కార్తీ చిదంబరం అజ్ఞాత నేరస్తుడు: కేంద్రం | CBI Issues Lookout Notice For P Chidambaram's Son Karti | Sakshi
Sakshi News home page

కార్తీ చిదంబరం అజ్ఞాత నేరస్తుడు: కేంద్రం

Published Fri, Aug 4 2017 3:04 PM | Last Updated on Sun, Sep 17 2017 5:10 PM

కార్తీ చిదంబరం అజ్ఞాత నేరస్తుడు: కేంద్రం

కార్తీ చిదంబరం అజ్ఞాత నేరస్తుడు: కేంద్రం

చెన్నై: సీబీఐ గాలిస్తున్న అజ్ఞాత నేరస్థుల జాబితాలో కేంద్ర మాజీమంత్రి పి.చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం పేరును చేరుస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వశాఖ శుక్రవారం ప్రకటించింది. అంతేగాక విదేశీయానంపై నిషేధం, ఆదాయ పన్నుశాఖ, సీబీఐ, ఈడీ కేసుల్లో విచారణకు హాజరుకాని కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ మద్రాసు హైకోర్టులో కార్తీ చిదంబరం పిటిషన్‌ దాఖలు చేశారు. నకిలీ సంస్థలకు పి.చిదంబరం అనుమతులు ఇవ్వగా, ఆ కంపెనీలతో పాటూ వివిధ సంస్థలకు అక్రమంగా భారీ ఎత్తున విదేశీ మారకద్రవ్యం పొందినట్లుగా కార్తీ చిదంబరంపై సీబీఐ అభియోగం మోపింది.

ఈ ఏడాది మేలో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, కార్తీ చిదంబరం ఇళ్లపై డిల్లీకి చెందిన సీబీఐ అధికారులు దాడులు చేసి అనేక డాక్యుమెంట్లు, హార్డ్‌ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో విచారణకు హాజరు కావాల్సిందిగా కార్తీ చిదంబరానికి ఈడీ సమన్లు జారీ చేసింది.  ఈ సమన్లు అందుకున్న కార్తీ విచారణకు హాజరుకాకుండానే విదేశాలకు వెళ్లిపోయారు. కొన్ని నెలలుగా విదేశాల్లోనే గడుపుతున్న కారణంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ భారత్‌ వెతుకుతున్న అజ్ఞాత నేరస్తుడి జాబితాలో కార్తీ చిదంబరాన్ని చేర్చినట్లుగా శుక్రవారం ప్రకటించింది. విదేశీయానంపై నిషేధం విధించడంతోపాటూ లుక్‌-అవుట్‌ సర్క్యులర్‌ను అన్ని విమానాశ్రయాలకు పంపింది. కాగా, వెతుకుతున్న నేరస్థుడిగా తనను ప్రకటించడాన్ని సవాలు చేస్తూ కార్తీ చిదంబరం తరపున ఆయన న్యాయవాదులు మద్రాసు హైకోర్టులో శుక్రవారం పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌పై ఈనెల 7వ తేదీన విచారణ జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement