
జైపూర్ ను వెనక్కునెట్టిన ఢిల్లీ
ముంబై: దేశరాజధాని ఢిల్లీ నుంచి ఈ ఏడాది ఎక్కువ మంది విద్యార్థులు ఐఐటీకి ఎంపికయ్యారు. జైపూర్ ను అధిగమించి మొదటి స్థానానికి చేరుకుంది. జైపూర్ లో ఎక్కువగా శిక్షణ సంస్థలు ఉండడంతో అక్కడి విద్యార్థులు అధిక సంఖ్యలో ఐఐటీలకు అర్హత సాధిస్తున్నారు. టాప్-10లో మూడు మహారాష్ట్ర నగరాలు ముంబై, పుణే, నాగపూర్ ఉన్నాయి. ముంబై తన స్థానాన్ని మెరుగుపరుచుకుని ఆరు నుంచి నాలుగో స్థానానికి ఎగబాకింది. మధ్యప్రదేశ్ నగరాలు భోపాల్, ఇండోర్ కు చోటు దక్కింది.
గత రెండేళ్ల నుంచి టాప్-10లో జైపూరే ముందు ఉంది. గతేడాది ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడ, పాట్నా, ముంబై ఉన్నాయి. 15 నగరాలకు చెందిన విద్యార్థులే 50 శాతం ఐఐటీ సీట్లు దక్కించుకోవడం విశేషం. ఈ నగరాలకు నుంచి 14,385 మంది విద్యార్థులు ఐఐటీకి అర్హత సాధించారు. ఐఐటీ అభ్యర్థులు ఇచ్చిన చిరునామా ఆధారంగా ఈ జాబితా తయారు చేశారు.