యతిరేకించింది, ఆ తర్వాతేమరో ఐదుగురు సభ్యులున్న ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. ఉమ్మడి ప్రయోజనాల కోసం పోరాడుదాం వర్గీకరణ కోసం మేం పోరాటాలు చేస్తుంటే మా మాల సోదరులు రోడ్డెక్కి అడ్డుచెప్పేవారు. కానీ, కొంతకాలంగా వారి మనసులు మారాయి, మా పోరాటాలకు ఎవరూ అడ్డు పడలేదు. ఇకపై ఉమ్మడి ప్రయోజనాల కోసం ఎస్సీలందరం కలిసి పోరాడాల్సిన అవసరముంది. 2004లో తెచి్చన చట్టాన్నే ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తే సరిపోతుంది. ఇక తెలంగాణలో కొన్ని నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయాల్సి ఉంది. వర్గీకరణ పూర్తయ్యే వరకు ఉద్యోగ నియామకాలు చేపట్టొద్దని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నా.సీఎంకు మాదిగ ఎమ్మెల్యేల స్వీట్లుసాక్షి, హైదరాబాద్: ఎస్సీల వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పు నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డికి మిఠాయిలు తినిపించారు. అసెంబ్లీలోని సీఎం చాంబర్లో మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో డప్పు చప్పుళ్లతో సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో కడియం శ్రీహరి, కాలె యాదయ్య, వేముల వీరేశం, కవ్వంపల్లి సత్య నారాయణ, అడ్లూరి లక్ష్మణ్కుమార్, శామేలు, తోట లక్ష్మీకాంతరావు తదితరులున్నారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు చారకొండ వెంకటేశ్, గజ్జెల కాంతం, దేవని సతీశ్, మాజీ మంత్రి పుష్పలీల కూడా సీఎం రేవంత్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
బీహార్ ప్రభుత్వానికి బిగ్ షాక్
-
సుప్రీం కోర్టులో బిహార్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టులో బిహార్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. బిహార్లో 65 శాతం రిజర్వేషన్ చట్టం నిలుపుదలపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. ఇప్పటికే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అయితే ఈ అంశంపై వాదనలు వినేందుకు మాత్రం సుప్రీం ధర్మాసనం అంగీకరించింది. గత ఏడాది నవంబర్లో రాష్ట్ర ఉభయ సభలు ఏకగ్రీవంగా ఆమోదించిన రిజర్వేషన్ సవరణలు రాజ్యాంగ సమానత్వ నిబంధనలను ఉల్లంఘించేవని పట్నా హైకోర్టు జూన్ 20 నాటి తీర్పులో వెల్లడించింది. వెనకబడిన తరగతులకు 65 శాతం రిజర్వేషన్ కోటా ఇవ్వడాన్ని నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. అయితే హైకోర్టు తీర్పును బిహార్ ప్రభుత్వం సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన రిజర్వేషన్ నిలుపుదల తీర్పుపై స్టే విధించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై ఇవాళ విచారణ జరిపిన సుప్రీం కోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించటాన్ని నిరాకరించింది. చదవండి: Bihar Caste Reservation: రిజర్వేషన్లపై బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం -
బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలు తీవ్రతరం... కనిపిస్తే కాల్చివేత!
ఢాకా/సాక్షి, న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది. రిజర్వేషన్లపై వారం క్రితం మొదలైన దేశవ్యాప్త హింసాకాండ నానాటికీ పెరిగిపోతోంది. భద్రతా సిబ్బందికి, విద్యార్థులకు మధ్య జరుగుతున్న ఘర్షణల్లో మృతి చెందిన వారి సంఖ్య శనివారంతో 115 దాటింది! రాజధాని ఢాకాతో పాటు ప్రధాన నగరాలు, పట్టణాల్లో కర్ఫ్యూ విధించినా, సైనికులు, పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. అయినా లాభం లేకపోగా పరిస్థితి విషమించడమే గాక పూర్తిగా అదుపు తప్పుతోంది. దాంతో తాజాగా కనిపిస్తే దేశవ్యాప్తంగా కాలి్చవేత (షూట్ ఎట్ సైట్) ఉత్తర్వులు జారీ అయ్యాయి! 978 మంది భారతీయులు వెనక్కు బంగ్లాదేశ్ నుంచి 978 మంది భారతీయ విద్యార్థులను కేంద్రం సురక్షితంగా వెనక్కు తీసుకొచి్చంది. 778 మంది నౌకల్లో, 200 మంది విమానాల్లో వచ్చారు. బంగ్లాదేశ్లో పనలు వర్సిటీల్లో ఇంకా 4 వేలకు పైగా భారతీయ విద్యార్థులున్నారు. వారందరినీ సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఢాకాలోని భారత హైకమిషన్ కృషి చేస్తోంది.ఇదీ సమస్య... 1971 బంగ్లాదేశ్ వార్ వెటరన్ల కుటుంబీకులకు ప్రభుత్వోద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. 2018లో షేక్ హసీనా వీటిని రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని ఢాకా హైకోర్టు తాజాగా తప్పుబట్టింది. ఆ రిజర్వేషన్లను పునరుద్ధరించాలంటూ జూన్ 5న ఆదేశాలిచి్చంది. దీనిపై విద్యార్థులు, ఉద్యోగార్థులు భగ్గుమన్నారు. దేశవ్యాప్తంగా వీటిని వ్యతిరేకిస్తూ భారీగా నిరసనలు, ఆందోళనలకు దిగారు. కోటా పునరుద్ధరణ వద్దే వద్దంటూ రోడ్డెక్కారు. దాంతో కోర్టు ఉత్తర్వులను హసీనా ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు తాత్కాలికంగా పక్కన పెట్టింది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఆదివారం తుది విచారణకు అంగీకరించింది. -
బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలు.. భారత్ చేరిన వెయ్యి మంది విద్యార్థులు
ఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో ఆందోళనలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. ఉద్రిక్త పరిస్థితులు పెరగుతున్న క్రమంలో ఢాకాలోని భారత హైకమిషన్ విద్యార్థులను పలు మార్గాల ద్వారా ఇండియాకు సురక్షితంగా చేర్చుతోంది. ఇప్పటివరకు 1000 మంది విద్యార్థులు బంగ్లాదేశ్ నుంచి భారత్ చేరకున్నారు. 778 మంది విద్యార్థులు వివిధ మార్గాల ద్వారా బంగ్లాదేశ్ సరిహద్దు దాటి భారత్కు చేరుకున్నారు. ఇక.. 200 మంది విద్యార్థులు రెగ్యులర్ విమాన సర్వీసుల్లో భాగంగా శనివారం ఢాకా, చిట్టగాంగ్ ఎయిర్పోర్టుల్లో విమానం ద్వారా భారత్కు చేరకున్నట్లు విదేశీ వ్యవహరాల శాఖ వెల్లడించింది. అయితే మరో నాలుగు వేల మంది విద్యార్థులతో టచ్లో ఉన్నామని అధికారులు తెలిపారు. ఇక.. శుక్రవారం 300 మంది భారతీయులు.. బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు బయలుదేరి ఈశాన్య రాష్ట్రాల సరిహద్దుల గుండా ఇళ్లకు చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. భారత్ చేరకున్న 300 మంది విద్యార్థల్లో ఎంబీబీఎస్ విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ విద్యార్థులంతా ఉత్తర ప్రదేశ్, హర్యానా, మేఘాలయా, జమ్ము కశ్మీర్ చెందినవారిగా అధికారులు గుర్తించారు.Over 300 Indian Students Return Home As 105 Bangladeshis Die In ProtestsMany of the students who returned were pursuing MBBS degrees and most of them were from Uttar Pradesh, Haryana, Meghalaya and Jammu and Kashmir.#BangladeshiStudentsareinDanger https://t.co/kL2sdGFYmL— AK_0 (@ak_2350) July 20, 2024 బంగ్లాదేశ్ నుంచి రెండు మార్గాలు ద్వారా విద్యార్థులు భారత్కు చేరుకున్నారు. శుక్రవారం ఈశాన్య రాష్ట్రం త్రిపుర రాజధాని అగర్తాలాకు సమీపంలోని అకురాహ్ పోర్టు, మేఘాలయాలోని దావ్కీ గుండా విద్యార్థులు భారత్లోకి ప్రవేశించారు. పలువరు విద్యార్థులు టాక్సిల ద్వారా సుమారు ఆరుగంటల ప్రయాణం చేసి మరీ ఇళ్లకు చేరకున్నట్లు అధికారులు తెలిపారు. 200 మంది భారతీ విద్యార్థులతోపాటు కొంతమంది భూటాన్, నేపాల్ చెందిన విద్యార్థులు కూడా భారత్లోకి ప్రవేశించినట్లు మేఘాలయా అధికారులు పేర్కొన్నారు.బంగ్లాదేశ్లో పోలీసులు, అధికార పార్టీ అనుబంధ విద్యార్థి సంఘాలతో ఆందోళనకారులు ఘర్షణలకు దిగుతున్నారు. దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. వారం రోజుల నుంచి జరుగుతున్న ఈ ఘటనల్లో శుక్రవారం నాటికి 64 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా పేర్కొంది. గాయపడిన వారి సంఖ్య వందల్లోనే ఉంటుందని తెలిపింది. -
ప్రైవేటు ‘కోటా’ వివాదం.. కర్ణాటక ప్రభుత్వం వెనకడుగు
బెంగళూరు: కర్ణాటకలోని ప్రైవేటు సంస్థల్లో గ్రూప్ సీ, డీ గ్రేడ్ పోస్టుల్లో కన్నడిగులకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై ప్రభుత్వం వెనకడుగు వేసింది. పరిశ్రమవర్గాల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత రావడంతో బిల్లును తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. దీనిపై రానున్న రోజుల్లో సమీక్షించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.ప్రైవేటు రంగంలో స్థానికులకు రిజర్వేషన్ తప్పనిసారి చేస్తూ కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం కొత్త బిల్లును ఆమోదించింది. అయితే కేబినెట్ ఆమోదించిన ఈ బిల్లుపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఎక్స్లో ఓ పోస్టు చేశారు. ఆయన ట్వీట్ ప్రకారం.. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు పరిశ్రమల్లోని గ్రూప్ సీ, డీ గ్రేడ్ ఉద్యోగాల్లో వంద శాతం కన్నడిగుల నియామకాన్ని తప్పనిసరి చేస్తూ రూపొందించిన బిల్లును రాష్ట్ర మంత్రివర్గం సోమవారం ఆమోదించిందని సీఎం పేర్కొన్నారు.కన్నడిగులు తమ రాష్ట్రంలో సంతోషంగా జీవించేందుకు అవకాశం కల్పించాలన్నదే తమ ప్రభుత్వ ఉద్ధేశ్యమని సీఎం పేర్కొన్నారు. సొంత రాష్ట్రంలో ఉద్యోగానికి వారు దూరం కాకూడదని తెలిపారు. కన్నడిగుల సంక్షేమమే తమ తొలి ప్రాధాన్యతగా చెప్పుకొచ్చారు. అయితే పోస్టుపై అనేక విమర్శలు వెల్లువెత్తడంతో.. తరువాత ఆయన దానిని డిలీట్ చేశారు. అనంతరం మళ్లీ సరిచేసి ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. -
రిజర్వేషన్ కోటా నిరసన హింసాత్మకం.. ఆరుగురి మృతి
ఢాకా: ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటాను వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్లో విద్యార్థులు చేపట్టిన నిరసనలు హింసాత్మాకంగా మారాయి. ఈ నిరసనల్లో మంగళవారం ఆరుగురు నిరసనకారులు మృతి చెందారు. దేశవ్యాప్తంగా ఉన్న అధికార అవామీ లీగ్ పార్టీ విద్యార్థి విభాగం సభ్యులు, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న వేలాది మంది విద్యార్థుల మధ్య ఘర్షణలు తీవ్రతరం అయ్యాయి. దీంతో నిరసన మరింత పెరగకుండా బంగ్లాదేశ్ ప్రభుత్వం ముందస్తుగా.. బుధవారం నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను నిరవధికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది.Dozens injured in Bangladesh clashes as students protest against job quotas for government jobs and a pro-government student body — in pictures https://t.co/CXkzG9mx6b pic.twitter.com/G0ETouUPvs— Al Jazeera English (@AJEnglish) July 16, 2024 బంగ్లాదేశ్లో 56 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు వివిధ కోటాల క్రింద రిజర్వ్ చేయబడ్డాయి. అయితే వాటిలో 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న వీరుల పిల్లలు, మనవళ్లకు 30 శాతం, 10 శాతం మహిళలకు, 10 శాతం అభివృద్ధి చెందని జిల్లాలకు చెందిన వారికి, 5 శాతం స్థానిక వర్గాలకు,1 శాతం వికలాంగులకు కేటాయించబడ్డాయి. ఈ రిజేర్వేషన్లను సంస్కరించి ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు ఇవ్వాలని కొంతమంది విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కోటా ద్వారా ప్రతిభ ఉన్న విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం విద్యార్థులు చేపట్టిన తీవ్రతరం కావటంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు రబ్బరు బుల్లెట్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు.Dhaka University now at 12am..#Bangladesh#StepDownHasina pic.twitter.com/PQMX2e8nJQ— Sayed Rouf 🇵🇸 (@SayedRouf4) July 16, 2024 ఈ నిరసనల్లో సుమారు 400వందల మంది గాయపడినట్లు తెలుస్తోంది. అయితే తాము హింసను రెచ్చగొట్టడానికి నిరసన చేయటం లేదని ఓ విద్యార్థి నిరసనకారుడు మీడియాకు తెలిపారు. ‘ మేకు కేవలం మా హక్కులుకోసం పోరాటం చేస్తున్నాం. కానీ అధికార పార్టీ గూండాలు శాంతంగా నిరసన తెలుపుతున్నవిద్యార్థులపై దాడులు చేస్తున్నారు’ అని తెలిపారు. ఇక.. బంగ్లాదేశ్లో రిజర్వేషన్ హక్కుల కోసం శాంతియుతంగా నిసనలు హింసాత్మకంగా మారాటంపై అంతర్జాతీయ సంస్థలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఆమ్నేస్టీ ఇంటర్నేషనల్ స్పందిస్తూ.. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న నిరసనకారులకు భద్రత కల్పించాలంది. యూఎస్ స్టేట్ డిపార్టుమెంట్ ఈ నిరసన హింసాత్మకంగా మారటాన్ని తీవ్రంగా ఖండించింది.দেশের বুকে আঠারো এসেছে নেমে।❤️#Bangladesh #কোটা_সংস্কার_চাই #কোটাবাতিলচাই #QuotaMovement #QuotaReform pic.twitter.com/Wkalog4iKi— toffee 🇵🇸 (@clowngrizzly) July 16, 2024 -
కూటమి మాట.. రిజర్వేషన్లు రద్దు..
సాక్షి, అమరావతి: మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలు, పేద వర్గాలకు రిజర్వేషన్లు అవసరం లేదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కుండబద్ధలు కొట్టారు! జాతీయ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రిజర్వేషన్లపై తన వ్యతిరేకతను బహిర్గతం చేసిన చంద్రబాబు వాటిని రద్దు చేయాలని అభిప్రాయపడ్డారు! ‘ఎస్సీ, ఎస్టీలు, ఇతర కొన్ని వర్గాలకు ఏడు దశాబ్దాలుగా రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. మరి వాళ్లు ఏమైనా బాగుపడ్డారా?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. వారికి రిజర్వేషన్లు అవసరం లేదన్నట్లుగా మాట్లాడారు. ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ చెబుతుండగా ఎన్డీఏతో పొత్తులో ఉన్న చంద్రబాబు మాత్రం ఇప్పటివరకు మభ్యపెట్టేలా మాట్లాడారు. పోలింగ్కు ముందు చంద్రబాబు తన ముసుగు తొలగించి ముస్లింలకు రిజర్వేషన్లు అవసరం లేదని స్పష్టం చేయడంతో ఆ వర్గాలు ఆవేదనతో రగిలిపోతున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి అధికారం ఇస్తే ఏపీలో ముస్లింలకు అమలవుతున్న 4 శాతం రిజర్వేషన్లు రద్దు కావడం ఖాయమని చంద్రబాబు వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది. చంద్రబాబు ప్రతి సందర్భంలోనూ పేదల పట్ల తన వ్యతిరేకతను చాటుకున్నారు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని వారి పుట్టుకనే అవమానించిన వ్యక్తి చంద్రబాబు. బీసీల తోకలు కత్తిరిస్తానని బెదిరించిన చరిత్ర కూడా ఆయనదే. చంద్రబాబు నరనరానా కులోన్మాదం జీర్ణించుకుపోయిందనేందుకు దళితులు, ముస్లింలు, బీసీలకు వ్యతిరేకంగా పలు సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. తాజాగా ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలకు రిజర్వేషన్లు అవసరం లేదంటూ వారి పట్ల తన వ్యతిరేకతను చాటుకున్నారు. ఆయన మాట్లాడిన వీడియో వైరల్ కావడంతో అది ఫేక్ అంటూ ఎప్పటి మాదిరిగానే గొంతు సవరించుకున్నారు.నైపుణ్య శిక్షణ చాలన్న పవన్చంద్రబాబు పార్ట్నర్ పవన్ కళ్యాణ్ కూడా రిజర్వేషన్లపై తన వ్యతిరేకతను చాటుకున్నారు. దేశంలో చాలా కులాలు, ఉప కులాలు ఉన్నాయని, అందరూ రిజర్వేషన్లు అడుగుతారని, కానీ అందరికీ ఇవ్వలేమని ఇటీవల ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ పేర్కొన్నారు. అర్హతను బట్టి అవకాశాలు రావాలని, అందుకు నైపుణ్య శిక్షణ ఇప్పిస్తే సరిపోతుందన్నారు. రిజర్వేషన్ల ద్వారా అందరికీ అవకాశాలు ఇవ్వలేమని, తన కులం వాళ్లు కూడా రిజర్వేషన్లు అడుగుతున్నారని, కానీ ఇవ్వలేమని స్పష్టం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ వ్యాఖ్యల ద్వారా పేద వర్గాలకు ఇచ్చే రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని తేల్చి చెప్పారు. -
కేంద్రంలో బీజేపీ వస్తే భవిష్యత్తు ఉండదు
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ మరోమారు అధికారంలోకి వస్తే దేశంలోని బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లకు భవిష్యత్తు ఉండదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హెచ్చరించారు. 400 సీట్లు ఎప్పుడు వస్తాయా? రాజ్యాంగాన్ని ఎప్పుడు మార్చి రిజర్వేషన్లను రద్దు చేద్దామా అని ఆ పార్టీ ఉర్రూతలూగుతోందని చెప్పారు. పొరపాటున బీజేపీకి ఓటేస్తే మన గొంతు మనం కోసుకున్నట్టేనని వ్యాఖ్యానించారు. మంగళవారం గాం«దీభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ నేతలు బండ్ల గణేశ్, సామా రామ్మోహన్రెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు. 90% మందికి హక్కులు దక్కకుండా బీజేపీ కుట్ర ‘బీజేపీ అధికారంలోకి వస్తే దళితులు, గిరిజనులు, బీసీలకు రాజ్యాంగం ద్వారా దక్కాల్సిన హక్కులు, వారి వాటా దక్కకుండాపోయే ప్రమాదముంది. తరతరాలుగా అణగదొక్కబడుతున్న దళితులు, గిరిజనులకు రిజర్వేషన్లు ఆషామాïÙగా రాలేదని బీజేపీ నేతలు గుర్తుంచుకోవాలి. ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ఎస్సీ, ఎస్టీలకు అవకాశాల్లో మార్పు రావడానికి రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లే కారణం. ఈ రిజర్వేషన్ల ద్వారా ఆయా వర్గాలకు రావాల్సింది ఇంకా చాలా ఉంది. ఓవైపు దేశ వ్యాప్తంగా కులగణన చేసి జనాభా దామాషా ప్రతిపాదికన ఎవరి వాటా వారికి ఇవ్వాలనేది రాహుల్గాంధీ ఆలోచన. కులగణన ఊసెత్తకుండా ఇప్పటికే ఉన్న ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను తొలగించాలన్నది బీజేపీ ఆలోచన. దేశంలోని 90 శాతం మంది ప్రజలకు రావాల్సిన హక్కులు వారికి రాకుండా బీజేపీ కుట్ర చేస్తోంది. అందుకే పదే పదే 400 సీట్లు కావాలని అడుగుతోంది..’అని భట్టి చెప్పారు. పెను ప్రమాదంలో ప్రజాస్వామ్యం ‘బీజేపీ ఆలోచనలతో ప్రజాస్వామ్యం పెను ప్రమాదంలో పడింది. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని సమాజంపై రుద్దే కుట్ర జరుగుతోంది. ఇలాంటి వాస్తవాలను చెబుతుంటే తప్పుడు కేసులు పెడుతున్నారు. ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై కేసులు పెట్టి విచారణకు ఢిల్లీ రావాలని పిలిపిస్తున్నారు. కేసులు పెట్టి బెదిరిస్తున్నారా? ప్రజల మనసులను గెలుచుకుని ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలే తప్ప కేసులు పెట్టి కాదు. బీజేపీకి ఈ రాష్ట్రంలో స్థానం లేకుండా చేయాల్సిన బాధ్యత రాష్ట్రంలోని బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లపై ఉంది. రానున్న ఎన్నికల్లో తెలంగాణలోని ఆయా వర్గాలు కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించాలి. దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యాంగబద్ధమైన వాటాను, వారి హక్కులను కాపాడుకోవాలంటే కాంగ్రెస్ను నిలబెట్టుకోవాలి..’అని డిప్యూటీ సీఎం అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చడంఎవరి తరం కాదు‘ఎన్నికల కోడ్ రాకముందు మేము అధికారంలోకి వచ్చి మూడు నెలలే అవుతోంది. పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ తెలంగాణను ఛిన్నాభిన్నం చేస్తే దాన్ని సరిదిద్దుతూ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. పదేళ్ల కాలంలో చెప్పిన హామీలను అమలు చేయని కేసీఆర్ ఇప్పుడు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు..’అని భట్టి విమర్శించారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉండబోదని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు కదా అని ప్రశ్నించగా.. ప్రభుతాన్ని కూల్చడం ఎవరి తరం కాదని భట్టి చెప్పారు. సంపూర్ణంగా ఐదేళ్ల పాటు పాలిస్తామని ధీమా వ్యక్తం చేశా రు. గత పదేళ్లలో ప్రజా సంపదను ఎలా లూఠీ చేయాలో బీఆర్ఎస్ చూపెడితే, ఆ సంపదను ప్రజలకు ఎలా పంచాలో తాము చూపెడతా మని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 14 స్థానాల్లో గెలుస్తుందని అన్నారు. -
రిజర్వేషన్లకు ఎవరు భరోసా?
రిజర్వేషన్ల మీద జాతీయ స్థాయిలో ఇంతటి ప్రస్తావన చోటు చేసుకోవడం ఒక మంచి పరిణామం. ఇది ప్రస్తావన మాత్రంగానే సాగుతున్న వ్యవ హారం కాబట్టి దీనిని చర్చ అనడం లేదు. ప్రస్తుతం జరుగు తున్న ఎన్నికల్లో (లోక్సభ ఎన్ని కలు–2024) బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ వస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తుందనీ, రిజర్వేషన్లను రద్దు చేస్తుందనీ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారానికి కమలనాథులు తీవ్ర కలవర పాటుకు గురౌతున్నారు. అర్ఎస్ఎస్ చేత కూడా ఖండన ప్రకటనలిప్పిస్తున్నారు. రాజ్యాంగాన్ని మార్చే ఉద్దేశం కానీ, రిజర్వేషన్లను రద్దు చేసే ఆలోచన కానీ ఏ కోశానా లేవని చెప్పుకుంటున్నారు. రిజర్వేషన్లు జనాభాలో అత్య ధిక శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించి నవి కాబట్టి బీజేపీ ఇంతగా ఇది అయిపోతోందని అర్థమవుతోంది. సామాజికంగా అణగారిన వర్గాలకు–అంటే సామాజికంగా, విద్యా పరంగా వెనుకబడిన వారికి మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వాలని రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. అందుకు విరుద్ధంగా ఆర్థిక వెనుకబాటుతనాన్ని రాజ్యాంగంలో చేర్పించి ఆ వర్గానికి ఏకంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పించిన చరిత్ర బీజేపీ పాలకులది. ఇందు కోసం అగ్ర వర్ణాలనుంచి ఒత్తిడి వర్గాలను రంగంలో దింపిన ఘనత బీజేపీది. దేశంలో శతాబ్దాలుగా కఠోరంగా అమల్లో గల కుల వ్యవస్థ, బ్రాహ్మణీయ వివక్ష వల్ల చదువుకీ, ఆస్తికీ, ఆత్మగౌరవానికీ బహు దూరంగా బతుకుతూ... అదే సమయంలో సకల శ్రామిక, సేవక వృత్తులు చేస్తూ సమాజ రథాన్ని నడిపిస్తున్న వేలాది కింది కులాల ప్రజలను చేయి అందించి ముందుకు తీసుకురావలసిన కర్తవ్యాన్ని గుర్తించి రాజ్యాంగ కర్తలు సానుకూల వివక్షకు అవకాశం కల్పించారు. విద్య, ఉద్యోగాల్లో కొంత శాతాన్ని ప్రత్యేక పరిగణన ద్వారా వారికి కేటాయించాలని నిర్ణయించారు. రాజ్యాంగ అధికరణలు 15(4), 46 ఇందుకే చోటు చేసుకున్నాయి. ప్రమోషన్లలో, భర్తీ కాకుండా మిగిలిపోయిన బ్యాక్ లాగ్ ఉద్యోగాలలో కూడా ఈ రిజర్వేషన్లు వర్తింపజేయడానికి వేర్వేరు రాజ్యాంగ సవరణల ద్వారా అవకాశం కల్పించారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ అందరికీ సమానంగా ఓటు హక్కును కల్పించడంతో దేశంలో సమతా భావన బలపడడం ప్రారంభించింది. అయినా ఇప్పటికీ వెలి గ్లాసులు, వెలి బావులు వంటివి కొనసాగుతున్నాయి. అగ్రవర్ణాలకు కేటాయించిన మంచినీటి కుండలోని నీరు తాగేడనే నెపం మీద పాఠశాలలో దళిత బాలుడిని కొట్టి చంపిన మాదిరి దారుణ ఉదంతాలు జరుగతున్నాయి. రిజర్వేషన్లు కల్పించి ఏడు దశాబ్దాలు దాటినా అణగారిన వర్గాల– ఎస్సీ, ఎస్టీ, బీసీల బతుకులు చాలీ చాలని గుడిసెల్లోనే కొనసాగుతున్నాయి. నిరుద్యోగం, అధిక ధరలు వారి బతుకులను మరింతగా అంచులకు ఈడ్చివేశాయి. అందుకే జనాభాలో తామెందరో... విద్య, ఉద్యోగాల్లో అంత శాతం వాటా తమకు రావాలనే డిమాండ్ ముందుకు వచ్చింది. కులగణన నినాదం బలం పుంజుకున్నది. కాంగ్రెస్ పార్టీ దీనిని ప్రధాన వాగ్దానంగా చేసుకుంది. ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా దామాషాను బట్టి రిజర్వేషన్లు వర్తిస్తుండగా దేశ జన సంఖ్యలో సగానికి పైగా ఉన్న బీసీలకు రిజర్వేషన్లను 27 శాతానికే కుదించారు. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీం కోర్టు గీచిన హద్దు గీత, క్రీమీ లేయర్ నిబంధన బీసీల పాలిట శాపాలయ్యాయి. ఆర్థిక వెనుకబాటుతనం పేరిట అగ్రవర్ణ పేదలకు రాజ్యాంగ సవరణ ఆయుధంతో 10 శాతం కోటా కల్పించిన మోదీ ప్రభుత్వం రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని, క్రీమీ లేయర్ను తొలగించడానికి రాజ్యాంగ సవరణ ఎందుకు చేయలేదు? కులగణను బీజేపీ ఎందుకు వ్యతి రేకిస్తోంది? బీసీల దయనీయస్థితి అంకెల్లో అచ్చు గుద్ది నట్టు బయటపడి వారిని వాడుకుంటూనే తాను వారిని ఎంతగా వంచిస్తున్నదో బహిర్గతమవుతుందనే భయంతోనే కదా! బీజేపీ చరిత్రంతా రిజర్వేషన్ల వ్యతిరేక చరిత్రే. దశాబ్దాల క్రితం మండల్ నివేదిక అమలుకు తలపెట్టిన ప్పుడు చెలరేగిన రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం, మందిర్ ఆందోళన పరివార్ శక్తుల ప్రమేయంతో చెలరేగినవే కదా! సమ్మిళిత లక్షణంతో సెక్యులర్ సదాశయంతో వారి వారి అణగారినతనం ఆధారంగా హిందూయేతర మత స్థులలోని వారికీ రిజర్వేషన్ల కల్పనకు రాజ్యాంగం వీలు కల్పించింది. 2005 లో యూపీఏ ప్రభుత్వం నెలకొల్పిన జస్టిస్ రాజిందర్ సచార్ కమిటీ దేశంలో ముస్లింలు దయనీయ స్థితిలో ఉన్నారనీ, వారికి విశేష స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనీ సిఫారసు చేసింది. ఇప్పుడు ముస్లింలకు అరకొరగా ఉన్న రిజర్వేషన్లను కూడా రద్దు చేస్తామని ప్రధాని మోదీ తన ఎన్నికల ప్రచార సభల్లో కఠోర స్వరంతో ప్రకటిస్తున్నారు. రాజ్యాంగ ధర్మాన్ని కాల రాస్తున్నారు. ముస్లింల రిజర్వే షన్లను తెగనరుకుతానంటున్న బీజేపీ, ఆ తర్వాత వారికి దగ్గరగా ఉన్న ఎస్సీ, ఎస్టీల కోటాకు టాటా చెప్పాబోదనే హామీ ఎక్కడిది? ఈ ఎన్నికల్లో తమ పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమికి లోక్సభలో 400 సీట్లు వస్తే రిజర్వేషన్లను తొలగిస్తామనీ, రాజ్యాంగాన్ని మారుస్తామనీ రాజస్థాన్ మంత్రి కిరోరి లాల్ మీనా ప్రకటించినట్టు చూపించిన ఒక వీడియో గత నెలలో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. బీజేపీ తన అభిమతాన్ని అధికారికంగా కాకుండా అనధికారిక మార్గాలలో వ్యక్తం చేస్తూ ఉంటుందనే అభిప్రాయం ఉంది. రిజర్వేషన్ల జోలికి వెళ్ళబోమనీ, అది తప్పుడు ప్రచారమనీ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పదే పదే చేస్తున్న ప్రకటనలను, ఇస్తున్న హామీలను నమ్మలేం. అర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ కూడా రంగ ప్రవేశం చేసి రిజర్వేషన్ల రద్దు జరగబోదని స్పష్టంగా ప్రకటించారు. అయితే గతంలో ఆయనొకసారి రిజర్వేషన్లను సమీక్షించాలని అన్నారు. 2015 లో బిహార్ ఎన్నికలకు కొద్ది వారాల ముందు మాట్లాడుతూ రిజర్వేషన్ విధానంపై సామాజిక సమీక్ష జరగాలని ప్రకటించారు. దాని మీద వివాదం చెలరేగడంతో ఇతర పేద వర్గాలకు కూడా మేలు చేసే ఉద్దేశంతోనే ఆయన అలా అన్నారని వివరణ వచ్చింది. ఆచరణలో బీజేపీ పదేళ్ల పాలనలో రిజర్వేషన్లు కను మరుగయ్యేలా ప్రైవేటైజేషన్ ముమ్మరించింది. సామా జికంగా, విద్యా విషయకంగా వెనుకబడిన బీసీలకు విధానపరంగా అది ఉపయోగపడింది శూన్యమే. బడు గులను కేవలం పేదలుగా, పైనుంచి నెలకు 5 కిలోల బియ్యం ‘ముష్టి’ వేస్తే అదే మహా ప్రసాదమని కళ్ళకు అద్దుకొనేవారుగా మాత్రమే బీజేపీ పరిగణిస్తూ ఉంది.హిందూ కుల వ్యవస్థ దశాబ్దాలుగా అణగదొక్కగా చదువు, ఆత్మగౌరవం పిసరంతైనా అంటని బానిస బతు కులు బతికినవారికి పరిహారంగా రిజర్వేషన్లను కల్పించడాన్ని తాము నెత్తిన పెట్టుకునే సనాతన నీతికి అవమా నమని వారు భావిస్తున్నారు. ఉదాహరణకు మహిళలపై గతంలో మోహన్ భాగవత్ వెలిబుచ్చిన అభిప్రాయా లను గమనించవచ్చు. ‘పెళ్లి ఒక కాంట్రాక్టు అని ఈ ఒప్పందం ప్రకారం నువ్వు నా ఇంటి బాధ్యతలు నెరవేరిస్తే నీ అవస రాలాన్నిటినీ నేను తీరుస్తాను, నిన్ను భద్రంగా కాపాడుతాను అని భర్త భార్యకు చెబుతాడు, భార్య ఈ ప్రకారం నడుచుకున్నంత కాలం భర్త ఆమె బాధ్యత వహిస్తాడు, ఆమె ఈ కాంట్రాక్టును ఉల్లంఘిస్తే ఆమెను అతడు వదిలేయవచ్చు’అని ఆయన అన్నారు. గ్రామీణ భారతంలో రేప్లు తక్కువనీ, పట్టణాల్లో, నగరాల్లోనే ఎక్కు వని కూడా అన్నారు. మహిళ ఆస్వతంత్రురాలుగా, పురుషుడి చేతుల్లో ఉండాలని ఆయన ప్రవచించారు. ఇటువంటి భావాలు గలవారి అధిపత్యంలో దేశం సెక్యులర్ రాజ్యాంగానికీ, రిజర్వేషన్లకూ స్వస్తి చెప్పి మనుస్మృతిని అమల్లోకి తెస్తుందనే భయాలు కలగడం సహజాతి సహజం.జి. శ్రీరామమూర్తి వ్యాసకర్త సీనియర్ సంపాదకులు -
నిప్పుతో చెలగాటమా!
న్యూఢిల్లీ: రిజర్వేషన్ల పేరిట హిందువులు, ముస్లింల మధ్య చిచ్చు పెట్టి కాంగ్రెస్ నిప్పుతో చెలగాటం ఆడుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆరోపించారు. బీజేపీ ఈసారి 400 స్థానాల్లో గెలిచి కొన్ని రాష్ట్రాల్లో మరింత మెరుగైన రాజకీయప్రతిభ కనబరచనుందని వ్యాఖ్యానించారు. పీటీఐతో ప్రత్యేక ఇంటర్వ్యూ సందర్భంగా ప్రస్తావించిన అంశాలు, అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. రాహుల్ గాంధీలో ఫైర్ లేదు ‘‘ రాహుల్ గాం«దీలో గొప్ప నాయకత్వ లక్షణం(ఫైర్)లేదుగానీ హిందూ, ముస్లింల మధ్య చిచ్చు పెట్టి విద్వేష మంటలు రాజేసే ఫైర్ చాలా ఉంది. ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ సామాజిక సామరస్యాన్ని నాశనంచేస్తోంది. మత విద్వేషాలకు కారణమవుతోంది. ముస్లింలను కేవలం ఓటు బ్యాంక్గా చూస్తోంది. మేం గెలిస్తే ఉమ్మడి పౌర స్మృతి, ఒకే దేశం ఒకే ఎన్నికలు వంటి నిర్ణయాలను అమలుచేస్తాం.రాజ్యాంగపీఠికను బీజేపీ ఎన్నటికీ మార్చబోదు. రాజ్యాంగాన్ని సవరిస్తామంటూ కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్సే ఇప్పటికి 80 సార్లు రాజ్యాంగసవరణలు చేసింది. ఎమర్జెన్సీ కాలంలో రాజ్యాంగ పీఠికలోనూ మార్చులు చేశారు. జనాల్లో భయాలు పెంచి వారి మద్దతు సాధించాలని కాంగ్రెస్ ఆశిస్తోంది. రిజర్వేషన్లు తొలగిస్తామని మాపై అబద్ధాల బురద చల్లుతోంది’’ ప్రశంసలో ఆంతర్యమేంటి?‘‘పాకిస్తాన్ మాజీ మంత్రి చౌదరి ఫహాద్ హుస్సేన్ ఇటీవల రాహుల్ గాం«దీని నెహ్రూతో పోలుస్తూ ప్రశంసల్లో ముంచెత్తడం నిజంగా ఆందోళనకర విషయమే. భారత్ను అస్థిరపరచాలని చూసే శత్రుదేశం నేత రాహుల్ను ప్రశంసించడంలో ఉన్న ఆంతర్యమేంటో? అసలు పాక్తో కాంగ్రెస్కు ఉన్న సంబంధమేంటి? సంపద పంపిణీ విషయంలో శనివారం కూడా ఆయన పొగిడారు. ఆయన మాటల వెనుక బలమైన కారణం ఉండి ఉంటుంది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఖచి్చతంగా వివరణ ఇవ్వాలి. లోక్సభ ఎన్నికలను ప్రభావితం చేద్దామని పాక్ ప్రయతి్నస్తోంది. కానీ పాక్కు అంత సత్తా లేదు’’ 400 సీట్లు ఖాయం ‘‘ఈసారి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 సీట్లు సాధిస్తుంది. బీజేపీ 370కిపైగా స్థానాల్లో గెలుస్తుంది. పశి్చమబెంగాల్లో మరిన్ని సీట్లు సాధిస్తాం. తమిళనాడులోనూ మెరుగవుతాం. కేరళలో బోణీ కొడతాం. ఒడిశా, అస్సాం, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ మెరుగైన సీట్లు సాధిస్తాం. ఛత్తీస్గఢ్లో క్లీన్స్వీప్ చేస్తాం. ఉత్తరప్రదేశ్లో 75 సీట్లదాకా గెలుస్తాం. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ చీలికలు, సీట్ల సర్దుబాటు, ఇతరత్రా కారణాల వల్ల తక్కువ సీట్లు సాధిస్తాం. తొలి రెండు దశల్లో తక్కువ పోలింగ్ శాతం నమోదవ్వడం వల్ల బీజేపీకి వచి్చన నష్టమేమీ లేదు’’ సంపద పునఃపంపిణీ సరికాదు‘‘ కాంగ్రెస్ చెబుతున్నట్లు సంపదను పునఃపంపిణీ చేస్తామన్న విధానం సహేతుకంకాదు. అర్జెంటీనా, వెనిజులా దేశాలు దీనిని అమలుచేసి చేతులుకాల్చుకున్నాయి. విపరిణామాలను ఎదుర్కొన్నాయి. కాంగ్రెస్ ఇలా చేస్తే భారత ఆర్థికవ్యవస్థ కుప్పకూలి వెనిజులా మాదిరిగా ద్రవ్యోల్బణం కట్టుతప్పుతుంది. భారత్పై పెట్టుబడిదారులు విశ్వాసం కోల్పోతారు’’ పాక్ ఆక్రమిత కశ్మీర్ మనదే ‘‘ పాక్ ఆక్రమిత కశీ్మర్ ముమ్మాటికీ మనదే. అంతమాత్రాన పీవోకేను బలవంతంగా ఆక్రమించాల్సిన అవసరం లేదు. జమ్మూకశ్మీర్లో సాకారమైన అభివృద్ధిని చూశాక పీఓకే ప్రజలే భారత్లో విలీనంకావాలని కోరుకుంటున్నారు. జమ్మూకశీ్మర్లో సాయుధబలగాల ప్రత్యేక అధికారాల(ఏఎఫ్ఎస్పీఏ) చట్టంను తొలగించాల్సిన సమయం దగ్గరపడింది. దీనిపై కేంద్ర హోం శాఖ త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోనుంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తాం. అయితే ఖచి్చతంగా ఎప్పుడు అనేది ఇప్పుడే చెప్పలేం’’ సరిహద్దు చర్చలు సానుకూలం ‘‘ తూర్పు లద్దాఖ్లో చైనా, భారత్ జవాన్ల ఘర్షణ తర్వాత నెలకొన్న ఉద్రిక్తతను సద్దుమణిగేలా చేసేందుకు చర్చల ప్రక్రియ సానుకూల వాతావరణంలో కొనసాగుతోంది. సమస్యకు పరిష్కారం లభిస్తుందని భారత్ నమ్మకం పెట్టుకుంది. చైనా కూడా అదే నమ్మకంతో చర్చలకు ముందుకొచి్చంది. సరిహద్దు వెంట మౌలికవసతుల పటిష్టానికి త్వరితగతిన ప్రాజెక్టుల్ని పూర్తిచేస్తున్నాం. సరిహద్దు త్వరలో మరింత సురక్షితంగా ఉండబోతోంది’’ -
మోదీ సభలో నోరెత్తగలవా? చంద్రబాబుకు వైఎస్ జగన్ సవాల్
చంద్రబాబు బాగా ముదిరిపోయిన తొండ! ఒకపక్క 4 శాతం ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని శపథం చేస్తున్న బీజేపీతో జత కడతాడు. మరోపక్క మైనార్టీల ఓట్ల కోసం దొంగ ప్రేమ నటిస్తూ డ్రామాలు మొదలుపెట్టాడు. మైనార్టీలపై దొంగ ప్రేమ నటిస్తూ ఎన్డీఏలో కొనసాగుతానంటాడు. ఇంతకన్నా ఊసరవెల్లి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా? – నెల్లూరు సభలో సీఎం జగన్మండుటెండలోనూ పలమనేరులో చక్కటి వర్షం పడింది. మీ చిక్కటి చిరునవ్వులతోపాటు ఈ వర్షం దేవుడి ఆశీస్సులుగా భావిస్తున్నా. విజయం మనదే. – పలమనేరు సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి నెల్లూరు, సాక్షి, తిరుపతి, సాక్షి, పుట్టపర్తి: ‘నేను ఈరోజు.. ధైర్యంగా చెబుతున్నా. ఆరునూరైనా కూడా 4 శాతం రిజర్వేషన్లు మైనార్టీలకు ఉండి తీరాల్సిందేనని మీబిడ్డ ఈరోజు తలెత్తుకుని చెబుతున్నాడు. ఇది మీ జగన్ మాట. ఇది మీ వైఎస్సార్ బిడ్డ మాట. దీనికోసం ఎందాకైనా పోరాడతా. మరి చంద్రబాబు ప్రధాని మోదీ సభలో ఇలా చెప్పగలడా? ఎన్డీఏ నుంచి బయటకు రాగలడా? ఎందుకీ దొంగ ప్రేమ? ఒకవైపు ఎన్డీఏలో కొనసాగుతూ.. మరోవైపు వాళ్లు 4 శాతం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నా కూడా.. వారితోనే జతకట్టి ఎందుకు ఎన్డీఏలో ఉన్నావు? సమాధానం చెప్పు చంద్రబాబూ..!’ అని సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సూటిగా నిలదీశారు. శనివారం హిందూపురం, పలమనేరు, నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్లో జరిగిన ఎన్నికల బహిరంగ సభల్లో సీఎం జగన్ ప్రసంగించారు. రాజ్యాంగానికి లోబడి ఇచ్చిన రిజర్వేషన్లు..ఇక్కడ కొన్ని విషయాలు రాష్ట్ర ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. మైనార్టీ సోదరులకు ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్లు మతం ప్రాతిపదికగా ఇచ్చినవి కావు. ముస్లింలలో కూడా కొన్ని వర్గాలకు రిజర్వేషన్లు వర్తించడం లేదు. పఠాన్లకు, సయ్యద్లకు, మొఘల్లకు వర్తించడం లేదు. ఇవి కేవలం వెనుకబాటు ప్రాతిపదికగా మాత్రమే ఇచ్చిన రిజర్వేషన్లు. ఇవాళ నేను ఈ రిజర్వేషన్లు వ్యతిరేకించే వారిని, బీజేపీని అడుగుతున్నా. ఒక్క ముస్లింలలో మాత్రమే కాదు. అన్ని మతాల్లో కూడా బీసీలు, ఓసీలున్నారు. అవి రాజ్యాంగానికి లోబడి వెనుకబాటు ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు. మరి ఇలాంటి వెనుకబాటుకి గురైన వారికి ఇచ్చిన రిజర్వేషన్లపై రాజకీయం చేస్తూ వారి జీవితాలతో చెలగాటం ఆడటం ధర్మమేనా? ఇది కరెక్టేనా? అనేది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి.మైనార్టీలకు మీ జగనన్న భరోసా..నేను ఇవాళ ప్రతి మైనార్టీ సోదరుడు, అక్కచెల్లెమ్మకు భరోసా ఇస్తూ చెబుతున్నా. మీకు 4 శాతం రిజర్వేషన్ల విషయం అయినా, ఎన్ఆర్సీ అయినా, సీఏఏ అయినా ఇంకా ఏ మైనార్టీ అంశమైనా.. మీ మనోభావాలకు, ఇజ్జత్ ఔర్ ఇమాన్కు మీ బిడ్డ జగన్ ఎప్పటికీ అండగా ఉంటాడు. మైనార్టీల పట్ల ప్రేమ చూపుతూ ఒక్క డీబీటీ స్కీమ్లే కాకుండా ఇళ్ల నిర్మాణం, షాదీ తోఫా లాంటి వాటితో అండగా నిలిచాం. ఉర్దూను రెండో అధికార భాషగా ప్రకటించడం మొదలు నలుగురు మైనార్టీలను ఎమ్మెల్సీలుగా, నలుగురు మైనార్టీలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నాం. నా మైనార్టీ సోదరుడు ఒకరిని డిప్యూటీ సీఎంగా, మైనార్టీ సోదరిని శాసనమండలి వైస్ చైర్పర్సన్గా అవకాశం కల్పించి గౌరవించాం. మైనార్టీ సబ్ ప్లాన్ బిల్లు తేవడం దాకా ప్రతి సందర్భంలోనూ వారికి సముచిత స్థానం కల్పించి సాదరంగా పక్కన పెట్టుకున్న ప్రభుత్వం ఇదేనని గర్వంగా చెబుతున్నా. మొట్టమొదటిసారిగా మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు మాత్రమే కాకుండా ఎన్నికల్లో 7 స్థానాలు మైనార్టీలకే ఇవ్వడం ద్వారా వారికి రాజకీయంగానూ నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చినట్లయింది. అలా ఇచ్చిన పార్టీ వైఎస్సార్ సీపీనే అని గర్వంగా చెబుతున్నా.ఖాతాల్లోకి రూ.2.70 లక్షల కోట్లు.. 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలుమరో 9 రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగనుంది. రాబోయే ఐదేళ్ల పాటు మీ ఇంటింటి భవిష్యత్తు, పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలివి. మీ జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. అదే చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవడం. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. చంద్రబాబును నమ్మితే మళ్లీ చంద్రముఖి నిద్రలేస్తుంది. ఐదేళ్ల పాటు మీ రక్తం తాగుతుంది. మీ బిడ్డ 59 నెలల పాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చాడు. 130 సార్లు బటన్లు నొక్కి అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు రూ.2.70 లక్షల కోట్లు నేరుగా డీబీటీతో జమ చేశాడు. గతంలో రాష్ట్రంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఉంటే మీ బిడ్డ ఏకంగా మరో 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడు. మేనిఫెస్టోలోని హామీల్లో 99 శాతం నెరవేర్చి చిత్తశుద్ధి చాటుకున్నాడు. మీ బిడ్డ ఐదేళ్లలో చేసిన మంచినే చూపిస్తున్నాడు. నలుగురిలో నిలబడి కళ్లల్లో కళ్లు పెట్టి చూడగలుగుతున్నాడు. ఒక మనిషి 14ఏళ్లు సీఎంగా చేసిన తర్వాత కూడా 75 ఏళ్ల వయసుండీ ఒంటరిగా ఎన్నికలకు వెళ్లలేకపోతున్నాడంటే, పొత్తులతో నిలబడే ప్రయత్నం చేస్తున్నాడంటే, అసాధ్యమైన వాగ్దానాలు, మోసాలను నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నాడంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా? మనం చేసిన అభివృద్ధి...నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీలు పూర్తిచేసి జాతికి అంకితం చేసింది మన ప్రభుత్వమే. ఆర్ అండ్ ఆర్ పూర్తి చేసి చిత్రావతి, గండికోట, పులిచింతల రిజర్వాయర్లను పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేశాం. వెలిగొండలో రెండు టన్నెళ్లను ఇప్పటికే పూర్తిచేశాం. ఈ వర్షాకాలంలో వెలిగొండ నీళ్లను ప్రకాశం జిల్లాకు తీసుకెళుతున్నాం. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పనులను పరుగులు పెట్టిస్తున్నాం. పైప్లైన్ వేసి రక్షిత మంచినీటి సదుపాయం కల్పించి ఉద్దానం సమస్యను శాశ్వతంగా పరిష్కరించాం. చంద్రబాబు దిక్కుమాలిన బుర్రకు ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా తట్టిందా? మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు, 10 ఇండస్ట్రియల్ నోడ్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎంఎస్ఎంఈలకు చేయి అందించి తోడుగా నిలిచాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో రాష్ట్రాన్ని వరుసగా నెంబర్ వన్గా నిలబెట్టాం. చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు కేవలం రూ.32 వేలు కోట్లు అయితే ఇదే మన పాలనలో వచ్చిన పెట్టుబడులు ఏకంగా రూ.లక్ష కోట్లు. వైద్య ఆరోగ్యశాఖలో 54 వేల పోస్టులు భర్తీ చేశాం. 17 కొత్త మెడికల్ కాలేజీలు కడుతున్నాం. నెల్లూరు జిల్లాలో రామాయపట్నం పోర్టు, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ దాదాపు పూర్తి కావచ్చాయి. గడగడా చెబుతాగవర్నమెంట్ బడికి వెళ్లే పిల్లల చేతుల్లో ట్యాబ్లు, బడులు తెరిచేసరికే విద్యాకానుక, గోరుముద్ద, చదువులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మ ఒడి లాంటివి గతంలో ఉన్నాయా? పూర్తి ఫీజులతో జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన గతంలో ఎప్పుడైనా చూశారా? నా అక్కచెల్లెమ్మలు ఆర్థికంగా ఎదిగేలా ఒక ఆసరా, చేయూత, సున్నావడ్డీ, కాపునేస్తం, ఈబీసీ నేస్తంతోపాటు 31 లక్షల ఇళ్ల స్థలాలు, 22 లక్షల ఇళ్ల నిర్మాణాలను చేపట్టాం. అవ్వాతాతలకు ఇంటికే రూ.3,000 పెన్షన్, రైతన్నలకు పెట్టుబడికి సాయంగా రైతు భరోసా లాంటివి గతంలో ఉన్నాయా? రైతన్నలకు ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ, పగటి పూటే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, ఓ ఆర్బీకే వ్యవస్థ లాంటివి ఇంతకు ముందెప్పుడైనా ఉన్నాయా? సొంత ఆటోలు, టాక్సీలు నడుపుతున్న డ్రైవరన్నలకు ఓ వాహన మిత్ర, నేతన్నలకు నేతన్న నేస్తం, మత్స్యకారులకు మత్స్యకార భరోసా, ఓ చేదోడు, తోడు, లాయర్లకు లా నేస్తం లాంటి పథకాలు గతంలో ఉన్నాయా?ఆరోగ్యశ్రీని విస్తరించి రూ.25 లక్షల దాకా ఉచితంగా వైద్యం అందిస్తున్నాం. ఆరోగ్య ఆసరా ద్వారా కోలుకునే సమయంలో జీవన భృతికి ఇబ్బంది లేకుండా అండగా నిలిచాం. సచివాలయాల ద్వారా ఏకంగా 600 రకాల సేవలు ప్రజలకు గడప వద్దే అందిస్తున్నాం. వలంటీర్ వ్యవస్థ ద్వారా పథకాలు డోర్ డెలివరీ అవుతున్నాయి. నాడు ఆ డబ్బంతా ఎవరి ఖాతాల్లోకెళ్లింది? పిండి కొద్దీ రొట్టె సామెత మనకు తెలుసు. కానీ,పిండీ.. రొట్టె మొత్తం తినేసే బ్యాచ్కు లీడర్ చంద్రబాబు! తన 14 ఏళ్ల పాలనలో పేదలకు ఒక్కటైనా మంచిపనిగానీ, ఖాతాల్లోకి ఒక్క రూపాయిగానీ జమ చేశాడా? నాడూ నేడూ ఇదే రాష్ట్రం.. అదే బడ్జెట్. అప్పుల గ్రోత్ రేట్ ఇప్పుడే తక్కువ. మరి చంద్రబాబు ఆ డబ్బంతా ఎవరి ఖాతాల్లో జమ చేశారో నిలదీసి అడగండి. చంద్రబాబుకి ఎంత పోయింది? దత్తపుత్రుడికి ఎంతిచ్చారు? ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5కి ఎంత పోయింది? జన్మభూమి కమిటీల జేబుల్లోకి ఎంత పోయింది?మన అభ్యర్థులను దీవించండిపలమనేరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటేగౌడ, చిత్తూరు ఎంపీ అభ్యర్థి ఎన్.రెడ్డెప్ప, హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి æదీపికమ్మ, ఎంపీ అభ్యర్థి శాంతమ్మ, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ అహ్మద్, రూరల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్రెడ్డి, నెల్లూరు ఎంపీ అభ్యర్థి సాయిరెడ్డిని మీరంతా ఆశీర్వదించి గొప్ప మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా. 2014లో బాబు ముఖ్యమైన విఫల హామీలివీ..» రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా? » రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తామని ఒక్క రూపాయైనా మాఫీ చేశాడా? » ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామని నమ్మబలికి రూపాయి అయినా ఇచ్చాడా? » ఇంటికో ఉద్యోగం లేదంటే రూ.2 వేలు నిరుద్యోగ భృతి హామీ అమలైందా? ఐదేళ్లలో ఏ ఇంటికైనా రూ.1.20 లక్షలు ఇచ్చాడా? » అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. మరి ఒక్కరికైనా సెంటు స్థలం ఇచ్చాడా? » రూ.10,000 కోట్లతో బీసీ సబ్ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్సు ఏర్పాటు చేశాడా? » సింగపూర్కు మించి అభివృద్ధి, ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మాణం జరిగిందా? హిందూపురం, పలమనేరు, నెల్లూరులో ఎక్కడైనా కనిపిస్తున్నాయా?» ప్రత్యేక హోదా తేకపోగా అమ్మేశాడు.» మళ్లీ ఇప్పుడు అదే కూటమి పేరుతో సూపర్ సిక్స్, సూపర్ సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజి కారు అంటూ మరోసారి మోసాలకు తయారయ్యారు.ఇంటికే పెన్షన్లను అడ్డుకున్న బాబు..చంద్రబాబు మొన్న అవ్వాతాతలకు ఇంటికే వచ్చే పింఛన్ను అడ్డుకున్నారు. ఇవాళ బ్యాంకుల చుట్టూ పడిగాపులు కాయాల్సిన దుస్థితికి తీసుకొచ్చారు. వలంటీర్లు ఇంటికి రాకూడదు, వాళ్లు పెన్షన్లు ఇవ్వకూడదంటూ చంద్రబాబు తన మనిషి నిమ్మగడ్డ రమేష్ ద్వారా కేంద్ర ఎన్నికల కమిషన్కు లెటర్ రాశాడు. అవ్వాతాతలు చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుండటంతో ఆ నెపాన్ని మీ బిడ్డ జగన్పై వేయాలని ప్రయత్నించడం సిగ్గు చేటు. మీ ఇంటికి మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలవాలని కోరుతున్నా. జగనన్న వచ్చాడు.. వర్షాన్ని తెచ్చాడుహిందూపురంలో పర్యటన ముగించుకుని సీఎం జగన్ పలమనేరు చేరుకునే సరికి మధ్యాహ్నం 2 గంటలు అయింది. అయితే మిట్ట మధ్యాహ్నం 12 గంటలకే క్లాక్ టవర్ వద్దకు జన ప్రవాహం మొదలైంది. అందరిలో హర్షం వెల్లివిరిసేలా సీఎం జగన్తో పాటు వరుణ దేవుడు తోడుగా వచ్చాడు. దాదాపు 30 నిమిషాల పాటు మోస్తరు వర్షం కురిసింది. జగన్ వస్తే వానొస్తుందంటూ రైతన్నలు ఆనందం వ్యక్తం చేశారు. -
రిజర్వేషన్ల రద్దు నాటకం కాంగ్రెస్ కుట్రే
కరీంనగర్ టౌన్: తెలంగాణలో ఏ సర్వే చూసినా బీజేపీ అత్యధిక సీట్లు సాధిస్తుందని తేలడంతో రేవంత్రెడ్డికి భయం పట్టుకుందని, సీఎం సీటు పోతుందనే భయంతో రేవంత్రెడ్డి ఇష్టమొచ్చి నట్లు మాట్లాడుతున్నా రని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బీజేపీని, ఆర్ఎస్ఎస్ను బద్నాం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. రిజర్వేషన్ల రద్దు కోసమే 2000లో జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ను బీజేపీ ప్రభుత్వం నియమించిందన్నారు. ఆయనిచ్చిన రిపోర్టును కూడా తొక్కిపెట్టారని చెబుతున్న రేవంత్రెడ్డికి 2004 నుంచి 2014 వరకు కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ అని తెలీదా? మరి ఆ రిపోర్టును ఎందుకు బయటపెట్టలేదని సంజయ్ ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్లోని కమాన్చౌరస్తా వద్ద బుధవారం రాత్రి నిర్వహించిన రోడ్షోకు వేలాది మంది తరలివచ్చారు. కేంద్రమంత్రి మురుగన్తోపాటు సంజయ్ పాల్గొని మాట్లాడారు. తమిళనాడులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి పార్టీని విస్తరించిన నాయకుడు మురుగన్ అని, ఆయన ఎంపీ కాకపోయినా దళితుడైన మురుగన్ సేవలను గుర్తించి నేరుగా కేంద్రమంత్రిని చేసిన ఘనత ప్రధాని మోదీదే అని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు డిపాజిట్లు రావని, రెండోస్థానం కోసమే పోటీ పడుతున్నారని ఎద్దేవాచేశారు. పొన్నం, వినోద్కుమార్ కరీంనగర్కు ఏంచేశారో చెప్పాలన్నారు. ఇవి దేశ ప్రధానిని నిర్ణయించే ఎన్నికలని, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే, సంక్షేమ పథకాలు అందాలంటే, దేశ రక్షణ కావాలంటే మోదీనే మళ్లీ ప్రధాని కావాలని సంజయ్ తెలిపారు. దేశమంతా కరీంనగర్లో బండి సంజయ్ను ఎంత మెజారిటీతో గెలిపిస్తారనే చర్చ జరుగుతోందన్నారు. తనను ఎంపీగా గెలిపించి మోదీని ప్రధానిగా ఎన్నుకునే అవకాశం కల్పించాలని కోరారు. -
ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు
-
నాడు వ్యతిరేకించి.. ఇప్పుడు సమర్థిస్తున్నారు
డామన్/కటక్: రిజర్వేషన్లను ఆర్ఆర్ఎస్ మొదట్నుంచీ సమర్థిస్తూ వస్తోందంటూ ఆ సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. డయ్యూ డామన్, దాద్రా నగర్ హవేలీ కేంద్ర పాలిత ప్రాంతంలోని డామన్ పట్టణంలో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారర్యాలీలో రాహుల్ ప్రసంగించారు. ‘‘ ఇప్పుడేమో రిజర్వేషన్లకు మేం వ్యతిరేకం కాదని భాగవత్ చెబుతున్నారు. మరి అప్పుడేమో తాను రిజర్వేషన్లకు పూర్తి వ్యతిరేకినని ఘంటాపథంగా చెప్పేవారు.రిజర్వేషన్లను వ్యతిరేకించే వాళ్లే బీజేపీతో చేరేవారు. వాళ్లకే బీజేపీ స్వాగతం పలికి అక్కున చేర్చుకుంది. తీరా ఎన్నికల వేళ ఇప్పుడొచ్చి మళ్లీ రిజర్వేషన్లకు మా మద్దతు అంటూ భాగవత్ కొత్త రాగం ఆలపిస్తున్నారు’’ అని రాహుల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ఈసారి ఎన్నికలు కాంగ్రెస్, ఆర్ఎస్ఎస్–బీజేపీ మధ్య సైద్ధాంతిక పోరు. రాజ్యాంగ విత్తనం నుంచే దేశంలోని అనేక విభాగాలు ఉద్భవించాయి. పూర్వకాలంలో మాదిరి రాజ్యపాలన సాగించాలని మోదీజీ, ఆర్ఎస్ఎస్ ఆశ. వీటిని నాశనం చేసి ఆర్ఎస్–బీజేపీ రాజుల్లాగా దేశాన్ని పాలించాలనుకుంటున్నారు’’ అని ఆరోపించారు. ‘‘ ఆర్ఎస్ఎస్–బీజేపీ వాళ్లకు ఒకే దేశం, ఒకే భాష, ఒక్కడే నేత ఉండే వ్యవస్థ కావాలి. పశి్చమబెంగాల్ ప్రజలు బెంగాలీ మాట్లాడతారు. అలాగే గుజరాత్ వాళ్లు గుజరాతీ, తమిళులు తమిళమే మాట్లాడతారు. అలాంటపుడు ఒకే భాష, ఒకే నేత విధానంలో హేతుబద్ధత ఎక్కడుంది?’’ అని నిలదీశారు. ‘‘డయ్యూ డామన్, దాద్రా నగర్ హవేలీ కేంద్ర పాలిత ప్రాంత అడ్మిని్రస్టేటర్ పదవిలో మోదీ ప్రఫుల్ పటేల్ను ‘రాజు’లాగా నియమించారు. ప్రజాభీష్టంతో ప్రఫుల్కు పనిలేదు. ఆయన ఏమనుకున్నారో అదే చేస్తారు’’ అని ఆరోపించారు. -
ముస్లిం రిజర్వేషన్లనే రద్దు చేస్తాం
హుజూరాబాద్: ‘స్వదేశీ బీజేపీకి.. విదేశీయుడు స్థాపించిన కాంగ్రెస్ పార్టీకి మధ్య ఎన్నికల పోరు జరుగుతోంది’అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. రిజర్వేషన్ల రద్దు ప్రచారం రాజకీయ లబ్ధికోసమేనన్నారు. వంద రోజు ల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీపై ప్రజలు ఆగ్రహంతో ఉండటంతో వారి దృష్టిని మళ్లించేందుకు ఆడుతున్న రాజకీయ డ్రామా అని విమర్శించారు. ఆదివారం ఆయన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో ‘ఇంటింటికీ బీజేపీ’పేరుతో ఎన్నికల ప్రచా రం నిర్వహించారు.అనంతరం విలేకరులతో మాట్లాడు తూ, రాజ్యాంగాన్ని తూ.చ. తప్పకుండా అమలు చేసే పార్టీ బీజేపీ అని, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మత రిజర్వేషన్లకు రా జ్యాంగం వ్యతిరేకమైనప్పటికీ..సుప్రీంకోర్టు తీర్పులను సైతం ధిక్కరించి ముస్లింలకు రిజర్వేష న్లు అమలు చేస్తున్న పార్టీ కాంగ్రెస్ అని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం ప్రకారం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి.. వాటిని ఎస్సీ, ఎస్టీ, బీసీలతోపాటు అగ్రవర్ణాల్లోని పేదలకు పంచుతామన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తామని కేసీఆర్ ప్రకటిస్తే కనీసం నోరు మెద³ని కాంగ్రెస్ నేతలు అంబేడ్కర్ను అడుగడుగునా అవమానించారన్నారు. అంబేడ్కర్ను ఓడించడంతోపాటు ఆయ న చనిపోతే పారి్థవదేహాన్ని ఢిల్లీలో ఉంచకుండా, ముంబైకి పంపించిన నీచమైన పార్టీ కాంగ్రెస్సేనని మండిపడ్డారు. బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ఏనాడూ జనం గురించి పట్టించు కోలేదన్నారు. కరీంనగర్కు కేంద్రం ఇచ్చిన నిధులను కేసీఆర్ దారి మళ్లిస్తే ఆయన నోరు విప్పలేదని, ఇక్కడి ప్రజలు బాధల్లో ఉంటే ఏనాడూ పట్టించుకోలేదని, కేసీఆర్ కు దోచి పెట్టడం, తన కుటుంబానికి దాచి పెట్టడం తప్ప సాధించిందేమీ లేదని ధ్వజమెత్తారు. కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎవరో ప్రజలకు ఆ పార్టీ నేతలకు కూడా తెలియద ని ఎద్దేవా చేశారు. తమ పార్టీ అగ్రనేత అమిత్ షా ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి, పేదలకు అందజేస్తామని ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ముస్లిం అనే పదాన్ని తొలగించి రిజర్వేషన్లనే రద్దు చేస్తామన్నట్లుగా దు్రష్పచారం చేయడం సిగ్గు చేటన్నారు. తాము రిజర్వేషన్లు ఎక్కడ ఎత్తివేశామో చెప్పాలని ప్రశ్నించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అసమానతలు తొలగేదాకా రిజర్వేషన్లు
బడంగ్పేట్: సమాజంలో అసమానతలు ఉన్నంతకాలం రిజర్వేషన్లు యథావిధిగా ఉంటాయని ఆర్ఎస్ఎస్ చీఫ్ డాక్టర్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. మొదటి నుంచీ రిజర్వేషన్లకు సంఘ్ అనుకూలంగా ఉందని వెల్లడించారు. తమ సంస్థ రిజర్వేషన్లకు వ్యతిరేకమంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని... అందులో ఏమాత్రం వాస్తవం లేదని ప్రకటించారు. తాను ఓ సమావేశంలో ఆ వ్యాఖ్యలు చేసినట్లు వీడియోను ప్రచారం చేస్తున్నారని.. కానీ అసలు అలాంటి సమావేశం ఏదీ జరగలేదని వివరించారు. ప్రస్తుతమున్న సాంకేతికత, కృత్రిమ మేథ (ఏఐ) ద్వారా జరగని దాన్ని కూడా జరిగినట్లు చూపించడం సాధమవుతోందని వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్గుల్లో ఏర్పాటు చేసిన విద్యాభారతి విజ్ఞాన కేంద్ర పాఠశాల (సరస్వతి విద్యాపీఠం అనుబంధ సంస్థ)ను ఆదివారం ఆయన చినజీయర్ స్వామితో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మోహన్ భాగవత్ మాట్లాడారు. ప్రపంచాన్ని తెలుసుకొనే మార్గంగా విద్యను ఆయన అభివరి్ణంచారు. 1952లో సరస్వతీ శిశుమందిర్ చిన్న గదిలో ప్రారంభమైందని.. నేడు దేశవ్యాప్తంగా వేలాది పాఠ శాలలు నడుస్తున్నాయని చెప్పా రు. దేశభక్తి విలువలతో కూడిన విద్యకు తాము పెద్దపీట వేస్తున్నామన్నారు. మనమంతా రాముడి బాటలో నడవాలన్నారు. సోషల్ మీడియాను మంచి కోసం ఉపయోగించాలని సూచించారు. స్వయం సేవక్లు చివరి శ్వాస దాకా సమాజం కోసం పనిచేస్తారని మోహన్ భాగవత్ తెలిపారు. మోదీ కృషి అభినందనీయం: చినజీయర్ దేశం సమస్యల్లో ఉన్నప్పుడు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారని చినజియర్ స్వామి కొనియాడారు. భారత్ను విశ్వగురువుగా మార్చేందుకు ఆయన ఎనలేని కృషి చేస్తున్నారని ప్రశంసించారు. తాను రాజకీయ నాయకుడిని కాదని.. కేవలం భారతీయుడిగా తన వాదన వినిపిస్తున్నానని చెప్పారు. విద్య అనేది పొట్టకూటి కోసం కాదని.. సక్రమమైన పౌరులుగా తయారయ్యేందుకేనని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్, క్షేత్ర ప్రచారక్ సు«దీర్, సహ ప్రచారక్ భరత్, ప్రాంత ప్రచారక్ లింగం శ్రీధర్, విద్యాభారతి క్షేత్ర అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు, సంఘటన కార్యదర్శి లింగం సు«ధాకర్రెడ్డి, శ్రీనివాస్, రమే‹Ùగుప్తా, విష్ణువర్దన్రాజు తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని ఎలా అంటావ్?
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని ఏ ప్రాతిపదికన చెబుతున్నారని సీఎం రేవంత్రెడ్డిని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి నిలదీశారు. దమ్ముంటే దీనిపై తనతో చర్చకు రావాలని సవాల్ చేశారు. తెలంగాణలో అమలవుతున్న బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల రిజర్వేషన్లపైనా చర్చకు సిద్ధమన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయలేక, ఏం చెప్పి ఓట్లు అడగాలో తెలియక.. రేవంత్ అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అబద్ధాలే కాంగ్రెస్ గ్యారంటీగా రేవంత్రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని కిషన్రెడ్డి విమర్శించారు. రేవంత్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని, లేకుంటే లెంపలేసుకుని గద్దె దిగిపోవాలని వ్యాఖ్యానించారు. ఒట్లు, ప్రమాణాలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో ప్రజలకు న్యాయం జరగదని స్పష్టం చేశారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అమలు చేయలేని హామీలు ఇచ్చి, బీసీ రిజర్వేషన్ల పేరుతో సామాజిక ఉద్రిక్తతలను రెచ్చగొడుతోంది. రాష్ట్రంలో ఒకటి రెండు లోక్సభ సీట్లకే కాంగ్రెస్ పరిమితం కాబోతుండటాన్ని తట్టుకోలేక బీజేపీపై విష ప్రచారానికి దిగింది. రిజర్వేషన్ల రద్దుపై కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం ఈ దశాబ్దపు పెద్ద అబద్ధం. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ–బీఆర్ఎస్ ఒకటేనంటూ రాహుల్ గాం«దీ, రేవంత్రెడ్డి దు్రష్పచారం చేశారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రజల ఆదరణ కొరవడటంతో కొత్త నాటకానికి తెరలేపింది. అబద్ధపు పునాదులపై ఎదిగిన కాంగ్రెస్ పార్టీ బీజేపీపై గోబెల్స్ ప్రచారాన్ని మొదలుపెట్టింది. బీసీ రిజర్వేషన్లు తగ్గించి, మతపరమైన రిజర్వేషన్లను అమలు చేస్తూ బీసీలకు విద్య, ఉద్యోగ రాజకీయ రంగాల్లో గండి కొట్టినది కాంగ్రెస్ పార్టీయే. అలాంటి కాంగ్రెస్కు రిజర్వేషన్లపై బీజేపీని విమర్శించే నైతిక హక్కు లేదు. అమిత్ షా ప్రసంగాన్ని మార్ఫింగ్ చేశారు ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా సిద్దిపేట సభలో చేసిన ప్రసంగాన్ని మారి్ఫంగ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఆయన చెప్పినట్టుగా కాంగ్రెస్ ‘ఎక్స్’లో పోస్ట్ చేసిందంటే.. ఆ పార్టీ దిగజారుడుతనడానికి పరాకాష్ట. బీజేపీ స్థైర్యాన్ని దెబ్బతీసి, సామాజిక ఉద్రిక్తతలను రెచ్చగొటే ప్రయత్నం. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీపై పోలీసు కేసు పెట్టాం. ఈసీకి ఫిర్యాదు చేశాం. కాంగ్రెస్ కుట్రలను ప్రజలు గుర్తించారు ప్రధాని మోదీని విమర్శించేందుకు ఎలాంటి అంశాలు దొరకక కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ నాటకాలను ప్రజల ముందు పెడుతున్నాం. ప్రజలు కూడా కాంగ్రెస్ కుట్రలు, కుతంత్రాలను గుర్తించారు. ఎన్నికల సందర్భంగా ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో సానుకూలత కనిపించడం లేదు. భారత్ జోడో అంటూ రాహుల్ గాంధీ యాత్ర చేస్తే.. కాంగ్రెస్ చోడో అంటూ నాయకులు ఆ పార్టీని వీడుతున్నారు. బీసీలకు న్యాయం బీజేపీతోనే.. దేశంలో అత్యున్నత పదవుల నుంచి రాజకీయ రంగం దాకా బీసీలకు న్యాయం చేసింది బీజేపీ మాత్రమే. తొలిసారి బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని ప్రధానిని చేసిన ఘనత బీజేపీదే. స్వాతంత్య్రం అనంతరం తొలిసారిగా కేంద్ర కేబినెట్లో ఏకంగా 27 మంది బీసీలు, 12 మంది దళితులు, 8 మంది ఎస్టీలకు అవకాశం ఇచ్చిన ఘనత బీజేపీదే. మోదీ మూడో సారి ప్రధాని కాబోతున్నారని తట్టుకోలేక కాంగ్రెస్ నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతోంది. ప్రస్తుతం తెలంగాణలో బీసీలకు అన్యాయం జరుగుతోంది. రిజర్వేషన్ల విషయంలో వారికి న్యాయం చేయడం బీజేపీతోనే సాధ్యం..’’అని కిషన్రెడ్డి పేర్కొన్నారు. -
PM Narendra Modi: కాంగ్రెస్ వస్తే దేశమంతటా కర్ణాటక మోడల్
ఆగ్రా/మొరేనా: సార్వత్రిక ఎన్నికల వేళ ప్రతిపక్ష కాంగ్రెస్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శల దాడిని రోజురోజుకూ ఉధృతం చేస్తున్నారు. సంపద పునఃపంపిణీ, ఓబీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ను ఇరుకున పెడుతున్నారు. ప్రజలు కష్టపడి సంపాదించి, దాచుకున్న సొమ్మును దోచేయడానికి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను, హక్కులను దొడ్డిదారిన కాజేసి, ఓటు బ్యాంక్కు కట్టబెట్టడానికి కాంగ్రెస్ పెద్ద కుట్ర పన్నిందని మరోసారి నిప్పులు చెరిగారు. గురువారం ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో, బరేలీ, షాజహాన్పూర్, మధ్యప్రదేశ్లోని మొరేనా నగరంలో ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. మతం ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమని మండిపడ్డారు. ప్రధానమంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే... అడ్డుగోడను నేను.. ‘‘మన తల్లులు, అక్కచెల్లెమ్మల సొత్తుపై కాంగ్రెస్ నాయకులు గురిపెట్టారు. అధికారంలోకి రాగానే తస్కరించాలని కుట్ర పన్నారు. మన ఆడపడుచుల సొమ్మును ఎవరూ దోచుకెళ్లకుండా నేను కాపలాదారుడిగా పనిచేస్తున్నా. మహిళలకు ఎల్లప్పుడూ అండగా ఉంటా. ప్రజలకు, కాంగ్రెస్కు మధ్య ఒక అడ్డుగోడగా నేను నిల్చున్నా. ప్రజల ఆస్తులను కాంగ్రెస్ దోచుకోకుండా కాపాడుతున్నా. జనం ఆస్తులను, సంపదను ఎక్స్–రే తీస్తామని కాంగ్రెస్ రాజకుమారుడు అంటున్నారు. ప్రజలపై వారసత్వ పన్ను విధించాలని మరో కాంగ్రెస్ నాయకుడు చెబుతున్నారు. ఎవరైనా ఆస్తి సంపాదించి మరణిస్తే అందులో 55 శాతం ఆస్తిని స్వా«దీనం చేసుకొని, మిగతా 45 శాతం ఆస్తిని వారసులకు ఇస్తారట! ఇదెక్కడి న్యాయమో అర్థం కావడం లేదు. మతపరమైన రిజర్వేషన్లను మన రాజ్యాంగం అనుమతించదు. అయినా కాంగ్రెస్ పార్టీ మతం ఆధారంగా మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెబుతోంది. తద్వారా రాజ్యాంగాన్ని కించపరుస్తోంది. మతం ఆధారంగా రిజర్వేషన్ల వ్యవస్థ తీసుకొచ్చేందుకు ఇప్పటిదాకా కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలను కోర్టులు తిరస్కరించాయి. అందుకే ఆ పార్టీ దొడ్డిదారిని ఎంచుకుంది. మైనార్టీలను ఓబీసీ కోటాలో చేర్చి రిజర్వేషన్లు ఇచ్చేస్తోంది. కర్ణాటకలో ముస్లింలను ఇప్పటికే చట్టవిరుద్ధంగా ఓబీసీ కేటగిరీలో చేర్చి, విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోనూ కాంగ్రెస్ పదేపదే ఈ విషయం చెబుతోంది. మేనిఫెస్టోలో కూడా చేర్చింది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తొలుత ఆంధ్రప్రదేశ్లోనే ముస్లిం రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. కేంద్రంలో అధికారంలోకి రాగానే కర్ణాటక మోడల్ను దేశమంతటా అమలు చేయాల న్నదే కాంగ్రెస్ కుయుక్తి. నేను కూడా ఒక ఓబీసీనే. కర్ణాటక మోడల్ నాకు ఆందోళన కలిగిస్తోంది. ఇక సామాన్య ప్రజల సంగతి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను, హక్కులను ఎవరూ తస్కరించకుండా రక్షణ కల్పించడానికి ఎన్నికల్లో 400 సీట్లు ఇవ్వాలని మేము అడుగుతున్నాం. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే.. దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల కుటుంబాల్లో రెండు ఉద్యోగాలు ఉంటే అందులో ఒకటి బలవంతంగా లాగేసుకుంటారు. ముస్లింలకు కట్టబెడతారు. ఇలాంటి బుజ్జగింపు రాజకీయాలు మన దేశాన్ని ముక్కలు చేస్తాయని అందరూ తెలుసుకోవాలి. సంతుïÙ్టకరణ(ప్రజలను పూర్తిస్థాయిలో సంతృప్తిపర్చడం) ద్వారా తుషీ్టకరణ(బుజ్జగింపు)ను అంతం చేయాలన్నదే మా ప్రయత్నం. అసలు లోగుట్టు ఇదే..ఎస్టేట్ డ్యూటీ(పన్ను)ని అప్పట్లో ప్రధాని రాజీవ్ గాంధీ రద్దు చేశారని కాంగ్రెస్ నాయకులు గొప్పగా చెబుతున్నారు. నిజానికి ఇందిరా గాంధీ మరణం తర్వాత ఆమె ఆస్తులను ప్రభుత్వం స్వా«దీనం చేసుకోకుండా కాపాడుకోవడానికి ఎస్టేట్ డ్యూటీని కుమారుడు రాజీవ్ గాంధీ రద్దు చేశారు. అసలు లోగుట్టు ఇదే. ఇందిరా గాంధీ నుంచి బదిలీ అయిన ఆస్తులను ఆమె కుటుంబంలో నాలుగు తరాలు చక్కగా అనుభవించాయి. ఇందిరా గాంధీ మరణం కంటే ముందు ఎస్టేట్ డ్యూటీతో భారీగా లాభపడిన కాంగ్రెస్ ఇప్పుడు అదే విధానం తీసుకురావాలని భావిస్తోంది. బీజేపీ ఉన్నంతకాలం కాంగ్రెస్ ఆటలు సాగవు. జనం ఆస్తులను కాజేసే ప్రయత్నాలను కచి్చతంగా తిప్పికొడతాం. -
మేమే కాదు.. ఎవ్వరినీ ముట్టుకోనివ్వం.. రిజర్వేషన్లపై అమిత్ షా
న్యూఢిల్లీ రిజర్వేషన్లపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. కుల ఆధారిత రిజర్వేషన్ల విధానాన్ని బీజేపీ ఎప్పటికీ మార్చదని అన్నారు. అంతేగాక ఎవరిని కూడా మార్చేందుకు అవకాశం ఇవ్వమని చెప్పారు. ఈ మేరకు జాతీయ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. భారీ మెజారిటీతో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చే యోచనలో ఉందంటూ ఆరోపిస్తున్న ప్రతిపక్షాల వ్యాఖ్యలపై అమిత్ షా స్పందించారు. 2014, 2019లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఉందని, ఆయినా తాము రాజ్యాంగాన్ని మార్చే యోచన చేయలేదని చెప్పారు. ‘నేను స్పష్టంగా చెబుతున్నా. మేము(బీజేపీ) ఎప్పటికీ రిజర్వేషన్ను మార్చబోము.. ఎవరినీ చేయనివ్వం. ఇది ప్రజల పట్ల మా నిబద్ధత. దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం మోదీజీ అత్యధికంగా కృషి చేశారు’ అని తెలిపారు. ఈ లోక్సభ ఎన్నికల్లో దక్షిణ భారత్లో బీజేపీ పుంజుకుందని పేర్కొన్నారు. తమిళనాడు, తెలంగాణ, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఇలా అన్ని రాష్ట్రాల్లోనూ పటిష్ట పనితీరు కనబరిచినట్లు తెలిపారు. దక్షిణాదిలో ప్రధాని మోదీ ప్రజాదరణ పెరిగిందని, ఇది ఈ ఎన్నికల ఫలితాల్లో నిరూపితమవుతుందని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ ఓట్ షేర్ను మెరుగుపరుచుకున్నట్లు తెలిపారు. అయితే తాము సీట్లు గెలుచుకునే స్థాయి చేరుకోలేదని అన్నారు. కానీ ఈ సారి తమ అభ్యర్ధులు చాలా చోట్ల గెలిచి తీరుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. నామినేషన్ దాఖలు లోక్ సభ ఎన్నికల కోసం కేంద్ర హోంమంత్రి అమిత్షా నామినేషన్ దాఖలు చేశారు. గుజరాత్లోని గాంధీనగర్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయన మరోసారి ఎంపీగా నామినేషన్ దాఖలు చేశారు. అమిత్ షా తరపున గుజరాత్ సీఎం పటేల్ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ సమర్పించారు. కాగా లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ నేడు ప్రారంభమైంది. ఈ దశలో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 102 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, బిహార్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్మూ కశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో పోలింగ్ జరుగుతోంది. -
రిజర్వేషన్లపై అమిత్ షా కీలక ప్రకటన
రాయ్పూర్: రిజర్వేషన్లపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. తాము మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై ఏం చేయబోతున్నామనేదానిపై క్లారిటీ ఇచ్చారు. రిజర్వేన్లను భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఎప్పటికీ రద్దు చేయదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ను కూడా ఆ పనిచేయనీయబోమని చెప్పారు. ఆదివారం(ఏప్రిల్14) ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా మాట్లాడారు.‘బీజేపీ రాజకీయాలు చేసినంత కాలం రిజర్వేషన్లకు ఏమీ కానివ్వదు. గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ను దృష్టిలో ఉంచుకుని ఆ కోపంతో కమలం గుర్తుపై ఓటు వేయండి’ అని ఛత్తీస్గఢ్ ప్రజలకు అమిత్ షా పిలుపునిచ్చారు. ఇదీ చదవండి.. శివసేన,ఎన్సీపీల చీలికకు కారణమదే -
బాబూ.. కాపులను మరోసారి మోసం చేయొద్దు
సాక్షి, అమరావతి: ఓటుబ్యాంకు రాజకీయాల కోసం కాపులను మరోసారి మోసం చేయవద్దని చంద్రబాబుకు కాపు ఐక్యవేదిక హితవు పలికింది. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు పవన్తో కలిసి వస్తున్న చంద్రబాబు కాపు రిజర్వేషన్లపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు చంద్రబాబుకు సోమవారం బహిరంగ లేఖ రాసింది. ఈ లేఖను మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఇంటింటికి కరపత్రాల రూపంలో పంపిణీ చేయనున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాలను కాపు ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోటిపల్లి అయ్యప్ప, కన్వీనర్ పెద్దిరెడ్డి మహేష్, కో–కన్వీనర్లు పంచాది రంగారావు, ఎన్.వి.రామారావు మీడియాకు విడుదల చేశారు. మూడు దశాబ్దాలుగా అమలుకు నోచుకోని కాపు రిజర్వేషన్లపై చంద్రబాబు నాన్చుడు ధోరణి అవలంభిస్తున్నారని పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని చెప్పిన చంద్రబాబు మోసం చేశారని గుర్తుచేశారు. కేంద్రం ఇచ్చిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో కాపులకు ఐదుశాతం అంటూ ఆచరణ సాధ్యం కాని మాటలు చెప్పారని పేర్కొన్నారు. -
Fact Check: ‘కాపు’ కాసిందే జగన్..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కాపుల మదిలో విష బీజాలు నాటి చంద్రబాబుకు మేలు చేయాలనే కుతంత్రంతో రామోజీరావు అడ్డగోలుగా మరో తప్పుడు కథనాన్ని వండి వార్చారు. ‘కాపులకు జగన్ దగా’ అంటూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఈనాడులో విషం కక్కారు. అసలు కాపులను ఓటు బ్యాంకుగా వాడుకొని వారి ఓట్లతో గద్దెనెక్కి వారిని వంచించి వదిలేసిందే చంద్రబాబు. ఇది జగమెరిగిన సత్యం. రిజర్వేషన్లు, ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు వంటి ఎన్నో హామీలిచ్చి 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. వాటిని అమలు చేయకుండా కాపులను దారుణంగా దగా చేశారు. ఒక్క కాపులే కాదు.. చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలనూ మోసం చేశారు. మోసాలకు కేరాఫ్ చంద్రబాబు అన్న ముద్ర వేసుకున్నారు. సీఎం వైఎస్ జగన్ మాత్రం మాయ మాటలతో తాను మభ్య పెట్టలేనని, చేసేదే చెబుతానని నిఖార్సైన నాయకుడిగా నిలబడ్డారు. ఇచ్చి న మాటను నిలబెట్టుకుంటూ నవరత్న పథకాలతో కాపులను అన్ని విధాలుగా ఆదుకోవడంతోపాటు ప్రత్యేకంగా కాపు కార్పొరేషన్ పెట్టి వారికి నిజమైన మేలు చేశారు. కాపు నేస్తం, చేయూత, ఆసరా, అమ్మ ఒడి, విద్యా దీవెన, విద్యా కానుక వంటి అనేక సంక్షేమ పథకాల ద్వారా కాపుల్లోని పేద వర్గాలకు ఆర్థిక తోడ్పాటునందించి, వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేశారు. సీఎం జగన్ 58 నెలల పాలనలో కాపులకు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ.39,317.80 కోట్లు ఆర్థిక సాయమందించి సీఎం జగన్ రికార్డు సృష్టించారు. రాజకీయాల్లో విలువలు కలిగిన నాయకుడిగా సీఎం వైఎస్ జగన్ కాపుల ఉన్నతిలో తనదైన ముద్ర వేసుకున్నారు. విశ్వసనీయత, నిబద్ధత, నిజాయతీకి సీఎం వైఎస్ జగన్ మారుపేరు. ఈ విషయాలన్నీ తెలిసీ రామోజీ అసత్య కథనంతో వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేశారు. రామోజీ ఇలాంటి కథనాలు ఎన్ని అచ్చేసినా చంద్రబాబుకున్న మోసాలకు కేరాఫ్ ముద్రా పోదు.. సీఎం వైఎస్ జగన్కు ఉన్న విశ్వసనీయతకు మారు పేరన్న గౌరవమూ తగ్గదు. రామోజీ అచ్చేసిన కథనంలో వాస్తవాలేమిటో పరిశీలిస్తే.. ఆరోపణ: కార్పొరేషన్ను నిర్లక్ష్యం చేసిన వైకాపా సర్కారు? వాస్తవం: కాపు కార్పొరేషన్ను గత చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసింది. ఇది తెలిసినా ఎన్నికలు సమీపిస్తుండటంతో బాబుకు రాజకీయ మేలు కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై రామోజీ బురద రాతలకు దిగజారారు. కాపులకు ప్రత్యేకంగా నిధులు కేటాయింపులు జరుపుతానని మాట ఇచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు కాపు కార్పొరేషన్ ద్వారా 2014 నుండి 2017 వరుకు ఒక్క రూపాయీ విదల్చలేదు. 2017 నుండి 2019 వరకు రూ.1,874.67 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. విడుదల చేసింది రూ.1,334 కోట్లే. అంతే ప్రకటించిన మొత్తంలో రూ.540 కోట్లు బకాయి పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం కాపు కార్పొరేషన్కు పెట్టిన బకాయిలను సైతం వైఎస్ జగన్ ప్రభుత్వం విడుదల చేయడం గమనార్హం. వైఎస్ జగన్ ప్రభుత్వం కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన పేద కుటుంబాల అభ్యున్నతికి కాపు కార్పొరేషన్ ద్వారా చేయూతనిచ్చి ంది. కాపు కార్పొరేషన్ ద్వారా రూ.15,044.64 కోట్లతో వైఎస్సార్ కాపు నేస్తం, జగనన్న విదేశీ విద్యా దీవెన, జగనన్న అమ్మ ఒడి, వాహన మిత్ర, జగనన్న చేదోడు, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్సార్ పెన్షన్ కానుక, వైఎస్సార్ అసరా, వైఎస్సార్ నేతన్న నేస్తం, జగనన్న తోడు వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసింది. ఆరోపణ: గత ప్రభుత్వ హయాంలో రూ1,441 కోట్ల మేర రాయితీ రుణాలు వాస్తవం: గత ప్రభుత్వ హయాంలో రూ.1,441.75 కోట్లు మేరకు రాయితీ రుణాలు ఇచ్చి నట్టు చంద్రబాబు గురించి గొప్పలు చెప్పిన ఈనాడు.. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అంతకు మించి నిధులు కేటాయించినప్పటికీ మసిపూసి మారేడు కాయ చేసేలా అబద్ధాలు రాసేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 (ఈ ఏడాది మార్చి) వరకు 19,81,458 మంది లబ్దిదారులకు రూ.3,260.87 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం చేకూర్చింది. వైఎస్సార్ ఆసరా, జగనన్న తోడు, జగనన్న చేదోడు, వైఎస్సార్ సున్నా వడ్డీ వంటి వాటికి నిధులు విడుదల చేసింది. వాహన మిత్ర పథకంలో 58 నెలల కాలంలో 25,046 మందికి ఏడాదికి రూ.10 వేలు చొప్పున రూ.132.57 కోట్లు ఆర్థిక సాయం అందించింది. ఆరోపణ: నైపుణ్య శిక్షణ నిలిపేశారు వాస్తవం: నైపుణ్య శిక్షణ పేరుతో గత ప్రభుత్వం 2015 నుంచి 2019 వరకు శిక్షణ సంస్థలకు బకాయిలు పెట్టిన రూ.8.83 కోట్లు వైఎస్ జగన్ ప్రభుత్వమే చెల్లించింది. గత ప్రభుత్వం విద్యోన్నతి అంటూ గొప్పలు చెప్పిన పథకంలో గత ప్రభుత్వం 2015 నుంచి 2019 వరకు శిక్షణ ఇచ్చి న సంస్థలకు బకాయి పెట్టిన రూ.6.15 కోట్లు కూడా వైఎస్ జగన్ ప్రభుత్వమే చెల్లించింది. వైఎస్ జగన్ ప్రభుత్వం 2023–2024 ఏడాదికి జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం ద్వారా అర్హత కలిగిన కాపు విద్యార్ధులకు లక్ష రూపాయలు చొప్పున 23 మందికి రూ.23 లక్షలు అందించింది. ఆరోపణ: కాపు భవన నిర్మాణాలపైనా జగన్ కన్నుకుట్టింది వాస్తవం: గత ప్రభుత్వం గొప్పలు చెప్పి మంజూరు చేసిన భవనాల్లో ఒక్క దానికీ నిర్మాణం పూర్తిచేసి ప్రారంభించలేదు. అదీ చంద్రబాబు సర్కారు ఘనత. వైఎస్ జగన్ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు 5 కాపు భవనాలకు రూ.వంద కోట్లు నిధులు విడుదల చేయడమే కాకుండా నెల్లూరు మున్సిపాలిటీలో, బాపట్ల జిల్లా ఏల్చూరు, అడవిపాలెం, చందలూరులో నాలుగు కాపు భవనాల నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించింది. ఇదీ సీఎం వైఎస్ జగన్ నిబద్ధత. ఆరోపణ: విదేశీ విద్య దక్కకుండా కుతంత్రాలు వాస్తవం: గత ప్రభుత్వం చేపట్టిన విదేశీ విద్యా పథకంలో అక్రమాలు, అవినీతి జరిగినట్టు విజిలెన్స్ విచారణలో వెలుగు చూసింది. దీంతో ఈ పథకాన్ని మరింత మెరుగులు దిద్ది పేద వర్గాలకు మేలు చేసేలా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో 2015–16 నుండి 2018–19 వరకు 307 మంది విద్యార్థులకు చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.20.97 కోట్ల మేర బకాయిలను కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం చెల్లించింది. 2022 నుంచి 2024 (మార్చి) వరకు విదేశీ విద్యా దీవెనకు సంబంధించి 60 మంది విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ రూ.15.62 కోట్లు అందించి విదేశాలకు వెళ్లి చదువుకునే అవకాశం కల్పించింది. వసతి దీవెన, విద్యా దీవెన, అమ్మఒడి పథకాల్లో 2019 నుంచి 2024 వరకు 8,41,677 మంది కాపు విద్యార్ధుల కోసం వారి తల్లులకు రూ.3,950.79 కోట్లు అందించింది. -
బిహార్లో 65 శాతానికి రిజర్వేషన్లు
పాట్నా: బిహార్లో ప్రభుత్వ విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో కుల రిజర్వేషన్లను 50 నుంచి 65 శాతానికి పెంచేందుకు ఉద్దేశించిన బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. దీంతో, రాష్ట్రంలో అన్ని రిజర్వేషన్లు కలిపి 75శాతానికి చేరినట్లయింది. గురువారం అసెంబ్లీలో బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. ఆర్థికంగా బలహీన వర్గాలకు కేటాయించిన 10శాతం రిజర్వేషన్తో కలిపి ఇప్పుడు రిజర్వేషన్లు మొత్తమ్మీద 75 శాతానికి చేరుకున్నాయి’అని అన్నారు . అంతకుముందు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, అత్యంత వెనుకబడిన కులాలు(ఈబీసీలు), ఇతర వెనుకబడిన కులాల(ఓబీసీల)కు ప్రస్తుతమున్న 50% రిజర్వేషన్లను 65%కి పెంచుతూ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. సమగ్ర కులగణన ఆధారంగా విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులకు సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. -
Bihar Caste Reservation: రిజర్వేషన్లపై బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
పాట్నా: రిజర్వేషన్ల విషయంలో సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని బిహార్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రిజర్వేషన్లు 65శాతానికి పెంచాలని ప్రాతిపాదించింది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈబీసీ వర్గాల వారి రిజర్వేషన్లు 55 శాతం ఉండగా తాజాగా వాటిని 65 శాతానికి పెంచాలని నిర్ణయించింది. ఇది ఆర్థికంగా బలహీన వర్గాలకు(ఈడబ్ల్యూఎస్) కేంద్రం నిర్దేశించిన 10శాతం రిజర్వేషన్లకు మినహయింపు. బిహార్ ప్రభుత్వం, కేంద్రం కల్పిస్తున్న రిజర్వేషన్లు కలిపి రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్లు 75శాతానికి చేరుకోనుంది. దీనిపై నిపుణులతో సంప్రదింపుల తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఈ మార్పులు అమలు చేయాలనేది తమ ఉద్ధేశ్యమని తెలిపారు. అయితే ఓబీసీ మహిళలకు కేటాయించిన మూడు శాతం కోటాను రద్దు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. తాజా ప్రతిపాదనల ప్రకారం.. షెడ్యూల్డ్ కులాల వారికి 20శాతం రిజర్వేషన్ లభిస్తుంది. ఓబీసీ, ఈబీసీలకు 43 శాతం ఉన్న రిజర్వేషన్ దక్కనుంది. ప్రస్తుతం ఓబీసీ, ఈబీసీలకు కలిపి 30 శాతం రిజర్వేషన్ ఉండగా.. తాజాగా మరో 13 శాతం పెరగనుంది. షెడ్యూల్డ్ తెగలు(ఎస్టీ) వారికి రెండు శాతం రిజర్వేషన్లను ప్రతిపాదించారు. దీంతో రాష్ట్రంలో రిజర్వేషన్లు 65 శాతానికి చేరుకుంటాయి. ప్రస్తుత ఈబీసీలకు 18 శాతం, ఓబీసీలకు 12 శాతం, ఎస్సీలకు 16 శాతం, ఎస్టీలకు ఒకశాతం రిజర్వేషన్లు ఉన్నాయి. చదవండి: బీహార్ కులగణన: 34 శాతం మంది పేదలే.. నెలకు రూ. 6 వేల కంటే తక్కువ ఆదాయం కాగా కులగణనకు సంబంధించిన నివేదికను బిహార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కొన్ని గంటల్లోనే నితీష్ కుమార్ ప్రభుత్వం ఈ రిజర్వేషన్ల పెంపు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక ఓబీసీ వర్గం వారిలో యాదవులు అత్యధిక సంఖ్యలలో ఉన్నారు. రాష్ట్ర జనాభాలో వారు 14. 27 శాతం ఉన్నారు. కులగణన ప్రకారం.. బిహార్ 13 కోట్ల జనాభాలో 36 శాతం మంది ఈబీసీలు, 27.1 శాతం మంది వెనకబడిన తరగతులు, 19.7 శాతం మంది ఎస్సీలు, 1.7 శాతం ఎస్టీ జనాభా, జనరల్ కేటగిరీలో 15.5 శాతం ఉన్నారు. దీని ప్రకారం రాష్ట్రంలో 60 శాతానికి పైగా ప్రజలు వెనకబడిన, అత్యంత వెనకబడిన తరగతులకు చెందిన వారే ఉన్నారు. -
బిల్లుకు అయిష్టంగానే విపక్షాల ఆమోదం
భోపాల్/జైపూర్: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కలి్పంచేందుకు ఉద్దేశించిన మహిళా బిల్లుకు పార్లమెంట్లో ప్రతిపక్షాలు మరో గత్యంతరం లేక తప్పనిసరి పరిస్థితుల్లో అయిష్టంగానే మద్దతు ఇచ్చాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నారీశక్తిని అర్థం చేసుకొని, సంకోచిస్తూనే బిల్లుకు ఆమోదం తెలిపాయని అన్నారు. తమ పట్టుదల వల్లే బిల్లు పార్లమెంట్లో నెగ్గిందని వివరించారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్నప్పుడు ఈ బిల్లు పరిస్థితి ఏమిటో మనకు తెలిసిందేనని అన్నారు. ఒకవేళ కాంగ్రెస్, దాని మిత్రపక్షాల అహంకార కూట మికి అధికారం అప్పగిస్తే ఈ బిల్లు విషయంలో వెనక్కి మళ్లుతాయంటూ ప్రజలను అప్రమత్తం చేశారు. బిల్లు పరిస్థితి వెనక్కి వెళ్లిపోతుందని పరోక్షంగా స్పష్టం చేశారు. జనసంఘ్ సహ వ్యవస్థాపకుడు దీన్దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా మధ్యప్రదేశ్లో సోమవారం నిర్వహించిన ‘కార్యకర్త మహాకుంభ్’లో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఆ పార్టీని తుప్పు పట్టిన ఇనుముతో పోల్చారు. బుజ్జగింపు రాజకీయాలు కాంగ్రెస్కు అలవాటేనని ఆక్షేపించారు. కాంగ్రెస్ను రాజకీయ నాయకులు నడిపించడం లేదని, పార్టీని అర్బన్ నక్సలైట్లకు ఔట్సోర్సింగ్కు ఇచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ విధానాలను, నినాదాలను ఈ లీజుదారులే నిర్ణయిస్తున్నారని మోదీ ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గనుక గెలిపిస్తే రాష్ట్రాన్ని అధోగతి పాలుచేస్తారని విమర్శించారు. కాంగ్రెస్ దివాలా తీసింది కాంగ్రెస్ దేశంలో ప్రతికూలతను వ్యాప్తి చేస్తోందని, దేశం సాధించిన ఘనతలను ఆ పార్టీ ఇష్టపడడం లేదని ప్రధానమంత్రి మోదీ ధ్వజమెత్తారు. దేశాన్ని 20వ శతాబ్దంలోకి తీసుకెళ్లాలని కోరుకుంటోందని అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని ఆరోపించారు. డిజిటల్ పేమెంట్ వ్యవస్థను కాంగ్రెస్ వ్యతిరేకించిందని, కానీ, ప్రపంచ దేశాలు ఈ వ్యవస్థను ప్రశంసించాయని గుర్తుచేశారు. కాంగ్రెస్ మనోబలం కోల్పోయిందని, దివాలా తీసిందని చెప్పారు. అందుకే అర్బన్ నక్సలైట్లకు పార్టీని లీజుకు ఇచ్చారని తెలిపారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్కు ప్రజాబలం లేదన్నారు. మహిళలను విభజించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందుకే వారంతా అప్రమత్తంగా ఉండాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పేదలు ఎప్పటికీ పేదలుగా ఉండాలన్నదే కాంగ్రెస్ విధానమని మండిపడ్డారు. మధ్యప్రదేశ్ అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి సాధిస్తుందన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే బీజేపీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాజస్తాన్లో కాంగ్రెస్ను గద్దె దించాలి రాజస్తాన్లో సీఎం అశోక్ గహ్లోత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం యువత జీవితాల్లో ఐదేళ్ల విలువైన సమయాన్ని వృథా చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలి్పంచలేదని అన్నారు. రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన సోమవారం రాజస్తాన్ రాజధాని జైపూర్లో బీజేపీ ఆధ్వర్యంలో ‘పరివర్తన్ సంకల్ప్ మహాసభ’లో మాట్లాడారు. పరిపాలన పరంగా కాంగ్రెస్ సర్కారుకు సున్నా మార్కులే వస్తాయన్నారు. కాంగ్రెస్ పాలనలో మాఫియాలు చెలరేగిపోతున్నాయని ప్రధాని మోదీ విమర్శించారు. మహిళల నుంచి వస్తున్న ఒత్తిళ్లను తట్టుకోలేక కాంగ్రెస్ పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇచి్చందని చెప్పారు. -
అక్క చెల్లెమ్మలకు అగ్రతాంబూలం
సాక్షి, అమరావతి: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ దశాబ్దాలుగా ఉంది. దాదాపు 27 ఏళ్ల క్రితం పార్లమెంట్ గడప తొక్కిన బిల్లుకు ఎట్టకేలకు ప్రధాని మోదీ నాయకత్వంలో ఆమోదం లభించింది. అయితే ఎటువంటి ఉద్యమాలు, డిమాండ్లు లేకుండానే, ఎవరూ కోరకుండానే మహిళలకు ఏకంగా 50 శాతం రిజర్వేషన్లను అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలిచింది. మహిళలకు అందరికంటే ముందుగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మద్దతుగా నిలిచారు. సీఎం జగన్ దార్శనికతతో వేసిన అడుగులు అక్క చెల్లెమ్మలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో అగ్రతాంబూలం దక్కేలా చేశాయి. ఆచరణలో అంతకుమించి... అధికారం చేపట్టిన వెంటనే నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనుల్లో మహిళలకు ఏకంగా 50 శాతం రిజర్వేషన్ అమలు చేసేలా సీఎం జగన్ చట్టం చేశారు. ఇక ఆచరణలో నామినేటెడ్ పదవుల్లో 51 శాతానికిపైగా పదవులు ఇచి్చన తొలి ప్రభుత్వం వైఎస్సార్సీపీనే. గ్రామాల్లో వార్డు మెంబర్, పట్టణాల్లో కౌన్సిలర్, కార్పొరేటర్ దగ్గరి నుంచి మంత్రి పదవుల దాకా మహిళలకు అగ్రపీఠం దక్కడం దేశంలోనే రికార్డు. తొలిసారిగా శాసన మండలి వైస్ ఛైర్మన్గా జకియా ఖానంను నియమించారు. రాష్ట్ర తొలి మహిళా చీఫ్ సెక్రటరీగా, ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నీలం సాహ్నికి అవకాశం కల్పించారు. విభజన అనంతరం మహిళా కమిషన్ను నియమించి మహిళల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధిని చాటారు. మహిళకు తొలిసారిగా హోంమంత్రి పదవి ఇచ్చి నాడు వైఎస్సార్ రికార్డు సృష్టిస్తే.. తండ్రి కంటే రెండు అడుగులు ముందుకు వేస్తానని చెప్పిన మాటను సీఎం జగన్ నిరూపించుకున్నారు. తొలి మంత్రివర్గంలో హోంమంత్రిగా దళిత వర్గానికి చెందిన మేకతోటి సుచరితను, ఉప ముఖ్యమంత్రిగా గిరిజన మహిళ పాముల పుష్ప శ్రీవాణిని నియమించారు. మలి విడత విస్తరణలో హోంమంత్రిగా దళిత వర్గానికి చెందిన తానేటి వనితతోపాటు మరో ముగ్గురు మహిళలకు కీలక మంత్రి పదవులను అప్పగించారు. రాష్ట్రంలో 13 జెడ్పీ ఛైర్మన్ పదవుల్లో ఏడుగురు మహిళలే ఉన్నారు. 26 జెడ్పీ వైస్చైర్మన్ పదవుల్లో 15 మంది మహిళలున్నారు. 12 మేయర్ పోస్టులు, 24 డిప్యూటీ మేయర్ పదవులు కలిపి మొత్తంగా 36 పదవుల్లో 18 మంది మహిళలే ఎన్నికయ్యేలా చర్యలు తీసుకున్నారు. దాదాపు 2.60 లక్షల వలంటీర్ ఉద్యోగాల్లో 53 శాతం, 1.30 లక్షల సచివాలయాల ఉద్యోగాల్లో 51 శాతం మహిళలకే దక్కడం విశేషం. మహిళలే కేంద్ర బిందువుగా సంక్షేమం అమ్మ కడుపులోని బిడ్డ నుంచి ఆప్యాయంగా ఆశీర్వదించే అవ్వ దాకా ప్రతి ఒక్కరి అవసరాలను గుర్తిస్తూ సీఎం జగన్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. మహిళలే కేంద్ర బిందువుగా వీటిని రూపొందించారు. నవరత్నాల పథకాల్లో 90 శాతానికి పైగా మహిళలే లబ్ధిదారులున్నారు. ప్రతి ఇంట్లో మహిళకు ప్రాధాన్యం, గౌరవం పెరగడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, సంక్షేమ పథకాలే కారణంగా నిలుస్తున్నాయి. మహిళల రక్షణ కోసం దిశ బిల్లు, దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు లాంటి పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ఆడబిడ్డల సంక్షేమంతోపాటు మహిళా సాధికారత కోసం సీఎం జగన్ చేపట్టిన కార్యక్రమాలు దేశానికే దిక్సూచిగా నిలవడం మన రాష్ట్రానికి గర్వ కారణం. దశాబ్దాల ప్రస్థానం.. దివంగత ప్రధాని రాజీవ్గాంధీ హయాంలో 1989లో స్థానిక సంస్థల్లో మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్ల అమలుకు రాజ్యాంగ సవరణ ప్రతిపాదించారు. అనంతరం పీవీ నరసింహారావు హయాంలో 1992–93లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు చట్టం రూపం వచ్చింది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల బిల్లును హెచ్డీ దేవెగౌడ నేతృత్వంలో 1996లో లోక్సభలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత వాజ్పేయి, మన్మోహన్సింగ్ ప్రభుత్వాల హయాంలోనూ ప్రవేశపెట్టినప్పటికీ ఆమోదానికి నోచుకోలేదు. 2010లో రాజ్యసభ ఆమోదం పొందినా లోక్సభలో పెండింగ్లోనే ఉండిపోయింది. -
బీసీల హక్కుల కోసం ఎందాకైనా..
సాక్షి, హైదరాబాద్: చట్ట సభల్లో బీసీలు, బీసీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు బీసీ కుల గణన చేపట్టాలనే డిమాండ్తో ఈ నెల 26న బీసీ సంఘాలు నిర్వహించే సమా వేశానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంపూర్ణ మద్దతు ప్రకటించారు. చట్ట సభల్లో బీసీల వాటా, హక్కుల కోసం జరిగే ఉద్యమానికి తమ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య శనివారం హైదరాబాద్లో కవితతో భేటీ అయ్యారు. బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు, ఎంపీలు మాలోత్ కవిత, బోర్లకుంట వెంకటేశ్ నేత, ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్లు గెల్లు శ్రీనివాస్ యాదవ్, పల్లె రవికుమార్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఈ భేటీలో పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి శాసనసభ సమావేశాల్లోనే 2014 జూన్లో చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే బిల్లుపై తమ పార్టీ తీర్మానం చేసిందని కవిత గుర్తు చేశారు. నామినేటెడ్ పదవులు, మార్కెట్ కమిటీలు, పార్టీ పదవుల్లో బీసీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అవకాశాలు కల్పించిందన్నారు. తెలంగాణ నుంచే బీసీ ఉద్యమం: కృష్ణయ్య కవితతో భేటీ అనంతరం బంజారాహిల్స్లోని ఆమె నివాసం వద్ద ఎంపీ కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు. తెలంగాణ నుంచే బీసీ ఉద్యమానికి శంఖారావం పూరిస్తామని ప్రకటించారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించటం, కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు, బీసీ కులగణన అనే మూడు డిమాండ్లతో తమ జాతీయ ఉద్యమం కొనసాగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన మహిళా బిల్లును సవరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈనెల 26న జలవిహార్లో సదస్సు నిర్వహించిన తరువాత బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. -
Womens Reservation Bill 2023: ఓబీసీలను అధికారానికి దూరం చేశారు
న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ల బిల్లును తక్షణం అమల్లోకి తేవాలని కాంగ్రెస్ సీనియర్ ఎంపీ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. యూపీయే హయాంలో తాము ప్రతిపాదించిన బిల్లులో ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లను వర్తింపజేస్తామని పేర్కొనపోవడం పట్ల తనకిప్పటికీ ఎంతగానో ఆవేదనగా ఉందని చెప్పారు. ఇప్పుడు వారికి రిజర్వేషన్ కోసం పట్టుబడతామని ఒక ప్రశ్నకు బదులుగా స్పష్టం చేశారు. మోదీ సర్కారు ఫక్తు రాజకీయ కారణాలతోనే మహిళా బిల్లు తెచి్చందని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీలకు ప్రత్యేక కోటా పెట్టకపోవడం ద్వారా వారిని అధికారానికి దూరం చేసిందని రాహుల్ కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కేంద్రం తక్షణం కుల గణన చేపట్టి, ఆ వివరాలను అందరికీ తెలిసేలా బహిరంగపరచాలని రాహుల్ డిమాండ్ చేశారు. ఇతర సామాజిక వర్గాల మహిళలకు కూడా వారి జనాభా నిష్పత్తి ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దృష్టి మళ్లించే నాటకమే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను అధికార బీజేపీ ప్రతిపాదించినప్పుడు తాము ఆహ్వానించామని రాహుల్ అన్నారు. ‘ఆ సందర్భంగా ఎంపీలమంతా అట్టహాసంగా పార్లమెంటు పాత భవనంలో నుంచి కొత్త భవనంలోకి మారాం కూడా. మోదీ కూడా అత్యంత నాటకీయ ఫక్కీలో రాజ్యాంగ ప్రతిని చేబూనారు. ’అతి ముఖ్యమైన బిల్లును ఆమోదించబోతున్నాం, అంతా సహకరించండి’ అని అన్నారు. ఆయన ప్రతిపాదించిన మహిళా బిల్లు నిస్సందేహంగా వారి సాధికారత దిశగా కీలక అడుగు. కానీ జన గణన, డీ లిమిటేషన్ రూపంలో రెండు మెలికలు పెట్టారు. వాటివల్ల అది మరో పదేళ్లకు గానీ అమల్లోకి రాదు. ఇది ఫక్తు సమస్యల నుంచి దృష్టి మళ్లించే కుట్రే‘ అని ఆరోపించారు. అధిక సంఖ్యాకులకు అధికారమేది? కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి హోదాలో కేవలం ముగ్గురు ఓబీసీలు మాత్రమే ఉన్నారని తెలిసి తాను షాకయ్యానని రాహుల్ అన్నారు. ‘ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు కలిపి బడ్జెట్లో చేసిన కేటాయింపులు కేవలం ఆరు శాతం! ప్రధాని మోదీ మాట్లాడితే తాను ఓబీసీ నేతను అంటుంటారు. వారి చేతుల్లో అధికారం లేని ఈ దురవస్థకు కారణం ఏమిటో ఆయనే చెప్పాలి. ఈ చేదు నిజాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు వారు ప్రయతి్నస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు దేశంలో ఓబీసీలు ఎందరు? ఇతర సామాజికవర్గాల వారు ఎందరు? ఇవిప్పుడు కీలక ప్రశ్నలు. అందుకే మేం కుల గణనకు డిమాండ్ చేస్తున్నాం‘ అని చెప్పారు. ‘దేశ ప్రజలకు అధికారాన్ని బదలాయించాలంటే ఈ సామాజిక గణాంకాలు తెలియడం చాలా అవసరం. జన గణన ఇప్పటికే జరిగింది గనుక ఈ లెక్కలన్నీ ఇప్పటికే కేంద్రం వద్ద అన్నాయి. ప్రధాని మోదీ వాటిని ఎందుకు విడుదల చేయడం లేదు?‘ అని రాహుల్ ప్రశ్నించారు. వారికి భాగస్వామ్యం ఉందా? తమ పార్టీలో అత్యధిక సంఖ్యలో ఓబీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారన్న బీజేపీ వాదనను రాహుల్ ఎద్దేవా చేశారు. ‘చట్టాల రూపకల్పనలో, దేశ ద్రవ్య వినిమయంలో వారు ఏ మేరకు పాలుపంచుకుంటున్నారో అడగండి. అసలే లేదని వారే అంగీకరిస్తారు‘ అన్నారు. ప్రజాస్వామ్య దేవాలయంగా చెప్పుకునే లోక్ సభలో బీజేపీ ఎంపీలకు వాస్తవంలో ఎలాంటి అధికారాలూ లేవని రాహుల్ అన్నారు. వారు కేవలం ఉత్సవ విగ్రహాలుగా మాత్రమే ఉన్నారన్నారు. ఒక బీజేపీ ఎంపీయే తనకు ఈ విషయం చెప్పారన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. -
చట్టసభల్లో ఓబీసీలకూ రిజర్వేషన్లు కల్పించాలి
సాక్షి, న్యూఢిల్లీ : చట్టసభల్లో ఓబీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్ డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు ఎలాగైతే రిజర్వేషన్లు కల్పిస్తు న్నారో అదేవిధంగా మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అందులో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కోరారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదే శాల మేరకు మహిళా బిల్లుకు మద్దతిస్తు న్నామ న్నారు. రాజ్యసభలో గురువారం మహిళ బిల్లు పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. బిల్లు కార్యరూపం దాల్చిన ఏడేళ్ల తర్వాత అమలు చేయడం అంటే పంచభక్ష్య పరమాన్నం ముందుపెట్టి ఎప్పుడో తినమన్నట్లు ఉందన్నారు. సామాజిక, విద్య, ఆర్థిక అంశాల్లో వెనుకబాటు తనంతో ఉన్న ఓబీసీలకు రిజర్వే షన్లు ఎందుకు కల్పించరని బోస్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభు త్వం దీనిపై ఆలోచించి త్వరలోనే ఓబీసీ బిల్లు తీసుకురావాలని ఎంపీ బోస్ విజ్ఞప్తి చేశారు. లింగ వివక్ష తగ్గుతుంది : ఆర్. కృష్ణయ్య చర్చలో ఎంపీ ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. మహిళా బిల్లు స్వాగతించదగినదన్నారు. దేశంలో లింగ, కుల వివక్షలు ఉన్నాయని.. మహిళ బిల్లుతో లింగ వివక్ష తగ్గుతుందని.. అయితే, కుల వివక్ష తగ్గించాలంటే బిల్లులో ఓబీసీ సబ్కోటా పెట్టాలని కోరారు. సబ్కోటా కుదరకపోతే బీసీ బిల్లు ప్రవేశపెట్టాలన్నారు. అన్ని రంగాల్లోనూ బీసీల పాత్ర చాలా తక్కువగానే ఉంటోందని కృష్ణయ్య తెలిపారు. రాజ్యాధికారం వస్తేనే వారికి గౌరవం దక్కుతుందన్నారు. -
రిజర్వేషన్లపై ఆరెస్సెస్ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు
నాగ్పూర్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్.. రిజర్వేషన్లపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సమాజంలో వివక్ష ఉన్నంతకాలం రిజర్వేషన్లు కొనసాగాల్సిందేనని అభిప్రాయపడ్డారాయన. బుధవారం నాగ్పూర్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లకు ఆరెస్సెస్ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. వ్యవస్థలో మనం.. తోటి మనుషులను(కొన్ని వర్గాలను) చాలా ఏండ్లు వెనుకే ఉంచుతూ వచ్చాం. దాదాపు 2 వేల ఏళ్లుగా ఇది కొనసాగింది. ఎప్పుడైతే సమానత్వం లాంటివి ప్రత్యేకాంశాలను వాళ్లకు కల్పించామో.. ప్రత్యేకించి రిజర్వేషన్లలాంటివి వాళ్లకు ఎంతో మేలు చేస్తున్నాయి. వెనకబడిన వర్గాలకు పూర్తిస్థాయిలో మనతో సమానావకాశాలు దొరికేవరకు.. రిజర్వేషన్లలాంటి ప్రత్యేక చర్యలు అవసరమే. అందుచేత.. వివక్ష ఉన్నంత వరకు రిజర్వేషన్లు కొనసాగించాల్సిందే. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లకు అన్ని విధాలా ఆరెస్సెస్ మద్దతు ఉంటుంది అని ప్రకటించారాయన. దాదాపు 2 వేల సంవత్సరాలపాటు కొన్ని వర్గాలు సంఘంలో నిర్లక్ష్యానికి గురయ్యాయన్న ఆయన.. వివక్ష ఎదుర్కొని వర్గాలు కనీసం 200 ఏండ్లైనా సరే కొంత ఇబ్బంది ఎదురైనా అంగీకరించాల్సిందేనని తెలిపారు. ఇదిలా ఉంటే.. మహారాష్ట్రలో మరాఠా కమ్యూనిటీ రిజర్వేషన్ల ఉద్యమం మరోసారి ఉపందుకుంటున్న వేళ.. భగవత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇదీ చదవండి: భారత్ మూలాలపై రిషి సునాక్ భావోద్వేగం -
ఎమ్మెల్సీ కవితపై వైఎస్ షర్మిల సెటైర్
సాక్షి, హైదరాబాద్: ‘బీ ది ఛేంజ్ యు వాంట్ టూ సీ’అంటూ 33% మహిళా రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ కవితకు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సలహా ఇచ్చారు. నిజంగా కవితకు మహిళా రిజర్వేషన్లపై గౌరవం ఉంటే..రానున్న ఎన్నికల్లో 33% అమలు చేయించాలని మంగళశారం ఆమె ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సిట్టింగులకు ఇచ్చిన సీట్లలో 33 స్థానాలు మహిళా అభ్యర్థులకు అవకాశం ఇప్పించి కవిత తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. 33 శాతం రిజర్వేషన్లకు చిత్తశుద్ధితో పార్టీలు కలిసి రావాలని చిలక పలుకులు పలుకుతున్న కవితమ్మ.. ఢిల్లీలో దొంగ దీక్షలు కాదు.. రాష్ట్రంలో సీట్లిచ్చే దమ్ముండాలన్నారు. 115 సీట్లలో 7 స్థానాలు ఇస్తే చిత్తశుద్ధి ఉన్నట్టా అని నిలదీశారు. తెలంగాణ జనాభాలో 50 శాతం మహిళలున్నా కేబినెట్లోనూ ప్రాధాన్యత దక్కలేదన్నారు. లిక్కర్, రియల్ ఎస్టేట్ బిజినెస్ల గురించి కాకుండా మీ నాన్నతో మాట్లాడి.. కేబినెట్లో, పెద్దల సభలో, నామినేటెడ్ పదవుల్లో మహిళలకు రిజర్వేషన్ ఇప్పించాలంటూ సెటైర్ వేశారు. లిక్కర్ స్కాం పక్కదారి పట్టించేందుకు ఎత్తుకున్న నినాదమే 33 శాతం రిజర్వేషన్లు తప్ప.. మీకెక్కడిది మహిళల పట్ల చిత్తశుద్ధి అని మండిపడ్డారు. -
మీ నాన్నను ఎందుకు అడగలేదు?
సాక్షి, హైదరాబాద్: చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కావాలని ఢిల్లీలో దొంగ దీక్ష చేసిన కవిత రాష్ట్రంలో మహిళలకు 33 %సీట్లు ఇవ్వలేదని తండ్రిని ఎందుకు అడగట్లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ నిలదీశారు. లిక్కర్ కేసును దారి మళ్లించేందుకే కవిత దీక్ష చేశారని, మహిళా బిల్లును చించేసిన పార్టీలతో కలిసి వెళ్లారని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం మీడియాతో అరుణ మాట్లాడారు. ఆదివాసీ మహిళను రాష్ట్రపతిగా పెడితే బీఆర్ఎస్ ఆమెకు వ్యతిరేకంగా ఓటు వేసిందని చెప్పారు. ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాల శాఖలను మహిళలకిచ్చిన ఘనత మోదీదేనన్నారు. మహిళల మీద నగరం నడబొడ్డున అకృత్యాలు జరిగినా సీఎం కార్యాలయంలో పనిచేసే ఏ అధికారి మాట్లాడటం లేదని, కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న అధికారులందరికీ రాజకీయ పిచ్చి పట్టుకుందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల మీద అనేక ఆరోపణలు ఉన్నాయని, అయినా కేసీఆర్ వారినే ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించారని తెలిపారు. అభద్రతా భావంతోనే కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న కేసీఆర్ గంప గోవర్ధన్ కోరిక మేరకే అని సమరి్థంచుకోవడం శోచనీయమన్నారు. -
గొర్రెలు, బర్రెలు కాదు.. రాజ్యాధికారంలో వాటా ఇవ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే బీసీ బిల్లు ప్రవేశపెట్టి... చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, ప్రైవేటు రంగంలో బీసీ, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు పెట్టాలని కోరుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్మంతర్లో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. బీఎస్పీ ఫ్లోర్ లీడర్ శ్యామ్ సింగ్, ఎంపీ బినోయ్ విశ్వమ్, సీపీఐ జాతీయ నాయకులు నారాయణ, మల్లు రవి మద్దతు తెలిపారు. వందలాది మంది సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, బీసీ సంఘాల నాయకులు ఈ భారీ ప్రదర్శనలో పాల్గొ న్నారు. ‘ఓట్లు బీసీలవి– సీట్లు అగ్రకు లాలవా.. రాజ్యాధికారంలో వాటా కావాలి‘ అంటూ నినాదాలు చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ, ప్రధాన కార్యదర్శి నందగోపాల్ రాజ్ కుమార్, నేతలు గోవింద్, కర్రి వేణు మాధవ్, బాషయ్య, పరశురామ్ నాయకత్వం వహించారు. బీసీలను శాశ్వత బిచ్చగాళ్లను చేస్తున్నారు: కృష్ణయ్య ధర్నాను ఉద్దేశించి ఆర్.కృష్ణయ్య ప్రసంగిస్తూ అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన అ గ్రకులాలకు ఒకే రోజులో బిల్లు పెట్టి ఆఘ మేఘాల మీద 10 శాతం రిజర్వేషన్లు పెట్టా రని... కానీ బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు పెట్టాలని 30 ఏళ్లుగా పోరాడుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వకుండా గొర్రెలు – బర్రెలు పందులు – పెన్షన్లు ఇచ్చి ఓట్లు వేయించుకొని బీసీలను శాశ్వత బిచ్చగాళ్లను చేస్తున్నారని విమర్శించారు. -
అంగన్వాడీల విద్యార్హత ఇంటర్
మంచిర్యాలటౌన్: అంగన్వాడీ టీచర్లు, ఆయాల నియామకంలో ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. గతంలో ఈ పోస్టులకు కనీస విద్యార్హత పదో తరగతి ఉండగా ఇంటర్మీడియెట్కు పెంచింది. వయోపరిమితిని 35 ఏళ్లకే పరిమితం చేస్తూ, 21 ఏళ్ల నుంచి 35 ఏళ్లలోపు వారికి మాత్రమే దరఖాస్తుకు అవకాశం కల్పించింది. ప్రాజెక్టుల వారీగా రిజర్వేషన్ ఖరారుకు ఆదేశాలు జారీ చేసింది. ఇకపై కొత్త మార్గదర్శకాల ప్రకారమే ఖాళీలను భర్తీ చేయనున్నారు. ప్రధాన అంగన్వాడీ టీచర్గా పదోన్నతికి మినీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కనీసం ఐదేళ్లు అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసి, 45 ఏళ్లలోపు వయస్సు ఉండి, ఇంటర్మీడియెట్ విద్యార్హత ఉండాలి. ఖాళీల భర్తీకి రిజర్వేషన్, రోస్టర్ పాయింట్, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ సెంటర్ల విధి విధానాల ఖరారుకు ఆదేశాలను జారీ చేశారు. ఆయా పోస్టులకు గాను అర్హులుగా స్థానికంగా ఉన్న వివాహిత, అర్బన్ ప్రాంతాల్లో అదే వార్డుకు చెందిన వారు, గ్రామీణ ప్రాంతాల్లోనైతే అదే గ్రామ పంచాయతీకి చెందిన వారు, ఏజెన్సీలో సంబంధిత హ్యాబిటేషన్కు చెందిన మహిళ అయి ఉండాలి. వితంతువులు, ఒంటరి, అనాథ మహిళలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఎంపిక ప్రక్రియ కమిటీకి కలెక్టర్ చైర్మన్గా, ఏజెన్సీ ప్రాంతాల్లో ఐటీడీఏ పీవో సభ్యులుగా, నాన్ ట్రైబల్ ప్రాంతాల్లో ఆర్డీవో, జిల్లా సంక్షేమ శాఖ అధికారి సభ్యులుగా వ్యవహరిస్తారు. ఖాళీల భర్తీకి నిబంధనలు జిల్లాలో 969 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, అందులో ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు 895 ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం 840 మంది టీచర్లు పనిచేస్తుండగా, 55 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 738 మంది ఆయాలు ఉండగా, 157 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక మినీ అంగన్వాడీ కేంద్రాలు 74 ఉండగా, 59 మంది టీచర్లు ఉండగా, 15 మినీ అంగన్వాడీ టీచరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గత ఏడాది ఖాళీగా ఉన్న గ్రేడ్–2 సూపర్వైజర్ పోస్టులకు గాను పదేళ్లు టీచర్గా పనిచేసి, డిగ్రీ అర్హత ఉన్న వారికి అర్హత పరీక్ష నిర్వహించి, మెరిట్ ప్రకారంగా ఎంపికై న వారిని సూపర్వైజర్లుగా విధుల్లోకి తీసుకున్నారు. 17 పోస్టులకు గాను జిల్లా నుంచి 8 మంది అంగన్వాడీ టీచర్లు పదోన్నతి పొందడంతో ఆయా కేంద్రాల్లోనూ అంగన్వాడీ టీచర్ పోస్టులు ఖాళీ అయ్యాయి. పక్కనే ఉన్న ఇతర అంగన్వాడీ టీచర్లకు ఇంచార్జి బాధ్యతలు అప్పగించి నిర్వహిస్తున్నారు. -
కేంద్రం గిరిజనుల రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలి
సాక్షి, హైదరాబాద్/ఖైరతాబాద్: కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం గిరిజనులపై కపట ప్రేమను చూపిస్తోందని రాష్ట్ర గిరిజన, మహిళాభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. గిరిజనులకు రాజ్యాంగబద్ధంగా అందాల్సిన ఫలాలను కేంద్రం నిలువరిస్తోందని ఆమె మండిపడ్డారు. జనాభా ప్రాతిపదికన గిరిజనులకు 10 % రిజర్వేషన్లు దక్కాలన్నారు. తెలంగాణలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు 10% రిజర్వేషన్లను అమలు చేస్తోందని, కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో మాత్రం ఈ రిజర్వేషన్లు అమలు కావడం లేదని ఆగ్రహించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే గిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో జరిగిన జాతీయ బంజారా మీట్–2023 కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో గిరిజనులకు సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా అండగా ఉన్నారని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గిరిజనుల కోసం ఏం చేసిందో స్పష్టం చేయాలన్నారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నిర్మించిన నూతన పార్లమెంటు భవనం గిరిజనులదేనని అన్నారు. హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల కోసం ప్రతిష్టాత్మకంగా గిరిజన, ఆదివాసీభవన్లను ఏర్పాటు చేసిందన్నా రు. ఢిల్లీలో సంత్ సేవాలాల్ భవనాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. సేవాలాల్ జయంతిని దేశవ్యాప్తంగా అధికారికంగా జరపాలన్నారు. 15 రాష్ట్రాల నుంచి వచ్చిన గిరిజన ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా బంజారాల సమస్యలపై ఈ సమావేశంలో చర్చించి పలు తీర్మానాలను ఆమోదించారు. కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ రామచంద్రునాయక్, జీసీసీ చైర్మన్ వాల్యానాయక్, మాజీ ఎంపీ సీతారాం నాయక్ పాల్గొన్నారు. సదస్సులో చేసిన ముఖ్య తీర్మానాలు.. ♦ రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో బంజారా భాషను చేర్చాలి. ♦ దేశవ్యాప్తంగా ఉన్న బంజారాలను గిరిజనులుగా గుర్తించి ఎస్టీ రిజర్వేషన్లను వర్తింపచేయాలి. ♦ పార్లమెంటు ప్రాంగణంలో బాబా లఖిషా బంజారా పేరిట బంజారా భవన్ను నిర్మించాలి. ♦ పార్లమెంట్ ప్రాంగణంలో బాబా లఖిషా బంజారా విగ్రహం ఏర్పాటు చేయాలి. ♦ తెలంగాణలో గిరిజన వర్సిటీని ప్రారంభించాలి. ♦ ప్రైవేటు రంగంలోనూ ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయాలి. ♦ హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల నియామకాల్లో గిరిజనులకు ప్రాధాన్యం కల్పించాలి. -
కాపు రిజర్వేషన్పై జూన్లో తుది విచారణ
సాక్షి, అమరావతి: ఉన్నత వర్గాల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు (ఈడబ్ల్యూఎస్) విద్యా, ఉపాధి అవకాశాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తెచ్చిన చట్టానికి అనుగుణంగా రాష్ట్రంలో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెచ్చిన చట్టాన్ని అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై జూన్ 26న తుది విచారణ చేపడుతామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ లోపు కాపులకు మాత్రమే 5 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన వ్యాజ్యంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 26కి వాయిదా వేసింది. ఈ మేరకు సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం పిటిషనర్కు పలు సూచనలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుని, ప్రభుత్వంపై ఇతర మార్గాల్లో ఒత్తిడి తేవాలని సూచించింది. లేనిపక్షంలో రిజర్వేషన్ల వ్యవహారంలో కోర్టులో పెండింగ్లో ఉందన్న కారణంతో ప్రభుత్వం జాప్యం చేసే అవకాశం ఉందని తెలిపింది. ఈ వ్యవహారం చాలా సున్నితమైందని వ్యాఖ్యానించింది. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించకపోవడం చట్ట విరుద్ధమంటూ కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యం బుధవారం మరోసారి విచారణకు వచ్చింది. జోగయ్య తరఫున న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ వాదనలు వినిపిస్తూ, గత ప్రభుత్వ హయాంలో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం తెచ్చిందని, దీనిపై దాఖలైన వ్యాజ్యాలను సుప్రీంకోర్టు కొట్టేసిందన్నారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్ను సుప్రీంకోర్టు సమర్థించిందని, అయినా రాష్ట్ర ప్రభుత్వం పాత చట్టాన్ని అమలు చేయడంలేదని అన్నారు. విద్యా, ఉపాధి అవకాశాల్లో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని ధర్మాసనాన్ని కోరారు. మరో న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు జోక్యం చేసుకుంటూ.. కాపులకు మాత్రమే 5 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ తాము గతంలోనే పిల్ దాఖలు చేశామని చెప్పారు. ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపులకు మాత్రమే 5 శాతం రిజర్వేషన్ కల్పించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ స్పందిస్తూ.. కాపులకు రిజర్వేషన్ను వ్యతిరేకిస్తూ దాఖలైన వ్యాజ్యంలో కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు. ఇందుకు అంగీకరించిన ధర్మాసనం.. ఈ వ్యవహారం చాలా సున్నితమైందని, అందువల్ల లోతుగా విచారణ జరుపుతామని తెలిపింది. -
మున్సిపాలిటీల్లో మైనారిటీలకు కోటా రాజ్యాంగ ఉల్లంఘనే
సాక్షి, హైదరాబాద్: మున్సిపాలిటీల్లో కో–ఆప్షన్ సభ్యులుగా మైనారిటీల నియామకానికి వీలు కల్పిస్తూ తెలంగాణ మున్సిపల్ చట్ట సవరణ బిల్లు–2022ను తీసుకురావడం రాజ్యాంగ ఉల్లంఘనేనని రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రకారం మైనారిటీ అనే పదాన్ని నిర్వచించడానికి అవసరమైన నిర్దిష్ట ప్రామాణికతను తీసుకురావాలని కోరుతూ మున్సిపల్ బిల్లును ప్రభుత్వానికి తిప్పి పంపించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యతలో ఉండి అందుకు తూట్లు పొడిచే పనుల్లో భాగస్వామి కాలేనని ఈ సందర్భంగా ఆమె రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చిచెప్పినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మైనారిటీల ప్రస్తావనే లేదు... ‘మున్సిపాలిటీల పాలనా వ్యవహారాల్లో దేశవ్యాప్తంగా ఏకరూప విధానం కోసం కేంద్రం 74వ రాజ్యాంగ సవరణ తెచ్చింది. మున్సిపాలిటీల ఏర్పాటు, పాలకవర్గ సభ్యుల ఎంపిక, సీట్ల రిజర్వేషన్ల అంశాలపై రాజ్యాంగంలోని పేరా–9–ఏలో ఉన్న ఆర్టికల్ 243–పీ, 243–జీలలో స్పష్టమైన వివరణలున్నాయి. ఎక్కడా అందులో మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించాలని లేదు. ఎన్నికల ద్వారానే మున్సిపాలిటీల్లో సీట్ల నియామకం జరపాలని ఆర్టికల్ 243–ఆర్ పేర్కొంటోంది. పురపాలనలో అనుభవం, పరిజ్ఞానంగల వ్యక్తులను కో–ఆప్షన్ సభ్యులుగా నియమించడానికి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వార్డు కమిటీ చైర్పర్సన్లను మున్సిపాలిటీల్లో (ఎక్స్అఫిషియో) సభ్యులుగా నియమించడానికే మినహాయింపు ఉంది. రాజ్యాంగంలోని పేరా–9–ఏలో మైనారిటీల ప్రస్తావన లేదు. ప్రతిపాదిత మున్సిపల్ బిల్లులోని నిబంధనలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 9–ఏను ఉల్లంఘించేలా ఉన్నాయి’అని గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారు. ఖజానాపై భారమనే ఆ బిల్లు తిరస్కృతి వైద్యవిద్య డైరెక్టర్, అదనపు డైరెక్టర్, వైద్య కళాశాల ల ప్రిన్సిపాళ్లు, బోధనాస్పత్రుల సూపరింటెండెంట్ల పదవీవిరమణ వయసును 61 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ (రెగ్యులేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపర్ యాన్యుయేషన్) చట్ట సవరణ బిల్లు–2022ను గవర్నర్ తమిళిసై తిరస్కరించడం తెలిసిందే. 2019 జూలై 20 నుంచి ఈ మేరకు రిటైర్మెంట్ వయసు పొడిగింపును వర్తింపజేస్తూ 2022 సెప్టెంబర్ 12న బిల్లును ప్రభుత్వం తేవడంపట్ల గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 61 ఏళ్లు నిండి పదవీ విరమణ చేసిన నాటి నుంచి తిరిగి పునర్నియమితులయ్యే వరకు ఉన్న కాలంలో ఒక్కరోజూ పనిచేయకపోయినా వారికి ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు చెల్లించాల్సి వస్తుందని ఆరోపిస్తూ ఈ బిల్లును గవర్నర్ తిరస్కరించారు. ఈ బిల్లుతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ఎలాంటి భారం పడదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొనడంపై సైతం గవర్నర్ స్పందించినట్లు సమాచారం. ఇప్పటికే రిటైరైన ఎందరికి దీనిద్వారా ప్రయోజనం కలుగుతుంది? ఎంత మేరకు రాష్ట్ర ఖజానాపై భారం పడుతుంది? వంటి అంశాలపై తమిళిసై ప్రభుత్వ వివరణ కోరినట్లు సమాచారం. ప్రభుత్వ వర్సిటీలకు దిక్కులేదు.. ప్రైవేటువి కావాలా? రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను నిర్లక్ష్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు వర్సిటీల ఏర్పాటును ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు–2022ను తీసుకురావడం సరికాదని గవర్నర్ తమిళిసై అభ్యంతరం తెలిపినట్లు తెలిసింది. ఈ విషయంలో ప్రభుత్వ వివరణ కోరినట్టు సమాచారం. -
‘రిజర్వేషన్లు తొలగించడం అమిత్ షా తరం కాదు’
సాక్షి, హుస్నాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. చేవెళ్ల సభలో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు రిజర్వేషన్లను రద్దు చేస్తామని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో కేసీఆర్ సర్కార్పై తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. అయితే, అమిత్ షా రిజర్వేషన్ల తొలగింపు వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేతలు సీరియస్ అవుతున్నారు. అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క స్పందించారు. ఈ క్రమంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అమిత్షా వ్యాఖ్యలు బాధ కలిగించాయి. దేశ హోంమంత్రి మతానికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడతారు?. మత రాజకీయాలు చేస్తే దేశాన్ని ఎవరు కాపాడాలి?. అమిత్ షా వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎందుకు ఖండించలేదు అని ప్రశ్నించారు. ఇక, అమిత్ షా వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ కౌంటర్ ఇచ్చారు. తాజాగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ రాజ్యాంగం నడుస్తోంది. ముస్లిం రిజర్వేషన్లను తొలగించడం అమిత్ షా తరం కాదు. అమిత్ షాపై రాజ్యాంగపరమైన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. -
‘ఒవైసీ అంటూ ఎంతకాలం ఏడుస్తారు?’
హైదరాబాద్: తెలంగాణలో అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ చేవెళ్ల సభ సాక్షిగా ప్రకటించారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకమన్న ఆయన.. వాటి ఫలాలను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అంతేకాదు.. మజ్లిస్ పార్టీ స్టీరింగ్తో నడుస్తున్న కేసీఆర్ పాలనతో తెలంగాణ అభివృద్ధి జరగదంటూ విమర్శలు గుప్పించాయి. అయితే.. అయితే అమిత్ షా చేవెళ్ల ప్రసంగంపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. షా చేసింది ముస్లిం విద్వేష ప్రసంగమన్న ఒవైసీ.. బీజేపీకి తెలంగాణపై విజన్ లేదని విమర్శించారు. ‘‘ముస్లిం విద్వేష ప్రసంగం మాత్రమే కాదు.. బీజేపీకి తెలంగాణ పట్ల విజన్ లేదు. బూటకపు ఎన్కౌంటర్లు, హైదరాబాద్పై సర్జికల్ స్ట్రైక్స్, కర్ఫ్యూలు, నేరస్థులను విడుదల చేయడం, బుల్డోజర్లను మాత్రమే వాళ్లు అందించగలరు. అసలు తెలంగాణ ప్రజల్ని ఎందుకు అంతగా ద్వేషిస్తున్నారు? అని ఒవైసీ ట్విటర్వేదికగా అమిత్ షాపై కౌంటర్ విమర్శలు గుప్పించారు. రికార్డు స్థాయికి చేరిన ద్రవ్యోల్బణం గురించి, నిరుద్యోగం గురించి మాట్లాడాలంటూ ఆయన షాకు చురకలు అంటించారు. ఒవైసీ మీద పడి ఎంతకాలం ఏడుస్తారంటూ మండిపడ్డారాయన. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు న్యాయం చేయాలని అమిత్ షా నిజంగా భావిస్తే.. 50 శాతం కోటా పరిమితిని తొలగించడానికి రాజ్యాంగ సవరణను ప్రవేశపెట్టాలి. అనుభావిక డేటా ఆధారంగానే వెనుకబడిన ముస్లిం సమూహాలకు రిజర్వేషన్లు ఇవ్వబడ్డాయని ఆయన గుర్తించాలి అని ట్వీట్లో ఒవైసీ పేర్కొన్నారు. ఈ విషయంలో సుధీర్ కమిషన్ రిపోర్ట్ను ఆయన చదవాలని, లేదంటే చదివిన ఎవరినైనా అడిగి తెలుసుకోవాలని షాకు సూచించారు. సుప్రీం కోర్టు స్టే కింద ముస్లింలకు రిజర్వేషన్లు కొనసాగుతున్నాయని అమిత్ షాకు ఒవైసీ గుర్తు చేశారు. Sir @AmitShah ye “owaisi owaisi” ka rona kab tak chalega? Khaali khattey dialog’aan maarte rehte. Please sometimes speak about record-breaking inflation & unemployment also. Telangana has the highest per capita income in the country Modi allegedly says reach out to pasmanda… — Asaduddin Owaisi (@asadowaisi) April 23, 2023 -
యడియూరప్ప ఇంటిపై రాళ్ల దాడి.. నిరసనకారులపై లాఠీ ఛార్జ్
బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప నివాసం, కార్యాలయంపై రాళ్ల దాడి జరిగింది. శివమొగ్గ జిల్లా షికారిపురలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. బీజేపీ ప్రభుత్వం ఎస్సీ కోటాలో అంతర్గత రిజర్వేషన్లు తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ బంజారా, భోవి సామాజిక వర్గాలకు చెందిన వారు యడియూరప్ప నివాసం ఎదుట ఆందోళనలు చేపట్టారు. ఈక్రమంలోనే రాళ్ల దాడి జరిగింది. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీ ఛార్జ్ చేశారు. అనంతరం ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. కర్ణాటక ఎస్సీ రిజర్వేషన్లలో మొన్నటివరకు బంజారాలు అధిక ప్రయోజనం పొందేవారు. అయితే సీఎం బసవరాజ్ బొమ్మై సర్కార్.. కొత్తగా ఎస్సీ రిజర్వేషన్లలో కోటాలు తీసుకొచ్చింది. ఉపకులాలుగా విభజించి రిజర్వేషన్లు అమలు చేస్తోంది. దీంతో గతంలో ఎస్సీ రిజర్వేషన్లలో 17 శాతం వరకు లబ్ధిపొందే బంజారా కమ్యూనిటీ ఇప్పుడు 4.5 శాతానికే పరిమితం అయింది. ఈ నేపథ్యంలోనే తమకు అన్యాయం జరుగుతోందని వారు యడియూరప్ప నివాసం ఎదుట ఆందోళనలు చేపట్టడం ఉద్రిక్తతలకు దారితీసింది. చదవండి: సావర్కర్ వంటి వ్యక్తులు ఏం చేశారో తెలుసా!కేంద్రమంత్రి ఫైర్ -
మాజీ అగ్నివీర్లకు బీఎస్ఎఫ్ ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్
న్యూఢిల్లీ: సైనిక దళాల్లో ఎంపికల కోసం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన అగ్నిపథ్ పథకం పట్ల యువతను ఆకర్షితులను చేసే దిశగా కేంద్రం ఒక ప్రకటన చేసింది. అగ్నివీర్ ద్వారా ఎంపికై నిబంధనల మేరకు నాలుగేళ్లు సర్వీసు పూర్తి చేసుకుని రిటైరైన అభ్యర్థులకు సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించింది. అంతేకాదు, గరిష్ట వయోపరిమితిలో కూడా సడలింపులు ఉంటాయని తెలిపింది. ఇందుకు వీలు కల్పిస్తూ బీఎస్ఎఫ్ జనరల్ డ్యూటీ కేడర్(నాన్ గెజిటెడ్) రిక్రూట్మెంట్–2015 నిబంధనల్లో మార్పులు చేపట్టినట్లు వెల్లడించింది. ఇవి మార్చి 9వ తేదీ నుంచే అమల్లోకి వచ్చాయని ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. మొదటి బ్యాచ్ మాజీ అగ్నివీర్లకు గరిష్ట వయో పరిమితిలో ఐదేళ్ల వరకు సడలింపు ఉంటుందని కేంద్ర హోం శాఖ అందులో వివరించింది. ఇతర బ్యాచ్ల వారికైతే మూడేళ్ల వరకు సడలింపు ఉంటుంది. మాజీ అగ్నివీర్లకు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ నుంచి మినహాయింపు కూడా ఉంటుంది. -
బీజేపీతో తస్మాత్ జాగ్రత్త
పటాన్చెరు: మతతత్వ బీజేపీతో బంజారాలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో జరిగిన రాష్ట్ర బంజారా ఎంప్లాయీస్ సేవాసంఘ్ కౌన్సిల్ సమావేశానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డితో కలసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లంబాడాలకు రిజర్వేషన్లు తొలగించాలని ఓ తెలంగాణ ఎంపీ డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. గిరిజన ఉద్యోగులపై బీజేపీ వాదులు దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నెల రోజుల్లో పోడు భూముల సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. తమ ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి కట్టుబడి ఉందని, ఇందులో భాగంగా బంజారా భవన్ను నిర్మిస్తున్నామని, సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నామని, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామని హరీశ్రావు వివరించారు. ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెంచామని, ఎస్టీ బాలికల కోసం ప్రత్యేక గురుకుల పాఠశాలలను తెరిచామని గుర్తు చేశారు. కాగా, గిరిజన యూనివర్సిటీ మంజూరు విషయంలో కేంద్రం తాత్సారం చేస్తోందన్నారు. ఏడేళ్ల క్రితం 317 ఎకరాల భూమిని ఈ యూనివర్సిటీ కోసం కేటాయించినప్పటికీ నేటికీ అక్కడ యూనివర్సిటీ రాలేదన్నారు. ట్రైబల్ యూనివర్సిటీ ఎందుకు రాలేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని నిలదీయాలని ఆయన కోరారు. కాంగ్రెస్, టీడీపీలు బంజారాలను ఓట్ల కోసం వాడుకున్నాయే తప్ప వారి అభ్యున్నతికి చేసిందేమీ లేదన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లలో బంజారాలు బీఆర్ఎస్ను బలపరుస్తున్నారని తెలిపారు. త్వరలో భర్తీ చేయనున్న 81 వేల ఉద్యోగాల్లో బంజారాలకు పది శాతం రిజర్వేషన్లు ఉంటాయన్నారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
BC Census: బీసీ జన గణనతోనే న్యాయం
జనాభా కులాలుగా విడగొట్ట బడిన దేశం మనది. ఆధిపత్య కులాలు దేశంలోని భూమి, ఇతర వనరులు; విద్య, ఉద్యోగ అవకాశాలను అధికంగా అను భవిస్తున్నాయి. సంపద వారి చేతుల్లో ఉన్నందు వల్ల చదువు కోగలరు కాబట్టి... ఉద్యోగావకాశాలూ సహజంగా వారికే అధికంగా లభిస్తాయి. అయితే దేశంలో సంఖ్యాపరంగా వీరి సంఖ్య తక్కువ. బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల జనాభా అధికంగా ఉంది. రాజ్యాంగం అందరికీ సమాన అవ కాశాలు వాగ్దానం చేసింది. అవకాశాల్లో సమాన భాగం కాకపోయినా... కనీస భాగం పొందాలంటే రిజర్వేషన్లు ఒక్కటే మార్గమని రాజ్యాంగ సభ భావించి రాజ్యాం గంలో అందుకు తగిన ఏర్పాటు చేసింది. అయితే ఇటీవల కాలంలో కొత్త కులాలనూ, వర్గాలనూ రిజర్వేషన్ వర్గాల్లో కలపడంతో రిజర్వేషన్ వర్గాల వారికి అవకాశాలు పలుచబడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కులాల జన గణన జరిగితే ఎవరి దామాషా ప్రకారం వారు అవకాశాలను పొందవచ్చుగదా అనే ఆలోచన బయలుదేరింది. ముఖ్యంగా వందలు, వేలా దిగా ఉన్న బీసీ కులాలు ఈ డిమాండ్ను బలంగా విని పిస్తున్నాయి. ఇలా కుల గణన జరిగితే ఒనగూరే ఇతర ప్రయోజనాలనూ వారు పేర్కొంటున్నారు. వెనుక బడిన మెజార్టీ ప్రజల సంక్షేమానికి తగిన పథకాల రూపకల్పనకు ఈ డేటా చాలా అవసరం. విద్య, ఉద్యోగ రంగాల్లో ఎవరి వాటా వారు పొందడానికి వీలు కలుగుతుంది. ఇప్పటివరకు రిజర్వేషన్ ఫలాలు అందని ఎన్నో వందల కులాలను వెలుగులోకి తీసుకురావచ్చు. ఫలితంగా అత్యధిక పేదలు ఉన్న బీసీల్లో తమ వాటా తమకు లభిస్తుందన్న సాంత్వన లభిస్తుంది. ఎవరి వాటా వారికి లభిస్తే సామాజిక అశాంతి తగ్గి శాంతి భద్రతలు మెరుగవుతాయి. ప్రభుత్వం తన దృష్టిని అభివృద్ధి కార్యక్రమాలపై నిలపడానికి అవకాశం ఏర్పడుతుంది. కులగణనపై సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం... కులాల వారీగా వెనుకబడిన తరగతుల జనగణన చేపట్టడం పాలనపరంగా కష్టమని తెలిపింది. దీంతో బీసీలు బాగా అసంతృప్తికి లోనయ్యారు. 1931 కులగణన తర్వాత బీసీ జనగణన జరగలేదు. అయితే 1979లో జనతా ప్రభుత్వం బీపీ మండల్ సారథ్యంలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులవారిని గుర్తించి వారి అభివృద్ధికి సిఫార్సులు చేయమని ఒక కమిటీని నియమించింది. ఈ మండల్ కమిషన్ 1980లో సమర్పించిన నివే దికలో భారత్ మొత్తం జనాభాలో 52 శాతం వెనుక బడిన తరగతులవారేననీ, వారికి 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలనీ సిఫార్సు చేసింది. బీసీల సమగ్ర అభివృద్ధి కోసం అనేక సిఫార్సులు చేసినా అవన్నీ అటకెక్కాయి. 27 శాతం రిజర్వేషన్లు మాత్రమే అత్యంత దారుణ వ్యతిరేక పరిస్థితుల్లో అమలులోకి వచ్చాయి. నిజానికి ఇప్పుడు బీసీల జనాభా మరింతగా పెరిగి ఉండాలి. వారూ వీరూ చెప్పే లెక్కలన్నీ కాకి లెక్కలే. ఒక్కసారి కుల గణన జరిపితే అభివృద్ధి ఫలాల్లో ఎవరి వాటా వారు అడగడానికి వీలు ఉంటుంది. సామాజిక న్యాయం సాకారమవుతుంది. (చదవండి: కులాంతర వివాహాలు శాస్త్రబద్ధమే) - డాక్టర్ పరికిపండ్ల అశోక్ సామాజిక కార్యకర్త -
వివక్ష ఉందంటే ఉలుకెందుకు?
వివక్ష సృష్టికర్తలు, వివక్ష లేదని చెప్పడమో లేక దాన్ని తక్కువ చేసి చూపడమో చేస్తూ వుంటారు. అందులో భాగంగానే బాధితుల ఆక్రందనల్ని ప్రమాదకరమైన అలవాట్లుగా చూపిస్తుంటారు. ఈ మధ్య ఒక వైపు దళితుల మీద వివక్ష వుందని చెబుతూనే మరోవైపు వివక్ష తీవ్రతనూ, పరిమాణాన్నీ పలుచన చేసి చూపించే ప్రయత్నాలు ఎక్కువయ్యాయి. నవంబర్ 17న ‘సాక్షి’లో పి. కృష్ణమోహన్ రెడ్డి రాసిన ‘ఇక్కడి వివక్షే కనిపిస్తుందా?’ వ్యాసంలో ఈ ధోరణి కనిపిస్తుంది. ఆధారాల కంటే సొంత అవసరాలనే నిజాలుగా ప్రచారంచేసే పోస్ట్– ట్రూత్ మేధావులు పెరిగిపోయారు. ఇక్కడి వివక్షని తెలుసు కోవడానికి విదేశాల రిపోర్టులు అవసరం లేదనీ... నిజాన్ని గుర్తించే జ్ఞానం వుంటే సరిపోతుందనీ తెలుసుకోలేకపోతున్నారు. కులం కొనసాగింపు కోసం కొత్తకొత్త వాదనలు కనిపెడుతున్నారు. దళితులు ప్రతి విషయాన్నీ కుల కోణం నుంచి చూస్తున్నారని ఆందోళన చెందటం అందులో మొదటిది. తమ తప్పును కప్పిపుచ్చు కోవడానికి అన్ని కులాలు వివక్ష ఎదుర్కొంటున్నాయి అంటారు. దళితులు ఎదుర్కొనే అంటరానితనం భిన్నమైందని ఒప్పుకోరు. ‘కొన్ని సంఘటన లను చూపించి’ దేశమంతా వివక్ష ఉందనడం సరి కాదంటారు. 2021లోనే దేశంలో 50,900 దాడులు నమోదు అయినట్లు నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో చెప్పింది. ఇన్ని దాడులు చెదురు మదురు ఘటనలుగా కనిపించడం ఆశ్చర్యమే. దళితులు ఇక్కడి వివక్షనే ఎదిరించడం ‘అధర్మ’మట. ఆఫ్రికాలో అపార్తీడ్కూ, అమెరికాలో జాతి వివక్షకూ వ్యతిరేకంగా దళితులు సంఘీభావం ప్రకటించడం వీళ్ళకి కనబడదు. ఎక్కడో వివక్ష ఉంది కాబట్టి ఇక్కడ దళితులు దాన్ని అనుభవించాలంటారు! ఆస్ట్రేలియాలో ఆదివాసీలకు జరిగిన అన్యాయానికి ఆ దేశ అధినేత క్షమాపణ చెప్పాడు. అమెరికాలో నల్ల జాతీయుల పట్ల వివక్షకు వ్యతిరేకంగా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హరీస్ క్షమాపణలు చెప్పారు. అలాంటి ఊరట కలిగించే మాట ఇక్కడ ఎవరైనా చెప్పగలరా? రిజర్వేషన్లు సమానత్వానికి వ్యతిరేకం అని ప్రచారం చేస్తారు. కానీ వీళ్ళకు కులం, అంటరానితనం అసమానత్వంగా కనబడవు. అమెరికాలో ‘పౌర హక్కుల చట్టం 1964’ ప్రకారం జాతి, మతం, లింగం వంటి అంశాల వల్ల ఒక వ్యక్తిని వివక్షకు గురి చేయకూడదు. ఈ చట్టం లోని ‘టైటిల్ సెవెన్’ ప్రకారం ప్రభుత్వంతో కలిసి పనిచేసే వ్యక్తులు, సంస్థలు... కాంట్రాక్టులు, వ్యాపారాల్లో అఫర్మే టివ్ యాక్షన్ ప్లాన్ అమలు చేసి తీరాలి. అంటే నల్ల జాతీయులు, లాటిన్ అమెరికన్స్, మహిళలు, మైనారిటీలు, ట్రాన్స్ జెండర్స్ వంటి వారికి తప్పకుండా ఉద్యోగావకాశాలు కల్పించాలి. నియామకాలలో డైవర్సిటీ ఇండెక్స్ పాటించి తీరాలి. ఇది రిజర్వేషన్ లాంటిదే. అమెరికా సాఫ్ట్వేర్ కంపెనీల్లో డైవర్సిటీ ఇండెక్స్, హాలీవుడ్ సినిమాల్లో నల్ల జాతీయులు కనిపించడం వంటివి అఫర్మేటివ్ యాక్షన్లో భాగమే. దౌర్భాగ్యం ఏంటంటే... బతుకుదెరువు కోసం వెళ్లి ఉద్యోగాలు చేసుకుంటున్న మన వాళ్ళు అక్కడ కూడా కుల వివక్షను పెంచి పోషిస్తున్నారు. అందుకే అక్కడి దళితులు నల్లజాతీయుల లాగే తమకూ రక్షణ చట్టాలు కావాలని ఉద్యమాలు చేస్తున్నారు. అకడమిక్స్లోనూ వివక్ష రాజ్యమేలుతోంది. దానికి వ్యతిరేకంగా పోరాడే విద్యార్థులనూ, ఉద్యోగులనూ కులవాదులుగా చిత్రించడం ‘అలవాటైన దుర్మార్గం’ కాదా? దళితులు ఇప్పుడిప్పుడే చదువుకు దగ్గర అవుతున్నారు. వాళ్లకి వ్యతిరేకంగా విశ్వవిద్యాలయాలు విష వలయాలుగా మారటం అన్యాయం కాదా? అంబేడ్కర్ మీద అక్కసు వెళ్లగక్కడం మరో పోకడ. గతంలో అమెరికాకి చెందిన నల్లజాతి నాయకులు ఇండియా వచ్చి గాంధీని కలిసి ఆహ్వానించారు గాని అంబేడ్కర్ని కలవలేదని పెద్ద రహా స్యాన్ని కనిపెట్టినట్టు ప్రచారం చేస్తున్నారు. గాంధీని పిలిచారు కాబట్టి అంబేడ్కర్ వివక్ష మీద పోరాటం చెయ్యలేదని చెప్పగలరా? గాంధీ ఒక దేశ స్వాతంత్య్ర ఉద్యమాన్ని నడిపిస్తున్న నేతగా ప్రపంచాన్ని ఆకర్షించాడనే సంగతిని మరువరాదు. అంబేడ్కర్ను తక్కువ చేసి చూపాలనే దుగ్ధతో అనవసరమైన పోలికలు తీసుకొస్తే ఎలా? ‘అంబే డ్కర్ ఎంతో సహనంతో ఇప్పటిదాక నామీద దాడి చెయ్యకపోవడం అతని గొప్పతనమే’ అని గాంధీ స్వయంగా ‘హరిజన’ పత్రికలో ఎందుకు రాసుకున్నాడో తెలిస్తే లోతు అర్థమౌతుంది. దేశంలో చాక్లెట్ కొన్నా పన్ను కట్టాల్సిందే. ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ... మిగిలిన పౌరుల్లాగానే పన్ను కడుతున్నారు. అందులోంచే సంక్షేమ కార్యక్రమాలకూ, పారిశ్రామిక వసతుల కోసం, కార్పొరేట్ లకూ, భూమి ఉన్న రైతులకూ రాయితీలు ఇవ్వడం కోసం ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు పెడుతోంది. రాయితీల్లో తొంబై శాతం పైగా లబ్ధి దారులు పైకులాలవారే. ఈ రాయితీలతో పోల్చుకుంటే రిజర్వేషన్ల విలువ అతి స్వల్పం. దేశాన్నే ప్రైవేట్ చేతుల్లో పెడుతుంటే పట్టించు కోకుండా తరతరాలుగా అణచివేతకు గురైనవారికి ఇస్తున్న రిజర్వేషన్ల మీద దాడిచేయడం ఏమిటి? కులం పేరుతో ఎవరి పట్లయినా వివక్ష చూపడం జరిగినా, దాడి జరిగినా నైతికంగా అందరూ బాధ్యత వహించాలి. దాన్ని అందరూ గర్హించాలి. (క్లిక్ చేయండి: మనుషులు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో.. !?) - ప్రొఫెసర్ శ్రీపతి రాముడు ఆచార్యులు, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ ఇన్క్లూజివ్ పాలసీ, హెచ్సీయూ -
‘కోటా’ను కాపాడుకోవడం ఎలా?
రిజర్వేషన్లు, అవినీతి భారతదేశ వెనుకబాటుతనానికి ప్రధాన కారణాలనే అభిప్రాయం ద్విజ న్యాయవ్యవస్థలో బలంగా పాతుకుపోయింది. ‘ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు’ (ఈడబ్ల్యూఎస్) కోటా విషయంలో సుప్రీంకోర్టులో మెజారిటీ తీర్పు దీన్నే ప్రతిఫలించింది. కులం కాకుండా వర్గం అనేదే రిజర్వే షన్లకు సరైన వర్గీకరణ అవుతుందన్నది వీరికి ఇష్టమైన సిద్ధాంతం. తమ యువతకు లబ్ధి చేకూర్చుతుందని నమ్ముతూ రిజర్వేషన్ పరిధిలో లేని శూద్ర వర్గాలు దీన్ని సమర్థిస్తున్నాయి. కానీ అంతిమంగా ద్విజ వర్గాలే దీని నుంచి లబ్ధి పొందుతాయనేది నిజం. అన్ని స్థాయుల్లోనూ ఉత్పాదకతతో ముడిపడి ఉన్న వర్గాల్లోంచి బలమైన లీగల్ మేధావులు ప్రత్యేకించి సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో లేకపోతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ప్రయోజనాలను కాపాడటం అసాధ్యం. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు రిజర్వేషన్పై సుప్రీంకోర్టు అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పు తీవ్ర చర్చలకు దారితీసింది. దళిత, ఆదివాసీ, ఓబీసీల సామాజిక ఆర్థిక మార్పునకు సంబంధించిన కోణంలోంచి చూస్తే అది తిరోగమన తీర్పా లేక పురోగమన తీర్పా అనేదే ఆ చర్చల సారాంశం. 2022 నవంబర్ 10న ఆల్ బార్ అసోసియేషన్ (ఏబీఏ) న్యాయవాదులు, అఖిల భారత వెనుకబడిన మైనారిటీ కమ్యూనిటీల ఉద్యోగుల సమాఖ్య కార్యకర్తలు ఒక ఆన్లైన్ సెమినార్ నిర్వహించారు. ఇప్పటికీ తమ చారిత్రక వెనుకబాటుతనాన్ని, తమపై నియంత్రణను అధిగమించలేకపోయిన ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఉత్పాదక ప్రజారాశులను తప్పుదోవ పట్టిస్తున్న న్యాయవ్యవస్థను, ప్రభుత్వాన్ని సవాలు చేసి భవిష్యత్తు కార్యాచరణ చేపట్టడం కోసం అవసరమైన కొత్త దృక్పథాన్ని ఈ సెమినార్ పరిశీలించింది. సుప్రీంకోర్టు ధర్మాసనం 3–2 మెజారిటీతో ఇచ్చిన తీర్పులో ప్రభుత్వ దృక్పథాన్ని మెజారిటీ న్యాయమూర్తులు ఎత్తిపట్టారు. ఇక పోతే నాటి చీఫ్ జస్టిస్ యుయు లలిత్తో కూడిన ఇద్దరు జడ్జీల మైనా రిటీ కొన్ని సంక్లిష్ట ప్రశ్నలను ముందుకు తెచ్చింది. సంస్థాగతంగా ఉన్న కులాన్ని నిర్మూలించి సమతావాద సమాజం వైపు పురోగమిం చాలని రాజ్యాంగం నిర్మాణాత్మకంగా మాట్లాడలేదన్న అభిప్రా యాన్ని ‘ఏబీఏ’ న్యాయవాదులు వ్యక్తపరిచారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 46 మాత్రమే కులం గురించి పేర్కొంది. ప్రజానీకంలోని బలహీన వర్గాల, ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీలకు చెందిన విద్యా, ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రోత్సహించాలని చెప్పింది. పైగా సామాజిక అన్యాయం నుంచి, అన్ని రకాల దోపిడీ నుంచి వారిని కాపాడాలని సూచించింది. ఇక్కడ కూడా కులానికి సంబంధించిన భావనను షెడ్యూల్డ్ కులాలకు మాత్రమే ఉద్దేశించడం చూడవచ్చు. రాజ్యాంగంలో ఎక్కడ కూడా శూద్ర, ఓబీసీలను కుల పీడనను ఎదుర్కొంటున్న వారిగా గుర్తించలేదు. వీరిని ఒక వర్గంగానే గుర్తిం చారు. ప్రస్తుతం ఇతర వెనుకబడిన వర్గం రిజర్వేషన్ని సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల చర్చా పరిధిలోనే ఏర్పర్చారు. ఇది రిజర్వేషన్ వ్యతిరేక రాజకీయ నాయకులు, పార్టీలు, మేధావులు, మీడియా వ్యక్తులకు విస్తారమైన పరిధిని ఇచ్చింది. 103వ రాజ్యాంగ సవరణతో 10 శాతం ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ద్వారా వర్గ ప్రాతిపదిక రిజర్వేషన్ను ముందుకు తెచ్చే వీలు కల్పించింది. ఇప్పుడు సుప్రీం కోర్టు తన తీర్పు ద్వారా దీనికి ఆమోద ముద్ర వేసింది. న్యాయవ్యవస్థలోని చాలామంది జడ్జీలు వర్గ (ఆర్థిక కేటగిరీ) పరమైన రిజర్వేషన్ థియరీని అనుసరిస్తున్నారు. అన్ని కులాలనూ దీంట్లో పొందుపరుస్తున్నప్పటికీ ద్విజ కులాలే ఎక్కువగా అదనపు ప్రయోజనాన్ని పొందుతాయి. ఆర్థిక వర్గీకరణ ప్రాతిపదికన ఉండే ఏ రిజర్వేషన్ అయినా ఇప్పటికే ప్రతిభ పేరుతో ప్రతి సీటును, ఉద్యో గాన్ని పొందగలుగుతున్న ద్విజ కులాలతోపాటు సాపేక్షంగా పేదలే అయినప్పటికీ, సామాజికంగా అదే స్థాయికి చెందిన శక్తులను విద్యా, ఉద్యోగ మార్కెట్లోకి తీసుకొస్తుంది. 1990 మండల్ రిజర్వేషన్ పోరాట రోజులనుంచి కులప్రాతి పదికన ఉన్న నిరక్షరాస్యత, దారిద్య్రం, అసమానత్వం, అణచివేత, దోపిడీ వంటి అంశాలను తక్కువచేసి చూపడానికి వామపక్షాలు, ఉదారవాదులు, హిందుత్వవాదులు అందరూ రిజర్వేషన్లలో ఆర్థిక ప్రాతిపదికను కూడా తేవాలని ఒత్తిడి చేస్తూ వచ్చారు. న్యాయ మూర్తులు, న్యాయ నిపుణులు రాజ్యాంగానికి చేస్తూ వచ్చిన వ్యాఖ్యా నాలు చాలావరకు వర్గ కేంద్రంగానే ఉంటూ వచ్చాయి. కులం కాకుండా వర్గం అనేదే రిజర్వేషన్లకు సరైన వర్గీకరణ అవుతుందన్నది వీరికి ఇష్టమైన సిద్ధాంతం. మన న్యాయవ్యవస్థలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల ప్రవేశాన్ని దామాషా ప్రాతిపదిక కింద చొప్పించడం ఎలా అనేది ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న. న్యాయపరమైన వ్యాజ్యాలలో పాలు పంచుకోవడాన్ని సాధా రణ ప్రజానీకం అర్థం చేసుకోలేదు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలనుంచి పోటీపడే సమర్థతలు కలిగిన సుశిక్షితులైన న్యాయ నిపుణులు మాత్రమే న్యాయ పోరాటాలలో తలపడగలరు. చట్టాలను వ్యాఖ్యా నించడంలో న్యాయవ్యవస్థ అత్యంత శక్తిమంతమైన విభాగంగా ఉంటున్నందున, అన్ని స్థాయిల్లోనూ ఉత్పాదకతతో ముడిపడి ఉన్న నేపథ్యంలోంచి బలమైన లీగల్ మేధావులు ప్రత్యేకించి సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో లేకపోతే న్యాయవ్యవస్థలో ఈ వర్గాల ప్రయోజనాలను కాపాడటం అసాధ్యం. ఈ సమరంలో ఇంగ్లిష్ పాత్ర చాలా కీలక మైంది. న్యాయ వ్యవస్థను అదుపు చేస్తున్న యంత్రాంగాలను మార్చా లంటే వీధిపోరాటాలు లేదా పార్లమెంటరీ గావుకేకలు సాయపడవు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఎంపీలు సంఖ్యరీత్యా మెజా రిటీగా ఉన్నప్పటికీ, అగ్రవర్ణ పేదలకు కోటా వంటి అంశాల్లో పాలక వర్గాలు చట్టాలను లేదా రాజ్యాంగ సవరణలను శరవేగంతో రూపొం దిస్తున్నాయి. కాంగ్రెస్ హయాంలో కూడా ఇది జరిగినప్పటికీ ఆర్ఎస్ఎస్, బీజేపీకి ప్రస్తుతం పూర్తి మెజారిటీ ఉన్నందున వీటిని మరింత తెలివిగా అమలు చేస్తూవస్తున్నాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్పై రివ్యూ పిటిషన్ గురించి ప్రస్తుతం మాట్లాడుతున్నప్పటికీ, చాలావరకు అదే తీర్పును భాషాపరమైన మార్పులతో తిరిగి రాయడమే జరుగుతుంది. కాబట్టి ఈ సమస్య మరెక్కడో ఉంది. బార్లో కానీ, ధర్మాసనంలో కానీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మేధావులు పెద్దగా ఉండటం లేదు. లేదా న్యాయపరమైన జిత్తులను అర్థం చేసుకోలేనంత బలహీనంగా ఉంటున్నారు. వీటిని సరిగా అర్థం చేసుకుని, ఉత్పాదక కులాలు ఇంతకాలం సాధించింది ఏమీలేదని దేశం మొత్తానికి నచ్చజెప్పగలిగిన అంబేడ్కర్ లాంటి ప్రతిభావంతు లైన న్యాయ నిపుణులు ఈ కులాల్లోంచి పుట్టుకురావలసిన అవసరం ఉంది. జాట్, పటేల్, రెడ్డి, కమ్మ, వెలమ, నాయర్, బెంగాల్లోని నామ్శూద్రుల వంటి ఓబీసీ రిజర్వేషన్ పరిధిలో లేని శూద్రుల విషయంలో సమస్య ఏమిటంటే, తమ యువతకు కాసిన్ని సీట్లు, ఉద్యోగాలు వస్తాయని ఆశించి వారు ఇలాంటి విధానాలను బల పరుస్తున్నారు. కానీ గత రెండేళ్లుగా 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజ ర్వేషన్ని అమలు చేస్తున్న రాష్ట్రాల్లో, కేంద్ర స్థాయిలో సీట్లు, ఉద్యో గాలకు సంబంధించిన డేటాను చూసినట్లయితే వారు నిజంగా లబ్ధి పొందినట్లు కనిపించడం లేదు. ఇక్కడ కూడా ఎగువ తరగతి శూద్రు లపై విద్యాపరమైన ఆధిక్యత కలిగిన ద్విజ కులాలవారే లబ్ధి పొందుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో శూద్ర ఎగువ తరగతి కులాలు పాలిస్తున్నప్పటికీ జాతీయ మేధారంగాల్లో వీరు ఎలాంటి నిర్ణయాత్మక పాత్రను పోషించడం లేదు. చివరకు 8 లక్షల ఆదాయ పరిమితితో అమలవుతున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని కూడా పూర్తిగా ద్విజులే ఉపయోగించుకుంటారు. ఇకముందు కూడా అనేక సంవత్సరాల పాటు విద్యారంగంలో ఓబీసీ క్రీమీ లేయర్, ఇతర శూద్ర కులాల వారు కూడా ద్విజ యువతతో పోటీ పడలేరన్నది వాస్తవం. రిజర్వేషన్లు, అవినీతి అనేవి భారతదేశ వెనుకబాటుతనానికి ప్రధాన కారణాలు అంటూ ద్విజ న్యాయవ్యవస్థలో పాతుకుపోయిన బలమైన అభిప్రాయాలనే సుప్రీంకోర్టులో మెజారీటీ తీర్పు ప్రతిఫ లించింది. కాబట్టి రిజర్వేషన్ వ్యవస్థను క్రమంగా ఎత్తివేయా లని వీరు చెబుతారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందినవారు తిండి తింటే బల హీనపడతారు, వీరు ఆకలి దప్పులతో ఉంటే దేవుడు వారికి మరింత శక్తిని ఇస్తాడు అని వారిచేతనే నమ్మింపజేస్తారు. చాలామంది ఇలాంటి థియరీలను నమ్ముతున్నారు కూడా. సైన్స్ ఒక మూఢనమ్మకం, రాజ్యాంగం ఒక బ్రాంతి అనే భావాలను కూడా వీరు వ్యాప్తి చెంది స్తారు. సుప్రీంకోర్టు తాజా తీర్పు దీనికి ఒక ఉదాహరణ. ప్రొ.కంచ ఐలయ్య షెపర్డ్, వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
వారికి రిజర్వేషన్లు సహేతుకం కాదు!
ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదల (ఈడబ్ల్యూఎస్)కు పదిశాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ 2019 జనవరి 8న పార్లమెంట్ చేసిన 103వ రాజ్యాంగ సవరణను సమర్థిస్తూ సుప్రీం కోర్ట్ 2022 నవంబర్ 7న తీర్పు ఇచ్చింది. దీంతో రిజర్వేషన్ అంశం దేశ వ్యాప్తంగా మరోసారి చర్చకు వచ్చింది. ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు. లలిత్, జస్టిస్ రవీంద్రభట్లు ఈడబ్ల్యూఎస్ కోటాను విభేదించగా... జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ బేలా ఎం త్రివేది సమర్థించారు. మొత్తం మీద 3:2 మెజారిటీతో 103వ రాజ్యాంగ సవరణను సమర్థిస్తూ ఎస్సీ, ఎస్టీ బీసీలు కాని వారిలో పేదలు... అనగా అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీర్పునివ్వడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ దేశంలో తరతరాలుగా సామాజికంగా, విద్యాపరంగా; అంటరానితనం, వివక్షతలను అనుభవిస్తున్న కులాలకు కల్పించవలసిన రిజర్వేషన్లు... ఆర్థికపరంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు 10 శాతం కల్పించడం రాజ్యాంగ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమనీ, ఆ సవరణను రద్దు చేయాలనీ సుమారు 40 మంది సుప్రీం కోర్టులో కేసులు వేశారు. జస్టిస్ యు.యు. లలిత్ కుమార్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు బెంచ్ విచారణ సమయంలో దీన్ని ప్రభుత్వం సమర్ధించుకుంటూ... ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇంతకు ముందే రిజర్వేషన్లు కల్పిస్తున్నందున వారికి కేటాయించిన 50 శాతం కోటాకు ఈ 10 శాతం అదనంగా ఉంటుందనీ, వీటితో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధం లేదనీ, ఇది రాజ్యాంగబద్ధమే అనీ చెప్పింది. ఈ కోర్టు తీర్పు రాగానే అధికార, ప్రతిపక్ష, వివిధ రాజకీయ పార్టీలు క్రెడిట్ మాదంటే మాది అని ప్రకటించుకోవడం సిగ్గుచేటు. 103వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఆర్టికల్ 15 (6), 16 (6) క్లాజు లను చేర్చడం ద్వారా దేశ జనాభాలో 8 నుంచి 10 శాతం ఉన్న అగ్ర వర్ణాలకు అందులో కేవలం మూడు శాతం ఉన్న పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం ఏ విధంగా సబబు అని ప్రశ్నిస్తున్నారు. ఎస్సీ, ఎసీ,్ట బీసీలలో ఉన్న నిరుపేదలు పేదలు కాదా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలలో ఎలాంటి స్థిరాస్తులు కలిగి లేకుండా ఏడాదికి రూ. 2.5 లక్షల ఆదాయం ఉన్న వారిని పేదలుగా గుర్తించినప్పుడు... అగ్రవర్ణాలకు మాత్రం 5 ఎకరాల లోపు భూమీ, సంవత్సరాదాయం రూ. 8 లక్షల లోపు ఆదాయం... అంటే నెలకు 60 వేల ఆదాయం ఉండా లని నిర్ణయించడం వివక్ష కాదా? నెలకు 60 వేల ఆదాయం సంపాదించే వారు ఎలా పేదలవుతారో తెలపాలి. పేదలు ఎవరైనా పేదలే అన్న ప్పుడు ఈ వివక్ష ఎందుకో సమాధానం చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎస్సీలలో 38 శాతం, ఎస్టీలలో 48.4 శాతం, బీసీలలో 13.8 శాతం, ఓసీలలో 3 శాతం పేదలు ఉన్నారు. పేదరికం, ఆర్థిక వెనుకబాటు ఆధారంగా ఓసీలలో ఉన్న మూడు శాతం పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలలో ఉన్న పేదలకు ఎందుకు ఇందులో అవకాశం ఇవ్వరు? వీరు పేదలు కాదా? కేవలం అగ్రవర్ణాల్లోనే పేదలుంటారని ఈడబ్ల్యూఎస్ కోటా నుండి ఎస్సీ, ఎస్టీ, బీసీలను తప్పించడం రాజ్యాంగం లోని ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వపు హక్కును కాలరాయడమే. ఆర్థిక ప్రాతిపదికన రిజర్వే షన్లను కొందరికే ఎలా వర్తింపచేస్తారని రాజ్యాంగ నిపుణులు అంటు న్నారు. ఉదాహరణకు దివ్యాంగులకు ఏ కులం వారికైనా రిజర్వేషన్లు కల్పిస్తున్నప్పుడు. నిరుపేదలు ఏ కులంలో ఉన్నా ఈడబ్ల్యూఎస్ రిజ ర్వేషన్లు వర్తింపజేయాలి కదా! ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం 52 శాతం ఉన్న బీసీలకు వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వలేదు. పైపెచ్చు 1992లో ఇందిరా సహాని కేసులో తొమ్మిది మంది సభ్యులు గల సుప్రీంకోర్టు బెంచ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రభుత్వం ఇస్తున్న రిజర్వేషన్లు 50 శాతానికి దాటడానికి వీలులేదని తీర్పునిచ్చింది. ఇదే సందర్భంలో ప్రమోషన్లలో రిజర్వేషన్లను కూడా తొలగించి, బీసీలకు క్రిమిలేయర్ ని వర్తింపజేసింది. దేశంలో 49.5 శాతం రిజర్వేషన్లు అమలవుతుండగా ప్రస్తుత ఈడబ్ల్యూఎస్లకు ఇస్తున్న 10 శాతం కలిపితే 59.5 శాతం అవుతున్నది. అయితే ఓ న్యాయమూర్తి 50 శాతం అనేది లక్ష్మణరేఖ కాదని పేర్కొనడం విశేషం. ఎస్సీ, ఎస్టీలకు ప్రమోషన్లలోనూ అనేక అన్యాయాలు జరగుతు న్నాయి. 2018లో హైకోర్టు జీవో నంబర్ 26ను సమర్థిస్తూ ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లు కల్పించాలని తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ గత సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 26ను తొలగిస్తూ జీవో నంబర్ 247ను తీసుకు రావడం జరిగింది. దీనివల్ల దళిత, గిరిజన ఉద్యోగుల ప్రమోషన్లకు అడ్డుకట్ట వేయడం జరిగింది. ఇదిలా ఉండగా మరో అన్యాయాన్ని గమనిస్తే (ఈడబ్ల్యూఎస్) అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు కేటాయించడం వల్ల ఓపెన్ కేటగిరిలో వచ్చే ఎస్సీ, ఎస్టీ, బీసీలు పది శాతం రిజర్వేషన్లు కోల్పోవడం జరుగుతుంది. ఇటీవలే జరిగిన కానిస్టేబుల్ నియామకాల ప్రక్రియలో ‘రూల్ ఆఫ్ రిజర్వేషన్’ పాటించక పోవడం వల్ల అన్యాయానికి గురైన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు తీవ్ర ఆందోళన చేయడం... ఈ అంశం అసెంబ్లీలో చర్చకు రావడం వల్ల తిరిగి వాటిని సరిచేయడం జరిగింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఉద్యోగ నియమకాల ఫలితాలలో ఎస్సీలకు –82.50, ఎస్టీలకు –76.50, బీసీ లకు 110.50, ఈడబ్ల్యూఎస్ (ఓసీ)లకు – 51.25 మార్కులు కటాఫ్ మార్కులుగా కేటాయించారు. ఇలా నిరుపేదలు, వికలాంగుల కంటే కూడా ఈడబ్ల్యూఎస్ (ఓసీ)లకు తక్కువ కటాఫ్ మార్కులు కేటాయిం చడం అన్యాయం. ఈ విధంగా కూడా దళిత గిరిజనులకు, బహుజను లకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఇలా ఒక్కొక్కటిగా రాజ్యాంగ రక్షణలు అన్నిటిని కూడా పెకిలించివేస్తున్న చర్యలను వివిధ సామాజిక వర్గాల మేధావులు తీవ్రంగా ఖండిస్తున్నారు. సామాజిక వెనుకబాటే ఆర్థిక వెనుకబాటుకు కారణం కాబట్టి ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వ సాధన కోసం సామాజికంగా, విద్యా పరంగా... వివక్ష, అంటరానితనం అనుభవిస్తున్న ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్స్ కల్పించడం జరిగింది. రిజర్వేషన్లు ఆర్థిక ఉద్దీపన కోసం కాదన్న విషయం గమనించాలి. కాబట్టి ఆర్థిక వెనుకబాటు కారణంగా రిజర్వేషన్లు కల్పించలేమన్న విషయాన్ని గుర్తించాలి. అగ్రవర్ణ పేదలపై ఎవరికీ వ్యతిరేకత లేదనేది గమనించాలి. వారి ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వాలు రకరకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తానంటే కాదనేది ఎవరు? ఆ దిశలో కృషి చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది. (క్లిక్ చేయండి: రాష్ట్రాల వృద్ధిలో కేంద్రం పాత్రేమిటి?) - బైరి వెంకటేశం రాష్ట్ర అధ్యక్షులు, ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి, తెలంగాణ -
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై స్టాలిన్ సర్కార్ సంచలన నిర్ణయం!
సాక్షి, చెన్నై: ఆర్థికంగా వెనుకబడిన జనరల్ కేటగిరిలోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లను తమిళనాడులో అమలు చేసే ప్రసక్తే లేదని అఖిలపక్ష సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా పునఃసమీక్ష పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు. సామాజిక న్యాయమే లక్ష్యంగా తమ కార్యాచరణ ఉంటుందని సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు. వివరాల ప్రకారం.. ఆర్థికంగా వెనుకబడిన జనరల్ కేటగిరీలోని పేదలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పనకు కేంద్రం తీసుకున్న చర్యలకు బలాన్ని కలిగించే విధంగా సోమవారం సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును డీఎంకేతో పాటు కొన్ని పారీ్టలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో ఈ తీర్పుపై చర్చించి తదుపరి చర్యలకు అఖిల పక్ష సమావేశానికి సీఎం స్టాలిన్ నిర్ణయించారు. అఖిల పక్షం సమావేశంలో సుదీర్ఘ చర్చ డీఎంకే ప్రభుత్వ పిలుపునకు ఆ పార్టీ మిత్రపక్షాలు కదిలాయి. అసెంబ్లీలోని 13 పారీ్టల ప్రతినిధులకు ఆహా్వనం పంపించగా, అన్నాడీఎంకే, బీజేపీ సభ్యులు గైర్హాజరయ్యారు. సచివాలయంలో శనివారం ఉదయం 10 గంటల నుంచి గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. ఇందులో కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత సెల్వ పెరుంతొగై, ఎమ్మెల్యే హసన్ మౌలానా, ఎండీఎంకే నేత, ఎంపీ వైగో, సదన్ తిరుమలైకుమార్, వీసీకే నేతలు, ఎంపీలు తిరుమావళన్, రవికుమార్ సీపీఐ నేత ముత్తరసన్, తమిళర్ వాల్వురిమై కట్చి నేత వేల్ మురుగన్, కొంగునాడు మక్కల్ దేశీయ కట్చి నేతలు చిన్న రాజ్, సూర్యమూర్తి, పురట్చి భారతం కట్టి నేత జగన్ మూర్తి, మనిద నేయ మక్కల్ కట్చి నేత జవహరుల్లా, డీఎంకే తరపున మంత్రులు దురై మురుగన్, పొన్ముడి, రఘుపతి, సీఎస్ ఇరై అన్భు ఈ సమావేశానికి హాజరయ్యారు. సీఎం స్టాలిన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అన్ని పారీ్టలు తమ తమ అభిప్రాయా లను వ్యక్తం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు మద్దతుగా ఉంటామని ప్రకటించాయి. తీర్మానాలు.. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, తీర్మానాలను మంత్రి పొన్ముడి మీడియాకు వివరించారు. వెనుకబడిన తదితర సామాజిక వర్గాలకు తమిళనాట కేటాయిస్తున్న 69 శాతం రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. కేంద్రం పేర్కొంటున్న 10 శాతం రిజర్వేషన్ తమిళనాటు అమలు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఆయా పారీ్టల ప్రతినిధుల సూచనలు, అభిప్రాయాల మేరకు తీర్మానాలు చేశామని తెలిపారు. జాతీయస్థాయిలో కొన్ని పారీ్టలు 10 శాతం రిజర్వేషన్కు మద్దతు ఇచ్చి ఉన్నా, అదే పార్టీలు తమిళనాడులో మాత్రం ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడుతామని ప్రకటించడం అభినందనీయమని కొనియాడారు. సుప్రీంకోర్టు తీర్పుపై పునః సమీక్ష పిటిషన్ దాఖలు చేయనున్నామని, బలమైన వాదనలు కోర్టు ముందు ఉంచుతామని వివరించారు. గతంలో ఈ రిజర్వేషన్లను వ్యతిరేకించిన అన్నాడీఎంకే, ఇప్పుడు అనుకూలంగా వ్యవహరించడం శోచనీయమని విమర్శించారు. తమిళనాడులో సామాజిక న్యాయమే లక్ష్యమని, 10 శాతం రిజర్వేషన్లకు ఇక్కడే చోటు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కాగా సామాజిక న్యాయం కోసం ఎంత వరకైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈ సమావే శంలో సీఎం స్టాలిన్ ప్రకటించడం గమనార్హం. -
‘కోటా’ తీర్పుతో కొత్త ప్రశ్నలు
ఆధిపత్య కులాల్లోని నిరుపేదలకు పదిశాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం 2019లో తీసుకున్న నిర్ణయం సరైందేనని అయిదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మా సనం సోమవారం వెలువరించిన మెజారిటీ తీర్పు సహజంగానే పలు ప్రశ్నలను రేకెత్తించింది. రాజ్యాంగంలోని 15, 16 అధికరణలకు కొత్త క్లాజులు చేరుస్తూ తీసుకొచ్చిన 103వ సవరణ రాజ్యాంగ బద్ధతపై దాఖలైన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు. లలిత్, జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ బేలా ఎం. త్రివేది, జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ రవీంద్ర భట్లతో కూడిన ధర్మాసనం విచారించింది. తరతరాలుగా సామాజిక అణచివేతకూ, వివక్షకూ గురవుతూ అన్ని విధాలుగా వెనకబడివున్న కులాలకు రిజర్వేషన్లు కల్పించాలని మన రాజ్యాంగ నిర్మాతలు నిర్దే శించగా నిరుపేదలకు కల్పించిన కోటా ఇందుకు విరుద్ధంగా ఆర్థిక వెనకబాటుతనాన్ని ప్రాతిపది కగా తీసుకుంది. సారాంశంలో కోటా కల్పనకు ఒక వర్గాన్నీ, దాని సామాజిక స్థితిగతులనూ కాక వ్యక్తిని పరిగణనలోకి తీసుకుంది. పైగా ఈ కోటానుంచి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పేదలను మినహా యించింది. ఇది సరైందేనని మెజారిటీ తీర్పు అంటుండగా, మైనారిటీ తీర్పు నిరుపేదలకు కోటా కల్పనను సమర్థిస్తూనే దాన్నుంచి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పేదలను మినహాయించటం రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించటమేననీ, రాజ్యాంగాన్ని బలహీనపరచటమేననీ స్పష్టం చేసింది. తన ఆధ్వర్యంలోని ధర్మాసనంలో మెజారిటీ తీర్పునిచ్చిన సభ్యుల్లో ప్రధాన న్యాయమూర్తి ఒకరుగా లేకపోవటం చాలా అరుదు. పదవీ విరమణ చేయబోతున్న జస్టిస్ లలిత్ అసమ్మతి తీర్పు వెలువ రించిన ఇద్దరిలో ఒకరై ఆ రికార్డు నెలకొల్పారు. కులంతో సంబంధం లేకుండా నిరుపేద వర్గాలన్నిటికీ అవసరమైన సదుపాయాలు కల్పిం చటం, ఆ వర్గాల ఎదుగుదలకు దోహదపడటం తప్పేమీ కాదు. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు అందుకు అవకాశ మిస్తున్నాయి. కానీ పేద వర్గాలకు కోటా ఇవ్వాలంటే ఆ వర్గాలు పేదరికం కారణంగా సామాజి కంగా ఎటువంటి వివక్షనూ, అణచివేతనూ ఎదుర్కొంటున్నాయన్నది... ఒక వ్యక్తి ఎదుగుదలకు ఆర్థిక అననుకూలత ఎలా అవరోధంగా ఉందన్నది నిగ్గు తేల్చవలసిన అవసరం ఏర్పడుతుంది. దాన్ని గణించటం సాధ్యమా? పైగా నిరుపేద వర్గాలను ఉద్ధరించటం కోసం కోటా ఉద్దేశించామని చెబుతూ అత్యంత నిరుపేద వర్గాలు అధికంగా ఉండే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలను దాన్నుంచి మినహాయించటం సరైందేనా? ఆ వర్గాలు ఇప్పటికే రిజర్వేషన్ల ఫలాలను అనుభవిస్తు న్నాయన్న కారణంతో ఇలా మినహాయించటం సరికాదని మైనారిటీ తీర్పునిచ్చిన న్యాయమూర్తులు వ్యక్తం చేసిన అభిప్రాయం సహేతుకమైనదన్న భావన కలగదా? అంతేకాదు... గతంలో మండల్ కమిషన్ కేసులో తొమ్మిదిమంది న్యాయమూర్తుల రాజ్యాంగ« ధర్మాసనం ఇచ్చిన మెజారిటీ తీర్పు రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని మించరాదని స్పష్టం చేసింది. దాని ప్రాతిపదికనే రాష్ట్ర ప్రభు త్వాలు కొత్తగా ఇచ్చే కుల రిజర్వేషన్లను వివిధ హైకోర్టులు, సుప్రీంకోర్టు ఇంతవరకూ కొట్టివేస్తూ వచ్చాయి. కానీ తాజాగా మెజారిటీ సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పు 50 శాతం కోటా పరిమితి మార్చడానికి వీల్లేనిది కాదంటున్నది. ఆ తీర్పు కులప్రాతిపదికన ఇస్తున్న కోటాకే వర్తిస్తుందని భాష్యం చెబుతోంది. ఇది కొత్తగా రిజర్వేషన్లు కోరుకుంటున్న వర్గాలనుంచి తామరతంపరగా డిమాండ్లు పుట్టుకురావటానికి దోహదపడదా? నిజానికి తొలిసారి 1991లో అప్పటి ప్రధాని పీవీ జనరల్ కేటగిరీలోని పేదలకు పదిశాతం కోటా నిర్ణయం తీసుకున్నారు. కానీ సుప్రీంకోర్టు అప్పట్లో ఈ నిర్ణయాన్ని కొట్టేసింది. ఆర్థిక అసమానతలు పీడిస్తున్నప్పుడు సహజంగానే బాధిత వర్గాలు ప్రభుత్వాల నుంచి ఆసరా కోరుకుంటాయి. దేశంలో ఆర్థిక సంస్కరణల అమలు తర్వాత సాగిన అభివృద్ధికి సమాంతరంగా సంక్షోభం కూడా బయల్దేరింది. చేతివృత్తులపై ఆధారపడి జీవించే అట్టడుగు కులాలతోపాటు వ్యవ సాయంపై ఆధారపడే కులాలు సైతం ఒడిదుడుకుల్లో పడ్డాయి. అందుకే రిజర్వేషన్లు పొందుతున్న వర్గాల్లోని అత్యంత వెనకబడిన కులాలు వర్గీకరణ కావాలని ఉద్యమించటం మొదలుపెడితే... మొదటినుంచీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్న వర్గాలు తమకూ వాటిని వర్తింపజేయాలన్న డిమాండ్తో ముందుకొచ్చాయి. ఇక క్రీమీ లేయర్ వాదన సరేసరి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, దానిపై తాజాగా సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు సహజంగానే దళిత, ఓబీసీ వర్గాల్లో కలవరం కలిగించాయి. అందుకే మైనారిటీ తీర్పు వ్యక్తంచేసిన అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని కేంద్రం ఆ వర్గాలకు తగిన భరోసానివ్వాలి. అంతకన్నా ముందు అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మానసపుత్రికలైన ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ వంటివి, ప్రస్తుతం ఏపీలో ఇస్తున్నట్టు వివిధ వృత్తులవారికి ఏటా నిర్ణీత మొత్తంలో నగదు అందించే పథకాలవంటివి అమలు చేసే అంశాన్ని పరిశీలించాలి. ఇప్పటికే ఉన్న వాటిని మరింత మెరుగుపరచాలి. ఎటూ ప్రభుత్వరంగంలో ఉద్యోగాలు కుంచించుకుపోయా యన్నది వాస్తవం. కనుక కోటాలవల్ల ఆచరణలో పెద్దగా ఫలితం ఉండదు. ప్రభుత్వ రంగాన్ని విస్తరిస్తే, తయారీ రంగ పరిశ్రమల స్థాపనకు నడుం బిగిస్తే నిరుద్యోగం నియంత్రణలో ఉంటుంది. పేదరికం అంతరిస్తుంది. కేంద్రం ఈ సంగతి ఆలోచించాలి. -
రిజర్వేషన్ల పెంపు చరిత్రాత్మక నిర్ణయం
మహబూబాబాద్ అర్బన్: బంజారా ఆదివాసీ, గిరిజనుల రిజర్వేషన్లు పెంపు దేశంలోనే ఒక చరిత్రాత్మక నిర్ణయమని రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు తర్వాత గిరిజనుల జనాభా మేరకు రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ దాన్ని నిలబెట్టుకున్నారని చెప్పారు. పోడుభూముల విషయంలోనూ సీఎం సానుకూల నిర్ణయం తీసుకుని సాగుదారులకు భూమి హక్కు పత్రాలు ఇవ్వాలని నిర్ణయించారని వెల్లడించారు. గిరిజనులకు ఏ ప్రభుత్వం అందించని అనేక పథకాలను అమలు చేస్తూ గిరిజనులకు సీఎం కేసీఆర్ ఆరాధ్యుడిగా మారారని, తనకు తల్లిదండ్రులు జన్మనిస్తే.. కేసీఆర్ తనకు పునర్జన్మనిచ్చారని, జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటానంటూ కన్నీటిపర్యంతమయ్యారు. -
దివ్యాంగులకు రిజర్వేషన్లు పెంచి మానవత్వం చూపిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో దివ్యాంగులకు రిజర్వేషన్లను మూడు నుంచి నాలుగు శాతానికి పెంచి మానవత్వం చూపారని అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. దివ్యాంగులకు రిజర్వేషన్లు పెంచాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో త్వరలో వందలాదిమంది దివ్యాంగులతో సీఎం వైఎస్ జగన్ను కలిసి కృతజ్ఞతలు చెబుతామని తెలిపారు. సీఎం నిర్ణయం పట్ల రాష్ట్రంలోని సుమారు పదిలక్షల మంది దివ్యాంగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. చదవండి: (22న సీఎం వైఎస్ జగన్ కుప్పం పర్యటన) -
ఈడబ్ల్యూఎస్కు 10 శాతం కోటా..రాజ్యాంగబద్ధమేనా?
సాక్షి, న్యూఢిల్లీ: విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు(ఈడబ్ల్యూఎస్) 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు అవుతుందో కాదో తొలుత పరిశీలిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. ముస్లింలకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు(కోటా) కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోపాటు పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం దృష్టి సారించింది. సెప్టెంబర్ 6న విధానపరమైన ప్రక్రియ, ఇతర అంశాలను పరిశీలిస్తామని, సెప్టెంబర్ 13 నుంచి ఈ పిటిషన్లపై విచారణ ప్రారంభిస్తామని మంగళవారం స్పష్టం చేసింది. ఈడబ్ల్యూఎస్ కోటా, అనంతరం ముస్లిం రిజర్వేషన్ చట్టంపై విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలియజేసింది. ఈ రెండు అంశాలపై విచారణకు నోడల్ అడ్వొకేట్లుగా వ్యవహరించాలని నలుగురు న్యాయవాదులకు సూచించింది. చదవండి: అంధుడైన సాఫ్ట్వేర్ ఇంజనీర్కు.. మైక్రోసాఫ్ట్లో 47 లక్షల వేతనం -
BP Mandal: మండల్ దన్నుతో ఉద్యమించాలి!
ఇండియా జనాభాలో సగాని కన్నా ఎక్కువ ఉన్న వెనుక బడిన తరగతులవారు (బీసీలు)... తరతరాలుగా భారతీయ సమాజానికి సేవ చేస్తున్నారు. కానీ వారు మాత్రం అన్ని రంగాల్లో వెనక బడే ఉన్నారు. అందుకే బీసీల సామాజిక, ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేయడం కోసం 1953 జనవరిలో కాకా కలేల్కర్ కమిషన్ను అప్పటి ప్రభుత్వం నియమించింది. 1955 మార్చిలో కమిషన్ నివేదిక సమర్పించి బీసీల అభివృద్ధికి పలు సూచనలు చేసింది. ఆ నివేదికను ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. 1977లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక... కాక కలేల్కర్ కమిషన్ నివేదిక సమర్పించి చాలా ఏండ్లు అయిందని... కొత్త కమిషన్ను 1978 డిసెంబర్లో నియమించింది. దీనికి బిహార్ మాజీ ముఖ్య మంత్రి బీపీ మండల్ సారధ్యం వహించారు. మండల్ 1980 డిసెంబర్ 31న నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. కానీ దాని సూచనలు అమలుకు నోచుకోలేదు. దీంతో బీసీలంతా ఉద్యమించారు. బహుజన్ సమాజ్ పార్టీ ఉద్యమానికి అండగా నిలిచింది. చివరికి అప్పటి ప్రధాని వీపీ సింగ్ 1990 ఆగస్టు 7న మండల్ నివేదికను అమలు పరుస్తానని ప్రకటన చేశారు. ప్రధాని ప్రకటనతో దేశవ్యాప్తంగా ఆధిపత్య కులాలు ఆందోళనకు దిగాయి. అన్ని పార్టీలు మండల్ నివేదికకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేశాయి. బయట నుండి వీపీ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న బీజేపీ తన మద్దతును ఉపసంహరించి తానెవరి వైపో తేల్చి చెప్పింది. మండల్ కమిషన్ను అమలు చేయరాదని ఆధిపత్య కులాల వారు కోర్టును ఆశ్రయించారు. చివరకు 1993లో మండల్ నివేదిక అమలుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో బీసీలకు కేంద్ర విద్యాసంస్థల్లో, సర్వీసుల్లో 27 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. కేంద్ర రిజర్వేషన్ సౌకర్యం పొందే బీసీలను ‘అదర్ బ్యాక్వార్డ్ క్లాసెస్’ (ఓబీసీలు)గా వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద మండల్ కమిషన్ బీసీల అభివృద్ధికి 40 సూచనలు చేయగా అందులో ఒకటైన విద్యా, ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని మాత్రమే అమలుచేసి అప్పటి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. బీసీల అభ్యున్నతికి విలువైన సూచనలు చేసిన బీపీ మండల్ బీసీల మదిలో ఎప్పటికీ నిలిచిపోతారు. ఆయన 1918 ఆగస్టు 25న బిహార్ మధేపూర్ జిల్లా మోరో గ్రామంలో... రాస్ బీహారీ లాల్ మండల్ జమీందారీ కుటుంబంలో జన్మించారు. 1952 మొదటి సారిగా శాసనసభకు ఎన్నికైన మండల్ ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. రామ్ మనోహర్ లోహియా నాయకత్వంలో పనిచేసిన మండల్ 1967 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 69 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. దీంతో 1968 ఫిబ్రవరిలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. (క్లిక్: వారి విడుదల దేనికి సంకేతం?) బయట నుండి మద్దతునిచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకుల అవినీతిపై విచారణ జరిగితే... ఆ విచారణ నివేదికను బుట్టదాఖలు చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల్పై ఒత్తిడి చేసింది. అయినా నిజాయితీగా కాంగ్రెస్ అవినీతి నాయకులపై చర్య తీసుకున్నారు. దాంతో కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం కూలిపోయింది. నీతి కోసం నిలబడిన గొప్ప నాయకుడు బీపీ మండల్. 1974లో ఎమ్మేల్యే పదవికి రాజీనామా చేసి లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ నాయకత్వంలో అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని 1977లో జనతా పార్టీ తరఫున లోకసభకు ఎన్నికయ్యారు. కులాలుగా చీలిపోయి ఉన్న బీసీలు ఏకమై... పార్టీలకు, సంఘాలకు అతీతంగా ఐక్యమై బీపీ మండల్ కమిషన్ ఇచ్చిన స్థైర్యంతో ముందుకు సాగి తమ హక్కులను సాధించుకోవాలి. (క్లిక్: 75 ఏళ్లుగా ఉరుకుతున్నా... ఉన్నకాడే!) - సాయిని నరేందర్ బీసీ స్టడీ ఫోరం వ్యవస్థాపక చైర్మన్ (ఆగస్టు 25న బీపీ మండల్ జయంతి) -
‘ఎస్సీ’ వర్గీకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై కేంద్రంతోపాటు అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ అయిన తర్వాత విచారణ జాబితాలో చేర్చాలని ఆదేశించింది. ఎస్సీ వర్గీకరణ కోరుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీస్) దాఖలు చేసిన పిటిషన్ను సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ కృష్ణమురారి, జస్టిస్ హిమా కోహ్లిలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. ఎమ్మార్పీస్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్రోహత్గి వాదనలు వినిపిస్తూ.. ఎస్సీల్లో ఎక్కువ జనాభాగా ఉన్నప్పటికీ మాదిగ ఉపకులాలకు తగిన రిజర్వేషన్లు వర్తించడం లేదన్నారు. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ స్పందిస్తూ.. ఈ అంశంపై ఇప్పటికే ఈవీ చిన్నయ్య కేసులో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అయితే... ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఆలస్యం అవుతోందని, ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న వారికి మధ్యంతర పరిష్కారం ఇవ్వాలని కోరారు. అయితే కేసు విచారణ వేగవంతం చేయాలని రాజ్యాంగ ధర్మాసనాన్ని కోరలేమని, అదే కేసులో ఇంప్లీడ్ కావాలని పిటిషనర్కు సీజేఐ సూచించారు. ఉద్యోగాలు, విద్యా సంస్థల ప్రవేశాల్లో ఇబ్బందులు పడుతున్నారని రోహత్గి తెలపగా స్పందించిన సీజీఐ, ‘‘ఈ తరహా కేసులో విచారణ చేపట్టకుండా ఎవరైనా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తారా?’’అని న్యాయవాదిని ప్రశ్నించారు. అనంతరం ‘‘రాజ్యాంగ ధర్మాసనం కేసులో ఇంప్లీడ్ కావడానికి పిటిషనర్కు అనుమతిస్తున్నాం. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేస్తున్నాం. ప్రతివాదులకు నోటీసులు జారీ పూర్తయిన తర్వాత విచారణ జాబితాలో చేర్చాలి’’అని ధర్మాసనం ఆర్డర్లో పేర్కొన్నారు. వర్గీకరణతోనే న్యాయం: మంద కృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణతోనే మాదిగ ఉపకులాలకు న్యాయం జరు గుతుందని ఎమ్మార్పీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. బుధవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ... రెండు దశాబ్దాలుగా రిజర్వేషన్ల అమలు కోసం పోరాడుతున్నామన్నారు. -
9న చలో ఢిల్లీ, పార్లమెంట్ ముట్టడి: కృష్ణయ్య
ముషీరాబాద్ (హైదరాబాద్): అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, జనగణనలో కుల గణన చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 9న చలో ఢిల్లీ, పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం చేపడుతున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. శుక్రవారం విద్యానగర్లోని బీసీ భవన్లో బీసీ సేన జాతీయ సమావేశం సేన జాతీ య అధ్యక్షుడు బర్క కృష్ణయాదవ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణయ్య మాట్లాడుతూ బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ వైఎస్సార్ సీపీ పార్లమెంట్లో బిల్లు పెడితే అధికార బీజేపీ ఆమోదించకపోవడం బాధాకరమన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు సాధన కోసం బీసీ ఎంపీలందరూ పార్లమెంట్లో డిమాండ్ చేయాలని కృష్ణయ్య కోరారు. బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, బీసీ ఉద్యోగులపై క్రిమిలేయర్ను ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ రంగంలో బీసీ రిజర్వేషన్లు అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. బర్క కృష్ణయాదవ్ మాట్లాడుతూ బీసీల డిమాండ్లను ఆమోదించేంత వరకు ఢిల్లీలో పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో బీసీ సంఘాల నేతలు మాదప్ప, నాగరాజు, రాములుయాదవ్, అశోక్, అంజి తదితరులు పాల్గొన్నారు. -
రిజర్వేషన్లు కల్పించాలని సంచారజాతుల మహాధర్నా
కవాడిగూడ: తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, అస్థిత్వానికి ప్రతీక సంచార జాతులు అని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. 76 సంచార జాతుల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద సంచార జాతులకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో పది శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాడ్ చేస్తూ మహాధర్నా నిర్వహించారు. మహాధర్నాకు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణŠ కుమార్, ఆమ్ఆద్మీ పార్టీ తెలంగాణ కోఆర్డినేటర్ ఇందిరాశోభన్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అనంతరం ఎమ్మెల్యే ఈటల మాట్లాడుతూ... సంచార జాతుల కులం, ఊరు, వృత్తిని కూడా గుర్తించలేని వ్యవస్థ ఉండటం దారుణమన్నారు. సంచార జాతుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం వెంటనే రూ. 1000 కోట్ల నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ... సంచార జాతులను రాజ్యాంగబద్ధమైన కులాలుగా గుర్తించి విద్యాభివృద్ధికి తగు చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల సంఘం అధ్యక్షుడు ఒంటెద్దు నరేందర్ మాట్లాడుతూ... స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పది శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. రాష్ట్రంలో 40 లక్షలకు పైగా జనాభా ఉన్న సంచార జాతులకు నామినేటెడ్ ఎంపీ, ఎమ్మెల్సీ కోటాలో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. సంచార జాతుల స్థితిగతులను అధ్యయనం చేసేందుకు కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి తిరిపిశెట్టి శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, కోఆర్డినేటర్ సమ్మయ్య, అధికార ప్రతినిధి నాగరాజు పాల్గొన్నారు. -
Agnipath scheme: అగ్నివీరులకు మరో ఆఫర్
న్యూఢిల్లీ: నిరసనలను చల్లార్చేందుకు అగ్నిపథ్ పథకానికి కేంద్రం మార్పుచేర్పులు చేసింది. నాలుగేళ్ల సర్వీసు అనంతరం బయటికొచ్చే అగ్నివీరుల్లో అర్హులకు రక్షణ శాఖ ఖాళీల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ శనివారం ఆమోదముద్ర వేశారు. ఇండియన్ కోస్ట్ గార్డ్, డిఫెన్స్ సివీలియన్ పోస్టులతో పాటు రక్షణ శాఖ పరిధిలోని 16 ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ వారికి 10 శాతం రిజర్వేషన్లు అమలవుతాయి. అలాగే సెంట్రల్ ఆర్మ్డ్ పారా మిలటరీ ఫోర్స్ (సీఏపీఎఫ్), అసోం రైఫిల్స్లో కూడా అగ్నివీర్లకు 10 శాతం కోటా కల్పించే ప్రతిపాదనకు కేంద్ర హోం శాఖ కూడా ఆమోదముద్ర వేసింది. అంతేగాక వారికి గరిష్ట వయోపరిమితిని మూడేళ్లు పెంచింది. అగ్నిపథ్ నియామకాలకు ఈ ఏడాది గరిష్ట వయో పరిమితిని ఇప్పటికే రెండేళ్లు పెంచడం తెలిసిందే. ఆ లెక్కన తొలి బ్యాచ్ అగ్నివీర్లకు సీఏపీఎఫ్, అసోం రైఫిల్స్లో నియామకాలకు ఐదేళ్ల వయోపరిమితి సడలింపు వర్తిస్తుందంటూ హోం శాఖ ట్వీట్ చేసింది. వారికి మరిన్ని ఉపాధి కల్పన అవకాశాలు కల్పించడంలో భాగంగా ప్రభుత్వ బ్యాంకులు, ఆర్థిక సంస్థల చీఫ్లతో కేంద్ర ఆర్థిక శాఖ ఇప్పటికే చర్చలు జరిపింది. పెట్రోలియం శాఖలోనూ అవకాశాలు అగ్నివీరులను సర్వీసు అనంతరం హౌసింగ్, పెట్రోలియం శాఖల్లో తీసుకుంటామని ఆ శాఖల మంత్రి హరదీప్సింగ్ పురీ చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇప్పటికే అగ్నివీరులకు పలు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ప్రకటించాయి. పోలీసు, సంబంధిత సర్వీసుల్లో వారికి ప్రాధాన్యమిస్తామని యూపీ, మధ్యప్రదేశ్, అసోం పేర్కొన్నాయి. అద్భుత పథకం: కేంద్రం మెడిసిన్, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉపాధి హామీ ఎక్కడుంది: రాజ్నాథ్ అగ్నిపథ్ను కేంద్రం గట్టిగా సమర్థించింది. మాజీ సైనికాధికారులు తదితరులతో రెండేళ్ల పాటు విస్తృతంగా సంప్రదింపులు జరిపిన అనంతరమే ఏకాభిప్రాయంతో పథకానికి రూపకల్పన చేసినట్టు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వివరించారు. పథకంపై దేశవ్యాప్త ఆందోళనల నేపథ్యంలో త్రివిధ దళాధిపతులతో శనివారం ఆయన సమీక్ష జరిపారు. ‘‘సైనిక నియామక ప్రక్రియలో అగ్నిపథ్ విప్లవాత్మక మార్పులు తెస్తుంది. రాజకీయ అవసరాల కోసం కొందరు దీనిపై అపోహలు వ్యాప్తి చేస్తున్నారు. దాంతో ప్రజల్లో అయోమయం నెలకొంది. నాలుగేళ్ల తర్వాత బయటికొచ్చాక ఉపాధి హామీ లేదనడం సరికాదు. లక్షలు పెట్టి మెడిసిన్, ఇంజనీరింగ్ చదువుతున్న యువతకు కూడా ఉపాధి హామీ లేదు కదా!’’ అన్నారు. వారికి సైనికోద్యోగాలు రావు హింసాత్మక నిరసనలకు పాల్పడే వారికి సైనికోద్యోగాలకు దారులు శాశ్వతంగా మూసుకుపోతాయని ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి అన్నారు. కేసుల్లో ఇరుక్కుంటే పోలీస్ క్లియరెన్సులు రావన్నారు. -
చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి
సాక్షి, న్యూఢిల్లీ: చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని వైఎస్సార్సీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. న్యాయవ్యవస్థలోను రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి వినతిపత్రం అందజేశారు. వైఎస్సార్సీపీ ఎంపీలు పిల్లి సుభాష్చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావు, అయోధ్యరామిరెడ్డి బుధవారం ఢిల్లీలో ప్రధానమంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఓబీసీలకు జరుగుతున్న నష్టాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఎంపీలు బోస్, వెంకటరమణారావు ఏపీ భవన్లో మీడియాతో మాట్లాడారు. చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, న్యాయవ్యవస్థలోను అమలు చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. తొలుత బీసీ జనగణన చేయాలని, లేకుంటే రాజ్యాంగ సవరణకు అవకాశం ఉండదని చెప్పామన్నారు. ఇంకా వారేమన్నారంటే.. ► న్యాయవ్యవస్థలోను రిజర్వేషన్లు అమలు చేయాలని కోరాం. సుప్రీంకోర్టులో ఇప్పటివరకు ఎస్సీ వర్గానికి చెందిన ఐదుగురు మాత్రమే న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. 14 హైకోర్టుల్లో 75 ఏళ్లలో ఒక ఎస్సీ వర్గానికి చెందిన న్యాయమూర్తి కూడా లేరు. మేజిస్ట్రేట్ కోర్టు నుంచి ఆ రిజర్వేషన్లు అమలు చేయాలని విజ్ఞప్తి చేశాం. బీసీలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా గుర్తింపు రాలేదని తెలిపాం. ► కాకినాడ–అమలాపురం రోడ్డును కత్తిపూడి నుంచి ద్రాక్షారామం, కోటిపల్లి మీదుగా అమలాపురం వరకు నిర్మించాలని, దీనికి గోదావరిపై వంతెన నిర్మించాలని కోరాం. -
అందరిలానే.. వారూనూ..
సాక్షి, అమరావతి: ట్రాన్స్జెండర్ల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మూడు నెలల్లో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ట్రాన్స్జెండర్లను సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతిగా గుర్తించి వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఎంత మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు? ప్రభుత్వ ఉద్యోగాల్లో వారి ప్రాతినిధ్యం ఎంత మేర ఉంది? వివక్ష చూపకుండా వారికి ఏ రకమైన ప్రయోజనాలను కల్పిస్తున్నారు? వారికి ఎంత మేర రిజర్వేషన్ కల్పించాలి? తదితర అంశాలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి, మూడు నెలల్లో సుప్రీంకోర్టు ఆదేశాల అమలుకు చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది. ఆడ, మగతో సమానంగా ట్రాన్స్జండర్లను కూడా చూడాల్సిన అవసరం ఉందంది. ఉద్యోగ నోటిఫికేషన్లలో ట్రాన్స్జెండర్ల కాలమ్ పెట్టకపోవడం అనాలోచిత చర్య అని హైకోర్టు ఆక్షేపించింది. అయితే ట్రాన్స్జెండర్లకు ప్రస్తుతం ఎలాంటి రిజర్వేషన్లు లేవని, అలాంటి పరిస్థితుల్లో ట్రాన్స్జెండర్ అయిన పిటిషనర్కు ఎస్ఐ పోస్టు ఇవ్వాలని ఆదేశించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్లు కల్పించలేదన్న కారణంతో ఎస్ఐ పోస్టుల భర్తీ కోసం పోలీసు నియామక బోర్డు 2018లో జారీ చేసిన నోటిఫికేషన్ చట్ట విరుద్ధమైనదిగా ప్రకటించడం సాధ్యంకాదని హైకోర్టు తెలిపింది. నోటిఫికేషన్ను చట్ట విరుద్ధంగా ప్రకటించాలంటూ ట్రాన్స్జెండర్ గంగాభవాని 2019లో హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ఇటీవల తీర్పు వెలువరించారు. పిటిషనర్ తరఫున న్యాయవాది ఎం.సొలొమన్రాజు వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు తీర్పు అమలుకు సిద్ధం.. ప్రభుత్వ న్యాయవాది వైఎన్ వివేకానంద వాదనలు వినిపిస్తూ, ట్రాన్స్జెండర్ల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. చిన్న అవకాశం కూడా ఇవ్వలేదు.. ‘సమాజంలో అణగారిన వర్గంగా ఉన్న ట్రాన్స్జెండర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిశ్చయాత్మక చర్యలు తీసుకోవాలి. ట్రాన్స్జెండర్లు శాపానికి గురైన వారిగా బతుకు వెళ్లదీస్తున్నారు. చాలా దీన, దయనీయ పరిస్థితుల మధ్య బతుకుతున్నారు. కొందరు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మానసికంగా, భౌతికంగా, లైంగికంగా వారు పలువురి చేతిలో వేధింపులకు గురవుతున్నారు. రాష్ట్రంలో వారి సంఖ్య చాలా తక్కువ. అయినా కూడా వారికి ఉద్యోగ అవకాశాల్లో వారి దామాషా ప్రకారం సమాన అవకాశాలు కల్పించడం లేదు. రాష్ట్రం వారిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. ఉద్యోగ దరఖాస్తులో తమ లింగం గురించి రాసే అవకాశం కూడా వారికి లేకుండా పోయింది. ఇవన్నీ కూడా స్త్రీ, పురుషులతో సమానంగా ఉద్యోగ అవకాశాలను నిరాకరించడం కిందకే వస్తాయి. 2017లోనే రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్జెండర్ల పాలసీ తీసుకొచ్చింది. 2019లో ట్రాన్స్జెండర్ల హక్కుల పరిరక్షణ చట్టం వచ్చింది. అయినా కూడా ఇవేవీ కూడా సమర్థవంతంగా అమలు కావడం లేదు. ట్రాన్స్జెండర్లను మన రాజ్యాంగం గుర్తించలేదు. అయితే మన పురాణాలు గుర్తించాయి. కురుక్షేత్ర సంగ్రామంలో భీష్మాచార్యుల మరణంలో శిఖండి కీలకపాత్ర పోషించిన సంగతి పురాణాల్లో ఉంది. ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్లు కల్పించాలని మాత్రమే సుప్రీంకోర్టు చెప్పిందే తప్ప, ఫలానా శాతం మేర రిజర్వేషన్లు కల్పించాలని చెప్పలేదు. పిటిషనర్ ఏ నోటిఫికేషన్ను సవాలు చేశారో ఆ నోటిఫికేషన్ అప్పటికి అమల్లో ఉన్న సర్వీసు నిబంధనలకు అనుగుణంగానే ఇచ్చారు. అందువల్ల ఆ నోటిఫికేషన్ను చట్ట విరుద్ధంగా ప్రకటించడం సాధ్యం కాదు.’ అని జస్టిస్ సత్యనారాయణమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. -
దళిత, గిరిజనులకు కేంద్రం చేసిందేంటి?
సాక్షి, హైదరాబాద్: దళిత, గిరిజనుల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏడున్నరేళ్లుగా చేసిందేమీ లేదని మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. గురువారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, హరిప్రియ నాయక్లతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. బీజేపీ నేతలు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, పోడు చట్టం కేంద్రం పరిధిలో ఉంటుందనే విషయం కూడా వారికి తెలియకపోవడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. పోడు భూములపై ముఖ్యమంత్రి కేబినెట్ సబ్ కమిటీ వేశారని, అర్హులైన వారికి భూ హక్కుల కల్పన కోసం తీసుకున్న దరఖాస్తులను త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ, పోడు భూముల హక్కుల కోసం నాలుగున్నర లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, ఈ సమస్యకు త్వరగా పరిష్కారం కావాలంటే కేంద్రంపై బీజేపీ నేతలు ఒత్తిడి పెంచాలన్నారు. -
‘ఈడబ్ల్యూఎస్’ కోటాలో ఆదాయ పరిమితి రూ.8 లక్షలు సమంజసమే
న్యూఢిల్లీ: ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్) వారికి రిజర్వేషన్ల వర్తింపు అర్హతపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేసింది. అభ్యర్థుల కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.8 లక్షలు, అంతకంటే తక్కువగా ఉండాలని త్రిసభ్య కమిటీ చేసిన సిఫార్సుల్ని ఆమోదించాలని నిర్ణయించినట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈడబ్ల్యూఎస్ను నిర్వచించడానికి కుటుంబ ఆదాయమే సరైన ప్రమాణంగా కమిటీ సిఫారసు చేసిందని, ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.8 లక్షలలోపు ఉండాలన్న సిఫార్సు సమంజసమైన పరిమితిగా భావిస్తున్నామని అఫిడవిట్లో పేర్కొంది. కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.8 లక్షల వరకు ఉన్న వారే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పొందడానికి అర్హులవుతారంది. రూ.8లక్షలు దాటితే క్రీమీలేయర్ వర్తింపజేస్తారు. ఆ కుటుంబాల వారు ఈడబ్ల్యూఎస్కు అనర్హులు. ఓబీసీ రిజర్వేషన్లకు గత 3 ఆర్థిక సంవత్సరాల వార్షిక ఆదాయం సరాసరిని పరిగణనలోకి తీసుకుంటుండగా ఈడబ్ల్యూఎస్కు గత ఆర్థిక సంవత్సరం ఆదాయాన్ని లెక్కలోకి తీసుకుంటున్నట్లు కేంద్రం తెలిపింది. కేంద్రం తరఫున సామాజిక న్యాయం, సాధికారిత శాఖ కార్యదర్శి సుబ్రహ్మణ్యం ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేశారు. నీట్–పీజీ అభ్యర్థులు వేసిన పలు పిటిషన్లపై స్పందించిన సుప్రీంకోర్టు ఈడబ్ల్యూఎస్ కోటా ఆదాయ అర్హత ప్రమాణాలను పరిశీలించాలని కేంద్రాన్ని ఆదేశించింది. దీంతో కేంద్రం విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ఉద్యోగాలు, నీట్–పీజీ కౌన్సిలింగ్ అర్హతకు కుటుంబ ఆదాయపరిమితిపై సిఫారసులు చేసేందుకు గత నవంబర్లో ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి వీకే మల్హోత్రా నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ గత ఏడాది డిసెంబర్ 31న తన నివేదికను కేంద్రానికి సమర్పించింది. ‘ఈడబ్ల్యూఎస్ కోటా అర్హతకు అభ్యర్థుల కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.8 లక్షలు, అంతకంటే తక్కువగా ప్రస్తుతమున్న విధానాన్ని కొనసాగించవచ్చు. అంతకుముందు సంవత్సరం కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.8 లక్షల వరకు ఉన్న వారు మాత్రమే ఈడబ్ల్యూఎస్ కోటాకు అర్హులవుతారు.’అని కమిటీ సిఫారసు చేసింది. ఈ సిఫారసును ప్రభుత్వం ఆమోదించడంలో జాప్యం కారణంగా నీట్–పీజీ–2021 కౌన్సెలింగ్ ఆలస్యం అయింది. దీంతో, ఢిల్లీ సహా దేశంలోని ఇతర ప్రాంతాల్లోని రెసిడెంట్ డాక్టర్లు ఆందోళనలకు దిగారు. న్యాయపరమైన అవరోధాలను తొలగించి, వెంటనే కౌన్సిలింగ్ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. నీట్–పీజీ కౌన్సెలింగ్ చేపట్టడంలో 8 నెలలపాటు జరిగిన జాప్యం కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న ఆస్పత్రుల్లో రెసిడెంట్ డాక్టర్లకు తీవ్ర కొరత ఏర్పడిందని వారు పేర్కొన్నారు. త్రిసభ్య కమిటీ ఇంకా ఏం చెప్పిందంటే.. ‘ప్రస్తుతమున్న కుటుంబ వార్షిక ఆదాయ పరిమితి రూ.8 లక్షలను భారీ ఆదాయంగా పరిగణించలేము. అందుబాటులో ఉన్న వాస్తవ ఫలితాలను బట్టి చూస్తే ఈ మొత్తం సమంజసమైందిగా ఉంది. సంవత్సరాదాయంలో వ్యవసాయ ఆదాయం, వేతనాలను కూడా కలిపిన విషయం గమనించాలి. ఆదాయంతో సంబంధం లేకుండా అయిదెకరాలు అంతకంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్న కుటుంబానికి చెందిన అభ్యర్థిని ఈ డబ్ల్యూఎస్ నుంచి మినహాయించవచ్చు. నివాస ఆస్తుల ప్రాతిపదికను తొలగించవచ్చు’అని పేర్కొంది. -
‘ప్రభుత్వ ఉద్యోగాల్లో కుల రిజర్వేషన్లు రద్దు చేయాలి’
షిమ్లా: ప్రభుత్వ ఉద్యోగాల్లో కుల ఆధారిత రిజర్వేషన్లను పూర్తి రద్దు చేయాలని హిమాచల్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు శాంత కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఫేస్బుక్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. కుల ఆధారిత కోటా వ్యవస్థను పూర్తిగా రద్దుచేసి, కుటుంబ ఆదాయం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. కుల ఆధారిత రిజర్వేషన్లపై దేశంలో 80 శాతం మంది విసుగెత్తిపోయారని అన్నారు. రిజర్వుడ్ కులాల్లోని పేదలు రిజర్వేషన్లతో పూర్తి లబ్ధి పొందలేకపోతున్నారని చెప్పారు. ఈ కేటగిరీలోని సంపన్నులు రిజర్వేషన్లతో లాభపడుతున్నారని శాంత కుమార్ ఆక్షేపించారు. రిజర్వేషన్ల నుంచి క్రీమీలేయర్ను మినహాయించాలన్న డిమాండ్ చాలా ఏళ్లుగా ఉందని గుర్తుచేశారు. రాజకీయ పార్టీల్లోని రిజర్వుడ్ కేటగిరీ నేతలు క్రీమీలేయర్ కిందకు వస్తారని వివరించారు. క్రీమీలేయర్ వర్గానికి రిజర్వేషన్లు వర్తింపజేయరాదంటూ సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు. ‘అంతర్జాతీయ ఆకలి సూచిక’లో 130 దేశాల్లో భారత్ 117 స్థానంలో ఉన్నట్లు తేలిందని వెల్లడించారు. దేశంలో 19.40 కోట్ల మంది ఆకలితో నిద్రిస్తున్నట్లు ఆ నివేదిక చెప్పిందన్నారు. వీరిలో 12 మంది కోట్ల మంది రిజర్వుడ్ కేటగిరీ ప్రజలేనని వివరించారు. కుల రిజర్వేషన్లతో ఆ వర్గంలోని పేదలు ప్రయోజనం పొందడం లేదన్న వాస్తవం అర్థమవుతోందని చెప్పారు. చదవండి: అంబేడ్కర్ను సరిగ్గా అర్థం చేసుకోవాలి! 50 శాతం మీ హక్కు: జస్టిస్ ఎన్వీ రమణ -
విప్లవంలా.. మహిళా సాధికారత: సీఎం వైఎస్ జగన్
ఎకనామికల్లీ బ్యాక్ వర్డ్ కమ్యూనిటీ (ఈబీసీ) వారికి కూడా మంచి చేయాలని వచ్చే జనవరి 9 నుంచి.. అంటే నా పాదయాత్ర ముగిసిన రోజు నుంచి ఈబీసీ నేస్తం అనే కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నాం. –సీఎం జగన్ సాక్షి, అమరావతి: మహిళా సాధికారతను రాష్ట్రంలో ఒక ఉద్యమంగా, విప్లవంగా చేపట్టినట్లు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. ఈ దిశగా ఈ రెండున్నరేళ్లు ఒక సువర్ణాధ్యాయమని.. అక్క చెల్లెమ్మలకు అన్నగా, తమ్ముడిగా సగర్వంగా తెలియజేస్తున్నానని స్పష్టం చేశారు. రాజకీయాలకు తావు లేకుండా మహిళలను మహరాణులుగా తీర్చిదిద్దుతున్న ప్రభుత్వం తమదన్నారు. మహిళా సాధికారతపై గురువారం శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. 44.50 లక్షల మంది తల్లులకు, వారి ద్వారా 85 లక్షల మంది పిల్లలకు కోసం జగనన్న అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టామని చెప్పారు. ఇందులో ఎక్కడా లంచాలు, వివక్షకు తావు లేకుండా ఈ రెండున్నరేళ్లలో అక్కచెల్లెమ్మలకు రూ.13,023 కోట్లు ఇచ్చామన్నారు. తద్వారా పిల్లలను బడులకు పంపించే గొప్ప విప్లవానికి నాంది పలికామని వివరించారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. నాడు పింఛన్ల బిల్లు రూ.400 కోట్లు.. నేడు రూ.1500 కోట్లు ► గతంలో ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు 44 లక్షల పింఛన్లు. నెలకు కేవలం రూ.400 కోట్లు పింఛన్ బిల్లు వచ్చేది. ఈ రోజు పింఛన్లు 61.73 లక్షలు. తొలి రోజు నుంచి రూ.2,250 ఇస్తున్నాం. ఈ రోజు ప్రతి నెలా పింఛన్ల బిల్లు రూ.1,500 కోట్లకు పైగా ఉంది. ► 61.73 లక్షల మందిలో 36.70 లక్షల మంది అవ్వలు, అక్కలు ఉన్నారు. రూ.21,899 కోట్లు వాళ్ల చేతుల్లో పెట్టాం. ప్రతి నెలా ఒకటో తారీఖున వలంటీర్ ద్వారా వారి చేతుల్లో పెడుతున్నాం. వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీతో పొదుపు సంఘాలకు ఆక్సిజన్ ► వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా 78.86 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు నాలుగేళ్ల కాలంలో జరిగే మేలు రూ.25,517 కోట్లు. ఈ రెండేళ్లలో రూ.12,758 కోట్లు వారి చేతుల్లో పెట్టాం. ► సున్నా వడ్డీ పథకం ద్వారా దాదాపుగా కోటి మంది అక్కచెల్లెమ్మలకు రూ.2,354 కోట్లు ఇచ్చాం. ఎన్నికల వేళ గత పాలకులు రుణాలు మాఫీ చేస్తామని మోసం చేస్తే.. పొదుపు సంఘాల గ్రూపుల ఎన్పీయేల శాతం 18.36కు పోయింది. ఏ గ్రేడ్ సంఘాలు సీ, డీ గ్రేడ్లకు దిగజారిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్ ఆసరా పథకం వాటికి ఆక్సిజన్గా నిలిచింది. వ్యాపారాలకు ఊతం ► వైఎస్సార్ చేయూత ద్వారా రెండేళ్లుగా ఏటా రూ.18,750 చొప్పున (మొత్తం నాలుగు దఫాలు) ఇస్తున్నాం. 24.56 లక్షల మంది 45 నుంచి 60 ఏళ్ల మధ్యలోనున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు అందించాం. ఇప్పటికి రెండు విడతలుగా రూ.8,944 కోట్లు ఇచ్చాం. ► బ్యాంకర్లతో, రిలయెన్స్, ఐటీసీ, అమూల్, హిందుస్తాన్ లీవర్, పీ అండ్ జీ వంటి పెద్ద పెద్ద సంస్థలతో అనుసంధానం చేసి 1.10 లక్షల మందితో రిటైల్ షాపులు పెట్టించాం. ఆవులు, గేదెలు కొనుక్కుని 1,34,103 మంది లబ్ధి పొందారు. మేకలు, గొర్రెలు ద్వారా 82,556 మందికి మేలు జరిగింది. కుప్పంలో దేవుడు మొట్టికాయలు వేశారు ► రాష్ట్ర వ్యాప్తంగా 13 వేల పంచాయతీలు ఉంటే, 17 వేల వైఎస్సార్ జగనన్న కాలనీలు ఉన్నాయి. 31 లక్షల ఇళ్ల పట్టాలు అందించాం. అంటే దాదాపు కోటి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు, ఇళ్లు కట్టించే కార్యక్రమం ఇది. ► 15.60 లక్షల ఇళ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నిర్మాణం పూర్తయితే ప్రతి అక్క, చెల్లెమ్మ చేతిలో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల ఆస్తి చేతిలో పెట్టినట్లవుతుంది. మొత్తంగా రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల కోట్ల సంపద వాళ్ల చేతిలో పెట్టినట్లవుతుంది. ఇలాంటి మంచి పథకాన్ని కోర్టుల ద్వారా అడ్డుకోవాలని చూస్తున్నందుకు దేవుడు కుప్పంలో మొట్టికాయలు వేశారు. పిల్లలకు మనమిచ్చే ఆస్తి చదువే ► జగనన్న విద్యా దీవెన ద్వారా 18.51 లక్షల మంది తల్లులకు రూ.5,573 కోట్లు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చాం. ► బోర్డింగ్ ఇతర ఖర్చుల కోసం జగనన్న వసతి దీవెన ద్వారా 15.57 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.2,270 కోట్లు జమ చేశాం. పిల్లలకు మనమిచ్చే ఆస్తి చదువే అని.. మనసా, వాచా ఒక గొప్ప ఉద్యమానికి నాంది పలికాం. గర్భిణులు, బాలింతలు, చిన్నారులపై శ్రద్ద ► వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాల ద్వారా గర్భిణులు, బాలింతలు, ఆరేళ్లలోపు పిల్లలందరికీ పౌష్టికాహారాన్ని అందించడమే ధ్యేయంగా పెట్టుకున్నాం. ఈ పథకాల ద్వారా 33.44 లక్షల మందికి మేలు జరుగుతుంది. రూ.2,972 కోట్లు ఖర్చు చేస్తున్నాం. వారు అన్ని విధాలా నిలదొక్కుకోవాలని.. ► నామినేటెడ్ పదవుల్లో, పనుల్లో 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేశాం. కేబినెట్లో హోంమంత్రిగా ఒక చెల్లికి, ఉప ముఖ్యమంత్రిగా మరో ఎస్టీ మహిళకు స్థానం కల్పించాం. ఎమ్మెల్సీలుగా ఇద్దరు మైనార్టీ మహిళలను, ఒక బీసీ మహిళను తీసుకొచ్చాం. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా చరిత్రలో తొలిసారిగా ఒక మహిళా అధికారిని నియమించాం. ► కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లలో మహిళలకు 51 శాతం పదవులిచ్చాం. మున్సిపల్ కార్పొరేషన్లు, మునిసిపాల్టీలు, నగర పంచాయతీల చైర్మన్లు, మేయర్ పదవులు, వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో సగభాగానికి పైగా వారికే ఇచ్చాం. 2.50 లక్షల మంది వలంటీర్లలో 53 శాతం మంది నా చెల్లెమ్మలే. 13 జెడ్పీ చైర్మన్లలో ఏడుగురు అక్కచెల్లెమ్మలే. వైస్ ఛైర్మన్లు 26 మందిలో 15 మంది వారే. మహిళా భద్రతే ముఖ్యం ► దిశా చట్టం చేసి, కేంద్రానికి ఆమోదం కోసం పంపాం. ఇవాళ దిశ యాప్ ద్వారా దాదాపు 90 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉన్నాం. ఈ యాప్ ద్వారా ఇప్పటి వరకు 6,880 మంది రక్షణ పొందారు. ► పలు చర్యల ద్వారా మద్య నియంత్రణ దిశగా అడుగులు వేస్తున్నాం. ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో మహిళా పోలీసు ఉన్నారు. దోషులకు త్వరగా శిక్షలు పడేలా చర్యలు తీసుకున్నాం. ► స్వేచ్ఛ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 10,388 పాఠశాలలు, ఇంటర్ కళాశాలల్లో టీనేజ్ బాలికలకు బ్రాండెడ్ శానిటరీ నాప్కిన్స్ను ఉచితంగా ఇస్తున్నాం. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. 97 శాతం ఆశీర్వాదం ► నిన్న 12 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్లో కౌంటింగ్ ముగిసింది. ఇందులో ఒక్కచోట మాత్రమే టీడీపీ వచ్చింది. కొండపల్లిలో టై. మిగిలిన అన్నీ క్లీన్ స్వీప్. దాని అర్థం 97 శాతం వైఎస్సార్సీపీని ఆశీర్వదించారు. (గ్రాఫ్ ప్రదర్శించారు) ► మనం అధికారంలోకి వచ్చినప్పుడు 50 శాతం ఓట్ షేర్ వస్తే, ఇప్పుడు 55.77 శాతం వచ్చింది. అచ్చెన్నాయుడు బీఏసీలోకి వచ్చినప్పుడు, చంద్రబాబునాయుడు కూడా వస్తారేమోనని కాస్త ఆలస్యం చేశాం. మహిళా సాధికారత మీద చర్చ జరుగుతున్నప్పుడు తాను (చంద్రబాబు) కూడా ఉంటే బాగుంటుందని వేచి చూశాం. ఇక్కడే ఉన్నారు.. వస్తారని అన్నారు.. వేచి చూసినప్పటికీ రాలేదు. ఆయనకున్న కష్టమేమిటో తెలియదు. మా వాళ్లందరూ కుప్పం ఎఫెక్ట్ అంటున్నారు. ఈ సమయంలో ఇక్కడ ఉండి ఉంటే బావుండేది. ఇక్కడ లేకపోయినా టీవీలో చూస్తుంటారని, ఇకపై అయినా బాధ్యతగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నా. -
మద్యం దుకాణాల రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్
సాక్షి, హైదరాబాద్: మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్పై హైకోర్టు అత్యవసర విచారణ జరిపింది. గౌడ్, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను సవాల్ చేస్తూ ఖమ్మం జిల్లాకు చెందిన రవికాంత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండొద్దని సుప్రీం తీర్పు ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. ఏ ప్రతిపాదికన రిజర్వేషన్లు నిర్ణయించారో తెలిపాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వాన్ని సంప్రదించి వివరాలు సమర్పించాలని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను తెలంగాణ హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది. చదవండి: ఇదేం బాదుడు బాబోయ్! సికింద్రాబాద్ స్టేషన్లో ఓవర్ స్టే పార్కింగ్ ఛార్జ్ రూ.500 -
అంబేడ్కర్ను సరిగ్గా అర్థం చేసుకోవాలి!
‘‘మహా సామ్రాజ్యాలు, సంకుచిత మనస్తత్వాలు కలిసి మనుగడ సాగించలేవు’’ అన్న అంబేడ్కర్ మాటలు రాజ్యాంగ సభను నివ్వెరపరిచాయి. 18వ శతాబ్దపు ఐరిష్ రాజనీతి తాత్వికుడు ఎడ్మండ్ బర్క్ మాటలను అంబేడ్కర్ తీవ్ర స్వరంతో పలికారు. ఆగస్టు 26, 1949న రాజ్యాంగంలో పొందుపరి చిన ఆర్టికల్ 334పై జరిగిన చర్చను ముగిస్తూ అంబేడ్కర్ చేసిన నిరసన గర్జన అది. షెడ్యూల్డ్ కులాల రాజకీయ హక్కుల కోసం పోరాడిన అంబేడ్కర్కు రాజ్యాంగసభ నిరాశను మిగిల్చింది. దాని పర్యవ సానమే 1955 ఆగస్టు 21న బొంబాయిలో జరిగిన ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కులాల సమాఖ్య, వర్కింగ్ కమిటీ సమావేశంలో... పార్లమెంటు, శాసనసభలు, జిల్లా, పట్టణ స్థాయి స్థానిక సంస్థల్లో ఎస్సీలకు కేటాయించిన రిజర్వుడు సీట్లను ఎత్తివేయాలన్న తీర్మానం. ఈ సమావేశంలో అంబేడ్కర్ కూడా పాల్గొన్నారు. దీనిని కొంతమంది ఎస్సీ రిజర్వేషన్లకే అంబేడ్కర్ వ్యతిరేకమని అర్థం చేసుకుంటున్నారు. అదే సంవత్సరం అంటే 1955 డిసెం బర్ 23న, భాషా ప్రయుక్త రాష్ట్రాలపై రూపొందించిన డాక్యు మెంటులో ‘‘ప్రత్యేక ఓటింగ్ విధానం గానీ, సీట్ల రిజర్వేషన్ గానీ సాధ్యం కానప్పుడు బహుళ సభ్యుల నియోజక వర్గాలు అంటే రెండు లేక మూడు నియోజక వర్గాలు కలిపి ఒకే నియోజక వర్గంగా రూపొందిస్తే అది అల్ప సంఖ్యాకులుగా ఉన్న వారికి భరోసాను ఇస్తుంది. దీనినే క్యుములేటివ్ ఓటింగ్ అంటారు’’ అని ప్రత్యామ్నాయాన్ని సైతం అంబేడ్కర్ సూచించిన విష యాన్ని మర్చిపోవద్దు. బాబాసాహెబ్ రాజ్యాంగ సభలో సభ్యుడిగా వెళ్లిన కారణమే రాజకీయ, సామాజిక హక్కులను పొందుపరచడానికని మరచి పోవద్దు. పార్లమెంటు, అంసెబ్లీలలో రిజర్వేషన్లు పదేళ్ళు మాత్రమే ఉంటాయనే విషయాన్ని అంబేడ్కర్ అంగీకరించలేదు. ‘ఎస్సీ, ఎస్టీల కోసం నిర్దేశించిన రిజర్వేషన్లు పదేళ్ళు ఉండాలని చాలామంది మాట్లాడారు. వాళ్ళందరికీ నేను చెప్పదల్చుకున్నది ఒక్కటే. మహా సామ్రాజ్యాలు, సంకుచిత మనస్తత్వాలు కలిసి మనుగడ సాగించలేవు’ అన్నారు. దీనర్థం పదేళ్ళ పరిమితిని అంగీకరించినట్టా, వ్యతిరేకించినట్టా? 1955లో షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ చేసిన తీర్మానానికీ, రాజ్యాంగం ఆమోదించిన దానికీ మధ్యలో చాలా పరిణామాలు జరిగాయి. అంబేడ్కర్ ఆశించిన రాజకీయ హక్కుల రక్షణకే వల్లభ్ భాయి పటేల్ లాంటి వాళ్ళు ఎసరు పెట్టారు. తాను ప్రతిపాదిస్తున్న ప్రత్యేక ఓటింగ్ విధానం కూడా సాధ్యం కాదేమో అనే అభిప్రాయానికి అంబేడ్కర్ వచ్చారు. 1947 ఆగస్టులో రూపొందించిన రాజ్యాంగ ముసాయిదాలో షెడ్యూల్డ్ కులాలకు, ఇతర మైనారిటీలకు రాజకీయ రక్షణలను చేర్చారు. అంబేడ్కర్ డిమాండ్ చేసిన ప్రత్యేక ఓటింగ్ విధానం ఆమోదం పొందలేదు. అయినప్పటికీ అంబేడ్కర్ రిజర్వుడు సీట్ల విధానానికి ఒప్పు కున్నారు. అప్పుడు పదేళ్ళ పరిమితి లేదు. అయితే పాకిస్తాన్ విభజన జరగడం, గాంధీజీ హత్యకు గురవడంతో సర్దార్ పటేల్ 1947 నాటి ముసాయిదాను తిరగదోడారు. రిజర్వేషన్లనే తీసి వేస్తామని ప్రకటించారు. 1948 ఆగస్టు నాటికి రాజ్యాంగ రచన పూర్తయింది. చర్చలు ముగిశాయి. అంబేడ్కర్ తీవ్ర ఆగ్రహంతో రాజ్యాంగ సభ నుంచి వాకౌట్ చేశారు. అంటరాని వారి సంక్షేమాన్ని హిందువులు ఎట్లా అడ్డుకున్నారో తరతరాల చరిత్ర మరువని విధంగా తాను రాజ్యాంగ సభ నుంచి వాకౌట్ చేస్తున్నా నని ప్రకటించారు. దాంతో దిగివచ్చిన కాంగ్రెస్ నాయకులు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు అంగీకరించారు. అయితే రాజ్యాంగం ఆమోదం సమయంలో పటేల్, నెహ్రూ పదేళ్ళ పాటు మాత్రమే రిజర్వేషన్లు ఉంటాయని చేసిన ప్రసం గాలు అంబేడ్కర్ను బాధించాయి. 1951, 1952లో జరిగిన మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ ఎటువంటి విజయాలు సాధించలేదు. అంబేడ్కర్ కూడా ఓడి పోయారు. రిజర్వుడు సీట్ల విధానం వల్ల నిజమైన ఎస్సీ ప్రతి నిధుల ఎన్నిక అసాధ్యమనే విషయాన్ని మరోసారి ఆ ఎన్నికలు రుజువు చేశాయి. 1936లో, 1942లో జరిగిన ఎన్నికల్లో ఇదే అను భవం అంబేడ్కర్కు ఎదురైంది. అందుకే 1947లో తయారు చేసిన నమూనా రాజ్యాంగంలో ప్రత్యేక ఓటింగ్ విధానాన్ని ప్రతిపాదించారు. నమూనా రాజ్యాంగానికి ‘స్టేట్స్ అండ్ మైనారి టీస్’ అనే పేరు పెట్టారు. ‘‘ఈ రిజర్వేషన్లు పదేళ్ళే ఉంటాయి. ఆ తర్వాత ఉండవు. అందువల్ల మనం ఐక్యంగా ఉద్యమించాలి. అంతే కాకుండా, హిందువుల దయాదాక్షిణ్యాల మీద ఎన్నికయ్యే ఈ రిజర్వుడు సీట్ల విధానం వల్ల మనకు ఎటువంటి ప్రయోజనం లేదు’’ అంటూ పంజాబ్ ఎన్నికల సభల్లో అంబేడ్కర్ చేసిన ప్రసంగాలు అంబేడ్కర్ సమగ్ర రచనల 17వ సంపుటంలోనే ఉన్నాయి. పనికిరాని రిజర్వేషన్లు, పదేళ్ళే ఉండే రిజర్వేషన్లు ఉంటే ఎంత, పోతే ఎంత అనే అభిప్రాయానికి అంబేడ్కర్ వచ్చారు. దాని ఫలితమే షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ తీర్మానం. ఆ తర్వాత క్యుములేటివ్ ఓటింగ్ విధానాన్ని ఆయన ముందుకు తెచ్చారు. ఈ విధానంలో ఎన్ని నియోజక వర్గాలను కలిపి ఒక్కటిగా చేస్తారో, ప్రతి ఓటరుకు అన్ని ఓట్లు ఉంటాయి. మూడు నియోజకవర్గాలను కలిపితే మూడు ఓట్లు ఉంటాయి. రిజర్వేషన్లు ఉండవు. ఎవరైనా పోటీ చేయొచ్చు. తమ నియోజక వర్గాలకు ప్రతి పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్థులు ఉంటారు. ఒక ఓటరు తన మూడు ఓట్లను ముగ్గురికి ఒక్కొక్క ఓటుగా వేయొచ్చు; ఇద్దరికే వేయొచ్చు; మూడు ఓట్లను ఒక అభ్యర్థికి కూడా వేయొచ్చు. ఎస్సీ అభ్యర్థి ఒక్కడే ఉండే ఆ నియోజక వర్గంలో ఎస్సీలందరూ ఒక్క అభ్యర్థికే తమ మూడు ఓట్లను వేస్తే, తప్పనిసరిగా ఎస్సీ అభ్యర్థి గెలుస్తాడు. అయితే అంబేడ్కర్కి ఈ విధానం మీద ఉద్యమం చేసేంతటి సమయం లేదు. ఆ సమ యంలో ఆయన బౌద్ధంపై కేంద్రీకరించి ఉన్నారు. ఈ ఆలోచన ‘స్టేట్స్, అండ్ మైనారిటీస్’లో కూడా ప్రతిపాదించారు. కానీ అది ప్రచారం పొందలేదు. రిజర్వేషన్ సీట్లు రాజకీయ అధికార భాగస్వామ్యం కోసం నిర్దేశించుకున్న ఒక రూపం. రిజర్వుడు సీట్లు అంబేడ్కర్ రాజకీయ మార్గం కాదు. ఎన్నో మార్గాలను అంబేడ్కర్ వెతికారు. ఆయన నిజమైన లక్ష్యం ఎస్సీలు రాజకీయాధికారంలో భాగం కావడం. ఆ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్ళేవారు ఆయన ఆలోచనా సరళిని సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మల్లెపల్లి లక్ష్మయ్య, వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ 81063 22077 -
50 శాతం మీ హక్కు: జస్టిస్ ఎన్వీ రమణ
సాక్షి, న్యూఢిల్లీ: యాభై శాతం రిజర్వేషన్లు మహిళల హక్కు అని, పోరాడి సాధించుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. ‘‘వేలాది సంవత్సరాల అణచివేత ఇక చాలు, న్యాయవ్యవస్థలోని అన్ని స్థాయిల్లోనూ మహిళలకు 50 రిజర్వేషన్లు కల్పించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది మీ హక్కు.. ఇదేదో దాతృత్వానికి సంబంధించిన అంశం కాదు. మీరు చింతిస్తూ కూర్చోకూడదు. ఆగ్రహంతో గట్టిగా నినదించాలి. 50 శాతం రిజర్వేషన్లు కావాలని బలంగా డిమాండ్ చేయాలి. నా మద్దతు మీకు ఉంటుంది’’ అని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్లోని మహిళా న్యాయవాదులు ఆదివారం ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఆయన మాట్లాడారు. న్యాయవాదుల్లో మహిళలు 15 శాతమే ‘‘దిగువ న్యాయస్థానాల్లో మహిళా జడ్జీలు కేవలం 30 శాతం లోపే ఉన్నారు. హైకోర్టుల్లో 11.5 శాతం ఉన్నారు. సుప్రీంకోర్టులో 11 నుంచి 12 శాతం ఉన్నారు. దేశంలోని మొత్తం 17 లక్షల న్యాయవాదుల్లో 15 శాతం మాత్రమే మహిళలున్నారు. బార్ కౌన్సిళ్లలో ఎన్నికైన ప్రతినిధుల్లో కేవలం 2 శాతం మాత్రమే మహిళలు. బార్కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మహిళల ప్రాతినిధ్యం లేదు. దీన్ని సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవసరమైన దిద్దుబాటు చర్యల గురించి కార్యనిర్వాహక వ్యవస్థపై ఒత్తిడి తీసుకొస్తా. ఉన్నత న్యాయస్థానాల్లో అంతరాన్ని తగ్గించడానికి సహచర కొలీజియం సభ్యులు కూడా చొరవ చూపడం సంతోషంగా ఉంది. న్యాయవాద వృత్తిలోకి రావడానికి మహిళలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ అడ్డంకులు, లింగ వివక్ష ఎదుర్కొంటున్నారు. చాలామంది క్లయింట్లు పురుష న్యాయవాదులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. కోర్టు గదుల్లో సౌలభ్యంగా లేని వాతావరణం, మౌలికవసతుల లేమి, రద్దీగా ఉండే కోర్టు గదులు, వాష్రూమ్స్ లేమి వంటివి మహిళలు న్యాయవాద వృత్తిలోకి రావడానికి అడ్డంకిగా ఉంటున్నాయి. 6 వేల ట్రయల్ కోర్టుల్లో 22 శాతం కోర్టుల్లో మహిళలకు మరుగుదొడ్లు లేవని నా సర్వేలో తేలింది. మహిళలకు మరింతగా స్వాగతం పలికే వాతావరణం కల్పించాలి. న్యాయ విద్యలో లింగ నిష్పత్తిపై దృష్టి సారించాలి. తొలి చర్యగా న్యాయ కళాశాలలు, యూనివర్సిటీలలో మహిళలకు తగినంతగా రిజర్వేషన్లు కలి్పంచాలి. మహిళా జడ్జీలు, లాయర్లు గణనీయంగా పెరుగుతారు. అన్ని రంగాల్లోకి మహిళలు వచ్చేలా స్ఫూర్తి కావాలి. న్యాయవాద వృత్తిలో లింగ అసమానతలు తొలగించడానికి తీసుకొనే చర్యలకు నా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. సీనియర్ న్యాయవాదుల ఎంపికకు త్వరలోనే కమిటీ ఏర్పాటు చేస్తాం. ప్రత్యక్ష విచారణ విషయానికొస్తే.. దీని వల్ల జడ్జీలకు ఎలాంటి ఇబ్బంది లేదు. లాయర్లకే ఒకింత ఇబ్బంది. దసరా తర్వాత ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని భావిస్తున్నాం. థర్డ్వేవ్ రాకూడదని ప్రారి్థద్దాం. ప్రత్యక్ష విచారణకు సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ పట్ల అడ్వొకేట్ల అసోసియేషన్ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. వాటిని సరిచేయాలని రిజిస్ట్రీని ఆదేశించా. మధ్యవర్తిత్వంపై శిక్షణ కార్యక్రమం త్వరలోనే ప్రారంభిస్తాం’’ అని సీజేఐ జస్టిస్ ఎన్ వీ రమణ పేర్కొన్నారు. వలస పాలకుల చట్టాలతో ఇబ్బందులు: జస్టిస్ పి.ఎస్.నరసింహ వలస పాలకుల హయాం నాటి కాలం చెల్లిన చట్టాలు, వాటికి ఇచ్చిన భాష్యాలతో భారత్ 70 ఏళ్లకు పైగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్.నరసింహ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చట్టాలను లోతుగా అధ్యయనం చేసి వాటికి కొత్త వివరణ ఇవ్వాల్సిన బాధ్యత న్యాయమూర్తులపైనే ఉందని అన్నారు. సుప్రీంకోర్టు బెంచ్లో నలుగురు మహిళా న్యాయమూర్తులు ఉండడం అసాధారణమైన విషయమన్నారు. కోర్టుల్లో 50 శాతానికి మహిళలు పరిమితమవకుండా ఇంకా ఎక్కువ మంది ఉండాలన్నదే తన ఆకాంక్షని చెప్పారు. ప్రతిభ ఆధారంగా ఎంత ఎక్కువ మంది మహిళలుంటే అంత మంచిదని, మగవారి కంటే మహిళలే లోతైన ఆలోచన చేస్తారని జస్టిస్ నరసింహ కొనియాడారు. -
ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు: నిర్ణయాన్ని తిరిగి సమీక్షించం
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఆదేశాలిస్తూ తామిచ్చిన తీర్పును తిరిగి సమీక్షించేది లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆదేశాలు అమలు ఎలా చేయాలో రాష్ట్రాలే నిర్ణయించుకోవాలని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించడంలో ఎదురవుతున్న ఇబ్బందులు నోట్ రూపంలో రెండు వారాల్లో అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోర్టు ఆదేశించింది. జర్నైల్ సింగ్ వర్సెస్ లచ్మి నరైన్ గుప్తా కేసులో ఇంప్లీడ్ అయిన 133 పిటిషన్లను మంగళవారం జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ సంజీవ్ఖన్నా, జస్టిస్ గవాయిల ధర్మాసనం మంగళవారం విచారించింది. నాగరాజ్, జర్నైల్ సింగ్ కేసులు తిరిగి ప్రారంభించాలని భావించడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఏ గ్రూపులు వెన కబడి ఉన్నాయో రాష్ట్రాలు ఎలా నిర్ణయిస్తాయని న్యాయవాది ఇందిరా జైసింగ్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ‘విధానాలు ఎలా అమలు ఎలా చేయాలో రాష్ట్ర ప్రభుత్వాలకు మేం చెప్పడం కాదు.. న్యాయసమీక్షకు లోబడి ఎలా అమలు చేయాలో రాష్ట్రాలు నిర్ణయించుకోవాలి’ అని ధర్మాసనం పేర్కొంది. ‘మూడు హైకోర్టులు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చాయి.. అందులో రెండు పదోన్నతులు కొనసాగించాలని చెప్పగా ఒకటి స్టే ఇచ్చింది. కేంద్రం ముందు ఈ సమస్య ఉంద’ని అటార్నీ జనరల్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. స్టేటస్ కో ఆదేశాల వల్ల 2,500 సాధారణ పదోన్నతులు ఏళ్ల తరబడి నిలిచిపోయానన్నారు. అడ్హక్ రూపంలో వాటిని చేపట్టాలని కేంద్రం భావిస్తోందని వేణుగోపాల్ తెలిపారు. పదోన్నతుల్లో రిజర్వేషన్ల నిబంధనల్లో ఈ గందరగోళాన్ని పరిష్కరించాలని కేంద్రంతో పాటు పలు రాష్ట్రాలు సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశాయి. నిబంధనల్లో గందరగోళం వల్ల పలు రాష్ట్రాల్లో పదోన్నతులు నిలిచిపోయాయని తెలిపాయి. పలువురు సీనియర్ న్యాయవాదుల వాదనల అనంతరం ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించడంలో ఎదురవుతున్న ఇబ్బందులు నోట్ రూపంలో రెండు వారాల్లో అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ధర్మాసనం ఆదేశించింది. -
పరిమితిని తొలగిస్తేనే మరాఠా రిజర్వేషన్లు
ముంబై: రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని తొలగిస్తే తప్ప మరాఠా కోటా రిజర్వేషన్లను అమలు చేయలేమని శివసేన ఎంపీ సంజయ్ రావుత్ వ్యాఖ్యానించారు. ఆదివారం ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మరాఠా కోటా గురించే తాను సీఎంతో చర్చించినట్లు తెలిపారు. ఢిల్లీలో రాహుల్ గాంధీతో జరిగిన భేటీకి సంబంధించిన వివరాలను సీఎంకు వివరించానన్నారు. మరాఠా కోటా అంశానికి సంబంధించి ప్రజాపనుల శాఖ మంత్రి అశోక్ చవాన్ అఖిలపక్ష నాయకులతో వర్చువల్గా భేటీ అవుతారని వెల్లడించారు. రాష్ట్రాలు ఓబీసీ జాబితా రూపొందించుకునేలా అధికారం కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెడితే చర్చకు పట్టుబడతానని పేర్కొన్నారు. వచ్చే ఫిబ్రవరిలో జరగనున్న బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో బీజేపీ, ఎమ్మెన్నెస్ల పొత్తు గురించి మాట్లాడేందుకు సంజయ్ రావుత్ నిరాకరించారు. డిసెంబర్ 28వ తేదీన రాహుల్ గాంధీ ముంబై పర్యటనకు వచ్చినప్పుడు సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసానికి వస్తారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు డిసెంబర్ నెల ఇంకా చాలా దూరంలో ఉందని, అప్పటివరకు ఏం జరుగుతుందో చూద్దామని సమాధానమిచ్చారు. -
వైద్య కోర్సుల్లో రిజర్వేషన్లు ఖరారు చేసిన కేంద్రం
-
అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై ‘వైఎస్సార్ కాపునేస్తం’ లబ్దిదారులు హర్షం వ్యక్తం చేశారు. వరుసగా రెండో ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,27,244 మంది పేద మహిళలకు రూ.490.86 కోట్ల ఆర్థిక సాయాన్ని గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేరుగా లబ్ధిదారుల ఖతాల్లోకి నగదు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ‘వైఎస్సార్ కాపునేస్తం’ లబ్దిదారులు.. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం కాపులు బీసీలా? ఓసీలా? అన్న అయోమయానికి గురిచేసిందన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా న్యాయ వివాదాలు సృష్టించిందని తెలిపారు. దాని వల్ల అగ్రవర్ణ పేదలకు ప్రయోజనాలు అందని పరిస్థితి ఏర్పడిందని సీఎం చెప్పారు. తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు అమలు చేస్తుందని పేర్కొన్నారు. ఈ రిజర్వేషన్లతో కాపులకు మేలు జరుగుతుందని, విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. -
విద్యతోపాటు ఉద్యోగాల్లోనూ ‘ఈడబ్ల్యూఎస్’ రిజర్వేషన్లు
సాక్షి, అమరావతి: ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) విద్యా సంస్థలతోపాటు ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈడబ్ల్యూఎస్ వర్గాలకు విద్యావకాశాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2019 జూలై 27న రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దానికి కొనసాగింపుగా ఉద్యోగావకాశాల్లోనూ 10% రిజర్వేషన్లు కల్పిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై విధి విధానాలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మూడో వంతు మహిళలకు... ► ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ కేటగిరీలలోకి రాని వర్గాలలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు ఈ రిజర్వేషన్లకు అర్హులు. కుటుంబ వార్షిక ఆదాయం గరిష్టంగా రూ.8 లక్షల లోపు ఉండాలి. ► ఈడబ్ల్యూఎస్ కింద ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రోస్టర్ పాయింట్లను తర్వాత ప్రత్యేకంగా నిర్ణయిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ► ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద కల్పించే పది శాతం రిజర్వేషన్లలో మూడో వంతు ఆ వర్గాలకు చెందిన మహిళలకు కేటాయిస్తారు. అర్హులైన వారికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీ చేసే అధికారాన్ని తహసీల్దార్లకు కల్పించారు. చంద్రబాబు తీరుతోనే గందరగోళం రిజర్వేషన్ల కేటగిరీలో లేని ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈబీసీ)కు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం 2019లో విధాన నిర్ణయం తీసుకుంది. అదే స్ఫూర్తితో ఆ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయాల్సిన అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయ దురుద్దేశాలతో వ్యవహరించారు. ఈడబ్ల్యూఎస్ వర్గాలకు కేటాయించిన 10 శాతం కోటాను కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా విభజించారు. అందులో 5 శాతం కాపు సామాజికవర్గానికి, మిగిలిన 5 శాతాన్ని ఇతర అగ్రవర్ణాల పేదలకు కేటాయిస్తూ అప్పట్లో టీడీపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై కాపు సామాజికవర్గ ప్రతినిధులతోపాటు రాజ్యాంగ నిపుణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం రిజర్వేషన్ల స్ఫూర్తిని చంద్రబాబు దెబ్బతీశారని స్పష్టం చేశారు. తమను బీసీల్లో చేరుస్తామని మోసం చేసిన చంద్రబాబు ఈడబ్ల్యూఎస్లో 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు సరికొత్త మోసానికి తెర తీయడంపై కాపు సామాజికవర్గ నేతలు భగ్గుమన్నారు. అసలు తాము బీసీలమా? ఈడబ్ల్యూఎస్ వర్గానికి చెందిన వారమా? అనేది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈడబ్ల్యూఎస్కు కేటాయించిన 10 శాతం రిజర్వేషన్లను విభజించడాన్ని సవాల్ చేస్తూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను విభజించడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేస్తూ చంద్రబాబు సర్కారు ఇచ్చిన ఉత్తర్వులను న్యాయస్థానం కొట్టివేసింది. అప్పటి నుంచి రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు నిలిచిపోయింది. చంద్రబాబు నిర్వాకంతో అటు కాపు సామాజికవర్గం, ఇటు ఆర్థికంగా వెనుబడిన ఇతర అగ్రకులాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈడబ్ల్యూఎస్ కోటాపై నేడు చిత్తశుద్ధితో అధికారం చేపట్టిన అనంతరం రాజ్యాంగ స్ఫూర్తితో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నడుం బిగించారు. న్యాయ నిపుణులతో చర్చించి వివాదాలకు తావులేని రీతిలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు సమగ్ర కార్యాచరణ రూపొందించారు. అందులో భాగంగా మొదట విద్యావకాశాల్లో ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2019 జూలై 27న ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీనిపై మరింత కసరత్తు అనంతరం సమగ్రంగా విధివిధానాలను నిర్ణయిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో విద్య, ఉద్యోగాలలో ఈడబ్ల్యూఎస్కు 10 శాతం రిజర్వేషన్లు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
ఏపీ: గ్రామ పాలనలో 55 శాతం వారే..
►ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో అధ్యాపకురాలిగా పని చేస్తున్న 30 ఏళ్ల చిల్లా అనూష ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా పెన్నాడ సర్పంచ్గా ఎన్నికయ్యారు. రాజకీయాల పట్ల తనకు ఉన్న ఆసక్తి, ప్రజాసేవ చేయాలనే కోరిక తనను ఈ దిశగా నడిపించాయని అనూష అంటున్నారు. ఆ గ్రామ సర్పంచ్ పదవి బీసీ మహిళకు రిజర్వు కావడం తనకు కలిసి వచ్చిందని ‘సాక్షి’తో అన్నారు. ఈమెతో పాటు రాష్ట్రంలో ఎంతో మంది ఔత్సాహిక యువత రాజకీయాల్లోకి వచ్చి గ్రామాలకు కొత్త కళను తీసుకొచ్చారు. గ్రామాల్లో మారుతున్న పరిస్థితులపై కథనం ►అనంతపురం జిల్లా కదిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని నల్లజెరువు సర్పంచ్గా ఎంకాం చదివి.. రెండేళ్ల క్రితం వరకు బెంగళూరులో సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన దాసరి శ్రీనాథ్రెడ్డి ఎన్నికయ్యారు. అతడి తల్లిదండ్రులు రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులే. వాళ్లిద్దరూ పెద్దగా చదువుకున్న వాళ్లు కూడా కాదు. శ్రీనాథ్రెడ్డి మాత్రం రాజకీయాలపై ఆసక్తితోనే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. అదే గ్రామానికి చెందిన మరో 50 మంది స్నేహితులతో కలిసి శ్రీనాథ్రెడ్డి చేపట్టిన సేవా కార్యక్రమాలు ఆయన సర్పంచ్గా ఎన్నిక కావడానికి దోహదపడ్డాయి. సర్పంచ్ అయ్యాక శ్రీనాథ్రెడ్డి గ్రామంలో కరోనా బారిన పడినవారి కోసం స్థానిక పాఠశాల భవనంలో 10 బెడ్లతో ప్రత్యేక ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. సాక్షి, అమరావతి: రాజకీయ రంగం నూతన జవసత్వాలు పుంజుకుంటోంది. గ్రామీణ రాజకీయ రంగంలో పాత నీరు దాదాపు పోయింది. బాగా చదువుకున్న నవతరం రాజకీయాల్లోకి వచ్చింది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో 84 శాతం మంది తొలిసారి సర్పంచ్లుగా ఎన్నికైన వారే ఉన్నారు. రాష్ట్రంలో 13,371 గ్రామ పంచాయతీలు ఉండగా.. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో 13,097 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. వీరిలో 13,070 సర్పంచ్ల పూర్తి వివరాలు ఎన్నికల సంఘానికి అందాయి. ఆ వివరాలను పరిశీలిస్తే.. ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. సర్పంచ్లుగా ఎన్నికైన 13,070 మందిలో 11,008 మంది (84 శాతం) తొలిసారిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వారే కావడం గమనార్హం. పంచాయతీ ఎన్నికల్లో అత్యధిగ చోట్ల వైఎస్సార్సీపీ సానుభూతిపరులే గెలుపొందిన నేపథ్యంలో.. రాష్ట్రంలో డైనమిక్ రాజకీయాలకు నాంది పలికిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో కొత్త తరం వారికి మెండుగా అవకాశాలు దక్కాయి. రిజర్వుడు స్థానాల్లోనూ చదువుకున్న వారే.. తొలినాళ్లలో చదువు వచ్చినా.. రాకపోయినా ఊళ్లో పెద్ద మనిషిగా చెలామణి అయ్యే వారే సర్పంచ్లుగా ఎన్నికయ్యేవారు. అప్పట్లో సర్పంచ్లుగా గెలిచే వారిలో 90 శాతం వరకు నిరక్షరాస్యులే ఉండేవారు. గడచిన 30 ఏళ్ల కాలంలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు రిజర్వు అయ్యే స్థానాల్లో ఎక్కువ శాతం నిరక్షరాస్యులే సర్పంచ్లుగా గెలుపొందే వారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ సారి పంచాయతీ ఎన్నికల్లో మాత్రం మొత్తం 13,070 మంది సర్పంచ్లలో కేవలం 2,276 మంది మాత్రమే నిరక్షరాస్యులు ఉన్నారు. 10,794 చోట్ల చదువుకున్న వారే గెలిచారు. వీరిలో చార్టెడ్ అకౌంట్ (సీఏ), ఎంటెక్, ఎంఏ, ఎంబీఏ, సీఏ, బీటెక్ వంటి ఉన్నత చదువులు చదివిన వారు ఉన్నారు. మొత్తం సర్పంచ్లలో 525 మంది పెళ్లి కాకమునుపే సర్పంచ్లుగా గెలుపొందటం విశేషం. రిజర్వేషన్లకు మించి మహిళలకు పదవులు జనరల్ రిజర్వుడు స్థానాల్లో మహిళలు సర్పంచ్ స్థానాలకు పోటీ చేసి గెలుపొందారు. ఎన్నికలు జరిగిన మొత్తం స్థానాల్లో 55 శాతం మంది మహిళలు సర్పంచ్ పదవులు దక్కించుకోగా.. పురుషులకు కేవలం 45 శాతం సర్పంచ్ స్థానాలే దక్కించుకోగలిగారు. సాధారణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ కేటగిరీలో 50 శాతం స్థానాలు మహిళలకు రిజర్వు చేశారు. కానీ, రిజర్వు స్థానాలకు అదనంగా మరో 5 శాతం సర్పంచ్ స్థానాలను మహిళలు దక్కించుకున్నారు. -
‘రిజర్వేషన్’ తీర్పుపై రివ్యూ పిటిషన్
న్యూఢిల్లీ: సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు(ఎస్ఈబీసీ) రిజర్వేషన్లు కల్పించడానికి సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం రివ్యూ పిటిషన్ వేసింది. 102వ రాజ్యాంగ సవరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ తీర్పుతో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించే రాష్ట్రాల హక్కుకు విఘాతం కలుగుతోందని పేర్కొంది. ఆ సవరణ ద్వారా పొందుపర్చిన రెండు నిబంధనలు దేశ సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కాదని కేంద్రం ఆ పిటిషన్లో పేర్కొంది. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాన్ని మే 5న జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం తోసిపుచ్చిన విషయం తెలిసిందే. అలాగే, రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ 1992లో సుప్రీంకోర్టు ఇచ్చిన ‘మండల్’తీర్పును విస్తృత ధర్మాసనానికి నివేదించాలన్న అభ్యర్థనను కూడా కోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. రివ్యూ పిటిషన్పై బహిరంగ కోర్టులోనే విచారణ జరగాలని, దీనిపై తీర్పు వెలువడే వరకు గత తీర్పులోని పలు అంశాలపై స్టే విధించాలని కేంద్రం కోరింది. గత తీర్పులో ఆర్టికల్ 342ఏను ధర్మాసనం సమర్ధిస్తూనే.. ఎస్ఈబీసీలను గుర్తించే విషయంలో రాష్ట్రాలకు ఉన్న హక్కును తప్పుగా అర్థం చేసుకుందని రివ్యూ పిటిషన్లో కేంద్రం పేర్కొంది. 342ఏతో పాటు రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపర్చిన ఇతర నిబంధనలపై తీర్పు వెలిబుచ్చిన ఆదేశాలపై స్టే విధించాలని కేంద్రం తన రివ్యూ పిటిషన్లో కోరింది. -
మా వద్ద 50% పైగా రిజర్వేషన్లు సబబే
న్యూఢిల్లీ: రాష్ట్రంలో 50 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించడాన్ని మేఘాలయ బుధవారం సుప్రీంకోర్టులో సమర్ధించుకుంది. 85% పైగా గిరిజనులు ఉన్న తమ రాష్ట్రంలో ఆ స్థాయి రిజర్వేషన్లు అవసరమని పేర్కొంది. మరాఠాలకు మహారాష్ట్ర ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్లను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను, ఇంద్ర సాహ్ని కేసులో రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ 1992లో సుప్రీంకోర్టు ఇచ్చి తీర్పును పునఃపరిశీలించే అంశాన్ని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తున్న విషయం తెలిసిందే. ఆ ధర్మాసనం ముందు మేఘాలయ తరఫున ఆ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ అమిత్ కుమార్ బుధవారం వాదనలు వినిపించారు. మేఘాలయ అనేక ప్రత్యేకతలు, వైవిధ్యత ఉన్న రాష్ట్రమని, అందువల్ల అసాధారణ పరిస్థితుల్లో అక్కడ 50 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించడం సరైనదేనని కోర్టుకు వివరించారు. ఇంద్ర సాహ్ని కేసును పునః పరిశీలించాల్సిన అవసరం లేదని అమిత్ కుమార్ కోర్టుకు తెలిపారు. పలు ఇతర రాష్ట్రాలు కూడా తమ వాదనలను వినిపించాయి. వాదనల అనంతరం విచారణను ధర్మాసనం గురువారానికి వాయిదా వేసింది. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించే చట్టబద్ధ హక్కు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఉందని మంగళవారం కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. ఆ నిర్ణయం రాజ్యాంగబద్ధమేనని, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల(ఎస్ఈబీసీ) జాబితాను రాష్ట్రాలు ప్రకటించే అధికారాన్ని 102వ రాజ్యాంగ సవరణ తొలగించదని వివరించింది. -
మరాఠాలు వెనుకబడిన వర్గం కాదు
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్రలో మరాఠాలు సామాజికంగా, రాజకీయంగా ప్రభావశీల వర్గమని సీనియర్ న్యాయవాది ప్రదీప్ సంచేటి సుప్రీంకోర్టుకు తెలిపారు. మహారాష్ట్రలోని ఎంపీలు, ఎమ్మెల్యేల్లో ఆ వర్గం వారే 40% వరకు ఉంటారన్నారు. రాష్ట్రంలోని అధిక శాతం భూములు వారి ఆధీనంలోనే ఉన్నాయన్నారు. ‘వారు వెనుకబడిన వారు, వారికి అన్యాయం జరిగింది అనే వాదనలోనే తప్పు ఉంది’అన్నారు. మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగాయి. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు రాజీవ్ ధావన్, ప్రదీప్ సంచేటి వాదనలు వినిపించారు. మొత్తం రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ 1992లో ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునః పరిశీలించే అంశాన్ని కూడా ఈ కేసు విచారణలో జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. మరాఠాలు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడ్డారని, ప్రభుత్వ సర్వీసుల్లో వారికి సరైన ప్రాతినిధ్యం లేదని 2018లో ఎంజీ గైక్వాడ్ ఇచ్చిన నివేదికను కూడా న్యాయవాది సంచేటి తప్పుబట్టారు. అది రాజకీయ కారణాలతో కావాలనే రూపొందించిన నివేదికలా ఉందన్నారు. ‘ఒకవేళ మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని సుప్రీంకోర్టు సమర్ధించినా.. అది రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు నిర్ధారించిన 50% పరిమితిలోపే ఉండాలి’అని స్పష్టం చేశారు. ఇందిరా సాహ్ని కేసు తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొన్నట్లు.. 50% పరిమితిని మించి మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అసాధారణ పరిస్థితులేవీ లేవని వాదించారు. వివిధ వర్గాలను వెనుకబడిన వర్గాల జాబితాలో చేర్చే విషయంలో గణనీయ స్థాయిలో రాజకీయ ఒత్తిళ్లు ఉంటాయని మరో న్యాయవాది రాజీవ్ ధావన్ పేర్కొన్నారు. ఓటర్లకు రాజకీయ నేతలు ఇచ్చిన హామీలు రాజ్యాంగబద్ధం కాదన్నారు. సామాజిక, రాజకీయ ఒత్తిళ్లనేవి సామాజిక స్థితిగతుల్లో మార్పులుగా పరిగణించలేమన్నారు. రిజర్వేషన్ల ప్రధాన ఉద్దేశం అందరికీ సమాన అవకాశాలు లభించే పరిస్థితిని కల్పించడమేనన్నారు. ఇదే విషయాన్ని నోబెల్ పురస్కార గ్రహీత అమర్త్యసేన్ చెప్పారన్నారు. పోరాడే సామర్ధ్యం అందరికీ ఒకేలా లభించేలా చూడాలని అమర్త్యసేన్ వివరించారన్నారు. ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలన్న వాదనను ఆయన తప్పుబట్టారు. ఈ సందర్భంగా, ఈ కేసు విషయంలో కేంద్రం స్పందన తెలియజేయాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ను ధర్మాసనం ఆదేశించింది. వాదనల అనంతరం జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ హేమంత్గుప్తా, జస్టిస్ రవీంద్రభట్లు కూడా సభ్యులుగా ఉన్న ధర్మాసనం విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఆధార్ లింక్ లేదని 3 కోట్ల రేషన్ కార్డులు రద్దు! ఇది చాలా తీవ్రమైన అంశం: సుప్రీం ఆధార్ కార్డుతో అనుసంధానం చేయలేదన్న కారణంతో దేశవ్యాప్తంగా మూడు కోట్లకు పైగా రేషన్ కార్డులను రద్దు చేశారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్ను బుధవారం సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ విషయాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించాలని సుప్రీం కోర్టు డివిజన్ బెంచ్ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి సమాధానమివ్వాలని ఆదేశిస్తూ 4 వారాలు గడువు ఇచ్చింది. ఆధార్తో లింకప్ చేయలేదన్న కారణంతో 3 కోట్లకుపైగా రేషన్ కార్డులు రద్దు చేశారని, దీంతో నిత్యావసరాలు లభించక ఆకలి చావులు సంభవించాయని జార్ఖండ్కు చెందిన కొయిలి దేవి అనే మహిళ పిటిషన్ దాఖలు చేశారు. ప్రతీ రాష్ట్రంలో దాదాపు 15 లక్షల రేషన్ కార్డులు రద్దయ్యాయని పిటిషనర్ తరఫు లాయర్ గోన్సాల్వెస్ తెలిపారు. అదనపు సొలిసిటర్ జనరల్ అమన్ ఈ పిటిషన్ను వ్యతిరేకించారు. ఆధార్ కార్డు లేకపోయినంత మాత్రాన ఆహార హక్కుని వదులుకోవాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ఈ పిటిషన్ను ఆయా రాష్ట్రాల హైకోర్టుల్లో విచారణ జరగాలని తొలుత సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ‘ఈ తరహా పిటిషన్లు నేను బొంబే హైకోర్టులో ఉండగా విచారణ జరిపాను. దీనిని ఆయా రాష్ట్రాల హైకోర్టులే చూడాలి’అని చీఫ్ జస్టిస్ బాబ్డే అన్నారు. లింకేజీతోపాటు ఆహార భద్రత అంశాన్నీ చూడాలని లాయర్ గోన్సాల్వేస్ వాదించారు. దీంతో సుప్రీం బెంచ్ తానే ఈ పిటిషన్ను నాలుగు వారాల తర్వాత పూర్తి స్థాయిలో విచారిస్తానని çస్పష్టం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు పంపింది. పిటిషనర్ కొయిలిదేవి తన రేషన్ కార్డుని ఆధార్తో లింకప్ చేయకపోవడంతో రద్దయింది. నిత్యావసరాల సరఫరా నిలిచిపోవడంతో తినడానికి తిండి లేక 11 ఏళ్ల వయసున్న ఆమె కుమార్తె సరిత రెండేళ్ల క్రితం ఆకలి తట్టుకోలేక మరణించిందన్న వార్తలు వచ్చాయి. -
ప్రైవేటులోనూ రిజర్వేషన్లు ప్రజల హక్కు
దేశంలో ప్రభుత్వ రంగంలో కొత్త ఉద్యోగాలు పుట్టడం లేదు. ఉన్న ఖాళీలను నింపడం లేదు. దీనికితోడు ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడానికి చర్యలు ఊపందుకుంటున్నాయి. మరి దేశంలో ఉన్న ఉద్యోగాలన్నీ ప్రైవేటురంగంలోకే పోయినప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల మాటేమిటి? సామాజిక న్యాయం బాధ్యత ఎవరు తీసుకోవాలి? స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా ఈ వర్గాలు ఇంకా పైకి రాలేవన్నది చేదునిజం. ప్రైవేటు సంస్థల పైస్థాయి ఉద్యోగాల్లో ఈ వర్గాల ప్రజలు నామమాత్రంగా ఉన్నారన్నది నగ్నసత్యం. కాబట్టి కేంద్రప్రభుత్వం సామాజిక అసమానత లను తొలగించే బాధ్యత నుంచి తప్పుకోకూడదు. ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు అమలుచేయడానికి అవసరమైన చర్యలు తీసుకోకతప్పదు. ‘‘కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలన చేస్తాయి, వ్యాపారాలు చేయడం ప్రభుత్వాల బాధ్యత కాదు’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల బహి రంగంగా పలుమార్లు ప్రకటించారు. పరిశ్రమ, సేవా రంగాలను దశల వారీగా ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసు కుంటున్నదనేది స్పష్టం. అందులో భాగంగా రైల్వే, ఎల్ఐసీ, పోస్టల్, బీఎస్ఎన్ఎల్, బ్యాంకింగ్, రక్షణ, బొగ్గు సంస్థలు, విశాఖ ఉక్కు పరి శ్రమలను ప్రైవేటీకరణ చేయడానికి చర్యలు తీసుకుంటోంది. దీన్ని ప్రజలు, ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయన్నది ఒక కారణమైతే, అందులో పనిచేసే ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోతామనే అభద్రత మరో కారణం. అలాగే ప్రైవేటీకరణ వల్ల రాజ్యాంగబద్ధమైన ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల అమలు జరగదనీ, రద్దు చేయకుండానే రిజర్వేషన్లు రద్దవుతాయనీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేట్ యాజమాన్యాలు సామాజిక వర్గాల రిజర్వేషన్ల అమలుకు అంగీకరించడం లేదు. ప్రైవేటు పారిశ్రామిక వర్గాలు ప్రభుత్వం వద్ద అన్ని రకాల సహాయ, సహకారాలు తీసుకుంటున్నాయి. కానీ ప్రభుత్వ నియమాలను పాటించడం లేదు. ఉద్యోగ రంగంలో 90 శాతం ఉద్యోగాలు ప్రైవేటు రంగంలోనే ఉన్నాయి. కేవలం 10 శాతం ఉద్యోగాలు మాత్రమే ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. ప్రస్తుతం ప్రతి పాదనలో ఉన్న సంస్థలను ప్రైవేటీకరిస్తే మరో 26 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు పోతాయి. అప్పుడు అవి 7 శాతానికి తగ్గుతాయి. ఉద్యో గాల్లో ప్రైవేటు రంగం విస్తరిస్తున్న క్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజ ర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్ బలంగా ముందుకు వస్తున్నది. ప్రైవేటురంగం విస్తరిస్తూ పోతే సమాజంలో సాంఘిక, ఆర్థిక అస మానతలు మరింత పెరుగుతాయి. రాజ్యాంగంలో పేర్కొన్న సమ సమాజం, సామాజిక న్యాయం పుస్తకాల్లోని పదాలుగా మిగిలి పోతాయి. ఆర్థిక అసమానతల వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరిగి శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. సంపద కొంతమంది బడా పారి శ్రామికవేత్తల చేతుల్లో కేంద్రీకృతమవుతుంది. రైల్వే స్టేషన్లు, రైల్వే లైన్ల రూపంలో లక్షల కోట్ల విలువైన ఆస్తులున్నాయి. అవి కోట్లాది ప్రజల ఆస్తులు. ఇన్ని ఆస్తులను కారుచౌకగా కార్పొరేట్ దిగ్గజాలకు అప్పగిం చడం ప్రభుత్వం చేయవలసిన పని కాదు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లకు ప్రభుత్వం ఆమోదించాలి. ఇది న్యాయమైన డిమాండ్ అని సమాజాన్ని ఒప్పించాలి. అలాగే దీనికి రాజ్యాంగపరంగా న్యాయపరమైన అవరోధాలు ఏమైనా ఉన్నాయా అన్నది పరిశీలించాలి. ఇవి సాధించుకోవడానికి ఉద్యమాలు, వ్యూహాలు రూపొందించుకోవాలి. పార్లమెంటులో పాలక, ప్రతి పక్షాలు ఈ అంశం మీద విస్తృతంగా చర్చించాలి. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు పెట్టడానికి రాజ్యాంగ సవరణ కూడా అవసరం లేదు. రాజ్యాంగంలోని 15 (4), 16(4) ప్రకారం ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయవచ్చన్న భావన నిబిడీకృతమై ఉంది. ఒకవేళ రాజ్యాంగ సవరణ అవసరమైనా దీనికి అభ్యంతరం చెప్పే రాజకీయ పార్టీలు ఉన్నాయా? సామాజిక న్యాయ సిద్ధాంతానికి విరుద్ధంగా అగ్రకులాల్లోని పేదలకు రెండు రోజుల్లో పార్లమెంటులో బిల్లు ఆమోదింపజేసి 10 శాతం రిజర్వేషన్లు పెట్టిన కేంద్రం, 90 శాతం జనాభా గల పేద కులాలకు రిజర్వేషన్లు పెడితే అభ్యంతరాలు చెప్పే వారు ఉంటారా? పాలక పక్షం తలుచుకుంటే ఈ రిజర్వేషన్లు అమలు చేయడం ఒక లెక్కలోది కాదు. ఒక్కరోజు పని మాత్రమే. ఇప్పుడు ప్రైవేటు రంగంలో ఏ కేటగిరీ ఉద్యోగాల్లో ఎవరు న్నారు? మేనేజింగ్ డైరెక్టర్, ఎగ్జి్జక్యూటివ్ డైరెక్టర్ లాంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలు ఎవరు చేస్తున్నారు? జనరల్ మేనేజర్లు, ఇంజినీర్లు, ఆఫీసర్లు, సూపర్వైజరు వగైరా ఉద్యోగాలు ఎవరు చేస్తున్నారు? అటెండర్లు, స్వీపర్ల ఉద్యోగాలు ఎవరు చేస్తున్నారు? ఇందులో పైస్థాయి ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు నామమాత్రంగా కూడా లేరనేది నగ్నసత్యం. వివిధ స్థాయిల్లో అధికార, అనధికార సంస్థలు జరిపిన సర్వేల్లో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల్లో ఈ వర్గాల వారు ఐదు శాతం కూడా లేరని తేలింది. స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత కూడా ఇలావుంటే సామాజిక న్యాయం ఇంకెప్పుడు సాధ్యమవుతుంది? ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల డిమాండ్ రెండు కోణాల్లో సమర్థ నీయం. ఈ కంపెనీలకు ప్రభుత్వమే రాయితీల మీద భూమి, ముడి సరుకు, ఇతర మౌలిక సదుపాయాలు సమకూరుస్తుంది. అలాగే ఇందులో చెమటోడ్చే కార్మికులు ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉంటారు. అలాంటప్పుడు అధికారం చలాయించే చోట ఈ వర్గాలు ఉండరాదా? ఈ పరిశ్రమల ఉత్పత్తుల్ని సంపన్న వర్గాలే కొనవు. 90 శాతం గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలే సింహభాగం కొంటారు. కొనుగోలులో అన్ని కులాల భాగస్వామ్యం ఉన్నప్పుడు పాలనలోనూ వాటా కల్పించడానికి అభ్యంతరం ఏమిటి? ఇంకొక విషయాన్ని గమనించాలి. ఒకనాడు బీసీ కులాల వారు చేసిన కులవృత్తులు, చేతి వృత్తులు నేడు పారిశ్రామికీకరణ చెందాయి. పద్మశాలీలు, దేవాం గులు నేసిన చేనేత వృత్తి బట్టల మిల్లులుగా మారిపోయింది. కమ్మరి, కంచరి పని ఉక్కు, ఇనుము కంపెనీలుగా మారిపోయింది. మేదరి, ఎరుకల వారి గంపలు, బుట్టలు, చాటలను, కుమ్మరివాళ్ల కుండలను ప్లాస్టిక్, స్టీలు పరిశ్రమలు తన్నుకుపోయాయి. ఒకప్పుడు వృత్తులకు యజమా నులైన ఈ కులాలవారు కనీసం ఇందులో ఉద్యోగులు కాకపోతే సామాజిక న్యాయం ఎలా సాధ్యం? మనది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. సామ్యవాద పునాదులతో పెట్టుబడిదారీ విధానం అవలం బించే దేశం. అలాంటప్పుడు ప్రభుత్వాలు వ్యాపారం చేసే బాధ్యత తీసుకోవని ప్రధాని ప్రకటించడాన్ని ఏ కోణంలో అర్థం చేసుకోవాలి? ప్రపంచంలోని అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో వేగ వంతమైన అభివృద్ధికి ప్రైవేటీకరణే కారణమని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఇందులో కొంత వాస్తవం ఉంది. ప్రైవేటీకరణ వల్ల యాజమాన్య పర్యవేక్షణ కట్టుదిట్టంగా అమలవుతుంది. పని సంస్కృతి మారుతుంది. జవాబుదారీతనం పెరుగుతుంది. వృథా తగ్గుతుంది. ఉత్పత్తి పెరుగుతుంది. అందులో సందేహం లేదు. చైనా లాంటి కమ్యూనిస్టు దేశాలు, జపాన్, జర్మనీ, ఇంగ్లండ్, అమెరికా లాంటి దేశాలు శీఘ్రగతిన అభివృద్ధి చెందడానికి ప్రైవేటీకరణే ప్రధాన కారణం. కానీ మనదేశంలో ఇప్పటికే 95 శాతం పారిశ్రామిక రంగం ప్రైవేట్ రంగంలోనే ఉంది. ఇంకా ముందుకు పోవడం వాంఛనీయం కాదు. కొత్త పరిశ్రమలను ప్రైవేటు రంగంలో చేరిస్తే అభ్యంతరం లేదు. కానీ పాతవాటిని, కోట్ల రూపాయలు లాభాలు ఆర్జించేవాటిని, ప్రజా సేవలో భాగమైన రైల్వేలను, ప్రభుత్వానికి అవసరమైన అప్పులు ఇచ్చే ఎల్ఐసీ లాంటి వాటిని కూడా ప్రైవేటీకరించడాన్ని సమాజం అంగీకరించదు. రోజు రోజుకు ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. రిటైర్ అవుతున్న ఉద్యోగుల స్థానాలను భర్తీ చేయడం లేదు. కొత్త ఉద్యో గాలు సృష్టించడం లేదు. పైగా శాశ్వత ఉద్యోగాలను తగ్గిస్తూ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, గెస్ట్ లెక్చరర్లు, గెస్టు టీచర్లు విద్యా వాలంటీర్లు, ఎన్ఎంఆర్లు అంటూ రకరకాల పేర్లతో రిజర్వేషన్లు లేకుండా చేశారు. ప్రైవేటీకరణ రహస్య ఎజెండా వెనకనే ఈ వర్గాలకు ఉద్యోగాలు దక్కకుండా చేయాలనే కుట్ర ఉంది. అలాంటప్పుడు అంత సులభంగా రిజర్వేషన్లు పెడుతారా! అందుకే ఈ కులాలు పెద్ద పోరాటం చేయక తప్పదు. వీరి అభివృద్ధి ప్రభుత్వ దయా దాక్షిణ్యాల మీద, సమాజంలోని ఆధిపత్య కులాల సానుభూతి మీద ఆధార పడిలేదు. ఇది భిక్షంగా కాకుండా రాజ్యాంగబద్ధమైన హక్కుగా గుర్తించాలి. ఆర్. కృష్ణయ్య వ్యాసకర్త అధ్యక్షులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం మొబైల్ : 90000 09164 -
తుది అంకానికి ఓబీసీ వర్గీకరణ
సాక్షి, న్యూఢిల్లీ: ఓబీసీ ఉప కులాల వర్గీకరణ కమిషన్ ఆయా కులాల మధ్య రిజర్వేషన్లను దామాషా ప్రకారం పంచేందుకు వాటిని నాలుగు కేటగిరీలుగా ప్రతిపాదిస్తూ ముసాయిదా నివేదిక రూపొందించింది. ఆయా ప్రతిపాదనలను రాష్ట్రాలు, సంబంధిత భాగస్వాములతో చర్చించేందుకు సిద్ధమైంది. ఈ దిశగా మార్చి నెల నుంచి వివిధ రాష్ట్రాల్లో పర్యటించనున్నట్టు తెలుస్తోంది. మొత్తం 2,633 కులాలను నాలుగు కేటగిరీలుగా వర్గీకరిస్తూ.. వరుసగా 2, 6, 9, 10 శాతం రిజర్వే షన్లను పంపిణీ చేస్తూ కమిషన్ ప్రతిపాదించి నట్టు సమాచారం. రిజర్వేషన్ ఫలాలు పొందని, అత్యంత వెనబడిన కులాలను మొదటి కేటగిరీలో పొందు పరిచినట్టు తెలుస్తోంది. నాలుగో కేటగిరీలో 97 కులాలు మాత్రమే ఉన్నప్పటికీ... జనాభా పరంగా చూస్తే సింహభాగం వారే ఉన్నారు. కాబట్టి 27 శాతం ఓబీసీ రిజర్వేషన్లలో జనాభా ప్రాతిప దికన అత్యధికంగా 10% వారికే దక్కనుందని సమా చారం. 4వ కేటగిరీలో సామాజికంగా బలమైన, అత్యంత ప్రభావవంతమైన కులాలున్నాయి. గతం లోనూ ఈ కులాలే రిజర్వేషన్ల ఫలాలు అధికంగా పొందినప్పటికీ... జనాభా నిష్పత్తికి మించి వీరికి ప్రయోజనం కలిగిందనేది ఇతరుల అభ్యంతరం. మొదటి కేటగిరీలో 1,674 కులాలు, రెండో కేటగిరీలో 534 కులాలు, మూడో కేటగిరీలో 328, నాలుగో కేటగిరీలో 97 కులాలు పొందుపరిచినట్టు సమాచారం. కేంద్ర జాబితాలోని ఓబీసీ కులాలకు ప్రస్తుతం విద్య, ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లు వర్తిస్తున్నాయి. అయితే ఈ రిజర్వేషన్లలో మెజారిటీ భాగం కొన్ని కులాలకు మాత్రమే అందుతున్నాయని, ఓబీసీల్లో అత్యంత వెనకబడిన కులాలకు రిజర్వేషన్ ఫలాలు అందడం లేదంటూ బీసీ సంక్షేమ సంఘాల డిమాండ్లు, జాతీయ బీసీ కమిషన్ సిఫారసులు, స్థాయీ సంఘాల సిఫారసుల నేపథ్యంలో 2017 అక్టోబరు 2వ తేదీన ఈ కమిషన్ ఏర్పాటైంది. ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రోహిణి నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిషన్ అదే ఏడాది అక్టోబరు 10 నుంచి తన పని ప్రారంభించింది. ఈ కమిషన్ 12 వారాల్లో నివేదిక ఇవ్వాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల పలుమార్లు కేంద్ర మంత్రిమండలి ఈ కమిషన్ గడువు పొడిగించింది. ప్రస్తుతం 2021 జూలై 31కి నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఈ కమిషన్ నాలుగు విధి విధానాల ఆధారంగా నివేదిక సమ ర్పించాల్సి ఉంటుంది. కేంద్ర జాబితాలో చేర్చిన ఓబీసీ కులాల మధ్య రిజర్వేషన్ ప్రయోజనాల పంపిణీలో అసమానతలు పరిశీలించడం, ఓబీసీ కులాల ఉప వర్గీకరణ కోసం శాస్త్రీయ విధానంలో నిబంధనలు రూపొందించడం, కేంద్ర జాబితాలో ఓబీసీలను ఉపకులాల వారీగా వర్గీకరించడం, కేంద్ర జాబితాలోని వివిధ ఎంట్రీలను అధ్యయనం చేసి అక్షర దోషాలు, పునరావృతులు, అస్పష్టతలు, లోపాలు ఉంటే వాటిని సరిదిద్దడం.. తదితరæ నాలుగు విధివిధానాలను దృష్టిలో పెట్టుకుని కమిషన్ నివేదిక సమర్పిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల ప్రవేశాల్లో... రిజర్వేషన్ల ద్వారా ప్రయోజనం పొందని ఓబీసీ కులాలకు.. ఈ కమిషన్ సిఫారసులను అమలు చేయడం ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఓబీసీ జాబితాలో ఉన్న అటువంటి అట్టడుగు వర్గాలకు ప్రయోజనం చేకూర్చేలా కమిషన్ సిఫారసులు చేస్తుంది. సున్నితమైన అంశం... రాజకీయంగా ప్రాధాన్యత ఇప్పటివరకు ఓబీసీ రిజర్వేషన్లలో కొన్ని కులాలకే లబ్ధి చేకూరినట్టు కమిషన్ విశ్లేషించినట్టు తెలుస్తోంది. ఓబీసీలకు కేటాయించిన వాటిలో 97% మేర విద్యా సంస్థల్లో సీట్లు, ఉద్యోగాలు కేవలం 25% ఓబీసీ కులాలకే దక్కాయని, ఇందులో 24.95% ఉద్యోగాలు కేవలం 10 ఓబీసీ కులాలకే దక్కాయని, దాదాపు 983 కులాలకు (అంటే 37%) విద్య, ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం లేకుండాపోయిందని కమిషన్ విశ్లేషించినట్టు తెలుస్తోంది. 994 ఓబీసీ కులాలకు 2.68% మేర కోర్సుల్లో సీట్లు, ఉద్యోగాలు దక్కినట్టు సమాచారం. ఓబీసీ ఉప కులాల వర్గీకరణ కమిషన్ తనకు అప్పగించిన విధివిధానాల మేరకు ఆయా అసమానతలను తొలగించాల్సి ఉన్నందున.. ఇప్పటివరకు ఓబీసీ రిజర్వేషన్ల ప్రయోజనాలను అధికంగా పొందిన కులాలను చివరి కేటగిరీలో చేర్చాల్సి వస్తుందని అంచనా. దేశంలో రాజకీయా లపై కులాల ప్రభావం ఎక్కువ ఉంటున్నందున.. రిజర్వేషన్లు తగ్గితే అధిక ప్రాబల్యం ఉన్న కులాల నుంచి రాజకీయ ఒత్తిళ్లు ఎలా ఉంటాయోనన్న చర్చ నడుస్తోంది. అయితే జనాభా ప్రాతిపదికన రిజ ర్వేషన్లు ఉండనున్నందున అలాంటి సమస్య తలె త్తదని, ఇప్పటివరకు రిజర్వేషన్ ఫలాలు అందని వారికి లబ్ధి చేకూరుతుందని, తాము లేవనెత్తిన అంశాలను కమిషన్ పరిగణనలోకి తీసుకుంటుందని ఆశిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ‘సాక్షి’కి తెలిపారు. సమాచారాన్ని విశ్లేషించిన కమిషన్ 11 రాష్ట్రాల్లో ఇప్పటికే బీసీ వర్గీకరణ అమలవుతోంది. అయితే ఆ వర్గీకరణ రాష్ట్ర జాబితాలోని కులాలకు రాష్ట్రస్థాయిలో వర్తిస్తుంది. ఇప్పుడు ఈ జాతీయస్థాయి కమిషన్ కేంద్ర జాబితాలోని ఓబీసీ కులాల మధ్య రిజర్వేషన్ల పంపిణీకి కసరత్తు చేస్తోంది. ఇప్పటికే బీసీ కులాల ఉప వర్గీకరణ చేపట్టిన అన్ని రాష్ట్రాలతో, రాష్ట్ర స్థాయి వెనుకబడిన తరగతుల కమిషన్లతో ఈ కమిషన్ చర్చించింది. ఉన్నత విద్య కోర్సుల్లో ఓబీసీ విద్యార్థుల ప్రవేశానికి సంబంధించిన సమాచా రాన్ని, ప్రభుత్వంలో భాగమైన వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, బ్యాంకులు, ఆర్థిక సహాయ సంస్థలు, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో ఓబీసీలకు ఇచ్చిన ఉద్యోగాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా కమిషన్ సేకరించింది. ఈ సమాచారాన్ని క్రోడీకరించి ఇప్పటివరకు రిజర్వేషన్ పంపిణీలో చోటు చేసుకున్న అసమానతలను విశ్లేషించింది. సంబంధిత సమాచారం భారీ పరిమాణంలో ఉన్నందున దానిని శాస్త్రీయంగా విశ్లేషించి సమగ్ర నివేదికను రూపొందించేందుకు సమయం అవసరమైంది. అలాగే లాక్డౌన్ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రాల నుంచి సమాచారం రావడం ఆలస్యమైంది. వీటన్నింటినీ విశ్లేషించి, ముసాయిదాను రూపొందించిన కమిషన్ తన ప్రతిపాదనలపై వచ్చే నెల నుంచి రాష్ట్రాలు, ఓబీసీ కులాలు, సంబంధిత అంశంలో భాగస్వాములందరితో చర్చించనుంది. -
ఈడబ్ల్యూఎస్ వర్గాలకు కేసీఆర్ గుడ్న్యూస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈడబ్ల్యూఎస్ వర్గాలకు అదనంగా 10శాతం రిజర్వేషన్ కల్పించాలని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఇప్పటికే బలహీనవర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు అమలవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో ఈడబ్ల్యూఎస్తో కలిపి రాష్ట్రంలో రిజర్వేషన్ల శాతం 60కి చేరనుంది.దీనిపై కేసీఆర్ రెండు రోజుల్లో అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశం తర్వాత అధికారులకు రిజర్వేషన్ల అంశానికి సంబంధించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయనున్నారు. -
సొంతూళ్లకు సొంత వాహనాల్లోనే..
సాక్షి, అమరావతి: తెలుగు వారికి అతి ముఖ్యమైన పండుగ సంక్రాంతికి సొంతూళ్లు వెళ్లేవారు ఎక్కువగా సొంత వాహనాలకే మొగ్గు చూపుతున్నారు. బస్సులకు డిమాండ్ తగ్గిపోయింది. హైదరాబాద్–విజయవాడ మార్గంలో (ఎన్హెచ్–65) సొంత వాహనాలు కిటకిటలాడుతున్నాయి. సాధారణ రోజుల్లో ఈ మార్గంలో నాలుగువేల నుంచి ఐదువేల వ్యక్తిగత వాహనాలు టోల్గేట్లను దాటుతుంటాయి. రెండురోజుల నుంచి 12 వేల వరకు వాహనాలు టోల్గేట్ల మీదుగా వెళుతున్నాయి. సొంతూళ్లకు సొంత వాహనాలు, క్యాబ్లనే ప్రయాణికులు ఆశ్రయిస్తున్నారనేందుకు ప్రైవేటు, ఆర్టీసీ బస్సుల్లో డిమాండ్ తక్కువగా ఉండటమే నిదర్శనం. ఆర్టీసీ రెగ్యులర్ రిజర్వేషన్లు కూడా 60 శాతం దాటడం లేదు. ప్రత్యేక సర్వీసుల్లో అయితే సగం సీట్లు కూడా నిండలేదు. ఆర్టీసీ రిజర్వేషన్లను ఈనెల 8 నుంచి 13వ తేదీ వరకు ఆరురోజులు పరిశీలిస్తే రెగ్యులర్ సర్వీసుల్లో 60 శాతం ఆక్యుపెన్సీ దాటలేదు. ప్రత్యేక సర్వీసుల్లో అయితే 48.03 శాతం రిజర్వేషన్లే అయ్యాయి. ఈ దఫా ఆర్టీసీ రిజర్వేషన్లపై ప్రయాణికులు ఆసక్తి చూపడం లేదు. పండుగకు వెళ్లేందుకు, తిరుగు ప్రయాణంలోను ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేసి ఆర్టీసీ ఈ నెల 8 నుంచి 13 వరకు ప్రత్యేక బస్సుల్ని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఏపీలోని ముఖ్య నగరాలకు, పట్టణాలకు 571 సర్వీసులు ఏర్పాటు చేసింది. వీటితో పాటు రెగ్యులర్గా నడిచే సర్వీసులు అన్ని జిల్లాలకు 1,988 వరకు ఉన్నాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలకు ఈ సీజన్లో హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో వెళ్లే ప్రయాణికులు కేవలం 115 మంది మాత్రమే కావడం గమనార్హం. అధికశాతం సాఫ్ట్వేర్ ఉద్యోగులు సొంతూళ్లలోనే.. మామూలుగా సంక్రాంతి పండుగ సీజన్లో హైదరాబాద్, చెన్నై, బెంగళూరులలో ఉండే సాఫ్ట్వేర్ ఉద్యోగులు సొంతూళ్లకు వెళ్లేందుకు, తిరుగు ప్రయాణానికి అడ్వాన్స్ రిజర్వేషన్లు చేయించుకుంటారు. వీరి డిమాండ్ కారణంగానే రెగ్యులర్, ప్రత్యేక సర్వీసుల్లో నెలముందే రిజర్వేషన్ల ఆక్యుపెన్సీ 30 నుంచి 35 శాతం వరకు ఉంటుంది. ఇప్పుడు అడ్వాన్స్ రిజర్వేషన్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎక్కువ శాతం సాఫ్ట్వేర్ కంపెనీలు వర్క్ ఫ్రం హోం ఇవ్వడంతో 90 శాతం మంది ఉద్యోగులు సొంతూళ్లలోనే ఉన్నట్లు ఆర్టీసీ ట్రాఫిక్ వింగ్ అంచనా వేస్తోంది. రిజర్వేషన్లు బాగా తక్కువగా ఉండటానికి ఇదే ప్రధాన కారణంగా చెబుతున్నారు. విద్యాసంస్థలు తెరవకపోవడం, ఆన్లైన్ క్లాస్లు జరగడం వల్లే విద్యార్థులు కూడా సొంత ప్రాంతాలను దాటి రాలేదని, అందువల్లే రిజర్వేషన్లు చేసుకోలేదని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఉత్తరాంధ్ర,, ఉభయగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఆశాజనకంగా రిజర్వేషన్లు ఉన్నాయి. -
బోధనా సిబ్బంది నియామకాల్లో రిజర్వేషన్ల రద్దు వద్దు
సాక్షి, హైదరాబాద్: జాతీయ విద్యా సంస్థల్లో బోధనా సిబ్బంది నియామకాల్లో రిజర్వేషన్లు ఎత్తేయాలని నిపుణుల కమిటీ సూచించడంపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అమలు చేయొద్దని కేంద్ర ప్రభుత్వం నియమించిన 8 మంది నిపుణుల కమిటీ సిఫార్సు చేయడం సరికాదని, వాటిని కేంద్రం తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ప్రధానమంత్రి మోదీకి బీసీ సంక్షేమ సంఘం, బీసీ సంఘాల సమాఖ్య తరఫున ఆయన లేఖ రాశారు. రిజర్వేషన్లు ఎత్తివేయడమంటే దళిత, గిరిజన, బీసీ కులాలను అవమానించినట్లేనని పేర్కొన్నారు. ఇప్పటికే పలు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటుపరం కావడంతో ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంతరాన్ని సరిచేయాల్సిన అవసరం కేంద్రంపై ఉందని గుర్తుచేశారు. -
ఈ ఎత్తుగడ కోటా ఎత్తివేతకేనా?
కేంద్ర ప్రభుత్వం తన పరిధి తగ్గించుకుంటూ క్రమంగా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేయడానికి నిర్ణయాలు తీసుకుంటోంది. దీని మూలంగా అవి బడా కార్పొరేట్ల అధీనంలోకి వెళ్లిపోతాయి. అలా జరిగితే వాటి ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర సామాజిక వర్గాల రిజర్వేషన్ల అమలు ఉండదు. అంటే చట్టబద్ధంగా రద్దు చేయకుండానే ప్రైవేటీకరణ ద్వారా రిజర్వేషన్లు లేకుండా చేసే కుట్ర ఇది. దీని మూలంగా వందల సంవత్సరాలుగా అధికారానికి దూరంగా ఉన్న కులాలకు అధికారంలో వాటా దక్కకుండా అన్యాయం చేయడమే అవుతుంది. సామాజిక న్యాయం, సమ సమాజం నెలకొల్పాలనే రాజ్యాంగ లక్ష్యాలను ఇది విస్మరించడమే. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు తగని పని. కేంద్ర ప్రభుత్వం దశలవారీగా రైల్వే, ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, పోస్టల్, బీహెచ్ఈఎల్ తదితర ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేయడానికి నిర్ణయాలు తీసుకుంటోంది. దీని మూలంగా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు బడా కార్పొరేట్ దిగ్గజాల అధీనంలోకి వెళ్లిపోతాయి. ప్రభుత్వ రంగ సంస్థల వాటా 51 శాతం అమ్మిన, యాజమాన్య హక్కులను కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పిన వాటి ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర సామజిక వర్గాల రిజర్వేషన్ల అమలు ఉండదు. దీని మూలంగా రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన రిజర్వేషన్లకు తిలోదకాలు ఇచ్చినట్లు అవుతుంది. చట్ట బద్ధంగా రద్దు చేయకుండానే ప్రైవేటీకరణ ద్వారా రిజర్వేషన్లు లేకుండా చేయడం అవుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడంలో రెండు కోణాలున్నాయి. ఒకటి, కేంద్ర ప్రభుత్వం తనకు తానుగా తన పరిధిని తగ్గించుకొని బలహీన పరుచుకోవడం. తద్వారా ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది. రెండవది, సామాజిక న్యాయా నికి గండికొట్టడం. దీని మూలంగా వందల సంవత్సరాలుగా వివక్ష, అణచివేతల వల్ల అధికారానికి దూరంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు అధికారంలో ఇప్పటికీ వాటా దక్కకుండా అన్యాయం చేయడం. సామాజిక న్యాయం, సమ సమాజం నెలకొల్పాలనే లక్ష్యా లను ఇది విస్మరించడమే. చట్ట ప్రకారం రిజర్వేష న్లను రద్దు చేయ కుండా, దొడ్డి దారిన ప్రైవేటీకరణతో రిజర్వేషన్లు లేకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో దాదాపు 245 సంస్థలు ఉన్నాయి. ఇందులో దాదాపు 26 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. రైల్వేలో 13 లక్షలు, ఎల్ఐసీలో 2 లక్షలు, బీఎస్ఎన్ఎల్లో 3 లక్షలు, బీహెచ్ఈఎల్లో లక్షా 90 వేలు– ఇలా మొత్తం 26 లక్షల ఉద్యోగాలు పోతాయి. 51 శాతం వాటాలను కార్పొరేట్ సంస్థలకు అమ్మితే ప్రభుత్వం యాజమాన్య హక్కును కోల్పోతుంది. దీనితో ఉద్యోగ నియామకాల్లో ప్రభుత్వ నియంత్రణ ఉండదు. రిజర్వేషన్ల అమలు ఉండదు. ఇది ఇలా ఉండగా మరోవైపు జాతీయ బ్యాంకులను విలీనం చేసే ప్రక్రియ చేపట్టారు. దీనితో బ్యాంకింగ్ రంగంలో కూడా ఉద్యో గాల సంఖ్య తగ్గి రిజర్వేషన్ల కోటా తగ్గిపోతుంది. ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్ చాలాకాలంగా బలంగా ముందుకు వచ్చింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ డిమాండ్లను పక్కన పెట్టి, ఉన్న రిజర్వేషన్లకే గండికొట్టే కుట్రకు పాల్పడుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని రంగాల్లో– విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, న్యాయ రంగాల్లో జనాభా ప్రకారం కోటా ఇవ్వాలి. ఎస్సీ, ఎస్టీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో కోటా కల్పించారు. కానీ సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకాల్లో, రాజ్యసభ, కౌన్సిల్, నామినేటెడ్ పోస్టుల్లో మాత్రం కోటా కల్పిం చలేదు. ఇక బీసీలకు స్వాతంత్య్రం వచ్చిన 36 ఏళ్ల తర్వాత మండల్ కమిషన్ నివేదిక ప్రకారం, ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఆ తర్వాత కేంద్ర విద్యా సంస్థలలో 27 శాతం రిజర్వే షన్లు పాక్షికంగా ప్రవేశ పెట్టారు. జాతీయ స్థాయిలో బీసీల జనాభా 56 శాతం ఉంటే 27 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. పార్లమెంట్, అసెంబ్లీల్లో, హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల నియామకాల్లో రిజర్వేషన్లు పెట్టడం లేదు. అనేక సాకులు చూపుతూ దాటవేస్తున్నారు. కానీ రాజ్యాంగంలో లేని అగ్ర కులాల్లోని పేదలకు మాత్రం ఆగమేఘాల మీద రాజ్యాంగ సవరణ చేసి 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తే ఆటోమేటిగ్గా రిజ ర్వేషన్లు పోతాయి. దీనివల్ల 17 నుంచి 20 లక్షల వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉద్యోగాలు కోల్పోతారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ శాఖల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో 14 లక్షల ఉద్యోగాలను కొన్నేళ్లుగా భర్తీ చేయకుండా పెండింగులో పెట్టారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యో గాల్లో 1993 నుంచి మండల్ కమిషన్ ప్రకారం రిజర్వేషన్ల కోటా ప్రారంభించిన తర్వాత ఉద్యోగాల భర్తీ ఆపేశారు. దీంతో రిజర్వేషన్లు ఉన్నా ఆయా వర్గాలకు ఉపయోగం లేకుండా పోయింది. మండల కమిషన్ అమలు తర్వాత ఈ 37 సంవత్సరాల కాలంలో 27 శాతం ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 2016 నాటికి ఓబీసీ ఉద్యోగులు 14 శాతం దాటలేదు. ప్రత్యేకంగా క్లాస్–1 ఉద్యోగుల్లో ఓబీసీలు 9 శాతం దాటలేదు. సివిల్ సర్వీసులో పూర్తిస్థాయి ఖాళీలను భర్తీ చేయడం లేదు. ఇటీవల కేంద్ర హోంశాఖ పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో ఐఏఎస్లో 1657 ఖాళీలు, ఐపీఎస్లో 1420 ఖాళీలు ఉన్నట్లు పేర్కొంది. ఇన్ని ఖాళీలున్నా నాణ్యత తగ్గుతుందనే సాకుతో ఏటా ఐఏఎస్లో 100 లోపు, ఐపీఎస్లో 120 లోపు ఖాళీలు మాత్రమే భర్తీ చేస్తున్నారు. రక్షణ, బ్యాంకింగ్ రంగాల్లో పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నప్పటికీ భర్తీ చేయడం లేదు. దీని మూలంగా రిజర్వేషన్ కోటా భర్తీ కాక ఆయా వర్గాలకు అన్యాయం జరుగుతుంది. ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నా మొత్తం ఉద్యోగాల్లో ఇప్పటి వరకూ 12 శాతం దాటలేదు. ఎస్టీలకు 7.5 శాతం అమలు చేస్తున్నా జాతీయ స్థాయిలో 5 శాతం దాటడం లేదని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. కేంద్రంలో మొత్తం ఉద్యోగాల సంఖ్య 56 లక్షలు కాగా ఇందులో 26 లక్షల ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాలు పోతే, మిగిలేది 30 లక్షల ఉద్యో గాలు మాత్రమే. పెరుగుతున్న జనాభా, బడ్జెట్, సంక్షేమ అభివృద్ధి పథకాలకు తగ్గట్లుగా ఉద్యోగాల సంఖ్య పెరగాలి. ప్రభుత్వరంగ వ్యవ స్థను విస్తరించడం, బలోపేతం చేయడం ప్రజాస్వామ్య లక్షణం. కుదిం చడం, ప్రైవేటీకరించడం ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు తగదు. ఒకవైపు అన్ని రంగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతుండగా మరోవైపు ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడం ‘మూలిగే నక్క మీద తాటి పండు పడ్డ’ సామెతను గుర్తుతెస్తోంది. ఆర్థికమాంద్యంతో దెబ్బతిన్నందువల్లే ఆర్థిక వనరులు పెంచు కోవడానికి ప్రభుత్వ రంగ సంస్థల వాటాలు విక్రయిస్తున్నామనే కేంద్ర ప్రభుత్వ వాదన సరికాదు. బడ్జెట్ పెంచుకోవడానికి అనేక మార్గాలు న్నాయి. నగదు ముద్రించడం, డిపాజిట్లు సేకరించడం, విదేశీ రుణాలు తేవడం ద్వారా ఆదాయం పెంచుకోవచ్చు. ఎన్నికలకు ముందు బీజేపీ దేశ విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని బయటకు తెస్తామని ప్రకటించింది. ఆ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఇప్పుడు దేశంలో ఉన్న నల«్లధనాన్ని వెలికితీయడానికి అవరోధాలు ఏమిటి? నల్లధనాన్ని తెల్లధనంగా మార్చడానికి అనేక మార్గాలు ఉన్నాయి. 50 శాతం కేంద్రానికీ, మిగతాది ఆయా వర్గాలకూ ప్రోత్సాహకాల కింద క్రమబద్ధీకరణ చేసుకొమ్మని పిలుపునిస్తే దేశంలోని పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య, కాంట్రాక్టు రంగాల నుంచి 60 లక్షల కోట్ల నల్ల ధనం ప్రభుత్వ ఖాతాలో చేరుతుంది. దీనిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు. ఇలాంటి పథకాలు పెట్టడానికి అవరోధాలు ఏమిటి? ప్రభుత్వానికి ఆదాయం తెచ్చుకోవడం కంటే ప్రభుత్వరంగ ఆస్తులను చౌకగా కార్పొరేటు వర్గాలకు ధారాదత్తం చేయడమే లక్ష్యంగా కనబడుతోంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు అధికార చట్రంలోకి వస్తున్న సమయంలోనే ఈ సంస్థలను ప్రైవేటీకరించడం, పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఉద్యోగ అవకాశాలు లేకుండా పోవడం జరుగుతోంది. 2014లో తాము అధికారంలోకి వస్తే ఏటా కోటి ఉద్యోగాలు కల్పిస్తామని నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తించి ఎన్డీయే అధికారంలోకి వచ్చింది. కోటి ఉద్యోగాలు దేవుడెరుగు! ఖాళీ ఉద్యోగాల భర్తీయే లేదు. ప్రభుత్వరంగ సంస్థలను కొనసాగించడం, కొత్తవి ప్రారంభించడం ప్రజాస్వామ్య ప్రభుత్వాల బాధ్యత. అలా చేయకుండా రైల్వేను కూడా ప్రైవేటీకరిం చడం విచిత్రమైన విషయం. రైల్వేకు లక్షల కోట్ల భూములు, భవ నాలు, ఇతర ఆస్తులు ఉన్నాయి. వీటిని చౌక ధరలకు కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పడం న్యాయమా? ఏటా వేల కోట్ల లాభాలు ఆర్జించే సంస్థ, ఏటా కోట్లమంది పేద ప్రజలకు తక్కువ చార్జీలకు సేవలందిస్తున్న సంస్థను ప్రైవేటీకరించడంలో హేతుబద్ధత ఉందా? 40 కోట్ల మంది పాలసీదారులకు అండగా నిలిచే ఎల్ఐసీని ప్రైవేటు పరం చేయవలసిన అవసరం ఉందా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేలకోట్ల అప్పులు ఆపత్కాలంలో ఇచ్చి ఆదుకున్న సంస్థ అది. లాభాల్లో నడిచేవాటిని ప్రైవేటీకరణ చేయడంలో ఉన్న రహస్య మేమిటో ప్రజలకు చెప్పవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. ప్రజలకు మరిన్ని సేవలు అందించే సామాజిక బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకోవడం న్యాయమా? అధికారంతో ఏది చేసినా చెల్లు తుందని అనుకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు. వ్యాసకర్త అధ్యక్షులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్. కృష్ణయ్య మొబైల్: 90000 09164 -
విధ్వంసంతో రిజర్వేషన్లు సాధ్యమేనా?
సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడులో కులాల డేటాను సేకరించడానికి అనుసరించాల్సిన పద్ధతులను సూచించేందుకు త్వరలోనే ఓ కమిషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి సోమవారం ప్రకటించిన విషయం తెల్సిందే. విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో వెన్నియార్ సామాజిక వర్గానికి 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ మాజీ కేంద్ర మంత్రి అంబుమణి రాందాస్ నాయకత్వంలో పట్టాలి మక్కల్ కాట్చి ప్రతినిధి బృందం కలసి వెళ్లాక పళనిస్వామి ఈ ప్రకటన చేశారు. ప్రస్తుతం వెన్నియార్ సామాజిక వర్గం తమిళనాడులో ఎక్కువ వెనక బడిన వర్గాల (ఎంబసీ) జాబితాలోన కొనసాగుతోంది. ఓటర్లలో కూడా వారిది చాలా బలమైన వర్గం. 2021, ఏప్రిల్, మే నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వెన్నియార్ వర్గం తమకు ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో 20 శాతం రిజర్వేషన్లు కావాలంటూ డిమాండ్ తీసుకొచ్చింది. తమిళనాడులో ఇప్పటికే 69 శాతం రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పట్టాలి మక్కల్ కాట్చి (పీఎంకే), ఏఐఏడిఎంకే, బీజేపీలతో కలసి పోటీ చేయాలనుకుంటోంది. 2019లో ఏఐఏడీఎంకేతో కలసి పొత్తు పెట్టుకోవడం వల్లనే రామదాస్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. (కొత్త పార్టీ: రజనీకాంత్ కీలక ప్రకటన) వెన్నియార్ సామాజిక వర్గానికి ప్రత్యేకంగా రిజర్వేషన్లు కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా పీఎంకే ఆందోళన ప్రారంభించిన రోజునే కులాల డేటా సేకరణకు కమిషన్ను ఏర్పాటు చేస్తానంటూ పళనిస్వామి ప్రకటించారు. తమ డిమాండ్ను రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించేంత తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాలంటూ పార్టీ కార్యకర్తలకు పార్టీ వ్యవస్థాపక నాయకుడు రామదాస్ పిలుపునివ్వడంతో ఆందోళన విధ్వంసం చోటు చేసుకుంది. చెన్నై నగరంలోకి ఎక్స్ప్రెస్ రైలు రాకుండా శివారులోనే దానిపై ఆందోళనకారులు రాళ్లతో దాడి చేశారు. ప్రధాన రహదారులన్నింటిని మూసివేశారు. దీంతో పీఎంకేను నిషేధించాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్లు వెల్లువెత్తాయి. మద్రాస్ హైకోర్టు జోక్యం చేసుకొని విధ్వంసానికి బాధ్యులను చేస్తూ రామదాస్తోపాటు ఆయన కుమారుడు అంబుమణి రామదాస్లపై కేసులు నమోదు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. (బీజేపీతో మైత్రి కొనసాగుతుంది: అన్నాడీఎంకే) ఆందోళనల్లో విధ్వంసం సష్టించడం పీఎంకేకు కొత్త కాదు. వెనకబడిన వర్గాల (బీసీ) జాబితా నుంచి ఎక్కువ వెనకబడిన వర్గాల (ఎంబీసీ) జాబితాను వేరు చేయాలంటూ 1987లో పీఎంకే ఆందోళనలో విధ్వంసకాండకు పాల్పడగా 21 మంది మరణించారు. ఆ నేపథ్యంలోనే 1989లో అప్పటి డీఎంకే ప్రభుత్వం 20 శాతం రిజర్వేషన్లతో ఎంబీసీ కోటాను ఏర్పాటు చేసింది. ప్రస్తుతానికి పీఎంకే ఆందోళనలను ఆపేందుకే కులాల డేటా సేకరణకు కమిషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. దీనవల్ల విపరీత పరిణామాలు చోటుచేసుకొనే ప్రమాదం ఉంది. (నాన్న పార్టీ.. నాకు సంబంధం లేదు: విజయ్ ) తమిళనాడు కమిషన్ వేసినా కులాల డేటాకు సర్వే నిర్వహించక పోవచ్చు. ఒకవేళ నిర్వహించినా దాన్ని విడుదల చేయకపోవచ్చు. కులాల ప్రాతిపదికన కాకుండా దేశంలో సామాజికంగా, ఆర్థికంగా వెనకబాటు ప్రాతిపదికన 2011లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేనే ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా విడుదల చేసేందుకు సాహసించలేదు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ కూడా 2015లో ప్రజల సామాజిక, ఆర్థిక వెనకబాటుతనం మీద చేసిన సర్వేను ఇంతవరకు విడుదల చేయలేదు. ఇందుకు కారణం ఎఫ్సీ, బీసీ, ఓసీ, ఎంబీసీల డేటాకు సంబంధించి ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉజ్జాయింపుగా చెబుతున్న లెక్కలకు, ఆయా సామాజిక వర్గాలు చెబుతున్న లెక్కలకు, సర్వే లెక్కలు భిన్నంగా ఉండడమే. సర్వే వివరాలను బయటకు వెల్లడించడం వల్ల ప్రభుత్వాలకు, పార్టీలకు మధ్య గొడవలే కాకుండా, సమాజంలో కూడా అశాంతి పరిస్థితులు ఏర్పడుతాయన్న భయమే ప్రధాన కారణం. తమిళనాడులో సర్వే నిర్వహిస్తే రాష్ట్ర జనాభాలో వెన్నియార్ సామాజిక వర్గం వారు 20 శాతం కూడా లేరని తెలిస్తే గొడవలు జరగుతాయి. ఎంబీసీ జాబితా నుంచి వారిని వేరు చేసి, ప్రస్తుతం డిమాండ్ చేస్తున్నట్లు వారికి ప్రత్యేక క్యాటగిరీ కింద 20 శాతం రిజర్వేషన్లు కేటాయించిన ఇతర సామాజిక వర్గాలు ఆందోళనలకు దిగుతాయి. అప్పుడు రాష్ట్రంలో రిజర్వేషన్లు కూడా 89 శాతం చేరుకుంటాయి. రిజర్వేషన్లు 50 శాతం కోటాను మించకూడదంటూ సుప్రీం కోర్టు మార్గదర్శకాలు సూచించిన విషయ తెల్సిందే. -
50% ఓబీసీ కోటాకు నో
న్యూఢిల్లీ: వైద్య విద్యా సంస్థల్లో ఓబీసీలకు ఈ విద్యా సంవత్సరం నుంచే 50 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలన్న తమిళనాడు ప్రభుత్వ ప్రయత్నాలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తమ రాష్ట్రంలోని వైద్య విద్యా సంస్థల గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డెంటల్ కోర్సులకు ఆల్ ఇండియా కోటాలో ఓబీసీలకు 50శాతం రిజర్వేషన్ను 2020–21 విద్యా సంవత్సరం నుంచే అమలు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ తమిళనాడు ప్రభుత్వం, అక్కడి అధికార పార్టీ ఏఐఏడీఎంకే పెట్టుకున్న అర్జీలపై సోమవారం జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ అజయ్ రస్తోగిల ధర్మాసనం విచారణ చేపట్టింది. తమిళనాడు రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వేతర విద్యాసంస్థల్లో ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్ల అమలుకు జూలై 27వ తేదీన చేపట్టిన విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టు అంగీకారం తెలిపింది. అయితే, రిజర్వేషన్ల అమలు విధానపరమైన అంశం అయినందున కేంద్రానికి తగు ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరాకరించిన మద్రాస్ హైకోర్టు మూడు నెలల గడువు ఇచ్చింది. దీనిపై తాజాగా సుప్రీంకోర్టులో పిటిషనర్లు సవాల్ చేశారు. ఈ విద్యాసంవత్సరం నుంచే ఓబీసీ కోటా అమలు చేయాలనే విషయంలో కూడా మద్రాస్ హైకోర్టు ఒక స్పష్టత ఇవ్వలేదని అందులో పేర్కొన్నారు. అయితే, ప్రస్తుత విద్యాసంవత్సరంలో 50 శాతం కోటా అమలు ఆచరణలో సాధ్యం కాదని ధర్మాసనానికి కేంద్రం తెలిపింది. వాదనలు విన్న ధర్మాసనం తమిళనాడు పిటిషన్లను తోసిపుచ్చుతూ తీర్పు వెలువరించింది. మధ్యప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వుపై సుప్రీం స్టే అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారాన్ని భౌతికంగా కాకుండా ఆన్లైన్ ద్వారా నిర్వహించుకోవచ్చని రాజకీయ పార్టీలకు సూచిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చట్ట నిబంధనల ప్రకారం ఎన్నికల ర్యాలీలపై సరైన నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల ›సంఘానికి సూచించింది. ఈ మేరకు జస్టిస్ ఎ.ఎం.ఖన్వీల్కర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం ఉత్తర్వు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో పరిస్థితుల్లో మార్పు రాలేదన్న విషయాన్ని మధ్యప్రదేశ్ హైకోర్టు గుర్తించాలని వ్యాఖ్యానించింది. కరోనా నేపథ్యంలో ఉప ఎన్నికల విషయంలో అన్ని రకాల నియమ నిబంధనలు పాటిస్తున్నామని ఎన్నికల సంఘం ధర్మాసనానికి తెలిపింది. మధ్యప్రదేశ్లో నవంబర్ 3వ తేదీన 28 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలతోనే ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ భవితవ్యం తేలిపోనుంది. -
రిజర్వేషన్లు ప్రకటించిన ఇంటర్ బోర్డ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ (2020-21) సంవత్సరానికి అడ్మిషన్ షెడ్యూల్ ప్రకటించింది. అప్లికేషన్ ఫామ్ను సెప్టెంబర్ 16(బుధవారం)న ఇష్యూ చేస్తుంది. ఆన్లైన్ తరగతులను సెప్టెంబర్ 18(శుక్రవారం)న ప్రారంభించనున్నారు. అడ్మిషన్లకు చివరి తేదీగా సెప్టెంబర్ 30న బోర్డ్ నిర్ణయించింది. అయితే కేటగిరీ వారిగా రిజర్వేషన్లు: షెడ్యూల్ క్యాస్ట్స్(ఎస్సీ)-15శాతం, షెడ్యూల్ ట్రైబ్స్(ఎస్టీ)-6శాతం, బ్యాక్వర్డ్ క్లాసెస్(బీసీ)- 29శాతం(బీసీ సబ్ కేటగిరీల వారిగా రిజర్వేషన్లు: బీసీ ఏ (7శాతం), బీసీ బీ (10శాతం), బీసీ సీ (1శాతం), బీసీ డీ (7శాతం), బీసీ ఈ (4శాతం), ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్(3శాతం), ఎన్సీసీ, స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్(5శాతం), ఎక్స్ సర్వీస్మెన్, డిఫెన్స్, పర్సనల్ రిసైడింగ్ ఇన్ ద స్టేట్(3శాతం), ఎకనామికల్లీ వీకర్ సెక్షన్(10శాతం) ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. అయితే మొత్తం సీట్లలో 33.3శాతం బాలికలకు కేటాయించినట్లు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రెటరీ సయ్యద్ ఉమర్ జలీల్ పేర్కొన్నారు. -
పాత సీట్లకు ప్రభుత్వ ఫీజులే
సాక్షి, హైదరాబాద్: పాత విద్యా సంస్థలనే యూనివర్సిటీలుగా మార్చితే అవి బ్రౌన్ఫీల్డ్ యూనివర్సిటీలుగా, పాత విద్యా సంస్థలు లేకుండా కొత్తగా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తే గ్రీన్ఫీల్డ్ యూనివర్సిటీలుగా అనుమతి ఇచ్చామని విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి స్పష్టంచేశారు. బ్రౌన్ఫీల్డ్ వర్సిటీల్లో పాత సీట్లకు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులే ఉంటాయని, వాటికి ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందని పేర్కొన్నారు. అదే వర్సిటీల్లో కొత్త సీట్లలో చేపట్టే ప్రవేశాల్లో మాత్రం యాజమాన్యాలే ఫీజులను నిర్ణయిస్తాయని, వాటికి రీయింబర్స్మెంట్ వర్తించదని స్పష్టం చేశారు. సోమవారం అసెంబ్లీలో ప్రైవేటు యూనివర్సిటీల సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా సభ్యలు లేవనెత్తిన వివిధ అంశాలపై ఆమె వివరణ ఇచ్చారు. ఇంజనీరింగ్ కాలేజీల విషయంలో నిబంధనలు పాటించని మంత్రులు, ఎమ్మెల్యేల కాలేజీలను కూడా మూసివేయించామని చెప్పారు. యూనివర్సిటీల ఏర్పాటుకు 16 దరఖాస్తులు వస్తే నిపుణుల కమిటీ సిఫారసు చేసిన 9 సంస్థల్లో 8 సంస్థలు ముందుకు వచ్చాయని, అందులో వివాదాల్లేని 5 సంస్థలకు మొదటి విడతలో అనుమతి ఇచ్చామని, మిగతావి ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని వివరించారు. గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీల్లో ఫీజులు యాజమాన్యాలే నిర్ణయించుకుంటాయని, ఆయా సంస్థల గవర్నింగ్ బాడీలో విద్యాశాఖ కార్యదర్శి ఉంటారని, ప్రభుత్వ నియంత్రణ ఉంటుం దని అన్నారు. వాటిల్లో 25 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే ఇవ్వాలన్న నిబంధన ఉందన్నారు. వీసీలు, అధ్యాపకుల నియామకాలకు లైన్ క్లియర్ అయిందన్నారు. ప్రపంచస్థాయి ఎలా సాధ్యం? ఎమ్మెల్యే డి. శ్రీధర్బాబు మాట్లాడుతూ వర్సిటీల్లో వసతులే లేకుంటే ప్రపంచస్థాయిలో అవి ఎలా పోటీ పడతాయని ప్రశ్నిం చారు. ఎమ్మెల్యే మోజంఖాన్ మాట్లాడుతూ ప్రైవేటు వర్సిటీల్లో పేదలకు రిజర్వేషన్లు కల్పి ంచాలన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజేందర్రెడ్డి, సంజయ్ మాట్లాడుతూ ప్రైవేటు వర్సిటీల అవసరం ఎంతైనా ఉందన్నారు. సభ్యుల ప్రశ్నలపై మంత్రి సమాధానం ఇచ్చాక బిల్లును సభ ఆమోదించింది. -
‘ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలన్ని స్థానికులకే’
భోపాల్: మధ్యప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుభవార్త తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో వంద శాతం రాష్ట్ర యువతకే అర్హత కల్పిస్తామని మంగళవారం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. అయితే 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో రాష్ట్ర యువతకే ప్రభుత్వ ఉద్యోగాలు అనే ప్రకటనను సీఎం చౌహాన్ వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా 10, 12వ తరగతి మార్కుల ఆధారంగా ఉద్యోగ నియామకాలను చేపట్టనున్నట్లు సీఎం తెలిపారు. రాష్ట్రంలో ప్రతిభ గల విద్యార్థులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వ పథకాల అమలులో సింగిల్ డేటా బేస్లో(వివిధ పథకాలకు అర్హుల జాబితా) పొందు పరుస్తామని తెలిపారు. ఈ ప్రక్రియతో పథకాల లబ్డిదారులు ఒక సారి డేటా బేస్లో తమ పేరును నమోదు చేసుకుంటే అర్హత కలిగిన వివిధ పథకాలను పొందవచ్చని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. చదవండి: సీఎం ఎడిటెడ్ వీడియో పోస్ట్ .. దిగ్విజయ్పై కేసు -
లాక్డౌన్ ఎత్తివేస్తే హైదరాబాద్ వదిలి వెళ్లేందుకు..
సాక్షి, సిటీబ్యూరో: కరోనా కలవరం సృష్టిస్తోంది. అన్ని వర్గాల్లోనూ ఆందోళన రేపుతోంది. అందరినీ గందరగోళానికి గురి చేస్తోంది. మరికొద్ది రోజుల్లో లాక్డౌన్ ఎత్తివేస్తారనే అంచనాలతో నగరవాసులు క్రమంగా ఊపిరి పీల్చుకునే వేళలో.. రోజురోజుకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు.. లాక్డౌన్ పొడిగింపు దిశగా ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయి. లాక్డౌన్కు ముందు పలు కారణాలతో వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులు ఈ నెల 15న లాక్డౌన్ ముగిస్తే సొంత ఊళ్లకు వెళ్లవచ్చని ఆశించారు. ఈ మేరకు రైళ్లలో రిజర్వేషన్ల కోసం ఆన్లైన్ బుకింగులకు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. కానీ తాజాగా లాక్డౌన్ పొడిగింపునకే ప్రభుత్వం అనుకూలంగా ఉండడంతో ప్రయాణికుల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. మొన్నటిదాకా రిజర్వేషన్ల బుకింగ్ కోసం ఎదురు చూసినవారు ప్రస్తుతం ప్రయాణాల రద్దు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. మరోవైపు లాక్డౌన్ సమయంలోనూ రైళ్ల రాకపోకలతో నిమిత్తం లేకుండా, రైల్వేతో ఎలాంటి సమన్వయం లేకుండా ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ బుకింగ్లకు అవకాశం కల్పించడం కొంత గందరగోళానికి దారితీసింది. డిమాండ్ అనూహ్యం.. ‘లాక్డౌన్ ఎత్తివేస్తే జనం హైదరాబాద్ వదిలి వెళ్లేందుకు పరుగులు పెడతారేమోనని రిజర్వేషన్లకు డిమాండ్ కనిపిస్తోంది’ అని దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఈ నెల 15 వరకు లాక్డౌన్ గడువు విధించడంతో హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖ, కాకినాడ, తిరుపతి, బెంగళూర్, ముంబై తదితర ప్రాంతాలకు వెళ్లే రైళ్లకు ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడింది. 16 నుంచి వారం రోజుల పాటు అన్ని రైళ్లలో ఏసీ, నాన్ ఏసీ బెర్తులకు బుకింగ్ పెరిగింది. కొన్ని రైళ్లలో వెయిటింగ్ లిస్టు కనిపించింది. వివిధ కారణాలతో నగరంలో చిక్కుకొనిపోయిన వారు లేదా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు రావాల్సిన వారు రైళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో ఒక్కసారిగా డిమాండ్ కనిపించింది. మరోవైపు కొద్దిరోజుల పాటు లాక్డౌన్ తొలగించి తిరిగి మళ్లీ విధించవచ్చనే వార్తల దృష్ట్యా కూడా చాలామంది సొంత ఊళ్లకు వెళ్లేందుకు సిద్ధపడ్డారు. కానీ లాక్డౌన్ పొడిగింపునకే కేంద్రం, రాష్ట్రం సుముఖంగా ఉండటంతో ఇప్పుడు మరో గత్యంతరం లేక ప్రయాణాల రద్దు కోసం ముందుకు వస్తున్నారు. మరోవైపు లాక్డౌన్పై నెలకొన్న సందిగ్ధం ప్రయాణికులను తీవ్ర గందరగోళానికి గురి చేస్తోంది. ‘లాక్డౌన్ పొడిగిస్తారో, తొలగిస్తారో తెలియనప్పుడు ఆన్లైన్ రిజర్వేషన్లు అందుబాటులో ఉంచడం ఎందుకు’ అంటూ ప్రయాణికులు ఆందోళన వ్కక్తం చేస్తున్నారు. ఎందుకీ గందరగోళం? ఒకవైపు బుకింగులు, మరోవైపు రద్దుతో ప్రయాణాల రాకపోకలపై నెలకొన్న గందరగోళాన్ని తొలగించేందుకు రైల్వేశాఖ కొంత మేరకు స్పష్టతనిచ్చింది. ‘కేంద్రం లాక్డౌన్ పొడిగిస్తే రైళ్లు నడిచేందుకు అవకాశం ఉండదు.లాక్డౌన్ ఎత్తివేస్తే రైళ్లు అందుబాటులోకి వస్తాయి. కానీ ఆన్లైన్ బుకింగులు లాక్డౌన్ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఓపెన్ చేసినవి కాదు’ అని దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. ‘ప్రయాణికులు 3 నెలలు ముందే బుక్ చేసుకొనేందుకు ఆన్లైన్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఇది లాక్డౌన్ కోసం ఉద్దేశించింది కాదు’ అని పేర్కొన్నారు. వెంటనే రిఫండ్.. ఐఆర్సీటీసీ ఆన్లైన్ ద్వారా రిజర్వేషన్లు బుక్ చేసుకున్నవారు తిరిగి తమ ప్రయాణాలను రద్దు చేసుకుంటే నాలుగైదు రోజుల్లోనే రిఫండ్ వారి ఖాతాల్లో జమ అవుతుందని ఐఆర్సీటీసీ ఉన్నతాధికారి సంజీవయ్య తెలిపారు. గత నాలుగైదు రోజులుగా బుక్ చేసుకున్న వారు లాక్డౌన్ పొడిగింపు వార్తల నేపథ్యంలో తిరిగి రద్దు చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. -
వదంతులకు చెక్ పెట్టిన రైల్వే శాఖ
సాక్షి, న్యూఢిల్లీ: కరోనాపై పోరులో భాగంగా దేశవ్యాప్తంగా 21రోజుల లాక్ డౌన్ అమలవుతోంది. ఈ క్రమంలో అన్ని రవాణా వ్యవస్థలు స్థంభించిపోయాయి. ముఖ్యంగా దేశంలో మొత్తం రైలు సర్వీసులను కూడా నిలిపి వేశారు. గూడ్స్ రైళ్లు మినహా మిగతా రైళ్లన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. అయితే ఏప్రిల్ 15 నుంచి రైల్వే రిజర్వేషన్ సంస్థ ఐఆర్ సీటీసీ రిజర్వేషన్ల ప్రక్రియను మొదలుపెట్టిందని పలు నివేదికలు వెలువడ్డాయి. దీనిపై స్పందించిన రైల్వే మంత్రిత్వ శాఖ గురువారం ట్విటర్ ద్వారా వివరణ ఇచ్చింది. అసలు తాము ఏప్రిల్ 15 (అంటే లాక్ డౌన్ తరువాతి సమయానికి సంబంధించి) నుంచి బుకింగ్లను నిలిపి వేసిందని లేదనీ అది పాత ప్రకటన అనే గమనించాలని ట్వీట్ చేసింది. ప్రస్తుతానికి లాక్ డౌన్ పరిస్థితులు కొనసాగుతున్నందున తాజాగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది. లాక్ డౌన్ ఆదేశాలకు మేరకు తాము లాక్ డౌన్ సమయం వరకే టికెట్ రిజర్వేషన్లను ఆపేశామని వెల్లడించింది. అంటే ఏప్రిల్ 14 వరకు ఇది అమలులో ఉంటుందని రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిజానికి రైల్వే టికెట్లు 120 రోజుల ముందుగా బుక్ చేసుకునే అవకాశం ఉంటుందని, దాన్ని చూసి కొంతమంది అపోహ పడుతున్నారని క్లారిటీ ఇచ్చింది. లాక్ డౌన్ సమయం తర్వాతి ప్రయాణాల కోసం తాము ఎప్పుడూ టికెట్ రిజర్వేషన్లు ఆపలేదని స్పష్టం చేసింది. ఒకవైపు లాక్ డౌన్ పొడిగించే అవకాశం ఉందంటూ ఊహాగానాలు కూడా వెలువడుతున్నాయి. మరోవైపు రైల్వే టికెట్ల రిజర్వేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 15 నుంచి తిరిగి ప్రారంభించారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో రైల్వే మంత్రిత్వ శాఖ స్పందించింది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పాటిస్తున్నప్పటికీ కరోనా వైరస్ విజృంభిస్తోంది. పలు రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. చదవండి: కరోనా : ఎయిరిండియా పైలట్లకు షాక్ Certain media reports have claimed that Railways has started reservation for post-lockdown period. It is to clarify that reservation for journeys post 14th April was never stopped and is not related to any new announcement. pic.twitter.com/oJ7ZqxIx3q — Ministry of Railways (@RailMinIndia) April 2, 2020 -
నాడు రాజన్న.. నేడు జగనన్న..
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉత్తరాంధ్ర అంటేనే వెనుకబడిన ప్రాంతం.. ఇక్కడ అత్యధికంగా ఉన్న బీసీలకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో అనేక సంక్షేమ ఫలాలు అందేవి. బీసీ రుణాలతో ఆ సామాజిక వర్గం వారు ఆర్థికాభివృద్ధి సాధించేవారు. టీడీపీ అధికంలోకి వచ్చిన తరువాత బీసీల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. బీసీలను ఆదుకుంటామని ప్రగల్భాలు పలికిన మాజీ సీఎం చంద్రబాబు వారి సంక్షేమాన్ని అటకెక్కించారు. ఆ సమయంలో ప్రజా సంకల్పయాత్ర చేపట్టి బీసీల కష్టాలను తెలుసుకున్న జగన్మోహన్రెడ్డి సార్వత్రిక ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్ను ప్రకటించారు. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో అదనంగా పదిశాతం సీట్లను బీసీలకు కేటాయిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆ సామాజిక వర్గం వారు హర్షం వ్యక్తంచేస్తున్నారు. సీఎం సంచలన నిర్ణయం ఎన్నికల్లో సీట్లు కేటాయింపులో బీసీ, ఉపకులాలకు సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రాధాన్యమిచ్చారు. బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో రిజర్వేషన్లు పెంచినప్పటికీ టీడీపీ వేసిన పిటిషన్ల కారణంగా ఆ ప్రయత్నం ఫలించలేదు. 50 శాతానికే రిజర్వేషన్లు నిర్ణయించాలని న్యాయస్థానం స్పష్టం చేయడంతో కోర్టు తీర్పును గౌరవించిన అధికారపార్టీ ఇచ్చిన మాటను నిలుపుకోవడంలోనూ వెనుకంజ వేయలేదు. జనరల్కు కేటాయించిన స్థానాల్లో కొన్నింటిని బీసీలకు ఇవ్వడం ద్వారా మరో కోర్టు తీర్పు వల్ల కోల్పోయిన 10 శాతం రిజర్వేషన్లను పార్టీ తరఫున ఇస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన సంచలన ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. వైఎస్ అలా.. చంద్రబాబు ఇలా.. బీసీ వర్గాల్లో చదువుకునే విద్యార్థులకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ఒక్కరంటే ఒక్కరికీ ఫీజులు గానీ, ఫీజు రీయింబర్స్మెంట్గానీ పెండింగ్ లేకుండా అందజేసేవారు. చంద్రబాబు హయాంలో జిల్లాలో 74,800 మంది విద్యార్థులు ఫీజులు, రీయింబర్స్మెంట్కోసం ఎదురుతెన్నులు చూసేవారు. జిల్లా వ్యాప్తంగా వివిధ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఫీజులు కట్టలేక అల్లాడారు. ఉన్నత తరగతులకు వెళ్లాల్సిన వారు, ఇతర కళాశాలలకు వెళ్లాల్సిన వారికి ఫీజులు కట్టడం లేదని ఆయా కళాశాలల యాజమాన్యాలు సర్టిఫికేట్లు ఇవ్వకుండా వేధించాయి. ఎంతో ఉన్నత ఆశయంతో ఆనాడు వైఎస్ తలపెట్టిన ఈ ఫీజురీఎంబర్స్మెంట్ పథకాన్ని అమలు కానివ్వలేదు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అప్పటి ఫీజులకు ఎంత మొత్తం ఉంటే అంత మొత్తం చెల్లించేవారు. దీంతో పూర్తిగా విద్యార్థుల పేరిట కళాశాలలకు ఫీజులందేవి. తల్లిదండ్రులకు కూడా ఎటువంటి ఆవేదన కానీ, ఇబ్బందులు కానీ పడేవారు కాదు. చంద్రబాబు హయాంలో విద్యార్థి సంఘాలు పోరాడుతుంటే పోలీసులతో వారిని చావగొట్టించారు. వైఎస్ హయాంలో కొన్ని కులాలను బీసీల్లోకి చేర్చి వారికి అన్ని రంగాలలోను అభివృద్ధి చెందేలా దోహదపడ్డారు. కొన్ని కులాల వర్గీకరణ లేకపోతే వర్గీకరణ చేసి వారికి వివిధ పథకాల ద్వారా న్యాయం జరిగింది. ప్రతి కుటుంబానికి పింఛన్, పేద రైతుకు ఉచిత విద్యుత్ని అందజేసి ఆదుకున్నారు. చంద్రబాబు హయాంలో బీసీలకు దిశా, దశాలేని కులాలకార్పొరేషన్ ఏర్పాటు ప్రకటన చేశారు. తండ్రిని మించిన తనయుడు... మళ్లీ ఇప్పుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తున్నారు. బీసీల్లో 135 ఉపకులాలు ఉన్నాయి. జిల్లాలో దాదాపు 14.40 లక్షల బీసీ జనాభా ఉంది. తూర్పుకాపు, యాదవ, కుమ్మరి, చాకలి, వండ్రంగి, కంసాలి, నాయీ బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, యాత, ఈడిగ, తదితర కులాలు అధికంగా ఉన్నారు. ఎన్నికల ముందు ఏలూరులో బీసీ గర్జన సదస్సు నిర్వహించిన జగన్ వారికి భరోసా ఇచ్చారు. బీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చాచు. అన్న మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే వారికి తీపి కబురు చెప్పారు. క్షౌ రశాలలకు 250 యూనిట్లు విద్యుత్ ఉచితం ఇస్తామన్నారు. డొమెస్టిక్ పర్పస్ 500 యూనియట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. దేవాలయాల్లో ఉద్యోగులకు ట్రస్టుబోర్డులో నామిటెడ్పోస్టులో అవకాశం ఇస్తామన్నారు. ఇప్పటివరకూ ఏ ప్రభుత్వం ఇవ్వని ప్రాధాన్యత వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీలకు ఇచ్చారు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు పదిశాతం అదనంగా సీట్లు కేటాయించిన వైఎస్ జగన్ మడమ తిప్పని నైజంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఔదార్యం మరువలేనిదని, ఆయన రుణం తీర్చుకోలేమని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విశ్వసనీయతకు నిదర్శనం సీఎం ఇచ్చిన మాట ప్రకారం హామీలను అమలుచేస్తున్న ఏకైక సీఎం జగన్మోహన్రెడ్డి. ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన నాటి నుంచి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మాదిరిగా బీసీల గుర్తింపు, అభివృద్ధి, సంక్షేమం, మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టారు. ఇప్పుడు వాటిని నెరవేర్చారు. ఇక బీసీల పయనమంతా ఆయన వెంటే. – ముద్దాడ మధు, ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, విజయనగరం తండ్రిని మించిన తనయుడు తండ్రిని మించిన తనయుడిగా సీఎం జగన్మోహన్రెడ్డి పేరుతెచ్చుకున్నారు. అతి తక్కువ సమయంలో మంచి సీఎంగా మన్ననలు పొందుతున్నారు. జనాభా ప్రాతిపదికతో పాటు మానవతా దృక్పథంతో బీసీల అభ్యున్నతికి చట్టబద్ధంగా అడుగులు వేయడం అభినందనీయం. బీసీల అభివృద్ధిని కాంక్షించే సీఎంగా పేరుకెక్కారు. – సానమునేటి శ్రీనివాసరావు, నగరాల సంఘం జిల్లా అధ్యక్షుడు, విజయనగరం సముచిత స్థానం బీసీలకు రాజ్యాధికారం దిశగా సీఎం అడుగులు వేస్తున్నారు. రాబోయే రోజుల్లో బీసీలకు మరింత సేవ చేస్తారని అనిపిస్తోంది. ఇప్పటికే మంత్రివర్గ కూర్పులోగాని, బడ్జెట్ కేటాయింపుల్లో గాని బీసీలకు సముచిత స్థానం కలి్పంచారు. గత 30 ఏళ్ల కాలంలో ఏ ముఖ్యమంత్రి బీసీలకు చేయలేని విధంగా చేస్తున్నారు. ఇప్పటికే అనేక పథకాలు అమలవుతున్నాయి. ఆయనలో అద్భుతమైన ఆలోచనలు, ఆచరణలు కనిపిస్తున్నాయి. – రామేశ్వరపు రామారావు, నాయీబ్రాహ్మణ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, విజయనగరం బీసీల అభివృద్ధి జగన్తోనే సాధ్యం బీసీల అభివృద్ధి, సంక్షేమం సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డితోనే సాధ్యం. గతంలో అధికారంలో లేకపోయినా బీసీల పక్షపాతిగా సేవలందించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక బీసీలకు పెద్దపీట వేసి గుర్తింపునిచ్చారు. ఎన్నికల్లో బీసీలంతా జగన్మోహన్రెడ్డికి ఏకపక్షంగా ఓట్లు వేశారు. – లెంక అప్పలరాజు, పూల్భాగ్కాలనీ, విజయనగరం -
నేడు సర్పంచ్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు
-
బీసీలకు 34 శాతం సీట్లు ఇస్తున్నాం
కడప కార్పొరేషన్: రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని హైకోర్టు చెప్పినా బీసీలకు వైఎస్సార్సీపీ తరఫున 34 శాతం టికెట్లు ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చిత్తశుద్ధి ఉంటే టీడీపీ కూడా ఇవ్వాలని సవాల్ విసిరారు. ఆదివారం కడపలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఎంపీ, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. - సీఎం వైఎస్ జగన్ అధికార పగ్గాలు చేపట్టిన 9 నెలల్లో దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా అద్భుత పాలన అందించారు. - విద్య, వైద్య, ఆరోగ్య పరంగా రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా తీసుకుపోతూ మేనిఫెస్టోలో చెప్పిన 90 శాతం హామీలను అమలు చేశారు. - బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లోనూ, పనుల్లోనూ 50 శాతం రిజర్వేషన్లు ఇస్తూ చట్టం చేశారు. - స్థానిక ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనుకున్నా కోర్టు 50 శాతానికి కుదించింది. దీనివల్ల బీసీలు కోల్పోయే పది శాతం రిజర్వేషన్లను పార్టీ ద్వారానే ఇచ్చి గెలిపించుకుంటాం. - బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తుంటే ఓర్వలేక కోర్టుకు పోయి స్టే తెచ్చిన టీడీపీ.. మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించడం విడ్డూరంగా ఉంది. - ఎన్నికల్లో పోటీ విషయమై చంద్రబాబు వ్యాఖ్యలను బట్టి చూస్తే తెలుగుదేశం పార్టీ కథ ఖతమ్ అయినట్లేననిపిస్తోంది. - మార్చి 31లోపు ఎన్నికలు జరగకపోతే రాష్ట్రానికి రావాల్సిన రూ. 5 వేల కోట్ల నిధులు రాకుండా పోతాయని తెలిసి టీడీపీ కుట్ర చేసింది. అందుకే నెలలోపే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. - ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం అంజాద్బాషా, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి, విప్ కొరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, పి.రవీంద్రనాథ్రెడ్డి, రాచమల్లు శివప్రసాద్రెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, డా.వెంకట సుబ్బయ్య, డా.సుధీర్రెడ్డి, కడప, రాజంపేట పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు సురేష్బాబు, ఆకేపాటి తదితరులు పాల్గొన్నారు. - స్థానిక సంస్థల ఎన్నికలపై ఆదివారం సజ్జల ట్వీట్ చేస్తూ.. ప్రతిపక్ష నేత చంద్రబాబు అడ్డుకున్నా బీసీల అభివృద్ధి ఆగదని చెప్పారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీల అభివృద్ధి విషయంలో కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. స్థానిక ఎన్నికల్లో 10 శాతం అధిక రిజర్వేషన్లు బీసీలకు కల్పించి చిత్తశుద్ధిని చాటారని తెలిపారు. డబ్బు, మద్యం లాంటి ప్రలోభాలు లేకుండా సీఎం జగన్ పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తుంటే.. చంద్రబాబు మాత్రం తమను ఓడించడానికే ఇలా చేస్తున్నారంటూ వింత వాదన చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా బలం కోల్పోయిన వారి ప్రవర్తన ఇలానే ఉంటుందని ఎద్దేవా చేశారు. -
ఏపీ జిల్లా పరిషత్ రిజర్వేషన్లు ఖరారు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్ధల ఎన్నికల్లో కీలక ఘట్టం పూర్తయింది. రాష్ట్రంలోని అన్ని జిల్లా పరిషత్ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 సెక్షన్ 181, సబ్ సెక్షన్ 2 ప్రకారం రిజర్వేషన్లను ఖరారు చేస్తూ శుక్రవారం ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. మొత్తం 13 జిల్లాలకు గాను మహిళలకు ఏడు స్థానాలు (రెండు బీసీ) రిజర్వు కాగా, నాలుగు స్థానాలు జనరల్, ఎస్సీలకు రెండు, ఎస్టీలకు ఒక స్థానం చొప్పున రిజర్వు చేయబడ్డాయి. జిల్లాల వారిగా రిజర్వేషన్లు... 1 ) అనంతపురం : బీసీ మహిళ 2) చిత్తూరు : జనరల్ 3) తూర్పుగోదావరి : ఎస్సీ 4) గుంటూరు : ఎస్సీ మహిళ 5) కృష్ణా : జనరల్ మహిళ 6) కర్నూలు : జనరల్ 7) ప్రకాశం : జనరల్ మహిళ 8) నెల్లూరు : జనరల్ మహిళ 9) శ్రీకాకుళం : బీసీ మహిళ 10) విశాఖపట్నం : ఎస్టీ మహిళ 11) విజయనగరం : జనరల్ 12: పశ్చిమ గోదావరి : బీసీ 13) కడప : జనరల్ -
ఏపీ స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్లు కొలిక్కి వస్తున్నాయి.. హైకోర్టు సూచనల మేరకు జిల్లా కలెక్టర్లు రిజర్వేషన్లు ఖరారు చేశారు. దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదలయింది. మధ్యాహ్నం లోపు ఏపీ ప్రభుత్వం తుది జాబితాను ఈసీకి పంపించనుంది. నెల్లూరు జిల్లాలో మొత్తం 46 జడ్పిటీసీ స్థానాలకు ఎస్టీ 5, ఎస్సీ 12, బీసీ 6,జనరల్కు 23 రిజర్వేషన్లు కేటాయించారు. మొత్తం 562 ఎంపీటీసీ స్థానాలకు ఎస్టీ 65, ఎస్సీలు-146, బీసీలు-59, జనరల్ 292 రిజర్వేషన్లు కేటాయించారు. తూర్పుగోదావరి జిల్లా జడ్పీటీసీ రిజర్వేషన్లు: అయినవిల్లి-ఎస్సీ, అల్లవరం-ఎస్సీ (మహిళ), అమలాపురం-ఎస్సీ అంబాజీపేట-ఎస్సీ (మహిళ), కాట్రేనికోన-ఎస్సీ, కొత్తపేట-ఎస్సీ (మహిళ) మలికిపురం-ఎస్సీ (మహిళ), పి.గన్నవరం-ఎస్సీ, రావులపాలెం-బీసీ రాజోలు-ఎస్సీ (మహిళ), సఖినేటిపల్లి-ఎస్సీ (మహిళ), ఉప్పలగుప్తం-ఎస్సీ కాకినాడ రూరల్-బీసీ, తాళ్లరేపు-బీసీ, యు.కొత్తపల్లి-బీసీ జగ్గంపేట-బీసీ (మహిళ), శంఖవరం-ఎస్సీ (మహిళ), తొండంగి-బీసీ తుని-బీసీ (మహిళ), బిక్కవోలు-బీసీ (మహిళ), మండపేట-బీసీ (మహిళ) అడ్డతీగల-ఎస్టీ, దేవీపట్నం-ఎస్టీ (మహిళ), గంగవరం-ఎస్టీ (మహిళ) మారేడుమిల్లి-ఎస్టీ, రాజవొమ్మంగి-ఎస్టీ (మహిళ), రంపచోడవరం-ఎస్టీ (మహిళ) వై.రామవరం-ఎస్టీ (మహిళ), కడియం-బీసీ (మహిళ), కోరుకొండ-బీసీ రాజమహేంద్రవరం-బీసీ (మహిళ), రాజానగరం-బీసీ, చింతూరు-ఎస్టీ కూనవరం-ఎస్టీ (మహిళ), వీఆర్పురం-ఎస్టీ, ఏటపాక-ఎస్టీ ఆత్రేయపురం-జనరల్, ఐ.పోలవరం-జనరల్, మామిడికుదురు-జనరల్ ముమ్మడివరం-జనరల్, గొల్లప్రోలు-జనరల్, కరప-జనరల్ పెదపూడి-జనరల్ (మహిళ), పిఠాపురం-జనరల్ సామర్లకోట-జనరల్ (మహిళ), గండేపల్లి-జనరల్ (మహిళ) కిర్లంపూడి-జనరల్ (మహిళ), కోటనందూరు-జనరల్ (మహిళ) పెద్దాపురం-జనరల్, ప్రత్తిపాడు-జనరల్ (మహిళ), రంగంపేట-జనరల్ రౌతులపూడి-జనరల్, ఏలేశ్వరం-జనరల్ (మహిళ) అనపర్తి-జనరల్ (మహిళ), కె.గంగవరం-జనరల్ (మహిళ) కాజులూరు-జనరల్, కపిలేశ్వరపురం-జనరల్, రామచంద్రపురం-జనరల్ రాయవరం-జనరల్ (మహిళ), ఆలమూరు-జనరల్ (మహిళ) గోకవరం-జనరల్ (మహిళ), సీతానగరం-జనరల్ (మహిళ) విజయనగరం జిల్లా జడ్పీటీసీ రిజర్వేషన్లు: పాచిపెంట-ఎస్టీ (జనరల్), సాలూరు-ఎస్టీ (జనరల్) జీఎల్పురం-ఎస్టీ (మహిళ), కురుపాం-ఎస్టీ (మహిళ) బలిజిపేట-ఎస్టీ (జనరల్), సీతానగరం-ఎస్టీ (జనరల్) బొబ్బిలి-ఎస్సీ (మహిళ), తెర్లాం-ఎస్సీ (మహిళ) గజపతినగరం-బీసీ (జనరల్), గంట్యాడ-బీసీ (జనరల్) గరివిడి-బీసీ (జనరల్), మెరకముడిదం-బీసీ (జనరల్) చీపురుపల్లి-బీసీ (మహిళ), కొత్తవలస-బీసీ (మహిళ) పూసపాటిరేగ-బీసీ (మహిళ),ఆర్బీపురం-బీసీ (మహిళ) ఎస్.కోట-బీసీ (మహిళ), బాడంగి-జనరల్, బొండపల్లి-జనరల్ గరుగుబిల్లి-జనరల్, గుర్ల-జనరల్, మక్కువ-జనరల్, మెంటాడ-జనరల్ నెల్లిమర్ల-జనరల్, వేపాడ-జనరల్, విజయనగరం-జనరల్ భోగాపురం-జనరల్ (మహిళ), దత్తిరేజేరు-జనరల్ (మహిళ) డెంకాడ-జనరల్ (మహిళ), జామి-జనరల్ (మహిళ) జియ్యమ్మవలస-జనరల్ (మహిళ), కొమరాడ-జనరల్ (మహిళ) ఎల్.కోట-జనరల్ (మహిళ), పార్వతీపురం-జనరల్ (మహిళ) పశ్చిమగోదావరి జిల్లా జడ్పీటీసీ రిజర్వేషన్లు: వేలేరుపాడు - ఎస్టీ (మహిళ), బుట్టాయిగూడెం - ఎస్టీ (మహిళ) జీలుగుమిల్లి - ఎస్టీ, పోలవరం - ఎస్టీ (మహిళ), కుక్కునూరు - ఎస్టీ గోపాలపురం - ఎస్సీ (మహిళ), చింతలపూడి - ఎస్సీ (మహిళ) కొవ్వూరు - ఎస్సీ (మహిళ), దేవరపల్లి - ఎస్సీ (మహిళ) దెందులూరు - ఎస్సీ (మహిళ), నల్లజర్ల - ఎస్సీ (మహిళ) నిడదవోలు - ఎస్సీ, ద్వారకాతిరుమల - ఎస్సీ, లింగపాలెం - ఎస్సీ కామవరపుకోట - ఎస్సీ, పెదవేగి - ఎస్సీ, పెదపాడు - బీసీ (మహిళ) ఉండి - బీసీ (మహిళ), భీమడోలు - బీసీ (మహిళ), పాలకోడేరు - బీసీ (మహిళ) ఉంగుటూరు - బీసీ (మహిళ), భీమవరం - బీసీ, కాళ్ల - బీసీ మొగల్తూరు - బీసీ, నర్సాపురం - బీసీ, తణుకు - జనరల్ (మహిళ) ఏలూరు - జనరల్ (మహిళ), తాళ్లపూడి -జనరల్ (మహిళ) కొయ్యలగూడెం - జనరల్ (మహిళ), పెనుమంట్ర - జనరల్ (మహిళ) చాగల్లు - జనరల్ (మహిళ), గణపవరం - జనరల్ (మహిళ) పెరవలి - జనరల్ (మహిళ), పెంటపాడు - జనరల్ (మహిళ) అత్తిలి - జనరల్ (మహిళ), పెనుగొండ - జనరల్ (మహిళ) ఆకివీడు - జనరల్, పాలకొల్లు - జనరల్, కోడూరు - జనరల్ నిడమర్రు - జనరల్, ఆచంట - జనరల్, ఇరగవరం - జనరల్ జంగారెడ్డిగూడెం - జనరల్, వీరవాసరం - జనరల్, తాడేపల్లిగూడెం - జనరల్ ఉండ్రాజవరం - జనరల్, యలమంచిలి - జనరల్, టి.నర్సాపురం - జనరల్ చిత్తూరు జిల్లా జడ్పీటీసీ రిజర్వేషన్లు: బి.కొత్తకోట - బీసీ, బైరెడ్డిపాలెం - ఎస్సీ, బంగారుపాలెం - ఎస్సీ బుచ్చినాయుడు కండ్రిగ - జనరల్ (మహిళ), చంద్రగిరి - జనరల్ చిన్నగొట్టిగల్లు - జనరల్ (మహిళ), చిత్తూరు - జనరల్, చౌడేపల్లి - జనరల్ జీడీ నెల్లూరు - బీసీ, గంగవరం - బీసీ (మహిళ), గుడిపాల - ఎస్సీ (మహిళ) గుడుపల్లె - బీసీ, ఐరాల - జనరల్ (మహిళ), గుర్రంకొండ - జనరల్ (మహిళ) కేవీబీపురం - ఎస్సీ (మహిళ), కంభంవారిపల్లె - జనరల్ (మహిళ) కలకాడ - ఎస్సీ (మహిళ), కలికిరి - బీసీ (మహిళ), కార్వేటినగరం - ఎస్సీ (మహిళ) కుప్పం - బీసీ, కురబలకోట - జనరల్ (మహిళ), మదనపల్లె - బీసీ ములకలచెరువు - జనరల్, నాగాలపురం - జనరల్ (మహిళ) నగరి - ఎస్సీ, నారాయణవనం - ఎస్సీ, నిమ్మనపల్లి - జనరల్ (మహిళ) నింద్ర - జనరల్ (మహిళ), పెద్దతిప్పసముద్రం - జనరల్ పాకాల - బీసీ (మహిళ), పలమనేరు - జనరల్ పాలసముద్రం - ఎస్సీ, పెద్దమాండ్యం - జనరల్ (మహిళ) పెదపంజని - బీసీ (మహిళ), పెనుమూరు - బీసీ పీలేరు - జనరల్, పిచ్చాటూరు - జనరల్ (మహిళ), పులిచర్ల-జనరల్ పుంగనూరు - బీసీ (మహిళ), పూతలపట్టు - ఎస్సీ (మహిళ) పుత్తూరు - జనరల్ (మహిళ), రామచంద్రపురం - జనరల్ (మహిళ) రామకుప్పం - ఎస్టీ, రామసముద్రం - జనరల్, రేణిగుంట - జనరల్ (మహిళ) రొంపిచర్ల - జనరల్, శాంతిపురం- బీసీ, సత్యవేడు - జనరల్ సోదం - జనరల్, సోమల - బీసీ (మహిళ), శ్రీకాళహస్తి - జనరల్ శ్రీరంగరాజపురం - జనరల్, తంబళ్లపల్లి - జనరల్ (మహిళ) తవనంపల్లి - ఎస్సీ (మహిళ), తొట్టంబేడు - ఎస్సీ (మహిళ) తిరుపతి రూరల్ - ఎస్టీ (మహిళ), వాదమలపేట - జనరల్ వాల్మీకిపురం - బీసీ (మహిళ), వరదాయపాలెం - ఎస్టీ (మహిళ) వెదురుకుప్పం - ఎస్సీ, వెంకటగికోట - బీసీ (మహిళ) విజయపురం - జనరల్ (మహిళ), యాదమర్రి - జనరల్ ఏర్పేడు - ఎస్సీ, యర్రావారిపాలెం - జనరల్ అనంతపురం జిల్లా జడ్పీటీసీ రిజర్వేషన్లు: ఆగలి - జనరల్, ఆమడగురు - జనరల్ (మహిళ) అమరాపురం - ఎస్సీ (మహిళ), అనంతపురం - ఎస్సీ (జనరల్) ఆత్మకూరు - జనరల్, బుక్కరాయసముద్రం - ఎస్సీ (జనరల్) బత్తలపల్లి - జనరల్, బెలుగుప్ప - జనరల్ (మహిళ) బొమ్మనహల్ - బీసీ (మహిళ), బ్రహ్మసముద్రం - బీసీ (మహిళ) బుక్కపట్నం - జనరల్ (మహిళ), చెన్నేకొత్తపల్లి - జనరల్ చిలమత్తూరు - బీసీ (మహిళ), హీరేహల్ - బీసీ (మహిళ) ధర్మవరం - జనరల్, గాండ్లపెంట - జనరల్ (మహిళ) గార్లదిన్నె - ఎస్సీ (మహిళ), గుత్తి - జనరల్, గోరంట్ల - ఎస్టీ (జనరల్) గుదిబండ - ఎస్సీ (జనరల్), గుమ్మగట్ట - బీసీ (జనరల్) గుంతకల్లు - బీసీ (జనరల్), హిందూపురం - బీసీ (జనరల్) కదిరి - ఎస్టీ (మహిళ), కల్యాణదుర్గం - బీసీ (జనరల్) కంబదూరు - ఎస్సీ (జనరల్), కనగానపల్లె - జనరల్ కనేకల్ - బీసీ (మహిళ), కొత్తచెరువు - జనరల్ (మహిళ) కూడేరు - జనరల్ (మహిళ), కుందుర్పి - బీసీ (జనరల్) లేపాక్షి - జనరల్, మడకశిర - ఎస్సీ (మహిళ), ముదిగుబ్బ - ఎస్సీ (మహిళ) నంబులపులకుంట - జనరల్ (మహిళ), నల్లచెరువు - జనరల్ (మహిళ) నల్లమడ - జనరల్, నార్పల - ఎస్సీ (మహిళ), ఓబులదేవచెరువు - జనరల్ పామిడి - జనరల్ (మహిళ), పరిగి - ఎస్సీ (జనరల్) పెద్దపప్పూరు - జనరల్ (మహిళ), పెద్దవడుగూరు - జనరల్ పెనుగొండ - జనరల్, పుట్లూరు - జనరల్ (మహిళ) పుట్టపర్తి - జనరల్ (మహిళ), రామగిరి - జనరల్ రాప్తాడు - జనరల్, రాయదుర్గం - బీసీ (జనరల్) రొద్దం - బీసీ (మహిళ), రోళ్ల - జనరల్, సెట్టూరు - బీసీ (జనరల్) సింగనమల - జనరల్ (మహిళ), సోమందేపల్లి - బీసీ (జనరల్) తాడిమర్రి - జనరల్ (మహిళ), తాడిపత్రి - బీసీ (మహిళ) తలుపుల - జనరల్ (మహిళ), తనకల్లు - జనరల్ (మహిళ) ఉరవకొండ - ఎస్సీ (మహిళ), వజ్రకరూరు - బీసీ (మహిళ) విడపనకల్లు - బీసీ (జనరల్), యాడికి - బీసీ (మహిళ), ఎల్లనూరు - జనరల్ శ్రీకాకుళం జిల్లా జడ్పీటీసీ రిజర్వేషన్లు: ఇచ్చాపురం- బీసీ (మహిళ), కంచిలి - బీసీ (జనరల్) సోంపేట - జనరల్, మందస - బీసీ (మహిళ) పలాస - జనరల్, వజ్రపుకొత్తూరు - జనరల్ నందిగం - బీసీ (జనరల్), టెక్కలి - ఎస్సీ (జనరల్) సంతబొమ్మాళి - జనరల్ (మహిళ), కొత్తబొమ్మాళి - జనరల్ (మహిళ) జలుమూరు - బీసీ (జనరల్), మెలియపుట్టి - జనరల్ (మహిళ) పాతపట్నం - ఎస్టీ (మహిళ), సారవకోట - బీసీ (జనరల్) హిర మండలం - జనరల్ (మహిళ), కొత్తూరు - ఎస్టీ (మహిళ) బామిని - జనరల్, సీతంపేట - ఎస్టీ (జనరల్), వీరఘట్టం - బీసీ (జనరల్) వంగర - జనరల్, పాలకొండ - ఎస్సీ (జనరల్) రేగిడి ఆమదాలవలస - ఎస్సీ (మహిళ), రాజాం - బీసీ (మహిళ) సంతకవిటి - బీసీ (మహిళ), జి.సిగడం - బీసీ (మహిళ) పొందూరు - జనరల్ (మహిళ), ఆమదాలవలస - బీసీ (మహిళ) బూర్జ - జనరల్, సరుబుజ్జిలి - జనరల్ (మహిళ) ఎల్ఎన్ పేట - జనరల్ (మహిళ), నరసన్నపేట - జనరల్ పోలకి - జనరల్ (మహిళ), గార - జనరల్ శ్రీకాకుళం - జనరల్ (మహిళ), ఎచ్చెర్ల - జనరల్ లావేరు - ఎస్సీ (మహిళ), రణస్థలం - బీసీ (మహిళ) వైఎస్ఆర్ జిల్లా జడ్పీటీసీ రిజర్వేషన్లు: కొండూరు - ఎస్టీ, పుల్లంపేట - ఎస్టీ పెనగలూరు - ఎస్సీ (జనరల్), పోరుమామిళ్ల - ఎస్సీ (జనరల్) ఓబులవారిపల్లి - ఎస్సీ (జనరల్), బి.కోడూరు - ఎస్సీ (జనరల్) పుల్లంపేట - ఎస్సీ (మహిళ), ప్రొద్దుటూరు - ఎస్సీ (మహిళ) ఖాజీపేట - ఎస్సీ (మహిళ), రాజంపేట - ఎస్సీ (మహిళ) చాపాడు - ఎస్సీ (మహిళ), మైలవరం - బీసీ (మహిళ) జమ్మలమడుగు - బీసీ (మహిళ), కొండాపురం - బీసీ (మహిళ) ముద్దనూరు - బీసీ (మహిళ), చిన్నమండ్యం - బీసీ (మహిళ) గాలివీడు - బీసీ (మహిళ), ఎల్ఆర్ పల్లి - బీసీ (మహిళ) దువ్వూరు - బీసీ (జనరల్), ఎర్రగుంట్ల - బీసీ (జనరల్) టి.సుండుపల్లి - బీసీ (జనరల్), వీరబల్లి - బీసీ (జనరల్) పెండ్లిమర్రి - బీసీ (జనరల్), లింగాల - బీసీ (జనరల్) రామాపురం - బీసీ (జనరల్), వల్లూరు - బీసీ (జనరల్) నందలూరు - జనరల్ (మహిళ), రాజుపాలెం - జనరల్ (మహిళ) తుండూరు - జనరల్ (మహిళ), సాంబేపల్లి - జనరల్ (మహిళ) సింహాద్రిపురం - జనరల్ (మహిళ), పెద్దముడియం - జనరల్ (మహిళ) చెన్నూరు - జనరల్ (మహిళ), చిట్టివేల్ - జనరల్ (మహిళ) వీఎన్ పల్లి - జనరల్ (మహిళ), మైదుకూరు - జనరల్ (మహిళ) అట్లూరు - జనరల్ (మహిళ), కమలాపురం - జనరల్ (మహిళ) రాయచోటి - జనరల్, సిద్ధవటం - జనరల్, సీకే దిన్నె - జనరల్ ఒంటిమిట్ట - జనరల్, కలసపాడు - జనరల్, బద్వేల్ - జనరల్ వేముల - జనరల్, వేంపల్లి - జనరల్, కాశినాయిని- జనరల్ పులివెందుల - జనరల్, చక్రాయపేట - జనరల్ గోపవరం - జనరల్, బి.మఠం - జనరల్ విశాఖ జిల్లా జడ్పీటీసీ రిజర్వేషన్లు: చింతపల్లి - ఎస్టీ, జీకే వీధి - ఎస్టీ (మహిళ) అరకు వ్యాలీ - ఎస్టీ (మహిళ), జి.మాడుగుల (ఎస్టీ) పెదబయలు - ఎస్టీ, హుకుంపేట - ఎస్టీ, పాడేరు - ఎస్టీ (మహిళ) డుంబ్రిగూడ - ఎస్టీ (మహిళ), ముచ్చంగిపుట్టు - ఎస్టీ (మహిళ) -
నేడే ‘స్థానిక’ రిజర్వేషన్లు ఖరారు
సాక్షి, అమరావతి: హైకోర్టు తీర్పునకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా గురువారం ఖరారు కానున్నాయి. జెడ్పీ చైర్మన్, ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ పదవులకు పంచాయతీరాజ్ శాఖ తాజాగా నేటి మధ్యాహ్నంలోగా రిజర్వేషన్లు ఖరారు చేయనుంది. జిల్లాలవారీగా గెజిట్ జారీ చేసి ఆ వెంటనే రాష్ట్ర ఎన్నికల కమిషన్కు కాపీని అందచేయడంతోపాటు వెబ్పోర్టల్లో అప్లోడ్ చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయ అధికారులు తెలిపారు. సర్పంచి, వార్డు సభ్యుల పదవులకు శుక్రవారం రిజర్వేషన్లు ఖరారయ్యే అవకాశం ఉంది. హైకోర్టు తీర్పు వెలువడగానే విధివిధానాలపై ఉత్తర్వులు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్లోనే ఉత్తర్వులు ఇచ్చింది. మంత్రివర్గ సమావేశంలోనూ ఆమోదించింది. ఆమేరకు రిజర్వేషన్లను ఖరారు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ కొందరు టీడీపీ నేతలు కోర్టును ఆశ్రయించడంతో రిజర్వేషన్లను 50 శాతానికే పరిమితం చేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా పదవుల రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం నూతన విధివిధానాలను ఖరారు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ఖరారులో అనుసరించాల్సిన నియమ నిబంధనలపై హైకోర్టు తీర్పు వెలువడిన 2వ తేదీనే పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రిజర్వేషన్ల ఖరారులో తాజా విధివిధానాలు.. - ఒక మండలంలో జెడ్పీటీసీ, మండల పరిషత్ అధ్యక్ష స్థానాలు ఒకే కేటగిరీ రిజర్వేషన్లో ఉంచకూడదు. ఉదాహరణకు ఏదైనా మండలంలో జెడ్పీటీసీ బీసీ జనరల్కు రిజర్వయితే ఎంపీపీ పదవి అదే కేటగిరికీ రిజర్వు చేయకూడదు. ఎంపీపీని బీసీ మహిళ లేదా మరే ఇతర రిజర్వేషన్ కేటగిరీకి రిజర్వు చేయవచ్చు. - జెడ్పీటీసీని ఎస్సీ మహిళకు రిజర్వు చేసిన మండలంలో ఎంపీపీ స్థానాన్ని ఎస్సీ మహిళకు రిజర్వ్ చేయడానికి వీల్లేదు. అదే సమయంలో జెడ్పీటీసీ అన్ రిజర్వు కేటగిరిలో ఉన్న మండలంలో ఎంపీపీ పదవి అన్ రిజర్వు కేటగిరిలో ఉండవచ్చు. - గ్రామ సర్పంచి, ఎంపీటీసీ పదవులను మండల జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. - మండలంలో సర్పంచి లేదా ఎంపీటీసీ పదవులను ఏ కేటగిరికి ఎన్ని రిజర్వు చేస్తారన్నది ఆ ప్రాంత ఆర్డీవో ఖరారు చేస్తారు. ఏ స్థానం ఏ కేటగిరికి రిజర్వు చేశారన్నది ఆర్డీవోనే ఖరారు చేసి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. - ఎంపీపీ, జెడ్పీటీసీ పదవులను జిల్లాలోని మొత్తం జనాభా ప్రాతిపాదికన ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. - జిల్లాలోని బీసీ ఓటర్ల సంఖ్య ఆధారంగా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. - జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించే స్థానాలు మొత్తం స్థానాల్లో సగానికి మించకూడదు. - జిల్లాలో ఎంపీపీ, జడ్పీటీసీ పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎన్ని స్థానాలు రిజర్వు చేయాలన్నది కలెక్టర్లు నిర్ణయిస్తారు. ఏ స్థానాలు ఏ కేటగిరికి కేటాయిస్తారో కలెక్టరే ఖరారు చేసి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. - జెడ్పీ చైర్మన్ పదవుల రిజర్వేషన్లను పంచాయతీరాజ్శాఖ కమిషనర్ నిర్ధారిస్తారు. - రిజర్వేషన్లు 50 శాతం మించకూడదన్న హైకోర్టు తీర్పు మేరకు 13 జడ్పీ చైర్మన్ పదవుల్లో ఎస్టీలకు ఒకటి, ఎస్సీలకు రెండు, బీసీలకు మూడు చొప్పున రిజర్వు అవుతాయని పంచాయతీరాజ్ శాఖ కార్యాలయ అధికారులు పేర్కొన్నారు. - ఏడు జడ్పీ చైర్మన్ పదవులు అన్ రిజర్వు కేటగిరిలో ఉంటాయి. - షెడ్యూల్ ఏరియాలో మాత్రం ఎస్టీలకు ఒకే మండల పరిధిలో ఎంపీటీసీ, గ్రామ సర్పంచి పదవులకు 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేస్తారు. ఈ మేరకు రాజ్యాంగంలోనే స్పష్టంగా నిబంధనలు ఉన్నాయని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయ అధికారులు తెలిపారు. - షెడ్యూల్ ఏరియాలో ఉండే జెడ్పీటీసీ పదవులను పూర్తిగా ఎస్టీలకే రిజర్వు చేస్తారు. -
స్థానిక సంస్థల ఎన్నికలపై బొత్స కీలక ప్రకటన
సాక్షి, తాడేపల్లి : స్థానికల సంస్థల ఎన్నికల రిజర్వేష్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని రాష్ట్ర మున్సిపల్శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా 50 శాతం రిజర్వేషన్లకు లోబడే ఎన్నికకు వెళ్తామని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బడుగుల బలహీన వర్గాలు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం భావించిందని, కానీ టీడీపీ కుట్ర కారణంగానే ఈ అంశాని కోర్టు తొసిపుచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. అధిక శాతం ఉన్న బలహీన వర్గాలకు న్యాయం చేయలేకపోయాము అనే బాధ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు మంత్రులకు ఉందన్నారు. 30 రోజుల్లో ఎన్నికలు జరపాలని హైకోర్టు ఆదేశించిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, బడ్జెట్ సమావేశాలు, విద్యార్థుల పరీక్షలు వంటి కీలక అంశాలు ప్రస్తుతం ప్రభుత్వం ముందు ఉన్నాయని, వాటన్నింటినీ సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తామన్నారు. ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల 50శాతానికి మించకుండా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు సోమవారం ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ తాడేపల్లిలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు కుట్రతోనే వెనుకబడిన వర్గాలు రిజర్వేషన్లు కోల్పోయారని మండిపడ్డారు. బలహీన వర్గాల ఎదుగుదలకు అడ్డుపడుతున్న చంద్రబాబు చరిత్ర హీనుడుగా మిగిలిపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి చెందిన ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని మంత్రి వెల్లడించారు. బీసీలకు చంద్రబాబు ఇచ్చే బహుమానం ఇదేనా అని నిలదీశారు. బలహీన వర్గాలు వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలవడం చూడలేక చంద్రబాబు వారికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ‘బీసీలు అంటే చంద్రబాబుకు చలకన భావన. ఓట్లు వేసేందుకు వారిని ఉపయోగించుకుంటారు. వెనుకబడిన వర్గాలు అంటే చంద్రబాబుకు ఎందుకు అంత కడుపు మంట. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని గతంలో అన్నారు. నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లను బడుగు బలహీన మైనార్టీలకు సీఎం జగన్మోహన్రెడ్డి కల్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ 59 శాతం రిజర్వేషన్లు ఉండాలని ప్రభుత్వం నిర్ణయిస్తే.. దానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారు. చంద్రబాబు నాయుడే దగ్గరుండి టీడీపీ కార్యకర్తలతో కేసులు వేయిస్తున్నారు. ఆ పరిణామంతో టీడీపీలో ఉన్న బీసీ నేతలు సిగ్గుపడలి’ అని అన్నారు. -
రిజర్వేషన్ల వ్యతిరేకులకు అడ్డాగా మారింది: మందకృష్ణ మాదిగ
సాక్షి, పంజగుట్ట: ఎస్సీ, ఎస్టీల ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల అంశం రాజ్యాంగంలో ప్రాథమిక హక్కు కాదని సుప్రీంకోర్టు అభి వర్ణించడం దుర్మార్గమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు. రిజర్వేషన్ల వ్యతిరేకులకు న్యాయవ్యవస్థ అడ్డాగా మారిందని విమర్శించారు. గతంలో ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని కూడా రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు రూపం లో ప్రయత్నం చేశారని, తీవ్రమైన ఉద్యమాలు చేస్తే వెనక్కి తగ్గారని గుర్తు చేశారు. రిజర్వేషన్ల అంశంపై హైదరాబాద్ కేంద్రంగా జాతీయ స్థాయి ఉద్యమం తీసుకువస్తా మన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంద కృష్ణ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను తీసేస్తే మిగిలినవి కూడా సులువుగా తీసేయవచ్చనే ఈ పథకం పన్నారని ఆరోపించారు. హైకోర్టు, సుప్రీంకోర్టులో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉంటే ఈ తీర్పు వచ్చేది కాదన్నారు. న్యాయవ్యవస్థలో రిజర్వేషన్లకు పోరాటం చేస్తామన్నారు. మార్చి 8న నిర్వహించనున్న ‘సింహగర్జన’ను వాయిదా వేసినట్లు మందకృష్ణ తెలిపారు. ఈ సమావేశంలో రాములు నాయక్, మాల మహానాడు అధ్యక్షుడు జి.చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఆ ప్రాంతాల్లో 100% రిజర్వేషన్లు ఎలా ఉపకరిస్తాయి?
సాక్షి, న్యూఢిల్లీ : షెడ్యూలు ప్రాంతాల్లో రిజర్వేషన్లు వంద శాతం ఉండడం ఆయా ప్రాంతాల ప్రజలకు ఎలా ఉపకరిస్తాయో చెప్పాలని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను ప్రశ్నించింది. ఆ ప్రాంతంలో నూటికి నూరు శాతం రిజర్వేషన్ అమలు చేయడానికి వీలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా కాలం క్రితం ఇచ్చిన జీవోను సమర్థిస్తూ ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ చేబ్రోలు లీలాప్రసాదరావు తదితరులు దాఖలు చేసిన పిటిషన్ బుధవారం విచారణకు వచ్చింది. జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ అనిరుద్ధ బోస్ల ధర్మాసనం ఈ పిటిషన్ను విచారిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు రాజీవ్ ధావన్, ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ షెడ్యూలు ఏరియాలో రిజర్వేషన్లు 100 శాతం ఉండడం సహేతుకమేనని వాదించారు. రాజ్యాంగంలోని ఐదో షెడ్యూలు ఇందుకు అనుమతిస్తోంని తెలిపారు. రిజర్వేషన్లు ప్రతి పదేళ్లకోసారి పొడిగిస్తున్నారని, దీనికి రాజ్యాంగం వీలు కల్పిస్తుందా అంటూ, తొలుత పదేళ్లపాటే రిజర్వేషన్లని ఎందుకు పెట్టారని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ అంశం ఆర్టికల్ 334 పరిధిలోనిదని రాజీవ్ ధావన్ నివేదించారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఐదో షెడ్యూలు విషయంలో ఎలాంటి కాల పరిమితి లేదా అని ప్రశ్నించింది. దీన్ని పార్లమెంటు సవరణ చేయొచ్చని వివరించారు. ఈ సందర్భంలో ధర్మాసనం కొన్ని సామాజిక వర్గాలు అభివృద్ధి చెంది రిజర్వేషన్లు వదులుకోవాలనుకుంటే మార్గాలేమిటని పలు కీలక ప్రశ్నలు సంధించింది. దీనికి ధావన్ సమాధానం ఇస్తూ దానిపై తాను అభిప్రాయం చెప్పలేనని, దీనిని సమీక్షించడానికి ఆదివాసీ కౌన్సిళ్లు, గవర్నర్, రాష్ట్రపతి, కేంద్ర కమిషన్, రాష్ట్ర కమిషన్ ఉన్నాయని వివరించారు. షెడ్యూలు ఏరియాకు మేలు చేస్తుంది..: ఏపీ ప్రభుత్వ ఉత్తర్వు షెడ్యూలు ఏరియాకు, షెడ్యూలు తెగలకు సంయుక్తంగా మేలు చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ఆర్.వెంకటరమణి, న్యాయవాది జీఎన్ రెడ్డి వాదించారు. స్థానిక ఎస్టీలకు మేలు చేసి, ఇతరులపై వివక్ష చూపాలని సదరు జీవో తేలేదని నివేదించారు. ఆ ప్రాంతాల్లో విద్యా రంగ ప్రయోజనాల దృష్ట్యా ఈ ఉత్తర్వులు ఇచ్చినట్టు వివరించారు. ఈ జీవో ఆర్టికల్ 14, ఆర్టికల్ 16(1) పరిధిలో పరిశీలించాల్సిన అవసరం లేదని వివరించారు. ఆర్టికల్ 371 డి, షెడ్యూలు ఐదు, ప్రస్తుత జీవో మధ్య ఎలాంటి ఘర్షణ తలెత్తదని వాదించారు. షెడ్యూలు ఏరియా విశాల ప్రయోజనాల కోసం అమలు చేస్తున్న రిజర్వేషన్లు అయినందున ఇవి అధిక రిజర్వేషన్లు అన్న ప్రశ్నను రేకెత్తనివ్వవని పేర్కొన్నారు. సామాజిక, ఆర్థిక న్యాయానికి ఉపకరిస్తాయా? ‘అసలు వారు కోరుకుంటున్నదేంటి? సామాజిక, ఆర్థిక న్యాయమే కదా.. మరి ఈ వంద శాతం రిజర్వేషన్లు ఎలా ఇందుకు సహకరిస్తాయి? షెడ్యూలు ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో అర్హులు తగినంతగా లేనప్పుడు వంద శాతం రిజర్వేషన్ల కల్పన ఎలా ఉపకరిస్తుంది? అని జస్టిస్ అరుణ్ మిశ్రా ప్రశ్నించారు. ఇలా చేయడం వారిని వెనకబడేలా చేయడమే కాకుండా ఇతర అర్హులైన వారి అవకాశాలను మూసివేయడమే కదా అని జస్టిస్ వినీత్ శరణ్ ప్రశ్నించారు. దశాబ్దాలుగా గిరిజనుల పరిస్థితి రిజర్వేషన్ల వల్ల ఏమైనా మెరుగుపడిందా? ఇందుకు సంబంధించిన గణాంకాలు ఏవైనా ఉన్నాయా అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. అనంతరం విచారణను గురువారానికి వాయిదావేసింది. -
కోటాపై వాగ్యుద్ధం
న్యూఢిల్లీ: ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు ఇవ్వాలా వద్దా అనేది ప్రభుత్వాలే నిర్ణయిస్తాయంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువరించిన కేసులో తాము కక్షిదారు కాదని కేంద్రం స్పష్టం చేసింది. రిజర్వేషన్ విధానాన్ని పరిరక్షించడంలో కేంద్రం విఫలమైందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో లోక్సభలో ప్రభుత్వం ఈ మేరకు ప్రకటన చేసింది. సామాజిక న్యాయం, సాధికారిత శాఖ మంత్రి థావర్చంద్ గహ్లోత్ సోమవారం సభలో.. ‘ఎస్సీ, ఎస్టీలోపాటు ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు కట్టుబడి ఉంది. ఈ విషయంలో అఫిడవిట్ వేయాలని సుప్రీం కోరలేదు. ఈ అంశాన్ని ప్రభుత్వం ఉన్నతస్థాయిలో పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటుంది. 2012లో ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ప్రతిపక్షాలు ఈ అంశాన్ని రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి’అని ఆరోపించారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు సిగ్గు, సిగ్గు అని నినాదాలు చేసుకుంటూ సభ నుంచి వాకౌట్ చేశారు. అంతకుముందు, ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ ఈ విషయాన్ని లేవనెత్తారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లపై తీవ్ర వివక్ష కొనసాగుతోందని ఆరోపించారు. ప్రభుత్వం రిజర్వేషన్లకు వ్యతిరేకమని చెప్పేందుకు ఎన్నో ఆధారాలున్నాయని డీఎంకే సభ్యుడు ఎ.రాజా, బీఎస్పీ నేత రితేశ్ పాండే వ్యాఖ్యానించారు. ఈ అంశంపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని సీపీఎం నేత ఏఎం అరీఫ్ ప్రభుత్వాన్ని కోరారు. మరో వైపు రాజ్యసభలో... అసమర్థులైన వైద్యుల కారణంగానే దేశ ఆర్థిక వ్యవస్థ పతనావస్థలో ఉందని కాంగ్రెస్ నేత చిదంబరం అన్నారు. సోమవారం సభలో ఆయన వార్షిక బడ్జెట్పై చర్చను ప్రారంభిస్తూ.. పెరుగుతున్న నిరుద్యోగిత, పడిపోతున్న వినియోగం అనే రెండు సమస్యలను దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటుండగా ప్రభుత్వం మాత్రం ఖండించడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు. ‘అన్ని రకాల పన్ను వసూళ్లు మందగించాయి. ఆరేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ..ఇంకా గత పాలకులను ఎలా విమర్శిస్తుంది? అని అన్నారు. -
మాటలు కాదు...చేతలు ముఖ్యం
పదోన్నతుల్లో రిజర్వేషన్లు అమలు చేసే అంశంలో ప్రభుత్వాల్లో దశాబ్దాలుగా నెలకొన్న అస్పష్టత ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రయోజనాలు దెబ్బతినే స్థితికి చేర్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ కోటాను ప్రాథమిక హక్కుగా పరిగణించడం లేదా వాటిని వర్తింపజేయమని ప్రభుత్వాలను ఆదేశించడం సాధ్యంకాదని సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం తీర్పునిచ్చింది. ఈ విషయమై వున్న సందిగ్ధతను తొలగించడానికి గిన చర్యలు తీసుకోమంటూ చాన్నాళ్లుగా దళిత సంఘాలు కోరుతూనే వున్నాయి. కానీ కదిలికేది? తీరా ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించాక కారణం మీరంటే మీరని ఆ పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. పార్లమెంటులో వాదోపవాదాలు హోరెత్తుతున్నాయి. కుల వివక్ష అంతం కావడానికి... సమాజ పురోగతిలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు నిజమైన భాగస్వామ్యం దక్కడానికి, వివక్ష పోవడానికి ఆ వర్గాలకు చదువుల్లో, ఉద్యోగావకాశాల్లో రిజర్వేషన్లు కల్పించడం ఒక్కటే మార్గమని మన రాజ్యాంగ నిర్మాతలు విశ్వసించారు. కానీ స్వాతంత్య్రం వచ్చి 73 ఏళ్లవు తున్నా వివక్ష అంతరించలేదు. అది కొత్త కొత్త రూపాల్లో తలెత్తుతున్నది. రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలొచ్చినవారు సైతం పదోన్నతుల్లో అన్యాయానికి గురవుతున్న సందర్భాలు కోకొల్లలుగా వుంటున్నాయి. తొలిసారి 1957లోనే అప్పటి రైల్వే మంత్రి జగ్జీవన్రామ్ దీన్ని గుర్తించారు. పదోన్నతుల్లో సైతం కోటా అమలు చేయడానికి వీలుగా ఆ శాఖలో విధానం రూపొందించారు. అయితే ఈ మాదిరి నిర్ణయాలు తరచు వివాదాస్పదంగా మారుతున్నా ప్రభుత్వాలు మౌనం పాటిస్తున్నాయి. ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించడం వరకూ అంగీకరిస్తున్నవారు కూడా పదో న్నతుల్లో పని తీరు, సర్వీసు ప్రామాణికం కావాలి తప్ప రిజర్వేషన్లు ఎందుకివ్వాలన్న ప్రశ్న లేవ నెత్తుతున్నారు. కానీ ఉద్యోగ నియామకాల్లో అడ్డుతగులుతున్న కులం పదోన్నతుల్లో అడ్డుతగలదని ఎందుకనుకోవాలన్నది దళిత సంఘాల ప్రశ్న. సమాజంలో అడుగడుగునా అసమానతలు, వివక్ష గూడుకట్టుకుని ఉన్నప్పుడు పదోన్నతుల సమయంలో వాటి ప్రభావం పడదని, పడటం లేదని ఎలా చెప్పగలం? కనుకనే ఈ రెండు వాదాలూ అప్పట్లోనే కోర్టుకెక్కాయి. జగ్జీవన్ రామ్ తీసుకొచ్చిన విధానం సరికాదని, రాజ్యాంగ విరుద్ధమని మద్రాసు హైకోర్టు 1959లో కొట్టేసింది. దానిపై కేంద్రం సుప్రీంకోర్టు కెక్కినప్పుడు అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గజేంద్ర గాడ్కర్ నేతృత్వంలోని ధర్మాసనం రైల్వే మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయం సరైనదేనని 1961లో 3–2 మెజారిటీతో తీర్పునిచ్చింది. కానీ వెనకబాటుతనాన్ని నిర్ధారించే అనేకానేక అంశాల్లో కులం ఒకటి మాత్రమేనని, అదే ఏకైక గీటురాయి కారాదని 1992లో ఇంద్రా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో పరిస్థితి మొదటికొచ్చింది. మధ్యలో కొన్ని రాష్ట్రాలు పదోన్నతులు అమలు చేసిన సందర్భాలు న్నాయి. కానీ వాటి రాజ్యాంగ బద్ధతను ప్రశ్నించినచోట అవి నిలిచిపోయాయి. దీన్ని సరిదిద్దడానికి 1995లో కేంద్రంలోని పీవీ నరసింహారావు ప్రభుత్వం రాజ్యాంగంలోని 16 వ అధికరణలో 4ఏ క్లాజును చేరుస్తూ 77వ రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకొచ్చింది. అయితే ఈ మార్గంలో పదోన్నతులు పొందుతున్నవారు అంతవరకూ సీనియర్లుగా వున్న తమకు సీనియర్లుగా మారుతున్నారని కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు 1999లో ‘క్యాచ్ అప్’ నిబంధన తీసుకొచ్చింది. దీని ప్రకారం ఎస్సీ, ఎస్టీ సిబ్బందికి పదోన్నతి వచ్చి, సాధారణ కేటగిరీకి చెందిన తమ సీనియర్లకు వారు సీనియర్లుగా మారితే, తక్షణం ఆ సాధారణ కేటగిరీ వారికి కూడా పదోన్నతి లభిస్తుంది. దీనిపై వినతులు వెల్లువెత్తాక, ఆ ఉత్తర్వును అధిగమించడం కోసం 2001లో అప్పటి వాజపేయి ప్రభుత్వం 85వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చింది. 16వ అధికరణలోని 4ఏ క్లాజులో వున్న అస్పష్టతను తొల గించడం దీని ఉద్దేశం. కానీ ఆ తర్వాత వివిధ హైకోర్టులు తమ ముందుకొచ్చే కేసుల్లో వివిధ రకాల తీర్పులిస్తూ వచ్చాయి. వాటిని ఎవరైనా సుప్రీంకోర్టులో సవాలు చేసినప్పుడల్లా ‘యధాతథ స్థితి’ కొనసాగించాలంటూ ఉత్తర్వులివ్వడంతో సమస్యకు తాత్కాలిక ఉపశమనం దొరికేది. 2001లోనూ, అంతకుముందు తీసుకొచ్చిన సవరణను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను అనుమతిస్తూ 2006లో సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పునిచ్చింది. పదోన్నతుల విషయంలో నిదర్శనాపూర్వకమైన గణాం కాలు అందజేస్తే తప్ప కోటాను అమలు చేయడానికి వీల్లేదని చెప్పింది. ఎస్సీ, ఎస్టీల పదోన్నతుల్లో రిజర్వేషన్లు పాటించాలని కేంద్రం రాష్ట్రాలను కోరడం సాధ్యంకాదని తెలిపింది. ఆ తర్వాత 2012లో ఉత్తరాఖండ్లో రిజర్వేషన్ల ప్రమేయం లేకుండా అక్కడి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన ప్పుడు అది చెల్లదని రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది. కానీ సుప్రీంకోర్టు మాత్రం నోటిఫికేషన్ సరైందేనని స్పష్టం చేసింది. 2006లో ఇచ్చిన తీర్పునే పునరుద్ఘాటించింది. దళిత వర్గాల ప్రయోజనాలకు భంగం కలగనీయరాదన్న సంకల్పం వుంటే భిన్న సందర్భాల్లో వెలువడిన ఈ తీర్పుల్ని ప్రభుత్వాలు శ్రద్ధగా అధ్యయనం చేసి, రాజ్యాంగాన్ని తగువిధంగా సవ రించేవి. కానీ అందుకు విరుద్ధంగా అవి మౌనంగా వుండిపోయాయి. తాజాగా వెలువరించిన తీర్పులో పదోన్నతుల్లో కోటా కల్పించవద్దని సుప్రీంకోర్టు చెప్పలేదు. కాకపోతే పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు తగినంత ప్రాతినిధ్యం లభించడంలేదని, ఆ విషయంలో వారికి అన్యాయం జరుగుతు న్నదని లేదా అందులోనూ వెనకబాటుతనం తప్పడం లేదని నిరూపించడానికి అవసరమైన సమా చారాన్ని చూపాలని చెప్పింది. కనుక పదోన్నతుల్లో కోటా ప్రాథమిక హక్కుగా మార్చడమో లేక సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన విధంగా పకడ్బందీ సమాచారం ఆధారంగా ఆ పదోన్నతులు కల్పించే విధానానికి రూపకల్పన చేయడమో జరగాలి. అంతేతప్ప రాజకీయ ప్రయోజనాలనాశించి పరస్పరారోపణలు చేసుకోవడం కాలహరణమే అవుతుంది. -
బీజేపీ, ఆరెస్సెస్లు రిజర్వేషన్లకు వ్యతిరేకం
-
వారు రిజర్వేషన్లకు వ్యతిరేకం..
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ, ఆరెస్సెస్లు రిజర్వేషన్లకు వ్యతిరేకమని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. దళితుల పురోగతిని వారు కోరుకోరని, బీజేపీ, ఆరెస్సెస్లు వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్ట సవరణలను సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లను తొలగించాలనేది ఆరెస్సెస్, బీజేపీ డీఎన్ఏలో భాగమని, రిజర్వేషన్లు ఎట్టిపరిస్థితుల్లో కొనసాగేలా చూస్తామని తాను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దళితులకు హామీ ఇస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు. రిజర్వేషన్లను తొలగించడం మోదీజీ, మోహన్ భగవత్ల స్వప్నాన్ని తాము నెరవేరనీయబోమని వివరించారు. కాగా ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక సవరణ చట్టం రాజ్యాంగ భద్రతను సుప్రీంకోర్టు సమర్ధించింది. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చింది. ఈ చట్టం కింద ప్రాథమిక ఆధారాలు లభ్యం కాని కేసుల్లోనే కోర్టులు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని, ఎఫ్ఐఆర్ నమోదుకు ప్రాధమిక దర్యాప్తు అవసరం లేదని, సీనియర్ పోలీస్ అధికారి అనుమతి అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. చదవండి : మోదీ తాజ్మహల్ను కూడా అమ్మేస్తారు.. -
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై కీలక తీర్పు
న్యూఢిల్లీ: షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారికి ఉద్యోగాల్లో, పదోన్నతుల్లో రిజర్వేషన్లను కల్పించడానికి సంబంధించి శుక్రవారం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్రాలు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అలాగే, ప్రమోషన్లలో రిజర్వేషన్లను అమలు చేయాలని కోరడానికి సంబంధించి ఎలాంటి ప్రాథమిక హక్కు లేదని పేర్కొంది. ‘రిజర్వేషన్లు కల్పించాలని కోర్టులు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించలేవు’ అని జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ హేమంత్ గుప్తాల ధర్మాసనం తేల్చిచెప్పింది. 2012 సెప్టెంబర్ 5న ఉత్తరాఖండ్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు అందులో పేర్కొనలేదు. ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయగా, ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రభుత్వ నోటిఫికేషన్ను కొట్టివేసింది. ఆ ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పు వెలువరిస్తూ సుప్రీంకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వ నోటిఫికేషన్ను సమర్ధిస్తూ, హైకోర్టు ఆదేశాలను కొట్టివేసింది. ప్రభుత్వ నిర్ణయం చట్టవ్యతిరేకమని కోర్టు నిర్ధారించడం సరికాదని తీర్పులో పేర్కొంది. ‘పబ్లిక్ పోస్ట్ల్లో నియామకాలకు సంబంధించి రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోర్టులు ఆదేశించలేవని చట్టంలో స్పష్టంగా ఉంది. అలాగే, ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు కచ్చితంగా రిజర్వేషన్లు కల్పించాలనే నిబంధన కూడా లేదు. అయినా, ఒకవేళ రాష్ట్రాలు తమ విచక్షణాధికారాన్ని వినియోగించుకుని వారికి రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే, కచ్చితమైన గణాంకాలు సేకరించి, తద్వారా ఆయా వర్గాలను సరైన ప్రాతినిధ్యం లేదని భావిస్తే.. రిజర్వేషన్లు కల్పించవచ్చు’ అని ధర్మాసనం వివరించింది. రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగంలో ఉన్న నిబంధనలపై కూడా ధర్మాసనం వివరణ ఇచ్చింది. ‘రాజ్యాంగంలోని 16(4), ఆర్టికల్ 16(4ఏ) అధికరణలు ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగాల్లో, ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించే అధికారాన్ని ప్రభుత్వాలకు కల్పిస్తున్నాయి. ఆయా వర్గాలకు సరైన ప్రాతినిధ్యం లేదని విశ్వసిస్తే ప్రభుత్వాలు వారికి రిజర్వేషన్లు కల్పించేలా నిర్ణయం తీసుకోవచ్చు. ఆయా అధికరణాల్లో ఆ విషయం స్పష్టంగా ఉంది’ అని ధర్మాసనం పేర్కొంది. తీర్పును ఖండిస్తున్నాం: కాంగ్రెస్ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తమకు ఆమోదనీయం కాదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. బీజేపీ పాలనలో ఎస్సీ, ఎస్టీల హక్కులు ప్రమాదంలో పడ్డాయని ఆరోపించింది. ఈ తీర్పును పార్లమెంట్ లోపల, వెలుపల కాంగ్రెస్ లేవనెత్తుతుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ ఆదివారం తెలిపారు. ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడం వారికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. అది ప్రభుత్వాల విచక్షణాధికారంపై ఆధారపడకూడదని కాంగ్రెస్ విశ్వాసం’ అని వాస్నిక్ పేర్కొన్నారు. -
జగన్ను ఆదర్శంగా తీసుకోవాలి
కర్నూలు (సెంట్రల్): బీసీలకు నిర్మాణాత్మక, రాజ్యాంగబద్ధమైన పదవులను కల్పించడంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని దేశంలోని ఇతర రాష్ట్రాల సీఎంలు ఆదర్శంగా తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తన మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 60 శాతం, నామినేటెడ్ పదవుల్లో 50 శాతం కల్పించడం అభినందనీయమన్నారు. ఆదివారం ఆయన కర్నూలులోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీల మాదిరిగా జనాభా ప్రకారం చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గతేడాది పార్లమెంట్లో బీసీలకు 50% రిజర్వేషన్ల కోసం ప్రవేశపెట్టిన బిల్లుకు బీజేపీ మద్దతు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. దేశంలో 14 బీసీ పార్టీలు ఉన్నాయని, వాటికి రాని ఆలోచన వైఎస్సార్సీపీకి రావడం గొప్ప విషయమని అన్నారు. సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లోనూ బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. -
33% బీసీ కోటా
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు వచ్చేశాయి. బీసీలకు 33 శాతం వరకు రిజర్వేషన్లు అమలు చేయవచ్చని రాష్ట్ర మున్సిపాలిటీల చట్టంలో విధించిన గరిష్ట పరిమితి మేరకు మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 32.5 నుంచి 33 శాతం వరకు రిజర్వేషన్లు దక్కనున్నాయి. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల చైర్పర్సన్, 13 మున్సి పల్ కార్పొరేషన్ల మేయర్ స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్లను రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్ డాక్టర్ టీకే శ్రీదేవి ఆదివారం హైదరాబాద్లో ప్రకటించారు. 123 మున్సిపాలిటీల చైర్పర్సన్ స్థానాల్లో బీసీలకు 40, ఎస్సీలకు 17, ఎస్టీలకు 4 రిజర్వ్కాగా ఓపెన్ కేటగిరీకి 62 స్థానాలు రిజర్వు అయ్యాయి. 13 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ స్థానాలకుగాను ఎస్సీ, ఎస్టీలకు చెరో స్థానం, బీసీలకు 4, ఓపెన్ కేటగిరీలో 7 స్థానాలు రిజర్వు అయ్యాయి. రాష్ట్రంలో కొత్త మున్సిపల్ చట్టం అమల్లోకి రావడంతో మళ్లీ కొత్తగా రిజర్వేషన్లను ప్రకటించాల్సిన అవసరం ఏర్పడింది. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలతోపాటు మరో రెండు పర్యాయాలు కలిపి మొత్తం మూడు వరుస సాధారణ ఎన్నికల్లో ఇవే రిజర్వేషన్లు అమలు కానున్నాయి. రాష్ట్రంలో 128 మున్సిపాలిటీలు, 13 మున్సిపల్ కార్పొరేషన్లు కలిపి మొత్తం 141 పురపాలికలు ఉన్నాయి. ఇందులో షెడ్యూల్డ్ ఏరియా పరిధిలో ఉన్న 3 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించడానికి రాజ్యాంగ సవరణ జరపాల్సి ఉంది. గ్రామ పంచాయతీల నుంచి మున్సిపాలిటీలుగా ఏర్పడిన 2 కొత్త మున్సిపాలిటీల పరిధిలోని కొన్ని గ్రామ పంచాయతీల పదవీకాలం ఇంకా ముగియలేదు. దీంతో ఈ ఐదు మున్సిపాలిటీలను మినహాయించి రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లకు సంబంధించిన చైర్పర్సన్, మేయర్ స్థానాలకు రిజర్వేషన్లను ప్రకటించారు. మరోవైపు ఆదివారం జిల్లా కలెక్టర్లు స్థానికంగా ఉన్న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలోని వార్డులు/డివిజన్లకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రకటించారు. దీంతో మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన ప్రధాన ఘట్టం ముగిసింది. ఈ నెల 7న రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికల నోటిఫికేషన్ రానుండగా, 22న పోలింగ్ నిర్వహించి 25న ఫలితాలు ప్రకటించనున్నారు. జనాభా దామాషా ప్రకారం.. మున్సిపల్ చైర్పర్సన్, మేయర్ స్థానాలకు రాష్ట్రం యూనిట్గా తీసుకొని రిజర్వేషన్లను ఖరారు చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా దామాషా ప్రకారం చైర్పర్సన్, మేయర్ స్థానాలను కేటాయించారు. మున్సిపాలిటీల్లో 3.3 శాతం ఎస్టీ జనాభా ఉండగా, 3.2 శాతం చైర్పర్సన్ స్థానాలు వారికి దక్కాయి. దీంతో మొత్తం 123 పురపాలికలకుగాను 4 చైర్పర్సన్ స్థానాలు ఎస్సీలకు రిజర్వు అయ్యాయి. ఇక మున్సిపాలిటీల్లో 13 శాతం ఎస్సీల జనాభా ఉండగా దాదాపు 14 శాతం (17 స్థానాలు) చైర్పర్సన్ సీట్లను వారికి కేటాయించారు. ఎస్సీ, ఎస్టీల కోటా కలుపుకొని మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా ఉండేలా బీసీలకు 32.5 నుంచి 33 శాతం (40 స్థానాలు) చైర్పర్సన్ సీట్లను కేటాయించినట్లు పురపాలక శాఖ డైరెక్టర్ టీకే శ్రీదేవి తెలిపారు. 13 మున్సిపల్ కార్పొరేషన్లలో ఎస్టీల జనాభా 1.9 శాతం మాత్రమే ఉన్నా నిబంధనల ప్రకారం వారికి ఒక మేయర్ పదవి (8 శాతం)ని కేటాయించారు. కార్పొరేషన్లలో ఎస్సీల జనాభా 3.6 శాతం ఉండగా వారికి కూడా నిబంధనల ప్రకారం ఒక మేయర్ సీటును కేటాయించడంతో 8 శాతం కోటా అమలు చేసినట్లు అయింది. బీసీలకు 4 మేయర్ స్థానాలు కేటాయించడంతో 33 శాతం రిజర్వేషన్లు వారికి కల్పించినట్లు అయిందని శ్రీదేవి వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీలకు చెరో మేయర్ పదవి రిజర్వు కావడంతో ఈ స్థానాలకు మహిళా రిజర్వేషన్లను అమలు చేయలేకపోయామన్నారు. అందుకు బదులుగా మహిళలకు ఓపెన్ కెటగిరీలో ఉన్న 7 మేయర్ స్థానాలకుగాను 4 స్థానాలను రిజర్వు చేశామన్నారు. మున్సిపాలిటీ చైర్మన్ రిజర్వేషన్లు... బీసీ (జనరల్): నారాయణ్ఖేడ్, ఆందోల్–జోగిపేట్, గద్వాల, నిర్మల్, రాయికల్, ఎల్లారెడ్డి, మహబూబ్నగర్, పరిగి, వనపర్తి, అమరచింత, రామాయంపేట, చౌటుప్పల్, కొడంగల్, ఖానాపూర్, తూప్రాన్, మంచిర్యాల, బాన్సువాడ, ఆలేరు, భువనగిరి, నర్సాపూర్ బీసీ (మహిళ): సిరిసిల్ల, నారాయణపేట, కోరుట్ల, సదాశివపేట, చండూరు, భీంగల్, ఆర్మూర్, కోస్గి, మెట్పల్లి, జగిత్యాల, సంగారెడ్డి, భైంసా, మక్తల్, పోచంపల్లి, సుల్తానాబాద్, ధర్మపురి, నర్సంపేట, కొల్లాపూర్, యాదగిరిగుట్ట, బోధన్ ఎస్సీ (జనరల్): క్యాతన్పల్లి, బెల్లంపల్లి, ఇబ్రహీంపట్నం, వైరా, ఐజా, నస్పూర్, నేరెడ్చర్ల, తొర్రూరు, నర్సింగి ఎస్సీ (మహిళ): మధిర, పరకాల, పెబ్బైర్, అలంపూర్, వర్ధన్నపల్లి, భూపాలపల్లి, పెద్ద అంబర్పేట, తిరుమలగిరి ఎస్టీ (జనరల్): ఆమనగల్, డోర్నకల్ ఎస్టీ (మహిళ): వర్ధన్నపేట, మరిపెడ ఓసీ (జనరల్): మెదక్, దేవరకొండ, గజ్వేల్, జహీరాబాద్, కొత్తపల్లి, ఎల్లందు, అచ్చంపేట, భూత్పూర్, లక్సెట్టిపేట, జమ్మికుంట, కాగజ్నగర్, కల్వకుర్తి, షాద్నగర్, తుక్కుగూడ, పోచారం, దమ్మాయిగూడ, ఆదిబట్ల, చిట్యాల, ఆదిలాబాద్, అమీన్పూర్, మహబూబాబాద్, మిర్యాలగూడ, సత్తుపల్లి, కొంపల్లి, నాగారం, తుంకుంట, బొల్లారం, మణికొండ, జల్పల్లి, హాలియా, నల్లగొండ. ఓసీ (మహిళ): చొప్పదండి, పెద్లపల్లి, వేములవాడ, కొత్తకోట, చేర్యాల, దుబ్బాక, మోత్కూరు, ఆత్మకూరు, కామారెడ్డి, తాండూరు, చెన్నూరు, దుండిగల్, జనగామ, నాగర్ కర్నూల్, శంషాబాద్, హుస్నాబాద్, మంథని, హుజూర్నగర్, హుజూరాబాద్, శంకర్పల్లి, వికారాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, కొత్తగూడెం, ఘట్కేసర్, మేడ్చల్, నందికొండ, తెల్లాపూర్, కోదాడ, తుర్కయాంజల్, గుండ్ల పోచంపల్లి మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ రిజర్వేషన్లు ఎస్సీ (జనరల్): రామగుండం ఎస్టీ (జనరల్): మీర్పేట బీసీ (జనరల్): బండ్లగూడ జాగీర్, వరంగల్ బీసీ (మహిళ): జవహర్నగర్, నిజామాబాద్ ఓసీ (జనరల్): కరీంనగర్, బోడుప్పల్, పీర్జాదిగూడ ఓసీ (మహిళ): ఖమ్మం, నిజాంపేట్, బడంగ్పేట్, జీహెచ్ఎంసీ మహిళలకు..50% 123 మున్సిపాలిటీల చైర్పర్సన్ స్థానాలకుగాను 61 స్థానాలు, 13 మున్సిపల్ కార్పొరేషన్ల చైర్మన్ స్థానాలకుగాను 6 స్థానాలు మహిళలకు లభించాయి. కొత్త మున్సిపల్ చట్ట నిబంధనల ప్రకారం మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను వర్తింపజేశారు. పురపాలక శాఖ డైరెక్టర్ టీకే శ్రీదేవి ఆదివారం తన కార్యాలయంలో రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ ద్వారా 50 శాతం స్థానాలను ఎంపిక చేసి మహిళలకు రిజర్వు చేశారు. రిజర్వేషన్ కేటగిరీలవారీగా మహిళా రిజర్వేషన్లను పరిశీలిస్తే 123 చైర్పర్సన్ స్థానాల్లో బీసీ (జనరల్)కు 20, బీసీ (మహిళ)కు 20, ఎస్టీ (జనరల్)కు 2, ఎస్టీ (మహిళ)కు 2, ఎస్సీ (జనరల్)కు 9, ఎస్సీ (మహిళ)కు 8, ఓపెన్ కేటగిరీ (జనరల్)కి 31, ఓపెన్ కేటగిరీ (మహిళ)కి 31 స్థానాలు రిజర్వు అయ్యాయి. 13 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ స్థానాలకుగాను మహిళలకు 6 స్థానాలు దక్కాయి. 13 మేయర్ స్థానాలకుగాను బీసీ (జనరల్)కు 2, బీసీ (మహిళ)కు 2, ఎస్సీ (జనరల్)కు 1, ఎస్టీ (జనరల్)కు 1, ఓపెన్ కేటగిరీ (జనరల్)కి 3, ఓపెన్ కేటగిరీ (మహిళ)కు 4 స్థానాలు రిజర్వు అయ్యాయి. కీలకమైన జీహెచ్ఎంసీ మేయర్ స్థానం ఓపెన్ కేటగిరీ(మహిళ)కి రిజర్వు కావడం గమనార్హం. -
మెదక్లో మున్సిపల్ రిజర్వేషన్ల ఖరారు
సాక్షి, మెదక్: జిల్లాలో మెదక్, తూప్రాన్, రామాయంపేట, నర్సాపూర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో మెదక్ మినహా అన్నీ కొత్తగా ఆవిర్భవించినవే. షెడ్యూల్ ప్రకారం గత నెల 30న ఓటరు ముసాయిదా జాబితాను అధికారులు ప్రదర్శించారు. అభ్యంతరాలు, సలహాలు, సూచనలు స్వీకరించారు. మొత్తం అన్ని మున్సిపాలిటీల్లో కలిపి 71 అభ్యంతరాలు రాగా స్వల్ప మార్పులు మాత్రమే చోటు చేసుకున్నాయి. దీనిపై మున్సిపల్ అధికారులను సంప్రదించగా.. సామాజిక వర్గాల్లో తేడాలు వస్తే సరి చేశామని చెప్పారు. చనిపోయిన వారిని తొలగించే హక్కు తమకు లేదన్నారు. తుది జాబితా ప్రకారం మెదక్ మున్సిపాలిటీలో మొత్తం 33,221, తూప్రాన్లో 17,597, రామాయంపేటలో 11,672, నర్సాపూర్లో 14,155 మంది ఓటర్లు ఉన్నట్లు తేలింది. నాలుగు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం మహిళలు 39,074, పురుషులు 37,571 మంది ఉన్నారు. ఈ లెక్కన పురుష ఓటర్ల కంటే మహిళలే 1,503 మంది అధికంగా ఉన్నారు. సామాజిక వర్గాల వారీగా.. మెదక్ మున్సిపాలిటీలో ఎస్టీ ఓటర్లు 752, ఎస్సీలు 4,314, బీసీలు 23,681, ఇతర సామాజిక వర్గాల వారు 4,774 మంది ఉన్నారు. తూప్రాన్లో ఎస్టీ ఓటర్లు 175, ఎస్సీలు 2,257, బీసీలు 12,893, ఇతరులు 2,272 మంది.. రామాయంపేటలో ఎస్టీలు 454, ఎస్సీలు 1,473, బీసీలు 8,677, ఇతరులు 1,068 మంది ఉన్నట్లు తేలింది. నర్సాపూర్లో ఎస్టీ ఓటర్లు మొత్తం 549, ఎస్సీలు 1,559, బీసీలు 10,228, ఇతరులు 1,819 మంది ఉన్నారు. ఊపందుకోనున్న ప్రచారం.. ఓటరు తుది జాబితా విడుదల కావడం, ఆదివారం వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు కానుండడంతో ‘పుర’ పోరు జోరందుకోనుంది. ఈ నెల 7న నోటిఫికేషన్ జారీ కానుండా 8 నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రచారం ఊపందుకోనుంది. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలు ఇదివరకే సన్నాహాలు మొదలుపెట్టగా ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. అన్ని పుర పీఠాలను చేజిక్కించుకుని మరో సారి సత్తా చాటాలనే లక్ష్యంతో అధికార పార్టీ టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మంత్రి హరీశ్రావు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను ఒక్కసారి చుట్టి వచ్చారు. రెండు, మూడు పర్యాయాలు ఆయా పురపాలిక పరిధిలోని నేతలతో సమావేశమై ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి శనివారం సీఎం కేసీఆర్ హైదరాబాద్లో నిర్వహించిన సమావేశానికి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ లెక్కన పుర పోరులో టీఆర్ఎస్ ముందంజలో ఉన్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
మున్సిపల్ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు..
సాక్షి, ఖమ్మం: మున్సిపాలిటీలకు సంబంధించిన వార్డుల రిజర్వేషన్ కోటాను ప్రభుత్వం శనివారం ప్రకటించింది. జిల్లాలోని మూడు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా.. సత్తుపల్లి 23, మధిర 22, వైరాలో 20వార్డుల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. అయితే ఏ వార్డు ఎవరికి రిజర్వు అయిందనే అంశాన్ని ఆదివారం ప్రకటించే అవకాశం ఉంది. వీటితోపాటు మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్లను కూడా ప్రకటిస్తారని భావిస్తున్నారు. ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించడంతో మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికల సందడి ప్రారంభం కానున్నది. ఇప్పటివరకు వార్డులు, మున్సిపల్ చైర్మన్ పదవులకు రిజర్వేషన్ ప్రకటించకపోవడంతో ఆశావహులు ఉత్కంఠగా వేచి చూస్తున్నారు. ప్రస్తుతం వార్డుల రిజర్వేషన్లు ప్రకటించగా.. ఆదివారం వార్డులవారీగా రిజర్వేషన్లు, చైర్మన్ పీఠం ఎవరికి రిజర్వు అయిందనే అంశాలు కూడా తేలే అవకాశం ఉంది. దీంతో ఆశావహులు టికెట్ల కోసం తమవంతు ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయనున్నారు. రిజర్వేషన్లు ఇలా.. సత్తుపల్లి, మధిర, వైరా మున్సిపాలిటీల్లోని వార్డులకు సంబంధించిన రిజర్వేషన్ల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే మున్సిపాలిటీ యూనిట్గా రిజర్వేషన్ల ప్రక్రియను ప్రకటించారు. ఆ ప్రకారం సత్తుపల్లిలో 23 వార్డులకుగాను.. ఒక వార్డు ఎస్టీ జనరల్కు కేటాయించారు. ఎస్సీలకు మూడు.. రెండు వార్డులు ఎస్సీ జనరల్, ఒక వార్డు ఎస్సీ మహిళకు కేటాయించారు. బీసీలకు 7 సీట్లు కేటాయించగా.. 4 బీసీ జనరల్కు, 3 బీసీ మహిళకు కేటాయించారు. మహిళలకు 7 వార్డులు కేటాయించగా.. 5 సీట్లు జనరల్కు కేటాయించారు. మధిర మున్సిపాలిటీలో 22 వార్డులు ఉండగా.. ఎస్టీ జనరల్కు ఒక వార్డు కేటాయించారు. ఎస్సీలకు 6 వార్డులు.. మూడు వార్డులు ఎస్సీ జనరల్కు, 3 ఎస్సీ మహిళకు కేటాయించారు. బీసీలకు 4 సీట్లు కేటాయించగా.. 2 బీసీ జనరల్కు, 2 బీసీ మహిళలకు రిజర్వు చేశారు. మహిళలకు 6 వార్డులు రిజర్వు చేయగా.. జనరల్కు 5 వార్డులు కేటాయించారు. వైరాలో 20 వార్డులు ఉండగా.. ఒక వార్డు ఎస్టీ జనరల్కు కేటాయించారు. ఎస్సీలకు 5 వార్డులు కేటాయించగా.. 3 ఎస్సీ జనరల్కు, 2 వార్డులు ఎస్సీ మహిళలకు రిజర్వు చేశారు. బీసీలకు 4 వార్డులు రిజర్వు చేశారు. వీటిలో 2 బీసీ జనరల్కు, 2 వార్డులు బీసీ మహిళలకు కేటాయించారు. 6 జనరల్ మహిళకు, 4 జనరల్కు కేటాయించారు. మూడు మున్సిపాలిటీల్లో ఒక్కో సీటును ఎస్టీలకు కేటాయించారు. 50 శాతం మహిళలకే.. ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లలో 50 శాతం వార్డులను మహిళలకు కేటాయించారు. సత్తుపల్లిలో మొత్తం 23 వార్డులు ఉండగా.. ఎస్సీ, బీసీ జనరల్ మహిళకు కలిపి 11 వార్డులు కేటాయించారు. అలాగే మధిరలో 22 వార్డులకు గాను.. 11 వార్డులు ఎస్సీ, బీసీ, జనరల్ మహిళకు కేటాయించారు. వైరాలో 20 వార్డులకు గాను.. 10 వార్డులు ఎస్సీ, బీసీ, జనరల్ మహిళకు రిజర్వు చేశారు. దీంతో ప్రతి మున్సిపాలిటీలోనూ మహిళా ప్రాతినిధ్యం 50 శాతం ఉండనున్నది. -
కరీంనగర్ మేయర్ బీసీలకే..?
సాక్షి, కరీంనగర్: మునిసిపల్ ఎన్నికల్లో కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియలో తొలిఘట్టం ముగిసింది. మునిసిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో ఏ కేటగిరీకి ఎన్ని వార్డులను రిజర్వు చేశారో తేలింది. ఆయా పుర, నగర పాలక సంస్థల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ జనాభా, బీసీ, జనరల్ ఓటర్ల సంఖ్యతో రూపొందించిన కులగణన ద్వారా ఆయా కేటగిరీలకు కేటాయించే వార్డుల సంఖ్యను ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఉమ్మడి కరీంనగర్ పరిధిలోని కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో ఉన్న రెండు కార్పొరేషన్లు, 14 మునిసిపాలిటీల్లో ఉన్న జనాభా, ఓటర్ల సంఖ్య ఆధారంగా వార్డులను ఆయా కేటగిరీలకు కేటాయించారు. ఆయా కేటగిరీలకు కేటాయించిన వార్డులను బట్టి మునిసిపల్ కార్పొరేషన్లలో కరీంనగర్ బీసీలకు కేటాయించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఏ మునిసిపల్ కార్పొరేషన్లో లేని విధంగా 60లో అన్రిజర్వుడు(జనరల్) 30 స్థానాలు పోగా ఏకంగా 23 వార్డులను బీసీలకు రిజర్వు చేశారు. 6 స్థానాలు ఎస్సీలకు, ఒక స్థానాన్ని ఎస్టీకి రిజర్వు చేశారు. దీనిని బట్టి కరీంనగర్ మేయర్ స్థానాన్ని బీసీలకు కేటాయించినట్లు స్పష్టమవుతోంది. అలాగే రామగుండం కార్పొరేషన్లో ఎస్సీలకు అత్యధికంగా 11 వార్డులు కేటాయించారు. ఇక్కడ 50 స్థానాలు ఉండగా, 50 శాతం రిజర్వేషన్లలో భాగంగా 25 స్థానాల్లో 11 స్థానాలు ఎస్సీలకు కేటాయించారు. రాష్ట్రంలో మరే కార్పొరేషన్లో ఎస్సీలకు ఇన్ని స్థానాలు లేవు. ఈ రిజర్వుడు స్థానాలను బట్టి కరీంనగర్ మేయర్ స్థానం బీసీలకు, రామగుండం ఎస్సీలకు రిజర్వు చేయడం దాదాపు ఖాయమైంది. మహిళలకా, జనరల్ స్థానమా అనేది తర్వాత తేలనుంది. మునిసిపాలిటీలకు సంబంధించి రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న అన్ని పురపాలక సంస్థలను ఒక యూనిట్గా తీసుకొని జనాభా ఆధారంగా రిజర్వేషన్లను ప్రకటిస్తారు. మునిసిపాలిటీల్లో కూడా జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి వంటి స్థానాలు బీసీలకు రిజర్వు అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. మునిసిపల్ కార్పొరేషన్లలో మేయర్ లెక్క ఇదీ.. వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్లకు కేటాయించిన వార్డులను బట్టి కరీంనగర్, రామగుండం మునిసిపల్ కార్పొరేషన్లు బీసీ, ఎస్సీలకు రిజర్వు అయ్యేందుకే ఎక్కువగా అవకాశం ఉంది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి 50 శాతం మించకుండా ప్రభుత్వం ఎస్టీ, ఎస్సీ, బీసీలకు వార్డుల సంఖ్యను రిజర్వు చేసింది. కరీంనగర్లోని 60 వార్డుల్లో జనరల్ స్థానాలు 30 పోగా మిగతా 30లో ఎస్సీలకు కేవలం6 స్థానాలు(10 శాతం), ఎస్టీలకు ఒక స్థానాన్ని కేటాయించారు. బీసీలకు ఏకంగా 23 స్థానాల(38 శాతం)ను కేటాయించడం గమనార్హం. దీనిని బట్టి కరీంనగర్ బీసీ కేటగిరీలో రిజర్వు అయ్యే అవకాశం అధికంగా ఉందని తెలుస్తోంది. ఇక ఎస్సీ జనాభా అధికంగా ఉన్న రామగుండం నగర పాలక సంస్థలో 50 వార్డులకు గాను సగం జనరల్కు కేటాయించారు. మిగిలిన 25లో ఏకంగా 11 స్థానాలు(20 శాతం) ఎస్సీలకు కేటాయించారు. ఇక్కడ బీసీలకు కేవలం 13 స్థానాలు, ఎస్టీలకు ఒక స్థానం మిగిలింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఒక్కో వార్డును ఎస్టీకి కేటాయించారు. నేడు తేలనున్న వార్డులు ప్రకటించిన రిజర్వు స్థానాల సంఖ్య ఆధారంగా ఏయే వార్డులను ఏ కేటగిరీకి రిజర్వు చేస్తారనేది ఆదివారం తేలుతుంది. అన్ని జిల్లాల కలెక్టర్లు 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ జనాభా అధికంగా ఉన్న వార్డులను వారికి కేటాయించిన సంఖ్య ప్రకారం తొలుత కేటాయిస్తారు. తరువాత ఓటర్ల గణన ప్రకారం బీసీ కేటగిరీకి వార్డులను కేటాయించిన అనంతరం మిగిలిన వాటిని జనరల్ కేటగిరీ కింద ప్రకటిస్తారు. అనంతరం ఆయా మునిసిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో మహిళలకు, ఎవరికి కేటాయించని స్థానాలను లాటరీ పద్ధతిలో డ్రా ద్వారా నిర్ణయిస్తారు. ప్రతి కౌన్సిల్లో 50 శాతం మహిళలు ఉండేలా వార్డులను రిజర్వు చేయడం గమనార్హం. రేపు మునిసిపల్ చైర్పర్సన్, మేయర్ రిజర్వేషన్ మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో ఏ కేటగి రీకి ఎన్ని వార్డులను కేటాయించారనే లెక్క తేలగా, అవి ఏయే వార్డులనే విషయం ఆదివారం వెల్లడి కానుంది. ఇక మున్సిపల్ చైర్మన్, మేయర్ స్థానాలను ఏ కేటగిరీకి రిజర్వు చేశారనేది సోమవారం స్పష్టం కానుంది. రాష్ట్రం యూనిట్గా తీసుకొని జనాభా ఆధారంగా మేయర్, మునిసిపల్ చైర్మన్ల రిజర్వేషన్లను నిర్ణయించనున్నారు. రాజ కీయ నేతల్లో ఈ మేరకు టెన్షన్ నెలకొంది. -
ఉత్కంఠకు తెర!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: స్థానిక సంస్థల ఎన్నికల్లో తొలిఘట్టం పూర్తయ్యింది. జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి..జిల్లా పరిషత్ చైర్పర్సన్ పీఠం ఈసారి ఎస్సీ మహిళకు దక్కింది. 2014 జెడ్పీ ఎన్నికల్లో చైర్పర్సన్ స్థానం ఎస్టీ మహిళకు కేటాయించారు. ఈ సారి ఎస్సీ మహిళకు రిజర్వయ్యింది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్లాల్ రిజర్వేషన్ల వివరాల జాబితాను విడుదల చేశారు. జిల్లాలో 34 జెడ్పీటీసీలు, 34 ఎంపీపీలు, 549 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఎంపీపీల్లో ఎస్టీ మహిళలకు 2, ఎస్టీ జనరల్కు 2 స్థానాలు కేటాయించారు. ఎస్సీ మహిళలకు 2, ఎస్సీ జనరల్ 2 స్థానాలు, బీసీ మహిళలకు 13, బీసీ జనరల్కు 13 స్థానాలు కేటాయించారు. జిల్లాలోని 34 జెడ్పీటీసీ స్థానాలకు ఎస్టీ మహిళలకు 2 స్థానాలు, ఎస్టీ జనరల్కు 2 స్థానాలను కేటాయించారు. ఎస్సీ మహిళలకు 2, ఎస్సీ జనరల్ 2 స్థానాలు, బీసీ మహిళలకు 9, బీసీ జనరల్కు 9, అన్ రిజర్వుడ్ మహిళలకు 4, అన్ రిజర్వుడ్ జనరల్కు 4 స్థానాలు కేటాయించారు. ఎంపీటీసీలకు సంబంధించి 549 స్థానాలకు ఎస్టీ మహిళలకు 37, ఎస్టీ జనరల్కు 24, ఎస్సీలకు 35, ఎస్సీ జనరల్కు 23, బీసీ మహిళలకు 150, బీసీ జనరల్కు 138, అన్ రిజర్వుడ్ మహిళలకు 80, అన్ రిజర్వుడ్ జనరల్కు 62 స్థానాలను కేటాయించారు. తుది నిర్ణయం తీసుకోనున్న హైకోర్టు రిజర్వేషన్ల ఖరారుపై ఈ నెల 8న రాష్ట్ర హైకోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం 1994 రూల్ నెం.13 ప్రకారం రిజర్వేషన్ల కేటాయింపు జరగడంతో దాదాపుగా ఇవే ఖరారయ్యే అవకాశం ఉంది. రిజర్వేషన్ల ప్రకారం చూస్తే జిల్లాలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యం లభించింది. ఎంపీటీసీలుగా 549 స్థానాలకు 302 స్థానాల్లో మహిళలే పోటీ చేయాల్సి ఉంది. 34 జెడ్పీటీసీ స్థానాల్లో సగం మహిళలకే దక్కాయి. ఎంపీపీల్లోనూ 34 స్థానాల్లో 17 మహిళలకే కేటాయించారు. తాజా రిజర్వేషన్ల ప్రకారం రాజకీయ పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలా చోట్ల ఆశావహులు పోటీ చేయాలని ఆశగా ఉన్నారు. రిజర్వేషన్ల గెజిట్ విడుదల తర్వాత వారిలో చాలా మంది అవకాశాన్ని కోల్పోయారు. అలాంటి వారిలో కొంత నైరాశ్యం ఏర్పడింది. కానీ ప్రభుత్వం ఏ విధమైన రాజకీయాలకు, పక్షపాతానికి తావు లేకుండా 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను అనుసరించి అధికారుల చేత రిజర్వేషన్లు రూపొందించింది. -
బీసీలకు 4.. ఎస్సీలకు 2
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మండల, జిల్లాపరిషత్ ఎన్నికలకు సంబంధించి జిల్లాపరిషత్ చైర్మన్ పదవుల రిజర్వేషన్లను పంచాయతీ రాజ్ శాఖ శుక్రవారం ఖరారు చేసింది. ఈ మేరకు 13 జిల్లాల జెడ్పీ చైర్మన్ పదవుల రిజర్వేషన్ల వివరాలతో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ ప్రకారం.. నాలుగు జిల్లా పరిషత్ (జెడ్పీ) చైర్మన్ పదవులు బీసీలకు, రెండు ఎస్సీలకు, ఒకటి ఎస్టీలకు రిజర్వు అయ్యాయి. మిగిలిన 6జెడ్పీ చైర్మన్ పదవులను జనరల్(అన్రిజర్వ్)కు కేటాయించారు. కాగా మొత్తం 13 జిల్లా పరిషత్లకుగాను ఆయా కేటగిరీల వారీగా 6 మహిళలకు రిజర్వు అయ్యాయి. 73వ రాజ్యాంగ సవరణ తర్వాత 1994లో ఏపీ పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి రాగా, అందులో పేర్కొన్న నిబంధనల మేరకు ఇప్పటి వరకు నాలుగు విడతలపాటు ‘స్థానిక’ ఎన్నికలు జరిగాయి. ఈ 4 విడతల ఎన్నికల్లోనూ నిబంధనల ప్రకారం రొటేషన్ పద్ధతిన జెడ్పీ చైర్మన్ పదవుల రిజర్వేషన్లను పంచాయతీరాజ్ శాఖ ఖరారు చేస్తూ వస్తోంది. అదే రొటేషన్ క్రమంలో ప్రస్తుతం ఐదో విడత ఎన్నికలకోసం ఆయా కేటగిరీల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ పదవుల రిజర్వేషన్లకు సంబంధించి జిల్లాలవారీగా ఆయా జిల్లాల కలెక్టర్లు గురువారం గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేయడం తెలిసిందే. సర్పంచ్ రిజర్వేషన్ల ఖరారుపై వీడియో కాన్ఫరెన్స్ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లను సైతం ఖరారు చేసే కసరత్తు ప్రారంభమైంది. ఇందులో భాగంగా జిల్లా, మండల అధికారులకు సూచనలు చేసేందుకు పంచాయతీరాజ్శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్తో కలసి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల్లో ఎక్కడికక్కడ ఆయా జిల్లాల జెడ్పీ చైర్మన్లు, డీపీవోలు, ఆర్డీవోలు, ఎంపీడీవోలు ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13,057 గ్రామ పంచాయతీలకు సర్పంచ్ పదవులతోపాటు వాటి పరిధిలో ఉండే 1,33,726 వార్డు సభ్యుల పదవుల రిజర్వేషన్లు ఖరారు చేసే ప్రక్రియను శని, ఆదివారాల్లోగా పూర్తి చేసి నోటిఫికేషన్ జారీ చేయాలని ఈ సందర్భంగా అధికారులను గోపాలకృష్ణ ద్వివేది ఆదేశించారు. -
ఎన్నికల షెడ్యూల్ సవరించాలి
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ రిజర్వేషన్లపై అభ్యంతరాలకు కనీసం వారం రోజుల సమయం ఉండేలా ఎన్నికల షెడ్యూల్ను సవరించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డికి బీజేపీ ప్రతినిధిబృందం విజ్ఞప్తి చేసింది. ఈ నెల 4, 5 తేదీల్లో మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లు ప్రకటించనుండగా, 7వ తేదీనే నోటిఫికేషన్ జారీచేస్తే రిజర్వేషన్లపై అభ్యంతరాలకు సమయం సరిపోదని పేర్కొంది. అనేక మున్సిపాలిటీల్లో వార్డు విభజనల లెక్కల్లో తప్పులు, వార్డులు వారీగా ఓటర్ల జాబితాల్లో, ఎస్సీ,ఎస్టీ,బీసీ జనగణనలో అక్రమాలు చోటుచేసుకున్నాయని తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ఎస్ఈసీ కార్యాలయంలో నాగిరెడ్డికి బీజేపీ ఉపాధ్యక్షుడు, మున్సిపల్ ఎన్నికల సమన్వయకర్త డా.ఎస్.మల్లారెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్చందర్జీల ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. ఎస్టీ,ఎస్సీ,బీసీ,మహిళా రిజర్వేషన్ల విషయంలో పారదర్శకత పాటించాలని, నిజాంపేట, బడంగ్పేట,పెద్దఅంబర్పేట తదితర మున్సిపాలిటీలు,కార్పొరేషన్లలో వార్డులవారీగా ఓటర్ల జాబితాల్లో తప్పులు వెంటనే సరిదిద్దాలని కోరారు. తాము పేర్కొన్న అంశాలపై నాగిరెడ్డి సానుకూలంగా స్పందించారని మల్లారెడ్డి మీడియాకు తెలిపారు. -
పంచాయతీ ఎన్నికల్లో.. బీసీలకు 34% రిజర్వేషన్లు
సాక్షి, అమరావతి: రానున్న పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీచేశారు. 2011 జనగణన వివరాల ప్రకారం ఎస్సీలకు 19.08 శాతం, ఎస్టీలకు 6.77 శాతం రిజర్వేషన్లు కల్పించి, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రెండ్రోజుల క్రితం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్ణయించిందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్ కమిషనర్ ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలు, మండలాలు, గ్రామాలు, వార్డుల వారీగా రిజర్వేషన్ ఖరారుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రిజర్వు స్థానాలు గుర్తించేది ఇలాగే.. ►రిజర్వేషన్ల ఖరారులో ఎస్సీ, ఎస్టీలకు 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం నిర్ణయిస్తారు. బీసీ రిజర్వేషన్లను ప్రస్తుతం ఆ కేటగిరికి చెందిన ఓటర్ల వివరాల ప్రకారం కేటాయింపులు జరుగుతాయని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయ అధికారులు అంటున్నారు. ►జడ్పీ చైర్మన్, ఎంపీపీ, గ్రామ పంచాయతీ రిజర్వేషన్లు రాష్ట్రం యూనిట్గా.. జడ్పీటీసీ రిజర్వేషన్లు జిల్లా యూనిట్గాను.. ఎంపీటీసీ రిజర్వేషన్లు మండల యూనిట్గానూ.. వార్డు సభ్యుల రిజర్వేషన్లు గ్రామ పంచాయతీ యూనిట్గా తీసుకుంటారు. యూనిట్గా అంటే ఆ ప్రాంత పరిధిలో 2011 నాటి జనాభా లెక్కలు లేదా ఓటర్ల వివరాల మేరకు జరుగుతుంది. ►మండల పరిషత్ అధ్యక్ష పదవులకు అయితే.. రాష్ట్రంలో 660 మండల పరిషత్లు ఉండగా, ఏ జిల్లాకు ఎన్ని మండలాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ కేటగిరీల కింద కేటాయించాలన్నది పంచాయతీరాజ్ కమిషనర్ నిర్ణయించి, ఆయా జిల్లా కలెక్టర్లకు తెలియజేస్తారు. కలెక్టరు ఆ జిల్లాలో ఏ మండలం ఏ కేటగిరికి రిజర్వు చేసేది నిర్ణయిస్తారు. ►జడ్పీటీసీ పదవులకు అయితే.. ఆ జిల్లాలో ఉండే మొత్తం పదవులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన (ఎస్సీలకు 19.08 శాతం, ఎస్టీలకు 6,77 శాతం, బీసీలకు 34 శాతం, మిగిలినవి జనరల్ కేటగిరి) మేరకు జిల్లా కలెక్టరే రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. ►ఎంపీటీసీ పదవులకు అయితే.. జిల్లాలో ఉండే మొత్తం పదవులను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు జిల్లా కలెక్టరు ఆ జిల్లాలో ఏ కేటగిరికి ఎన్ని పదువుల కేటాయించాలన్నది నిర్ణయిస్తే.. ఆర్డీవో స్థాయి అధికారి తమ పరిధిలో ఉన్న స్థానాలను ఏ కేటగిరికి ఎన్ని కేటాయించాలన్నది నిర్ణయిస్తారు. ►ఇక సర్పంచి పదవులను జిల్లాల వారీగా ఎన్ని కేటాయించాలన్నది పంచాయతీరాజ్ కమిషనర్, ఆయా జిల్లాల కలెక్టర్లు నిర్ణయిస్తారు. ఆర్డీవో స్థాయి అధికారి తమ పరిధిలో ఏఏ పంచాయతీలను ఏఏ కేటగిరికి కేటాయించేది నిర్ణయిస్తారు. ►చివరిగా.. వార్డు సభ్యుల రిజర్వేషన్లను గ్రామాల వారీగా ఏ కేటగిరికి ఎన్ని కేటాయించేది ఆర్డీవో అధికారి నిర్ణయిస్తే.. వార్డుల వారీగా ఏ వార్డును ఏ కేటగిరికి కేటాయించేది ఎంపీడీవో నిర్ణయిస్తారు. -
‘స్థానిక’ రిజర్వేషన్లు ఖరారు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పంచాయతీరాజ్ చట్టం ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలను 2011 జనాభా లెక్కల ప్రకారం నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి అత్యంత కీలకమైన రిజర్వేషన్లను సైతం ఖరారు చేసింది. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశం వీటితోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రివర్గ సమావేశం నిర్ణయాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు. రాష్ట్ర ప్రజలందరి ప్రయోజనమే లక్ష్యంగా సర్కారు పని చేస్తుందని చెప్పారు. మంత్రి నాని వివరించిన మంత్రివర్గ నిర్ణయాలు ఇలా.. ►2011 జనాభా గణన ఆధారంగా బీసీలకు 34 శాతం, ఎస్సీలకు 19.08, ఎస్టీలకు 6.77 శాతం.. మొత్తం 59.85 శాతం రిజర్వేషన్ల దామాషా ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం– 1994 ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ. ►ప్రమాదాల్లో గాయపడిన వారిని తక్షణమే ఆస్పత్రికి చేరవేసి, మెరుగైన వైద్యం అందించడం ద్వారా ప్రాణాలు కాపాడాలనే ఉన్నతాశయంతో నాడు దేశంలో ప్రప్రథమంగా దివంగత సీఎం వైఎస్సార్ ప్రవేశపెట్టిన 108 అంబులెన్స్ సేవలు గత అయిదేళ్లలో దారుణంగా తయారయ్యాయి. నిర్వహణ బాగోలేక వాహనాలకు కాలం చెల్లింది. జీతాల్లేక డ్రైవర్లు సమ్మెలోకి వెళ్లడం వల్ల గత అయిదేళ్లలో ఎందరో చనిపోయారు. ఈ నేపథ్యంలో 412 సరికొత్త 108 సర్వీసు వాహనాలను వచ్చే ఏడాది మార్చి ఆఖరులోగా రూ.71.48 కోట్లతో కొనుగోలు చేయాలి. ►ఆరోగ్య పరీక్షలు నిర్వహించే 104 సర్వీసుల కోసం 656 వాహనాలను రవాణా వ్యయంతో కలిపి మొత్తం రూ.60.51 కోట్లతో మార్చి ఆఖరులోగా కొనుగోలు చేయాలి. ►కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలో 6.04 ఎకరాలు కేటాయింపు. మార్కెట్ విలువ ఎకరా రూ.43 లక్షలు ఉన్నప్పటికీ ఎకరా రూ.లక్షకే కేటాయించాలని నిర్ణయం. వైఎస్సార్ జిల్లా రాయచోటిలో 4 ఎకరాలను రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు బదలాయించేందుకు ఆమోదం. ►మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ బాధ్యతను కేంద్ర ప్రభుత్వ సంస్థ రైట్స్ నిర్మాణ సంస్థకు అప్పగిస్తూ ఇన్క్యాబ్ సీఎండీ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం. మచిలీపట్నం పోర్టును రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా నిర్మించడం కోసం స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్పీవీ) ఏర్పాటుకు అనుమతి. ►రామాయపట్నం పోర్టు నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న కృష్ణపట్నం సముద్ర ముఖపరిధిని కుదించాలని నిర్ణయం. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణకు కొత్త పాలసీ రాష్ట్రంలో 191 మార్కెట్ యార్డులు, 150 ఉప మార్కెట్ యార్డులు.. మొత్తం 341 చోట్ల వ్యవసాయ ఉత్పత్తుల శాశ్వత కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేవలం కోతల సమయంలోనో, వ్యవసాయ ఉత్పత్తులు చేతికొచ్చే సమయంలోనే కాకుండా 365 రోజులూ ఇవి పనిచేసేలా నూతన విధానం అమలవుతుంది. పసుపు, మిర్చి, ఉల్లి, చిరుధాన్య (కొర్ర, అండుకొర్ర, అరిక, వరిగ, ఊద, సామలు) పంటలకు నేటికీ కనీస మద్దతు ధర కరువైన తరుణంలో ఏటా సాగు సీజన్కు ముందే వీటికి కనీస మద్దతు ధరలను ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయనుంది. ఈ ఏడాది క్వింటాలు మిర్చికి రూ.7 వేలు, పసుపు రూ.6,350, ఉల్లి (కనీసం) రూ.780, చిరుధాన్యాలకు రూ.2,500గా కనీస మద్దతు ధర ఖరారు చేసింది. టమాటా, చీని, అరటి, నిమ్మ పంటలకు మద్దతు ధర ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తోంది. వీటన్నింటికీ విధి విధానాలు ఖరారు చేయాలంటూ వ్యవసాయ మార్కెట్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. -
నేడు పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు!
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను శుక్రవారం జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఖరారు చేసే అవకాశముంది. చట్టప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను ఖరారు చేస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకునే వీలుందని అధికార వర్గాల ద్వారా తెలిసింది. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇందులో పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. దేవాలయాల ట్రస్టు బోర్డుల్లో సభ్యుల నియామకానికి సంబంధించి దేవదాయ చట్టంలో సవరణలు తీసుకొచ్చే ముసాయిదా బిల్లుపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది. పేదలకిచ్చే ఇళ్ల స్థలాల టైటిల్పై విధివిధానాలు ఖరారుకు సంబంధించి నిర్ణయం తీసుకోనున్నారు. జగనన్న అమ్మ ఒడి పథకం వివరాలను కేబినెట్కు అధికారులు ఈ సందర్భంగా వివరించనున్నారు. కొత్తగా 104, 108 అంబులెన్స్లు 1,060 కొనుగోలు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. రాజధానితోపాటు రాష్ట్రంలోని 13 జిల్లాల అభివృద్ధిపై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికను కేబినెట్కు సమరి్పంచే వీలుంది. ఎకనామిక్ జోన్లకు భూమి కేటాయింపులపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. -
మార్చి 31 నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కంటే ముందు పూర్తి చేయాల్సిన విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం గురువారం హైకోర్టు ముందుంచింది. 2020 జనవరి మొదటి వారం నాటికి పంచాయతీల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు తదితర ప్రక్రియలను పూర్తి చేస్తామని నివేదించింది. జనవరి 10వ తేదీ కల్లా ఆ వివరాలన్నింటినీ రాష్ట్ర ఎన్నికల కమిషన్కు పంపుతామంది. మార్చి 31వ తేదీకల్లా పంచాయతీ ఎన్నికలను పూర్తి చేస్తామని వివరించింది. ఈ వివరాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. జనవరి 3వ తేదీ కల్లా పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను పూర్తి చేసి, వీలైనంత త్వరగా ఎన్నికలను పూర్తి చేస్తారని ఆశిస్తున్నామని పేర్కొంది. తదుపరి విచారణను జనవరి 3వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీల గడువు ముగిసినా ఎన్నికలు నిర్వహించకుండా, ప్రత్యేకాధికారులను నియమించడం రాజ్యాంగ విరుద్ధమని, వెంటనే ఎన్నికలను నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ న్యాయవాది తాండవ యోగేష్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఇదే అంశంపై మరో వ్యక్తి కూడా పిల్ వేశారు. ఈ వ్యాజ్యాలపై గురువారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీఎస్ నీలం సాహ్ని దాఖలు చేసిన అఫిడవిట్ను అడ్వొకేట్ జనరల్(ఏజీ) శ్రీరామ్ ధర్మాసనం ముందుంచారు. మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు పెట్టాలంటూ 2018 అక్టోబర్ 23న ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయలేకపోయినందుకు నీలం సాహ్ని కోర్టును క్షమాపణలు కోరారు. స్థానిక సంస్థలకు రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏజీ శ్రీరామ్ వివరించారు. జనవరి మొదటి వారానికల్లా పంచాయతీల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారును పూర్తి చేస్తామని తెలిపారు. జనవరి 10కల్లా ఆ రిజర్వేషన్లను రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలియచేస్తామన్నారు. -
రిజర్వేషన్ల అమలులో అవకతవకలు
సమ సమాజం, సామాజిక న్యాయం కోసం రాజ్యాంగ నిర్మాతలు – పీడిత, అణగారిన, అణచివేతకు గురైన కులాలకు అధికారంలో వాటా ఇవ్వడానికి ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల అమలులో అధికారులు ఏదేదో సాకుతో రిజర్వేషన్ సూత్రాలకు, సిద్ధాంతాలకు వక్రభాష్యం చెబుతూ నిర్వచిస్తూ తూట్లు పొడుస్తూనే ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సాధికారత కల్పించడానికి ప్రవేశపెట్టిన రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయడానికి ప్రభుత్వంతో చర్చలు జరిపి జీవో నంబర్ 550–జీవో నంబర్ 519 జారీ చేయడం జరిగింది. 1986 నుంచి అనేక సర్క్యులర్స్ జారీ చేశారు. అయినప్పటికీ సుప్రీంకోర్టు తీర్పులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఉత్తర్వులకు రిక్రూట్మెంట్ అధికారులు వక్రభాష్యం చెబుతు ఈ వర్గాల ప్రయోజనాలను, అభివృద్ధిని కాలరాస్తున్నారు. ఇటీవల కాలంలో ఎం.బి.బి.ఎస్ అడ్మిషన్లలో, పంచాయతీరాజ్ సెక్రటరీ పోస్టుల నియామకాలలో, పోలీస్ నియామకాల్లో, టీఎస్పీఎస్సీ ద్వారా జరిగిన టీచర్ రిక్రూట్ మెంట్లో, సాంఘిక సంక్షేమ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా జరిపిన టీచర్ రిక్రూట్మెంట్లో ఎస్సీ,ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ల అమలులో అవకతవకలు,అక్రమాలు జరిగినట్లు వెలుగులోకి వచ్చాయి. దీనిపై బీసీ కమిషన్కు, ఎస్సీ/ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదులు వచ్చాయి. రిజర్వేషన్లు అమలులో రిక్రూట్ మెంట్ అధికారులు నాలుగు రకాలుగా అక్రమాలకు పాల్పడుతున్నారు. 1) ఆప్షన్ పేరుమీద – ఉద్యోగాల నియామకాలలో పోస్టు ఆప్షన్ పేరుమీద, శాఖ ఆప్షన్ పేరుమీద, జిల్లా ఆప్షన్ పేరుమీద– కాలేజి అడ్మిషన్లలో కాలేజి ఆప్షన్ పేరుమీద రిజర్వేషన్ల అవకతవకలు–అక్రమాలకు పాల్పడుతున్నారు. 2) రెండవది– లోకల్– నాన్ లోకల్ రిజర్వేషన్లు అమలు చేసేటప్పుడు ఎస్సీ,ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ల అమలులో తప్పుడు విధానం అవలంబిస్తున్నారు. 3) మూడవది– రెండవ లిస్టు– మూడవ లిస్టు ఆ తర్వాత వేసే క్రమంలో స్లై్లడింగ్–రివైజ్ చేయడం లేదు. 4) నాలుగవది–సెలక్షన్ సమయంలోనే సీనియారిటీ పేరుమీద 100 పాయింట్లు రోస్టర్ పాయింట్లలో ఫిక్స్ చేయడం పేరు మీద అన్యాయం చేస్తున్నారు. మొదటి పద్ధతిలో గ్రూప్–1, గ్రూప్–2 రిక్రూట్ మెంట్లలో వివిధ శాఖలలో కలిపి ఎక్కువ కేటగిరీల పోస్టులు ఉండటం వలన పోస్టుల ఆప్షన్ల పేరు మీద పోస్టు–పోస్టుకు రిజర్వేషన్లను వేరు, వేరుగా అమలు చేస్తున్నారు. దీని మూలంగా ఎక్కువ మార్కులు వచి్చన అభ్యర్థులు కూడా ప్రాదాన్యత గల పోస్టులను ఎంపిక చేసుకుంటే రిజర్వేషన్ కేటగిరి క్రిందకు వెళుతున్నాయి. అలాగే సోషల్ వెల్ఫేర్ గురుకుల టిచర్ రిక్రూట్మెంట్ బోర్డు జరిపిన టిచర్ పోస్టులలో కూడా ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, బి.సి వెల్ఫేర్ స్కూళ్ళ టిచర్ల రిక్రూట్ మెంట్లో ఆప్షన్ల పేరు మీద రిజర్వేషన్ వర్గాలకు అన్యాయం జరిగింది. మొత్తం రిక్రూట్మెంట్ను యూని ట్గా తీసుకొని మొత్తం పోస్టుల సెలక్షన్ చేసిన తర్వాత ఆప్షన్కు అవకాశం కలి్పంచాలి. కాని సెలక్షన్– ఆప్షన్ ఒకే సమయంలో ఇచ్చి అన్యాయం చేశారు. ఇక రెండవ పద్ధతి తప్పుడు నిర్వచనం చూస్తే లోకల్–నాన్ లోకల్ పేరుమీద రిజర్వేషన్ అమలు చేసే విధానం కూడా లోపభూయిష్టంగా ఉంది. మొదట నాన్ లోకల్–ఆ తర్వాత లోకల్ కేటగిరిలలో–మొదట ఓపెన్ కాంపిటీషన్ భర్తీ చేసిన తర్వాతనే రిజర్వేషన్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టాలి. కానీ అలా కాకుండా నాన్ లోకల్ కోటాలో ఓపెన్ కేటగిరి, రిజర్వేషన్ కేటగిరి పోస్టులు భర్తీ చేసిన తర్వాతనే లోకల్ కోటా ప్రారంభించి భర్తీ చేస్తున్నారు. ఇది అన్యాయం. దీని మూలంగా ఎక్కువ మార్కులు ఉన్న రిజర్వుడు అభ్యర్థులు లోకల్ కోటాలో ఓపెన్ కాంపిటిషన్లో వస్తారు. కానీ మొదట నాన్ లోకల్ రిజర్వేషన్ కోటా భర్తీ చేయడంతో ఎక్కువ మార్కులు ఉన్న రిజర్వుడు అభ్యర్థులు నాన్ లోకల్లో రిజర్వేషన్లోకి వెళుతున్నారు. ఈ తప్పును సరిదిద్దడం లేదు. ఇక మూడవ పద్ధతిలోని అన్యాయం చూస్తే మొదటి లిస్టు, రెండవ లిస్టు, మూడవ లిస్టులు వేసేటప్పుడు ఈ వర్గాలకు అన్యాయం చేస్తున్నారు. రెండవ లిస్టు, మూడవ లిస్టు వేసేటప్పుడు స్లైడింగ్, రివైజ్ లిస్ట్ లాంటి ప్రక్రియలు చేపట్టకుండా అన్యాయం చేస్తున్నారు. మొదటి లిస్టులో రిజర్వేషన్లో వచి్చన అభ్యర్థులు కొందరు ఎక్కువ మార్కులు ఉన్నవారు. రెండు– మూడవ లిస్టులలో వచ్చే సరికి మార్కులను బట్టి ఓపెన్ కేటగిరికి వెళ్లి పోతారు. కాని అలా రివైజ్ చేస్తూ స్లై్లడింగ్ చేయడం లేదు. దీని మూలంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతుంది. 1992లో విద్యుత్ శాఖ వారు ఏఈ పోస్టుల నియామకాలలో రెండవ లిస్టు సంద ర్భంగా రివైజ్ చేయకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం చేశారు. ఇక విద్యా సంస్థల అడ్మిషన్లలో కూడా ఎం.బి.బి.ఎస్ అడ్మిషన్లలో కాలేజీ ఆప్షన్ పేరుమీద, పీజీ అడ్మిషన్లలో కోర్సు ఆప్షన్ పేరుమీద అన్యాయం చేస్తున్నారు. నాలుగో పద్ధతిలో అన్యాయం చూస్తే రోస్టర్ పాయింట్ పేరుమీద మెరిట్లో వచి్చన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ అభ్యర్థులను ఇరికించి అన్యాయం చేస్తున్నారు. పాయింట్ టు పాయింట్ ప్రకారం, మెరిట్ మార్కుల ఆధారంగా ఒకటి నుండి సీరియల్గా రిక్రూట్ చేయడం వలన ఓసీ పాయింట్లలో ఓసీని– ఆ తర్వాత వచ్చే బి.సి పాయింట్లలో ఎక్కువ మార్కులు వచి్చన బీసీలను రిజర్వేషన్ పాయింట్లలో ఫిక్స్ చేసి అన్యాయం చేస్తూవచ్చారు. దీనిని 1986–87 లోనే గుర్తించి బి.సి సంక్షేమ సంఘం పోరాటం చేయగా మార్పులు–చేర్పులు చేసి సరిదిద్దారు. ఇప్పటికి ఇంకా కొన్ని రిక్రూట్మెంట్ సంస్థలు రోస్టర్కు వక్ర భాష్యం చెబుతూ, రిజర్వేషన్లకు గండి కొట్టే కుట్రలు మానుకోవడం లేదు. ఖాళీలు భర్తీ చేసేటప్పుడు మెరిట్ లిస్టు మరియు రిజర్వేషన్ కేటగిరీలో లిస్టు వేరువేరుగా తయారు చేసిన తర్వాత రోస్టర్ కం మెరిట్ ప్రకారం అభ్యర్థుల జాబితాను తయారుచేసి నియామక పత్రాలు ఇవ్వాలి. కానీ అలా కాకుండా రిక్రూట్మెంట్ బోర్డుల నుండి వచ్చిన జాబితానే యధాతధంగా అమలుపరిచి తాము జారీ చేసిన ఉత్తర్వులను వారే తుంగలో తొక్కిపెట్టి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రిజర్వేషన్ల అమ లులో అవకతవకలకు పాల్పడుతున్నారు. వ్యాసకర్త: ఆర్. కృష్ణయ్య, అధ్యక్షులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ‘ మొబైల్ : 90000 09164 -
మిగిలింది ‘రిజర్వేషన్లే’
సాక్షి, హైదరాబాద్: మున్సి‘పోల్స్’కు న్యాయపరమైన అవరోధాలు దాదాపుగా తొలగిపోవడంతో త్వరలోనే పుర‘పోరు’కు నగారా మోగనుంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో రిజర్వేషన్ల ఖరారుపై పురపాలకశాఖ దృష్టి సారించింది. రిజర్వేషన్ల జాబితా ఈసీకి అందిన మరుక్షణమే ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే అవకాశముంది. అయితే రిజర్వేషన్ల ఖరారుపై మున్సిపల్శాఖ ఆచితూచి అడుగేస్తోంది. 65 మున్సిపాలిటీలపై స్టే.. ప్రధాన కేసు కొలిక్కి వచ్చినా.. ఓటర్ల జాబితా తయారీ, వార్డుల విభజనలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కొందరు స్థానిక నేతలు హైకోర్టును ఆశ్రయించడంతో సింగిల్ జడ్జి దాదాపు 65 మున్సిపాలిటీల పరిధిలో ఎన్ని కలను నిలుపుదల చేస్తూ స్టే విధించారు. ఈ ఉత్తర్వులు తొలగితేగానీ అడుగు వేసే పరిస్థితి లేదు. మున్సిపల్ అధికారులు మాత్రం హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును అధ్యయనం చేసిన తర్వాతే నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచన సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం ఆ శాఖ ఉన్నతాధికారులు తాజా పరిణామాలను చర్చించారు. రిజర్వేషన్ల కసరత్తును మొదలుపెడితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. ఇది పూర్తి చేయడానికి 2, 3 రోజులు పడుతుందని, ఈలోగా స్టేలున్న మున్సిపాలిటీలపై స్పష్టత వస్తుందని మున్సిపల్ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. స్టేలు ఉన్న మున్సిపాలిటీలపై తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చేలా ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ సింగిల్ బెంచ్లో కౌంటర్ దాఖలు చేయాలనే యోచనలో మున్సిపల్శాఖ ఉన్నట్లు తెలుస్తోంది. రిజర్వేషన్లే తరువాయి..! ఎన్నికల ముందస్తు ప్రక్రియలో కీలకమైన ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా ఓటర్ల ఖరారు, జాబితా తయారీ, వార్డుల విభజన పూర్తైనందున ప్రస్తుతం రిజర్వేషన్ల ఖరారు మాత్రమే మిగిలి ఉంది. మొత్తం స్థానాల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీలకు 50 శాతం స్థానాలను రిజర్వ్ చేయనున్నారు. ఈ కసరత్తు పూర్తి చేశాక పురపాలకశాఖ రిజర్వేషన్ల జాబితాను ప్రకటించనుంది. ఆ తర్వాత జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 141 నగర, పురపాలక సంఘాలకు ప్రస్తుతం రిజర్వేషన్లను ఖరారు చేయనుంది. అయితే వాటిలో జీహెచ్ఎంసీ, గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట మున్సిపాలిటీల పాలకవర్గాల కాలపరిమితి ముగియలేదు. జడ్చర్ల, నకిరేకల్లలో ఇంకా గ్రామాల విలీనం పూర్తి కాలేదు. సాంకేతిక కారణాల వల్ల పాల్వంచ, మందమర్రి, మణుగూరు ఏజెన్సీ మున్సిపాలిటీలకు ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశం కనిపించడంలేదు. సీఎంతో అధికారుల భేటీ హైకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో పురపాలకశాఖ అధికారులు మంగళవారం రాత్రి సీఎం కేసీఆర్తో సమావేశమయ్యారు. హైకోర్టు తీర్పు ప్రతిని సీఎం ముందుంచిన అధికారులు.. తదుపరి కార్యాచరణపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం. సీఎం సూచనల ప్రకారం రిజర్వేషన్ల ఖరారు, పుర‘పోరు’పై అధికారులు తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. -
‘లోకల్ స్టేటస్’ మరో రెండేళ్లు పొడిగింపు
సాక్షి, అమరావతి : రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు వచ్చి విద్య, ఉద్యోగాల్లో స్థానిక(లోకల్) కోటా రిజర్వేషన్లు పొందాలనుకుంటున్న వారికి శుభవార్త. తెలంగాణ నుంచి ఏపీకి వచ్చేవారు స్థానిక హోదా(లోకల్ స్టేటస్) పొందడానికి గడువును కేంద్ర ప్రభుత్వం మరో రెండేళ్లు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు వచ్చేవారికి 2021 జూన్ ఒకటో తేదీ వరకూ స్థానిక హోదా పొందడానికి అవకాశం లభించనుంది. తెలంగాణలో నివాసం ఉంటూ ఆంధ్రప్రదేశ్కు వచ్చేవారికి ఇక్కడ లోకల్ స్టేటస్ పొందడానికి కేంద్ర ప్రభుత్వం మొదట మూడేళ్లు గడువు ఇచ్చింది. ఇందుకోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 370(డి)లోని ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను రాష్ట్రపతి ఆమోదంతో సవరించింది. దీనిప్రకారం రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ రోజైన 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 1 వరకు లోకల్ స్టేటస్ సర్టిఫికెట్లు పొందవచ్చని 2016 జూన్ 16న కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. తదుపరి ఏపీ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు గడువును మరో రెండేళ్లు పొడిగిస్తూ 2017 అక్టోబర్ 30న మరో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం గడువు 2019 జూన్ 1వ తేదీతో ముగిసింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య తొమ్మిది, పదో షెడ్యూళ్లలోని సంస్థల ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల విభజన పూర్తికాకపోవడం వల్ల చాలామంది ఏపీ ఉద్యోగులు ఇప్పటికీ తెలంగాణలోనే ఉండిపోయారు. కొందరు ఉద్యోగులు ఏపీకి వచ్చినప్పటికీ తమ కుటుంబాలను హైదరాబాద్లోనే ఉంచారు. పునర్వ్యవస్థీకరణ చట్టంలో సైతం హైదరాబాద్ను పదేళ్ల వరకూ ఉమ్మడి రాజధానిగా అప్పట్లో కేంద్రం పేర్కొంది. విద్యా సంస్థలు, ఉద్యోగ నియామకాల్లో స్థానిక కోటా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు వచ్చే వారికి రాష్ట్రంలో స్థానిక హోదా పొందడానికి గడువును మరో రెండేళ్లు పొడిగించాలంటూ రాష్ట్ర సర్కారు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం రాష్ట్రపతి అనుమతి తీసుకుని లోకల్ స్టేటస్ పొందడానికి గడువును మరో రెండేళ్లు పొడిగించింది. ఇందుకోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 (డి)లోని 1, 2 క్లాజ్లను సవరిస్తూ ‘ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థల(నియంత్రణ, ప్రవేశాలు) సవరణ చట్టం–2019’ చేసింది. ఇది ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థుల ప్రవేశాలకు స్థానికత హోదా కల్పనకు వర్తిస్తుంది. అలాగే ఉద్యోగాల్లో స్థానిక హోదాను మరో రెండేళ్లు పొడిగించడం కోసం ఇదే తరహాలో రాష్ట్రపతి ఆమోదంతో ‘ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్) అమెండ్మెంట్ ఆర్డర్–2019’ చేసింది. దీంతో తెలంగాణ నుంచి 2021 జూన్ 1వ తేదీలోగా ఆంధ్రప్రదేశ్కు వచ్చినవారు నిబంధనల ప్రకారం స్థానికత సర్టిఫికెట్లు తీసుకోవచ్చు. ఉన్నత విద్యా సంస్థల్లో, ప్రత్యక్ష ఉద్యోగ నియామకాల్లో స్థానిక కోటా కింద రిజర్వేషన్లు పొందవచ్చు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ ఎస్కే షాహి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక హోదా సర్టిఫికెట్ పొందడమెలా? తెలంగాణ నుంచి ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్కు వచ్చి స్థిరపడినవారు, ఇప్పుడు రావాలనుకుంటున్న వారు స్థానిక హోదా పొందాలంటే కొన్ని మార్గదర్శకాలను తప్పనిసరిగా అనుసరించాలి. ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి వచ్చేశాం కదా ఆటోమేటిగ్గా లోకల్ స్టేటస్ వర్తిస్తుందనుకుంటే పొరపాటే. 2021 జూన్ 1వ తేదీలోగా తహసీల్దార్ నుంచి లోకల్ స్టేటస్ సర్టిఫికెట్లు పొందిన వారికి మాత్రమే విద్య, ఉద్యోగాల్లో స్థానిక కోటా రిజర్వేషన్లు వర్తిస్తాయి.ఈ సర్టిఫికెట్ పొందగోరేవారు తెలంగాణలో నివాసం ఉంటూ ఇక్కడికి వచ్చినట్లు ఆధారాలతో దరఖాస్తు (ఫారం–1) సమర్పించాలి. గతంలో తెలంగాణలో నివాసం ఉన్నట్లు ఆధారాలుగా రేషన్ కార్డు, ఆధార్కార్డు, బ్యాంకు పాస్ పుస్తకం లాంటివి జత చేయాలి. దీంతోపాటు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోఫలానా ప్రాంతంలో నివాసం ఉంటున్నామని, అందువల్ల లోకల్ స్టేటస్ సర్టిఫికెట్ ఇవ్వాలంటూ ఫారం–2 సమర్పించాలి. మీ–సేవా ద్వారా దరఖాస్తు చేసుకుంటే వారం రోజుల్లోగా సంబంధిత తహసీల్దార్ డిజిటల్ సంతకంతో కూడిన లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ జారీ చేస్తారు. -
'డిప్యూటీ సీఎం ఇచ్చిన ఘనత జగన్కే దక్కుతుంది'
సాక్షి, విశాఖపట్నం : ఏపీ చరిత్రలో మొదటిసారి ఓ మైనార్టీకి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా వెల్లడించారు. విశాఖలో ఆదివారం జరిగిన మైనారిటీ సదస్సుకు హాజరైన ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ హయాంలో ముస్లింలు అనేక ఇబ్బందులకు గురయ్యారు. కేవలం ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు ముస్లింలు గుర్తుకు వస్తారని ఆరోపించారు. ముస్లింలకు నాలుగుశాతం రిజర్వేషన్ కల్పించి వైఎస్సార్ మైనారిటీ జీవితాల్లో వెలుగులు నింపారని తెలిపారు. వైఎస్సార్ సాధికారత కింద పేద ముస్లింలకు హజ్ యాత్ర కింద ప్రత్యేక నిధులు కేటాయించారు. వక్ఫ్ బోర్డు ఆస్తుల రక్షణకు నిధులు కేటాయింపు జరిగిందని పేర్కొన్నారు. -
జీవో 550పై పిటిషన్లు కొట్టివేత
సాక్షి, అమరావతి: వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించి ప్రతిభావంతులైన రిజర్వుడ్ కేటగిరీ (ఎంఆర్సీ) అభ్యర్థికి కేటాయించిన సీటు ఖాళీ అయితే, ఆ సీటును మరో రిజర్వుడ్ కేటగిరి అభ్యర్థితోనే భర్తీ చేయాలంటూ 2001లో ప్రభుత్వం జారీ చేసిన జీవో 550 అమలు కావడం లేదంటూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. వచ్చే విద్యా సంవత్సరంలో జరిగే ప్రవేశాలు పూర్తి పారదర్శకంగా జరిగేందుకు వీలుగా ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కమిటీలో వైద్య విద్య రంగంలోని ఇద్దరు నిపుణులకు, ఇద్దరు విశ్రాంత ఐఏఎస్ అధికారులకు, ఇద్దరు హైకోర్టు సీనియర్ న్యాయ వాదులకు స్థానం కల్పించాలని సూచిస్తూ న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి, జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్రాయ్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. వైద్య విద్య సీట్ల భర్తీలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) ఇస్తున్న 10 శాతం రిజర్వేషన్లు అమలుకు నోచుకోవడం లేదని,ఈ 10 శాతం రిజర్వేషన్లలో 50 శాతం సీట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయిస్తున్నారని పేర్కొంటూ దాఖలైన వ్యాజ్యాలను కూడా ధర్మాసనం కొట్టేసింది. -
ఇప్పట్లో ఈ సమస్యకు పరిష్కారం ఉందా!
సాక్షి, న్యూఢిల్లీ : ‘సమాజంలో మంచితనం పరిఢవిల్లితే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లేదు’ అని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ఆదివారం ఢిల్లీలో జరిగిన ఓ సభలో మాట్లాడుతూ చెప్పారు. ఆయన మాట్లాడిందీ దళితులు, బీసీలకు కల్పిస్తున్న రిజర్వేషన్లు రద్దు చేయడం గురించి. ‘చట్టాన్ని మార్చకుండానే రిజర్వేషన్లపై కొనసాగుతున్న సామాజిక సంఘర్షణను ఒక్క నిమిషంలో పరిష్కరించవచ్చు. వీటిని వ్యతిరేకిస్తున్నవారు, సమర్థిస్తున్న వారి మధ్య సామరస్య భావన ఏర్పడితే చాలు’ అని ఆయన వ్యాఖ్యానించారు. అది ఇప్పట్లో సాధ్యమా ? అది సాధ్యమయ్యే పని కాదని గత శనివారం తమిళనాడులోని వెల్లూరి జిల్లాలో ఓ దళితుడి అంత్యక్రియల విషయంలో జరిగిన పరాభవమే అందుకు కారణం. వెల్లూరు జిల్లాలోని వనియంబమ్కు 20 కిలోమీటర్ల దూరంలోని నట్రంపల్లి గ్రామంలో 55 ఏళ్ల కుప్పన్ అనే దళితుడు మరణించాడు. ఊరి శ్మశానంలో దళితుల అంత్యక్రియలకు అనుమతి లేదు. దాంతో వారు పాలర్ నది అవతలి ఒడ్డున అంత్యక్రియలు నిర్వహించడం అలవాటు. అవతల ఒడ్డుకు వెళ్లాలంటే ఓ అగ్రవర్ణ కులస్థుడి పొలం బాట గుండా వెళ్లాలి. దళితులకు ఆ స్థలం గుండా కూడా ప్రవేశం లేదు. అందుకని దళితులు ఆగస్టు 17న పాలం నది వంతెనపైకి కుప్పన్ మృతదేహాన్ని తీసుకెళ్లారు. 45 అడుగుల ఎత్తున ఉన్న ఆ వంతెన మధ్య నుంచి తాళ్ల సహాయంతో మృతదేహాన్ని కిందకు దించారు. అక్కడి నుంచి నిర్దేశిత చోటుకు మోసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. అక్కడి దళిత కుటుంబాల్లో ఇంటి పెద్ద కుమారుడిని పూడ్చి పెట్టడం, మిగతా కుటుంబ సభ్యులను తగులబెట్టడం సంప్రదాయమట. అది వేరే విషయం. ఇలా వంతెన మీది నుంచి మృత దేహాన్ని దించడం, అక్కడి నుంచి అంత్యక్రియలకు తీసుకెళ్లడంకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దీంతో వెల్లూరు జిల్లా ప్రభుత్వ యంత్రాంగమంతా ఒక్కసారిగా కదిలిపోయింది. తిరుపత్తూర్ సబ్ కలెక్టర్ ప్రియాంక మరుసటి రోజే హుటాహుటిన నట్రంపల్లి గ్రామాన్ని సందర్శించి ఊరవతల అర ఎకరం పోరంబోకు స్థలాన్ని దళితుల అంత్యక్రియల కోసం కేటాయించారు. సామాజిక న్యాయం చేశామనిపించుకున్నారు. హిందువులందరికి ఒకే శ్మశాన వాటిక ఉండాల్సిన చోట వేరు స్థలం కేటాయించడంతోపాటు అందుకు దారితీసిన పరిణామాలన్నీ సమాజంలోని వివక్షతను, వైషమ్యాలను స్పష్టం చేస్తున్నాయి. కుల వివక్షత పోయే వరకు రిజర్వేషన్లు తప్పవనే విషయం విజ్ఞులందరికి తెల్సిందే. హిందువులంతా ఒక్కటే దళితులందరు తమ వెంటే ఉన్నారని గత ఎన్నికల్లో పాలకపక్ష బీజేపీ ప్రకటించుకుంది. అవును దళితుల మద్దతు లేకపోయినట్లయితే ఆ పార్టీకి లోక్సభలో అన్ని సీట్లు వచ్చి ఉండేవి కావు. అయినా కేంద్ర కేబినెట్లో అగ్రవర్ణాలకే ఎక్కువ సీట్లు లభించాయి. కులాల పేరిట ఎక్కువనో, తక్కువనో మంత్రి పదవులు కట్టబెట్టారు. ప్రభుత్వంలోనే ఇలా రిజర్వేషన్లు కొనసాగితే విద్యా, ఉపాధి అవకాశాల్లో వెనకబడిన వర్గాల వారికి రిజర్వేషన్లు కొనసాగడం తప్పా!? -
రద్దుల పద్దులో రిజర్వేషన్లు !
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రాజ్యాంగం ప్రకారం లభిస్తున్న రిజర్వేషన్లపై దాపరికం లేకుండా చర్చించాల్సి ఉందని ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ తాజాగా ప్రకటించిన నేపథ్యంలో గత ఏడుదశాబ్దాలుగా దేశంలో అమలవుతూ వస్తున్న రిజర్వేషన్లు ప్రమాదంలో పడనున్నాయి. దేశంలో గోరక్షణ చట్టాల పేరుతో దళితుల, ఆదివాసీల, మైనారిటీల ఆహార ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసిన ప్రస్తుత పాలకులు ట్రిపుల్ తలాక్ను రద్దు చేశారు. తాజాగా ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కశ్మీర్ స్వయం ప్రతిపత్తికి మంగళం పాడేశారు. ఇక రామమందిర నిర్మాణం. రిజర్వేషన్ చట్టం రద్దు వీరి కీలక ఎజెండాగా మారాయి. వీలైనంత త్వరలో రిజర్వేషన్ రద్దు బిల్లును కూడా కేంద్రం తీసుకు వచ్చే ప్రమాదం ఉంది. మనం ఇప్పుడు దళిత, ఓబీసీ, ఆదివాసీ, మైనారిటీ, శరణార్థుల హక్కులను రద్దు చేసే యుగంలో ఉంటున్నాం. ఇది మన ప్రజాస్వామ్యం నూతన దశ. ఆరెస్సెస్ రిజర్వేషన్లను వ్యతిరేకించే సంస్థగా ఉంటోంది. ఆ సంస్థ అధినేత మోహన్ భాగవత్కు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చాలా ప్రకటనలు చేసిన రికార్డు కూడా ఉంది. ఆగస్టు 19న ఆయన తాజా ప్రకటనలో రిజర్వేషన్ల సమస్యపై నిర్దిష్ట దిశలో తప్పక చర్చించాల్సిందేనని వక్కాణించారు. ’’ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇస్తున్న రిజర్వేషన్కు సంబంధించి దాపరికం లేకుండా చర్చించాల్సి ఉంద’’ని ఆరెస్సెస్ చీఫ్ చెప్పారు. ఆయన గతంలోనూ ఇలాంటి ప్రకటనలే చేసి ఉన్నారు. ఆరెస్సెస్ దీర్ఘకాలంగా తాను పెట్టుకుంటూ వచ్చిన అజెండాలను ఒక్కటొక్కటిగా మోదీ ప్రభుత్వం ద్వారా అమలు చేయిస్తోంది. పశువులను మేపే శూద్ర రైతుల ఆర్థిక వ్యవస్థను, దళిత, ఆదివాసీ, ముస్లింలు నిర్వహిస్తున్న ఆహార ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసేందుకోసం గోరక్షణ చట్టాలను రూపొందించాల్సిందిగా అది రాష్ట్రాల ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చింది. ట్రిపుల్ తలాక్ చట్టాన్ని తీసుకురావలసిందిగా కూడా ఆరెస్సెస్ నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చింది. ఈ కోవలో తాజాగా ఆర్టికల్ 370కి కూడా మంగళం పాడేసింది. దాని దీర్ఘకాలిక ఎజెండా అమలుకు సంబంధించి మరో రెండు ప్రధాన సమస్యలు పెండింగులో ఉన్నాయి. అవి రామమందిర నిర్మాణంపై తీర్మానం. రిజర్వేషన్ చట్టాల రద్దు. సమీప భవిష్యత్తులోనే ఆరెస్సెస్ వీటి అమలుకు కూడా పావు కదపనుంది. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఓబీసీల ఓట్లను భారీగా రాబట్టుకున్న నరేంద్రమోదీని ఇప్పుడు రిజర్వేషన్ రద్దు చట్టాన్ని అమలు చేయాలని ఆరెస్సెస్ ఒత్తిడికి గురిచేయవచ్చు. ఆ రోజు కూడా ఎంతో దూరంలో లేదు. కాంగ్రెస్ వేదికలపై పనిచేస్తున్న రిజర్వేషన్ వ్యతిరేక మేధావులు రిజర్వేషన్ రద్దు చట్టాన్ని పూర్తిగా బలపరుస్తారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు మనీష్ తివారీ, జనార్ధన్ ద్వివేదీలు రిజర్వేషన్లపై ఏ వైఖరితో ఉన్నారో దేశం మొత్తానికే తెలుసు. చాలామంది లౌకికవాద మేధావులు తమ హృదయంలో రిజర్వేషన్ల వ్యతిరేకులుగా ఉంటున్నారు.మోహన్ భాగవత్ తేలికగా తీసిపారవేయదగిన స్థాయి వ్యక్తి కాదు. బీజేపీ, ఆరెస్సెస్ యంత్రాంగాల్లో ఆయనకు చాలా పట్టుంది. తాను చంద్రగుప్తునికి కౌటిల్యుడి వంటివాడు. ముర అనే శూద్ర/ఓబీసీకి చెందిన మహిళ పుత్రుడే మౌర్యుడు. కులవ్యవస్థను వ్యవస్థీకృతం చేయడానికి అవసరమైన ప్రతి పనినీ, చర్యనూ కౌటిల్యుడు.. చంద్రగుప్త మౌర్యుడితో చేయించాడు. కులవ్యవస్థపై, మన విద్యా సంస్థల్లోని సైన్స్ వ్యతిరేక, మానవ వ్యతిరేక స్వభావంపై చర్చించాలని ఆరెస్సెస్ ఎన్నడూ కోరలేదు. పైగా శూద్రులకు, ఎస్సీలకు, ఆదివాసులకు ఎలాంటి హక్కులను ప్రసాదించని వేదాలు, రామాయణం, మహాభారతంపై చర్చించాలని ఈ సంస్థ కోరింది. ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ హిందూ మతంలో మానవ సమానత్వం గురించి ఎన్నడూ మాట్లాడిన పాపాన పోలేదు. హిందూ మతం నుంచి అంటరానితనాన్ని రద్దు చేయాలని ఒక్క ప్రకటన కూడా ఆయన విడుదల చేయలేదు. హిందూ మతం పరిధిలో శూద్రులకు, ఓబీసీలకు, ఆదివాసీలకు అర్చకత్వ హక్కులను కల్పించడమే ఆయన ఏనాడూ మాట్లాడలేదు. హిందూమతంలో పురుషులతోపాటు మహిళలకు కూడా సమాన హక్కులు ఇవ్వాలని తాను ఎప్పుడూ బహిరంగ ప్రకటన చేయలేదు. పైగా చరిత్రాత్మక పోరాటాల ద్వారా ప్రజలు సాధించుకున్న కొన్ని హక్కులను రద్దు చేయాలని బలంగా వాదించేవారు. కులవ్యవస్థ రద్దుపై మోహన్ భాగవత్ ఎన్నడూ ప్రకటించలేదు. హిందూమతంలోనూ వెలుపలా బ్రాహ్మణాధిపత్యాన్ని రద్దు చేయాలని అయన ఎన్నడూ మాట్లాడి ఉండలేదు. ప్రధానంగా దళితులు, ఓబీసీలే ఉంటున్న వ్యవసాయ కూలీల వేతనాలు పెంచడంపై తానెన్నడూ మాట్లాడింది లేదు. కానీ రిజర్వేషన్లపై తీవ్రంగా చర్చించాల్సి ఉందంటూ ఆయన పదే పదే మాట్లాడుతూ వచ్చారు.ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆరెస్సెస్ చీఫ్ ఏ కీలక ప్రకటన చేసినా ప్రధాని నరేంద్రమోదీ మాత్రం మౌనవ్రతం పాటిస్తుంటారు. ఆయన మౌనం తన గురువు ఆదేశాన్ని పూర్తిగా ఆమోదించడాన్నే సూచిస్తుంది. ఆరెస్సెస్లో పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు సంస్థకు కండబలంగా మాత్రమే ఉంటున్నారు. పెద్దగురువు ఆదేశాలను ఏమాత్రం వ్యతిరేకించకుండా వీరికి పూర్తిగా బ్రెయిన్వాష్ చేస్తుంటారు. జాతి ప్రయోజనాల బట్టే ఆరెస్సెస్ పనిచేస్తుందని వీరికి నూరిపోస్తుంటారు. జాతి ప్రయోజనాలు సమాజంలోని విడి వర్గాల ప్రయోజనాలకు పైనే ఉంటాయి మరి. దళితులు, ఓబీసీలు, ఆదివాసీలు హిందూ సమాజంలో విభాగాలు మాత్రమే. బ్రాహ్మణవాదపు ప్రతిభా మూర్తులే జాతికి ప్రతి బింబం అన్నమాట. దీన్ని ఏ పరిస్థితుల్లోనూ ఇబ్బందిపెట్టరాదు. సంఘ్ పరివార్లోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇచ్చే సైద్ధాంతిక శిక్షణలో కులాలకు, కమ్యూనిటీలకు, మహిళలకు ఇవ్వాల్సిన సమాన హక్కుల కంటే దేశంలోని మైనారిటీ మతస్తులే అసలు శత్రువులని నూరిపోస్తుంటారు.ఏబీసీలకు చెందిన మన ప్రధాన మంత్రి కూడా దీనికి భిన్నంగా ఉండరు. రిజర్వేషన్ బిల్లు రద్దు కనుక పార్లమెంటు ముందుకు వస్తే దాన్ని ఆమోదింపచేసే బాధ్యత మోదీ మీదే ఉంది. పైగా దానికి అనుగుణంగా ఓట్లేయడానికి ప్రతిపక్ష పార్టీలనుంచి బొచ్చెడుమంది సభ్యులు క్రాస్ ఓటు వేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు కూడా. దేశంలో శూద్ర, ఓబీసీ, దళిత నేపథ్యంలోని ప్రాంతీయ రాజకీయ పార్టీలకు మోహన్ భాగవత్ నిర్నిరోధక శక్తిని నిలువరించే సత్తా లేదు. శక్తివంతుడైన ఓబీసీ ప్రధానమంత్రి గత అయిదేళ్ల పాలనలో దేశంలోని మొత్తం కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఐఐఎమ్లు వంటి అత్యున్నత విద్యాసంస్థలను రిజర్వేషన్ సమస్యపై మోహన్ భాగవత్ను అనుసరించే వ్యక్తుల చేతుల్లో పెట్టారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, ఐఐటీ, ఐఐఎమ్ల డైరెక్టర్లలో చాలామంది రిజర్వేషన్లపై ఆరెస్సెస్ అధినేత అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నవారే. చివరకు కమ్యూనిస్టులలో కూడా చాలామంది ఈ సిద్ధాంతాన్నే విశ్వసిస్తున్నారు. కులపరమైన అసమానతలకు సంబంధించిన ప్రశ్న ఎదురైనప్పుడు అనేక పార్టీల రాజకీయ సరిహద్దులు చెరిగిపోతుంటాయి. రిజర్వేషన్ బిల్లు తీరా పార్లమెంటులో ప్రవేశపెట్టిన రోజున మోహన్ భాగవత్ తన నిజమైన మిత్రులను తప్పక కనుగొంటారు. అదేసమయంలో అంబేడ్కర్, ఆయన అనుయాయులు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగెత్తుతుంటారు. ముస్లింలు అంతర్జాతీయ కమ్యూనిటికీ చెందినవారు కాబట్టి ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు అదొక ప్రపంచ సమస్య అయిపోయింది. కానీ రిజర్వేషన్ల రద్దు చట్టం ఉనికిలోకి వచ్చినప్పుడు ఏ అంతర్జాతీయ వేదిక కూడా దానిగురించి చర్చించబోదు. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు.. ముస్లింలలాగా అంతర్జాతీయ శక్తిగా లేరు. రిజర్వేషన్ల పరిధికి అవతల ఉన్న కులాల్లో రిజర్వేషన్ వ్యతిరేక సెంటిమెంట్ బీజేపీ అధికారంలోకి వచ్చాక బాగా పెరుగుతోంది. దళితులు, ఓబీసీలు, ఆదివాసీలకు ఇప్పటివరకు ఇంగ్లిష్ చదివిన మేధో శక్తి దన్ను లేదు. సర్ సయ్యద్ హమద్, అలీగర్ ముస్లిం యూనివర్శిటీ ప్రభావ ఫలితంగా ముస్లింలు ఇంగ్లిష్ చదువుకున్న విద్యావంతుల వర్గంగా మారారు. కానీ అలాంటి సెక్షన్ దళితులకు, ఓబీసీలకు లేదు. రిజర్వేషన్ చట్టం రద్దుకు ఆరెస్సెస్ తప్పకుండా బలమైన పునాదిని సిద్ధం చేస్తుంటుంది. ప్రాచీనకాలపు వర్ణధర్మ వ్యవస్థను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని గోల్వాల్కర్ తన ఒక పుస్తకంలో ప్రతిపాదించారు. మహాత్మాగాంధీ కూడా వర్ణధర్మ పునరుద్ధరణకు అనుకూలంగా వాదించారు కాబట్టి ఆరెస్సెస్ శక్తులు గాంధీ భావాల మద్దతును కూడా తీసుకోవచ్చు. ఆరెస్సెస్, బీజేపీలు రిజర్వేషన్ బిల్లు రద్దుకు పూనుకుంటే, సెక్యులర్ ముసుగులోని రిజర్వేషన్ వ్యతిరేక శక్తులు చాలావరకు వారికి మద్దతు ఇస్తాయి. లౌకికవాదులు కాంగ్రెస్ పాలనలో విద్యా సంస్థలను నిర్వహించినప్పుడు రిజర్వేషన్ల అమలుకు తిరస్కరించిన చరిత్ర కూడా ఉంది. నేడు ఆర్టికల్ 370 రద్దు విషయంలో ఆరెస్సెస్, బీజేపీకి కొత్త మద్దతుదారులు చాలామంది దొరికారు. అలాగే రిజర్వేషన్ల రద్దు విషయంలోనూ ప్రతిపక్ష శిబిరం నుంచి వీరికి మరింత మద్దతు లభించవచ్చు కూడా. ఒక్కమాటలో చెప్పాలంటే మనం ఇప్పుడు దళిత, ఓబీసీ, ఆదివాసీ, మైనారిటీ, శరణార్థుల హక్కులను రద్దు చేసి యుగంలో ఉంటున్నాము. ఇది ప్రజాస్వామ్యం నూతన దశ. ప్రొఫెసర్ కంచ ఐలయ్య వ్యాసకర్త డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ -
కోటాపై మళ్లీ దుమారం
ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ మళ్లీ ‘కోటా’ తుట్టె కదిలించారు. రిజర్వేషన్లపై సమాజంలో సామరస్యపూర్వకమైన చర్చ జరగాలంటూ ప్రతిపాదించారు. దీని పై వెంటనే చానెళ్లలో, సామాజిక మాధ్యమాల్లో దుమారం రేగడంతో ఆరెస్సెస్ వివరణ ఇచ్చింది. సంక్లిష్టమైన అంశాలను సుహృద్భావ వాతావరణంలో చర్చించుకోవాలన్నదే ఆయన ఉద్దేశమని చెప్పింది. వివిధ వర్గాలకు ఇప్పుడిస్తున్న రిజర్వేషన్లను తాము సంపూర్ణంగా సమర్థిస్తున్నామని ప్రకటించింది. నాలుగేళ్లక్రితం కూడా మోహన్ భాగవత్ ఇటువంటి వివాదాన్నే రేపారు. ఎవరికి రిజర్వేషన్లు అవసరమో, ఎంతకాలం అవసరమో తేల్చడానికి ఒక ‘రాజకీయేతర సంఘాన్ని’ ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు. అప్పట్లో బీజేపీ నేతలు ఆయన అభిప్రాయాలతో తమకు ఏకీభావం లేదని ఆదరాబాదరాగా ప్రకటించగా, ఆయన చేసిన వ్యాఖ్యల ఉద్దేశం వేరని ఆరెస్సెస్ వివరించింది. ఇప్పుడు కూడా ఆయన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. రిజర్వేషన్ల విషయంలో దాని అనుకూలురు, వ్యతిరేకులమధ్య చర్చ జరుగుతున్నదని, అది సామరస్యపూర్వకంగా లేదని భాగవత్కు ఎందుకు అనిపించిందో తెలియదు. నిజానికి ఈ అంశంపై గతంతో పోలిస్తే ఇప్పుడు పెద్దగా చర్చలేదు. పోటాపోటీ ఉద్యమాలు, వాగ్యుద్ధాలు జరగటం లేదు. పైపెచ్చు ఒకప్పుడు రిజర్వేషన్లను తీవ్రంగా వ్యతిరేకించిన వర్గాలే ఇప్పుడు తమకూ ఆ మాదిరి సౌకర్యం కల్పించాలని కోరుతున్నాయి. గుజరాత్లో ఒకప్పుడు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమానికి నాయకత్వం వహించిన పటేళ్లు తమకు కూడా విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలంటూ రోడ్డెక్కారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఆధిపత్య కులాలవారు తమకు కొత్తగా రిజర్వేషన్లు కల్పించాలని కోరుతుండటం వర్తమాన పరిస్థితి. అలాగే బీసీ కులాల జాబితాల్లో ఉన్న కొన్ని కులాలు తమను షెడ్యూల్ కులాలుగా గుర్తించాలని డిమాండ్ చేస్తుంటే, కొందరు తమను ఎస్టీలుగా గుర్తించాలని కోరుతున్నారు. రిజర్వేషన్లను వర్గీకరించాలని, ఆ ఫలాలు తమకు కూడా దక్కేందుకు చర్యలు తీసుకోవాలని అట్టడుగు కులాల్లో బాగా దిగువన ఉండిపోయిన కొన్ని కులాలు కోరుతున్నాయి. మొత్తంగా చూస్తే ఇప్పుడు రిజర్వేషన్లు ఆశిస్తున్నవారే ఎక్కువ. అందుకోసం పలు రాష్ట్రాల్లో ఉద్యమాలు సాగుతున్నాయి. ఇలా కొత్తగా వస్తున్న డిమాండ్లను గమనించి కొన్ని రాష్ట్రాలు కోటాకు సుప్రీంకోర్టు విధించిన 50 శాతం పరిమితిని తొలగించాలని కేంద్రాన్ని గతంలో కోరాయి. ఈ ఏడాది మొదట్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం జనరల్ కేటగిరీలోని ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు 10 శాతం కోటా కల్పిస్తూ జీవో విడుదల చేసింది. పర్యవసానంగా రిజర్వేషన్ల శాతం సుప్రీంకోర్టు విధించిన పరిమితిని దాటింది. ఈ విషయంలో దాఖలైన పిటిషన్లు ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణలో ఉన్నాయి. మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో 16శాతం రిజర్వేషన్ కల్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మొన్న జూన్లో బొంబాయి హైకోర్టు ఆమోదిస్తూనే స్వల్పంగా సవరించింది. పర్యవసానంగా అక్కడి కోటా 65శాతానికి చేరింది. మన దేశంలో శతాబ్దాలుగా వేళ్లూనుకున్న కుల వ్యవస్థ వల్ల కొన్ని కులాలవారు సామాజికంగా నిరాదరణకు లోనవుతున్నారని, అటువంటి వర్గాలను ఆదుకోవడానికి, ఉద్ధరించడానికి తగిన చర్యలు అవసరమని బ్రిటిష్ పాలన సమయంలోనే గుర్తించారు. అప్పట్లోనే కొన్ని అట్టడుగు కులాలకు రిజర్వేషన్ల సౌకర్యం కల్పించారు. శతాబ్దాల అసమానతలు సృష్టించిన అంతరాలను తగ్గించడానికి ఇది తప్పనిసరనుకున్నారు. స్వాతంత్య్రానంతరం మన రాజ్యాంగ నిర్మాతలు కూడా ఆ విధంగానే భావించారు. కనుకనే షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ తెగలకు రిజర్వేషన్ల సౌకర్యం కల్పించారు. నిజానికి అప్పట్లోనే సామాజికంగా వెనకబడి ఉన్న కులాలకు కూడా ఈ సదుపాయం కల్పించి ఉంటే వేరుగా ఉండేది. కానీ అది జరగడానికి మరికొన్ని దశాబ్దాలు పట్టింది. 1979లో జనతా పార్టీ ప్రభుత్వం కుల వివక్ష కారణంగా వెనకబాటుతనానికి గురవుతున్న కులాలను గుర్తించేందుకు మండల్ కమిషన్ ఏర్పాటు చేసింది. అది చాలా చురుగ్గా పనిచేసి ఆ మరుసటి ఏడాదికల్లా సమగ్రమైన నివేదిక సమర్పించింది. దాదాపు మరో పదేళ్ళకు గానీ మండల్ కమిషన్ నివేదికకు మోక్షం కలగలేదు. 1989లో అప్పటి వీపీ సింగ్ ప్రభుత్వం ఆ నివేదిక దుమ్ము దులిపి ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని తప్పుబడుతూ దేశవ్యాప్తంగా ఉధృతంగా ఆందోళనలు సాగాయి. కొన్ని చోట్ల హింస చెలరేగింది. అలా రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగబద్ధమేనని 2008లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. చిత్రమేమంటే అప్పట్లో ఆందోళన చేసిన కులాలే దాదాపు అన్నిచోట్లా తమకూ కోటా కల్పించాలని కోరుతున్నాయి. ఏతావాతా రిజర్వేషన్ల విషయంలో వ్యక్తులుగా ఎవరికెలాంటి అభిప్రాయాలైనా ఉండొచ్చుగానీ... వాటిని రద్దు చేయాలని కోరే కులాలు, సంస్థలూ, పార్టీలూ ఇప్పుడు దాదాపు లేవు. కనుకనే మోహన్ భాగవత్ వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సామరస్యపూర్వక చర్చ జరగాలనే ముందు సంస్థగా రిజర్వేషన్ల విషయంలో తమ వైఖరేమిటో భాగవత్ చెప్పివుంటే సరిపోయేది. ఆయన అస్పష్టంగా ఏదో ఒకటి అనడం, అనంతరం దానిపై దుమారం రేగడం, ఆ తర్వాత సంస్థ తరఫున ఒక వివరణ రావడం సహజంగానే సంశయాలను రేకెత్తిస్తుంది. విపక్షాల సంగతలా ఉంచి, బీజేపీ మిత్రపక్షం రిపబ్లికన్ పార్టీ అధినేత, కేంద్రమంత్రి రాందాస్ అథవాలే సైతం రిజర్వేషన్లపై చర్చ వృథా అంటున్నారు. రిజర్వేషన్లు అవసరమా, కాదా అనే అంశం చర్చనీయాంశమే కాదంటున్నారు. రిజర్వేషన్ల ఆలోచనకు మూలమైన కుల వివక్ష, అసమానతలు మన దేశంలో పూర్తిగా అంతరించాయా లేదా అన్న అంశంపై చర్చ జరగాలి. అప్పుడు ఈ రిజర్వేషన్లను కొనసాగించాలో లేదో నిర్ణయించుకోవడం పెద్ద కష్టం కాదు. -
రిజర్వేషన్లు పాటించకుంటే యూనివర్సిటీ ముట్టడి: జాజుల
సాక్షి,హైదరాబాద్: మెడికల్ కౌన్సెలింగ్లో రిజర్వేషన్లు పాటించకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు మెడికల్ సీట్లు దక్కకుండా చేశారని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు, వీసీ ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయించకపోతే ఈనెల 17న కాళోజీ యూనివర్సిటీని ముట్టడిస్తామని జాజుల హెచ్చరించారు. 550 జీవోను అమలు చేయకుండా, యూనివర్సిటీ అధికారులకు వక్ర భాష్యం చెబుతూ ఉన్నతాధికారులను, సంబంధిత మంత్రిని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. జరిగిన రెండో కౌన్సెలింగ్ను రద్దు చేసి, మూడో కౌన్సెలింగ్లో రిజర్వేషన్లు పూర్తిగా అమలయ్యేలా చూడాలని మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. -
నామినేటెడ్ పదవుల్లో 50 % రిజర్వేషన్లు
సాక్షి, అమరావతి: బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా.. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా.. ఆ వర్గాలకు ప్రభుత్వంలోని అన్ని నామినేటెడ్ పదవుల్లో, అన్ని నామినేటెడ్ పనుల్లో 50 శాతం చొప్పున రిజర్వేషన్ కల్పిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రెండు బిల్లులను బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మరిన్ని అవకాశాలను కల్పించే రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించేందుకు అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. అన్ని ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 29 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్లను ఒక బిల్లులో ప్రతిపాదించగా, మరో బిల్లులో అన్ని ప్రభుత్వ నామినేటెడ్ పనుల్లో కూడా ఇదే తరహాలో రిజర్వేషన్లు కల్పిస్తూ మరో బిల్లును ప్రవేశపెట్టారు. నామినేటెడ్ పదవుల్లోనూ, పనుల్లోనూ ఆయా వర్గాల మహిళలకే 50 శాతం చొప్పున రిజర్వేషన్ కల్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సామాజిక, రాజకీయ వెనుకబాటుకు ఇక స్వస్తి అన్ని నామినేటెడ్ ప్రభుత్వ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా ఈ వర్గాల్లో సామాజిక, రాజకీయ వెనుకబాటుతనానికి స్వస్తి పలికినట్లు అవుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు బిల్లులో స్పష్టం చేశారు. అన్ని కార్పొరేషన్లు, ఏజెన్సీలు, సంస్థలు, సొసైటీలు, పరిపాలన విభాగాల్లో పనిచేసే కమిటీలన్నింటిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా నామినేట్ చేసే వీటి చైర్పర్సన్ పదవుల్లోనూ ఈ వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు వర్తించనున్నాయి. అలాగే నామినేట్ చేసే డైరెక్టర్లు, సభ్యుల పదవుల్లోనూ 50 శాతం రిజర్వేషన్లను కల్పిస్తారు. ఈ రిజర్వేషన్లు దేవదాయ చట్టం కింద ఏర్పడిన బోర్డులు, ట్రస్టులకు, అలాగే వక్ఫ్ బోర్డు చట్టం కింద ఏర్పడిన పదవులకు వర్తించవని పేర్కొన్నారు. నామినేటెడ్ పోస్టుల్లో ఈ రిజర్వేషన్ల అమలు తీరుతెన్నులను సాధారణ పరిపాలన శాఖ పర్యవేక్షించనుందని తెలిపారు. ఆర్థికంగా బలోపేతం ప్రభుత్వ నామినేటెడ్ పదవులు, పనులు, సర్వీసుల్లోనూ 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకే కేటాయించారు. తద్వారా ఆయా వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేయాలనేది ప్రభుత్వం లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలనే రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే నామినేటెడ్ పనుల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు బిల్లులో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని నామినేటెడ్ సివిల్ పనుల కాంట్రాక్టులు, నామినేటెడ్ సర్వీసు పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లను కల్పించనున్నట్లు పేర్కొంది. నామినేటెడ్ వర్క్ కాంట్రాక్టులు, సర్వీసు కాంట్రాక్టులు, అన్ని ఇంజనీరింగ్ విభాగాల్లోని పనుల్లో రిజర్వేషన్లను వర్తింపచేయనున్నారు. బీసీలకు 29 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్లను కల్పించాలని ప్రతిపాదించారు. ఇందులోనే ఆయా వర్గాలకు చెందిన మహిళలకు 50 శాతం పనులను రిజర్వ్ చేయాలని స్పష్టం చేశారు. నామినేటెడ్ పనుల్లో రిజర్వేషన్లను అమలు చేసేందుకు రాష్ట్ర స్థాయిలో పంచాయతీరాజ్ శాఖ ఈఎన్సీ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తారు. జిల్లా స్థాయిల్లో నామినేటెడ్ పనుల్లో, సర్వీసు కాంట్రాక్టు పనుల్లో రిజర్వేషన్ల అమలు బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. సర్వీసు కాంట్రాక్టుల్లో రిజర్వేషన్ల అమలుకు సాధారణ పరిపాలన శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. -
రిజర్వేషన్లపై ఉత్కంఠ!
సాక్షి, జోగిపేట(సంగారెడ్డి) : జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సందడి నెలకొంది. సాధ్యమైనంత తొందరలోనే పురపాలక సంఘాల ఎన్నికలు పూర్తి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి తగ్గట్టు అధికారులు ఓటర్ల గణనను చేపట్టారు. గత నెల 22న ప్రారంభమైన ఈ ప్రక్రియ ఈ నెల 14న పూర్తి కానుంది. అధికార ఏర్పాట్ల విషయాన్ని అటుంచితే ఇటు మున్సిపల్ చైర్మన్గిరిపై ఆశావహుల్లో ఉత్కంఠ మొదలైంది. ఓటర్ల గణన తర్వాత ఏ మున్సిపాలిటీ రిజర్వేషన్ ఎవరికి కలిసి వస్తుందోనని ఎదురు చూస్తున్నారు. రిజర్వేషన్ కలిసి వస్తే చాలు ఎలాగైనా పదవి దక్కించుకోవాలని ఇప్పటికే యత్నాలు ముమ్మరం చేశారు. ఒకవేళ ‘పుర’ పీఠం మహిళలకు కేటాయిస్తే తమ బంధువులనూ బరిలో దించే ఆలోచనలో ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్కు ముందే చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకుంటున్న వారి సంఖ్య జిల్లాలో పెరిగిపోతోంది. జిల్లాలో సంగారెడ్డి, జోగిపేట, జహీరాబాద్, సదా శివపేట మున్సిపాలిటీలకు తోడు కొత్తగా ఏర్పడిన నారాయణఖేడ్, అమీన్పూర్, తెల్లాపూర్, ఐడీఏ బొల్లారం మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే వార్డుల వారిగా ఓటర్ల వివరాలు తెలుసుకున్న ఆశావహులు కౌన్సిలర్గా పోటీ చేసి ‘పుర’ పీఠంపై దృష్టి సారించారు. తొలి చైర్మన్లు ఎవరో..? జిల్లాలో కొత్తగా ఏర్పడిన అమీన్పూర్, నారాయణఖేడ్, తెల్లాపూర్, ఐడీఏ బొల్లారం మున్సిపాలిటీలకు మొదటిసారిగా జరిగే ఎన్నికల్లో చైర్మన్లుగా ఎవరు ఎన్నికవుతారో వేచి చూడాల్సిందే. ఈ ఎన్నికల్లో తామే కొత్త మున్సిపాలిటీలపై జెండా ఎగురవేస్తామన్న ధీమాను అధికార పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. అయితే రిజర్వేషన్లు ఏవి వస్తాయోనన్న టెన్షన్లో ఉన్నారు. చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్న వారు తమకు అనూకూలంగా రిజర్వేషన్లు వస్తాయా లేదా అన్న ఉత్కంఠతతో ఉన్నారు. కొత్త మున్సిపల్ చట్టంలో చైర్మన్ పదవికి ప్రత్యక్షంగా ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పటి వరకు ప్రత్యక్ష ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం కూడా ఎక్కడా ప్రస్తావన తీసుకురాకపోవడంతో పరోక్ష ఎన్నికలే జరగవచ్చని అంటున్నారు. పాత పాలకవర్గం ఆశలు గత ఎన్నికల్లో కొనసాగిన పాలకవర్గాలు తిరిగి మరోసారి ఎన్నిక కావాలన్న ఆశతో ఉన్నారు. జహీరాబాద్, సంగారెడ్డి, జోగిపేట, సదాశివపేట మున్సిపాలిటీల్లో మహిళలే చైర్పర్సన్లుగా కొనసాగారు. జరగబోయే ఎన్నికల్లో వారి భర్తలు ఆశలు పెంచుకుంటున్నారు. ఏదిఏమైనా అధికార టీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించి జిల్లాలోని 8 మున్సిపాలిటీలను సాధించుకునేలా ముందుకు సాగుతోంది. జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అందరి కంటే ముందే మున్సిపాలిటీలో ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. సుమారుగా రూ.10 కోట్ల విలువ చేసే పనులను చేపట్టేందుకు నిర్ణయించుకొని శంకుస్థాపనలు చేశారు. -
నేతల్లో గుబులు
సాక్షి, నర్సంపేట: మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అధికారులు ఎన్నికల నిర్వహణకు వేగవంతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రజాప్రతినిధుల గుండెల్లో అలజడి మొదలైంది. కౌన్సిలర్లుగా పోటీ చేయాలనుకునే నేతలు ముందస్తుగానే ప్రయత్నాలు చేస్తున్నారు. రిజర్వేషన్ల ప్రకటన అనంతరం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు.ఎలాగైనా పదవి దక్కించుకోవాలని ఆరాటపడుతున్నారు. ఇప్పటికే ఏ వార్డు రిజర్వేషన్ల పరంగా ఏ కేటగిరికీ ఖరారవుతుందోనని అందరిలో చర్చ మొదలైంది. తుది ఓటరు జాబితా ప్రకటించిన వెంటనే అధికారులు ఈ నెల 14 వరకు రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. కాగా రిజర్వేషన్లు అనుకూలిస్తే తాము.. లేకుంటే తమ సతీమణులను రంగంలోకి దింపడానికి నాయకులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. నర్సంపేట, పరకాల, వర్దన్నపేట మున్సిపాలిటీల్లో ఈ మేరకు ఆయా పార్టీల టికెట్ల కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేష్ల అనుగ్రహం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిల అనుమతి కోసం ఆ పార్టీ ఆశావహులు పోటీ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. పోయినసారి నర్సంపేట చైర్మన్ పదవి బీసీ జనరల్కు అవకాశం రాగా వార్డుల వారీగా ఎవరికి రిజర్వేషన్ ప్రకటన వస్తుందోనని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఆయా వార్డుల్లో పోటీ చేసేవారు అధినాయకుల అనుమతి పొందినవారు రిజర్వేషన్ అనుకూలంగా ఉంటుందో లేదోనని టెన్షన్లో ఉన్నారు. ఈ నెల చివరలో రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికలు నిర్వహించాలని ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుండడంతో మునిసిపాలిటీల్లో వార్డుల విభజన, సరిహద్దులు ఖరారు చేయగా కులాలు, వర్గాల వారీగా ఓటర్ల గణన వంటి అంశాలు పూర్తి చేసిన అధికారులు ఓటరు జాబితా ప్రకటనపై దృష్టి సారించారు. అయితే తుది ఓటరు జాబితా ప్రకటించిన వెంటనే రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. జిల్లాలోని మూడు మునిసిపాలిటీల్లో ఏ పీఠం ఎవరికి అనుకూలిస్తే వారు.. లేకుంటే తమ సతీమణులను రంగంలోకి దింపడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మేరకు ఆయా పార్టీల టికెట్ల కోసం ఆయా పార్టీల ఎమ్మెల్యేతో పాటు ముఖ్య నాయకులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రిజర్వేషన్లపై చర్చలు జిల్లాలోని మూడు మునిసిపాలిటీ పీఠాలకు రిజర్వేషన్లు ఏ విధంగా ఉండబోతున్నాయనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. జిల్లాలో పరకాల, నర్సంపేట పాతవి కాగా వర్ధన్నపేటను కొత్తగా ఏర్పాటు చేశారు. మునిసిపల్ చైర్పర్సన్ పదవులకు రిజర్వేషన్లు రాష్ట్ర యూనిట్గా, వార్డు కౌన్సిలర్ పదవుల రిజర్వేషన్లను మునిసిపల్ యూనిట్గా ఖరారు చేయనున్నారు. రాష్ట్రంలోని మునిసిపాలిటీల్లో చైర్పర్సన్ పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50శాతం రిజర్వు చేయబోతున్నారు. మరో 50 శాతం జనరల్ కేటగిరిలో ఉండనున్నాయి. అయితే మొత్తంగా 50 శాతం మహిళలకు కేటాయిస్తారు. రూరల్ జిల్లాలోని మూడు మునిసిపాలిటీల్లో నర్సంపేటలో 24, పరకాలలో 22, వర్ధన్నపేటలో 12 వార్డుల కౌన్సిలర్ స్థానాలు ఉండగా అందులో సగభాగం బీసీ, ఎస్టీ, ఎస్సీలకు రిజర్వు కానున్నాయి. ఏ మునిసిపాలిటీ ఎవరికి రిజర్వేషన్ ఖరారవుతుందోననే ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పటికే రిజర్వేషన్ల ఖరారుకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అవసరమైన చర్యలను అధికార యంత్రాంగం సిద్దం చేస్తున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రధాన రాజకీయ పార్టీల ఆశావహులు తమతమ అంచనాలు, ఊహాగానాలతో తమకే అనుకూలిస్తుందనే గట్టి నమ్మకంతో పోటీకి సిద్ధమవుతున్నారు. రిజర్వేషన్లు 14లోపు ఖరారు.. రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపాలిటీలకు కొత్త పాలకవర్గాలను ఆగస్టు మొదటి వారంలోపు పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే వార్డులను ఖరారు చేసిన అధికారులు తుది జాబితా ప్రకటనను మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టరేట్కు నివేదించారు. వార్డుల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వ ఆర్డినెన్స్ మేరకు విలీన గ్రామాలను పరిగణ లో కి తీసుకుని వార్డుల విభజనను పూర్తి చేశా రు. కొత్త వార్డుల వారీగా ఓటరు జాబితాను సిద్ధం చేస్తున్న అధికారులు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్లను ఖరారు చేసి ఎన్నికల సంఘానికి పంపించనున్నారు. ఓటరు ముసాయిదా జాబితా, తుది ఓటరు జాబితా ఆధారంగా రాష్ట్రం యూనిట్గా చైర్పర్సన్, మునిసిపల్ యూనిట్గా వార్డు కౌన్సిలర్ రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. -
మున్సిపల్ రిజర్వేషన్లపైనే ..అందరి దృష్టి!
సాక్షి, నల్లగొండ: మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం చేపట్టిన వార్డుల పునర్విభజన, సామాజిక వర్గాల వారీగా ఓటర్ల గణనతో పాటు వార్డు ఓటరు జాబితా ముసాయిదా సైతం పూర్తి కావడంతో ఇక అందరి దృష్టి వార్డుల రిజర్వేషన్లపై పడింది. ఏ వార్డు ఏ సామాజిక వర్గానికి రిజర్వు అవుతుందో అన్న ఉత్కంఠతో ఆశావహులు ఎదురు చూస్తున్నారు. తాజా మాజీ కౌన్సిలర్లతోపాటు ఈసారి పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్న వారు సైతం అనుకూల రిజర్వేషన్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో నిలబడి సత్తా చాటాలని భావిస్తున్న ఆశావహులు తాము పోటీ చేద్దామనుకుంటున్న వార్డులు తమకు అనుకూల రిజర్వేషన్ వస్తుందా, లేక ఇతర సామాజిక వర్గాల వారీకి రిజర్వు అవుతుందా అన్న అంచనాల్లో మునిగిపోయారు. నల్లగొండ మున్సిపాలిటీ 40 వార్డుల నుంచి 48 వార్డులకు పెరిగింది. పట్టణంలో 1,24,117 మంది ఓటర్లు ఉన్నారు. వార్డుల వారీగా ఓటర్లను పరిగణనలోకి తీసుకుంటారు. ఆయా సామాజిక వర్గాలకు చెందిన ఓటర్ల సంఖ్య ప్రకారం వార్డు రిజర్వేషన్లు ఖరారు అవుతాయి. 24 వార్డులు జనరల్..! నల్లగొండ మున్సిపాలిటీలో 48 వార్డులు ఉన్నందున 24 వార్డులు జనరల్ కేటగిరీలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఏ సామాజిక వర్గం జనాభా ఎంత ఉన్నా రిజర్వేషన్లు 50 శాతం మించవద్దని ఉన్న సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో 24 వార్డులు మాత్రం వివిధ సామాజిక వర్గాలకు రిజర్వు అవుతాయి. పట్టణంలో తక్కువ సంఖ్యలోనే దాదాపు 1400 వరకు గిరిజన ఓటర్లు ఉన్నందున వారికి ఒక వార్డు రిజర్వు కానుంది. 48 వార్డులలో 24 జనరల్, ఒకటి ఎస్టీలకు రిజర్వు కానుండగా ఇంకా 23 వార్డుల ఉంటాయి. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ 23 వార్డులలో 7 వార్డులు ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మిగిలిన 16 వార్డులు బీసీ సామాజిక వర్గాలకు రిజర్వు అవుతాయని అంచనా వేస్తున్నారు. ఒక వేళ ఎస్సీలకు 1 వార్డు పెరిగి 8 అయితే బీసీలకు 1 వార్డు తగ్గి 15 వార్డులు రిజర్వు అయ్యే అవకాశం ఉంది. ఎస్సీ, బీసీలకు కేటాయించే వార్డుల్లో ఒకటి అటు, ఇటు అయినా.. దాదాపు ఈ సంఖ్య ప్రకారమే వార్డుల రిజర్వేషన్ పూర్తయ్యే పరిస్థితి కనిపిస్తోంది. భారీగా పెరిగిన బీసీ ఓటర్లు 2014 మున్సిపల్ ఎన్నికలతో పోలిస్తే.. ఈ సారి పట్టణంలో బీసీ ఓటర్ల సంఖ్య ఎక్కువగా పెరిగింది. ముస్లిం ఓటర్లను ఎక్కువ సంఖ్యలో బీసీ సామాజిక వర్గంలో కలపడంతోనే బీసీ ఓటర్లు ఎక్కువగా పెరిగాయని అంటున్నారు. దీంతో పట్టణంలో ఓసీ ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇటీవల పెరిగిన ఓటర్ల ప్రకారం ప్రస్తుతం మున్సిపాలిటీలో సుమారుగా ఓసీ ఓటర్లు 27 వేలు, బీసీ ఓటర్లు 77,350, ఎస్సీ ఓటర్లు 18,750, ఎస్టీ ఓటర్లు 1450 మంది ఉన్నట్లు సమాచారం. -
బీసీ జాబితా ధర్మసత్రం కాదు: జాజుల
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం బీసీ కమిషన్ను అడ్డు పెట్టుకుని రోజుకొక కులాన్ని బీసీల్లో కలుపుతూ బీసీ జాబితాను ధర్మసత్రంగా మారుస్తుందని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతమున్న బీసీ రిజర్వేషన్లను తగ్గించిన ప్రభుత్వం బీసీ జాబితాలో కొత్త కులాలను కలపడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దోమలగూడ బీసీ భవన్లో ఆదివారం జరిగిన బీసీ సంఘాల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర బీసీ కమిషన్ ఏర్పాటు జరిగి రెండేళ్లు అవుతున్నా బీసీల ప్రయోజనాల కోసం పని చేయకపోగా తాజాగా 30 కులాలను బీసీ జాబితాలో కలుపుతామనడం బీసీల ప్రయోజనాలను దెబ్బ తీయడమేనని విమర్శించారు. బీసీ కమిషన్ ఇప్పటి వరకు బీసీ గణన నిర్వహించలేదని, బీసీలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, సామాజిక బహిష్కరణల వంటి చర్యలపై ఏనాడు స్పందించలేదన్నారు. ఎస్సీ లేదా ఎస్టీ జాబితాలో కలపాలి బీసీ కమిషన్ బీసీ జాబితాలో కలపాలనుకుంటున్న 30 కులాలు అత్యంత పేదరికం, వివక్ష, అంటరానితనానికి గురైన మాట వాస్తవమని ఇలాంటి కులాలను ఎస్సీ, లేదా ఎస్టీ జాబితాలో కలిపితేనే వారికి న్యాయం జరుగుతుందన్నారు. రిజర్వేషన్లు పెంచకుండా రోజుకొక కులాల్ని కలిపితే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ నాయకులు కుల్కచర్ల శ్రీనివాసు, నరాల సుధాకర్, శ్రీనివాస్రావు తదితరులు పాల్గొన్నారు. -
మున్సి‘పోల్స్’కు ముందడుగు
సాక్షి, హైదరాబాద్ : మున్సి‘పోల్స్’కు ముందడుగు పడింది. ఎన్నికల క్రతువులో కీలక ఘట్టానికి తెరలేచింది. రిజర్వేషన్ల ఖరారుకు ప్రాతిపదికగా భావించే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియను ప్రభుత్వం చేపడుతోంది. ప్రస్తుత పురపాలికల పదవీకాలం వచ్చే నెల 2వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో పురపాలక సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని కృతనిశ్చయంతో ఉన్న సర్కారు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపునకు ఇంటింటి సర్వే మొదలుపెట్టింది. వాస్తవానికి గత ఫిబ్రవరిలోనే ఈ సామాజికవర్గాల ఓటర్లను పురపాలక శాఖ గుర్తించింది. తాజాగా గుర్తించిన ఓటర్లను పరిశీలించి జాబితా సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. శనివారం ప్రారంభమైన డోర్ టు డోర్ సర్వే వచ్చే నెల నాలుగో తేదీ వరకు కొనసాగనుంది. ఆ తర్వాత ఐదో తేదీన జాబితాను పరిశీలించి ఆరో తేదీన ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రదర్శించనున్నారు. మున్సిపాలిటీ/నగర పాలక సంస్థ, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రదర్శించడమే కాకుండా.. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ప్రతిని అందజేయనున్నారు. 5 రోజులు అభ్యంతరాల స్వీకరణ.. ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను జూలై 7 నుంచి 11వ తేదీ వరకు స్వీకరించనున్నారు. ఈ అభ్యంతరాలు/క్లెయిమ్స్ను 12 నుంచి 14వ తేదీలలో పరిశీలించి 15, 16వ తేదీలలో క్షేత్రస్థాయిలో విచారించి పరిష్కరించనున్నారు. ఆ తర్వాత ఓటర్ల జాబితాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్లను గుర్తించేలా మార్కింగ్ చేసి జూలై 19వ తేదీన మున్సిపాలిటీల్లో ఓటర్ల తుది జాబితాను ప్రకటించనున్నారు. ఓటర్ల జాబితా అందుబాటులోకి రాగానే వార్డులు, మేయర్/చైర్పర్సన్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. జూలైలోనే ఎన్నికలు..? కొత్త పురపాలక చట్టం తీసుకొచ్చిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ యాక్ట్ డ్రాఫ్ట్ కాపీని న్యాయశాఖకు పంపించింది. అయితే చట్టం తీసుకురావడంలో జాప్యం జరుగుతుండటంతో నిర్ణీత గడువులోగా ఎన్నికలు నిర్వహించలేమని ఇటీవల పురపాలకశాఖ హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్లో స్పష్టం చేసింది. పాలకవర్గాల కాలపరిమితి ముగుస్తున్నా ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదని రాష్ట్ర ఎన్నికల సంఘం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేసినందున సకాలంలో ఎన్నికలు నిర్వహించలేమని, వార్డుల విభజన, ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల ఖరారుకు 151 రోజుల సమయం పడుతుందని, అందువల్ల ఎన్నికలకు వ్యవధి కావాలని ప్రభుత్వం కోరింది. అయితే అదేరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ జూలైలో పురపోరు జరుగుతుందని, ఈ మేరకు రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను చేపట్టాలని పురపాలకశాఖ కార్యదర్శిని ఆదేశించినట్లు ప్రకటించారు. దీంతో ఎన్నికల నిర్వహణపై కొంత సందిగ్ధత కనిపించింది. ఒకవైపు దాదాపు ఐదు నెలలు కావాలని కోర్టులో కౌంటర్ దాఖలు చేస్తునే మరోవైపు ఎన్నికలకు సీఎం గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో ఒకింత ఆయోమయం నెలకొంది. అయితే తాజాగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపునకు చకచకా షెడ్యూల్ ప్రకటించడం, ఇది వచ్చే నెల మూడో వారంలోగా ముగియనుండటంతో సీఎం మదిలో ఉన్నట్లు జూలై చివర్లో లేదా ఆగస్టు మొదటి వారంలో పురపోరుకు నగారా మోగే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు ముందస్తు కసరత్తుకు ఐదు నెలల టైమ్లైన్ అవసరమని భావించినా ఓటర్ల గుర్తింపు, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం, వార్డుల విభజనను ఏకాకాలంలో పూర్తి చేసుకోవడం ద్వారా కొన్నింటి సమయం తగ్గించవచ్చని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. అదే సమయంలో రాజ్యాంగబద్ధంగా కొన్నింటికి మాత్రం గడువు కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేస్తున్నాయి. అయితే వార్డుల విభజన ప్రక్రియను అంతర్గతంగా పూర్తి చేయడంతో ఓటర్ల గణనను సర్కారు యుద్ధప్రాతిపదికన చేస్తోంది. ఆర్డినెన్స్ ద్వారా చట్టం తీసుకురావడమే తరువాయి రిజర్వేషన్లను ఖరారు చేయనుంది. జూలై 2న ముగియనున్న గడువు... ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం జూలై 2వ తేదీతో ముగియనుంది. జీహెచ్ఎంసీ, గ్రేటర్ వరంగల్, సిద్దిపేట, ఖమ్మం, అచ్చంపేట మినహా మిగతా 53 మున్సిపాలిటీలు, మూడు నగర పాలక సంస్థల కాలపరిమితికి ఆ రోజు తెరపడనుంది. అయితే వేగంగా జరుగుతున్న పట్టణీకరణతో 68 కొత్త పురపాలికలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తాజాగా వాటికి కూడా పాలకవర్గాలను ఎన్నుకోవాల్సివుంది. అయితే జడ్చర్ల గ్రామ పంచాయతీని బాదేపల్లి మున్సిపాలిటీలో విలీనం చేయడం, నకిరేకల్కు వచ్చే ఏడాది చివరి వరకు కాలపరిమితి ఉండటంతో వాటికి మినహా మిగతా వాటికి ఎన్నికలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, అచ్చంపేట మున్సిపాలిటీలకు మాత్రం మరో రెండేళ్ల హయాం మిగిలి ఉంది. -
10 శాతం రిజర్వేషన్లపై అయోమయం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఆర్థికంగా వెనకబడిన అగ్రవర్ణాల పిల్లలకు విద్యా, ఉద్యోగావకాశాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం గత లోక్సభ ఎన్నికలకు రెండు నెలల ముందు, జనవరి నెలలో రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొచ్చిన విషయం తెల్సిందే. ఎస్సీ,ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను కోత పెట్టకుండా, అగ్రవర్ణాల విద్యార్థులకు విద్యా సంస్థల్లో అడ్మిషన్లు ఇవ్వాలంటే ప్రస్తుతం ఉన్న సీట్లకన్నా 25 శాతం సీట్లను పెంచాలని, ఆ మేరకు తరగతి గదులను, సిబ్బందిని పెంచాలని పలు విద్యా సంస్థలు ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపించాయి. ఆ దిశగా ఇంతవరకు ఏ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో విద్యా సంస్థల అధ్యాపకులు, ఈ కేటగిరీ కింద అడ్మిషన్లు కోరుతున్న విద్యార్థినీ విద్యార్థులు గందరగోళంలో పడుతున్నారు. గుంజాన్ మఖిజాని అనే 18 ఏళ్ల యువతి జర్నలిజం కోర్సులో చేరేందుకు ఢిల్లీ యూనివర్శిటీలోని హెల్ప్ డెస్క్ను ఆశ్రయించారు. తాను ఏడాదికి ఎనిమిది లక్షల రూపాయల ఆదాయం కలిగి ఆర్థికంగా వెనకబడిన వర్గం కింద పది శాతం రిజర్వేషన్ల పరిధిలోకి వస్తానని చెప్పారు. అయితే సబ్–డివిజనల్ మేజిస్ట్రేట్ నుంచి ఆదాయం సర్టిఫికెట్ తీసుకరావాలని యూనివర్శిటీ వారు సూచించారు. దాంతో ఆమె అయోమయంలో పడ్డారు. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ నుంచి ఆదాయం సర్టిఫికెట్ తీసుకరావడం ఆమెకెకాదు చాలా మంది విద్యార్థులకు కష్టం. ఇదే విషయమై సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ను ప్రశ్నించగా, ఆదాయ పత్రాలను జారీ చేయాల్సిందిగా తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లే వని అన్నారు. పది శాతం రిజర్వేషన్లను ఎలా అమలు చేయాలో తమకు మార్గదర్శకాలేవీ లేవని రాజస్థాన్లో ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఆదాయ, ఆస్తుల సర్టిఫికెట్లను చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఉత్తరప్రదేశ్లో విద్యార్థులు వాపోతున్నారు. -
కులాల వారీగా ఓటర్ల గణన పూర్తి
సాక్షి, కర్నూలు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికలు నిర్వహించేందుకు సమాయత్తం అవుతోంది. అందులో భాగంగానే కర్నూలు నగరపాలక సంస్థలో ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ నెల 5న ఎన్నికల్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఆ ప్రకారం అదే నెల 30వ తేదీ లోపు నగరంలోని అన్ని వార్డుల్లో ఫొటో ఓటర్ల గుర్తింపు కార్యక్రమం చేపట్టారు. వివిధ కారణాలతో మే 10వ తేదీ వరకు గడువు పెంచారు. మే 10 నుంచి కులాలవారీగా ఓటర్లను గుర్తించే కార్యక్రమం చేపట్టారు. పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, సిబ్బంది నగరంలోని 51 వార్డుల్లో తిరిగి కులాల వారీగా ఓటర్లను గుర్తించారు. ఇదే జాబితాను కర్నూలు నగరపాలక సంస్థ కార్యాలయంతో పాటు కలెక్టరేట్, రెవెన్యూ డివిజనల్ కార్యాలయం, కర్నూలు, కల్లూరు తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రదర్శనకు ఉంచారు. కర్నూలు ఓటర్లు 4.9 లక్షలు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్కు 2005లో ఎన్నికలు నిర్వహించారు. అప్పటి పాలకవర్గం 2010 సెప్టెంబర్ 30 వరకు పనిచేసింది. అప్పట్లో నగరపాలక పరిధిలో ఓటర్ల సంఖ్య 3.42 లక్షలు. అప్పటి నుండి 9 ఏళ్లుగా కర్నూలు నగరపాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించలేదు. ఇదే క్రమంలో 2012 సంవత్సరంలో నగరపాలక సంస్థలో స్టాంటన్పురం, మామిదాలపాడు, మునగాల పాడు గ్రామాలు విలీనం అయ్యాయి. దీంతో త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేయడంతో మరోసారి నగరపాలకలో ఎన్నికల ప్రక్రియ వేగవంతం అయ్యింది. ప్రస్తుతం నగరపాలక సంస్థ పరిధిలో 4.9 లక్షల ఓటర్లు ఉన్నట్లు గుర్తించారు. 9 ఏళ్లలో నగరపాలక సంస్థలో 70 వేల ఓటర్లు నమోదు చేసుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. కులాల వారీగా ఓటర్లను గుర్తించే కార్యక్రమం పూర్తి కావడంతో పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, రిజర్వేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. మొత్తం 51 వార్డులు నగరపాలక సంస్థలో 51 వార్డులు ఉన్నాయి. మొత్తం 4,09,591 ఓటర్లు ఉన్నారు. పురుషులు 2,01,368, మహిళలు 2,08,147 మంది ఉన్నారు. మిగతా వారు 76 మంది ఉన్నారు. బీసీ వర్గానికి సంబంధించి 2,34,462 ఓట్లు ఉన్నాయి. ఇందులో పురుషులు 1,14,871, మహిళలు 1,19,544 మంది ఉన్నారు. ఎస్సీ వర్గానికి 59,236 ఓట్లు ఉన్నాయి. ఇందులో పురుషులు 27, 809, మహిళలు 31,421 మంది ఉన్నారు. ఎస్టీ ఓటర్లు 2,864 ఉన్నారు. ఇందులో పురుషులు 1,432, మహిళలు 1,431 ఉన్నారు. ఓసీ సంబంధించి 1,13,029 ఓట్లు ఉన్నాయి. పురుషులు 57, 256, మహిళలు 55, 751 మంది ఉన్నారు. 2010లో 13 మంది ఉండేవారు. వీరి సంఖ్య ప్రస్తుతం 76 చేరింది. వీరిలో బీసీలు 47 మంది, ఎస్సీలు ఆరుగురు, ఎస్టీ ఒకరు, ఓసీ 22 మంది ఉన్నారు. -
సీఎం ఆమోద ముద్ర
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అగ్రవర్ణాల్లోని బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు 10% రిజర్వేషన్లు కల్పించే ఫైలుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలిపినట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. అనంతరం సంబంధిత ఫైలుపై ఉన్నతాధికారుల సంతకం కూడా పూర్తయింది. ఆ ఫైలుపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సంతకం తీసుకొని తక్షణమే ఉత్తర్వులు జారీచేయాలని అధికారులు భావిస్తున్నారు. ఉత్తర్వులు జారీ అయిన వెంటనే ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ వర్గాలు తెలిపాయి. 2019–20 వైద్య విద్యా ఏడాదిలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాష్ట్రాలను ఆదేశించిన సంగతి తెలిసిందే. 10% రిజర్వేషన్ల అమలుకు 25% సీట్ల పెంపు తప్పనిసరి కావడంతో ఆ మేరకు ప్రతిపాదలను పంపాలని కోరింది. దీంతో రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్ (డీఎంఈ) ప్రతిపాదనలు పంపారు. ఆ ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో దాదాపు 312 ఎంబీబీఎస్ అదనపు సీట్లకు ప్రతిపాదనలు పంపారు. ఈ సీట్ల పెంపునకు కూడా ఎంసీఐ తాజాగా సుము ఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆరోగ్య వర్సిటీ ఎదురుచూపు.. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి వారం కిందటే ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయాల్సి ఉంది. ఆ మేరకు సన్నాహాలు జరిగాయి. కానీ వివిధ కారణాలతో అప్పుడు ఉత్తర్వులు జారీకాలేదు. నీట్ ఫలితాలు వచ్చి అఖిల భారత కోటా సీట్లకు కౌన్సెలింగ్ కూడా బుధవారం ప్రారంభమైంది. రాష్ట్ర స్థాయి ర్యాంకులు కూడా విద్యార్థుల చేతికి వచ్చాయి. దీంతో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుపై విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే మెడికల్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీచేయాల్సిన ఆరోగ్య వర్సిటీ ప్రభుత్వ ఉత్తర్వుల కోసమే ఎదురుచూస్తోంది. ఉత్తర్వులు రాకుండా నోటిఫికేషన్ జారీచేస్తే రిజర్వేషన్లు ఈ ఏడాదికి అమలు కాకుండా పోతాయి. వైద్య ఆరోగ్యశాఖలో కొందరు అధికారుల తీరువల్ల ఉత్తర్వుల జారీ కాస్తంత ఆలస్యమైందన్న విమర్శలు వచ్చాయి. ఇప్పుడు సీఎం ఆమోదం తెలపడంతో ఉత్తర్వులు రానున్నాయి. ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీ.. ప్రభుత్వం జారీచేసే ఉత్తర్వులో ప్రధానంగా అమలుతీరుపైనే మార్గదర్శకాలు ఉంటాయని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఈడబ్ల్యూఎస్ ఆదాయ పరిమితి రూ.8 లక్షల లోపు ఉంటుందని, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేలా రెవెన్యూ శాఖకు ఈ మేరకు ఆదేశాలిస్తారని చెబుతున్నారు. ఇప్పటికే రెవెన్యూ శాఖకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. అఖిల భారత సీట్లలో చేరే విద్యార్థుల కోసం ఈడబ్ల్యూఎస్ ఆదాయ ధ్రువీకరణ పత్రాలను రాష్ట్రంలో రెవెన్యూ అధికారులు ఇస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మెడికల్ కాలేజీ సీట్ల భర్తీకి తాజాగా ధ్రువీకరణ పత్రాలు జారీచేయాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వమూ రూ.8 లక్షల లోపు ఆదాయమే నిర్ణయిస్తే, ఇప్పటికే కేంద్ర సీట్ల కోసం తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రాలు చెల్లుబాటు అవుతాయా లేదా అన్నదానిపై సందేహాలు నెలకొన్నాయి. ఇక ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణ పత్రాలను ఎలా ఇవ్వాలి.. ఎవరు ఇవ్వాలి.. అనే అంశాలపైనా మార్గదర్శకాల్లో సర్కారు స్పష్టత ఇచ్చే అవకాశముంది.