డాక్టర్‌తో పాటు మరో 11 మంది నర్సులకు కరోనా | Coronavirus: Another Doctor And 11 Nurses Tested Positive In Delhi Hospital | Sakshi
Sakshi News home page

డాక్టర్‌తో పాటు మరో 11 మంది నర్సులకు కరోనా

Apr 7 2020 9:04 AM | Updated on Apr 7 2020 9:04 AM

Coronavirus: Another Doctor And 11 Nurses Tested Positive In Delhi Hospital - Sakshi

క్యాన్సర్‌ ఆస్పత్రిలో పని చేస్తున్న 45 మంది సిబ్బందిని క్వారంటైన్‌లో ఉంచారు

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్‌ వేగంగా ప్రబలుతోంది. సామాన్యులతో పాటు కరోనా రోగులకు సేవలు అందిస్తున్న వైద్య సిబ్బంది సైతం మహమ్మారి బారిన పడుతున్నారు. గత వారం రోజల క్రితం ప్రభుత్వం క్యాన్సర్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ వైద్యురాలికి కరోనా సోకిన విషయం తెలిసిందే. విదేశాలను నుంచి సోదరుడి ద్వారా ఆమెకు ఈ వైరస్‌ సోకింది.  ఆ తర్వాత అదే అస్పత్రిలో పనిచేస్తున్న మరో ఆరుగురు నర్సులకు కూడా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం ఆ ఆస్పత్రిని మూసేసింది.
(చదవండి: పరీక్షలు చేయించుకోకపోతే.. హత్యాయత్నం కేసు)

తాజాగా అదే అస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్‌తో పాటు మరో 11 మంది నర్సులకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఆ ఆస్పత్రిలో కరోనా బాధితుల సంఖ్య 18కి చేరింది. క్యాన్సర్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న 19 మంది రోగుల రక్త నమూనాలను కూడా ల్యాబ్‌కు పంపారు. ఈ నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది. క్యాన్సర్‌ ఆస్పత్రిలో పని చేస్తున్న 45 మంది సిబ్బందిని క్వారంటైన్‌లో ఉంచారు. ఢిల్లీ ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ డాక్టర్‌ జంటకు కూడా కరోనా వైరస్‌ సోకింది. సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఓ రోగి ద్వారా వారికి ఈ వైరస్‌ సోకింది. ఇక ఢిల్లీలో కరనా బాధితుల సంఖ్య సోమవారం సాయంత్రం నాటికి 523కి చేరింది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు ఏడుగురు మరణించారు. దేశ వ్యాప్తంగా 4,281 కరోనా కేసులు నమోదు కాగా, 111 మంది మృతి చెందారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement