రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ రైల్వే స్టేషన్ పార్కింగ్ ప్రదేశంలో ఆదివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ కారు నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పార్కింగ్ ప్రదేశంలో ఉన్న ఇతర కార్లు, ద్విచక్రవాహనాలకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో దాదాపు 150 వాహనాలు అగ్నికి ఆహుతైనట్లు స్థానిక ఎస్పీ అనంత్కుమార్ వెల్లడించారు.
ఆ ప్రాంతమంతా దట్టంగా పొగ కమ్ముకుంది. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. కారులో మంటలు చెలరేగడానికి కారణాలు తెలియరాలేదు. ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ చెప్పారు.