karti chidambaram
-
Video: పద్మనాభస్వామి ఆలయంలోకి విదేశీ మహిళకు ప్రవేశం నిరాకరణ
తిరువనంతపురం: పవిత్రమైన దేవాలయంలోకి విదేశీ మహిళను వెళ్లకుండా అడ్డుకున్న ఘటన కేరళలోని పద్మానాభస్వామి ఆలయంలో చోటుచేసుకుంది. కేవలం భారతీయులకు మాత్రమే ఆలయంలోకి అనుమతి ఉందంటూ ఆమెను లోపలికి వెళ్లనివ్వలేదు. అయితే తన భర్త భారతీయుడేనని, వారికి నిశ్చితార్థం కూడా జరిగిందని చెప్పినా ఆలయ అధికారులు పట్టించుకోలేదు.. ఈ మేరకు సదరు విదేశీ మహిళకు ఎదురైన అనుభవాన్ని హర్ప్రీత్ అనే మహిళ సోషల్ మీడియాలో పంచుకున్నారు.విదేశాలకు చెందిన మహిళ చక్కగా చీర కట్టుకొని తనకు కాబోయే భర్తతో పద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శించాలనుకుంది. కానీ అక్కడ ఉన్న సిబ్బంది.. ఆలయంలోకి ప్రవేశించేందుకు ఆమెకు అనుమతి ఇవ్వలేదు. తన జాతీయత, మతం కారణంగా ఆలయంలోకి ప్రవేశాన్ని నిరాకరించినట్లు ఆమె వాపోయింది. భారతీయులకు మాత్రమే ఆలయ అనుమతి ఉంటుందని అధికారులు చెప్పినట్లు వీడియోలో పేర్కొంది. తనతో ఎంగేజ్మెంట్ జరిగినట్లు ఇండియన్ అయిన ఆమె ప్రియుడు చెప్పినా.. ఆలయ సిబ్బంది ఆ విదేశీ మహిళకు గుడిలోకి అనుమతి ఇవ్వలేదు.తాను హిందువునే అని ఆ మహిళ వీడియోలో చెప్పుకున్నప్పటికీ అధికారులు సర్టిఫికేట్ చూపించాలంటూ కోరారని తెలిపింది. ప్రతిసారి సర్ఠిఫికేట్ తీసుకెళ్లడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించింది. తాను భారతీయుడిని పెళ్లి చేసుకోబోతున్నానని, భగవద్గీతను చదవుతానని, అయినా సెక్యూర్టీ గార్డులు తనను ఓ నేరస్థురాలిగా చూస్తున్నారని ఆమె తన వీడియోలో ఆరోపించింది. ఆలయ అధికారులు వర్ణవివక్షను ప్రదర్శించినట్లు ఆరోపించింది. కేవలం ఆలయంలో ప్రవేశించేందుకు మాత్రమే చీరను కొన్నట్లు ఆమె చెప్పుకొచ్చింది.Why should anyone be barred from a place worship they want to visit? https://t.co/Y6LrCCJUwV— Karti P Chidambaram (@KartiPC) July 16, 2024 ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది.తాజాగా ఈ వీడియోపై కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం స్పందించారు. ప్రార్ధన స్థలానికి వెళ్లి పూజలు చేయాలనుకున్న వ్యక్తులను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. మరోవైపు అనేకమంది ఈ వీడియోపై రియాక్ట్ అవుతున్నారు. కొంతమంది ఆలయాల్లోకి విదేశీయులను అనుమతించాలని కోరగా.. మరికొందరు సంప్రదాయాలను గౌరవించాలని చెబుతున్నారు. "మతం, జాతీయతతో సంబంధం లేకుండా ఎవరినైనా హిందూ దేవాలయాలలోకి అనుమతించాలి. కేవలం వారి దుస్తులు, శాఖాహారం తినడం, చెప్పులు తీయడం వంటి ఆలయ సంస్కృతిని గౌరవించాలనే షరతులు మాత్రమే ఉండాలి. అని సూచిస్తున్నారు. ఇక దేవాలయాలు అందరూ సందర్శించడానికి టూరిస్టు ప్రదేశాలు కాదని, మీ ఇంట్లోకి ఎవరినైనా అనుమతిస్తారా? ఇవ్వరు కదా!. వారు హిందూ మతాన్ని విశ్వసిస్తున్నట్లు రాతపూర్వకంగా డిక్లరేషన్ ఇస్తే ఆలయంలోకి అనుమతించాలి’ అని కొందరు కామెంట్ చేస్తున్నారు. -
‘రాహుల్ కంటే మోదీ పాపులర్’ వ్యాఖ్యలు.. చిక్కుల్లో కార్తీ చిదంబరం
చెన్ననై: కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు, ఎంపీ కార్తీ చిదంబరానికి కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మద్దతుగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది. పార్టీ క్రమశిక్షణా కమిటీ తరపున మాజీ ఎమ్మెల్యే కేఆర్ రామసామి ఈ నోటీసులు జారీ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై 10 రోజుల్లో సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు. కాగా ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న కార్తీ.. ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురించి ప్రస్తావించారు. రాహుల్ కంటే ప్రధాని మోదీకి ఎక్కువ పాపులారిటీ ఉందని వ్యాఖ్యానించారు. మోదీతో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సరిపోతారా అనే ప్రశ్నకు చిదంబరం స్పందిస్తూ.. బీజేపీ ప్రచార యంత్రాంగానికి ఎవరూ సరిపోరని అన్నారు. ప్రధాని మోదీకి ప్రజాదరణ అధికంగా ఉందని.. ఆయన్ను మరొకరితో పోల్చమని అడిగితే.. తాను వెంటనే ఎవరి పేరు చెప్పలేనని అన్నారు అదే విధంగా కాంగ్రెస్ వ్యతిరేకివస్తున్న ఈవీఎంల మిషన్ల వాడకం గురించి కార్తీ మద్దతుగా మాట్లాడారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లపై అవిశ్వాసం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ ఇటీవల ఎన్నికల కమిషన్కు లేఖ రాసిన విషయం తెలిసిందే. పార్టీ అభిప్రాయానికి వ్యతిరేకంగా ఈవీఎమ్లపై విశ్వాసం వ్యక్తం చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై పార్టీ నేతలు మండిపడుతున్నారు. అయితే పార్లమెంటరీ సభ్యుడికి నోటీసులు జారీ చేసే అధికారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ)కి మాత్రమే ఉందని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. తమిళనాడులో ఆయనను ముఖ్యనేతగా ఎదగనివ్వకుండా చేసేందుకే జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగానే షోకాజ్ నోటీసులు జారీ చేశారని ఆరోపించాయి. చదవండి: జనవరి 22న ఉత్తర ప్రదేశ్లో విద్యాసంస్థలకు సెలవు -
ఈడీ ఎదుటకు కార్తీ చిదంబరం
న్యూఢిల్లీ: 2011లో కొందరు చైనీయులకు వీసాల జారీకి సంబంధించిన మనీలాండరింగ్ ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం శనివారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆయన వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేశారు. ఈడీ అధికారులు ఈ నెల 12, 16వ తేదీల్లో కూడా కార్తీకి సమన్లు పంపారు. అయితే, అవసరమైన పత్రాల సేకరణకు సమయం కావాలంటూ ఆయన విచారణకు హాజరుకాలేదు. పంజాబ్లో ఏర్పాటవుతున్న ఒక విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ పనుల కాంట్రాక్టును చైనా కంపెనీ తీసుకుంది. ఈ కంపెనీ గడువులోగా పనులను పూర్తి చేయలేదు. దీంతో, 263 మంది చైనా సిబ్బందికి దేశంలో ఉండేందుకు అవసరమైన వీసాలను మళ్లీ మంజూరు చేయాల్సిన అవసరం ఏర్పడింది. వీసాల మంజూరు కోసం 2011లో కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంకు రూ.50 లక్షలు ముట్టినట్లు సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ప్రశ్నించేందుకే ఈడీ అధికారులు కార్తీకి నోటీసులు పంపారు. అయితే, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరంను వేధించే చర్యల్లో భాగంగానే తనపై కక్షగట్టారని కార్తీ ఆరోపిస్తున్నారు. ఒక్క చైనీయుడి వీసా మంజూరుకు కూడా తాను ఎన్నడూ సాయపడలేదన్నారు. కార్తీ చిదంబరంపై ఐఎన్ఎక్స్ మీడియా, ఎయిర్సెల్–మ్యాక్సిస్ కేసుల్లో మనీలాండరింగ్ ఆరోపణల కింద ఇప్పటికే ఈడీ దర్యాప్తు చేస్తోంది. -
‘మహువా’ పై వేటు క్రికెట్లో ఆ రూల్ లాంటిదే: కార్తీ చిదంబరం
న్యూఢిల్లీ: పార్లమెంట్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా బహిష్కరణపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.మహిళా ఎంపీపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే ఇదే విషయమై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఆసక్తికరంగా స్పందించారు. మహువాను బహిష్కరించడాన్ని క్రికెట్లో టైమ్ అవుట్ పద్ధతితో పోల్చారు. ‘మహువాపై ఒక ఫిర్యాదు వచ్చింది.దీనిపై లోక్సభ ఎథిక్స్ కమిటీ విచారణ జరిపింది. ఆమెను సభ నుంచి బహిష్కరించాలని కమిటీ నివేదిక ఇచ్చింది. అనంతరం ఆమెను బహిష్కరించారు. ఇదంతా చూస్తుంటే విచారణ ఏదో కంటి తుడుపు చర్యలా కనిపిస్తోంది’ అని కార్తీ వ్యాఖ్యానించారు. ‘రెండువారాల క్రితం వరల్డ్ కప్ జరిగింది.అందులో ఒక మ్యాచ్లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మ్యాథ్యూస్ను బంగ్లాదేశ్ ప్లేయర్ షకీబ్ టైమ్ అవుట్ చేశాడు.ఇది ఆట నిబంధనల్లో భాగమే కావచ్చు. కాని దీనిని క్రికెట్ ఫ్యాన్స్ ఒప్పుకోలేదు. ఆట స్ఫూర్తికి విరుద్ధమని వారంతా అభిప్రాయపడ్డారు. మహువా విషయంలోనూ ఇదే జరిగింది. ఒక ఒంటరి మహిళను అవమానించారు. ఇది ప్రజలు ఒప్పుకోరు. ఆమెను మళ్లీ భారీ మెజారిటీతో లోక్సభకు పంపిస్తారు’అని కార్తీ చెప్పారు. కాగా, పార్లమెంట్లో అదానీ గ్రూపుపై ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందాని నుంచి మహువా నగదు, బహుమతులు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఏకంగా తన పార్లమెంట్ లాగిన్ ఐడీ, పాస్వర్డ్ను హీరానందానికి ఇచ్చారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మహువాపై లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పీకర్ ఆమెపై విచారణకు ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేశారు. విచారణజరిపిన ఎథిక్స్ కమిటీ మహువానున లోక్సభ నుంచి బహిష్కరించాలని నివేదిక ఇచ్చింది.ఈ సిఫారసును లోక్సభ శుక్రవారం వాయిస్ ఓట్తో ఆమోదించడంతో మహువా సభ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఇదీచదవండి..ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం -
చూస్తూ ఉండండి..సనాతన ధర్మమే గెలుస్తుంది : అమిత్ షా
జైపూర్: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. జైపూర్లో 'పరివర్తన యాత్ర' ప్రారంభోత్సవంలో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా తీవ్ర స్థాయిలో స్పందించారు. త్వరలో రాజస్థాన్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దుంగార్పూర్ వేదికగా 'పరివర్తన యాత్ర'ను ప్రారంభించిన కేంద్ర మంత్రి అమిత్ షా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టే అర్ధమవుతుంది ఇండియా కూటమి హిందూత్వాన్ని వ్యతిరేకమని.. ఇది ఒకరకంగా హిందూత్వ వారసత్వంపై దాడి చేయడమేనని.. స్టాలిన్ తనయుడు చేసిన వ్యాఖ్యలు ఇండియా కూటమి ఓటు బ్యాంక్ రాజకీయాలకు, బుజ్జగింపు రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. డీఎంకే నాయకుడి కుమారుడు.. కాంగ్రెస్ నేత కుమారుడు మారణహోమానికి పిలుపునిస్తున్నారని అన్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా గతంలో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలను చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఆనాడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ రాడికల్ హిందూ సంస్థలు లష్కర్-ఏ-తోయిబా వంటి ఉగ్రవాద సంస్థల కంటే ప్రమాదమని అన్నారు. మీ హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే కూడా ఇది హిందూ ఉగ్రవాదమని అన్నారు. కానీ ఈనాడు సనాతన ధర్మం ప్రజల మనుసును గెలుచుకుందని మళ్ళీ మోదీ అధికారంలోకి వస్తే సనాతన పరిపాలన వస్తుందని వారు ఆశాభావంతో ఉన్నారని అన్నారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఏళ్ళు అడ్డుకుందని.. మా హయాంలోనే రామ మందిరం నిర్మాణ పనులు మొదలయ్యాయని జనవరికల్లా మందిర నిర్మాణం పూర్తవుతుందని దాన్ని అడ్డుకోవడం కాంగ్రెస్ వల్ల కాదని అన్నారు. ఇక ఈరోజు ప్రారంభమైన 'పరివర్తన యాత్ర' 19 రోజుల పాటు 2500 కి.మీ కొనసాగుతుందని.. మొత్తం 52 నియోజకవర్గాల్లో 152 చిన్న సభలు.. 54 భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నామని.. అవినీతిలో పీకల్లోతు కూరుకుపోయిన అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని అన్నారు. అమిత్ షా వ్యాఖ్యల నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్ మాట్లాడుతూ ఉదయనిధి వ్యాఖ్యలను సమర్ధించడమే కాదు సనాతన ధర్మం మతం పేరిట ప్రాంతం పేరిట ప్రజలను వేరు చేసే సిద్ధాంతమని అన్నారు. ఉదయనిధి స్టాలిన్ కూడా అమిత్ షా వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ నేను చెప్పిందాంట్లో తప్పేమీ లేదని.. ఒక్క మాట కూడా వెనక్కి తీసుకోబోవడం లేదని స్పష్టం చేశారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించడమంటే మానవత్వాన్ని, సమానత్వాన్ని కాపాడటమేనని అన్నారు. సనాతన ధర్మం వలన అణగారిన వర్గాల తరపునే నేను ఆ మాటలన్నానని తెలిపారు. మాజీ మంత్రి పి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం కూడా ఉదయ నిధి స్టాలిన్ వ్యాఖ్యలను సమర్ధిస్తూ.. కులం దేశానికి శాపమని అన్నారు. చెన్నైలో రైటర్ల సదస్సులో మాట్లాడుతూ స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో పోల్చారు. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించలేమని నిర్మూలించడం ఒక్కటే మార్గమని అన్నారు. ఇది కూడా చదవండి: జమిలీ ఎన్నికలపై స్పందించిన రాహుల్.. ఏమన్నారంటే? -
పది నిమిషాలు సరే.. ప్రాణాలు పోతే బాధ్యత ఎవరిది ?
టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఆకాశమే హద్దుగా విస్తరిస్తోన్న డెలివరీ బిజినెస్పై దృష్టి సారించాలని, అవసరమైన నిబంధనలు రూపొందించాలని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం కోరారు. గిగ్ ఎకానమీలో జోమాటో, స్విగ్రీ, డూన్జో ఇలా ఎన్నో కంపెనీలు వేగంగా డెలివరీ చేసేందుకు పోటీ పడుతున్నాయని, అయితే ఈ క్రమంలో డెలివరీ బాయ్ సెక్యూరిటిని ఎవరూ పట్టించుకోవడం లేదంటూ పార్లమెంటులో ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. జోమాటో, స్విగ్రీ, డూన్జో ఇలా అనేక కంపెనీలు డోర్ డెలివరీ చేస్తున్నాయి. జోమాటో అయితే ఏకంగా పది నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ చేస్తామని చెబుతున్నాయి. ఇలా చేసేప్పుడు ఆ కంపెనీలుకు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నాయి. డెలివరీ బాయ్ పర్సనల్ వెహికల్స్ను కమర్షియల్గా వాడుకుంటున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సిన అవసరం ఉందని కార్తి చిదంబరం అన్నారు. ఇక డెలివరీ బాయ్లను కంపెనీలు తమ ఉద్యోగులుగా పరిగణించడం లేదు. కనీసం వారికి ఇన్సురెన్సు చేయించడం లేదు. కానీ పది నిమిషాల్లె డెలివరీ అందిస్తామని చెబుతున్నాయి. ఈ వేగాన్ని అందుకునే క్రమంలో డెలివరి బాయ్స్ ప్రమాదాలకు గురైతే బాధ్యత ఎవరూ తీసుకోవడం లేదు. ఎంతోమంది డెలివరి బాయ్స్ ఎటువంటి రక్షణ లేకుండా పని చేస్తున్నారు. This is absurd! It’s going to put undue pressure on the delivery personnel, who are not employees & who have no benefits or security, who have no bargaining power with @zomato I have raised this in Parliament & have written to the Govt. Will pursue this further. https://t.co/fH8yflloiY pic.twitter.com/PfQIe2nfR4 — Karti P Chidambaram (@KartiPC) March 21, 2022 టెక్నాలజీ రావడంతో గిగ్ ఎకానమీ ఊపందుకుంది. ఈ స్వింగ్ని ఇలా కొనసాగిస్తూనే డెలివరీ బాయ్స్ రక్షణ విషయంలో, వారి హక్కుల విషయంలో ప్రభుత్వం దృష్టి సారించాలి. డెలివరీ సంస్థలకు కచ్చితమైన నియమ నిబంధనలు జారీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చదవండి: జొమాటో సంచలన నిర్ణయం..! ఇకపై పది నిమిషాల్లోనే డెలివరీ..ముందుగా అక్కడే -
చిదంబరం కోడలి వీడియోతో బీజేపీ ప్రచారం
సాక్షి, చెన్నై: కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం కోడలు, ఎంపీ కార్తీ చిదంబరం సతీమణి శ్రీనిధి భరత నాట్యం బీజేపీ ఎన్నికల ప్రచార అస్త్రంగా మారింది. బీజేపీ ప్రచార ట్విట్లో తన వీడియో కనిపించడంతో శ్రీనిధి తీవ్రంగా ఖండించారు. తమిళనాట ఎన్నికల ప్రచారం వేడెక్కి ఉన్న విషయం తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచారం సాగుతోంది. ఆ దిశగా బీజేపీ విడుదల చేసిన ప్రచార వీడియోలో ఓ మహిళ భరత నాట్యం చేస్తున్నట్టుగా సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. అయితే, ఆ నాట్యం చేస్తున్న మహిళ కాంగ్రెస్ సీనియర్, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం కోడలు శ్రీనిధి కావడంతో వివాదానికి దారి తీసింది. తన వీడియోను ఉపయోగించి బీజేపీ ప్రచారం చేయడాన్ని పరిశీలించిన ఆమె ఇది ఖండించ దగ్గ విషయంగా పేర్కొన్నారు. ఎన్ని ప్రయత్నాలు, కుస్తీలు పట్టినా, కమలంకు తమిళనాట చోటు లేదని, పాదం మోపడం కష్టతరమేని అదే ప్రచార ట్వీట్లో శ్రీనిధి కామెంట్లు పెట్టారు. అయితే, కొన్నేళ్ల క్రితం డీఎంకే అధికారంలో ఉన్న సమయయంలో జరిగిన సెమ్మోళి మహానాడులో చిత్రీకరించిన వీడియోగా ఆ నాట్య ప్రదర్శనను గుర్తించారు. దీనిని పరిశీలించకుండానే బీజేపీ వర్గాలు తమ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకోవడం గమనార్హం. చదవండి: 66 ఏళ్ల ఆంటీ.. నోరు అదుపులో పెట్టుకో! -
ఎంపీ కార్తీ చిదంబరంకు కరోనా పాజిటివ్
సాక్షి, చెన్నై: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పంజా విసురుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా మహమ్మారి సామాన్య ప్రజలతోపాటు సినీ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులను వదలడం లేదు. ఇప్పటికే పలు ఎమ్మెల్యేలు, మంత్రులు కరోనా బారినపడ్డారు. తాజాగా కాంగ్రెస్ మాజీ మంత్రి చిదంబరం కుమారుడు, శివగంగ ఎంపీ కార్తీ చిదంబరం కరోనా బారిన పడినట్లు సోమవారం తెలిపారు. ‘నాకు కరోనా వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. వైరస్కు సంబంధించిన సాధారణ లక్షణాలు ఉన్నాయి. వైద్యుల సూచనల మేరకు హోం క్వారంటైన్లో ఉన్నాను. ఇటీవల నాతో సన్నిహితంగా ఉన్నవారంతా వైద్యులు ఇచ్చే కరోనా సూచనలు పాటించాలని కోరుతున్నా’అని ట్విటర్లో పేర్కొన్నారు. (సీఎం కుమార్తెకు కరోనా.. ఆస్పత్రిలో చేరిక) I have just tested positive for #Covid. My symptoms are mild and as per medical advice I am under home quarantine. I would urge all those who have recently been in contact with me to follow medical protocol. — Karti P Chidambaram (@KartiPC) August 3, 2020 ఇక కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్పకు ఆదివారం కరోనా పాజిటివ్గా నిర్ధారణ కాగా చికిత్స కోసం బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. కర్ణాటక మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నేత ఇవాన్ డిసౌజా, ఆయన భార్యకు శనివారం కరోనా సోకిన విషయం తెలిసిందే. అదే విధంగా కాంగ్రెస్ నేత, మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే పీసీ శర్మ కూడా ఇటీవల కరోనా బారినపడ్డారు. -
శశికళ చేతిలోకే అన్నాడీఎంకే!
సాక్షి, వేలూరు: జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే శశికళ చేతిలోకి అన్నాడీఎంకే పార్టీ వెళ్లడం కాయమని పార్లమెంట్ సభ్యులు కార్తీ చిదంబరం తెలిపారు. ఆయన బెంగళూరు నుంచి చెన్నైకి కారులో వచ్చారు. ఆ సమయంలో ఆంబూరు బస్టాండ్ ప్రాంతంలో తిరుపత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రభు అధ్యక్షతన పార్టీ కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆ సమయంలో కార్తీ చిదంబరం విలేకరులతో మాట్లాడారు. కందశష్టి కవశాన్ని అవమానం పరచడాన్ని మత నమ్మకం ఉన్న వారు ఎవరూ వదిలి పెట్టరన్నారు. మురుగుడి భక్తుడిగా ఉన్న తానే వాటిని అంగీకరించనన్నారు. ఒక మతానికి చెందిన దేవున్ని అవమాన పరిచడం సరికాదు. దేవుళ్లను అవమాన పరిచేందుకు పూనుకోకూడదన్నారు. (సీఎం నివాసంగా వేద నిలయం..) శశికళ జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే అన్నాడీఎంకే పార్టీ పూర్తి అ«ధికారాలను ఆమె చేజిక్కించుకోవడం ఖాయమన్నారు. టీటీవీ దినగరన్ మరోసారి అన్నాడీఎంకే పార్టీలో చేరిపోతారన్నారు. వారి కుటుంబం అదుపులోనే ఉంటుందన్నారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారికి కాంగ్రెస్ ఇదివరకే తెలిపిన విధంగా ఒక్కొక్కరికీ రూ.10 వేలు అందజేసి ఉండాలన్నారు. అయితే రూ. 1000 మాత్రమే అందజేశారని చెప్పారు. బాధితులకు అదనంగా నివారణ సాయం అందజేయాలన్నారు. ప్రస్తుతం లాక్డౌన్ అమలులో ఉన్నందున నిబంధనలుకు విరుద్ధంగా కార్యకర్తలు అధిక సంఖ్యలో చేరడంతో ఆంబూరు పోలీసులు కార్తీ చిదంబరంతో పాటు జిల్లా అధ్యక్షులు ప్రభుతో పాటు 50 మంది కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. (వేదనిలయంలోకి దీపక్) -
కార్తీ ..మీరు ఆ 20కోట్లు విత్డ్రా చేసుకోవచ్చు!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి.చిదంబరం కొడుకు కార్తీ చిదంబరం అత్యున్నత న్యాయస్థానం వద్ద డిపాజిట్ చేసిన రూ.20 కోట్లను విత్డ్రా చేసుకునేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విదేశాలకు వెళ్లడానికి అనుమతి కోసం గతంలో రూ.20 కోట్ల డిపాజిట్ తీసుకొని సుప్రీంకోర్టు అంగీకారం తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ డిపాజిట్ను విత్డ్రా చేసుకోవడానికి సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. గత సంవత్సరం మే, జూన్ నెలల మధ్యలో విదేశాలకు వెళ్లేందుకు సుప్రీంకోర్టును అనుమతి కోరగా.. సుప్రీం ఆదేశాల ప్రకారం ఆ సొమ్మును డిపాజిట్ చేశారు. కాగా.. ఐఎన్ఎక్స్ మీడియా, ఎయిర్ సెల్ మ్యాక్సిస్ మనీల్యాండరింగ్ కేసుల్లో కార్తీ చిదంబరం ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. చదవండి: కార్తీ మరో రూ. 10 కోట్లు కట్టి వెళ్లండి.. -
పీకల్లోతు కష్టాల్లో మాజీ ఆర్థికమంత్రి
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా మనీ ల్యాండరింగ్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి. చిదంబరం పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుపోయారు. ఈ కేసులో తాజాగా చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరం, పీటర్ ముఖర్జీ, ఇంద్రాణీ ముఖర్జీతో కలిపి మొత్తం 13మంది పేర్లను సీబీఐ చార్జీషీటులో చేర్చింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో రూ. 310కోట్లు అక్రమంగా నిధులను మళ్లించడంపై ఆయనపై సీబీఐ అధికారులు చార్జిషీటు నమోదు చేశారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆగస్టు 21న చిదంబరంను అరెస్ట్ చేసి తీహార్ జైలులో జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. అప్పటి నుంచి సీబీఐ, ఈడీ అధికారుల సమక్షంలో కస్టడీలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది కపిల్సిబాల్ బెయిల్ తీసుకురావడానికి విశ్వప్రయత్నాలు చేసిన ఫలించలేదు. కాగా ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కార్తీ చిదంబరంపై చార్జీషీటు నమోదు కావడం ఇదే మొదటిసారి. కార్తీ చిదంబరం సన్నిహితుడు భాస్కర్, కేంద్రమాజీ కార్యదర్శి ఆర్ ప్రసాద్, విదేశీ వ్యవహారాల మాజీ డైరెక్టర్ ప్రబోద్ సక్సేనా, ఆర్థిక వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి అనూప్ పూజారి, అదనపు కార్యదర్శి సిద్దుశ్రీ కుల్హర్, చెస్ నిర్వహణ యాజమాన్యం పేర్లను కూడా సీబీఐ అధికారులు చార్జీషీటులో నమోదు చేశారు. చార్జీషీటు నమోదు కావడంతో కేసు మరింత జఠిలమైనట్లు తెలుస్తోంది. కాగా ఈ కేసు సోమవారం విచారణకు రానుంది. (చదవండి : ఐఎన్ఎక్స్ కేసు : చిదంబరాన్ని అరెస్ట్ చేసిన ఈడీ ) -
మీరు లేకుండా మీ పుట్టిన రోజు అసంపూర్ణం
సాక్షి, న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయి.. ప్రస్తుతం తిహార్ జైలులో గడుపుతున్నారు కేంద్ర మాజీ మంత్రి పీ చిదబంరం. ఈ క్రమంలో జైలులోనే తన 74వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోనున్నారు చిదంబరం. ఈ సందర్భంగా చిందబరం తనయుడు కార్తీ తండ్రి పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాక చిదంబరం జైలు పాలైన నాటి నుంచి జరిగిన సంఘటనల గురించి వివరిస్తూ.. రెండు పేజీల లేఖ రాశారు. దానిలో కశ్మీర్ పునర్వ్యస్థీకరణ, ఆర్థిక మందగమనం, దానిపై ఆర్థిఖ మంత్రి నిర్మల సీతారామన్ వ్యాఖ్యలు, గురుత్వాకర్షణ గురించి పియూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు, అస్సాం ఎన్ఆర్సీ, మోదీ ప్రభుత్వం 100 రోజుల వేడక గురించి ప్రస్తావించారు. అంతేకాక ‘మీరు 76వ ఏట అడుగుపెట్టడం.. మోదీ ప్రభుత్వం వంద రోజుల వేడుక చేసుకోవడం రెండు ఒకేలాంటి అంశాలు కాదు. తన అనాలోచిత నిర్ణయాలతో బీజేపీ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింద’ని కార్తీ ఆరోపించారు. దాంతో పాటు ‘మీరు లేకుండా మీ పుట్టిన రోజు వేడుకలు జరపుకోవడం చాలా లోటుగా ఉంది. మీరు లేకపోవడం మా హృదయాలను కదిలించింది. మీరు తిరిగి వచ్చి మాతో పాటు పుట్టిన రోజు వేడకల్లో పాల్గొంటే బాగుంటుందనిపిస్తుంది. కానీ అలా జరగదని తెలుసు’ అంటూ కార్తీ లేఖలో పేర్కొన్నారు. -
వారి వాంగ్మూలంతో బిగిసిన ఉచ్చు
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా వ్యవస్థాపకులు ఇంద్రాణీ ముఖర్జీ–పీటర్ ఈ మనీలాండరింగ్ కేసులో అప్రూవర్లుగా మారడంతో కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం మెడకు ఉచ్చు బిగుసుకుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐ) కోసం అనుమతులు ఇవ్వాలంటే తన కుమారుడు కార్తీకి వ్యాపారంలో సహకరించాలని 2008లో అప్పటి ఆర్థికమంత్రిగా ఉన్న చిదంబరం కోరినట్లు ఇంద్రాణీ, పీటర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. తన కుమారుడికి సాయం చేస్తే విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్ఐపీబీ) నుంచి అనుమతులు వచ్చేస్తాయని చిదంబరం చెప్పారన్నారు. దీంతో ఓ ఫైవ్ స్టార్ హోటల్లో తాము కార్తీతో సమావేశమయ్యామనీ, ఈ సందర్భంగా తనకు 10 లక్షల డాలర్లు చెల్లిస్తే ఎఫ్ఐడీల కోసం అనుమతులు లభిస్తాయని కార్తీ చెప్పినట్లు ఇంద్రాణి ముఖర్జీ వెల్లడించారు. కార్తీకి చెందిన అడ్వాంటేజ్ స్ట్రాటెజిక్ కంపెనీ ఖాతాలో రూ.10 లక్షలు జమచేసినట్లు పీటర్ ముఖర్జీ వెల్లడించారు. ఈ వ్యవహారాన్ని ‘క్విడ్ ప్రో కో’గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అభివర్ణించింది. అయితే 10 లక్షల డాలర్లలో మిగతా మొత్తాన్ని ఇంద్రాణీ–పీటర్లు కార్తీకి చెల్లించారా? లేదా? అన్న విషయంపై మాత్రం స్పష్టత రాలేదు. ఇంద్రాణీ–పీటర్ ముఖర్జీలు ఎవరో తెలియదు రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే సీబీఐ అధికారులు పి.చిదంబరాన్ని అరెస్ట్ చేశారని ఆయన కుమారుడు కార్తీ చిదంబరం తెలిపారు. చెన్నై నుంచి ఢిల్లీకి చేరుకున్న కార్తీ విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ‘నేనెప్పుడూ పీటర్ ముఖర్జీ, ఇంద్రాణీలను కలుసుకోలేదు. సీబీఐ విచారణలో భాగంగా ఓసారి బైకుల్లా జైలులో కలిశా. అలాగే విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్ఐపీబీ)లో ఎవ్వరితోనూ నేను భేటీకాలేదు. కాంగ్రెస్ పార్టీని కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారు’ అని పేర్కొన్నారు. -
చిదంబరానికి మధ్యంతర ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్సెల్-మ్యాక్సిస్ కేసులో అరెస్ట్ కాకుండా కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబారానికి మంజూరు చేసిన మధ్యంతర ఊరటను ఢిల్లీ కోర్టు గురువారం ఈ నెల 9 వరకూ పొడిగించింది. కేసును విచారిస్తున్న సీబీఐ, ఈడీలు ఎప్పుడు సమన్లు జారీ చేసినా చిదబంరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరం విచారణకు హాజరవుతారని వారి న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు నివేదించారు. చిదంబరం మార్చి 2006లో కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో నిబంధనలకు విరుద్ధంగా ఎయిర్సెల్-మ్యాక్సిస్ ఎఫ్డీఐకి ఆమోద ముద్ర వేశారని దర్యాప్తు సంస్ధలు ఆరోపిస్తున్నాయి. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించాల్సి ఉండగా, చిదంబరం ఆర్థిక మంత్రి హోదాలో విదేశీ సంస్ధకు ఎఫ్ఐపీబీ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సీబీఐ ఆరోపిస్తోంది. రూ 3500 కోట్ల ఎయిర్సెల్-మ్యాక్సిస్ ఒప్పందంతో పాటు రూ 305 కోట్ల ఐఎన్ఎక్స్ మీడియా కేసులోనూ దర్యాప్తు సంస్ధలు చిదంబరం పాత్రపై దర్యాప్తు సాగిస్తున్నాయి. -
వెళ్లి నియోజకవర్గం మీద శ్రద్ధపెట్టండి!
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. విదేశాల్లో పర్యటించడానికి పూచీకత్తుగా గతంలో తాను సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్కు సమర్పించిన రూ. 10 కోట్లను తిరిగి ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. అప్పు తెచ్చి సుప్రీంకోర్టుకు డబ్బు కట్టానని, దానిపై ప్రస్తుతం వడ్డీ చెల్లించాల్సి వస్తోందని, కాబట్టి రూ. 10 కోట్లు తిరిగి ఇవ్వాలని కార్తీ చిదంబరం అభ్యర్థించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ అనిరుద్ధ బోస్ నేతృత్వంలోని ధర్మాసనం ఆయన అభ్యర్థనను తోసిపుచ్చడమే కాకుండా.. వెళ్లి తన నియోజకవర్గంపై దృష్టి సారించాలని కార్తీకి సూచించింది. తమిళనాడులోని శివగంగ నియోజకవర్గం నుంచి 3లక్షలకుపైగా ఓట్ల మెజారిటీతో కార్తీ చిదంబరం గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆయన తండ్రి చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్ఐపీబీ) ద్వారా ఇప్పించిన అనుమతుల్లో పలు అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కార్తీ ఈడీ, సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈడీ, సీబీఐ దర్యాప్తు నేపథ్యంలో సుప్రీంకోర్టు సూచన మేరకు రూ. 10 కోట్లు పూచీకత్తు చెల్లించి.. కార్తీ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి పొందారు. -
కార్తీ మరో రూ. 10 కోట్లు కట్టి వెళ్లండి..
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి.చిదంబరం కొడుకు కార్తీకి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. మే, జూన్ నెలల మధ్యలో ఆయన విదేశాలకు వెళ్లేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. గతంలోవి కాకుండా పూచీకత్తు కింద మరో రూ.10 కోట్లు డిపాజిట్ చేయాలని సీజేఐ జస్టిస్ గొగోయ్, జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ సంజీవ్ ఖన్నాల బెంచ్ కార్తీని ఆదేశించింది. ఐఎన్ఎక్స్ మీడియా, ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసులకు సంబంధించి సీబీఐ, ఈడీ సంస్థలు ప్రస్తుతం కార్తీని విచారిస్తున్నాయి. అయితే టోటస్ టెన్నిస్ లిమిటెడ్ సంస్థ నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్ల కోసం తాను అమెరికా, జర్మనీ, స్పెయిన్ దేశాలకు వెళ్లాల్సి ఉందని కోర్టుకు కార్తీ తెలిపారు. -
మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి భారీ ఊరట
సాక్షి,న్యూఢిల్లీ : ఎయిర్సెల్ మాక్సిస్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర ఆర్థికమంత్రి పీ చిదంబరంకు మరోసారి ఊరట లభించింది. ఈయనతోపాటు కుమారుడు కార్తీ చిదంబరాన్ని కూడా మార్చి 8 వరకు అరెస్ట్ చేయకుండా ఢిల్లీ హైకోర్టు సోమవారం ఆదేశించింది. ఈ కేసులలో ప్రశ్నించడానికి మార్చి 5, 6, 7, 12 తేదీల్లో సీబీఐ కోర్టుముందు హాజరు కావాలని కోరామని ఈడీ కోర్టుకు తెలిపింది. అనంతరం కోసును మార్చి12వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. మరోవైపు ఈ కేసును వాయిదా వేయడాన్ని అక్కడే కోర్టులో ఉన్నచిదంబరం వ్యతిరేకించారు. ఈడీ కావాలనే ఆలస్యం చేస్తోందని ఆరోపించారు. కాగా 2006లో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఎయిర్సెల్-మ్యాక్సిస్ డీల్కు సంబంధించి విదేశీ పెట్టుబడుల ప్రమోషన్ బోర్డు(ఎఫ్ఐపిబి) ఆమోదం విషయంలో కార్తి చిదంబరం అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. -
కార్తీ చిదంబరంపై సుప్రీం సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్సెల్-మ్యాక్సిస్, ఐఎన్ఎక్స్ కేసుల్లో విచారణ నిమిత్తం మార్చి తొలివారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరు కావాలని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర ఆర్ధిక మంత్రి పీ చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరాన్ని సుప్రీం కోర్టు బుధవారం ఆదేశించింది. చట్టంతో చెలగాటమాడరాదని ఆయనను సర్వోన్నత న్యాయస్ధానం హెచ్చరించింది. విదేశాలకు వెళ్లేందుకు అనుమతించే షరతుల్లో భాగంగా రూ పది కోట్లను కోర్టు రిజిస్ట్రీ వద్ద డిపాజిట్ చేయాలని కార్తీని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఫిబ్రవరి 21-28 తేదీల్లో తన ఫ్రాన్స్ పర్యటనకు అనుమతించాలని కోరుతూ కార్తీ గత ఏడాది నవంబర్లో అప్పీల్ చేశారు. ‘మీరు ఎక్కడికి వెళ్లదలుచుకుంటే అక్కడికి వెళ్లవచ్చు..ఏం చేయాలనుకుంటే అది చేయవచ్చు.. అయితే చట్టంతో మాత్రం ఆడుకోవద్దు..విచారణకు సహకరించకుంటే మాత్రం తాము తీవ్ర చర్యలకు వెనుకాడబో’ మని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని బెంచ్ కార్తీపై మండిపడింది. ఎయిర్సెల్-మ్యాక్సిస్, ఐఎన్ఎక్స్ కేసుల్లో కార్తీ చిదంబరం మనీ ల్యాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆయా సంస్ధల్లో విదేశీ పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం కార్తీ చిదంబరం ముడుపులు స్వీకరించారని దర్యాప్తు ఏజెన్సీలు ఆరోపిస్తున్నాయి. -
కార్తీ చిదంబరం ఆస్తుల జప్తు
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో దేశ, విదేశాల్లో ఉన్న రూ.54 కోట్ల విలువైన కార్తీ చిదంబరం ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గురువారం ప్రకటించింది. తమిళనాడులోని ఊటీ, కొడైకెనాల్లలో ఉన్న సాగు భూమి, బంగళా, ఢిల్లీలో కార్తీ, అతని తల్లి నళిని పేరిట ఉన్న రూ.16 కోట్ల ఖరీదైన ఫ్లాట్, బ్రిటన్లోని సోమర్సెట్లో ఉన్న రూ.8.67 కోట్ల కాటేజీ, ఇల్లు, స్పెయిన్లోని బార్సిలోనాలో రూ.14.57 కోట్ల టెన్నిస్ క్లబ్లను మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) ప్రకారం జప్తు చేస్తున్నట్లు తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. చెన్నై బ్యాంకులోని కార్తీకి, అతనికి చెందినదిగా భావిస్తున్న అడ్వాంటేజ్ స్ట్రాటెజిక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్(ఏఎస్సీపీఎల్) పేరుతో ఉన్న రూ.90 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ను కూడా జప్తు చేస్తున్నట్లు తెలిపింది. ’అటాచ్మెంట్ ఉత్తర్వు చట్ట విరుద్ధం..హాస్యాస్పదం, అనాగరికం. వాస్తవాల ఆధారంగా కాకుండా కేవలం పిచ్చి ఊహాగానాలతో తీసుకున్న చర్య. వార్తల్లోకి ఎక్కటమే దీని వెనుక ఉద్దేశం’ అని కార్తీ అన్నారు. -
కార్తీ చిదంబరం ఆస్తులు అటాచ్
సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం, ఆయన సంస్థకు చెందిన భారత్, బ్రిటన్, స్పెయిన్లలో రూ 54 కోట్ల ఆస్తులను ఈడీ గురువారం అటాచ్ చేసింది. ఈ కేసులో దాఖలైన ఎఫ్ఐఆర్కు అనుగుణంగా గత ఏడాది మే 15న కార్తీని చెన్నైలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 2007లో ఐఎన్ఎక్స్ మీడియాకు విదేశాల నుంచి రూ 305 కోట్ల నిధులు సమకూర్చేందుకు ఎఫ్ఐపీబీ గ్రీన్ సిగ్నల్ లభించడంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆయనపై అభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే. ఐఎన్ఎక్స్ మీడియాకు ఎఫ్ఐపీబీ క్లియరెన్స్ లభించేలా చేసినందుకు కార్తీ చిదంబరం రూ పది లక్షల ముడుపులు స్వీకరించారని ఆరోపించిన సీబీఐ ఆ తర్వాత ఆ మొత్తాన్ని 100 మిలియన్ డాలర్లుగా సవరించింది. -
ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసులో మలుపు
-
కార్తీ బెయిల్పై సుప్రీంకు సీబీఐ
సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన బెయిల్ను సవాల్ చేస్తూ సీబీఐ సోమవారం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కేసుకు సంబంధించి కార్తీకి వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను హైకోర్టు సరిగ్గ పరిశీలించలేదని ఆరోపిస్తూ ఇది కేసు విచారణను ప్రభావితం చేస్తుందని సీబీఐ పేర్కొంది. ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్ పెండింగ్లో ఉన్న క్రమంలో కార్తీ చిదంబరం బెయిల్ పిటిషన్ను హైకోర్టు ప్రోత్సహించడం సరైంది కాదని సీబీఐ తన అప్పీల్లో పేర్కొంది. కార్తీకి బెయిల్ మంజూరు చేసే క్రమంలో కోర్టు ఆయనపై ఉన్న అభియోగాల తీరు, ఆధారాలు, సాక్ష్యాలపై ప్రభావం చూపే అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా హైకోర్టు వ్యవహరించిందని సీబీఐ ఆక్షేపించింది. మార్చి 23న ఢిల్లీ హైకోర్టు కార్తీ చిదంబరానికి బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. -
కార్తీ చిదంబరానికి ఎదురు దెబ్బ?
-
కార్తీకి మరో ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి మరో ఎదురుదెబ్బ తగలనుంది. ఎయిర్సెల్-మ్యాక్సిస్ కేసులో ఆయనపై ఈడీ తాజా చార్జిషీట్ను నమోదు చేసేందుకు సంసిద్ధమైంది. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఓపీ సైనీ ఎదుట తాజా అభియోగపత్రాన్ని ఈడీ నమోదు చేస్తుందని భావిస్తున్నారు. ఎయిర్సెల్-మ్యాక్సిస్ డీల్లో కార్తీ చిదంబరం సహా ఇతరుల పాత్రను ఈ చార్జిషీట్లో ఈడీ ప్రముఖంగా ప్రస్తావిస్తుందని సమాచారం. మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టం కింద ఈ కేసులో ఈడీ ఇప్పటికే కార్తీ చిదంబరాన్ని రెండు సార్లు ప్రశ్నించడంతో పాటు ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసింది. మరోవైపు ఎయిర్సెల్-మ్యాక్సిస్ కేసులో విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్ఐపీబీ)2006లో గ్రీన్సిగ్నల్ ఇవ్వడంపై కార్తీని ఈడీ ప్రశ్నించింది. ఎఫ్ఐపీబీ ఆమోదం లభించిన కొద్దిరోజులకే కార్తీకి చెందిన సంస్థగా భావిస్తున్న ఏఎస్సీపీఎల్కు ఎయిర్సెల్ టెలివెంచర్స్ లిమిటెడ్ రూ 26 లక్షలు చెల్లించడంపై ఈడీ సందేహాలు వ్యక్తం చేస్తోంది. కార్తీపై తాజా చార్జిషీట్ ఎప్పుడో దాఖలు కావాల్సి ఉందని, చిదంబరానికి సన్నిహితులైన అధికారులు ఆయనకు సాయపడేందుకు ప్రయత్నించడంతో ఈ ప్రక్రియలో జాప్యం జరిగిందని బీజేపీ రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. ఈడీ, సీబీఐలపై ఎవరి ఒత్తిడి లేకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారని ఆయన పేర్కొన్నారు. -
తీహార్ జైలుకు కార్తీ
సాక్షి,న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్రమంత్రి పి.చిదంబరం కుమారుడు, కార్తీ చిదంబరాన్ని తీహార్ జైలుకు తరలించారు. ఈ నెల 24తేదీవరకు కార్తీని జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని ప్రత్యేక న్యాయస్థానం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. మూడు-రోజుల పోలీసు కస్టడీ గడువు ముగిసిన తర్వాత మరో15 రోజుల కస్టడీ కోరిన సీబీఐ ప్రతిపాదనకు కోర్టు నో చెప్పింది. అంతేకాదు కార్తీ ముందస్తు బెయిల్ పీటిషన్ను తోసిపుచ్చింది. జైలులో ఇంటి భోజనానికి అవకాశం ఇవ్వలేమని కూడా కోర్టు తేల్చి చెప్పింది. మార్చి 15కార్తీ బెయిల్ పీటిషన్ను విచారించనున్నట్టు తెలిపింది. అయితే భద్రతాకారణాల రీత్యా తనకు ప్రత్యేక సెల్ కేటాయించాలని కార్తీ అభ్యర్థించారు. 1995 లో బిస్కట్ బారన్ రాజన్ పిళ్ళై మరణించిన ఉదంతాన్ని గుర్తు చేసిన కార్తీ చిదంబరం తాను అలా కావాలని కోరుకోవడం లేదని పేర్కొన్నారు. తనకు ఏమైనా జరగవచ్చు అనే సందేహాలను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తనకు ప్రత్యేకగది, బాత్ రూం కావాలని కార్తీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతోపాటు ఇంటిలో వండిన ఆహారం, మందులు, కళ్లజోడు లాంటి కావాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. దేశ ఆర్థికమంత్రిగా తన తండ్రి చిదంరబం పనిచేసిన సమయంలో ఉగ్రవాద కేసులను నిర్వహించారని ఆయన వాదించారు. అయితే మందులు, కళ్లజోడుకు అంగీకారం తెలిపిన కోర్టు మిగిలినవాటిని తోసి పుచ్చింది. ఆయన భద్రతకు ఢోకాలేదని చెప్పింది. ఈ సమయంలో మాజీ కేంద్రమంత్రి చిదంబరం కూడా కోర్టులో ఉన్నారు. కాగా యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి కేంద్ర ఆర్థికమంత్రిగా పని చేసిన చిదంబరం అధికారం అడ్డంపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారని, ఐఎన్ఎక్స్ మీడియాకు విదేశీ నిధుల కోసం కుమారుడు కార్తీకి లాభం చేకూరేలా వ్యవహరించారని సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. తాజాగా ఇంద్రాణీ ముఖర్జీ వాంగ్మూలం నేపథ్యంలో ఫిబ్రవరి 28 న చెన్నై విమానాశ్రయంలో కార్తీని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. -
నా పాస్వర్డ్ ఇవ్వలేదు.. ఇచ్చే సమస్యే లేదు
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు తన ఫోన్ పాస్వర్డ్ చెప్పలేదని, చెప్పే సమస్యే లేదని అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్తీ చిదంబరం స్పష్టం చేశారు. ఓ మీడియాతో ఆయన మాట్లాడుతూ కోర్టుల్లో జరుగుతున్న వాదోపవాదాలను తాను ప్రస్తుతం పరిశీలిస్తున్నట్లు చెప్పారు. గత విచారణ సందర్భంగా కార్తీ తన మొబైల్ పాస్వర్డ్ను చెప్పడం లేదని, అందుకు ఆదేశించాలంటూ కోర్టును సీబీఐ కోరిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరం తనయుడు కార్తీ చిదంబరాన్ని ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఫిబ్రవరి 28న చెన్నై ఎయిర్పోర్ట్లో సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా విచారణ ఎదుర్కొంటున్న ఆయన బెయిల్ పిటిషన్ పెట్టుకున్నారు. దీనిపై శుక్రవారం కోర్టుకు రాగా బెయిల్ పిటిషన్ ను మార్చి 15కు వాయిదా వేసిన కోర్టు.. ఆయన కస్టడీని మరో మూడు రోజులు పొడిగించింది. ఆరు రోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ అభ్యర్థించగా.. కోర్టు మాత్రం మూడు రోజులకు అనుమతిచ్చింది. బెయిల్ పిటిషన్పై విచారణకు వచ్చిన నేపథ్యంలోనే ఆయనను మీడియా ప్రతినిధులు మొబైల్ పాస్వర్డ్ పై ప్రశ్నించారు. దానికి బదులిచ్చిన కార్తీ 'సీబీఐకి నా మొబైల్ పాస్వర్డ్ ఇవ్వలేదు. ఎప్పటికీ ఇవ్వను కూడా' అని ఆయన స్పష్టం చేశారు. కార్తీని ఆయన అడిటర్తో సహా విచారణ చేపట్టే అవకాశం ఉందని.. అవసరమైతే నార్కో పరీక్షలు కూడా నిర్వహించే యోచనలో సీబీఐ ఉన్నట్లు సమాచారం. -
కార్తీ చిదంబరానికి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా మనీల్యాండరింగ్ కేసులో సీనియర్ కాంగ్రెస్ నేత పీ చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి ఢిల్లీ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఊరట కల్పించింది. ఈడీ అరెస్ట్ చేయకుండా ఆయనకు ఊరట ఇచ్చింది. మరోవైపు కార్తీ చిదంబరం దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్పై సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి సునీల్ రాణా నేడు విచారించనున్నారు. అవినీతి కేసులో కార్తీని ఢిల్లీ కోర్టులో హాజరుపరిచిన సీబీఐ మరో ఆరు రోజులు కస్టడీని కోరింది. మూడు రోజుల పాటు కార్తీ కస్టడీకి కోర్టు అనుమతించిన గడువు నేటితో ముగిసింది. ఇదే కేసులో ఈడీ అరెస్ట్ చేసిన కార్తీ సీఏ ఎస్ భాస్కరరామన్ జ్యుడిషియల్ కస్టడీని కోర్టు ఈనెల 22 వరకూ పొడిగించింది. కాగా ఫిబ్రవరి 28న చెన్నై ఎయిర్పోర్ట్లో కార్తీ చిదంబరంను సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఐఎన్ఎక్స్ కేసులో సీబీఐ చెబుతున్నట్టు తాను సాక్ష్యాలను ఎన్నడూ ప్రభావితం చేయలేదని, డాక్యుమెంటరీ ఆధారాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించలేదని బెయిల్ పిటిషన్లో కార్తీ పేర్కొన్నారు.రాజకీయంగా తన తండ్రి ప్రతిష్టను దెబ్బతీసేందుకే తనపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తన తండ్రి పీ చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడులకు ఆమోదం లభించేలా వ్యవహరించినందుకు కార్తీ చిదంబరంకు భారీగా ముడుపులు ముట్టాయని దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ ఆరోపిస్తున్నాయి. -
చిదంబర రహస్యం
-
'నాకు జొమాటో, స్విగ్గీ ఫుడ్ కావాలి'
న్యూఢిల్లీ : తనకు జొమాటో, స్విగ్గీ కంపెనీలనుంచి ఆహారం తెప్పించాలని ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కార్తి చిదంబరం...సీబీఐ అధికారులను కోరారు. ఇంటినుంచి వచ్చే ఆహారం తినేందుకు ప్రత్యేక కోర్టు గురువారం నిరాకరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఈ రెండు కంపెనీల్లో ఏదో ఒకదానినుంచి ఆహారం తెప్పించాలని సంబంధిత అధికారులకు విన్నవించారు. కార్తి అరెస్టు సబబే : స్వామి ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కార్తి చిదంబరంను సీబీఐ కస్టడీకి పంపడం సమంజసమేనని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. న్యాయస్థానం సరైన నిర్ణయం తీసుకుందన్నారు. కార్తి తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వి చేసిన వాదనలు నిజాలు కావని, అందువల్లనే కార్తీని సీబీఐ కస్టడీకి కోర్టు ఆదేశించిందని ఈ సందర్భంగా చెప్పారు. లావాదేవీలన్నీ అక్రమేనంటూ కార్తి వద్ద పనిచేస్తున్న చార్టర్డ్ ఎకౌంటెంట్ ఇప్పటికే నిర్ధారించారని, అందువల్ల కార్తితోపాటు ఆయన సీఏ భాస్కర్రామను విచారించేందుకు మార్గం సుగమవుతుందన్నారు. కార్తిని విచారించడంవల్ల ఈ కేసులో చిదంబరం ప్రమేయం నిర్ధారణ అవుతుందని, ఇందువల్ల ఈ కేసును ప్రాసిక్యూషన్కు అప్పగించేందుకు మార్గం సుగమమవుతుందని ఆయన వివరించారు. -
కార్తీ చిదంబరానికి ఎదురుదెబ్బ
-
కార్తీ చిదంబరానికి చుక్కెదురు
సాక్షి, న్యూఢిల్లీ : మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన కేంద్ర మాజీమంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంకు న్యాయస్థానంలో చుక్కెదురు అయింది. ఆయనను అయిదు రోజులపాటు సీబీఐ కస్టడీకి ఢిల్లీ పటియాలా కోర్టు అనుమతి ఇచ్చింది. కాగా కార్తీ చిదంబరాన్ని 14 రోజుల కస్టడీకి అనుమతించాలని సీబీఐ అధికారులు కోరినప్పటికీ ...న్యాయస్థానం మాత్రం మార్చి 6వ తేదీ వరకూ కస్టడీకి అనుమతించింది. ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడులకు తన తండ్రి ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన సమయంలో అనుమతులు ఇప్పించారనే ఆరోపణలను కార్తీ చిదంబరం ఎదుర్కొంటున్నారు. ఇందుకు ప్రతిఫలంగా కార్తీ చిదంబరంకు భారీగా ముడుపులు ముట్టాయని సీబీఐ ఆరోపిస్తోంది. రిమాండ్ సమయంలో రోజుకు రెండు గంటలు న్యాయవాదిని కలుసుకునేందుకు కోర్టు అనుమతించింది. ప్రిస్క్రిప్షన్లోని మెడిసిన్స్ తీసుకోవచ్చని..అయితే ఇంటి నుంచి వచ్చే ఆహారాన్ని అనుమతించబోమని తెలిపింది. అంతకుమందు కోర్టులో ఇరు వర్గాలు తమ వాదనలు వినిపించాయి. నిందితుడిని సహ నిందితుడు, ఇతర నిందితులు, అనుమానితులతో కలిసి విచారించేందుకు సమయం పడుతుందని..తాము సమీకరించిన ఆధారాలపై అతడిని ప్రశ్నించాల్సి ఉందని అంటూ కార్తీని కనీసం 14 రోజుల పాటు విచారించాలని అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు నివేదించారు. కార్తీ తల్లి, సీనియర్ అడ్వకేట్ నళినీ చిదంబరం కోర్టులో కుమారుడి పక్కనే కూర్చున్నారు.మరోవైపు తనపై రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఇదంతా చేస్తున్నారని కార్తీ పేర్కొంటున్నారు. సీబీఐ తనకు కనీసం సమన్లు ఇవ్వకుండా ఇప్పుడు విచారణకు సహకరించడం లేదని ఆరోపించడం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు. సీబీఐ పక్షపాతపూరితంగా వ్యవహరిస్తోందని కార్తీ తరపు న్యాయవాది, కాంగ్రెస్ నేత సింఘ్వీ అన్నారు. ఈ కేసులో కార్తీకి వ్యతిరేకంగా తమ వద్ద పూర్తి ఆధారాలున్నాయని సీబీఐ చెబుతోంది. చిదంబరాన్ని కూడా ఈ కేసులో ప్రశ్నించే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
కార్తీ చిదంబరం అరెస్ట్ కక్ష సాధింపే..?
-
కార్తీని కోర్టు ఎదుట హాజరుపర్చిన సీబీఐ
సాక్షి, న్యూఢిల్లీ : మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ. చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంను సీబీఐ గురువారం ఢిల్లీ కోర్టులో హాజరుపరిచింది. కార్తీని 14 రోజుల కస్టడీకి అనుమతించాలని ప్రత్యేక జడ్జి సునీల్ రాణాను సీబీఐ కోరింది. నిందితుడిని సహ నిందితుడు, ఇతర నిందితులు, అనుమానితులతో కలిసి విచారించేందుకు సమయం పడుతుందని..తాము సమీకరించిన ఆధారాలపై అతడిని ప్రశ్నించాల్సి ఉందని అంటూ కార్తీని కనీసం 14 రోజుల పాటు విచారించాలని అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు నివేదించారు. కార్తీ తల్లి, సీనియర్ అడ్వకేట్ నళినీ చిదంబరం కోర్టులో కుమారుడి పక్కనే కూర్చున్నారు. ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడులకు తన తండ్రి ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన సమయంలో అనుమతులు ఇప్పించారనే ఆరోపణలను కార్తీ చిదంబరం ఎదుర్కొంటున్నారు. ఇందుకు ప్రతిఫలంగా కార్తీ చిదంబరంకు భారీగా ముడుపులు ముట్టాయని సీబీఐ ఆరోపిస్తోంది. మరోవైపు తనపై రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఇదంతా చేస్తున్నారని కార్తీ పేర్కొంటున్నారు. సీబీఐ తనకు కనీసం సమన్లు ఇవ్వకుండా ఇప్పుడు విచారణకు సహకరించడం లేదని ఆరోపించడం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు. సీబీఐ పక్షపాతపూరితంగా వ్యవహరిస్తోందని కార్తీ తరపు న్యాయవాది, కాంగ్రెస్ నేత సింఘ్వీ అన్నారు. -
పటియాల కోర్టులో కార్తీ చిదంబరం
-
కార్తీ అరెస్ట్ వెనుక చిదంబర రహస్యం...!
కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం అరెస్ట్తో జాతీయస్థాయిలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. లండన్ నుంచి చెన్నైకు చేరుకున్న సందర్భంగా విమానాశ్రయంలోనే మనీలాండరింగ్ కేసులో సీబీఐ ఆయనను అదుపులోకి తీసుకుంది. గురువారం (మార్చి 1న) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు కార్తీ హాజరుకావాల్సి ఉండగా ఒకోరోజు ముందే ఈ అరెస్ట్ జరిగింది. గతంలోనే ఈడీతో పాటు సీబీఐ పలుమార్లు కార్తీని విచారించాయి. కార్తీ విదేశీ ప్రయాణాలు చేయకుండా గతంలో ‘లుకౌట్’ నోటీసులు సైతం జారీఅయ్యాయి. గత నవంబర్లో తన కుమార్తెను కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చేర్పించేందుకు కార్తీకి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. తాజాగా బయటపడిన వివిధ అవినీతి, కుంభకోణాల నుంచి ప్రజల దృష్టిని మరలించడంతో పాటు పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మోదీ ప్రభుత్వం ఈ చర్యకు దిగిందని కాంగ్రెస్పార్టీ ఆరోపించింది. గత పదిరోజుల్లోనే రూ.30 వేల కోట్ల విలువకు పైబడిన కుంభకోణాలు బయటపడినా కేంద్రం నోరు మెదపలేదని పేర్కొంది. వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడిన వారు విదేశాలకు చెక్కేసిన పట్టించుకోని ప్రభుత్వం, సీబీఐ విచారణకు సహకరిస్తున్న కార్తీని దేశానికి తిరిగి వచ్చిన సందర్భంగా ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేయడం విడ్డూరంగా ఉందని ఆ పార్టీ నేత అశోక్ గెహ్లాట్ విమర్శించారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదనే విషయాన్ని కార్తీ అరెస్ట్స్పష్టం చేస్తోందని బీజేపీ పేర్కొంది. ఏ రాజకీయపార్టీ అయినా దీనిని కక్షసాధింపుగా ఎలా భావిస్తోందో అర్థం కావడం లేదని,చట్టం తన పని తాను చేసుకుపోతోందని బీజేపీ నాయకుడు సంబిత్ పాత్రా వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే కార్తీ అవినీతి, అక్రమాలకు పక్కా ఆధారాలున్నాయని సీబీఐ స్పష్టంచేసింది. 2007 నాటి కేసు... 2007లో విదేశాల నుంచి రూ. 305 కోట్ల మేర ఐఎన్ఎక్స్ మీడియాకు నిధులు అందేలా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎఫ్ఐపీబీ) క్లియరెన్స్ ఇవ్వడంలో అక్రమాలు జరిగాయనేది ప్రధాన ఆరోపణ. కేంద్ర ఆర్థికమంత్రిగా కార్తీ తండ్రి చిదంబరం ఉండడం వల్ల ఇది సాధ్యమైందని, దీని ద్వారా కార్తీకి రూ. 10 లక్షలు నిధుల రూపంలో అందాయని పేర్కొంది. దీనిపై 2015 మే నెలలో సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. అదే ఏడాది డిసెంబర్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను శాఖ చైన్నైలోని కార్తీ కార్యాలయాలపై దాడులు జరిపాయి. 2016 ఏప్రిల్లో కార్తీకి సంబంధమున్న బెంగళూరులోని వాసన్ హెల్త్కేర్ గ్రూప్లో ఈడీ సోదాలు చేసింది. అదే ఏడాది జులైలో ఎయిర్సెల్–మాక్సిస్ ముడుపుల కేసులో కార్తీకి ఈడీ సమన్లు జారీచేసింది. ఈ ఏడాది ప్రారంభంలో ఈ కేసు విషయంలోనే చిదంబరం, కార్తీ నివాసాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. తమ విచారణకు కార్తీ సహకరించని కారణంగా అరెస్ట్ చేయాల్సి వచ్చిందని ఇప్పుడు సీబీఐ తెలిపింది. ఈ కేసులో విదేశీమారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన స్పష్టంగా ఉండడంతో పాటు, దీనికి సంబంధించిన ఆధారాలు లభించడంతో అరెస్ట్ చేసి విచారణ జరపాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని స్పష్టంచేసింది. ఇవీ సీబీఐ ఆరోపణలు... ఐఎన్ఎక్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పూర్వ యజమానులు పీటర్, ఇంద్రాణి ముఖర్జీ. నిబంధనలకు విరుద్ధంగా విదేశీ పెట్టుబడులు వచ్చిన కేసులో 2007లో కార్తీ ద్వారా ఈ కేసును ఈ సంస్థ సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంది. ఎఫ్ఐపీబీ రూ.4.62 కోట్ల విదేశీ పెట్టుబడులకు అనుమతించగా, ఈ సంస్థ రూ.305 కోట్ల పెట్టుబడులు తెచ్చుకుంది. తన తండ్రి చిదంబరం ఆర్థికమంత్రి కావడంతో ఎఫ్ఐపీబీ అధికారులపై కార్తీ ఒత్తిడి తెచ్చి ఈ కేసును విచారించకుండా చూశారు. నిబంధనలకు విరుద్ధంగా ఆ సంస్థ రూ.305 కోట్లకు ఎఫ్ఐపీబీకి తాజా దరఖాస్తు చేసుకునేలా చేశారు. ఈ సంస్థలోకి అప్పటికే పెట్టుబడులు రాగా ఆ తర్వాత ఎఫ్ఐపీబీ అనుమతిచ్చేలా చేశారు. మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సర్వీస్ కింద ఐఎన్ఎక్స్ సంస్థ నుంచి కార్తీ పరోక్ష నియంత్రణలోని అడ్వాంటేజ్ స్ట్రాటజిక్ కన్సల్టింగ్ (ప్రై) లిమిటెyŠ ద్వారా రూ. 10 లక్షలు అందాయి. కార్తీ గుర్తింపు బయటపడకుండా ఉండేందుకే ఈ విధంగాచేశారు. చిదంబరానికి ప్రత్యక్ష, పరోక్ష ఆర్థిక ప్రయోజనాలున్న కంపెనీలకు రూ.3.5 కోట్ల మేర లబ్ది చేకూరేందుకు ఐఎన్ఎక్స్ గ్రూపు ద్వారా లావాదేవీలు నడిచాయి. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఇది ముమ్మాటికీ కక్షసాధింపే!
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం తనయుడు కార్తీని సీబీఐ బుధవారం అరెస్టు చేయడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. నరేంద్రమోదీ సర్కారు ప్రతిపక్షాన్ని లక్ష్యంగా చేసుకొని సాగిస్తున్న కక్షసాధింపు రాజకీయాలకు ఇది నిలువత్తు నిదర్శనమని ధ్వజమెత్తింది. ఐఎన్ఎక్స్ మీడియా సంస్థ మనీలాండరింగ్ కేసులో 46 ఏళ్ల వ్యాపారవేత్త కార్తీని చెన్నై విమానాశ్రయంలో సీబీఐ బుధవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నీమో(నీరవ్మోదీ), చోక్సీ, డీడీ జెవెల్లర్స్, రోటోమ్యాక్ ఇలా రోజుకొకటి చొప్పున బయటపడుతున్న భారీ కుంభకోణాలు, అవినీతిని దృష్టిని మరల్చేందుకు మోదీ సర్కారు సాగిస్తున్న కళాత్మక ప్రయత్నమే ఇదని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలా ట్వీట్ చేశారు. అయినా, కాంగ్రెస్ పార్టీ సత్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చే విషయంలో వెనుకకు తగ్గబోదని ఆయన వెల్లడించారు. తన తండ్రి చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు కార్తీ కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖలో తన ప్రభావాన్ని ఉపయోగించి.. ఐఎన్ఎక్స్ మీడియా సంస్థకు మారిషస్కు చెందిన పెట్టుబడిదారుల నుంచి విదేశీ పెట్టుబడులకు అనుమతి లభించేలా చూశాడని, రూ. 305 కోట్ల మేర విదేశీ పెట్టుబడులు ఐఎన్ఎక్స్ మీడియా సంస్థలోకి వచ్చేందుకు లైన్ క్లియర్ చేసి.. ముడుపులు పొందాడని ఆరోపిస్తూ కార్తీ మీద సీబీఐ కేసు నమోదుచేసిన సంగతి తెలిసిందే. -
కార్తీ ఇళ్లపై ఐటీ దాడులు
సాక్షి, చెన్నై/న్యూఢిల్లీ: ఎయిర్సెల్–మాక్సిస్ మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా ఈడీ అధికారులు శనివారం ఉదయం మాజీ కేంద్రమంత్రి చిదంబరం, ఆయన కుమారుడు కార్తీకి చెందిన 10 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. ఢిల్లీలోని చిదంబరం నివాసం, చెన్నైలోని కార్తీ నివాసం, కార్తీ చార్టెర్డ్ అకౌంటెంట్, అతని వ్యక్తిగత సహాయకుడి ఇళ్లు తదితర చోట్ల తనిఖీలు జరిగాయి. దక్షిణ ఢిల్లీ జోర్బాగ్లో ఉన్న తన నివాసంలోకి వచ్చిన ఈడీ అధికారులు కార్తీ ఇంట్లో సోదా చేయటానికి వచ్చినట్లు చిదంబర్ మీడియాతో చెప్పారు. అయితే, తన కుమారుడు కార్తీ చెన్నైలో ఉంటారని, ఇది తన నివాసమని వారికి తెలిపానన్నారు. ప్రభుత్వ ప్రోద్బలంతోనే ఈడీ ఈ సోదాలు చేపట్టిందన్నారు. ఈడీ దాడులను ‘నగుబాటు చర్యలు’గా ఆయన అభివర్ణించారు. ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడుల వ్యవహారం కేసులో కార్తీ పాత్రపైనా విచారిస్తున్నామని ఈడీ పేర్కొంది. గత ఏడాది డిసెంబర్ ఒకటో తేదీన కూడా కార్తీతోపాటు ఆయన బంధువుల ఇళ్లపై ఈడీ సోదాలు జరిపింది. సుప్రీంకోర్టు జడ్జీల అంశంపై నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే బీజేపీ ప్రభుత్వం చిదంబరం, కార్తీ ఇళ్లపై ఈడీ దాడులు చేయించిందని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. -
సీబీఐ సమన్లపై సుప్రీంకు కార్తీ
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం ఎయిర్సెల్ మాక్సిస్ కేసులో సీబీఐ తనకు సమన్లు జారీ చేయడంపై సుప్రీం కోర్టును ఆశ్రయించారు.ఈ కేసుకు సంబంధించి బుధవారం తమ ఎదుట హాజరు కావాలని సీబీఐ కార్తీకి సమన్లు జారీ చేసింది. అయితే విచారణలో తాను హాజరు కావాలని ఒత్తిడి చేయవద్దని తన న్యాయవాది ద్వారా ఆయన సీబీఐకి స్పష్టం చేశారు. ఈ కేసులో తనను ప్రశ్నించేందుకు సీబీఐ సమన్లు జారీ చేయడం అక్రమమని, తనను తన కుటుంబాన్ని వేధించేందుకేనని కార్తీ పేర్కొన్నారు.సీబీఐ సమన్లను సవాల్ చేస్తూ కార్తీ చిదంబరం రాజ్యాంగంలోని 32వ ఆర్టికల్ ప్రకారం సర్వోన్నత న్యాయస్ధానంలో పిటిషన్ దాఖలు చేశారని కార్తీ న్యాయవాది పేర్కొన్నారు. ఇదే కేసుకు సంబంధించి కార్తీ, ఆయమ తండ్రిని 2014 నవంబర్, డిసెంబర్లలో సీబీఐ విచారించిందని ఆయన గుర్తుచేశారు.ఈ కేసులో నిందితులందరిపై అభియోగాలను తోసిపుచ్చిన క్రమంలో సీబీఐ సమన్లు జారీ చేయడం అర్ధరహితమని కార్తీ న్యాయవాది అన్నారు. -
కార్తీ విదేశాల్లో ఏం చేస్తారంటే..
సాక్షి, న్యూఢిల్లీః అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్తీ చిదంబరం విదేశాలకు వెళితే విచారణకు ఇబ్బందులు ఎదురవుతాయని సీబీఐ శుక్రవారం సుప్రీం కోర్టుకు నివేదించింది. కార్తీ పలు విదేశీ ఖాతాలను మూసివేస్తున్నారని, అందుకే ఆయన విదేశీ పర్యటనలను అడ్డుకునేలా లుక్ అవుట్ నోటీసులు జారీ చేశామని సీబీఐ కోర్టుకు తెలిపింది. విచారణలో పలు అంశాలు ఇంకా వెలుగు చూడాల్సి ఉందని దర్యాప్తు అంశాలను సీల్డ్ కవర్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ ముందుంచేందుకు అనుమతించాలని సీబీఐ కోరింది. దీనికి సీనియర్ న్యాయవాది, కార్తీ అడ్వకేట్ కపిల్ సిబల్ అభ్యంతరం తెలిపారు. అయితే విదేశాల్లో కార్తీ ఏం చేశారన్నది సీల్డ్ కవర్లో .పొందుపరిచారని అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. విచారణ సందర్భంగా తనకు విదేశాల్లో ఒకే ఖాతా ఉందని చెప్పిన కార్తీ తను విదేశాలు వెళ్లినప్పుడు పలు విదేశీ బ్యాంకు ఖాతాలను మూసివేశారని ఆ అంశాలు సీల్డ్ కవర్లో ఉన్నాయని మెహతా కోర్టుకు వెల్లడించారు. దీనిపై కపిల్ సిబల్ అభ్యంతరం తెలుపుతూ విదేశీ బ్యాంకు ఖాతాలపై కార్తీ సంతకాలు ఉంటే ఆయనను ఫెమా, బ్లాక్ మనీ కలిగి ఉన్నారనే ఆరోపణలపై ప్రాసిక్యూట్ చేయవచ్చని సిబాల్ అన్నారు. -
సీబీఐ ఎదుట హాజరయ్యేందుకు కార్తీ నో
సాక్షి,న్యూఢిల్లీః ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసులో సీబీఐ ఎదుట హాజరయ్యేందుకు కార్తీ చిదంబరం నిరాకరించారు. 2006లో కార్తీ తండ్రి చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఓ విదేశీ పెట్టుబడి క్లియరెన్స్కు సంబంధించి ప్రశ్నించేందుకు హాజరుకావాలని ఆయనను సీబీఐ కోరింది. ఈ అంశంలో నిందితులపై ఆరోపణలను ప్రత్యేక కోర్టు తిరస్కరించిందని చెబుతూ సీబీఐ ఎదుట హాజరయ్యేందుకు కార్తీ నిరాకరించారని ఆయన తరపు న్యాయవాది వెల్లడించారు. ఈ సమాచారాన్ని సీబీఐకి చేరవేశామని ఆయన న్యాయవాది అరుణ్ నటరాజన్ చెప్పారు. మరోవైపు రాజకీయ కోణంలోనే తమ కుమారుడిని కేసుల పేరుతో ప్రభుత్వం వేధిస్తోందని మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం ఆరోపిస్తున్నారు. ఎఫ్ఐపీబీ అనుమతులు రొటీన్గా ఇచ్చేవేనని చెప్పారు. -
కార్తికి విదేశాల్లో ఆస్తులన్నాయి : సీబీఐ
న్యూఢిల్లీ : కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం కుమారుడు కార్తి చిదంబరానికి విదేశాల్లో ఆస్తులు ఉన్నాయని సీబీఐ సుప్రీంకోర్టుకు మంగళవారం తెలిపింది. విదేశాల్లో కార్తికి మొత్తం 25 ఆస్తులు ఉన్నట్లు తమ దర్యాప్తులో తేలిందని సీబీఐ తెలిపింది. కార్తికి విదేశాల్లో ఉన్న ఆస్తుల వివరాలను సుప్రీంకోర్టుకు సీబీఐ సీల్డ్ కవర్లో అందించింది. దీనిపై కార్తి చిదంబరం తరఫు న్యాయవాది కపిల్సిబల్.. విదేశాల్లో కార్తికి ఆస్తులున్నాయడం అవాస్తవమని కోర్టుకు చెప్పారు. ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లేదా సీబీఐ కార్తికి ఆస్తులు ఉన్నట్లు నిరూపిస్తే.. వాటిని ప్రభుత్వానికి ఇచ్చేస్తామని చెప్పారు. సిబల్ వాదనలకు అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. ఆ ఆస్తులన్నీ షెల్ కంపెనీ పేరు మీదే ఉన్నా.. వాటి నిర్వహణ అంతా కార్తీనే చూస్తున్నారని చెప్పారు. -
మళ్లీ సీబీఐ ఎదుట హాజరైన కార్తీ చిదంబరం
న్యూఢిల్లీ : అవినీతి, ఫెరా ఉల్లంఘనల కేసులో కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి చిదంబరం కుమారుడు కార్తీ సోమవారం మరోసారి సీబీఐ ఎదుట హాజరయ్యారు. తన న్యాయవాదులతో కలిసి వచ్చిన కార్తీని సీబీఐ అధికారులు దాదాపు 100కి పైగా ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. ఈనెల 23న విచారణ సందర్భంగా కార్తీని సీబీఐ ఎనిమిది గంటలకు పైగా ప్రశ్నించిన విషయం విదితమే. ఈ కేసులో సీబీఐ ఎదుట విచారణకు హాజరు కావాలని ఈనెల 18న సుప్రీం కోర్టు కార్తీ చిదంబరాన్ని ఆదేశించింది. ఇదే కేసులో సుప్రీం ఉత్తర్వులకు అనుగుణంగా ఈనెల 28న మరో నలుగురిని సీబీఐ ప్రశ్నించనుంది. ముంబయికి చెందిన ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్ లభించేలా వ్యవహరించినందుకు కార్తీకి రూ 3.5 కోట్ల ముడుపులు ముట్టాయని సీబీఐ ఆరోపిస్తోంది. ఆయనపై నేరపూరిత కుట్ర, మోసం, అక్రమ పద్దతుల్లో డబ్బులు స్వీకరించారనే అభియోగాలపై ఈ ఏడాది మే 15న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. -
సీబీఐ ఎదుట హాజరైన కార్తీ
సాక్షి, న్యూఢిల్లీ : అవినీతి, ఫెరా ఉల్లంఘనల కేసుకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం బుధవారం సీబీఐ ఎదుట హాజరు అయ్యారు. ఐఎన్ఎక్స్ మీడియా విదేశీ పెట్టుబడుల క్లియరెన్స్ కేసులో ఈనెల 23న సీబీఐ ఎదుట హాజరుకావాలని కార్తీని సుప్రీం కోర్టు ఆదేశించింది. గతంలో కార్తీకి సీబీఐ జారీ చేసిన లుక్అవుట్ నోటీసులపై మద్రాస్ హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును సీబీఐ ఆశ్రయించగా కార్తీకి వ్యతిరేకంగా సర్వోన్నత న్యాయస్థానం దిగువ కోర్టు జారీ చేసిన స్టే ఉత్తర్వులను తోసిపుచ్చింది. సీబీఐ ఎదుట హాజరయ్యేందుకు ఎందుకు వెనుకాడుతున్నారని కార్తీని సూటిగా ప్రశ్నించింది. విచారణకు హాజరయ్యేందుకు తనకు భయం లేదని, తన భద్రతపైనే ఆందోళన చెందుతున్నానని కార్తీ చిదంబరం కోర్టుకు నివేదించారు. దీంతో న్యాయవాదితో కలిసి సీబీఐ ఎదుట విచారణకు హాజరయ్యేందుకు కార్తీని సుప్రీం కోర్టు అనుమతించింది. -
23న సీబీఐ ఎదుటకు కార్తీ చిదంబరం
న్యూఢిల్లీ : అవినీతి, ఫెరా ఉల్లంఘనల కేసుకు సంబంధించి ఈనెల 23న సీబీఐ ఎదుట విచారణకు హాజరు కావాలని మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరాన్ని శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. తన తండ్రి, కాంగ్రెస్ నేత చిదంబరంను టార్గెట్ చేసిన ప్రభుత్వం కేసుల పేరుతో తనను వేధింపులకు గురిచేస్తున్నదని కార్తీ చేసిన ఆరోపణలను కోర్టు తోసిపుచ్చింది. ప్రముఖ రాజకీయ నేతలను టార్గెట్ చేయడం ఫ్యాషన్గా మారిందని కార్తీ న్యాయవాది గోపాల్ సుబ్రమణియన్ వాదించారు. కార్తీ తన వాదనలను సమర్థించుకుంటున్న క్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహార్, జస్టిస్ డీవై చంద్రచూడ్లతో కూడిన సుప్రీం బెంచ్ జోక్యం చేసుకుంది. ‘మీరు చాలా మంచివారు కాబట్టి మీరు సీబీఐ ఎదుట హాజరుకానని చెప్పదలుచుకున్నారా’ అని బెంచ్ కార్తీ చిదంబరాన్ని ప్రశ్నించింది. సీబీఐ ఎదుట హాజరయ్యేందుకు తాను భయపడటం లేదని..అయితే తనకు భద్రత కావాలని కార్తీ చిదంబరం ఈ సందర్భంగా కోర్టును కోరారు. న్యాయవాదితో కలిసి సీబీఐ ఎదుట హాజరయ్యేందుకు కోర్టు అనుమతించింది. అయితే విచారణ సమయంలో న్యాయవాది దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. మరోవైపు కార్తీ లుక్ అవుట్ నోటీసుపై మద్రాస్ హైకోర్టు జారీ చేసిన స్టే ఉత్తర్వులను సవాల్ చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. -
సుప్రీం ముంగిట కార్తీ లుక్అవుట్ వ్యవహారం
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మాజీమంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంకు జారీ చేసిన లుక్అవుట్ నోటీసుపై మద్రాస్ హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేయడాన్నిసవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తనను విదేశాలకు వెళ్లకుండా నిరోధించేలా సీబీఐ జారీ చేసిన లుక్అవుట్ నోటీసులు రద్దు చేయాలని కోరుతూ కార్తీ మద్రాస్ హైకోర్టులో అప్పీల్ వేశారు. అవినీతి, ఫెరా ఉల్లంఘనలకు సంబంధించి కార్తీకి సీబీఐ ఈ నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహార్, జస్టిస్ డీవై చంద్రచూడ్తో కూడిన బెంచ్ ఈ అంశాన్ని విచారణ చేపట్టింది. కార్తీ చిదంబరం సహా నిందితులు విచారణకు హాజరు కావాల్సిందేనని ఆదేశించిన కోర్టు, ముగ్గురు నిందితులు దేశం విడిచి వెళ్లడానికి అనుమతించబోమని స్పష్టం చేసింది. ఐఎన్ఎక్స్ మీడియా విదేశీ పెట్టుబడుల చట్టం ఉల్లంఘనలకు పాల్పడేలా సహకరించినందుకు కార్తీ చిదంబరంకు రూ 3.5 కోట్ల ముడుపులు ముట్టాయని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. అయితే తనపై ఆరోపణలు నిరాధారమని, రాజకీయ కక్షసాధింపులో భాగమని కార్తీ చిదంబరం చెబుతున్నారు. -
కార్తీ చిదంబరం అజ్ఞాత నేరస్తుడు: కేంద్రం
చెన్నై: సీబీఐ గాలిస్తున్న అజ్ఞాత నేరస్థుల జాబితాలో కేంద్ర మాజీమంత్రి పి.చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం పేరును చేరుస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వశాఖ శుక్రవారం ప్రకటించింది. అంతేగాక విదేశీయానంపై నిషేధం, ఆదాయ పన్నుశాఖ, సీబీఐ, ఈడీ కేసుల్లో విచారణకు హాజరుకాని కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ మద్రాసు హైకోర్టులో కార్తీ చిదంబరం పిటిషన్ దాఖలు చేశారు. నకిలీ సంస్థలకు పి.చిదంబరం అనుమతులు ఇవ్వగా, ఆ కంపెనీలతో పాటూ వివిధ సంస్థలకు అక్రమంగా భారీ ఎత్తున విదేశీ మారకద్రవ్యం పొందినట్లుగా కార్తీ చిదంబరంపై సీబీఐ అభియోగం మోపింది. ఈ ఏడాది మేలో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, కార్తీ చిదంబరం ఇళ్లపై డిల్లీకి చెందిన సీబీఐ అధికారులు దాడులు చేసి అనేక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో విచారణకు హాజరు కావాల్సిందిగా కార్తీ చిదంబరానికి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ సమన్లు అందుకున్న కార్తీ విచారణకు హాజరుకాకుండానే విదేశాలకు వెళ్లిపోయారు. కొన్ని నెలలుగా విదేశాల్లోనే గడుపుతున్న కారణంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ భారత్ వెతుకుతున్న అజ్ఞాత నేరస్తుడి జాబితాలో కార్తీ చిదంబరాన్ని చేర్చినట్లుగా శుక్రవారం ప్రకటించింది. విదేశీయానంపై నిషేధం విధించడంతోపాటూ లుక్-అవుట్ సర్క్యులర్ను అన్ని విమానాశ్రయాలకు పంపింది. కాగా, వెతుకుతున్న నేరస్థుడిగా తనను ప్రకటించడాన్ని సవాలు చేస్తూ కార్తీ చిదంబరం తరపున ఆయన న్యాయవాదులు మద్రాసు హైకోర్టులో శుక్రవారం పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై ఈనెల 7వ తేదీన విచారణ జరగనుంది. -
లండన్ వెళ్లిపోయిన చిదంబరం కొడుకు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి పీ చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం బ్రిటన్ వెళ్లారు. అవినీతి, లంచం ఆరోపణల కేసుకు సంబంధించి రెండు రోజులుగా ఆయన ఇంట్లో, బంధువుల ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించిన అనంతరమే ఆయన లండన్కు వెళ్లిపోవడం చర్చనీయాంశం అయింది. అయితే, ఉన్నపలంగా ఇప్పటికిప్పుడు అనుకున్న ప్రయాణం కాదని, అంతకుముందే పెట్టుకున్న షెడ్యూల్ ప్రకారం బ్రిటన్ వెళ్లినట్లు కార్తీ చిదంబరంతోపాటు ఆయన తండ్రి చిదంబరం స్పష్టం చేశారు. ‘ట్రావెలింగ్ ప్లాన్స్ ప్రకారమే కార్తి వెళుతున్నాడు. కొద్ది రోజుల తర్వాత అతడు తిరిగొస్తాడు. కార్తీపై ట్రావెల్ బ్యాన్ లేదు’ అని చిదంబరం పీటీఐకి తెలిపారు. గత మంగళవారం సీబీఐ అధికారులు కార్తీ నివాసంతోపాటు నగరంలోని ఆయనకు సంబంధించిన నాలుగు ప్రధాన కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. తన తండ్రి చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు ఇంద్రాణి, పీటర్ ముఖర్జియాకు సంబంధించిన మీడియా కంపెనీ నుంచి పెద్ద మొత్తంలో లంచం తీసుకొని అవినీతికి పాల్పడి వారి కంపెనీలకు అనుమతులిప్పించారని ఆరోపిస్తూ సీబీఐ అధికారులు ఈ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. -
నాటకం ఇక ముగిసింది: కార్తీ చిదంబరం
చెన్నై : కేంద్ర మాజీమంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం ఎట్టకేలకు సీఐబీ దాడులపై స్పందించారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ డ్రామా ఇక ముగిసిందని, తాను ఏ తప్పు చేయలేదని, సీబీఐ దాడులు రాజకీయ కక్ష సాధింపులో చర్యలేనని అన్నారు. కాగా ఒక మీడియా సంస్థ నుంచి ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలతో కార్తీ చిదంబరం నివాసాలు, కార్యాలయాల్లో మంగళవారం సీబీఐ ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఐఎన్ఎక్స్ మీడియాపై ఐటీ దర్యాప్తును పక్కదోవ పట్టించేందుకు ఆర్థిక శాఖ, విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ(ఎఫ్ఐపీబీ)అధికారుల్ని కార్తీ ప్రభావితం చేసినట్లు సీబీఐ ఆరోపించింది. ఉదయం నుంచి పొద్దుపోయేవరకూ చెన్నై, ముంబై, ఢిల్లీ, గురుగ్రామ్ల్లో 14 చోట్ల కార్తీ ఆస్తులపై సీబీఐ అధికారులు తనిఖీలు చేశారు. మరోవైపు సీబీఐ దాడులను చిదంబరం కూడా తీవ్రంగా ఖండించారు. తన కుమారుడే లక్ష్యంగా సీబీఐ, ఇతర దర్యాప్తు సంస్థల్ని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆయన ఆరోపించిన విషయం తెలిసిందే. -
కార్తీ చిదంబరంపై సీబీ‘ఐ’
-
కార్తీ చిదంబరంపై సీబీ‘ఐ’
4 నగరాల్లో కార్తీ నివాసాలు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు ఐఎన్ఎక్స్ మీడియా నుంచి ముడుపులు స్వీకరించారని ఎఫ్ఐఆర్ - ఎఫ్ఐఆర్లో ‘ఐఎన్ఎక్స్’ యజమానులు ఇంద్రాణీ, పీటర్ ముఖర్జియా పేర్లు - ఇది రాజకీయ కక్ష సాధింపే: కార్తీ - నా గొంతు నొక్కేందుకే: పి.చిదంబరం న్యూఢిల్లీ/ సాక్షి, చెన్నై: కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం మెడకు మరో సీబీఐ కేసు చుట్టుకుంది. ఒకవైపు ఎయిర్సెల్–మ్యాక్సిస్ కేసు విచారణ కొనసాగుతుండగానే.. మరోవైపు ఒక మీడియా సంస్థ నుంచి ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలపై మంగళవారం సీబీఐ ఆయన నివాసాలు, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఐఎన్ఎక్స్ మీడియాపై ఐటీ దర్యాప్తును పక్కదోవ పట్టించేందుకు ఆర్థిక శాఖ, విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ(ఎఫ్ఐపీబీ)అధికారుల్ని కార్తీ ప్రభావితం చేసినట్లు సీబీఐ ఆరోపించింది. ఆ మేరకు నేరపూరిత కుట్ర, మోసం, అక్రమంగా ప్రతిఫలం పొందడం, ప్రభుత్వాధికారుల్ని ప్రభావితం చేయడం, నేరపూరిత ప్రవర్తన నేరాలపై సోమవారమే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అనంతరం మంగళవారం ఉదయం నుంచి పొద్దుపోయేవరకూ చెన్నై, ముంబై, ఢిల్లీ, గురుగ్రామ్ల్లో 14 చోట్ల కార్తీ ఆస్తులపై సీబీఐ అధికారులు తనిఖీలు చేశారు. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఏముంది? ఎఫ్ఐఆర్లో కార్తీపై సీబీఐ పలు అభియోగాలు మోపింది. ఐఎన్ఎక్స్ మీడియాపై పన్ను దర్యాప్తు కేసును ప్రభావితం చేసేందుకు కార్తీ చిదంబరం డబ్బులు అందుకున్నారని ఆరోపించింది. ‘కార్తీ పరోక్ష భాగస్వామిగా ఉన్న అడ్వాంటేజ్ స్ట్రాటజిక్ కన్సల్టింగ్ లిమిటెడ్కు రూ.10 లక్షలు ఇచ్చినట్లు రికార్డుల్లో ఐఎన్ఎక్స్ మీడియా స్పష్టంగా పేర్కొంది. ఎఫ్ఐపీబీతో మధ్యవర్తిత్వం కోసం ఫీజుగా ఈ మొత్తం చెల్లించారు. అలాగే ప్రత్యక్షంగా, పరోక్షంగా కార్తీకి సంబంధమున్న కంపెనీలకు లబ్ధిచేకూర్చేలా ఐఎన్ఎక్స్ గ్రూపు రూ.3.5 కోట్ల మేర ఇన్వాయిస్లు జారీచేసింద’ని సీబీఐ పేర్కొంది. కార్తీతో పాటు అతని కంపెనీ చెస్ మేనేజ్మెంట్ సర్వీసెస్, ఐఎన్ఎక్స్ మీడియా యజమానులు పీటర్, ఇంద్రాణీ ముఖర్జియాలు (ప్రస్తుతం ఇంద్రాణీ కుమార్తె షీనాబోరా హత్య కేసులో జైల్లో ఉన్నారు), ఐఎన్ఎక్స్ మీడియా, అడ్వాంటేజ్ స్ట్రాటజిక్ కన్సల్టింగ్ సర్వీసెస్, ఆ కంపెనీ డైరెక్టర్ పద్మా విశ్వనాథన్ల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చింది. తమకందిన విశ్వసనీయ సమాచారం మేరకు అన్నీ నిర్ధారించుకుని కేసులు నమోదు చేశామంది. ఆర్థిక శాఖ, ఎఫ్ఐపీబీ అధికారులపై కార్తీ ఒత్తిడి తెచ్చారని సీబీఐ పేర్కొన్నా.. ఆ అధికారుల పేర్లను మాత్రం ఎఫ్ఐఆర్లో చేర్చలేదు. ఏ తప్పూ చేయలేదు: కార్తీ ‘నేనెలాంటి తప్పూ చేయలేదు. సీబీఐ దాడులు రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమేన’ని కార్తీ చిదంబరం ఆరోపించారు. తన కార్యాలయాలు, నివాసాల నుంచి సీబీఐ ఎలాంటి పత్రాల్ని స్వాధీనం చేసుకోలేదని, తనపై ఒక్క ఆరోపణ కూడా నిరూపించలేకపోయారని పేర్కొన్నారు. గొంతు నొక్కేందుకే..: చిదంబరం తన కుమారుడే లక్ష్యంగా సీబీఐ, ఇతర దర్యాప్తు సంస్థల్ని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని పి.చిదంబరం ఆరోపిం చారు. ‘ప్రతిపక్ష పార్టీల నేతలు, జర్నలిస్టులు, కాలమిస్టులు, ఎన్జీవోలు, పౌర సంస్థల విషయంలో చేసినట్లే నా గొంతు నొక్కడం, రాయకుండా అడ్డుకోవడమే ప్రభుత్వ లక్ష్యం. వెనక్కి తగ్గేది లేదు. పత్రికల్లో రాయడం కొనసాగిస్తా’ నని చిదంబరం స్పష్టం చేశారు. ఈ కేసులో ఎఫ్ఐపీబీలోని ఏ ఒక్క అధికారిపైనా సీబీఐ ఎందుకు ఆరోపణలు చేయలేదని ప్రశ్నించారు. ‘సన్’స్ట్రోక్కు మూల్యం తప్పదు: బీజేపీ కేంద్రం తనను లక్ష్యంగా చేసుకుందన్న చిదంబరం ఆరోపణలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఖండించారు. చిదంబరం తనయుడి కంపెనీకి ఎఫ్ఐపీబీ నిధులు ఎందుకిచ్చిందన్నది ఇక్కడ విషయమని, దానిపై స్పందించాలన్నారు. ‘సన్’స్ట్రోక్కు చిదంబరం మూల్యం చెల్లించక తప్పదన్నారు. ఇవి ప్రతీకార దాడులన్న ప్రతిపక్షాల వ్యాఖ్యలపై స్పం దిస్తూ... బీజేపీ ఎప్పటికీ చట్టం, స్వయంప్రతిపత్తిగల దర్యాప్తు సంస్థల వ్యవహారాల్లో జోక్యం చేసుకోదన్నారు. అక్రమంగా రూ.305 కోట్ల సేకరణ విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ(ఎఫ్ఐపీబీ) నిబంధనల్ని ఉల్లంఘిస్తూ మారిషస్ నుంచి ఐఎన్ఎక్స్ భారీగా పెట్టుబడులు సేకరించింది. కేవలం రూ. 4.62 కోట్లు మాత్రమే సేకరించాలని ఎఫ్ఐపీబీ, ఆర్థిక శాఖ షరతులు విధించినా.. వాటిని లెక్కచేయకుండా రూ. 305 కోట్లను విదేశీ పెట్టుబడుల రూపంలో అందుకుంది. విదేశీ పెట్టుబడుదారులకు ఒక్కోటి రూ.800ల విలువైన షేర్లను జారీ చేసినట్లు సీబీఐ అధికారి ఒకరు వెల్లడించారు. ఆరోపణలపై ఐఎన్ఎక్స్ స్పందిస్తూ.. ఎఫ్ఐపీబీ షరతుల మేరకే పెట్టుబడులు సేకరించామని తెలిపింది. -
కావాలనే నన్ను టార్గెట్ చేశారు: చిదంబరం
చెన్నై: రాజకీయ కక్షతోనే కేంద్ర ప్రభుత్వం తమపై సీబీఐ దాడులు చేయించిందని కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అన్నారు. ఎయిర్టెల్-మ్యాక్సిస్ కేసు దర్యాప్తులో భాగంగా ఈ రోజు ఉదయం చిదంబరంతో పాటు ఆయన కుమారుడు కార్తీ చిదంబరం నివాసాలపై సీబీఐ దాడులు జరిగిన విషయం తెలిసిందే. దాడులపై చిదంబరం స్పందిస్తూ తానేప్పుడు చట్టాన్ని ఉల్లంఘించలేదని, వ్యవస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. కావాలనే తనను టార్గెట్ చేశారని చిదంబరం వ్యాఖ్యానించారు. తమ గొంతు నొక్కేందుకు కేంద్రం దర్యాప్తుల పేరుతో సీబీఐతో దాడులు చేయించి కుట్రలు చేస్తోందన్నారు. తన కుమారుడితో పాటు అతడి స్నేహితులను లక్ష్యంగా చేసుకున్నారని అన్నారు. దాడులకు భయపడేది లేదని చిదంబంరం స్పష్టం చేశారు. మరోవైపు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్... చిదంబరం నివాసంపై సీబీఐ దాడులను ఖండించారు. రాజకీయ కక్షతోనే దాడులు నిర్వహిస్తున్నారని ఆయన వ్యాఖ్యలు చేశారు. అలాగే చిదంబరంను కేంద్రం టార్గెట్ చేసిందని, కేవలం సంచలనం రేపాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం అలా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి టామ్ వడక్కన్ ఆరోపించారు. -
చిదంబరం నివాసంలో సీబీఐ సోదాలు
-
చిదంబరం నివాసంలో సీబీఐ సోదాలు
చెన్నై : కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం నివాసంలో మంగళవారం సీబీఐ సోదాలు చేసింది. చెన్నైలో చిదంబరంతో పాటు ఆయన కుమారుడు కార్తీ చిదంబరం ఇంట్లోనూ సీబీఐ అధికారులు తనిఖీలు చేశారు. అలాగే తమిళనాడు వ్యాప్తంగా 14 ప్రాంతాలతో పాటు ఢిల్లీ, నోయిడాలోనూ సీఐబీ ఏకకాలంలో దాడులు నిర్వహించింది. విదేశీ పెట్టుబడులు తీసుకునేందుకు ఓ మీడియా గ్రూపునకు లంచం తీసుకుని అనుమతులు ఇప్పించినట్లు కార్తి చిదంబరం సంస్థ ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇంద్రాణి ముఖర్జియాకు చెందిన ఐఎన్ఎక్స్ మీడియాకు 2008లో దొడ్డిదారిలో అనుమతులు మంజూరుచేయించినట్టు కార్తిపై ఆరోపణలున్నాయి. ఎఫ్ఐఆర్ నమోదు అయిన నేపథ్యంలో దాడులు జరుగుతున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే ఎయిర్ సెల్ , మ్యాక్సిస్ ఒప్పందాల వ్యవహారం కేసులో కార్తీ చిదంబరంపై ఆదాయపన్ను శాఖ, ఈడీ వర్గాలు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. అలాగే రాజస్థాన్లో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 108 అంబులెన్స్ సేవల్లో చోటుచేసుకున్న అవినీతిలో కార్తీ చిదంబరానికి వాటా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. -
చిదంబరంపై మరో బాంబు పేల్చిన స్వామి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం మరిన్ని చిక్కుల్లో పడనున్నారు. సీనియర్ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంపై మరోసారి తన దాడిని ఎక్కుపెట్టారు. కార్తి, అతని కంపెనీలకు సంబంధించిన దాదాపు 21 రహస్య విదేశీ బ్యాంకు ఖాతాల వివరాలను బహిర్గతం చేసి చిదంబరం, ఆయన కుటుంబంపై పెద్ద బాంబు పేల్చారు. ఈ వివరాలను మీడియాకు వెల్లడించిన స్వామి త్రీవమైన ఆరోపణలు చేశారు. ఆర్ధిక మంత్రిత్వశాఖ, ఆదాయపు పన్ను అధికారుల అలక్ష్యం కారణంగా ఈ కఠోర అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. చిదంబరం కొడుకు కార్తీకానీ,అతని పేరెంట్ ఇండియన్ భారతీయ కంపెనీలుకానీ ఈ విదేశీ బ్యాంకు ఖాతాల కార్డులు వివరాలను ఆదాయపు పన్ను అధికారులకు వెల్లడించలేదని ఆరోపించారు. ముఖ్యంగా మొనాకో బార్క్లేస్ బ్యాంక్, కెనడాలోని బ్యాంక్ మెట్రో, సింగపూర్ లో స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, ఓసీబీసీ, కెనడాలోని హెచ్ఎస్బీసి , ఫ్రాన్స్ లో డ్యుయిష్ బ్యాంక్, స్విట్జర్లాండ్ లో యూబీఎస్, కాలిఫోర్నియా లోని వెల్స్ ఫార్గో బ్యాంక్ లాంటి వివిధ విదేశీ బ్యాంకుల ఖాతాలను ఆయన సోమవారం వెల్లడించారు. గత కొన్ని సంవత్సరాలుగా కార్తీ ఈ ఖాతాలను రహస్యంగా మెయింటైన్ చేస్తున్నాడని పేర్కొన్నారు. ఆర్థికమంత్రిత్వశాఖలోని సన్నిహితులపై చిదంబరం ఒత్తిడి మూలంగానే గత ఎనిమిది నెలలుగా చెన్నై ఆదాయ పన్ను శాఖ ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. 2014 ఎన్నికల సందర్భంగా లోక్ సభకు పోటీ చేసిన కార్తీ ఈసీకి సమర్పించిన అఫిడవిట్ లో ఈ ఖాతాల వివరాలను ప్రకటించలేదని చెప్పారు. ఈ జాబితా, ఖాతాల నెంబర్లు, గతంలో తాను మోదీకి రాసిన లేఖ, కార్తీ ఆదాయ ప్రకటన వివరాలను స్వామి మీడియాకు అందించారు. ఫిబ్రవరి 16వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గతంలో ఒకలేఖ రాశానని చెప్పుకొచ్చారు. ఎయిర్ సెల్ మాక్సిస్ స్కాం కుంభకోణంపై పలు ఆరోపణలు గుప్పించిన ఆయన ఈ కుంభకోణంలో చిదంబరం, ఆయన కుమారుడు ప్రమేయంపై తాను సాక్ష్యాలను సమర్పించినా, హెచ్చరించినా కూడా సీబీఐ, ఈడీ తగిన చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కొంతమంది బీజేపీ నాయకులు అవినీతి నిరోధక చట్టాన్ని నీరుకార్చేందకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ చర్యను తాను వ్యతిరేకిస్తున్నానని, దీని అంతు తేలేవరకు తాను పోరాటం చేస్తానని చెప్పారు. దీనికోసం పార్లమెంట్ లో సవరణలు ప్రతిపాదించనున్నట్టు చెప్పారు. -
‘తమిళనాడు అసెంబ్లీని రద్దు చేయాలి’
చెన్నై: అధికార అన్నాడీఎంకేలో సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో తమిళనాడు అసెంబ్లీని రద్దు చేసి, తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ నాయకుడు కార్తి చిదంబరం డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో జయలలితకు తమిళనాడు ప్రజలు తీర్పు ఇచ్చారని ఆయన తెలిపారు. ఆమె చనిపోవడంతో రాష్ట్రం పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు శాసనసభను వెంటనే రద్దు చేయాలని కోరారు. గతంతో పోలిస్తే తమిళనాడులో రాజకీయ పరిస్థితులు పూర్తి భిన్నంగా మారాయని కార్తి తండ్రి, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం అంతకుముందు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టే అర్హత శశికళకు లేదని పరోక్షంగా పేర్కొన్నారు. -
చిక్కుల్లో చిదంబరం తనయుడు కార్తి
చెన్నై : కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తి చిదంబరం చిక్కుల్లో పడ్డారు. ఎయిర్ సెల్, మ్యాక్సీస్ ఒప్పందాల వ్యవహారంలో ఆయనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఎయిర్ సెల్, మ్యాక్సీస్ ఒప్పందంలో జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లతో కార్తి చిదంబరం మంగళవారం ఉదయం ఈడీ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది. కాగా 2006 సంవత్సరంలో మాక్సిస్ సంస్థ అక్రమంగా ఎయిర్ సెల్ లో 80 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు అప్పటి ఆర్థికమంత్రి చిదంబరం ప్రత్యేక చొరవ తీసుకొని అనుమతిచ్చారని ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే కార్తి చిదంబరంపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆదాయపన్ను శాఖతో కలిసి అతడి ఆస్తులపై కూడా సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. -
'వారిపై జాలి కలుగుతోంది'
న్యూఢిల్లీ: రాజకీయ కుట్రలతోనే తన కుమారుడు కార్తీ చిదంబరంను వేధిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం ఆరోపించారు. ఎన్డీఏ ప్రభుత్వం అసలు టార్డెట్ తానేనని అన్నారు. కార్తీపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని పేర్కొన్నారు. తన కుమారుడికి అక్రమ ఆస్తులు లేవని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తన కుమారుడిపై కొద్ది రోజుల క్రితం బాధ్యతారహితంగా తప్పుడు కథనం ప్రచురించిందని తెలిపారు. ఇది కల్పిత కథనమని మండిపడ్డారు. కార్తీ చట్టబద్దంగా వ్యాపారం చేస్తున్నారని వివరించారు. ప్రతి ఏడాది ఆదాయపన్ను చెల్లిస్తున్నారని చెప్పారు. తన కుమారుడిపై ఆరోపణలు చేసిన వారిపై జాలి కలుగుతోందని వ్యాఖ్యానించారు. చివరకు సత్యమే గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎయిర్ సెల్-మాక్సిస్ వ్యవహారంలో కార్తీ చిదంబరం అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో చిదంబరం స్పందించారు. -
కార్తీ చిదంబరంపై అట్టుడికిన పార్లమెంట్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం అవినీతి వ్యవహారంపై మంగళవారం పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. కార్తీ చిదంబరంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అన్నాడీఎంకే సభ్యులు ఉభయ సభలను స్తంభింపజేశారు. అన్నాడీఎంకే ఎంపీలు పదేపదే అడ్డు తగలడంతో పార్లమెంట్ మొదలైన గంటలోనే ఉభయ సభలు రెండుసార్లు వాయిదా పడ్డాయి. ఎయిర్ సెల్-మాక్సిస్ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని అన్నాడీఎంకే ఎంపీలు డిమాండ్ చేశారు. దీనిపై తాత్సారం చేయకుండా వెంటనే చర్యలు చేపట్టాలంటూ స్పీకర్ పోడియం వద్ద నినాదాలు చేశారు. రియల్ ఎస్టేట్ లో ప్రపంచవ్యాప్తంగా కార్తీ చిదంబరం పెట్టుబడులు పెట్టారని ఆంగ్ల దినపత్రికలో వచ్చిన కథనం ప్రతులను సభలో ప్రదర్శించారు. దీనికి సంబంధించిన కాపీలకు బీజేపీ సభ్యులకు పంచిపెట్టారు. సభ నియమ నిబంధనలకు అనుగుణంగా నోటీసు ఇస్తే చర్చించేందుకు సిద్ధమని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ప్రకంచినా అన్నాడీఎంకే సభ్యులు శాంతించలేదు. తమ ఆందోళన కొనసాగించారు. దీంతో ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. -
'నా కుమారుడిని ఇంకెంతకాలం వేధిస్తారో..'
చెన్నై: మాజీ కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి చెందినదిగా భావిస్తున్న చెస్ గ్లోబల్ అడ్వైజరీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థపై బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు నిర్వహించింది. ఈ సంస్థతో కలిసి అడ్వాంటేజ్ స్ట్రాటజిక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, వాసన్ హెల్త్ కేర్ కంపెనీలు విదేశీ మారక ద్రవ్య ఉల్లంఘనలకు పాల్పడ్డాయనే ఆరోపణల ఆధారంగా ఈడీ ఈ దాడులు నిర్వహించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఓ ల్యాప్ ట్యాప్ ను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇదిలాఉండగా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడుల నుంచి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం పక్కకు జరిగారు. ఈడీ దాడులు నిర్వహించిన సంస్థలకు తనకు, తన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. తనకుగానీ, తన కుటుంబ సభ్యులకు ఆ సంస్థల్లో వాటాలు లేవని అన్నారు. 'మొత్తం మూడు సంస్థల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్లు తనకు సమాచారం ఉంది. వాటిలో రెండు నా స్నేహితులవి. స్వయంగా ప్రొఫెనల్స్ అయినా వారే ఆ సంస్థలకు డైరెక్టర్లుగా కూడా ఉన్నారు. మరో సంస్థ ఎవరిదో నాకు తెలియదు. గతంలోనే నేను ఈడీ అధికారులకు చాలా స్పష్టంగా చెప్పాను నాకుటుంబానికి, నాకు అందులో వాటాలు లేవని. నాపై వచ్చే ఆరోపణలన్నీ కూడా అవాస్తవాలు' అని కార్తీ అన్నారు. అంతకుముందు ఈ దాడులపై చిదంబరం కూడా స్పందిస్తూ తన కుమారుడిపై ఇంకెంతకాలం ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరించి దాడులు చేయిస్తారో, వేధిస్తారో తాను కూడా చూడాలనుకుంటున్నట్లు తెలిపారు. అయితే, ప్రభుత్వం మూర్ఖంగా పనిచేసినా ఈడీ శాఖలో నిబద్దులై పనిచేసే అధికారులు ఉన్నారని తనకు తెలుసని, వారు చట్ట ప్రకారమే వ్యవహరిస్తారని మరోమాటగా చెప్పారు. -
'నేను టార్గెట్ అయితే.. నేరుగా ఎదుర్కోండి'
చెన్నై: కేంద్ర ప్రభుత్వం తనను లక్ష్యంగా చేసుకోవాలనుకుంటే నేరుగా తననే ఎదుర్కోవాలని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరం అన్నారు. కేంద్ర ప్రభుత్వం తన కుటుంబంపై ప్రతీకార చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం, ఆయన సన్నిహితుల సంస్థలపై మంగళవారం ఈడీ, ఐటీ అధికారులు దాడులు చేసిన నేపథ్యంలో ఆయన పైవిధంగా స్పందించారు. 'కేంద్ర ప్రభుత్వం నన్ను లక్ష్యంగా చేసుకోవాలనుకుంటే నేరుగా ఎదుర్కోవాలి. అంతేకాని నా కుమారుడి స్నేహితులను వేధించరాదు. వారి వ్యాపారాలకు రాజకీయాలతో సంబంధం లేదు' అని చిదంబరం అన్నారు. కేంద్ర ప్రభుత్వ దాడులను ఎదుర్కొనేందుకు తాను, తన కుటుంబ సబ్యులు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. చెన్నైలో కార్తీ చిదంబరం సీఈవోగా ఉన్న సంస్థలపై ఐటీ, ఈడీ అధికారులు దాడులు చేశారు. -
ఆప్ను చూసి నేర్చుకోండి: కార్తీ చిదంబరం
చెన్నై: కాంగ్రెస్ పార్టీపై ఆ పార్టీ నాయకులే ప్రత్యక్ష దాడికి దిగుతున్నారు. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం మరోసారి పార్టీపై విమర్శలతో పాటు పలు సూచనలు చేశారు. అంతేకాకుండా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ ని చూసి నేర్చుకోవాలని కార్తీ చిదంబరం కాంగ్రెస్కు సలహాలు ఇచ్చారు. కార్తీ చిదంబరం గురువారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. 'అత్యధిక మెజారిటీతో గెలిచినందుకు 'ఆప్'కు అభినందనలు. ఆప్ను చూసి కాంగ్రెస్ ప్రత్యేకించి...టీఎన్సీసీ చాలా నేర్చుకోవాలి. రాష్ట్ర నాయకత్వం బాగుంటేనే పార్టీ బలోపేతం అవుతుందనే విషయం గమనించాలి. పార్టీకి ఓ ప్రత్యేక ఎజెండాను తయారు చేసుకోవాలి. ప్రజాదరణ కలిగిన నాయకుణ్ని ఎంపిక చేయాలి. నాయకుడిని ఎంపిక చేయటంలో తొందరపాటు నిర్ణయాలు పనికి రావు' అని అన్నారు. ఇప్పటికే పలుమార్లు సొంత పార్టీపై విమర్శలు చేసిన కార్తీ అధిష్టానం నుంచి షోకాజ్ నోటీసులు కూడా అందుకున్న సంగతి తెలిసిందే. -
'ఏఐసీసీ అడిగితేనే సమాధానమిస్తా'
చెన్నై: పీసీసీ జారీ చేసిన షోకాజ్ నోటీసుకు జవాబిచ్చేందుకు కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం నిరాకరించారు. తనను వివరణ అడిగే అధికారం ఏఐసీసీ క్రమశిక్షణ సంఘానికి మాత్రమే ఉందని పేర్కొన్నారు. తాను ఏఐసీసీ సభ్యుడినని, తనపై క్రమశిక్షణ చర్య తీసుకునే అధికారం ఏఐసీసీకి మాత్రమే ఉందన్నారు. ఏఐసీసీ అడిగితేనే సమాధానమిస్తానని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి కామరాజనాడార్ను, పార్టీ వ్యవహారాలను విమర్శించినందుకు ఆయనకు తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్ ఈనెల 23న సంజాయిషీ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. నోటీసుకు వారం రోజుల్లోగా వివరణ ఇవ్వకుంటే పార్టీ నుంచి బహిష్కరిస్తామని ఇళంగోవన్ స్పష్టం చేశారు. -
చిదంబరం ‘సీఎం’
సాక్షి, చెన్నై : ‘సీఎం పదవికి అర్హుడు నా తండ్రి. అలాంటి వ్యక్తికి రాష్ట్ర పార్టీ పగ్గాల్ని అప్పగించాల్సిందే’ అని ఏఐసీసీకీ కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం సంకేతాన్ని పంపించారు. తన తండ్రి సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం టీఎన్సీసీలో చర్చకు దారి తీసింది.రాష్ట్ర కాంగ్రెస్లోని గ్రూపుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆధిపత్యం కోసం ఈ గ్రూపుల మధ్య సాగుతున్న వివాదాలు రాష్ట్రంలో కాంగ్రెస్ను చావు దెబ్బ తీశాయి. పూర్వ వైభవాన్ని చేజిక్కించుకుని తీరుతామన్న ధీమాతో నేతలు వేర్వేరుగా పరుగులు తీస్తున్నారు. ప్రధానంగా రాష్ట్ర పార్టీ అధ్యక్ష పగ్గాల్ని చేజిక్కించుకునేందుకు తీవ్రంగానే గ్రూపుల నేతలు పావులు కదుపుతున్నారు. ఓ వైపు జీకే వాసన్కు అధ్యక్ష పగ్గాల్ని అప్పగించాలన్న నినాదం ఉన్నా, మరో వైపు చిదంబరం సైతం ఆ రేసులోనే ఉన్నారంటూ ఆయన మద్దతుదారులు డప్పులు వాయించే పనిలో పడ్డారు. ప్రస్తుతానికి ఆ పదవిలో జీకే వాసన్ మద్దతుదారుడైన జ్ఞాన దేశికన్ ఉన్నా, ఆయన్ను తప్పించడం లక్ష్యంగా ఏఐసీసీ వద్ద తీవ్రంగానే గ్రూపులు పావులు కదిపే పనిలో పడ్డాయి. ఈ సమయంలో ఆ పదవి ఏదో తన తండ్రికే ఇవ్వండంటూ ఏఐసీసీకి చిదంబరం తనయుడు కార్తీ సంకేతాన్ని పంపించారు. తన తండ్రి సమక్షంలో ఆయన అధిష్టానానికి సంకేతాలు ఇస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడం టీఎన్సీసీలో చర్చకు దారి తీసింది.మోడీపై సెటైర్లు : చెన్నైలోని కామరాజర్ అరంగంలో సోమవారం రాత్రి దక్షిణ చెన్నై కాంగ్రెస్ నేతలు (చిదంబరం మద్దతుదారులు) సమావేశమయ్యారు. ఇందులో చిదంబరం ముఖ్య అతిథిగా పాల్గొని తన ప్రసంగంలో మోడీ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికల ముందు తాను దాఖలు చేసిన మధ్యంతర బడ్జెట్ను ప్రస్తుత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కాపీ కొట్టారన్నారు. మోడీ ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేదంటూ విమర్శలు గుప్పించారు. ఆయన తర్వాత తనయుడు కార్తీ చిదంబరం ప్రసంగం అత్యంత ఆసక్తికరంగానే సాగింది. తన తండ్రి సమక్షంలోనే ఆయన అధిష్టానానికి కొన్ని సంకేతాల్ని పంపించారు. పరోక్షంగా చిదంబరం మదిలో ఉన్న కోరికను తన నోటి ద్వారా బయట పెట్టారని చెప్పవచ్చు. రాష్ట్రంలో సీఎం అయ్యేందుకు తన తండ్రికి అన్ని అర్హతలు ఉన్నాయని, ఆయన చేతికి పార్టీ పగ్గాలు ఇవ్వకుండా కాలయాపన చేయొద్దంటూ ఏఐసీసీని విజ్ఞప్తి చేశారు. తన తండ్రి చిదంబరం సీఎం పదవికి అర్హుడని, ఆయనకు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించాల్సిందేనని డిమాండ్ చేయడం టీఎన్సీసీ వర్గాల్ని విస్మయంలో పడేసింది. కార్తీ వ్యాఖ్యలపై టీఎన్సీసీలో చర్చ మొదలైంది. తన ప్రసంగం అంతా జాతీయ స్థాయి అంశాలపై చిదంబరం దృష్టి సారిస్తే, ఆయన తనయుడు రాష్ట్రంలో తన తండ్రికి సీఎం పదవి ఇవ్వాలన్నట్టుగా వ్యాఖ్యలు చేయడాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. ఏఐసీసీ అధిష్టానం ఒక వేళ చిదంబరం చేతికి రాష్ట్ర పార్టీ పగ్గాలు ఇవ్వని పక్షంలో గతంలో మాదిరిగా వేరు కుంపటికి చిదంబరం సిద్ధం అవుతారా? అన్న ప్రశ్నను తెరపైకి తెచ్చే పనిలో కొన్ని గ్రూపులు పడ్డాయి. -
ఏంటి 'బాబూ' ఇదీ...
-
చిక్కుల్లో చిదంబరం కుమారుడు కార్తి
చెన్నై: శివగంగ స్థానం నుంచి లోక్సభకు పోటీ చేస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం చిక్కుల్లో పడ్డారు. అతని నామినేషన్ను తిరస్కరించాలని ఆదాయపు పన్నుశాఖాధికారులు ప్రధాన ఎన్నికల కమిషన్కు మంగళవారం ఫిర్యాదు చేశారు. కార్తీ నామినేషన్ పత్రంతోపాటూ సమర్పించిన స్థిర, చరాస్తుల ధృవీకరణ పత్రంలో వాస్తవాలు దాచిపెట్టారని ఆదాయపు పన్నుశాఖాధికారి ఎస్.కె.శ్రీ వాత్సవ ఈసీ దష్టికి తీసుకెళ్లారు. వ్యాపారం తన వృత్తి అని పేర్కొన్న కార్తీ, తాను చేసే వ్యాపారానికి పెట్టుబడి ఎంత, ఆ వ్యాపారానికి అతను యజమానా, భాగస్తుడా, డైరెక్టరా లేక షేర్లు కొన్నాడా వంటి ఏ వివరాలు పొందపరచలేదని వివరించారు. తమది ఉమ్మడి కుటుంబమని, బ్రైక్రిప్ట్ తోటలోని స్థిరాస్తిలో కార్తీకి, ఇతర కుటుంబ సభ్యులకు వాటా ఉందని గత లోక్సభ ఎన్నికల్లో పి.చిదంబరం తన నామినేషన్లో పేర్కొన్నట్లు ఆయన చెప్పారు. కార్తీ తన నామినేషన్లో ఆ ఆస్తుల వివరాలను తప్పుగానూ, మార్కెట్ విలువకంటే తక్కువగానూ చూపారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 1951 నాటి ప్రజాప్రతినిధి చట్టం ప్రకారం తప్పుడు సమాచారం ఇచ్చిన ఆయన నామినేషన్ను తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం శ్రీవాత్సవ మీడియాతో మాట్లాడుతూ, కార్తీ చిదంబరం సమర్పించిన 147 పేజీల నామినేషన్ పత్రాలను ప్రధాన ఎన్నికల కమిషనర్కు పంపుతానని, ఆ నామినేషన్లోని వివరాలను ఎన్నికల వెబ్సైట్లో పెడతామని స్థానిక ఎన్నికల అధికారి వివరించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, శ్రీవాత్సవ చేప్పినవన్నీ నిరాధార ఆరోపణలని కేంద్ర ఆర్థిక మంత్రి చిదబంరం కొట్టిపారేశారు. అతను కోర్టులో అనేక కేసులు కూడా ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.