'గుజరాతీని.. వాణిజ్యం నా రక్తంలోనే ఉంది' | being a gujarati, business is in my blood, says narendra modi | Sakshi
Sakshi News home page

'గుజరాతీని.. వాణిజ్యం నా రక్తంలోనే ఉంది'

Published Mon, Sep 1 2014 3:01 PM | Last Updated on Tue, Aug 21 2018 2:46 PM

'గుజరాతీని.. వాణిజ్యం నా రక్తంలోనే ఉంది' - Sakshi

'గుజరాతీని.. వాణిజ్యం నా రక్తంలోనే ఉంది'

తన ప్రభుత్వంలోను, తన కార్యాలయంలోను కూడా జపాన్ తరహా సమర్ధతను తీసుకురావడానికి కట్టుబడి ఉన్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. జపాన్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడి వ్యాపారవేత్తలను, ప్రభుత్వాధికారులను, నాయకులను.. అందరినీ ఆకట్టుకునేలా మాట్లాడారు.

* ''నేను గుజరాతీని.. వాణిజ్యం నా రక్తంలోనే ఉంది. వాణిజ్యవేత్తలకు రాయితీలు అవసరం లేదు. వాళ్లకు ఎదగడానికి మంచి వాతావరణం మాత్రమే అవసరం'' అని మోడీ అన్నారు.

* జపాన్ నుంచి వచ్చే ప్రతిపాదనలను పరిశీలించడానికి తన కార్యాలయంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేస్తానని మోడీ చెప్పారు. అలాగే, ఈ బృందంలో జపాన్ ఎంపిక చేసే ఇద్దరు వ్యక్తుల కోసం కార్యాలయం కూడా ఇస్తామన్నారు.

* ''ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలోనే 5.7 వృద్ధిరేటు నమోదైంది. ఇది చాలా పెద్ద ముందడుగు. ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి'' అంటూ తన విజయాన్ని చెప్పకనే చెప్పారు.

* ఇంతకాలం ఉన్న నిరుత్సాహకరమైన వాతావరణం ఇక ముగిసిపోయిందని, జపాన్ పెట్టుబడిదారులు భారత్కు వస్తే, వాళ్లకు చకచకా అనుమతులు లభిస్తాయని పారిశ్రామికవేత్తలకు చెప్పారు.

* చైనా పేరు ఎత్తకుండానే ఆ దేశం మీద తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విదేశీ విధానంలో అభివృద్ధి వాదమే కావాలి తప్ప విస్తరణ వాదం కాదన్నారు. 18వ శతాబ్దం నాటి ఆలోచనల్లో మగ్గిపోయేవాళ్లు ఇతరుల జలాల్లోకి ప్రవేశించి, ఆక్రమణలకు పాల్పడతారని చెప్పారు. జపాన్కు కూడా చైనాతో విరోధం ఉన్నమాట తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement