Railway station
-
ప్రపంచంలోనే తొలి 3డీ ప్రింటెడ్ రైల్వేస్టేషన్
టోక్యో: ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 3డీ ప్రింటెడ్ రైల్వేస్టేషన్ నిర్మాణానికి జపాన్లోని ఓ రైల్వే ఆపరేటింగ్ సంస్థ శ్రీకారం చుట్టింది. ఈ స్టేషన్ చుట్టకొలత 108 చదరపు అడుగులు. జపాన్లో జనాభా పరంగా మూడో అతిపెద్ద నగరమైన ఒసాకా నుంచి 60 మైళ్ల దూరంలోని దక్షిణ వకయామ ప్రావిన్స్లో ఈ స్టేషన్ను నిర్మించబోతున్నట్లు వెస్ట్ జపాన్ రైల్వే(జేఆర్ వెస్ట్) సంస్థ తాజాగా ప్రకటించింది. ప్రస్తుతం ఇక్కడ కలపతో నిర్మించిన రైల్వే కాంప్లెక్స్ ఉంది. అది చాలావరకు దెబ్బతినడంతో పూర్తిగా కూల్చివేసి 3డీ ప్రింటెడ్ స్టేషన్ నిర్మించాలని నిర్ణయించారు. ఈ కొత్త స్టేషన్ చిత్రాలను ఇప్పటికే విడుదల చేశారు. ఈ నెల 25వ తేదీ తర్వాత నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. సెరెండిక్స్ అనే నిర్మాణ సంస్థ సైతం ఇందులో భాగస్వామిగా మారుతోంది. 3డీ ప్రింటింగ్ టెక్నాలజీలో ఈ సంస్థకు మంచి అనుభవం ఉంది. కొత్త టెక్నాలజీతో రైల్వే స్టేషన్నిర్మాణం కేవలం ఆరు గంటల్లో పూర్తి కానుంది. జపాన్లో ప్రస్తుతం పనిచేసే సామ ర్థ్యం కలిగిన యువత సంఖ్య తగ్గుతోంది. వృద్ధు ల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో శ్రామిక శక్తి అందుబాటులో లేకుండాపోతోంది. అందుకే తక్కువ సమయంలో నిర్మాణాలు పూర్తయ్యే టెక్నాలజీపై జపాన్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ సాయంతో తక్కువ మంది కార్మికులతో నిర్మాణాలు చకచకా పూర్తి చేయొచ్చు. ఇందులో భవనం విడిభాగాలను ముందుగానే తయారు చేస్తారు. నిర్మాణ స్థలానికి తీసుకెళ్లి వాటిని బిగించేస్తారు. -
తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాప్రెడ్డి పేరు
సాక్షి, హైదరాబాద్: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరును ప్రతిపాదిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు సోమవారం శాసనసభ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి పక్షాన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సోమవారం ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లు ప్రవేశపెట్టడానికి కారణాలపై సీఎం రేవంత్రెడ్డి సభలో ప్రకటన చేశారు. తెలుగు వర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరును తొలగించడాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్ సహా పలువురు తీవ్రంగా వ్యతిరేకించిన నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చారు. పొట్టి శ్రీరాములును తక్కువగా చూడటం లేదు ‘పొట్టి శ్రీరాములు చేసిన కృషిని ఎవరూ తక్కువగా చూడటం లేదు. వారి ప్రాణ త్యాగాన్ని అందరూ స్మరించుకోవాలి. పరిపాలనలో భాగంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన వారిని స్మరించుకుని వారి పేర్లు పెట్టుకున్నాం. రాష్ట్ర పునరి్వభజన తర్వాత గత పదేళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే కొందరు కొన్ని వర్గాల్లో అపోహలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర పదవుల్లో ఉన్నవారు కూడా ఇలా చేయడం సమంజసం కాదు.ఉమ్మడి రాష్ట్రంలో హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరుండేది. రాష్ట్ర విభజన తర్వాత ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఏపీకి వెళ్లగా తెలంగాణలో హెల్త్ యూనివర్సిటీకి కాళోజీ పేరు పెట్టుకున్నాం. ఇది ఎన్టీఆర్ను అగౌరవపరిచినట్టు కాదు. రాష్ట్ర విభజన తర్వాత ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీకి ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టుకున్నాం. వైఎస్ పేరుతో ఉన్న హార్టీకల్చర్ యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకున్నాం. వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీకి పీవీ నరసింహారావు పేరును పెట్టుకున్నాం. ఇదే కోవలో తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాప్రెడ్డి పేరు పెట్టుకున్నాం. వ్యక్తులను అగౌరవ పరిచేందుకు కాదు.. ఏపీలో ఆ పాత పేర్లతో యూనివర్సిటీలు, సంస్థలు కొనసాగనున్నందున తెలంగాణలో కూడా అవే పేర్లతో ఉంటే పరిపాలనలో గందరగోళం ఏర్పడే అవకాశం ఉన్నందున మార్చుకుంటున్నాం. అంతే కానీ వ్యక్తులను అగౌరవపరిచేందుకు కాదు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు బాధ్యతాయుత పదవుల్లో ఉన్న కొందరు కులాన్ని ఆపాదిస్తున్నారు. కుల, మత ప్రాతిపదికన విభజించి రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకోవటం తప్పు. గుజరాత్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరుతో ఉన్న స్టేడియంకు ఆయన పేరు తొలగించి నరేంద్ర మోదీ పేరు పెట్టారు. మేం అలాంటి తప్పిదాలు చేయలేదు..’అని రేవంత్ చెప్పారు. నేచర్క్యూర్ ఆసుపత్రికి రోశయ్య పేరు ‘మాకు ఆర్యవైశ్యులపై, పెద్దలు పొట్టి శ్రీరాములుపై అపార గౌరవం ఉంది. ఆయన త్యాగాలు, ఆయన దేశభక్తిని సమున్నతంగా స్మరించుకునేలా.. ఇటీవలే ఘనంగా ప్రారంభించుకున్న చర్లపల్లి రైల్వే టెరి్మనల్కు ఆయన పేరు పెట్టుకుందాం. ఈ మేరకు కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్లకు లేఖ రాస్తా. ఇక మాజీ సీఎం కె.రోశయ్య ఇంటికి చేరువలోనే ఉన్న ప్రభుత్వ నేచర్ క్యూర్ ఆసుపత్రికి రోశయ్య పేరు పెట్టడంతో పాటు ఆవరణలో ఆయన విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.ఆయన జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తాం. ఇక సురవరం ప్రతాపరెడ్డి మహనీయుడు. తెలంగాణలో కవులు లేరు అంటూ అపహాస్యం చేసిన పరిస్థితిలో 354 మంది ఉద్ధండ కవులతో సమావేశమై గోల్కొండ పత్రికలో వారి ప్రతిభకు పట్టం కట్టి తెలంగాణ కవుల గొప్పదనాన్ని చాటారు. నిజాంకు వ్యతిరేకంగా గొప్పగా పోరాడిన ధీశాలి..’అని సీఎం వివరించారు. తెలుగుజాతి త్యాగాన్ని అవమానించడమే: బీజేపీతెలుగు వర్సిటీ పేరు మార్పును బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. ‘పొట్టి శ్రీరాములు ఓ ప్రాంత నేత కాదు. ఆయన గాం«దీజీతో కలిసి జాతీయోద్యమంలో పాల్గొన్నారు. మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విముక్తి కోసం ప్రాణత్యాగం చేశారు. అలాంటి మహనీయుడి పేరును తొలగించటం అంటే తెలుగు జాతి త్యాగాన్ని అవమానపరచటమే.సురవరం ప్రతాపరెడ్డి పేరును.. నిజాంకు గుర్తుగా ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ పేరును మార్చి దానికి పెట్టాలి..’అని బీజేపీ సభ్యుడు ధన్పాల్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. అహ్మదాబాద్లోని స్టేడియానికి సర్దార్ పటేల్ పేరును తొలగించారన్న ఆరోపణ సరికాదని, స్టేడియం ప్రాంగణానికి ఆయన పేరే ఉందని, అక్కడి క్రికెట్ గ్రౌండ్కు మాత్రమే నరేంద్ర మోదీ పేరు పెట్టారని ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్రెడ్డి చెప్పారు. -
రైలు ప్రమాదాల నివారణకు కొత్త టెక్నాలజీ
-
ఆ మహానగరంలో 11 అంతస్థుల రైల్వే స్టేషన్
ముంబై: భారతీయుల కలల నగరం ముంబై(Mumbai) త్వరలో మరో ఖ్యాతిని కూడా దక్కించుకోబోతోంది. ముంబైలోని థానేలో 11 అంతస్థుల రైల్వే స్టేషన్ నిర్మితం కానుంది. ఈ రైల్వే స్టేషన్లో కేవలం రైళ్ల రాకపోకలే కాకుండా ప్రయాణికులకు వినోదాన్ని అందించే పలు వేదికలు కూడా సిద్ధం కానున్నాయి. ఈ రైల్వే స్టేషన్ పైభాగంలో అద్భుతమైన మాల్, ఆఫీస్ స్పేస్, రిటైల్ షాపులు కూడా ఉండనున్నాయి. ఈ ప్రాజక్టు పూర్తయితే రైల్వేశాఖకు భారీగా ఆదాయం సమకూరనుంది.థానే రైల్వే స్టేషన్(Thane Railway Station)లోని 10ఏ ప్లాట్ఫారంలో తొమ్మిది వేల చదరపు మీటర్ల ప్రాంతాన్ని ఈ ప్రాజెక్టుకు కేటాయించనున్నారు. దీనితోపాటు 24,280 చదరవు మీటర్ల ప్రాంతాన్ని లీజుకు తీసుకోనున్నారు. ఈ లీజు 60 ఏళ్ల పాటు కొనసాగనుంది. ఈ ప్రాజెక్టును 2026, జూన్ 30 నాటికి పూర్తిచేయాలని రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రైల్వే స్టేషన్కు బస్సులు, మెట్రో సేవలను అనుసంధానించనున్నారు.రైల్వే స్టేషన్ బేస్మెంట్(Basement)లో పార్కింగ్ సౌకర్యం కూడా కల్పించనున్నారు. ఇక్కడి నుంచే లోకల్ బస్సులు ఎక్కే అవకాశం కల్పించనున్నారు. పైఫ్లోర్లో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించనున్నారు. ఇక్కడ ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు ఏర్పాటు చేయనున్నారు. కోచింగ్ ఇన్స్టిట్యూట్ల ఏర్పాటుకు కూడా అనుమతి ఇవ్వనున్నారు. ఇది కూడా చదవండి: Holi 2025: ఈ దేశాల్లోనూ అంబరాన్నంటే హోలీ వేడుకలు -
‘అద్దాలు పగులగొడితే.. ఈడ్చుకెళ్లాల్సిందే’
యూపీలో జరుగుతున్న కుంభమేళా నిర్వహణ విషయంలో ప్రభుత్వం ఎంత పకడ్బందీగా వ్యవహరిస్తున్నప్పటికీ, కొన్ని విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తొలుత ప్రయాగ్రాజ్లో తొక్కిసలాట, తాజాగా న్యూఢిల్లీలో తొక్కిసలాట.. ఈ రెండూ ఉదంతాలకు అధికారుల వైఫల్యమే కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. వీటిపై సోషల్ మీడియాలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలావుండగా కుంభమేళాకు వెళుతున్న రైలుకు సంబంధించిన ఒక వీడియో వైరల్గా మారింది. Pakda gya 🐒 (Police Caught a guy who was trying to break the Door of train) pic.twitter.com/NPGHMUXxc6— Ghar Ke Kalesh (@gharkekalesh) February 16, 2025ఆ వీడియోలో కొందరు ప్రయాణికులు స్టేషన్కు వచ్చిన రైలు డోర్ లాక్ అయి ఉండటాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. ఒక యువకుడు అసహనంతో రగిలిపోతూ, గట్టిగా కొడుతూ, రైలు కోచ్ అద్దాలను పగులగొట్టే ప్రయత్నం చేస్తాడు. దీనిని గమనించిన ఒక రైల్వే పోలీసు ఆ యువకుని షర్టు కాలర్ పట్టుకుని, కొడుతూ లాక్కెళుతున్న దృశ్యాన్ని వీడియోలో చూడవచ్చు. ఈ వీడియోను చూసిన కొందరు యూజర్స్ పోలీసుల చర్యను మెచ్చుకుంటున్నారు. అద్దాలు పగులగొట్టేవారిని అలా ఈడ్చుకెళ్లాల్సిందేనంటూ సలహా ఇస్తున్నారు. ఇది కూడా చదవండి: Railway Station Stampede: ప్లాట్ఫారం టిక్కెట్ల విక్రయాలు నిలిపివేత -
Railway Station Stampede: ప్లాట్ఫారం టిక్కెట్ల విక్రయాలు నిలిపివేత
న్యూఢిల్లీ: దేశరాజధానిలోని న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాట జరిగిన దరిమిలా రైల్వే అధికారులు స్టేషన్లో భద్రతను మరింత కట్టదిట్టం చేశారు. ప్రయాణికుల రద్దీ ఏర్పడకుండా చర్యలు చేపట్టారు. సోమవారం మరోమారు రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ ఏర్పడటాన్ని చూసిన అధికారులు ప్లాట్ఫారం టిక్కెట్లు విక్రయాలను నిలిపివేశారు.న్యూఢిల్లీ రైల్వే అధికారులు మీడియాతో మాట్లాడుతూ ప్రయాణికు సంఖ్య తగ్గాకనే ప్లాట్ఫారం టిక్కెట్లను విక్రయిస్తామని తెలిపారు. ప్రయాణికులు రద్దీని నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్లాట్ఫారం టిక్కెట్ల కౌంటర్ దగ్గర ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక పోస్టర్ అతికించారు. దానిలో ప్లాట్ఫారం టిక్కెట్ల విక్రయాలను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఆన్లైన్లో ప్లాట్ఫారం టిక్కెట్లను విక్రయిస్తున్నారా? లేదా అనేది తెలియరాలేదు. కాగా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది మృతిచెందారు. ఇది కూడా చదవండి: రైల్వే స్టేషన్ తొక్కిసలాట: ఏడేళ్ల రియా ప్రాణాలు కోల్పోయిందిలా.. -
ఢిల్లీ తొక్కిసలాట ఘటనపై విచారణ ముమ్మరం
-
తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ఎక్స్రేగ్రేషియా
-
తొక్కిసలాట జరిగినా మారలేదు..!మళ్లీ గందరగోళమే..
న్యూఢిల్లీ:దేశ రాజధాని న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాట జరిగి 18 మంది మృతి చెందిన తర్వాత కూడా పరిస్థితి మారలేదు. మరుసటి రోజు ఆదివారం(ఫిబ్రవరి16) కూడా రైల్వేస్టేషన్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.దీనికి కారణం సీట్ల కోసం ప్రయాణికులు ముందు వెనుకా చూసుకోకుండా మిగిలిన వారిని తోసుకుంటూ వెళ్లి రైళ్లు ఎక్కడమే కారణం.శనివారం సాయంత్రం తొక్కిసలాట జరిగిన చోటుకు దగర్లోనే ప్లాట్ఫాం నంబర్ 16 దగ్గర బీహార్ సంపర్క్ క్రాంతి రైలు కోసం ప్రయాణికులు మళ్లీ ఎగబడ్డారు.భారీ లగేజ్ పట్టుకుని ఒకరిని ఒకరు తోసుకుంటూ ఎలాగైనా రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తూ బీభత్సం సృష్టించారు. ఒక ముసలావిడనైతే ఎమర్జెన్సీ కిటికి నుంచి రైలులోకి నెట్టడానికి ప్రయత్నించగా ఆమె అందులో ఇరుక్కుపోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రైలు డోర్ దగ్గర ఆ ముసలావిడ ఎక్కలేని పరిస్థితి ఉండడం వల్లే ఆమెను ఎమర్జెన్సీ కిటికీ నుంచి నెట్టారు.ఇంతేకాకుండా దర్బంగా వెళ్లే రైలు ప్లాట్ఫాంపైకి రాగానే రైలులోకి ఎక్కేందుకు రిజర్వేషన్లేని, రిజర్వేషన్ కన్ఫామ్ కాని ప్రయాణికులు ఒక్కసారిగా ఎగబడ్డారు.ఎమర్జెన్సీ కిటీకిలో నుంచి లగేజ్లను విసురుతూ సీట్లు ముందుగానే ఆపేందుకు ప్రయత్నించారు.ఈ క్రమంలోనే అడ్డొచ్చిన వారిని నెట్టివేయడం గందరగోళానికి దారి తీసింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ రైల్వేప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్)కు సంబంధించిన ఒక్క పోలీసు లేకపోవడం న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో ఉన్న దారుణమైన పరిస్థితులను అద్దం పడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఢిల్లీ రైల్వే స్టేషన్ ఘటనపై మోదీ దిగ్భ్రాంతి
-
ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాటకు కారణాలు..
-
విషాదం.. ఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాట (ఫోటోలు)
-
రాజధానిలో ఘోరం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఘోరం జరిగింది. మహాకుంభమేళాకు వెళ్లేందుకు వచ్చిన భక్తులతో కిక్కిరిసిన న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాట జరిగి 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 10 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని వార్తలొచ్చాయి. శనివారం రాత్రి 9.55 గంటలకు 13, 14వ నంబర్ ప్లాట్ఫామ్ల వద్ద ఈ తొక్కిసలాట జరిగింది. ఘటనాస్థలిలో భక్తుల బ్యాగులు, దుస్తులు, చెప్పులు చెల్లాచెదురుగా పడ్డాయి. భయంతో జనం తమ చిన్నారులను భుజాలపైకి ఎత్తుకుని, బ్యాగులు పట్టుకుని పరుగెడుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. తొక్కిసలాటకు కారణాలపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన వెల్లడి కాలేదు. అయితే ఢిల్లీ నుంచి ప్రయాగ్రాజ్కు వెళ్లాల్సిన రెండు రైళ్లు ఆలస్యంగా రావడంతో అప్పటికే వేచిఉన్న భక్తులు త్వరగా ఎక్కేందుకు ప్రయత్నించడం, కిక్కిరిసిన జనం కారణంగా తొక్కిసలాట జరిగినట్టు వార్తలొచ్చాయి. ఊపిరాడక స్పృహ తప్పిన కొందరిని సమీప ఆస్పత్రులకు తరలించారు. దాదాపు 12 మందిని లోక్నాయక్ జైప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. విషయం తెలిసిన వెంటనే అగి్నమాపక సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్టు ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ చీఫ్ అతుల్ గార్గ్ చెప్పారు. ఘటనపై రైల్వే డీసీపీ కేపీఎస్ మల్హోత్రా ట్లాడారు. ‘‘14వ నంబర్ ప్లాట్ఫామ్ ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ రైలు ఆగి ఉన్నప్పుడు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు అక్కడ వేచి ఉన్నారు. అదే సమయానికి రావాల్సిన స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. వాటిని ఎక్కాల్సిన ప్రయాణికులు 12, 13, 14వ నంబర్ ప్లాట్ఫామ్లపై వేచి ఉన్నారు. దీంతో ప్లాట్ఫామ్లపై జనం ఊహించనంతగా పెరిగిపోయి చివరకు 14వ నంబర్ ప్లాట్ఫామ్, 16వ నంబర్ ప్లాట్ఫామ్ ఎస్కలేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. కమర్షియల్ మేనేజ్మెంట్ ఇన్స్పెక్టర్(సీఎంఐ) తెలిపిన వివరాల ప్రకారం రైల్వేస్ ప్రతి గంటకు 1,500 టికెట్లు విక్రయించింది. ఊహించనంతగా ప్రయాణికులు వచ్చారు.అందుకే పరిస్థితి అదుపు తప్పింది’’ అని డీసీపీ మల్హోత్రా చెప్పారు. ఘటనపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. పరిస్థితి ఇప్పుడు అదుపులోనే ఉంది. ఘటనాస్థలికి వెంటనే రైల్వే పోలీస్, ఢిల్లీ పోలీస్, సీఆర్పీఎఫ్ బలగాలు వెంటనే చేరుకున్నాయి. వారాంతం కావడంతో అధికంగా వచ్చిన భక్తుల రాకపోకల కోసం అదనపు రైళ్లను నడుపుతున్నాం’’ అని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ‘ఎక్స్’లో ఒక పోస్ట్చేశారు. -
Republic Day 2025: మువ్వన్నెల రైల్వే స్టేషస్లు.. మురిసిపోతున్న ప్రయాణికులు
గణతంత్ర వేడుకల సందర్భంగా దేశమంతా త్రివర్ణమయంగా మారిపోయింది. దీనిలో భాగంగా భారతీయ రైల్వే వివిధ రైల్వేస్టేషన్లను అందంగా ముస్తాబు చేసింది. వీటిని చూసిన ప్రయాణికులు మురిసిపోతున్నారు.అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ త్రివర్ణ పతాక కాంతిలో వెలుగొందుతోంది. రామాలయ నిర్మాణం తర్వాత, దేశం నలుమూలల నుండి భక్తులు ఇక్కడికి తరలి వస్తున్నారు.అస్సాంలోని కామాఖ్య జంక్షన్ను కూడా త్రివర్ణ దీపాలతో అలంకరించారు. కామాఖ్య దేవి ఆలయాన్ని సందర్శించడానికి దేశం నలుమూలల నుండి భక్తులు ఇక్కడికి తరలివస్తారు.ప్రధాని మోదీ పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలోని రైల్వే స్టేషన్ను కూడా త్రివర్ణ దీపాలతో అలంకరించారు. ఇక్కడికి విదేశాల నుండి కూడా పర్యాటకులు తరలివస్తారు. త్రివర్ణ పతాక కాంతిలో వారణాసి రైల్వే స్టేషన్ చాలా అందంగా కనిపిస్తోంది.దేశ రాజధాని న్యూఢిల్లీలో నేడు గణతంత్ర దినోత్సవ ప్రధాన వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ను త్రివర్ణ దీపాలతో అలంకరించారు.గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ను కూడా త్రివర్ణ దీపాలతో అలంకరించారు.ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో రైల్వే స్టేషన్ పూర్తిగా త్రివర్ణ లైట్లతో అలంకరించారు. రైల్వే స్టేషన్ మొత్తాన్ని త్రివర్ణ పతాకంలోని మూడు రంగుల లైట్లతో అలంకరించారు.ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ రైల్వే స్టేషన్ను కూడా త్రివర్ణ దీపాలతో అలంకరించారు. త్రివర్ణ పతాక కాంతిలో ఝాన్సీ రైల్వే స్టేషన్ మిలమిలా మెరిసిపోతోంది.ప్రధాని మోదీ సొంత జిల్లా మెహ్సానాలోని రైల్వే స్టేషన్ను కూడా త్రివర్ణ దీపాలతో అలంకరించారు.ఇది కూడా చదవండి: దేశ ప్రజలకు ప్రధాని మోదీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు -
ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్గా గుర్తింపు పొందింది. దీని నిర్మాణం 1913లో పూర్తయింది. ఈ నిర్మాణంలో భాగంగా రెండు భూగర్భ స్థాయుల్లో 44 ప్లాట్ఫామ్లు, 67 ట్రాక్లు ఉన్నాయి. ఈ ఐకానిక్ స్టేషన్ గురించి కొన్ని ఆసక్తికర అంశాలు తెలుసుకుందాం.ఆకట్టుకునే మౌలిక సదుపాయాలు44 ప్లాట్ఫామ్లు: ఈ స్టేషన్లో రెండు స్థాయుల్లో మొత్తంగా 44 ప్లాట్ఫామ్లున్నాయి. ఇది ఒకేసారి 44 రైళ్లను నడిపే సామర్థ్యాన్ని కలిగి ఉంది.67 ట్రాక్లు: ఈ ట్రాక్లు రెండు భూగర్భ స్థాయిల్లో విస్తరించి ఉన్నాయి. వీటిలో ఎగువ స్థాయిలో 41, దిగువ స్థాయిలో 26 ఉన్నాయి.రోజువారీ రద్దీ: గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ ప్రతిరోజూ 1,50,000 మందికి పైగా ప్రయాణిలకు తమ గమ్యస్థానలను చేరుస్తుంది. రోజూ సుమారు 660 మెట్రో-నార్త్ రైళ్లు ఈ స్టేషన్ గుండా ప్రయాణిస్తాయి.నిర్మాణ సౌందర్యం: ఈ స్టేషను అద్భుతమైన ‘బీక్స్-ఆర్ట్స్ ఆర్కిటెక్చర్’కు ప్రసిద్ధి చెందింది. 2,500 నక్షత్ర ఆకృతులతో అద్భుతమైన సీలింగ్ డిజైన్ను కలిగి ఉంటుంది.సీక్రెట్ ప్లాట్ఫామ్గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్లో ఎక్కువ ప్రాచుర్యం పొందని విషయాల్లో ఒకటి సీక్రెట్ ప్లాట్ఫామ్. ట్రాక్ 61 పరిధిలో రహస్య వేదిక ఉన్నట్లు సమాచారం. ఇది వాల్డోర్ఫ్ ఆస్టోరియా హోటల్ క్రింద ఉంది. ఈ వేదికను అప్పటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి.రూజ్ వెల్ట్ కోసం నిర్మించినట్లు తెలిసింది. తద్వారా అతను న్యూయార్క్ నగరం, వాషింగ్టన్ డీసీ మధ్య రహస్యంగా ప్రయాణించేవారని కొన్ని సంస్థలు వెల్లడించాయి. అయితే ఆ ట్రాక్ పరిధిలోకి సాధారణ ప్రజలకు ఇప్పటికీ నిషేధం ఉంది.ఇదీ చదవండి: కేబీసీ తొలి విజేత.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా..?చారిత్రక ప్రాముఖ్యతగ్రాండ్ సెంట్రల్ టెర్మినల్కు ఒక రవాణా కేంద్రంగా మాత్రమే కాకుండా ముఖ్యమైన సాంస్కృతిక, చారిత్రక కట్టడంగా గుర్తింపు ఉంది. ఇది అనేక హాలీవుడ్ సినిమాల చిత్రీకరణకు నెలవుగా మారింది. చాలామంది సందర్శకులు నిత్యం ఈ స్టేషన్ను వీక్షిస్తుంటారు. -
కన్నౌజ్ రైల్వే స్టేషన్లో కూలిన పైకప్పు
-
Kannauj: రైల్వే స్టేషన్లో కూలిన నిర్మాణం.. శిథిలాల కింద పలువురు!
లక్నో: ఉత్తరప్రదేశ్లో ప్రమాదం జరిగింది. కన్నౌజ్ రైల్వే స్టేషన్లో నిర్మాణంలో ఉన్న భవనం పైకప్పు కూలిపోయింది. దీంతో పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారమందుకున్న సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. శిథిలాల కింద కనీసం 20 మంది చిక్కుకుని ఉండొచ్చని ప్రాథమిక సమాచారం. ఇప్పటివరకు 12 మందిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని కలెక్టర్(DM) శుభ్రాంత్ కుమార్ శుక్ల్ తెలిపారు. కన్నౌజ్ రైల్వే స్టేషన్లో ఆధునికీకరణ పనుల్లో భాగంగా పలు నిర్మాణాలు చేపట్టారు. ఈ క్రమంలోనే శనివారం మధ్యాహ్నం రెండో అంతస్తులో ఉన్న పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. భారీ శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో 35 మంది కూలీలు అక్కడ ఉన్నట్లు సమాచారం.ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్య సాయం అందించాలని ఆదేశించారు. -
పల్లెకు పోదాం చలో చలో (ఫొటోలు)
-
అధిక ప్లాట్పారంలున్న రైల్వే స్టేషన్లివే.. చర్లపల్లి స్థానం ఎక్కడ?
తెలంగాణలోని హైదరాబాద్కు చర్లపల్లి రైల్వేస్టేషన్ మరో మణిహారంగా మారింది. అత్యాధునిక సదుపాయాలతో మొత్తం తొమ్మది ప్లాట్ఫారంలతో ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. ఈ నేపధ్యంలో దేశంలో అత్యధిక ప్లాట్ఫారంలు కలిగిన రైల్వే స్టేషన్ల గురించి చాలామంది చర్చించుకుంటున్నారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.ప్లాట్ఫారంల సంఖ్య, విస్తీర్ణం పరంగా దేశంలో అతిపెద్ద రైల్వే స్టేషన్ కోల్కతాలోని హౌరా జంక్షన్. రైల్వే మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ప్రకారం దేశంలోని రైల్వే లైన్ల మొత్తం పొడవు 1,50,368 కిలోమీటర్లు. భారతదేశంలోని అతిపెద్ద రైల్వే స్టేషన్లు, వాటి ప్రత్యేకతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.టాప్-6 రైల్వేస్టేషన్లుహౌరా జంక్షన్ రైల్వే స్టేషన్ప్రారంభమైన సంవత్సరం: 1854స్టేషన్ కోడ్: హెచ్డబ్ల్యుహెచ్స్థానం: హౌరా, పశ్చిమ బెంగాల్ప్లాట్ఫారమ్ల సంఖ్య: 23రోజువారీ ప్రయాణికులు: 10 లక్షలకు పైగా..కనెక్టివిటీ: ఇది భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానమై ఉంది.ఆకర్షణలు: హౌరా వంతెన, ప్రిన్సెప్ ఘాట్, బేలూర్ మఠంపశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఉన్న హౌరా రైల్వే స్టేషన్ భారతదేశంలోని అత్యంత పురాతన రైల్వే స్టేషన్లలో ఒకటి. దేశం మొత్తాన్ని రైలు మార్గం ద్వారా ఈ స్టేషన్ అనుసంధానిస్తుంది. ఈ స్టేషన్ తూర్పు భారతదేశాన్ని మిగిలిన రైల్వే వ్యవస్థతో అనుసంధానించడంలో ప్రధాన భూమిక వహిస్తోంది.సీల్దా రైల్వే స్టేషన్చిరునామా: కోల్కతా, పశ్చిమ బెంగాల్స్టేషన్ కోడ్: ఎస్డీఏహెచ్ప్లాట్ఫారంల సంఖ్య: 21రోజువారీ ప్రయాణికులు: 12 లక్షలకు పైగాకనెక్టివిటీ: ఇది కోల్కతాలోని ప్రధాన రైల్వే టెర్మినల్. భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ఇక్కడి నుంచి అనుసంధానం ఉంది. కోల్కతా మెట్రోకు కూడా ఇక్కడి నుంచి కనెక్టివిటీ ఉంది.ఆకర్షణలు: హౌరా వంతెన, విక్టోరియా మెమోరియల్, ఇండియన్ మ్యూజియం.సీల్దా స్టేషన్.. కోల్కతా నగరంలోని మరొక ప్రసిద్ధ రైల్వే స్టేషన్. దీనికి చరిత్రలో ఘనమైన స్థానం ఉంది. ఇక్కడి నుండి నగరాన్ని చుట్టుముట్టి రావడం చాలా సులభం. ఇది పశ్చిమ బెంగాల్లోని కోల్కతా మెట్రో లైన్ 2లో ఒక స్టాప్.ఛత్రపతి శివాజీ స్టేషన్ప్రారంభమైన సంవత్సరం: 1887స్టేషన్ కోడ్: సీఎస్ఎంటీఎక్కడుంది: ఛత్రపతి శివాజీ టెర్మినస్ ఏరియా, ఫోర్ట్, ముంబై, మహారాష్ట్రప్లాట్ఫారంల సంఖ్య: 18రోజువారీ ప్రయాణికులు: ఏడు లక్షలుకనెక్టివిటీ: ఛత్రపతి శివాజీ టెర్మినస్ భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానమై ఉంది. ముంబై మెట్రోకు కనెక్టివిటీ ఉంది.ఆకర్షణలు: గేట్వే ఆఫ్ ఇండియా, తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్, కోలాబా కాజ్వే, ఎలిఫెంటా గుహలుమహారాష్ట్రలోని ముంబైలో ఛత్రపతి శివాజీ టెర్మినస్ ఒక చారిత్రక రైల్వే స్టేషన్. పూర్వం దీనిని విక్టోరియా టెర్మినస్ అని పిలిచేవారు. 2004లో యునెస్కో దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ప్రారంభమైన సంవత్సరం: 1873స్టేషన్ కోడ్: ఎంఏఎస్చిరునామా: కన్నప్పర్ తిడల్, పెరియమెట్, చెన్నై, తమిళనాడుప్లాట్ఫారమ్ల సంఖ్య: 22 (మెయిన్ లైన్ రైళ్లకు 17, సబర్బన్ రైళ్లకు 5)రోజువారీ ప్రయాణికులు: 3,50,000కనెక్టివిటీ: చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు రైలు ద్వారా అనుసంధానమై ఉంది. ఆకర్షణలు: మెరీనా బీచ్, కపాలీశ్వర్ ఆలయం, ప్రభుత్వ మ్యూజియంచెన్నైలోని ఈ స్టేషన్ నగరానికి ప్రత్యేక గుర్తింపుగా మారింది. ఈ స్టేషన్ నుంచి దేశమంతటీకీ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. కోల్కతా, ఢిల్లీ, ముంబై వంటి నగరాలతో నేరుగా కనెక్టివిటీ ఉన్నందున, ఈ స్టేషన్ దక్షిణ భారతదేశానికి ప్రధాన ద్వారంగా నిలిచింది.న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ప్రారంభమైన సంవత్సరం: 1956స్టేషన్ కోడ్: ఎన్డీఎల్ఎస్చిరునామా: అజ్మేరి గేట్, పహడ్గంజ్, న్యూఢిల్లీప్లాట్ఫారంల సంఖ్య: 16రోజువారీ ప్రయాణికులు: ఐదు లక్షలుకనెక్టివిటీ: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానమైవుంది. ఇది ఢిల్లీ మెట్రోకు కనెక్ట్ అయివుంది.ఆకర్షణలు: ఇండియా గేట్, రాష్ట్రపతి భవన్, హుమాయున్ సమాధి, కుతుబ్ మినార్, జామా మసీదు.న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ అనేది రాజధాని ఎక్స్ప్రెస్కు నిలయం. ఈ స్టేషన్కు ప్రపంచంలోని అతిపెద్ద రూట్ రిలే ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఉంది. సౌకర్యాల పరంగా కూడా ఈ స్టేషన్ ముందుంది. ఈ స్టేషన్ కూడా ఢిల్లీ మెట్రోకు అనుసంధానమైవుంది.ఇది కూడా చదవండి: Business Idea: చలికాలంలో అల్లం వ్యాపారం.. జేబుకు ‘వెచ్చదనం’.. లక్షల్లో ఆదాయం -
ప్రారంభానికి సిద్ధమైన చర్లపల్లి రైల్వే టెర్మినల్
-
త్వరలోనే భారత్కు బుల్లెట్ ట్రైన్: మోదీ
Charlapalli Railway Station Terminal Inaugurate Updates..👉 చర్లపల్లి రైల్వే టెర్మినల్ను ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ..చర్లపల్లి రైల్వే టెర్మనల్తో సౌకర్యవంతమైన ప్రయాణం సాధ్యమవుతుంది.వికసిత్ భారత్ సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం.రైల్వే ఆధునీకరణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం.ప్రతీ రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి జరుగుతోంది.నాలుగు విభాగాల్లో రైల్వేలను అభివృద్ధి చేస్తున్నాం.మారుమూల ప్రాంతాల అభివృద్దే మా లక్ష్యం.రైల్వేలో మౌలిక సదుపాయాల కల్పన అత్యాధునికంగా, శరవేగంగా జరుగుతోంది.వందే భారత్, అమృత్ భారత్, నమో భారత్ రైళ్లును ప్రవేశపెట్టాం.త్వరలోనే భారత్లో బుల్లెట్ ట్రైన్ కల సాకారం అవుతుంది.కోట్లాది మంది ప్రజలను వందే భారత్ రైళ్లు గమ్య స్థానాలకు చేర్చుతున్నాయి.గడిచిన పదేళ్లలో 30వేల కిలోమీటర్ల రైల్వే లైన్లను నిర్మించాం.భారత రైల్వేలకు బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తున్నాం. #WATCH | Prime Minister Narendra Modi says, "...Our country has now over 1000 km of metro network... The projects that have been inaugurated today - for Telangana, Odisha and Jammu & Kashmir - it's a huge milestone in connectivity. It shows that the country is moving ahead… pic.twitter.com/Nyu2SIa224— ANI (@ANI) January 6, 2025 👉 రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవానికి వర్చువల్గా హాజరైన ప్రధాని మోదీ, సీఎం రేవంత్. #WATCH | PM Narendra Modi inaugurates and lays the foundation stone of multiple railway projects, virtuallyThe PM inaugurates New Jammu Railway Division, Charlapalli New Terminal Station in Telangana and lays the foundation stone for the Rayagada Railway Division Building of… pic.twitter.com/0bGiOhwfj2— ANI (@ANI) January 6, 2025తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్స్..చర్లపల్లి టెర్మినల్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందిరైల్వే టెర్మినల్ పూర్తి చేసినందుకు ప్రధాని మోదీకి తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలుబందర్ పోర్ట్ కు రైల్వే లైన్ కు అనుమతి ఇవ్వాలని కోరుతున్నాతెలంగాణ లో డ్రైపోర్ట్ ఏర్పాటు కు ఉపయోగకరంగా ఉంటుందితెలంగాణ ఫార్మా ఇండస్ట్రీకి కేరాఫ్ అడ్రస్ గా ఉందిఎలక్ట్రిక్ వెహికల్ తయారీ కి అనుమతి ఇవ్వాలిరీజనల్ రింగ్ రోడ్డు 374 కిలోమీటర్ల నిర్మాణం జరుగుతోందిరీజనల్ రైల్ అవసరం కూడా ఉందిరైల్ రింగ్ కు అనుమతి ఇవ్వాలని కోరుతున్నావికారాబాద్ నుంచి కొడంగల్ మీదుగా కర్ణాటకకు రైల్వే లైన్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలి.ప్రధాని కోరుకుంటున్న 5ట్రిలియన్ ఎకానమీ సాకారం కావాలంటే అన్ని రాష్ట్రాల అభివృద్ధి జరగాలితెలంగాణ రాష్ట్రం కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని కోరుకుంటుందిడ్రైపోర్ట్ ఏర్పాటు చేస్తే రాష్ట్రాభివృద్ధికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది1ట్రిలియన్ ఎకానమీ కాంట్రిబ్యూట్ చేసేందుకు మాకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నాను. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కామెంట్స్..రైళ్ల ప్రమాదాలను నివారించే కవచ్ను మారుమూల ప్రాంతాలకు సైతం విస్తరించారు.వందే భారత్తో రవాణా వ్యవస్థలో విప్లవం తీసుకొచ్చారు.రింగ్ రోడ్ దగ్గరలో ఉండడం వల్ల చర్లపల్లి ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది.అద్భుతమైన చర్లపల్లి టెర్మినల్ నిర్మించిన దక్షిణ మధ్య రైల్వే, భారతీయ రైల్వే, ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కామెంట్స్..2021 నుంచి చర్లపల్లి అభివృద్ది పనులు జరిగాయి.తెలంగాణకు ఏది కావాలన్నా కేంద్రం సహాయం అందించింది.చర్లపల్లి అభివృద్ది పనులపై నేను దాదాపు ఆరు సార్లు వచ్చి పర్యవేక్షించానుట్రాఫిక్ సమస్య లేకుండా ఈ స్టేషన్ అందుబాటులో ఉంటుంది.ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయి.చాలా రైళ్లు ఇక్కడి నుంచి నడుస్తాయిఎంఎంటీఎస్ రైళ్లు కూడా ఇక్కడి నుంచే ఘట్ కేసర్ వరకు వెళ్తాయి.720 కోట్ల రూపాయలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ది చేస్తున్నాం1300 రైల్వే స్టేషన్ లు దేశ వ్యాప్తంగా అభివృద్ది జరుగుతుందితెలంగాణ లో సుమారు 40 స్టేషన్లు కేంద్రం ఆధునీకరణ చేస్తోంది.రైలు కూత వినిపించని ప్రాంతాలకు కూడా రైల్వే లైన్లు వేసి రైళ్ల సౌకర్యం కల్పిస్తుంది.రైలు ప్రమాదాలకు చెక్ పెట్టేలా కవచ్ తీసుకొచ్చాంతెలంగాణకు ఐదు వందే భారత్ రైళ్లు వచ్చాయివందే భారత్ స్లీపర్ రైళ్లు కూడా రాబోయే రోజుల్లో వస్తే..ఇక్కడి నుంచి బెంగళూరుకు వెళ్లే రైలు సౌకర్యం మరింత సులభం అవుతుందిలక్ష కోట్లతో జాతీయ రహదారి విస్తరిస్తున్నాంకాజీపేటలో రైల్వే మానుఫాక్చరింగ్ ఫ్యాక్టరీ పనులు జరుగుతున్నాయి.ఎంఎంటీఎస్ రైళ్ల కోసం 1000 కోట్లు గత రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని అడిగాంమేము ఎన్నో సార్లు అడిగినా ఇవ్వలేదు.అయినప్పటికీ మేము ముందడుగు వేసి రైళ్ల రాకపోకలు సాగిస్తున్నాయిఎంఎంటీఎస్ రైళ్లు యాదగిరి గుట్ట వరకు పొడిగించాం.రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించాలి.లక్షల మంది ప్రయాణీకులు యాదగిరిగుట్టకు వెళ్తారు.కాబట్టి ఎంఎంటీఎస్ రైళ్లు వేస్తే సమయం ఆదా అవుతుందికొమరవెల్లి స్టేషన్ కూడా కడుతున్నాం.చర్లపల్లి రైల్వే స్టేషన్కు రావాలంటే అప్రోచ్ రోడ్లు కావాలి.రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించాలిగతంలో ఎన్నోసార్లు కేసీఆర్కు లేఖ రాసినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు.ఇప్పుడున్న ప్రభుత్వమైనా అప్రోచ్ రోడ్లకు కృషి చేయండి.ట్రిపుల్ ఆర్ వస్తుంది.ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ..మోదీ గొప్ప మనసుతో 400కోట్లకు పైగా ఖర్చు చేసి టెర్మినల్ నిర్మించారుగత ప్రభుత్వం హయాంలో రైల్వే స్టేషన్లో దుర్గంధంతో ఉండేవిఇప్పుడు ప్రపంచంతో పోటీ పడేలా రైల్వే స్టేషన్లను నిర్మిస్తున్నారుఅన్ని రైల్వే లైన్లు ఎలక్ట్రికల్ చేసేలా కృషి చేస్తున్నారురైల్వే స్టేషన్లను ఎయిర్ పోర్టులను తలపించేలా నిర్మిస్తున్నారుచర్లపల్లి పారిశ్రామికవాడకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందిమంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్..చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం కావడం సంతోషంతెలంగాణ ఏర్పడ్డ తర్వాత కొత్త రైల్వే లైన్లు కావాలని ఎన్నో ఏళ్లుగా అడిగాంమేము కూడా కేంద్రానికి సాకారం అందించాంఇప్పుడు ప్రారంభించనున్న ఈ టెర్మినల్ కు రైల్వే అప్రోచ్కు మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటాంకేంద్రం కూడా అవసరమైన నిధులు విడుదల చేయాలి.అప్రోచ్ రోడ్లు, ప్రయాణికుల సహకారం కోసం కేంద్రం కొంత సహకరించాలి.రైల్వే నెట్వర్క్ పెంచేలా సహకారం చేయాలి.కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కామెంట్స్..గతంలో రైల్వే స్టేషన్లో కనీస సౌకర్యాలు లేకుండా రైల్వే ట్రాక్స్ వెంట చెత్తాచెదారం నిండిపోయి కంపుకొట్టేదికానీ, ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టాక రైల్వే స్టేషన్లన్నీ క్లీన్ అండ్ గ్రీన్గా మారిపోయాయి.32వేల కోట్లు రైల్వే స్టేషన్లో అభివృద్ది చేసేందుకు కేంద్రం సహకరించింది.అమృత్ స్కీం కింద 2 వేల కోట్లు తెలంగాణలో ఉన్న స్టేషన్లు అభివృద్ది చేస్తున్నాం430 కోట్లతో చర్లపల్లి టెర్మినల్ అభివృద్ది చేసింది.రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు తెలంగాణ అభివృద్ది కలిసి పనిచేయాలి.👉కాసేపట్లో పర్యావరణ అనుకూలంగా నిర్మించిన చర్లపల్లి నూతన రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టెర్మినల్ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కేంద్ర మంత్రులు అశ్వనీ వైష్ణవ్, కిషన్రెడ్డి, సహాయ మంత్రులు సోమన్న, బండి సంజయ్, మంత్రి శ్రీధర్బాబు, దక్షిణమధ్య రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్ తదితరులు పాల్గొనే అవకాశం ఉంది.👉సుమారు రూ. 413 కోట్ల వ్యయంతో చర్లపలి టర్మినల్ నిర్మించారు. వాస్తవానికి గతేడాది డిసెంబర్ 28నే టెర్మినల్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ మరణంతో వారం రోజులు సంతాప దినాలుగా కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఈ టెర్మినల్ అందుబాటులోకి వచ్చాక సికింద్రాబా ద్, హైదరాబాద్, కాచిగూడ స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉండటం వల్ల ప్రయాణికులు నగరంలో ఎక్కడి నుంచైనా సులువుగా ఈ స్టేషన్కు చేరుకునే వీలుంది.ఆధునిక హంగులు.. సదుపాయాలు.. 👉ప్రయాణికుల రాకపోకలకు అనుగుణంగా ఆధునిక హంగులతో చర్లపల్లి రెండవ ప్రవేశద్వారం, నూతన రైల్వే టెర్మినల్ను అభివృద్ధి చేశారు. స్టేషన్లో ఆరు టికెట్ బుకింగ్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. స్త్రీ, పురుషులకు ప్రత్యేక విశ్రాంతి గదులు ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఎగ్జిక్యూటివ్ లాంజ్ ఉంది. మొదటి అంతస్తులో కెఫెటేరియా, రెస్టారెంట్, విశ్రాంతి గదులు ఉన్నాయి. ఒక ప్లాట్ఫాం నుంచి మరో ప్లాట్ఫాంకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రాకపోకలు సాగించేందుకు వీలుగా 12 మీటర్ల వెడల్పుతో ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జితోపాటు 6 మీటర్ల వెడల్పుతో మరో బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. మొత్తం 9 ప్లాట్ఫాంలలో 7 లిఫ్టులు, 6 ఎస్కలేటర్లు ఉన్నాయి. రైళ్ల నిర్వహణ కోసం ఆధునిక కోచ్ డిపోను కూడా నిర్మించారు. బస్బే తోపాటు కార్లు, బైక్లను నిలిపేందుకు విశాల పార్కింగ్ సదుపాయం కల్పించారు. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
హైదరాబాద్ : ముస్తాబైన మరో మణిహారం..చర్లపల్లి నూతన రైల్వే టెర్మినల్ (ఫొటోలు)
-
కుంభమేళాకు సుందరంగా ముస్తాబైన ప్రయాగ్రాజ్
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జనవరి 13నుంచి జరగబోయే మహాకుంభమేళాకు సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి. నగరంలోని ప్రతీప్రాంతాన్ని అధికారులు అందంగా తీర్చిదిద్దుతున్నారు.ఈ నేపధ్యంలో ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్ను అంత్యంత సుందరంగా ముస్తాబు చేశారు. కుంభమేళా సందర్భంగా ప్రయాగ్రాజ్ ప్రతిష్టను మరింతగా పెంచడంలో భారతీయ రైల్వే కూడా గొప్ప పాత్ర పోషిస్తోంది.‘పెయింట్ మై సిటీ’ ప్రచారం పేరిట ప్రయాగ్రాజ్లోని రైల్వేస్టేషన్ను అద్భుత కళ, అందమైన సంస్కృతికి నిలయంగా మార్చారు.స్టేషన్ గోడలపై హిందూ పురాణాలు, భారతీయ సంప్రదాయాలను వర్ణించే అందమైన, ఆకర్షణీయమైన వర్ణచిత్రాలను రూపొందించారు.ప్రయాగ్రాజ్, ప్రయాగ్రాజ్ జంక్షన్, నైని జంక్షన్, ఫఫామౌ, ఝూన్సీ రైల్వే స్టేషన్, రాంబాగ్ రైల్వే స్టేషన్, చివ్కీ రైల్వే స్టేషన్, ప్రయాగ్రాజ్ సంగమ్ రైల్వే స్టేషన్, సుబేదర్గంజ్ రైల్వే స్టేషన్లన్నింటినీ అత్యంత సుందరంగా మలచారు.రైల్వే స్టేషన్ గోడలపై రామాయణం, శ్రీకృష్ణ లీలలు, బుద్ధుడు, శివ భక్తి, గంగా హారతి, మహిళా సాధికారత తదితర చిత్రాలను రూపొందించారు.పలువురు కళాకారులు తమ జీవితానుభవాలను ఈ కళాకృతులలో ప్రతిబింబించారు.ఈ కళాకృతులు భక్తులకు, పర్యాటకులకు ప్రయాగ్రాజ్కు ప్రత్యేకంగా నిలిచిన సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని చూపిస్తాయి. రైల్వేశాఖ చూపిన ఈ చొరవ కేవలం సుందరీకరణకే పరిమితం కాకుండా, ప్రయాగ్రాజ్ చారిత్రక, సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచింది.రైల్వేశాఖ చేపట్టిన ‘పెయింట్ మై సిటీ’ కార్యక్రమం మహా కుంభమేళాను తిలకించేందుకు ప్రయాగ్రాజ్కు వచ్చే ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంది.ఋషి సంప్రదాయం, గురు-శిష్య సంప్రదాయం, జ్ఞానం, త్యాగాలకున్న ప్రాముఖ్యత ఈ కళాకృతులలో కనిపిస్తుంది.ఈ కళాఖండాలు మహాకుంభమేళాకు వచ్చే లక్షలాది మంది భక్తులు, పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.భారతీయ రైల్వే చేస్తున్న ఈ ప్రయత్నం ప్రయాగ్రాజ్ గొప్పతనాన్ని తెలియజేస్తుంది.ఎంతో వైవిధ్యతతో కూడిన ఈ చిత్రాలు అందరినీ విశేషంగా ఆకర్షిస్తున్నాయి.ఇది కూడా చదవండి: బీహార్లోనూ ఎర్రకోట.. చరిత్ర ఇదే -
నీళ్లు పోసి నిద్ర లేపుతున్నారు..
-
విశాఖలో మైనర్ పిల్లల అక్రమ రవాణా.. రక్షించిన పోలీసులు
-
విశాఖ రైల్వే స్టేషన్లో తప్పిన పెను ప్రమాదం
-
భారతదేశంలో రైల్వే స్టేషన్ లేని ఏకైక రాష్ట్రం..ప్రకృతి అందాలకు నెలవు..!
భారతదేశంలో రైల్వేస్టేషన్ లేని రాష్ట్రం ఉందంటే నమ్ముతారా..?. అరచేతిలో ప్రపంచాన్ని చూసేలా టెక్నాలజీ శరవేగంగా దూసుకుపోతున్న రోజుల్లో ఇంకా అలాంటి రాష్ట్రం కూడా ఉందా..? అని ఆశ్చర్యపోకండి. అయితే ఆ ప్రాంతం ప్రకృతి ఒడిలో ఉన్న భూతల స్వర్గంలా అందంగా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రకృతి అందాలకు నెలవు. అలాంటి రాష్ట్రానికి పర్యాటకుల తాకిడి తప్పక ఉంటుంది కదా..! అంటారేమో..అయినప్పటికీ రైల్వే నిర్మాణ సాధ్యం కాలేదు. ఈ ఆధునాత కాలంలో టెక్నాలజీనే శాసించే స్థాయిలో ఉండి కూడా ఎందుకు ఆ రాష్ట్రంలో ఈ రైల్వే నిర్మాణం సాధ్యం కాలేదని సందేహాలు మెదులుతున్నాయి కదూ..! ఇంకెందుకు ఆలస్యం అది ఏ రాష్ట్రం, దాని కథాకమామీషు ఏంటో తెలుసుకుందామా..!.భారతదేశం అత్యంత ప్రశంసనీయమైన రైల్వే నెట్వర్క్ను కలిగి ఉన్న దేశం. అలాంటి దేశంలో రైల్వే లైన్లు లేని రాష్ట్రం కూడా ఉందంటే.. నమ్మశక్యంగా లేదు కదా!. ఈ రాష్ట్రం మన హిమాలయాల ఒడిలో ఉంది. సినిమా వాళ్ల ఫేమస్ లోకేషన్ పాయింట్ కూడా ఇదే. మంచు కొండల్లో పాట అనగానే మనవాళ్లు చకచక వచ్చి వాలిపోయే రాష్టం. అదేనండి సిక్కిం. ఈ రాష్ట్రం చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. ఇక్కడ ఉండే ప్రకృతి రమ్యతకు ఎలాంటి వారైనా పరవశించిపోవాల్సిందే. అంతలా మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. పర్యాటకులు తాకిడి ఎక్కువగా ఉండే ఈ రాష్ట్రానికి ఎందుకు రైల్వే సౌకర్యం లేదంటే..అక్కడ ప్రతికూల వాతావరణమే ఇందుకు ప్రధాన కారణం. ఇక్కడ భూభాగంలో అనేక రకాల ప్రకృతి సవాళ్లు ఉన్నాయి. నిటారుగా ఉండే లోయలు, ఇరుకైన మార్గాలు, ఎత్తైన పర్వతాల వల్ల రైల్వే లైన్లు నిర్మిచడం సాధ్యం కాలేదు.అదీగాక ఇక్కడ తరుచుగా కొండచరియలు విరిగిపడతాయి. అక్కడ ఆ ప్రమాదం అత్యంత సర్వసాధారణం. ఈ పరిస్థితుల దృష్ట్యా ఇంతవరకు రైల్వే నిర్మాణం ఏర్పాట్లు చేయడం సాధ్యం కాలేదు. అయితే ఇప్పుడు అక్కడ పరిస్థితి క్రమంగా మారనుంది. ఇటీవలే మోదీ అక్కడ రైల్వే స్టేషన్కు శంకుస్థాపన చేశారు. నిర్మాణ దశలో ఉన్న ఈ సిక్కిం రంగ్పో స్టేషన్ను టూరిజం, డిఫెన్స్ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తామని చెప్పారు రైల్వే మేనేజర్ అమర్జీత్ అగర్వాల్. ఇక్కడ సరస్సుల ప్రసిద్ధ ఆకర్షణ. తప్పక సందర్శించాల్సిన టూరిజం స్పాట్లు కూడా ఈ సరస్సులే. రత్నాల వలే భూమిలో పొదిగి ఉన్న ఆ సరస్సుల సహజ సౌందర్యం మనల్ని కట్టిపడేస్తుంది. ఈ రాష్ట్రంలో సందర్శించాల్సిన సరస్సులివే..క్రోస్ లేక్, ఉత్తర సిక్కింక్రోస్ లేక్, స్థానికంగా కల్పోఖ్రి సరస్సు అని పిలుస్తారు. ఇది ఉత్తర సిక్కింలో దాచిన రత్నం. 4,260 మీటర్ల ఎత్తులో టిబెటన్ సరిహద్దుకు సమీపంలో ఉంది. చోళము సరస్సు, ఉత్తర సిక్కించోళము సరస్సు, ప్రపంచంలోని ఎత్తైన సరస్సులలో ఒకటి. ఇది 5,330 మీటర్ల ఎత్తులో ఉత్తర సిక్కింలోని ఇండో-చైనా సరిహద్దులో ఉంది.కథోక్ సరస్సు, పశ్చిమ సిక్కింపశ్చిమ సిక్కింలోని ప్రసిద్ధ పట్టణం యుక్సోమ్ సమీపంలో ఉన్న కథోక్ సరస్సు ప్రశాంతమైన ప్రదేశం. ఈ అందమైన సరస్సు చుట్టూ పచ్చదనంతో నిండి ఉంది. ఇది సిక్కిం మొదటి చోగ్యాల్ (రాజు) చారిత్రక పట్టాభిషేకంతో ముడిపడి ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం.(చదవండి: శివపరివారం కొలువుదీరిన మహాపుణ్య క్షేత్రం ఉజ్జయిని) -
రక్తంతో తడిసి ముద్దయిన రైల్వే స్టేషన్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ రైల్వే స్టేషన్లో సంభవించిన భారీ పేలుడులో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. క్వెట్టా రైల్వే స్టేషన్ మొత్తం రక్తంతో తడిసి ముద్దయ్యింది. మృతుల సంఖ్య 25కి చేరిందని, క్షతగాత్రుల్లో ఇంకొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరగవచ్చని అక్కడి అధికారులు తెలిపారు. అసలేం జరిగిందంటే.. క్వెట్టా రైల్వే స్టేషన్ సమీపంలో ఇవాళ ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటి స్టేషన్ పైకప్పు ఎగిరిపోయింది. ప్లాట్ఫారం మీద ఉన్న ప్రయాణికులంతా చెల్లాచెదురుగా పడిపోయారు. పేలుడు సమయంలో రైల్వే స్టేషన్లో జాఫర్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫాం నుంచి పెషావర్కు బయలుదేరడానికి సిద్ధంగా ఉందని.. అదే సమయంలో పేలుడు చోటు చేసుకుందని అక్కడి మీడియా వెల్లడించింది. మరోవైపు.. బలూచ్ లిబరేషన్ ఆర్మీ సంస్థ పేలుడు జరిపింది తామేనని ప్రకటించుకుంది. మానవ బాంబుతో..క్వెట్టా నుంచి పెషావర్కు జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు బయలుదేరే సమయంలో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇప్పటివరకు 25 మంది మృతి చెందారు’ అని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆపరేషన్స్ ముహమ్మద్ బలోచ్ తెలిపారు. మృతుల్లో ఎక్కువగా సైనికులు ఉండడంతో.. వాళ్లనే లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. పేలుడు జరిగిన విధానం బట్టి ఆత్మాహుతి దాడిగా నిర్ధారణకు వచ్చారు. A tragic loss of 24 innocent lives in the suicide attack at Quetta Railway Station in Balochistan. Strongly condemn this cowardly act. Heartfelt condolences to the families of the martyrs and prayers for the swift recovery of the injured. #Quetta pic.twitter.com/NDtlfAhKEn— Azam Joyo A J (@AzamJoyo01) November 9, 2024 #BREAKING: 21 killed and over 30 injured in a bomb blast at Quetta Railway Station in Balochistan. Baloch Liberation Army claims responsibility for the attack on Pakistan Army’s unit while they were in Jaffer Express Train. Casualties likely to increase. pic.twitter.com/ob2on4rJ7M— Aditya Raj Kaul (@AdityaRajKaul) November 9, 2024 -
సింహాచలం రైల్వే స్టేషన్లో రైలు ప్రమాద మాక్డ్రిల్ (ఫొటోలు)
-
అనకాపల్లి రైల్వే స్టేషన్లో దారుణం.. రైలు ఎక్కుతుండగా..
అనకాపల్లి జిల్లా: అనకాపల్లి రైల్వే స్టేషన్లో దారుణం చోటుచేసుకుంది. కదులుతున్న జన్మభూమి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కుతుండగా కాళ్లు జారి ఒక వ్యక్తి ట్రైన్కి, ఫ్లాట్ ఫారం మధ్య ఇరుక్కుపోయాడు. దీంతో ట్రైన్ నిలిపివేసి ప్లాట్ ఫారం తవ్వి కోన ఊపిరితో ఉన్న వ్యక్తిని బయటికి తీశారు. ఆ వ్యక్తిని ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రన్నింగ్ ట్రైన్ ఎక్కబోయి.. ప్లాట్ఫాం మధ్యలో పడిన యువతి
తిరువనంతపురం: కదులుతున్న రైలును ఎక్కే ప్రయత్నం చేసిన యువతి.. అదుపుతప్పి ప్లాట్ఫాం, రైలు మధ్యలో పడిపోయారు. ఈ ప్రమాదం కేరళలోని కన్నూర్ రైల్వే స్టేషన్లో జరిగింది. ఆదివారం జరిగిన ఈ ప్రమదంలో 19 ఏళ్ల యువతికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. పుదుచ్చేరి-మంగళూరు వీక్లీ రైలులో ఇరిట్టికి చెందిన యువతి.. తలస్సేరి నుంచి మంగళూరుకు వెళుతోంది. అయితే.. మధ్యలో కన్నూర్ రైల్వే స్టేషన్లో రైలు కాసేపు ఆగటంతో.. సదరు యువతి స్టేషన్లో ఉన్న షాప్లో స్నాక్స్ కొనుగోలు చేయడానికి దిగారు. కొనుగోలు చేస్తున్న సమయంలోనే రైలు కదటం గమనించిన యువతి.. పరుగెత్తుకుంటూ వెళ్లి రైలు ఎక్కే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె ఒక్కసారిగా రైలు, ప్లాట్ఫారం మధ్య పడిపోయారు. ప్రయాణికులు, రైల్వే పోలీసులు, క్యాటరింగ్ సిబ్బంది అప్రమత్తం కావడంతో వెంటనే డ్రైవర్కు సమాచారం అందించడంతో ఆమెను రక్షించేందుకు రైలును నిలిపివేశారు. ఆ యువతికి స్వల్ప గాయాలకు అవ్వటంతో.. చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. అనంతరం రైల్వే అధికారులు.. ఆమె మరోక రైలులో ఎక్కించి మంగళూరుకు పంపించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్మీడియాలో వైరల్గా మారింది.கேரளா, கண்ணூர் ரயில் நிலையத்தில் ஓடும் ரயிலில் ஏற முயன்றபோது தடுமாறி நடைமேடைக்கும் ரயிலுக்கும் இடையில் விழுந்த இளம் பெண். உடனடியாக ரயில் நிறுத்தப்பட்டு பத்திரமாக மீட்டனர். Platform க்கும் train க்கும் இடைவெளி அதிகமா இருந்ததால் சிறு காயங்களுடன் அந்த பெண் உயிர் தப்பினார் pic.twitter.com/Qb7bVUHOBb— admin media (@adminmedia1) November 4, 2024 -
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో సూపర్ యాప్
న్యూఢిల్లీ: రైలు ప్రయాణికుల ఇబ్బందులను దూరం చేసేందుకు భారతీయ రైల్వే త్వరలో ఒక సూపర్ యాప్ను విడుదల చేయనుంది. ఈ సూపర్ యాప్ డిసెంబర్ 2024 చివరి నాటికి అందుబాటులోకి రానుంది. ఈ యాప్ సాయంతో ప్రయాణికులు టికెట్ బుకింగ్, రైలు రాకపోకల సమాచారం, ఆహారం, రైలు రన్నింగ్ స్థితి తదితర వివరాలను అత్యంత సులభంగా తెలుసుకోవచ్చు.త్వరలో అందుబాటులోకి రానున్న భారతీయ రైల్వేల సూపర్ యాప్ ఇప్పటికే ఉన్న ఐఆర్సీటీసీ యాప్కు భిన్నంగా ఉంటుంది. ఈ సూపర్ యాప్ ద్వారా ప్రయాణికులు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. టిక్కెట్, పాస్లను కొనుగోలు చేయవచ్చు. రైల్వే టైమ్టేబుల్ను కూడా చూడవచ్చు. ఈ యాప్ను రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సెంటర్ అభివృద్ధి చేస్తోంది.ప్రస్తుతం ప్రయాణికులు ఆన్లైన్లో టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు ఐఆర్సీటీసీ యాప్ను ఉపయోగిస్తున్నారు. ఈ యాప్ ద్వారా విమాన టిక్కెట్లను కూడా కొనుగోలు చేయవచ్చు. రైలులో ఆహారాన్ని కూడా ఆర్డర్ చేయవచ్చు. అయితే భారతీయ రైల్వే మరో కొత్త యాప్ను ప్రవేశపెట్టడం ద్వారా ప్రయాణికులకు మరింత చేరువకానుంది.ఇది కూడా చదవండి: సగం సీట్లు ‘ఇతరులకే’..! -
బాంద్రా రైల్వేస్టేషన్లో తొక్కిసలాట.. సీసీటీవీ దృశ్యాలు వైరల్
ముంబైలోని బాంద్రా టెర్మినస్ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. బాంద్రా టెర్మినస్ లోని ఒకటో నంబర్ ప్లాట్ ఫామ్పై బాంద్రా -గోరఖ్ పూర్ ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కే సమయంలో భారీగా ప్రయాణికులు ఒక్కసారిగా రావడంతో ఈ ఘటన జరిగింది.Complete failure of Narendra Modi Govt and Railway ministry A stampede at Platform No. 1, Bandra Terminus, occurred at 5: 10 a.m. on October 27 as heavy passenger rush led to overcrowding. Train No. 22921, the Bandra-Gorakhpur Expresspic.twitter.com/83tTNOndf4— Pritesh Shah (@priteshshah_) October 27, 2024 ాజాగా రైల్వేస్టేషన్లో రైలు రావడానికి ముందు ఎదురుచూస్తున్న ప్రయాణికులకు చెందిన సీసీటీవీ ఫుటేజీ వైరల్గా మారింది. ఆదివారం తెల్లవారుజామున 2.44 గంటలకు 22 కోచ్లతో బాంద్రా-గోరఖ్పూర్ అంత్యోదయ ఎక్స్ప్రెస్ప్లాట్ఫామ్ మీదకు రావడంతో జనరల్ బోగీలో ఎక్కేందుకు ఒక్కసారిగా ప్రయాణికులు ఎగబడినట్లు ఇందులో కనిపిస్తుంది. దీపావళి పండగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికులు. పెద్దఎత్తున రైలు ఎక్కేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగింది. కొంతమంది ఎమర్జెన్సీ ఎగ్జిట్ విండో ద్వారా కూడా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు.त्योहार के समय हर किसी का सपना होता है घर पहुंचना।#Bandra स्टेशन पर आज भीड़ और भगदड़ से कई लोग घायल हुए।रेल मंत्री जी से अनुरोध है कि त्योहारों में स्पेशल ट्रेन चलाकर यात्रियों की सुरक्षा सुनिश्चित करें।#BandraTerminus #SafeTravels pic.twitter.com/zSHMX3fThU— Shelesh Bamniya (@SheleshBamniya) October 27, 2024 గాయపడిన వారిని షభీర్ అబ్దుల్ రెహ్మాన్ (40), పరమేశ్వర్ సుఖ్దర్ గుప్తా (28), రవీంద్ర హరిహర్ చుమా (30), రామసేవక్ రవీంద్ర ప్రసాద్ ప్రజాపతి (29), సంజయ్ తిలక్రం కాన్గే (27), దివ్యాంశు యోగేంద్ర యాదవ్ (18), మహ్మద్, షరీఫ్ షేక్ (25), ఇంద్రజిత్ సహాని (19), నూర్ మహ్మద్ షేక్ (18) లుగా అధికారులు గుర్తించారు. -
చెన్నై శివారులో ఘోర రైలు ప్రమాదం.. 19 మందికి గాయాలు
సాక్షి, చెన్నై: చెన్నై వైపు వస్తున్న మైసూరు–దర్భంగా భాగమతి ఎక్స్ప్రెస్ తిరువళ్లూరు జిల్లా కవరపేట స్టేషన్ వద్ద శుక్రవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీ కొంది. ఈ ప్రమాదంలో రెండు బోగీలు పాక్షికంగా అగ్నికి ఆహుతయ్యాయి. మొత్తం 15 బోగీలు పట్టాలు తప్పాయి. రైలు వేగం తక్కువగా ఉండడంతో అదృష్టవశాత్తు ప్రాణనష్టం సంభవించలేదు. అయితే, ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పలువురు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. కర్ణాటక రాష్ట్రం మైసూర్ నుంచి చెన్నై శివారులోని అరక్కోణం, పెరంబూరు, గుమ్మిడిపూండి మార్గం మీదుగా బిహార్ వైపు ప్రయాణించే దర్భంగా భాగమతి ఎక్స్ప్రెస్ శుక్రవారం ఉదయం 10.30 గంటలకు బయలుదేరింది. ఈ రైలు రాత్రి 8.30 గంటల సమయంలో పొన్నేరి రైల్వేస్టేషన్ దాటి గుమ్మడిపూండి సమీపంలోని కవరపేట వద్ద భారీ కుదుపులకు లోనై లూప్ లైన్లో ఆగి ఉన్న గూడ్స్ను ఢీకొంది. ప్రమాదం జరిగిన క్షణాలలో మంటలు వ్యాపించడంతో కలకలం రేగింది. మొత్తం 13 బోగీలు పట్టాలు తప్పడంతో ఒక్కసారిగా ప్రయాణికుల హాహాకారాలతో ఆ ప్రాంతం మార్మోగింది. #TrainAccident 🚨Visuals from the area where Mysuru - Darbhanga Train collided with a Goods train & derailedMore than 12 Coaches derailed & the condition is worst. Still there's "No Accountability" 😑 pic.twitter.com/UeeOGBGBOt— Veena Jain (@DrJain21) October 12, 2024 ప్రమాదం జరిగిన పరిసరాలు చిమ్మచీకటిగా ఉండడంతో రైలు ప్రయాణికులకు తీవ్ర ఆందోళనతో భీతావహులయ్యారు. ప్రమాద సమాచారంతో గుమ్మిడిపూండి ఎమ్మెల్యే గోవిందరాజ్ సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడి ప్రజలతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. తిరువళ్లూరు కలెక్టర్ ప్రభుశంకర్,ఎస్పీ శ్రీనివాస పెరుమాల్, రైల్వే పోలీసు ఉన్నతాధికారి ఈశ్వరన్ నేతృత్వంలో బృందం సహాయక చర్యలకు పూనుకుంది. అప్పటికే గ్రామస్తులు రైలు బోగీలలో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. అరక్కోణం నుంచి వచి్చన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మంటలు ఇతర బోగీలకు వ్యాపించకుండా కట్టడి చేశారు. ›ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని చెన్నైకు తరలించారు. మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. Train accident in chennai Tamilnadu near ghumdipundiTrain no. 12578 please help us @AshwiniVaishnaw @PiyushGoyal @PMOIndia @AmitShah @GMSRailway pic.twitter.com/UqPCzaisIE— Rahul (@kumarsankarBJP) October 11, 2024సిగ్నల్ సమస్యే కారణమా? రైలు 109 కిలోమీటర్ల వేగంతో వెళుతూ భారీ కుదుపులకు లోనై లూప్ లైన్లోకి మళ్లింది. గార్డ్ సకాలంలో స్పందించి వేగాన్ని క్రమంగా 90 కి.మీ.కి తగ్గించారు. అప్పటికే ఆగి ఉన్న గూడ్స్ను ఢీకొంది. ఘటనలో 13 బోగీలు పట్టాలు తప్పాయి. ఏసీ బోగీలలో స్వల్పంగా మంటలు చెలరేగినా సకాలంలో ఆర్పి వేయడంతో ప్రమాదం తప్పినట్లైంది. ప్రమాదంలో ఎవ్వరికీ ప్రాణహాని కలగలేదని దక్షిణ రైల్వే ప్రకటించింది. ఘటన కారణంగా ఆంధ్రప్రదేశ్ వైపు చెన్నై నుంచి వెళ్లాల్సిన పలు రైళ్లు మధ్యలోనే ఆగాయి. అలాగే, గుమ్మిడిపూండి మీదుగా చెన్నైకు రావాల్సిన రైళ్లు ఎక్కడికక్కడ ఆగడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తప్పలేదు. దక్షిణ రైల్వే యంత్రాంగం 044 25354151, 2435499, అదేవిధంగా దక్షిణ మధ్య రైల్వే విజయవాడ హెల్ప్ లైన్ 0866–2571244 నంబర్ను ప్రకటించింది. తిరుచి్చ–హౌరా, ఎర్నాకులం–టాటా నగర్, కాకినాడ–దర్బంగా భాగమతి ప్రత్యేక రైలు సేవలను గూడురు మార్గంలో నిలుపుదల చేశారు. వీటిని ప్రత్యామ్నయ మార్గంలో నడిపేందుకు చర్యలు తీసుకున్నారు. చదవండి: Trichy: ఎయిరిండియా విమానం.. సేఫ్ ల్యాండింగ్ -
రాజస్థాన్లో హై అలర్ట్.. రైల్వేస్టేషన్లకు బాంబు బెదిరింపులు
జైపూర్: దేశంలో రోజూ ఎక్కడో ఓ చోట బాంబు బెదిరింపు వస్తూనే ఉంది. స్కూళ్లు, ఎయిర్పోర్టులు, రైల్వేస్టేషన్లు, ఆస్పత్రులు ఇలా దేన్నీ వదలకుండా ఫోన్లు, మెయిళ్లు, లేఖల ద్వారా భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తాజాగా రాజస్థాన్లోని పలు రైల్వేస్టేషన్లకు బుధవారం(అక్టోబర్2) బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు తనిఖీలు నిర్వహించారు.రాజస్థాన్లోని హనుమాన్ఘర్ జంక్షన్లోని స్టేషన్ సూపరింటెండెంట్కు గుర్తుతెలియని నుంచి ఓ లేఖ వచ్చింది. లేఖ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ పేరుతో ఉంది. బికనీర్, శ్రీరంగానగర్, జోధ్పుర్, బుందీ, కోట, జైపూర్, ఉదయర్పుర్ సహా పలు రైల్వేస్టేషన్లలో బాంబు దాడులు జరగనున్నాయనేది లేఖ సారాంశం.లేఖ చదవిన వెంటనే అధికారులు అలర్ట్ అయ్యారు. బీఎస్ఎఫ్, జీఆర్పీ, ఆర్పీఎఫ్ బలగాలు రైల్వేస్టేషన్లను జల్లెడ పట్టాయి. తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు దొరకలేదని అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: పుణెలో కూలిన హెలికాప్టర్.. ముగ్గురు మృతి -
మెట్రో.. అవుతోందా సూసైడ్ స్పాట్?
సాక్షి, బెంగళూరు: బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలను తీర్చేలా ఉన్న మెట్రో రైలు వ్యవస్థ ఆధునికతగా ప్రతిరూపంగా ఆకర్షిస్తోంది. కానీ ఇలాంటి నమ్మ మెట్రో స్టేషన్లు సూసైడ్ స్పాట్గా మారడం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. ఈ ఏడాదిలో 9 నెలల్లో 7 ఆత్మహత్యాయత్నాలు జరగడం గమనార్హం. చనిపోతామంటూ మెట్రో రైలు పట్టాలపై దూకుతున్న ఘటనలు తలనొప్పిగా మారాయి. ఫలితంగా మెట్రో రైలు సేవలకు అంతరాయం ఏర్పడడంతో పాటు ప్రయాణికులు భయాందోళనకు గురవుతుంటారు.గ్లాస్ డోర్లు ఎక్కడ?ఈ ప్రమాదాల నివారణ కోసం పీఎస్డీ (ఫ్లాట్ఫారం స్క్రీనింగ్ డోర్)ని ఏర్పాటు చేయాలని గత కొన్నేళ్లుగా డిమాండ్లు వినిపిస్తున్నా ఎందుకు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ, చైన్నె, కొచ్చి మెట్రోలో ఈ పీఎస్డీ డోర్లను ఏర్పాటు చేశారు. అయితే నమ్మ మెట్రోలో మాత్రం ఇంకా ఆచరణలోకి రాకపోవడం గమనార్హం. ఈ డోర్లను అమర్చితే ట్రాక్పైకి ప్రయాణికులు పడిపోయే, దూకే ఘటనలు తప్పిపోతాయని నిపుణులు తెలిపారు. మెట్రో స్టేషన్కు రైలు వచ్చినప్పుడు మాత్రమే ఈ స్క్రీనింగ్ డోర్లు తెరుచుకుంటాయి. ప్రయాణికులు రైల్లోకి ఎక్కిన తర్వాత తిరిగి మూసుకుపోతాయి. ఇలా ప్రయాణికుల భద్రతలో ఎంతో కీలకమైన పీఎస్డీ డోర్లను వెంటనే బెంగళూరు మెట్రో స్టేషన్లలో కూడా అమర్చాలని చెబుతున్నారు. నమ్మ మెట్రో ప్రారంభమై 13 ఏళ్లు పూర్తి అయింది. ఇంతవరకు రక్షణ గోడలు ఏర్పాటు చేయకపోవడం ఆశ్చర్యకరమని విమర్శలున్నాయి.ఈ ఏడాది జరిగిన కొన్ని సంఘటనలు జనవరి 01– మొబైల్ పడిపోయిందని..ఇందిరా నగర మెట్రో రైల్వే స్టేషన్లో ట్రాక్పై పడిన మొబైల్ను తీసేందుకు ఒక మహిళ ట్రాక్పైకి దిగింది. సిబ్బంది వెంటనే ఆ మహిళను గుర్తించి బయటకు లాగి ప్రాణాన్ని కాపాడారు. పట్టాలకు హై ఓల్టేజ్ కరెంటు అనుసంధానమై ఉంటుంది. తగిలితే ప్రాణాలు పోవచ్చు. ఈ ఘటనతో 15 నిమిషాలు రైలు సేవలు నిలిచిపోయాయి. జనవరి 5 – యువకుడు దూకి..కేరళకు చెందిన షారోన్ (23) అనే యువకుడు జాలహళ్లి మెట్రో స్టేషన్లో ఆత్మహత్య చేసుకోవాలని రైలు వస్తుండగా పట్టాల మీదకు దూకాడు. ఆ వ్యక్తిని చూసిన లోకోపైలట్ వెంటనే అత్యవసర బ్రేకులను ఉపయోగించి రైలు నిలిచిపోయేలా చేయడంతో ప్రాణాపాయం తప్పింది. జనవరి 6 – నల్ల పిల్లి ఆటంకంజేపీ నగర మెట్రో రైల్వే స్టేషన్లో పట్టాలపై నల్లటి పిల్లి ఒకటి కనిపించింది. మెట్రో రైల్వే స్టేషన్ సిబ్బంది ఆ పిల్లిని అక్కడి నుంచి తరిమేసేందుకు నానా తిప్పలు పడ్డారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా కూడా మారాయి. మార్చి 12– పట్టాలపై నడకజ్ఞానభారతి మెట్రో స్టేషన్–పట్టణగెరె మెట్రో స్టేషన్ మధ్య వయడక్ట్లో ఒక గుర్తు తెలియని వ్యక్తి కనిపించాడు. మెట్రో పట్టాలపై ఉన్న వయడక్ట్పై నడుచుకుంటూ వెళుతున్నాడు. దీంతో కూడా మెట్రో సేవలు కొంత సమయం నిలిచిపోయాయి. మార్చి 21– లా విద్యార్థి ఆత్మహత్యఅత్తిగుప్పే మెట్రోస్టేషన్లో 19 ఏళ్ల ధ్రువ్ టక్కర్ అనే లా విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. స్టేషన్కు రైలు వస్తుండగా నేరుగా పట్టాలపైకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు మానసిక ఒత్తిడి కారణంగా ప్రాథమికంగా నిర్ధారించారు. ఆగస్టు 3 – మరో ఆత్మహత్యదొడ్డకల్లసంద్ర మెట్రో స్టేషన్లో ట్రైన్ రావడాన్ని గమనించిన 35 ఏళ్ల వ్యక్తి ట్రాక్ మీదకు దూకాడు. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. ఈ ప్రమాదంతో చాలా సమయం వరకు మెట్రో రైలు సేవలు నిలిచిపోయాయి.సెప్టెంబర్ 17 – మరో ఆత్మహత్యాయత్నం..జ్ఞానభారతి మెట్రో స్టేషన్లో రైలు రావడాన్ని గమనించి ఆత్మహత్య చేసుకునేందుకు ట్రాక్ మీదకు దూకాడు. ఈసందర్భంలో మెట్రో సెక్యురిటీ సిబ్బంది సిద్ధార్థ జైన్ అతని ప్రాణాలను కాపాడారు. బ్యాంకులో రూ. 3 లక్షల అప్పు చేసి తీర్చలేకనే బాధతో ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిసింది.అత్యాధునిక సౌకర్యాలతో కూడిన మెట్రో రైళ్లు, స్టేషన్లకు వెళ్లడం ఒక మంచి అనుభూతిగా ఉంటుంది. అందుకే ఎంతోమంది అవసరం లేకపోయినా మెట్రో రైళ్లలో ప్రయాణిస్తారు. అనేక ఊర్ల నుంచి నిత్యం పెద్దసంఖ్యలో ఔత్సాహికులు మెట్రో సేవల కోసం వస్తుంటారు. కానీ కొందరికి మాత్రం అది ఆత్మహత్యకు అనువైన ప్రాంతంగా కనిపిస్తోంది. చిన్న చిన్న సమస్యలకు కుంగిపోయి మెట్రో పట్టాలపైకి దూకాలని వస్తారు. ఈ సమస్యను నివారించడం మెట్రోకు చిక్కుముడిగా మారింది. -
రైల్వేస్టేషన్ ప్లాట్ఫారమ్పై పెద్ద పాము.. ప్రయాణికుల పరుగులు
పాములంటే అందరికీ భయమే.. అవి కనిపిస్తే ఆమడదూరం పరిగెడుతుంటారు. ఈ మధ్య ఇళ్లలోకి, రోడ్లపైకి, ఆఖరికి బైక్, షూవంటి వాటిల్లోనూ పాములు ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా రైల్వే స్టేషన్లో పాము ప్రత్యక్షం కావడంతో కలకలం రేగింది. రైల్వే ప్లాట్ఫారమ్పై పామును చూసిన ప్రయాణికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. ఉత్తరాఖండ్లోని రిషికేశ్లో ఈ సంఘటన జరిగింది.శుక్రవారం ఉదయం రిషికేశ్లోని యోగనగరి రైల్వే స్టేషన్లో రైలు పట్టాలపై ఆరు అడుగుల పొడవైన పాము కనిపించింది. ఆ పాము పాకుతూ ప్లాట్ఫారమ్పైకి చేరింది. కాగా పామును చూసి ఆ ప్లాట్ఫారమ్పై ఉన్న ప్రయాణికులు భయాందోళన చెందారు. అక్కడి నుంచి దూరంగా పరుగెత్తారు. కొందరు తమ లగేజ్ వదిలేసి పరుగులు తీశారు. ఆ ప్లాట్ఫారమ్పై పాము ఉన్నట్లు అక్కడున్న వారిని అప్రమత్తం చేశారు. ఈ విషయాన్ని రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.#उत्तराखंड : आप स्टेशन पर ट्रेन का इंतजार कर रहे हों और सामने सांप आ जाए तो क्या होगा...। #ऋषिकेश रेलवे स्टेशन का एक वीडियो वायरल है। प्लेटफार्म पर अचानक एक लंबे सांप को रेंगता देख यात्रियों में अफरा-तफरी मच गई। #Uttarakhand #Rishikesh pic.twitter.com/qN3HAGt893— अनुराग शुक्ला/Anurag Shukla 🇮🇳 (@anuraganu83) September 20, 2024 వారు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో పామును పట్టి సురక్షితంగా సమీపంలో అడవిలో వదిలారు. అయితే ప్లాట్ఫారమ్పై పెద్ద పాము పాకుతూ వెళ్తున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. -
కూయకుండానే.. రైలొచ్చి వెళ్లింది
సామర్లకోట: ఎటువంటి అనౌన్స్మెంట్, ప్లాట్ఫాంపై డిస్ప్లే లేకుండా సామర్లకోట రైల్వే స్టేషన్లో సోమవారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ఏపీ ఎక్స్ప్రెస్ వచ్చిందని రైలు ప్రయాణికులు ఆరోపించారు. రైలు వచ్చే ముందు బోగీల సమాచారం తెలిసేలా డిస్ప్లేతో పాటు, అనౌన్స్మెంట్ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. విశాఖపట్నం నుంచి న్యూఢిల్లీ వెళ్లే ఏపీ ఎక్స్ప్రెస్ వచ్చే ముందు ఇవేమీ చేయలేదని, దీంతో రైలు వచ్చిన విషయాన్ని ఆలస్యంగా గుర్తించి, పిల్లలతో, మహిళలతో పరుగులు తీయాల్సి వచ్చిందని బీజేపీ అనుబంధ యువమోర్చా రాష్ట్ర సభ్యుడు ఎస్ అనిల్కుమార్ మంగళవారం ఆరోపించారు. తాము న్యూఢిల్లీ వెళ్లడానికి సోమవారం రాత్రి సామర్లకోట రైల్వే స్టేషన్లో వేచిఉన్నామని తెలిపారు. సమాచారం లేకుండా రైలు వచ్చిందని, డిస్ప్లే లేకపోవడం వల్ల ఏ బోగీ ఎక్కడ వచ్చిందో తెలియక మహిళలు, పిల్లలతో పరుగులు తీశామని చెప్పారు. దీనిపై న్యూఢిల్లీ వెళ్లాక సామర్లకోట రైల్వే స్టేషన్ మేనేజర్ను వివరణ కోరుతామని అనిల్కుమార్ స్థానిక విలేకర్లకు ఫోన్లో తెలిపారు. ఈ సంఘటనపై రైల్వే స్టేషన్ మేనేజర్ ఎం.రమేష్ను వివరణ కోరగా, రాత్రి డ్యూటీలో ఉన్న సిబ్బందిపై విచారణ చేస్తామని చెప్పారు. ప్రతి రైలుకు తప్పనిసరిగా అనౌన్స్మెంట్తో పాటు, బోగీల డిస్ప్లే వేయాల్సి ఉంటుందన్నారు. -
తిరుపతిపై వైఎస్ జగన్ మార్క్.. వరల్డ్ క్లాస్ సిటీ తరహాలో అభివృద్ధి
-
పాలకొల్లు రైల్వే స్టేషన్ దగ్గర విషాదం.. ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం
సాక్షి, పశ్చిమగోదావరి: పాలకొల్లు రైల్వే స్టేషన్ సమీపంలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేయగా, యువకుడు మృతిచెందాడు. రైలు వచ్చే సమయానికి యువతిని పక్కకు నెట్టి యువకుడు సూసైడ్కు పాల్పడ్డాడు. పెద్దలు వీరి వివాహానికి అంగీకరించకపోవడమే కారణమని సమాచారం.ఈ ఘటనలో ప్రియుడు మృతి చెందగా, ప్రియురాలికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.మృతుడుది గణపవరం కాగా, ప్రియురాలు ఎస్ కొండేపాడు గ్రామానికి చెందిన అమ్మాయిగా పోలీసులు గుర్తించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
Hyderabad: ఊరగాయలో బల్లి.. హోటల్ సీజ్ చేసిన పోలీసులు
నాంపల్లి: తిరుపతికి వెళ్లి తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు వెళ్తున్న భక్తులకు నగరంలో అపశృతి చోటుచేసుకుంది. నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో బల్లిపడిన వంటకాన్ని తిని వాంతులు చేసుకున్నారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి నాంపల్లి శాంతిభద్రతల పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మహారాష్ట్రకు చెందిన 30 మంది భక్తులు దైవదర్శనం కోసం ఇటీవల తిరుపతికి వెళ్లారు. దర్శనం అనంతరం రైలులో మంగళవారం రాత్రి నగరానికి చేరుకున్నారు. బుధవారం ఉదయాన్నే హైదరాబాద్ రైల్వే స్టేషన్ నుండి పూర్ణా ప్యాసింజర్ రైలులో సొంతూరు వెళ్లాల్సి ఉంది. మంగళవారం రాత్రి నగరంలోనే బస చేయడంతో రైల్వే స్టేషన్కు చేరువలో ఉండే మహేష్ రెస్టారెంట్లో డిన్నర్ చేశారు. 30 మంది ఒకేసారి భోజనాలు చేస్తుండగా ఊరగాయ(పికిల్)లో చనిపోయిన బల్లిని చూశారు. అన్నంలో ఊరగాయను వేసుకుని కలుపుతుండగా ఓ భక్తుడి చేతికి బల్లి తగిలింది. దీంతో అతడక్కడే వాంతులు చేసుకున్నారు. ఈ క్రమంలో మిగతా వారూ అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నారు. స్థానికులు గమనించి అంబులెన్స్లో చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వీరంతా త్వరగానే కోలుకోవడంతో తిరిగి ఉదయాన్నే హైదరాబాదు రైల్వే స్టేషన్కు చేరుకుని పూర్ణా ప్యాసింజర్ రైలులో తిరుగుపయనం అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మహేష్ హోటల్ను రాత్రి మూసివేయించారు. హోటల్ సిబ్బందిని, యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
విశాఖలో కోర్బా ఎక్స్ప్రెస్ రైలు అగ్ని ప్రమాదం (ఫొటోలు)
-
వరల్డ్ క్లాస్ లుక్లో గోరఖ్పూర్ రైల్వే స్టేషన్
గోరఖ్పూర్: యూపీలోని గోరఖ్పూర్ రైల్వే స్టేషన్ త్వరలో వరల్డ్ క్లాస్ లుక్లో కనిపించనుంది. ఈ రైల్వే స్టేషన్ను రూ.498 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. ఈ స్టేషన్లో పలు అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.గోరఖ్పూర్ రైల్వే స్టేషన్లో ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించనున్నామని నార్త్ ఈస్టర్న్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ పంకజ్ కుమార్ సింగ్ తెలిపారు. మహిళలు, వృద్ధులు, పిల్లలు, వికలాంగులు, రోగులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నామన్నారు. బడ్జెట్ హోటల్, మల్టీప్లెక్స్, రెస్టారెంట్ అందుబాటులో ఉంటాయన్నారు. ప్రయాణికులతో పాటు ఇతరులు కూడా ఇక్కడకు వచ్చి సినిమాలు చూసేందుకు, షాపింగ్ చేయడానికి వీలు కలుగుతుందన్నారు.గోరఖ్పూర్ రైల్వే స్టేషన్లో ట్రావెలేటర్ ప్రత్యేక ఆకర్షణ కానుంది. ఇది ప్రత్యేక తరహా ఎస్కలేటర్. దానిపై నిలబడి నడవకుండానే ఒక చోట నుంచి మరో చోటికి చేరుకోవచ్చు. సీనియర్ సిటిజన్లు, మహిళలు, వికలాంగులతో సహా ప్రయాణికులంతా ట్రావెలేటర్ను వినియోగించుకోవచ్చు. రాబోయే 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని గోరఖ్పూర్ రైల్వే స్టేషన్ను తీర్చిదిద్దుతున్నారు. 2023 జూలై 7న ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. -
మహిళా రైల్వే స్టేషన్ గా మారిన బేగంపేట్ రైల్వే స్టేషన్
-
బోగీల్లో మంటలు
సాక్షి, హైదరాబాద్/ సికింద్రాబాద్: నగరంలోని ఏదో ఒక రైల్వేస్టేషన్లో తరచూ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. గురువారం ఏసీ బోగోల్లో మంటలు చెలరేగిన సమయంలో అదృష్టవశాత్తు ప్రయాణికులెవరూ లేరు. ⇒ గతంలో నాంపల్లి స్టేషన్లో ప్లాట్ఫామ్పైన నిలిపి ఉన్న నర్సాపూర్ ఎక్స్ప్రెస్లోనూ ఇలాగే మంటలు చెలరేగాయి. అప్పటికే ప్రయాణికులు దిగి వెళ్లిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ట్రైన్లో పేలుడు స్వభావం ఉన్న పదార్థాల వల్లనే మంటలు అంటుకున్నట్టు అప్పట్లో గుర్తించారు. ⇒ సికింద్రాబాద్ స్టేషన్లోనూ చారి్మనార్ ఎక్స్ప్రెస్ కూడా ప్రమాదానికి గురైంది. విశాఖ నుంచి నగరానికి చేరుకున్న జన్మభూమి ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ రైల్వే యార్డుకు చేరుకున్న కొద్దిసేపటికే అగ్ని ప్రమాదానికి గురైన సంఘటన నాలుగేళ్ల క్రితం తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ప్రయాణికులు సికింద్రాబాద్ స్టేషన్లో దిగిన కొద్ది సేపటికే ఈ ప్రమాదం జరగడం గమనార్హం.ఒకవేళ యార్డుకు చేరుకోకముందే అగ్నిప్రమాదం చోటుచేసుకొని ఉంటే భారీ ఎత్తున ప్రాణనష్టం జరిగి ఉండేది. ఇలా తరచుగా ఏదో ఒక ట్రైన్లో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. కొన్ని రైళ్లలో పొగలు రావడంతోనే గుర్తించి తక్షణమే చర్యలు చేపట్టిన సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు భారీ ఎత్తున మంటలు అంటుకొని ప్రయాణికులు, అధికారులు, సిబ్బందిని భయాందోళనకు గురిచేసిన సంఘటనలూ ఉన్నాయి. నిర్వహణలో నిర్లక్ష్యమే కారణమా..రైల్వేయార్డులు, వాషింగ్లైన్లు, పిట్లైన్లలో నిలిపి ఉంచే బోగీలకు భద్రత ఉండటం లేదనే ఆరోపణలున్నా యి. కోచ్లను శుభ్రం చేసేందుకు రైళ్లను పిట్లైన్లకు తరలిస్తారు. కొన్నింటిని డిపోల్లో నిలిపివేస్తారు. రైళ్లు, బోగీలు ఎక్కడ నిలిపి ఉంచినా, వాటిపైన భద్రతా సిబ్బంది నిఘా కొరవడుతోంది. దీంతో అసాంఘిక కార్యకలాపాలకు ఈ బోగీలు అడ్డాలుగా మారుతున్నాయి. తాగుబోతులు, ర్యాగ్పిక్కర్స్, అసాంఘిక శక్తులు రాత్రి వేళల్లో బోగీల్లో తిష్టవేస్తూ మద్యం సేవిస్తున్నారు. సిగరెట్లు, గంజాయి వంటివి తాగి మండుతున్న పీకలను బోగీల్లోనే వేస్తున్నారు. దీంతో సిగరెట్ పీకలు, వెలిగించిన అగ్ని పుల్లలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ⇒ ఏసీ బోగీల నిర్వహణలో వైఫల్యం వల్ల తరచూ విద్యుత్ షార్ట్సర్క్యూట్ వంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నా యి. ఏసీ బోగీల్లో ప్రయాణికులు చెత్తాచెదారం, ఆహారపదార్ధాలు వదిలేస్తున్నారు. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడంతో ఎలుకలు, బొద్దింకలు వచ్చి చేరుతున్నాయి. ఎలుకలు తరచుగా విద్యుత్ వైర్లు కట్ చేయడం వల్ల షార్ట్సర్క్యూట్ వంటి ప్రమాదాలు జరుగుతున్నట్టు రైల్వే భద్రతా నిపుణుడు ఒకరు చెప్పారు. ఆరీ్పఎఫ్, జీఆర్పీ వంటి పోలీసు విభాగాలు పిట్లైన్లు, యార్డుల్లో నిరంతరం నిఘా కొనసాగించాలి. బయటి వ్యక్తులు యార్డుల్లోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి.ఏసీ కోచ్ల్లో అగ్ని ప్రమాదంసికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి గురువారం ఉద యం 10.30 గంటలకు ఏసీ కోచ్లను వాషింగ్ కోసం మెట్టుగూడ వద్దనున్న క్లీనింగ్ పిట్ యార్డ్ తీసుకెళ్లారు. క్లీనింగ్ పూర్తయ్యాక 11 గంటల ప్రాంతంలో తిరిగి రైల్వే స్టేషన్కు తరలిస్తుండగా ఏసీ బోగీల్లో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగి, దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఇది గమనించిన చిలకలగూడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు రైల్వే అధికారులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే సిబ్బంది స్టేషన్లో మంటలు ఆర్పే యంత్రాలతో తగలబడుతున్న బోగీలను అదుపు చేసే ప్రయ త్నం చేశారు. మంటలు ఇతర బోగీలకు వ్యాపించ కుండా రైల్వే సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటున్న సమయంలోనే అక్కడకు చేరుకున్న ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపు చేశాయి. రైలు కోచ్లలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో రెండు బోగీలు దగ్ధమయ్యాయి. విషయం తెలియగానే దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. ప్రమాదంపై సమీక్షించి, భవిష్యత్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డివిజనల్ అధికారులను ఆదేశించారు. -
న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ మూసివేత? రైళ్ల మళ్లింపునకు సన్నాహాలు?
భారతీయ రైల్వేను ‘దేశానికి లైఫ్ లైన్’ అని అంటారు. ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులను రైల్వేలు తమ గమ్యస్థానానికి చేరుస్తున్నాయి. ఇంతటి ఘనత కలిగిన రైల్వేశాఖ నుంచి వచ్చిన ఒక వార్త ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.పునరాభివృద్ధి కోసం ఈ ఏడాది చివరి నాటికి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ను మూసివేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఆ తరువాత న్యూఢిల్లీ మీదుగా నడిచే రైళ్లను ఇతర స్టేషన్లకు మళ్లించాలని రైల్వే మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. అయితే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ను ఎప్పటి నుంచి మూసివేస్తారనేదానిపై ఇంకా అధికారిక సమాచారం రాలేదు. ఇది ఈ ఏడాది చివరి నాటికి జరగవచ్చని తెలుస్తోంది.రైల్వే మంత్రిత్వ శాఖ గతంలో దేశంలోని సుమారు 1,300 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి ప్రణాళికను రూపొందించింది. దీనికి సంబంధించిన పనులు నిదానంగా పూర్తవుతున్నాయి. ఇప్పుడు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ను పునరుద్ధరించే పనులు ప్రారంభంకానున్నాయి. కాగా ఢిల్లీ రైల్వే స్టేషన్లో రోజుకు ఆరు లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. అలాంటి రైల్వే స్టేషన్ను అకస్మాత్తుగా మూసివేయడం రైల్వేకు పెను సవాలుగా మారనుంది. అయితే ఇందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇక్కడి నుంచి వెళ్లే రైళ్లను వివిధ స్టేషన్ల మీదుగా దారిమళ్లించనున్నారు. ఈస్ట్ ఢిల్లీ వైపు వెళ్లే రైళ్లను ఆనంద్ విహార్ స్టేషన్కు మార్చనున్నారు. అలాగే పంజాబ్, హర్యానాకు వెళ్లే రైళ్లను సరాయ్ రోహిల్లా వైపు మళ్లించాలని రైల్వే శాఖ యోచిస్తోంది. రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్ వైపు వెళ్లే రైళ్లను ఢిల్లీ కాంట్, హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ల మీదుగా మళ్లించనున్నారు. మిగిలిన కొన్ని రైళ్లను ఘజియాబాద్కు మళ్లించే అవకాశ ఉంది. దీనికి సంబంధించి మరికొద్ది రోజుల్లో రైల్వేశాఖ నుంచి అధికారిక సమాచారం వెలువడనుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ను అభివృద్ధి పనుల కోసం నాలుగేళ్లపాటు మూసివేయనున్నారు. ఈ రైల్వే స్టేషన్ను పూర్తిగా రీడిజైన్ చేయనున్నారు. ఈ పనులను ఏకకాలంలో చేయాలని గతంలో ప్రభుత్వం యోచించింది. అయితే ఇప్పుడు దశలవారీగా ఈ పనులను చేయాలని నిర్ణయించారు. 2023 బడ్జెట్ సెషన్లో రైల్వే మంత్రిత్వ శాఖ ఈ సమాచారాన్ని వెల్లడించింది. -
దేశంలోనే పెద్ద స్టీల్ ఎయిర్ కాన్కోర్స్
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అద్భుత, ఆధునిక రైల్వే స్టేషన్లలో ఒకటిగా రూపుదిద్దుకుంటున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎయిర్ కాన్కోర్స్ ప్రత్యేకంగా నిలవబోతోంది. రూఫ్ ప్లాజాగా పిలవబోతున్న ఈ కాన్కోర్స్.. స్టేషన్లలో ఉండే ఫుట్ఓవర్ బ్రిడ్జి పాత్ర పోషిస్తుంది. కానీ, ఇది సాధారణ ఫుట్ఓవర్ బ్రిడ్జి కాదు. ఇప్పుడు దేశంలోని రైల్వే స్టేషన్లలో అతిపెద్ద (ఇప్పటి వరకు ప్రతిపాదించిన వాటిల్లో) స్టీల్ ఎయిర్ కాన్కోర్సుగా నిలవబోతోంది. ఇప్పుడు దీని నిర్మాణానికి ఇంజనీర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు రూ.600 కోట్ల వ్యయంతో 1.60 లక్షల చ.మీ. వైశాల్యంతో పూర్తి ఆధునిక రైల్వే స్టేషన్గా సికింద్రాబాద్ స్టేషన్ రూపొందుతున్న విషయం తెలిసిందే. రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా, నిత్యం పెద్ద ఎత్తున ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నా.. వారి ప్రయాణాలకు అవాంతరంగా కలగకుండా వేగంగా పనులు కొనసాగిస్తున్నారు. ఇవన్నీ ఓ ఎత్తయితే, ప్లాట్ఫామ్ నం.1 – ప్లాట్ఫామ్ 10 మధ్య ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు నిర్మించబోతున్న రూఫ్ప్లాజా మరో ఎత్తుగా ఉండబోతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీన్ని స్టీల్తో నిర్మిస్తున్నారు. ప్లాట్ఫారాల మధ్య రాకపోకల కోసం ప్రయాణికులు ఫుట్ఓవర్ వంతెనలను వినియోగిస్తారు. ప్రస్తుతం సికింద్రాబాద్ స్టేషన్లో ఇలాంటి వంతెనలు నాలుగున్నాయి. ఇప్పుడు వాటిని తొలగించి వాటి స్థానంలో స్టీల్తో భారీ వంతెన నిర్మించనున్నారు. 120 మీటర్ల పొడవుండే ఈ వంతెన ఏకంగా 108 మీటర్ల వెడల్పు వెడల్పు ఉండనుంది. ఇది కేవలం వంతెన పాత్ర పోషించేందుకే పరిమితం కాదని, ఇందులోనే వెయిటింగ్ హాళ్లు, ఫుడ్ కోర్టులు, ఇతర వాణిజ్యపరమైన వ్యవస్థలుంటాయని చెపుతున్నారు. 9 మీటర్ల ఎత్తులో ఉండే మొదటి అంతస్తులో ప్రయాణికుల వెయిటింగ్ హాళ్లు ఉంటాయి. 15 మీటర్ల ఎత్తుండే రెండో అంతస్తులో ఫుడ్ కోర్టులు, ఇతర ఏర్పాట్లు ఉంటాయి. దీనికి అనుసంధానంగా రెండు ట్రావెలేటర్స్ ఉంటాయి. ప్రయాణికులు వాటిపై నుంచుంటే చాలని, అవే ముందుకు తీసుకెళ్తాయని వివరిస్తున్నారు.రైల్వే స్టేషన్లో తొలిసారి ట్రావెలేటర్స్..ఇప్పటివరకు విమానాశ్రయాల్లో కనిపిస్తూ వస్తున్న ట్రావెలేటర్స్ ఇప్పుడు తొలిసారి రైల్వే స్టేషన్లో దర్శనమివ్వనున్నాయని చెపుతున్నారు. కాన్కోర్స్ రెండు అంతస్తుల్లోకి వెక్కి దిగటంతోపాటు, ప్లాట్ఫారాల మీదకు రాకపోకలు సాగించేందుకోసం ఈ రూఫ్ప్లాజాకు ఏకంగా 32 ఎస్కలేటర్లు అనుసంధానమై ఉంటాయంటున్నారు. దీని మీదుగానే స్టేషన్కు రెండు వైపులా ఉన్న రెండు మెట్రో స్టేషన్లతో అనుసంధానిస్తూ రెండు స్కై వేలుంటాయని, అంతా సిద్ధమయ్యాక ఇది ఓ అద్భుత స్టీల్ కాన్కోర్సుగా నిలవబోతోందని అంటున్నారు. -
ఓటు మా బాధత్య.. పల్లెకు బయల్దేరిన నగరవాసులు (ఫొటోలు)
-
శభాష్ సుమతి.. ప్రయాణికుడి ప్రాణం కాపాడిన పోలీస్
రైలు ఎక్కేటప్పుడు.. దిగెటప్పుడు ప్రమాదాలు జరుగుతుంటాయి. రైలు కదులుతుంటే పట్టాలు, ప్లాట్ఫామ్ మధ్య ఇరుక్కొని కొంత మంది ప్రాణాలు కోల్పోతే.. మరికొంత మంది అక్కడే విధుల్లో ఉన్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్( ఆర్పీఎఫ్) పోలీసుల సాహసంతో ప్రాణాలు దక్కించుకున్నవారు ఉన్నారు. అటువంటి ఘటనే ఒకటి హరిద్వార్లో చోటుచేసుకుంది. ఓ మహిళా ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ రైలు కింది పడిన వ్యక్తిని సాహసంతో చాకచక్యంగా వ్యవహరించి ప్రాణాలను కాపాడారు. వివరాల్లోకి వెళ్లితే... ఉత్తరాఖండ్ హరిద్వార్కు సమీపంలోని లక్సర్ రైల్వే స్టేషన్లో ఓ ప్రయాణికుడు ఆహారం కోసం రైలు దిగాడు. అతను దిగిన రైలు కదలటంతో పరుగుపెట్టి మరీ ఎక్కడానికి ప్రయిత్నించాడు. కానీ, రైలు వేగంగా ఉండటంతో ఒక్కసారిగా డోర్ వద్ద అదుపుతప్పి రైలు పట్టాలు, ప్లాట్ మధ్యలో పడిపోయాడు. అప్పటికే రైలు కదులుతోంది. ప్రయాణికుడు రైలు కింద పడినట్లు శబ్దంతో రావటంలో అక్కడే విధుల్లో ఉన్న ఓ మహిళా ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ వెంటనే వచ్చి.. ముందుగా ఆ ప్రయాణికుడి తలను ప్లాట్పైకి లాగింది. వెంటనే రైలును అత్యవసరంగా ఆపారు. తర్వాత ఆ ప్రయాణికుడిని ప్లాట్ఫామ్కి లాగారు. క్షణాలో సమయస్ఫూర్తితో స్పందించిన ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ ఆ ప్రయాణికుడి ప్రాణాలు కాపాడారు. ప్రయాణికుడిని రక్షించి కానిస్టేబుల్ కే. సుమతి రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుడిని కాపాడిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సాహసంతో చాకచక్యంగా వ్యవహరించి.. ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. #viralvideo At Haridwar's Laksar railway station a passenger carrying food items from the railway station boarded the Calcutta-Jammutvi Express During this, his foot slipped and he got stuck between the train and the platform Woman constable Uma pulled him out safely#Uttarakhand pic.twitter.com/BvfnMqlPtQ— Siraj Noorani (@sirajnoorani) April 28, 2024 -
రైలులో నోట్ల కట్టలు.. రూ. 4 కోట్లకు పైగా సీజ్
చెన్నై, సాక్షి: చెన్నై తాంబరం రైల్వేస్టేషన్లో శనివారం రాత్రి భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. నెల్లూరు ఎక్స్ప్రెస్ రైలులో 4 కోట్లకు పైగా నగదును పోలీసులు, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ముగ్గురు వ్యక్తులు ఎనిమిది బ్యాగులతో ఎగ్మోర్లో రైలు ఎక్కారు. సమాచారం అందుకున్న పోలీసులు, తాంబరంలో విధులు నిర్వహిస్తున్న ఫ్లయింగ్ స్క్వాడ్లు శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో తాంబరం రైల్వే స్టేషన్కు చేరుకుని నిందితులను పట్టుకున్నారు. నిందితులను అగరానికి చెందిన ఎస్ సతీష్, అతని సోదరుడు ఎస్ నవీన్, తూత్తుకుడికి చెందిన ఎస్ పెరుమాల్గా గుర్తించారు. సెకండ్ క్లాస్ ఏసీ కోచ్ (ఏ1)లో వెతకగా వారి వద్ద ఉన్న బ్యాగుల్లో రూ. 500 నోట్ల కట్టలు దొరికాయి. దీంతో పోలీసులు ముగ్గురు అనుమానితులను పోలీస్ స్టేషన్లో అదుపులోకి తీసుకుని ఆదాయపు పన్ను శాఖను అప్రమత్తం చేశారు. ఐటీ బృందాలు నిందితులను ఆదివారం లేదా సోమవారం విచారించనున్నాయి. తిరునల్వేలి బీజేపీ అభ్యర్థి నైనార్ నాగేంద్రన్కు చెందిన కిల్పాక్, ట్రిప్లికన్, సాలిగ్రామం ప్రాంతాలలో కూడా పోలీసులు సోదాలు చేశారు. నిందితులు నగదును ఎగ్మోర్ రైల్వే స్టేషన్కు తీసుకెళ్లే ముందు బీజేపీ నేతకు సంబంధించిన ప్రదేశాల్లో ఉంచినట్లు తెలిసింది. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తిరునెల్వేలి లోక్సభ నియోజకవర్గంలో పంపిణీ చేసేందుకు ఈ డబ్బును తీసుకెళ్లారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. తమిళనాడులోని 39 లోక్సభ నియోజకవర్గాలకు మొదటి దశ అంటే ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది. -
Krishna Express: కృష్ణా ఎక్స్ప్రెస్కు తప్పిన ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా ఎక్స్ప్రెస్ రైలుకు తృటిలో ప్రమాదం తప్పింది. యాదాద్రి జిల్లా ఆలేరు రైల్వే స్టేషన్ దగ్గర రైలు పట్టా విరిగి పెద్ద శబ్ధం రావడంతో వెంటనే రైలును నిలిపివేశారు. దీంతో, ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్లే కృష్ణా ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. ఆదివారం సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన రైలు యాదాద్రి జిల్లా ఆలేరు స్టేషన్ దాటుతున్న సమయంలో భారీశబ్దం వినిపించింది. దీంతో హడలిపోయిన ప్రయాణికులు రైలు సిబ్బందికి సమాచారం అందించారు. అప్రమత్తమైన అధికారులు రైలును నిలిపివేశారు. అనంతరం పట్టాలను పరిశీలించగా రైలు పట్టా విరిగినట్టు గుర్తించారు. దీంతో, వెంటనే మరమ్మతులు చేశారు. అనంతరం రైలు బయలుదేరింది. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. -
హన్మకొండ జిల్లా కాజీపేట రైల్వే స్టేషన్ లో భారీ అగ్నిప్రమాదం
-
కాజీపేట్ రైల్వే యార్డులో అగ్ని ప్రమాదం
సాక్షి, హనుమకొండ: కాజీపేట్ రైల్వేస్టేషన్ యార్డులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రిపేర్ కోసం నిలిపిన రైల్ బోగీ నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అధికారులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని వెంటనే మంటలు అదుపు చేశారు. ఎటువంటి ప్రాణాపాయం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంపై విచారణ చేస్తున్నమని పోలీసులు తెలిపారు. -
డ్రైవర్ లేకుండా 70 కిలోమీటర్లు పరుగులు తీసిన గూడ్సు!
జమ్ముకశ్మీర్లోని కథువా రైల్వే స్టేషన్లో అధికారులు నిర్లక్ష్యం వెలుగు చూసింది. నిలిపి ఉంచిన గూడ్స్ రైలు అకస్మాత్తుగా డ్రైవర్ లేకుండానే పఠాన్కోట్ వైపు ఏకంగా 70 కిలోమీర్ల దూరం వరకూ పరుగులు తీసింది. నేటి(ఆదివారం) ఉదయం 8.47 గంటలకు క్రషర్లతో నిండిన గూడ్స్ రైలు డ్రైవర్ లేకుండానే జమ్మూలోని కథువా స్టేషన్ నుండి పంజాబ్లోని హోషియార్పూర్ వైపు వేగంగా పరుగులుపెట్టింది. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు రైలును ఆపేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఏటవాలుగా ఉన్న మార్గం కారణంగా రైలు వేగం పుంజుకుంది. దీంతో అధికారుల్లో ఆందోళన మొదలయ్యింది. ఈ విషయమై ఆ మార్గంలోని అన్ని రైల్వే స్టేషన్లకు తెలియజేశారు. ఎట్టకేలకు కథువాకు 70 కిలోమీటర్ల దూరంలోని హోషియార్పూర్లోని దాసుహా వద్ద ఆ గూడ్సను నిలిపివేయగలిగారు. రైల్వే ట్రాక్పై చెక్క దిమ్మెలను ఉంచి, రైలును ఆపడంలో రైల్వే ఉద్యోగులు విజయం సాధించారు. #WATCH | Hoshiarpur, Punjab: The freight train, which was at a halt at Kathua Station, was stopped near Ucchi Bassi in Mukerian Punjab. The train had suddenly started running without the driver, due to a slope https://t.co/ll2PSrjY1I pic.twitter.com/9SlPyPBjqr — ANI (@ANI) February 25, 2024 ఈ సందర్భంగా ఆ గూడ్సు డ్రైవర్ మాట్లాడుతూ తాను ఆ రైలుకు హ్యాండ్బ్రేక్ వేయడం మర్చిపోయానని, ఫలితంగా ఆ రైలు పట్టాల వాలు కారణంగా ఆటోమేటిక్గా ముందుకు కదిలిందని తెలిపాడు. రైలు కదులుతున్న సమయంలో తాను అక్కడ లేనిని చెప్పాడు. కాగా ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం జరగలేదు. అయితే ఇది ఎలా జరిగిందో తెలుసుకునేందుకు ఫిరోజ్పూర్ రైల్వే అధికారుల బృందం జమ్మూ చేరుకుంది. -
చర్లపల్లి టెర్మినల్ నుంచి త్వరలో రైళ్లు
సాక్షి, హైదరాబాద్: నాలుగో రైల్వే టెర్మినల్గా చర్లపల్లి స్టేషన్ సేవలు మార్చి నుంచి ప్రారంభం కానున్నాయి, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లపై పెరిగిన రైళ్ల ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని దక్షిణమధ్య రైల్వే రూ.221 కోట్లతో చర్లపల్లి స్టేషన్ విస్తరణ చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రతి రోజూ సుమారు 50 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా చర్లపల్లి టెర్మినల్ను విస్తరించారు. సరుకు రవాణాకు పార్శిల్ కేంద్రం కూడా ఏర్పాటు చేశారు. రోజుకు 200కు పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తున్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ప్రస్తుతం పునరాభివృద్ధి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో కొన్ని రైళ్ల రాకపోకలను నియంత్రించవలసిన అవసరం ఏర్పడింది. ఈ క్రమంలోనే చర్లపల్లి స్టేషన్ విస్తరణ పూర్తి కావడంతో మార్చి నుంచి కొన్ని రైళ్లను ఇక్కడి నుంచి నడిపేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ప్రధాని మోదీతో ప్రారంభం! ప్రధాని మోదీతోనే త్వరలో చర్లపల్లి టెర్మినల్ను ప్రారంభించనున్నారు. అదే రోజు రైళ్ల రాకపోకలు కూడా ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. చర్లపల్లి నుంచి నడిచే రైళ్లు ఇవే... ► షాలిమార్ నుంచి సికింద్రాబాద్కు రాకపోకలు సాగిస్తున్న ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్ (18045/18046) త్వరలో సికింద్రాబాద్కు బదులు చర్లపల్లి నుంచి రాకపోకలు సాగించనుంది. ► చెన్నై నుంచి నాంపల్లి స్టేషన్కు నడిచే చార్మి నార్ ఎక్స్ప్రెస్ (12603/12604) చర్లపల్లి నుంచి రాకపోకలు సాగించనుంది. ► గోరఖ్పూర్ నుంచి సికింద్రాబాద్కు రాకపోకలు సాగించే (12589/12590) గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ను చర్లపల్లి నుంచి నడుపనున్నారు. మరో 6 రైళ్లకు హాల్టింగ్... ► హైదరాబాద్–సిర్పూర్కాగజ్నగర్ (17011/17012), సికింద్రాబాద్–సిర్పూర్కాగజ్నగర్ (12757/12758), గుంటూరు–సికింద్రాబాద్ (17201/17202) గోల్కొండ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్–సిర్పూర్కాగజ్నగర్ (17233/17234) భాగ్యనగర్ ఎక్స్ప్రెస్, విజయవాడ–సికింద్రాబాద్ (12713/12714) శాతవాహన ఎక్స్ప్రెస్, గుంటూరు–సికింద్రాబాద్ (12705/12706) ఎక్స్ప్రెస్ రైళ్లను మార్చి నుంచి చర్లపల్లి స్టేషన్లో నిలుపనున్నారు.ఈ మేరకు రైల్వేబోర్డు అనుమతులను ఇచ్చింది. -
కడప రైల్వే స్టేషన్ లో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టివేత
-
రైలు ప్రయాణికులకు గుడ్న్యూస్.. చిల్లర కష్టాలకు చెక్
సాక్షి, హైదరాబాద్: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్న్యూస్ చెప్పింది. ప్రయాణికుల బాధను అర్థం చేసుకుని రైల్వేస్టేషన్లలో టికెట్ కౌంటర్ల వద్ద చిల్లర ఇచ్చే విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. వివరాల ప్రకారం.. ప్రయాణికులు సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ కౌంటర్ల వద్ద డిజిటల్ పేమెంట్స్కు సౌకర్యం కల్పించనుంది. దీంతో, ప్రయాణికుల చిల్లర కష్టాలకు రైల్వే శాఖ చెక్ పెట్టినట్టు అయ్యింది. ఇక, దక్షిణ మధ్య రైల్వే నిర్ణయంపై ప్రయాణీకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
రైల్విలాస్: అప్పట్లో రైల్వేస్టేషన్.. ఇప్పుడు హోటల్
ప్రపంచంలోని పురాతనమైన రైల్వేస్టేషన్లలో ఇదొకటి. ఒకప్పుడు రైళ్ల రాకపోకలతో కళకళలాడేది. ఇక్కడ రైల్వే సేవలు నిలిచిపోవడంతో కొన్నాళ్లకు ఈ రైల్వేస్టేషన్నే హోటల్గా మార్చేశారు. ఇది ఇంగ్లండ్లోని పెట్వర్త్లో ఉంది. మిడ్ ససెక్స్ రైల్వే కంపెనీ 1859లో ఇక్కడ రైల్వేస్టేషన్ను నిర్మించింది. అప్పట్లో ఇక్కడ రైల్వే సిబ్బంది, ప్రయాణికుల వసతి కోసం స్టేషన్కు ఆనుకునే ‘రైల్వే ఇన్’ అనే హోటల్ కూడా వెలిసింది. దాదాపు శతాబ్దానికి పైగా సేవలందించిన పెట్వర్త్ రైల్వేస్టేషన్ నుంచి రైళ్ల రాకపోకలను 1966లో నిలిపి వేశారు. తర్వాత దశాబ్దాల తరబడి ఇది అతీ గతీ లేకుండా పడి ఉంది. తర్వాత రైల్వేస్టేషన్కు మరమ్మతులు జరిపి, 1995లో తొలిసారిగా స్టేషన్ భవనంలో రెండు గదులను హోటల్ గదుల్లా మార్చి, అతిథులకు బస కల్పించడం ప్రారంభించారు. తర్వాత ఇక్కడ నిలిచిపోయిన పాత రైళ్ల బోగీలను కూడా హోటల్ గదులుగా మార్చి, స్టేషన్ భవనంలో కూడా మరిన్ని గదులను ఏర్పాటు చేసి 1998 నుంచి దీన్ని ‘ద ఓల్డ్ రైల్వేస్టేషన్’ పేరుతో పూర్తిస్థాయి హోటల్గా మార్చారు. -
రైలుపల్లె.. రెడ్డిపల్లి
వైఎస్సార్: చైన్నె–ముంబై రైలు మార్గంలో తొలుత ఏర్పడిన స్టేషన్ రెడ్డిపల్లి. రైలు రావడానికి కారణమైన పల్లె గనుక ఇప్పటికీ రైలు పల్లెగా ప్రసిద్ధి కెక్కింది. అయితే రైల్వేశాఖ ఈ రైల్వేస్టేషన్ ఆనవాళ్లు లేకుండా చేసిందనే విమర్శలను మూటకట్టుకుంది. దక్షిణ భారతదేశంలో తొలి రైల్వేస్టేషన్గా రెడ్డిపల్లిను చెప్పుకుంటారు. తర్వాత ఇక్కడి నుంచి నందలూరు వరకు రైలు మార్గం వేశారు. చెయ్యేరు నీరు శ్రేష్టమని భావించి రైలు ఇంజిన్ల నిర్వహణ కోసం లోకోషెడ్ నిర్మించేందుకు బ్రిటీషు రైల్వేపాలకులు ముందుకొచ్చారు. ► రెడ్డిపల్లి రైల్వేస్టేషన్లో విక్టోరియా రాణి.... రెడ్డిపల్లి రైల్వేస్టేషన్ వరకు రైల్వేట్రాక్ వేశారు. విక్టోరియా రాణి ఇక్కడికి వచ్చి దీనిని ప్రారంభించారు. రైల్వేమార్గం పురోగతిపై నాటి రైల్వేపాలకులతో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికీ రెడ్డిపల్లి రైల్వేస్టేషన్ పరిధిలో రైల్వేకు ఎకరాల్లో స్థలం ఉంది. నిన్న మొన్నటివరకు బ్రిటీష్ రైల్వేపాలకుల చిహ్నాలు ఉండేవి. రాయపురం నుంచి..... మద్రాసు, సందరన్ మరాఠా రైల్వేస్ పరిధిలో రెడ్డిపల్లి రైల్వేస్టేషన్ ప్రారంభమైంది. ఇక్కడి నుంచి తమిళనాడులోని రాయపురం వరకు 153 కిలోమీటర్లు రైల్వేట్రాక్ నిర్మించారు. ఇదంతా 1857 ప్రాంతంలో జరిగింది. దేశంలో తొలి రైలుమార్గం ముంబై–థానా మధ్య నిర్మితమైన క్రమంలో రెడ్డిపల్లి రైల్వేస్టేషన్ వరకు ట్రాక్ నిర్మితమైందని సమాచారం. రైల్వేస్టేషన్ను పూర్తి బర్మా టేకుతో నిర్మించారు. మద్రాసు నుంచి నేరుగా రెడ్డిపల్లి వరకు..... మద్రాసు నుంచి నేరుగా రెడ్డిపల్లి వరకు గూడ్స్, ప్యాసింజర్ రైళ్లు నడిచేవి. బొగ్గుతో నడిచే రైలింజన్లతో రైళ్ల రాకపోకలను కొనసాగించారు. ఈ స్టేషన్లో మద్రాసు–రాయచూరు–రేణిగుంట–గుంతకళ్లు ప్యాసింజర్ రైళ్లు ఆగేవి. అరక్కోణం , కడప ప్యాసింజర్ రైళ్లు కూడా నిలిచేవి. 2003–2004 మధ్యలో రైల్వేస్టేషన్ మూసివేత ఇండియా రైల్వేలో మీటర్గేజ్లను బ్రాడ్గేజ్లుగా మార్చడం.. సింగల్ లైన్ ఉన్న రైల్వేస్టేషన్ను డబుల్ లైన్ చేశారు. ఈ క్రమంలో 2003–2004లో స్టేషన్ను మూసివేశారు. స్టేషన్ మాస్టర్లను, పాయింట్మెన్లను అందరినీ బదిలీ చేశారు. తర్వాత కాంట్రాక్టు పద్దతిలో రైల్వే టికెట్లు ఇచ్చేందుకు బుకింగ్ రూమ్ నిర్మించారు. లెవెల్ క్రాసింగ్ గేటు బ్రిటీష్ కాలం నుంచి నేటి వరకు కొనసాగుతోంది. ► స్టేషన్ మూసివేతకు ప్రధానంగా రెడ్డిపల్లికి మూడున్నర కిలోమీటర్ల దూరంలో పుల్లంపేట రైల్వేస్టేషన్, ఏడున్నర కిలోమీటర్ల దూరంలో ఓబులవారిపల్లె స్టేషన్లు ఉన్నాయి. రైళ్లవేగం పెరిగిన క్రమంలో నాలుగు, ఐదు నిమిషాల్లో రైలు రెడ్డిపల్లి స్టేషన్ దాటి పోతుంది. ఆ స్టేషన్ ఉండటం వల్ల రైల్వేకు ఎలాంటి లాభదాయకం కాదని అప్పటి డీఆర్ఎం నివేదిక సమర్పించారు. దీంతో రైల్వేబోర్డు స్టేషన్ను మూసివేసిందని రైల్వే వర్గాలు తెలిపాయి. స్టేషన్ను మూసి వేయవద్దని కార్మికసంఘాలు చేసిన విజ్ఞప్తిని అధికారులు పెడచెవిన పెట్టారు. ► బ్రిటీషు రైల్వేపాలకుల హయాంలో రెడ్డిపల్లి రైల్వేస్టేషన్ను కేంద్రంగా చేసుకొని ముంబై–చైన్నె రైలు మార్గం నిర్మించారు. ఈ స్టేషన్లో రెండు లైన్లు, ఒక ప్లాట్ఫామ్ ఉండేది. గూడ్స్ సైడింగ్ను కూడా బ్రిటీషర్లు ఏర్పాటు చేసుకున్నారు. 1980లో ఈ సైడింగ్ను మూసివేశారు. ఇక్కడి నుంచి గూడ్స్ వ్యాగన్లో కర్రబొగ్గు, ఎర్రగడ్డలు, తమలపాకు, నిమ్మకాయలు మద్రాస్ హార్బర్కు తీసుకెళ్లి అక్కడ నుంచి గోధుమలు, బార్లీ దిగుమతి అయ్యేవి. భావితరాలకు తెలియాలి బ్రిటీషు కాలం నుంచి చరిత్ర కల్గిన రైల్వేస్టేషన్లు గురించి, ఆనాటి పరిజ్ఞానం, రైళ్ల గురించి భావితరాలకు తెలియాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే ఇప్పుడు రైల్వే లాభాలు చూసుకుంటోంది. చరిత్ర కల్గిన స్టేషన్లు కాలగర్భంలో కలిసిపో యాయి. ఇందులో రెడ్డిపల్లి రైల్వేస్టేషన్ ఒకటి. – తల్లెం భరత్ కుమార్ రెడ్డి, గుంతకల్ రైల్వే బోర్డు మెంబర్ సరుకుల రవాణాకు అనుకూలం దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి రైల్వేస్టేషన్ రెడ్డిపల్లి.దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉండేది. ఇక్కడి నుంచి ఇంగ్లాడుకు సరుకుల రవాణ జరిగింది. బ్రిటీషు రైల్వేపాలకులు రెడ్డిపల్లికి ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు స్టేషన్ లేకుండా పోవడం విచారకరం. – ముస్తాక్, మండల కనీ్వనర్ పునరుద్ధరించాలి చరిత్ర కల్గిన రైల్వేస్టేషన్ రెడ్డిపల్లి జిల్లాలో ఉండడం గర్వకారణం. మా పూర్వీకుల నుంచి స్టేషన్ రాకపోకలకు అనుకూలంగా ఉండేది. నేడు దీనిని ఆనవాళ్లు లేకుండా చేయడం బాధాకరం. ఈ స్టేషన్ను పునరుద్ధరిస్తే అందరికీ ఉపయోగంగా ఉంటుంది. – జనార్దన్, రెడ్డిపల్లి, పుల్లంపేట మండలం -
Vizag: విశాఖ రైల్వేస్టేషన్లో వ్యక్తి హల్చల్..
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం రైల్వేస్టేషన్లో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. రైల్వేస్టేషన్లో రూఫ్ టాప్పైకి ఎక్కి కరెంట్ తీగలను పట్టుకుంటాను అంటూ అక్కడున్న వారిని బెదిరించాడు. దీంతో, ప్రయాణికులు హడిలిపోయారు. రైల్వేస్టేషన్లో రద్దీ ఎక్కువగా ఉండటంతో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. విశాఖ స్టేషన్లో ఓ వ్యక్తి హల్చల్ సృష్టించాడు. ప్రయాణికులతోపాటు ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులను టెన్షన్ పెట్టాడు. రూఫ్టాప్ పైకి ఎక్కి విద్యుత్ తీగలను పట్టుకుంటానని బెదిరింపులకు దిగాడు. అతడిని సురక్షితంగా కిందికి తీసుకొచ్చేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. తొలుత విద్యుత్ సరఫరా నిలిపి ఆ వ్యక్తి వద్దకు వెళ్లే ప్రయత్నం చేయగా.. నాలుగో నంబర్ ప్లాట్ఫామ్పై ఉన్న పూరీ-తిరుపతి ఎక్స్ప్రెస్ రైలుపైకి దూకాడు. దీంతో అతడి వెంట పరుగులు పెట్టిన పోలీసులు.. ఎట్టకేలకు ప్రయాణికుల సాయంతో అదుపులోకి తీసుకున్నారు. అయితే, సదరు వ్యక్తికి మతిస్థిమితం సరిగా లేదని తెలుస్తోంది. అనంతరం, పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించారు. దీంతో, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఉజ్వల లబ్ధిదారు ఇంట్లో టీ తాగిన మోదీ
అయోధ్య: ‘ఉజ్వల పథకం’ 10 కోట్లవ లబ్దిదారు మీరా మంఝీతో మోదీ అన్న మాటలివి! అయోధ్య రైల్వేస్టేషన్ ప్రారంభించాక విమానాశ్రయానికి వెళ్తూ మార్గ మధ్యంలో లతా మంగేష్కర్ చౌక్ కూడలి సమీపంలో ఆయన హఠాత్తుగా ఆగారు. సమీప వీధిలోని మీరా ఇంటికెళ్లి వారందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. స్వయానా ప్రధాని తన ఇంటికి రావడంతో ఉబ్బి తబ్బిబ్బైన మీరా బహుశా ఆ కంగారులో ఆయనకు కలిపిచి్చన టీలో కాస్తంత చక్కెర ఎక్కువేశారు. ఆ చాయ్ తాగుతూ తీపి ఎక్కువైందని మోదీ సరదాగా స్పందించారు. ఉజ్వల పథకం 10 కోట్లవ లబ్ధిదారు కావడంతో ఆమె కుటుంబాన్ని కలిసేందుకు మోదీ ప్రత్యేకంగా వారింటికి వెళ్లారు. ‘‘ఉజ్వలతో ఉచితంగా గ్యాస్ కనెక్షన్ వచి్చంది. కేంద్ర గృహ నిర్మాణ పథకంతో ఉచితంగా ఇల్లూ వచి్చంది’’ అంటూ మీరా ఆనందం వెలిబుచ్చారు. ఆమె కుటుంబ యోగక్షేమాలను మోదీ అడిగి తెల్సుకున్నారు. మీరా కుమారుడికి ఆటోగ్రాఫ్ ఇచ్చి వందేమాతరం అని రాసిచ్చారు. అక్కడి చిన్నారులతో సెల్ఫీ దిగారు. ‘‘పాత ప్రభుత్వాలు ఐదు దశాబ్దాల్లో కేవలం 14 కోట్ల గ్యాస్ కనెక్షన్లిస్తే మేం పదేళ్లలో ఏకంగా 18 కోట్ల కనెక్షన్లు అందించాం. వాటిలో పది కోట్లు ఉచిత కనెక్షన్లే’’ అని మోదీ అన్నారు. -
అయోధ్యలో రైల్వే స్టేషన్ ప్రారంభించిన ప్రధాని మోదీ
-
అయోధ్య వాసుల కష్టానికి దక్కిన ఫలితమిది
PM Narendra Modi In Ayodhya Updates ప్రపంచం యావత్తూ జనవరి 22 కోసం ఎదురుచూస్తోంది : ప్రధాని మోదీ శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం నేను కూడా మీలాగే ఎదురుచూస్తున్నాం ఒకప్పుడు అయోధ్యలో రాముడు టెంట్లో కొలువుదీరాడు ఇప్పుడు రాముడికి గొప్ప మందిరం వచ్చింది ఇది అయోధ్య వాసుల కష్టానికి దక్కిన ఫలితం అయోధ్యను దేశ చిత్రపటంలో సగర్వంగా నిలబెడతాం వారసత్వం మనకు సరైన మార్గం చూపిస్తుంది అభివృద్ధి చెందాలంటే వారసత్వాన్ని కాపాడుకోవాలి కొన్ని రోజుల్లో అయోధ్యలో వారసత్వం వెల్లివిరుస్తుంది ఇకపై అయోధ్యకు వచ్చే భక్తుల సంఖ్య ఐదురెట్లు పెరుగుతుంది అయోధ్య ఎయిర్ పోర్ట్ చూసి ప్రతి ఒక్కరూ పులకించిపోతారు మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్య ధామ్ ప్రాంగణంలో జరిగిన జన్ సభలో భావోద్వేగంగా ప్రధాని మోదీ #WATCH | Ayodhya, Uttar Pradesh: PM Narendra Modi says, "Today the whole world is eagerly waiting for the 22nd January..." The consecration ceremony of the Ram temple will be held on January 22 in Ayodhya pic.twitter.com/MXTdAczYqn — ANI (@ANI) December 30, 2023 #WATCH | Ayodhya, Uttar Pradesh: PM Narendra Modi says, "I have a request to all. Everyone has a wish to come to Ayodhya to be a part of the event on 22 January. But you know it is not possible for everyone to come. Therefore, I request all Ram devotees that once the formal… pic.twitter.com/pbL81WrsbZ — ANI (@ANI) December 30, 2023 అయోధ్య బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ యూపీకి సంబంధించి రూ.15,700 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి.. జాతికి అంకితం చేయనున్న ప్రధాని #WATCH | Prime Minister Narendra Modi participates in a public programme in Ayodhya, Uttar Pradesh. The PM will inaugurate, dedicate to the nation and lay the foundation stone of multiple development projects worth more than Rs 15,700 crore in the state. pic.twitter.com/BxnVrZGNv3 — ANI (@ANI) December 30, 2023 అయోధ్యకు ఎగిరిన తొలి విమానం టేకాఫ్ అనౌన్స్ చేసిన ఇండిగో పైలట్ కెప్టెన్ అశుతోష్ శేఖర్ కాసేపట్లో అయోధ్యకు చేరుకోనున్న తొలి విమానం #WATCH | IndiGo pilot captain Ashutosh Shekhar welcomes passengers as the first flight takes off from Delhi for the newly constructed Maharishi Valmiki International Airport, Ayodhya Dham, in Ayodhya, UP. pic.twitter.com/rWkLSUcPVF — ANI (@ANI) December 30, 2023 అయోధ్య ఎయిర్పోర్ట్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ #WATCH | PM Narendra Modi inaugurated Maharishi Valmiki International Airport Ayodhya Dham, in Ayodhya, Uttar Pradesh pic.twitter.com/6phB4mRMY5 — ANI (@ANI) December 30, 2023 అయోధ్య విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీ.. కాసేపట్లో ప్రారంభం జై శ్రీరామ్తో మారుమోగిపోతున్న ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఢిల్లీ ఎయిర్పోర్టులో జై రామ్.. శ్రీరామ్ నినాదాలు అయోధ్య ఎయిర్పోర్ట్ను మరికాసేపట్లో ప్రారంభించనున్న ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి ప్రయాణికులతో అయోధ్య చేరుకోనున్న తొలి విమానం రామాయణం రచించిన మహర్షి వాల్మీకి పేరును అంతర్జాతీయ విమానాశ్రయానికి పెట్టిన కేంద్రం #WATCH | Delhi: People raise slogans of 'Jai Ram, Shri Ram'as they board the first flight for the newly built Maharishi Valmiki International Airport Ayodhya Dham, in Ayodhya, Uttar Pradesh PM Modi will inaugurate Maharishi Valmiki International Airport Ayodhya Dham shortly. pic.twitter.com/4xrYPZeKK2 — ANI (@ANI) December 30, 2023 ఆ ఇద్దరికి సెల్ఫీలు.. ఆటోగ్రాఫ్లు యూపీ అయోధ్య పర్యటనలో ప్రధాని మోదీని కలిసిన ఇద్దరు చిన్నారులు చిన్నారులకు సెల్ఫీ ఫోజులు ఇచ్చిన ప్రధాని మోదీ ఆటోగ్రాఫ్లిచ్చి కాసేపు వాళ్లతో ముచ్చటించిన ప్రధాని Uttar Pradesh | Prime Minister Narendra Modi met two children in Ayodhya and took selfies with them and also gave them autographs. pic.twitter.com/N7PHVTRwr7 — ANI (@ANI) December 30, 2023 #WATCH | Ayodhya, Uttar Pradesh: Two children who met Prime Minister Narendra Modi and took selfies with him, express their happiness. PM Modi also gave them autographs. https://t.co/RCMlsNOxpp pic.twitter.com/mGryxiRhLP — ANI (@ANI) December 30, 2023 కాసేపట్లో అయోధ్య ఎయిర్పోర్ట్ ప్రారంభం అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అయోధ్య ధామ్గా నామకరణం కాసేపట్లో ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 6వ తేదీ నుంచి విమానాల రాకపోకలు షురూ దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి వాల్మీకి ఎయిర్పోర్ట్కి విమానాలు అయోధ్య లతా మంగేష్కర్ చౌక్లో సందడి చేసిన ప్రధాని మోదీ #WATCH | PM Narendra Modi at the Lata Mangeshkar Chowk in Ayodhya, Uttar Pradesh pic.twitter.com/ZSkQVt41a3 — ANI (@ANI) December 30, 2023 ఆమె ఇంట్లో ఛాయ్ తాగిన ప్రధాని మోదీ అయోధ్య పర్యటనలో మోదీ తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారు ఉజ్వల యోజన లబ్ధిదారురాలి ఇంటికి వెళ్లారు ఆమె ఇంట్లో టీ తాగి.. కుటుంబ సభ్యులతో ముచ్చటించారు పీఎం ఉజ్వల యోజన కింద 10 కోట్ల మంది లబ్ధిదారులున్న సంగతి తెలిసిందే కాసేపట్లో అయోధ్య ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును ప్రారంభించనున్న ప్రధాని మోదీ అమృత్ భారత్ను ప్రారంభించిన ప్రధాని రెండు అమృత్ భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ అంతకు ముందు.. రైలులోని విద్యార్థులతో ప్రధాని మోదీ మాటామంతీ అయోధ్య పర్యటనలో రెండు అమృత్ భారత్ రైళ్లు, ఆరు వందేభారత్ రైళ్లను వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోదీ #WATCH | Ayodhya, Uttar Pradesh: PM Narendra Modi flags off two new Amrit Bharat trains and six new Vande Bharat Trains. pic.twitter.com/Q1aDQc8wG7 — ANI (@ANI) December 30, 2023 అయోధ్య ధామ్ జంక్షన్ ప్రారంభం అయోధ్య రైల్వే స్టేషన్ ప్రారంభించిన ప్రధాని మోదీ అయోధ్య ధామ్ జంక్షన్గా అయోధ్య రైల్వే స్టేషన్కు నామకరణం రూ.240 కోట్లతో పునరుద్ధరణ పనులు అయోధ్య మందిర చిత్రాలతో.. హైటెక్ హంగులతో స్టేషన్ మూడు అంతస్థులతో అయోధ్య జంక్షన్ పునర్నిర్మాణం #WATCH | Prime Minister Narendra Modi inaugurates the Ayodhya Dham Junction railway station, in Ayodhya, Uttar Pradesh Developed at a cost of more than Rs 240 crore, the three-storey modern railway station building is equipped with all modern features like lifts, escalators,… pic.twitter.com/oJMFLsjBnp — ANI (@ANI) December 30, 2023 #WATCH | Prime Minister Narendra Modi inaugurates the Ayodhya Dham Junction railway station, in Ayodhya. Uttar Pradesh Governor Anandiben Patel, CM Yogi Adityanath, Railways Minister Ashwini Vaishnaw are also present. pic.twitter.com/ls97j4eKkE — ANI (@ANI) December 30, 2023 भगवान रामलला की नगरी में #PMModi, उनके रोड शो में उमड़ा जनसैलाब, जय श्री राम की गुंज के बीच 'अयोध्या धाम जंक्शन' का किया उद्घाटन। #Ayodhya @BJP4India @narendramodi #RamMandir pic.twitter.com/gv8Ewzed39 — Aviral Singh (@aviralsingh15) December 30, 2023 దారిపొడవునా.. ప్రధానికి సాదర స్వాగతం ఆధ్యాత్మిక నగరి అయోధ్యలో కొనసాగుతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన రైల్వే స్టేషన్ వరకు 15 కిలోమీటర్ల దూరం మెగా రోడ్ షో దారి పొడవునా ప్రధానికి ప్రజలు సాదర స్వాగతం మధ్య మధ్యలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 1,400 మంది కళాకారుల ప్రదర్శన ఆధునిక హంగులు, రామమందిర చిత్రాలతో పునరుద్ధరించిన అయోధ్య రైల్వేస్టేషన్ను కాసేపట్లో ప్రారంభించనున్న ప్రధాని మోదీ #WATCH | People shower flower petals on Prime Minister Narendra Modi as he holds a roadshow in Ayodhya, Uttar Pradesh PM Modi will inaugurate the Maharishi Valmiki International Airport Ayodhya Dham, redeveloped Ayodhya Dham Railway Station, and flag off new Amrit Bharat… pic.twitter.com/b53mxsHFml — ANI (@ANI) December 30, 2023 అయోధ్య ప్రజలకు ప్రధాని మోదీ అభివాదం #WATCH | PM Narendra Modi greets people as he arrives in Ayodhya, Uttar Pradesh PM Modi will inaugurate the Maharishi Valmiki International Airport Ayodhya Dham, redeveloped Ayodhya Dham Railway Station, and flag off new Amrit Bharat trains and Vande Bharat trains. pic.twitter.com/zqpaqjzzW4 — ANI (@ANI) December 30, 2023 అయోధ్యలో ప్రధాని మోదీ మెగా రోడ్ షో అయోధ్య పర్యటనలో మెగా రోడ్షోలో పాల్గొంటున్న ప్రధాని నరేంద్ర మోదీ దారికి ఇరువైపులా బారులు తీరిన జనం అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతున్న ప్రధాని మోదీ మోదీకి ఘనంగా స్వాగతం ప్రత్యేక ఆకర్షణగా.. సాంస్కృతిక కళల ప్రదర్శన #WATCH | Prime Minister Narendra Modi arrives in Ayodhya, Uttar Pradesh PM Modi will inaugurate the Maharishi Valmiki International Airport Ayodhya Dham, redeveloped Ayodhya Dham Railway Station, and flag off new Amrit Bharat trains and Vande Bharat trains. pic.twitter.com/c60Tzh4Xkb — ANI (@ANI) December 30, 2023 రాముడు అందరివాడు: ఫరూక్ అబ్దుల్లా అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంపై జమ్ము మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా స్పందన అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది అందుకు కృషి చేసిన ప్రతీ ఒక్కరికీ అభినందనలు రాముడు కేవలం హిందువులకే దైవం కాదు.. ప్రపంచంలో ప్రతీ ఒక్కరికీ దేవుడే.. అది పుస్తకాల్లోనూ రాసి ఉంది ప్రజలంతా మత, భాష బేధాలు లేకుండా సోదరభావంతో, ప్రేమతో, ఐక్యంగా ఉండాలని శ్రీరాముడు విశ్వ సందేశం ఇచ్చారు కాబట్టి ఆలయం ప్రారంభం అయ్యే సమయంలో అంతా సోదరభావంతో మెలగాలి #WATCH | Poonch, J&K: Former CM of Jammu and Kashmir and National Conference leader Farooq Abdullah says, "Ayodhya Ram Temple is about to be inaugurated. I would like to congratulate everyone who made the effort for the temple. It's ready now. I would like to tell everyone that… pic.twitter.com/V7Pb5Q8uN1 — ANI (@ANI) December 30, 2023 ►అయోధ్య చేరుకున్న ప్రధాని మోదీ ప్రధానికి రాష్ట్ర గవర్నర్ ఆనందిబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం ఎయిర్పోర్టు నుంచి 15 కిలోమీటర్లు సాగే రోడ్ షోలో పాల్గొననున్న మోదీ Prime Minister Narendra Modi arrives in Ayodhya; received by Uttar Pradesh Governor Anandiben Patel and CM Yogi Adityanath PM Modi will inaugurate the Maharishi Valmiki International Airport Ayodhya Dham, redeveloped Ayodhya Dham Railway Station, and flag off new Amrit Bharat… pic.twitter.com/yWqDDowRcm — ANI (@ANI) December 30, 2023 ►కాసేపట్లో అయోధ్యకు ప్రధాని నరేంద్ర మోదీ.. ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు కాసేపట్లో ప్రధాని అయోధ్య విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఘనస్వాగతంతో ముందుకు సాగుతారు. ఆధునిక హంగులు, రామమందిర చిత్రాలతో పునరుద్ధరించిన అయోధ్య రైల్వేస్టేషన్ను, మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాల అనంతరం విమానాశ్రయం పక్కనున్న మైదానంలో ఏర్పాటుచేసే ‘జన్ సభ’లో మాట్లాడతారు. ఈ సభకు లక్షన్నర మంది హాజరయ్యే అవకాశముంది. సభానంతరం ప్రధాని తిరుగు పయనమవుతారు ►అయోధ్యలో నాలుగు గంటలపాటు ఉండనున్న ప్రధాని #WATCH | Ayodhya: BJP MP Lallu Singh says, "Entire Ayodhya has been decorated. The people of Ayodhya are waiting eagerly for the most popular world leader, PM Modi...Devotees of Lord Ram in Ayodhya will welcome PM Modi with warmth." pic.twitter.com/h8Njr7Qinr — ANI (@ANI) December 30, 2023 ►అయోధ్యలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు రూ.11,100 కోట్ల ప్రాజెక్టులను, యూపీలోని ఇతర ప్రాంతాల అభివృద్ధికి రూ.4,600 కోట్ల పనులను ప్రారంభిస్తారు. అలాగే రామ మందిరానికి చేరుకునేలా కొత్తగా పునరుద్ధరించిన నాలుగు రహదారుల ప్రారంభం కూడా ప్రధాని షెడ్యూలులో ఉన్నట్లు పీఎంవో తెలిపింది. ►ఉత్తర ప్రదేశ్ ఆధ్యాత్మిక నగరం అయోధ్యలో నేడు అత్యాధునిక ఎయిర్పోర్ట్, ఆధునిక హంగులు సంతరించుకున్న రైల్వే స్టేషన్ ప్రారంభం ►రామమందిర శంకుస్థాపనకు ముందే అంతర్జాతీయ విమానాశ్రయాన్ని, ఆధునీకరించిన అయోధ్య రైల్వే స్టేషన్ ప్రారంభం కావడం గమనార్హం ► ప్రధాని మోదీ చేతుల మీదుగా.. మొత్తం రూ. 15 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన ►మోదీ పర్యటన నేపథ్యంలో నగరంలో భద్రత పటిష్టం ►డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్తో అణువణువూ తనిఖీలు.. డ్రోన్లతో నిఘా ►పూలతో అందంగా ముస్తాబైన అయోధ్య ►అయోధ్యలో రూ.1,450 కోట్లతో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మాణం Ayodhya Airport completed in record time of 20 months: Airport Authority Chairman Read @ANI Story | https://t.co/RSOVcfxEAc#AyodhyaAirport #Ayodhya #UttarPradesh #AAI pic.twitter.com/1v3OZwnS0Z — ANI Digital (@ani_digital) December 30, 2023 ►6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో టెర్మినల్ భవనం ►ఇక్కడి నుంచి ఒకేసారి 600 మంది ప్రయాణికులు రాకపోకలు ►‘మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయోధ్యధామం’గా పేరు ఆధునీకరించిన అయోధ్య రైల్వే స్టేషన్కు ‘అయోధ్య ధామ్ జంక్షన్’గా నామకరణం శ్రీరాముడి స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ పలు సుందర నిర్మాణాలు శిఖరం, విల్లు బాణం వంటి గుర్తులు నాలుగు ఎత్తయిన గోపురాలతో 11,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రైల్వే స్టేషన్ విస్తరణ రైల్వే శాఖ అనుబంధ సంస్థ అయిన రైల్ ఇండియా టెక్నికల్, ఎకనామిక్ సర్వీసెస్ లిమిటెడ్(రైట్స్) ఆధ్వర్యంలో అభివృద్ధి ►మరోవైపు.. అయోధ్యలో ఊపందుకున్న భవ్య రామమందిర ప్రారంభోత్సవ ఏర్పాట్లు ►అయోధ్య నగరానికి 15 కి.మీ.ల దూరాన ఉన్న ఎయిర్పోర్టు నుంచి రైల్వేస్టేషనుకు వెళ్లే మార్గం పొడవునా ప్రధాని రోడ్షో ఉంటుందని అధికారవర్గాలు వెల్లడించాయి. ఈ మార్గంలో ఏర్పాటుచేసే 40 వేదికలపై దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 1,400 మంది కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. -
కొవ్వూరు రైల్వేస్టేషన్లో రైళ్లను పునరుద్ధరించాలి: తానేటి వనిత
సాక్షి, విజయవాడ: కరోనా సమయంలో లాక్ డౌన్ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా కొవ్వూరు రైల్వేస్టేషన్లో రద్దు చేసిన రైళ్లును పునరుద్దరించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత కోరారు. శనివారం ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న నిర్మలా సీతారామన్ను విజయవాడలో కలిసి ఈ మేరకు ఆయా రైళ్ల వివరాలను ప్రత్యేక లేఖ ద్వారా ఆమె దృష్టికి తీసుకెళ్లారు. కొవ్వూరు రైల్వేస్టేషన్లో రెగ్యులర్గా నిలుపుదల చేయవలసిన రైళ్లను నిలుపుదల చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని వివరించారు. హైదరాబాద్, మద్రాసు, బెంగుళూరు, తిరుపతి వెళ్లే ప్రయాణికులు రైళ్లు నిలుపుదల చేయకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారని, వ్యయ ప్రయాసలకు గురై రాజమహేంద్రవరం వెళ్లి రైళ్లు ఎక్కవలసి వస్తుందన్నారు. ప్రజలశేయస్సు దృష్ట్యా కొవ్వూరు స్టేషన్లో కొవిడ్ కారణంగా రద్దుచేసిన రైళ్లును పునరుద్ధరించాలని కోరారు. సదరు విజ్ఞప్తిని కేంద్ర రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి కొవ్వూరు నియోజకవర్గ ప్రజల ఇబ్బందులను తొలగించాలని నిర్మలా సీతారామన్ ను హోంమంత్రి తానేటి వనిత కోరారు. కొవ్వూరు రైల్వేస్టేషన్ కొవ్వూరు, పోలవరం, గోపాలపురం మొత్తం మూడు నియోజకవర్గాల్లోని ప్రజలకు అందుబాటులో ఉంటుందని వివరించారు. కరోనా లాక్ డౌన్ అనంతరం 4 రైళ్లను మాత్రమే పునరుద్దరించారని.. మరో 9 రైళ్లను పునరుద్దరించాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు. కొవ్వూరులో పునరుద్దరించాల్సిన రైళ్ల జాబితాను అందజేశారు. పునరుద్దరించాల్సిన రైళ్లలో విజయవాడ వైపు, విశాఖపట్నం వైపు తిరిగే రైళ్లున్నాయి. తిరుమల ఎక్స్ ప్రెస్ (17488, 17487), సర్కార్ ఎక్స్ ప్రెస్ (17644, 17643), బొకారో ఎక్స్ ప్రెస్ (13351, 13352), కాకినాడ-తిరుపతి ఎక్స్ ప్రెస్ (17250, 17249), సింహాద్రి ఎక్స్ ప్రెస్ (17240, 17239), తిరుపతి-పూరి ఎక్స్ ప్రెస్ (17479, 17480), మచిలీపట్నం-విశాఖపట్నం ఎక్స్ ప్రెస్ (17220, 17219), రాయగడ-గుంటూరు ఎక్స్ ప్రెస్ (17244, 17243), బిలాస్ పూర్ ఎక్స్ ప్రెస్ (17482, 17481) రైళ్లకు కొవ్వూరు రైల్వేస్టేషన్ లో ఆగేవిధంగా పునరుద్దరించాలని హోంమంత్రి అందజేసిన లేఖలో పేర్కొన్నారు. హోంమంత్రి విజ్ఞప్తి పై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారు. కొవ్వూరు రైల్వే స్టేషన్లో రైళ్లు నిలుపుదల పునరుద్ధరణకు తన వంతు కృషి చేస్తానని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. -
రైల్వే స్టేషన్లో చీకట్లు... లగేజీలు చోరీ, పడిపోయిన ప్రయాణికులు!
అది మధ్యప్రదేశ్లోని జబల్పూర్ రైల్వేస్టేషన్.. తాము ఎక్కబోయే రైలు కోసం ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు. ఇంతలో హఠాత్తుగా స్టేషన్లో కరెంట్ పోయింది. ప్రయాణికులకు మొదట ఏమీ అర్థం కాలేదు. చాలా సేపు ఇదే పరిస్థితి నెలకొనడంతో స్టేషన్లో గందరగోళం ఏర్పడింది. జబల్పూర్ ప్రధాన స్టేషన్లోని విద్యుత్ వ్యవస్థ మొత్తం కుప్పకూలడంతో ప్లాట్ఫారమ్ నంబర్ వన్ నుంచి ప్లాట్ఫామ్ ఆరు వరకు స్టేషన్ ఆవరణ అంతా అంధకారమయం అయ్యింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో టికెట్ కౌంటర్ కూడా మూతపడింది. ఇది చూసిన ప్రయాణికులు నానా హంగామా చేశారు. ఈ ఘటన జరిగి రెండు రోజులైనా దీనికి బాధ్యులెవరనేది అధికారులు తేల్చలేదు. స్టేషన్ మొత్తంమీద గంటల తరబడి విద్యుత్ లేకపోవడంతో చాలా మంది ప్రయాణికుల సామాను చోరీకి గురయ్యింది. చీకటిమాటున దొంగలు రెచ్చిపోయారు. చీకటిలో ఎదుట ఏమున్నదో తెలియక పలువురు ప్రయాణికులు నడిచేటప్పుడు పడిపోయారు. ఈ ఘటన అనంతరం సంబంధిత శాఖ ఇంజినీర్లు మరమ్మతులు చేపట్టారు. గంట తరువాత తిరిగి విద్యుత్ పునరుద్ధరణ జరిగింది. స్టేషన్లో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్యానెల్లో లోపం కారణంగా, ప్లాట్ఫారమ్తో సహా మొత్తం స్టేషన్ ప్రాంగణం, వివిధ రైల్వే విభాగాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జనరేటర్ను ఉపయోగించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఎట్టకేలకు ప్యానల్కు మరమ్మతులు చేసిన తర్వాత విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరిగింది. ఇది కూడా చదవండి: ఒడిశా, బీహార్ గుణపాఠాల తర్వాత రైల్వేశాఖ ఏం చేస్తున్నదంటే.. -
సింహాచలం స్టేషన్కు ‘అమృత’ భాగ్యం!
సాక్షి,విశాఖపట్నం : సింహాచలం రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ శనివారం ప్రారంభించారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో రూ.20 కోట్లతో రైల్వే శాఖ సింహాచలం స్టేషన్ అభివృద్ధి పనులను చేపట్టింది. అభివృద్ధి పనుల ప్రారంభం సందర్భంగా రైల్వే మంత్రి మాట్లాడుతూ విజయనగరం జిల్లా కంటకాపల్లి రైల్వే ప్రమాదం మానవ తప్పిదం వల్లే జరిగిందన్నారు. ఈ ఘటనపై ఇంకా విచారణ కొనసాగుతోందని చెప్పారు. ‘త్వరలో మరిన్ని వందే భారత్ రైళ్ళు పట్టాలెక్కనున్నాయి. వారానికి ఒక వందే భారత్ రైలు నిర్మాణం జరుగుతోంది. రైల్వేలను రాజకీయాలతో ముడిపెట్టి చూడొద్దు. ఏపీలో రైల్వేల అభివృద్ధి కోసం 8వేల 406కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. భూ కేటాయింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. దేశంలో 5జీ మొబైల్ సర్వీసుల విస్తరణ చాలా వేగంగా జరుగుతోంది. దీపావళి నాటికి బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి. నాలుగువేల నూతన సెల్ ఫోన్ టవర్లు ఏర్పాటవుతున్నాయి. ఇందులో ఎక్కువ ఉత్తరాంధ్రలోనే నిర్మాణం జరుగుతున్నాయి’అని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇదీచదవండి..విశాఖలో అమెరికా దిగ్గజ ఐటీ అనుబంధ సంస్థ -
మిచౌంగ్: చెన్నై అతలాకుతలం, జనం ఇక్కట్లు, వైరల్ వీడియోలు
తమిళనాడులో మిచౌంగ్ తుపాను ప్రజలను వణికిస్తోంది. భారీ వర్షాలతో ముఖ్యంగా చెన్నై నగరం అతలాకుతలమవుతోంది. ప్రధాన రహదారులన్నీ జలమయ మయ్యాయి. రాకపోకలకు తీవ్ర అంతాయం ఏర్పడింది. ఒకచోట మొసలి రోడ్డుపైకి దృశ్యంతోపాటు, తుపాను బీభత్సానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. రన్వేపైకి నీరు చేరడంతో చెన్నై విమానాశ్రయాన్ని కూడా మూసివేశారు. దీంతోపాటు ఎవరూ బయటకు రావొద్దంటూ అధికారులు హెచ్చరించారు. రోడ్లన్నీ వరద నీటితో మునిగిపోవడంతో చెన్నై ప్రజారవాణా వ్యవస్థ అస్తవ్యస్థంగా మారిపోయింది. దీంతో నగర వాసుల ఇబ్బందులు అన్ని ఇన్నీకావు. ఇప్పటికే దేశవ్యాప్తంగా తుపాను ప్రభావిత ప్రాంతాలకు పాక్షికంగా లేదా పూర్తిగా రైళ్ల సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. చెన్నైలోని చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముగ్గురు వ్యక్తులు మరణించారు. చెన్నైతో పాటు మరో మూడు జిల్లాల్లో రేపు ప్రభుత్వ సెలవు ప్రకటించారు. బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన తుపాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వెళ్లే అవకాశం ఉంది. అర్ధరాత్రి సమయంలో తుపాను నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ నిపుణుల అంచనా. 🌀 #Michaungcyclone Police in action. Rescuing a family from a low lying area in Perumal Koil street, Kotturpuram. Removing the fallen trees. #ChennaiRain #Update@SandeepRRathore@R_Sudhakar_Ips@ChennaiTraffic pic.twitter.com/3hqSMEFr5P — GREATER CHENNAI POLICE -GCP (@chennaipolice_) December 4, 2023 Chennai @Suriya_offl fans on duty! Provided food items and other materials at the affected areas.#ChennaiRains #CycloneMichuang pic.twitter.com/WIseZuk3WH — Suriya Fans Club (@SuriyaFansClub) December 4, 2023 -
ఈ రైల్వే స్టేషన్ పేరు సచిన్!
స్టేడియంల సంగతి ఏమిటోగానీ రైల్వేస్టేషన్లకు క్రికెటర్ల పేర్లు ఊహించలేము. అయితే గుజరాత్లోని సూరత్ సమీపంలోని ఒక రైల్వేస్టేషన్ పేరు సచిన్. మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఈ రైల్వేస్టేషన్ ముందు దిగిన ఫోటో వైరల్గా మారింది. ‘ఈ రైల్వేస్టేషన్కు మన ఆల్టైమ్ గ్రేట్ క్రికెటర్లలో ఒకరైన నా ఫేవరెట్ క్రికెటర్, నా అభిమాన వ్యక్తి పేరు పెట్టారు. గత శతాబ్దానికి చెందిన పెద్దల ముందు చూపు అబ్బురపరుస్తుంది’ అని ఇన్స్టాగ్రామ్లో రాశాడు సునీల్ గవాస్కర్. ఇది చూసి ‘సచిన్లో సన్నీని చూడడం ఆనందంగా ఉంది’ అంటూ స్పందించాడు సచిన్ తెందూల్కర్. నిజానికి ఈ రైల్వేస్టేషన్కి ‘సచిన్’ అనే పేరు సచిన్ తెందూల్కర్ తాతముత్తాల కాలంలోనే ఉంది. సచిన్ తెందూల్కర్ పేరుకు, ఈ రైల్వేస్టేషన్ పేరుకు ఎలాంటి సంబంధం లేకపోయినా సరదా కోసం ‘పూర్వీకుల ముందుచూపు అబ్బురపరిచింది’ అని రాశాడు గవాస్కర్. -
‘నలంద’ విద్యార్థిని ఆత్మహత్య
అనంతపురం క్రైం: నగరంలోని రైల్వేస్టేషన్ వద్ద ఉన్న నలంద జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతున్న పాటిల్ సుధ (18) అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కాలేజీ హాస్టల్ భవనంపై నుంచి దూకి మృతిచెందింది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. బొమ్మనహాళ్ మండలం కల్లుహోళ గ్రామానికి చెందిన శంకర్గౌడ్, రత్నమ్మ దంపతుల కుమారై సుధ నగరంలోని నలంద కళాశాలలో ఇంటర్ (సీఈసీ గ్రూపు) రెండో సంవత్సరం చదువుతోంది. సమీపంలోని మేడా నర్సింగ్ హోం వద్ద ఉన్న అదే కళాశాల హాస్టల్లో ఉంటోంది. గౌరమ్మ పండుగ కోసం ఇటీవల ఊరెళ్లిన సుధ శుక్రవారం తిరిగొచ్చింది. మధ్యాహ్నం 2.40 గంటలకు హాస్టల్కు చేరుకుంది. తండ్రికి ఫోన్ చేసి తాను చేరుకున్న విషయం చెప్పింది. అనంతరం కళాశాలకు వెళ్లి సాయంత్రం 5.52 గంటలకు మిత్రులతో కలసి హాస్టల్కు తిరిగొచ్చింది. నాల్గవ అంతస్తులోని రూమ్ నంబర్–7లో తనతో పాటు మరో ఐదుగురు విద్యార్థినులు ఉంటున్నారు. వారితో కొంతసేపు మాట్లాడిన తర్వాత కన్నీళ్లు పెట్టుకుంటూ గదిలోంచి బయటకు వచ్చింది. గది తలుపులకు బయట గడియ పెట్టింది. కారిడార్ వాష్ బేషిన్ వైపు వెళ్లింది. అక్కడ లాక్ చేసి ఉన్న గ్రిల్డోర్ పైకి ఎక్కి కారిడార్ వైపు కిందకు దిగింది. నాల్గవ అంతస్తు నుంచి సరిగ్గా 6.44 గంటలకు కిందకు దూకింది. బయట నుంచి పెద్ద శబ్దం రావడంతో గది లోపలున్న విద్యార్థినులు గట్టిగా తలుపులు తట్టారు. ఆ శబ్దానికి వార్డెన్ వచ్చి తలుపులు తీసి ఎందుకిలా చేస్తున్నారంటూ ఆరా తీశారు. సుధ కిందకు పడిపోయిన శబ్దం వచ్చిందని చెప్పారు. దీంతో కిందకు చూడగా హాస్టల్ పక్క కాంపౌండులోని సిమెంటు ప్లాట్ఫాంపై పడి ఉంది. ఆమెను వెంటనే పక్కనే ఉన్న ప్రైవేటు నర్సింగ్ హోమ్కు..అక్కడి నుంచి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స ప్రారంభించిన గంట వ్యవధిలోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గోప్యంగా ఉంచిన కాలేజీ యాజమాన్యం ఘటన శుక్రవారం సాయంత్రం 6.44 గంటలకు జరగ్గా..కాలేజీ యాజమాన్యం మాత్రం రాత్రి తొమ్మిది గంటలకు పోలీసులకు సమాచారం ఇచ్చింది. విద్యార్థిని తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు స్వగ్రామం నుంచి అర్ధరాత్రి అనంతపురానికి చేరుకున్నారు. ఆ తర్వాతే విషయం బయటకు తెలిసింది. విద్యార్థి సంఘాల నేతలు శనివారం కాలేజీ హాస్టల్ ముందు ఆందోళన చేపట్టారు. విద్యార్థిని మృతికి కారణమైన కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుమార్తె మృతిపై అనుమానాలున్నాయి.. కళాశాల యాజమాన్యం వైఖరితోనే తమ బిడ్డ చనిపోయిందని, మృతిపై అనుమానాలు ఉన్నాయని సుధ తల్లిదండ్రులు త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒంటిపై ఎక్కడా రక్తగాయాలు లేకపోయినా గొంతు కింది భాగంలో మాత్రం గాట్లు ఉన్నట్లు తెలిపారు. నాలుగు అంతస్తుల భవనంపై నుంచి కిందకు పడితే శరీరం ఛిద్రమవుతుందని, కానీ కనీసం కాలు, చెయ్యి కూడా చెక్కు చెదరలేదని, తమ బిడ్డను హత్య చేసి కిందకు నెట్టి ఉండొచ్చని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా.. విద్యార్థిని మృతి ఘటనను ఎస్పీ అన్బురాజన్ సీరియస్గా పరిగణించారు. మృతికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. దిశ డీఎస్పీ ఆంథోనప్పను దర్యాప్తు అధికారిగా నియమించారు. లెయ్ తల్లి ఊరికి వెళదాం! సుధ మృతిని తల్లి రత్నమ్మ జీర్ణించుకోలేక పోయింది. ‘అమ్మా సుధా.. లెయ్ తల్లి ఊరికి వెళదాం’ అంటూ కుమార్తె మృతదేహంపై పడి గుండెలవిసేలా రోదిస్తుంటే ఆమెను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. చివరికి పోలీసులే ధైర్యం చెప్పారు. ‘బాగా చదువుతుంది సార్..బుద్ధిమంతురాలు. ఎవరితోనూ గొడవలకు వెళ్లదు. ఏ దేవుడికి కన్నుకుట్టి నా బిడ్డను ఇలా తీసుకుపోయాడో’ అంటూ కన్నీరు మున్నీరైంది. ‘మంచిగా చదివి నాన్నను, నిన్ను బాగా చూసుకుంటానంటివే. ఇలా మోసం చేసి వెళ్లిపోయావా తల్లీ’ అంటూ గుండెలు బాదుకుంది. లోతుగా దర్యాప్తు చేస్తాం విద్యార్థిని సుధ మృతికి దారి తీసిన కారణాలపై లోతుగా దర్యాప్తు చేస్తామని దిశ డీఎస్పీ ఆంథోనప్ప తెలిపారు. ఆయన శనివారం నగర డీఎస్పీ ప్రసాద్రెడ్డి, వన్టౌన్ సీఐ రెడ్డప్పతో కలసి విలేకరులతో మాట్లాడారు. సుధ కిందకు దూకినప్పుడు కుడికాలు ముందుగా నేలను తాకి తొడ ఎముకభాగం విరిగిందని, దానిపై ఉన్న బర్రెముకలు కూడా విరిగిపోయి కొసలు ఊపిరితిత్తుల్లోకి చొచ్చుకుపోయాయని తెలిపారు. దీనివల్ల ఊపిరితిత్తుల్లోకి, ఇతర శరీరభాగాల్లోకి రక్తం వెళ్లి గడ్డ కట్టడం వల్ల హేమరేజ్ షాక్ జరిగి మృతి చెందిందని వివరించారు. -
ఈ పెట్టెల్లో ఏముందో?
కర్ణాటక: శివమొగ్గ నగరంలోని ప్రధాన రైల్వేస్టేషన్లో ఆదివారం రెండు పెట్టెలు కలకలం సృష్టించాయి. రేకు పెట్టెలను విడివిడిగా జనపనార సంచిలో కట్టి ఉంచారు. ఆ పెట్టెల దగ్గర ఎవరూ లేకపోవడంతో రైల్వే సిబ్బందికి అనుమానం వచ్చి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైల్వేస్టేషన్లోని పార్కింగ్ ప్రదేశం కాంపౌండ్ వద్ద రెండు పెట్టెలు కనిపించాయి. గంటలు గడిచినా ఎవరూ తీసుకోకపోవడంతో స్థానికులకు, రైల్వే సిబ్బందికి అనుమానం వచ్చింది. అలాగే జయనరగ పోలీసులకు కూడా కాల్ చేశారు. పోలీసులు జాగిలాలు, బాంబు తనిఖీ సిబ్బందితో వచ్చి పెట్టెలను తెరవకుండానే పరిశీలించారు. తరువాత వాటిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఒక చిన్న కారులో వచ్చి ఆ పెట్టెలను అక్కడ పెట్టి వెళ్లినట్లు సీసీ కెమెరాలలో రికార్డయింది. -
ఏ రైల్వే స్టేషన్ ఎప్పుడు పుట్టిందో?
సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, కాజీపేట్,వరంగల్, ఖమ్మం.... ఇలాంటి ప్రముఖ రైల్వే స్టేషన్లు ఎప్పుడు స్థాపించారు.. ఎలా ఆవిర్భవించాయి ?.. వాటి పుట్టుకలో కీలక భూమిక ఎవరిది..?.. నాటి ఏ పరిస్థితి వల్ల అక్కడ స్టేషన్ ఏర్పాటైంది? –ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు ఇలాంటి వివరాల సేకరణలో తలమునకలై ఉన్నారు. ప్రత్యేకంగా కొంతమందిని ఇందుకోసం పురమాయించారు. సదరు సిబ్బంది ఆ వివరాల సేకరణకు ఉరుకులు పరుగులు మొదలుపెట్టారు. ఏ స్టేషన్ ఎప్పుడు ఏర్పడిందో వివరాలు తెలిస్తే.. వాటి పుట్టిన రోజు (ఆవిర్భావ దినోత్సవం) వేడుకలు నిర్వహిస్తారట. మోదీ చేసినప్రస్తావనే ఆదేశంగా భావిస్తూ.. ఇటీవల దేశవ్యాప్తంగా తొమ్మిది వందేభారత్ రైళ్లను రైల్వే శాఖ పట్టాలెక్కించింది. ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా జెండా ఊపి వాటిని ప్రారంభించారు. ఈ సందర్భంలో ఆయన, ప్రజలను రైల్వేకు మరింత చేరువ చేసే క్రమంలో రైల్వే స్టేషన్లకు పుట్టినరోజు వేడుకలు చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. తమిళనాడులోకి కోయంబత్తూరు, ముంబయిలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్ స్టేషన్ల భవనాలకు ఇటీవల స్థానిక రైల్వే అధికారులు ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించారు. వీటిని ఉదహరించిన మోదీ, మిగతా వాటికి కూడా నిర్వహించనున్నట్టు ప్రకటించారు. కానీ, విధానపరంగా అలాంటి నిర్ణయం ఇప్పటి వరకు లేదని రైల్వే శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఉన్నట్టుండి ప్రధాని స్వయంగా పేర్కొనేసరికి, వెంటనే కొన్ని స్టేషన్ భవనాలకు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించాలని, ఆయా స్టేషన్లతో అనుబంధం ఉన్న ప్రముఖులు, సాధారణ ప్రయాణికులను పెద్ద సంఖ్యలో పిలిపించి అట్టహాసంగా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో, సమీపంలో ఏయే స్టేషన్ల ఆవిర్భావ రోజులున్నాయో గుర్తించే పనిలో పడ్డారు. వివరాలు సేకరిస్తున్నాం ‘‘రెండు స్టేషన్ల పుట్టినరోజు వేడుకలను ప్రధాని స్వయంగా ప్రస్తావించారు. కానీ, ఇప్పటి వరకు మాకు అలాంటి నిర్ణయంపై సమాచారం లేదు. ప్రధాని స్వయంగా చెప్పారంటే, ఆదేశాలతో సంబంధం లేకుండా మేం నిర్వహించాల్సిందే. అందుకే వివరాలు సేకరిస్తున్నాం’ అని ఓ ఉన్నతాధికారి చెప్పుకొచ్చారు. -
కూత.. సంబరాల మోత.. దశాబ్దాల కల సాకారమైన వేళ..
సిద్దిపేట: సిద్దిపేట ప్రజల దశాబ్దాల కల కళ్ల ముందు ఆవిష్కృతమైంది. ఎన్నో ఏళ్లుగా రైలు సౌకర్యం కోసం ఎదురుచూసిన క్షణాలు నిజమయ్యాయి. సిద్దిపేట–సికింద్రాబాద్ మధ్య రైలు ప్రయాణికులతో పరుగులు పెట్టింది. మంగళవారం నిజామాబాద్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా, సిద్దిపేట రైల్వేస్టేషన్ వద్ద రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు జెండా ఊపి రైలును ప్రారంభించారు. ఈ సందర్భంగా రైల్వేస్టేషన్, పరిసరాలను అందంగా ముస్తాబు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రైలు వద్ద సెల్ఫీలు దిగుతూ మురిసిపోయారు. కొంత మంది సరదాగా రైలులోకి ఎక్కారు. బీఆర్ఎస్ కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకుంటూ మంత్రికి స్వాగతం పలికారు. మంత్రి హరీశ్రావు దుద్దెడ స్టేషన్ వరకు రైలులో ప్రయాణించారు. తొలి ప్రయాణంలో 327 మంది ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్రావు, ఫారుఖ్ హుస్సేన్, జెడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ, కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. -
అంతర్జాతీయ స్థాయిలో విశాఖ రైల్వేస్టేషన్ అభివృద్ధి
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): విశాఖపట్నం రైల్వేస్టేషన్ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని కేంద్ర రైల్వే, జౌళి శాఖల సహాయ మంత్రి దర్శనా జర్దోష్ తెలిపారు. వాల్తేర్ డివిజన్ డీఆర్ఎం సౌరబ్ ప్రసాద్తో కలిసి శనివారం విశాఖపట్నం రైల్వేస్టేషన్ను ఆమె సందర్శించారు. విశాఖ రైల్వేస్టేషన్ దేశంలో రద్దీ స్టేషన్లలో ఒకటని, నిత్యం వేలాదిమంది రాకపోకలు సాగిస్తుంటారని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో దీన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు స్టేషన్ రీడెవలప్మెంట్ ప్రాజెక్టును ప్రధాని మోదీ ప్రారంభించారని చెప్పారు. ఈ పనులపై గతిశక్తి, వాల్తేర్ డివిజన్ అధికారులతో దర్శనా జర్దోష్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జరుగుతున్న పనుల గురించి అధికారులు ఆమెకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తర్వాత ఆమె ఒకటో నంబర్ గేట్ వైపు ప్రారంభమైన మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ను సందర్శించారు. రైల్వేస్టేషన్, స్టేషన్ రీ డెవలప్మెంట్ ప్రాజెక్టు పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న పారిశుధ్య కారి్మకులకు హెల్త్ కిట్స్ను అందజేశారు. అనంతరం ఏటికొప్పాక బొమ్మలతో వన్ స్టేషన్–వన్ ప్రొడక్ట్ పథకం కింద ఏర్పాటు చేసిన స్టాల్ను పరిశీలించారు. అమ్మకాలు, స్టేషన్ అధికారుల ప్రోత్సాహం, సహకారం గురించి స్టాల్ యజమానితో మాట్లాడారు. 24/7 రైల్ కోచ్ రెస్టారెంట్ ప్రారంభం రైల్వేస్టేషన్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన 24/7 రైల్ కోచ్ రెస్టారెంట్ను మంత్రి దర్శనా జర్దోష్ ప్రారంభించారు. రైల్వే ప్రయాణికులకు, నగర వాసులకు ఈ రెస్టారెంట్ 24 గంటలు అందుబాటులో ఉంటుంది. వాల్తేర్ డివిజన్ అధికారుల, సిబ్బంది పనితీరును మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు. -
రైల్వే కూలీగా రాహుల్ గాంధీ
ఢిల్లీ: ఢిల్లీలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ.. కూలీ నెం.1లో వెంకటేశ్లా కనిపించారు. ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్లో ఎర్రని చొక్కా ధరించి నెత్తిన లగేజ్ పెట్టుకుని మోశారు. రైల్వే కూలీలు ధరించి బ్యాడ్జీ ధరించి అచ్చం కూలీలాగే కనిపించి అభిమానులను అలరించారు. రాహుల్ చిరునవ్వులు చిందుతూ రైల్వే కూలీలా మూటలు మోస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. రాహుల్ గాంధీ నేడు ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ను సందర్శించారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న రైల్వే కూలీలను కలిసి వారితో ముచ్చటించారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో కూలీలు చేసే పనిని స్వయంగా చూసి తాను కూడా మూటలు మోశారు. రాహుల్ గాంధీ జిందాబాద్ అంటూ అక్కడ ఉన్న కూలీలు నినాదాలు చేశారు. ఈ వీడియోను ఎక్స్లో పంచుకున్న కాంగ్రెస్ పార్టీ.. భారత్ జోడో యాత్ర నడుస్తుందని స్పష్టం చేసింది. He came to listen to the hearts of the people…!!! Shri @RahulGandhi ji… Dressed in the coolie brothers' clothes and picked up the luggage with them at Delhi's Anand Vihar railway station, pic.twitter.com/vPMH3VHdY1 — Telangana Youth Congress (@IYCTelangana) September 21, 2023 యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ బివి కూడా 1983 చిత్రం మజ్దూర్లోని "హమ్ మెహనత్కాష్ ఈజ్ దునియా సే" పాటతో రైల్వే స్టేషన్లో రాహుల్ గాంధీ బ్యాగులు లాగుతున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. యువనేత పోస్ట్కు "ప్రజానాయకుడు" అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. जनता का नायक ❤️ pic.twitter.com/6MRkPTmlUM — Srinivas BV (@srinivasiyc) September 21, 2023 ఇదీ చదవండి: Womens Reservation Bill 2023: తక్షణమే అమలు చేయండి -
యువర్ అటెన్షన్ ప్లీజ్.. ‘పెద్దపల్లి బైపాస్’కు
సాక్షి ప్రతినిధి,కరీంనగర్: ఎన్నో దశాబ్దాలుగా కరీంనగర్ నుంచి హైదరాబాద్, ముంబై వంటి నగరాలకు రైలులో వెళ్లాలన్న పాత కరీంనగర్ వాసుల కల త్వరలో సాకారం కానుంది. ఇందుకోసం దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్–కాజీపేట–బల్లార్షా సెక్షన్ను పెద్దపల్లి–కరీంనగర్–ముంబై సెక్షన్ లైన్తో కలపనుంది. ఇటీవల పెద్దపల్లి–కరీంనగర్ మార్గాన్ని డబ్లింగ్ లైన్గా అప్గ్రేడ్ చేసేందుకు ముందుకు వచ్చిన దక్షిణ మధ్య రైల్వే తాజాగా.. కాజీపేట–బల్లార్షా, కరీంనగర్–పెద్దపల్లి లైన్లను కలపడం ద్వారా ఈ సెక్షన్లోని రైల్వే ప్రయాణంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. భూమి ఇచ్చేందుకు రైతుల అంగీకారం పెద్దపల్లి జిల్లాలోని చీకురాయి–పెద్దబొంకూరు గ్రామాల మధ్య పెద్దపల్లి బైపాస్ పేరుతో కొత్త రైల్వేస్టేషన్ నిర్మించతలపెట్టారు. ఇందుకోసం ఇటీవల రెండు గ్రామాల్లో అధికారులు గ్రామసభలు నిర్వహించారు. దాదాపు 20 ఎకరాల వరకు భూమిని ఇచ్చేందుకు రైతులు అంగీకరించారు. వారికి పరిహారం ఇచ్చేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేస్తోంది. రైల్వేస్టేషన్ నిర్మాణంలో భాగంగా ముందుగా ఎలక్ట్రిక్ లైన్ నిర్మించేందుకు ఇటీవల టెండర్లు పిలిచింది. త్వరలోనే స్టేషన్ నిర్మాణం కోసం టెండర్లు పిలవనుంది. చీకురాయి–పెద్దబొంకూరుల మధ్య పాయింట్ను వ్యూహాత్మకంగా ఎంపిక చేశారు. ఇది కాజీపేట–బల్లార్షా లైన్తో కరీంనగర్–పెద్దపల్లి లైన్ కలిసే ప్రాంతం. ఇంతకాలం ఒక రైలు కరీంనగర్ మీదుగా కాజీపేట/సికింద్రాబాద్ వైపు వెళ్లాలంటే ముందు పెద్దపల్లి జంక్షన్ చేరాలి. అక్కడ బోగీల ముందు ఉన్న ఇంజిన్ విడిపించుకొని, ముందుకు వెళ్లి మళ్లీ వెనక్కి వచ్చి కాజీపేట వైపు ఉన్న బోగీలను లింక్ చేసుకొని వెళ్లాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు పెద్దపల్లి బైపాస్ రైల్వేస్టేషన్ పూర్తయితే కాజీపేట వైపు వెళ్లే రైళ్లన్నీ కొత్త స్టేషన్ మీదుగా ఎలాంటి ఇంజిన్ మార్పులు అవసరం లేకుండా సాఫీగా సాగిపోతాయి. జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్వాసులకు కాజీపేట/వరంగల్/సికింద్రాబాద్ వైపు ప్రయాణం మరింత సులువు కానుంది. గణనీయంగా పెరిగిన ఫ్రీక్వెన్సీ కరోనాకు ముందు ఇది కేవలం సింగిల్ లైన్ మార్గం. నిజామాబాద్ వరకు కనెక్టివిటీ ఉండటం, ఈ మార్గాన్ని వందే భారత్ వంటి రైళ్లు సైతం నడిచేలా ఇటీవల 100 కి.మీ. వేగం తట్టుకునేలా ట్రాక్ సామర్థ్యం పెంచారు. గతంలో ఖాజీపేట–బల్లార్షా సెక్షన్లోని రైళ్లు సికింద్రాబాద్ మీదుగా మహారాష్ట్ర వెళ్లేవి. దీనివల్ల చాలా ఇంధనం, సమయం వృథా అయ్యేవి. ఈ మార్గం పూర్తి కావడంతో కరోనా కాలంలో పెద్దపల్లి–నిజామాబాద్ రూట్కు డిమాండ్ బాగా పెరిగింది. ప్రతీరోజు గ్రానైట్, బొగ్గు, బాయిల్డ్ రైస్, వ్యవసాయ ఉత్పత్తులు రవాణా చేసే రైళ్ల ఫ్రీక్వెన్సీ గతంలో ఎన్నడూ లేనంతగా గణనీయంగా పెరిగింది. ఫలితంగా దక్షిణ మధ్య రైల్వే జోన్లో సరుకు రవాణా రైళ్ల ద్వారా అత్యధికంగా ఆదాయం తీసుకువచ్చే రైల్వే మార్గాల్లో పెద్దపల్లి–నిజామాబాద్ ఒకటిగా ఆవిర్భవించింది. చెప్పుకోదగ్గ రైళ్లేవీ లేవు కానీ, ఈ మార్గంలో ప్రయాణికుల రైళ్లు మాత్రం చెప్పుకోదగ్గవి ఏమీలేవు. ఢిల్లీ, కోల్కతా, విశాఖపట్టణం, వారణాసి, బెంగళూరు, చైన్నె, తిరువనంతపురం నగరాలకు రైళ్లు నడపాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మార్గంలో కేవలం రెండు పుష్పుల్ (డెమూ, మెమూ) ఎక్స్ప్రెస్ రైళ్లు, కాజీపేట నుంచి దాదర్ ముంబై వీక్లీ ప్రత్యేక ఎక్స్ప్రెస్, తిరుపతి నుంచి కరీంనగర్ బై వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. ఈ మార్గంలో కోరుట్ల, మెట్పల్లి, ఆర్మూర్ లాంటి ఎక్కువ జనాభా కలిగిన పట్టణాలు కూడా ఉన్నాయి. భవిష్యత్తులో డబ్లింగ్ పూర్తయితే ఇటు ముంబై వైపు, అటు సికింద్రాబాద్ వైపు రైళ్ల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. మరోవైపు అటల్ మిషన్ ఫర్ రిజునవేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్మిషన్ (ఏఎంఆర్యూటీ) పథకం కింద ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్కు రూ.26.6 కోట్లు, రామగుండంకు రూ.26.50 కోట్లు, పెద్దపల్లికి రూ.20 కోట్లు మంజూరయ్యాయి. అయితే, ఈ పనులను రెండు దఫాల్లో చేపట్టనున్న కేంద్రం.. తొలిదశలో కరీంనగర్, రామగుండం స్టేషన్లను అభివృద్ధి చేసి, మరికొన్ని నెలల్లోనే పెద్దపల్లిలోనూ పనులు ప్రారంభించనుంది. ఉమ్మడి జిల్లా ప్రజలకు ఉపయుక్తం చీకురాయి వద్ద రైల్వేస్టేషన్ నిర్మించతలపెట్టడం అభినందనీయం. రెండు మార్గాలు కలిసేచోట స్టేషన్ నిర్మించడం వల్ల మా ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇది ఒక్క పెద్దపల్లి ప్రజలకే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల ప్రాంతాల ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. – మేకల శ్రీనివాస్, చీకురాయి -
చెంపదెబ్బకి అదుపుతప్పి రైల్వే ట్రాక్పై పడ్డాడు.. తర్వాత..
ముంబై: ముంబైలోని సియోన్ రైల్వే స్టేషన్లో భార్యా భర్తలు ఒక వ్యక్తితో ఘర్షణకు దిగారు. వివాదం కాస్తా పెద్దది కావడంతో రెండు వర్గాల మధ్య కొట్లాట జరిగి భర్త బలంగా చెంపదెబ్బ కొట్టడంతో ఆ వ్యక్తి అదుపుతప్పి రైల్వే ట్రాక్పై పడిపోయాడు. క్షణాల వ్యవధిలో ఆ ట్రాక్పైకి వచ్చిన ఓ రైలు ఆ వ్యక్తిని బలంగా ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. ఈ వివరమంతా అక్కడి సీసీటీవీ ఫుటేజిలో స్పష్టంగా రికార్డయ్యింది. పోలీసులు భార్యాభర్తలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సియోన్ రైల్వేస్టేషన్లో ఆదివారం రాత్రి 9.15 ప్రాంతంలో భార్యా భర్తలు అవినాష్ మానే(35), శీతల్ మానే(31) అక్కడ ప్లాట్ఫారంపై మంఖార్డ్ వెళ్లే రైలు కోసం ఎదురు చూస్తున్నారు. అంతలోనే మృతుడు దినేష్ రాథోడ్(26) ఆమెను వెనక నుంచి తోశాడని ఆరోపిస్తూ గొడవకు దిగింది. బాధితుడిపై గొడుగుతో కూడా దాడి చేసింది. పక్కనే ఉన్న భర్త కూడా భార్యకు జతకలిసి ఇద్దరూ కలిసి దినేష్ పై దాడి చేశారు. ఈ క్రమంలో అవినాష్ మానే దినేష్ ను బలంగా చెంప దెబ్బ కొట్టడంతో అదుపుతప్పి రైలు పట్టాలపై పడిపోయాడు. దినేష్ ప్లాట్ఫారంపైకి తిరిగి ఎక్కే ప్రయత్నం చేసినా కూడా ఫలితం లేకపోయింది. చుట్టూ ఉన్నవారు దినేష్ కు సాయం చేద్దామని ముందుకు వచ్చే లోపు రైలు వస్తుండటాన్ని చూసి వారంతా వెనకడుగు వేశారు. రెప్పపాటులో ఆ ట్రాక్ పైకి వచ్చిన రైలు వేగంగా దూసుకొచ్చి దినేష్ పైనుండి వెళ్ళిపోయింది. దీంతో అతను అక్కడికక్కడే చనిపోయాడని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే భార్యా భర్తలు అక్కడి నుండి జారుకుని వారి నివాసమైన ధారావికి పారిపోయారు. అక్కడున్న వారు ఇచ్చిన సమాచారంతో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మొదట అవినాష్ ను తర్వాత శీతల్ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు పోలీసులు. ఇది కూడా చదవండి: అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ తొలి జాబితా విడుదల -
దేశంలో 508 రైల్వేస్టేషన్ల పునరుద్ధరణ పనులకు ప్రధాని శంకుస్థాపన
న్యూఢిల్లీ: అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా దేశంలోని పలు రైల్వేస్టేషన్ల పునర్నిర్మాణానికి వర్చువల్గా శంకుస్థాపన చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. మొత్తం 508 రేల్వే స్టేషన్లను రూ.24,470 కోట్ల రూపాయలతో నిర్మించనున్నట్లు తెలిపారు ప్రధాని. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా పునర్నిర్మించనున్న 1309 రైల్వేస్టేషన్ల పనులకు ఆదివారం ప్రధానమంత్రి వర్చువల్గా శంకుస్థాపన చేయగా మొదట విడతలో 508 రైల్వే స్టేషన్ల పనులు మొదలుకానున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం రూ.24,470 కోట్లను కేటాయించినట్లు తెలిపారు ప్రధాన మంత్రి. మొదటి విడతలో ఏపీలోని 18 రైల్వే స్టేషన్లను తెలంగాణలోని 39 స్టేషన్లకు గాను మొదట 21 రైల్వే స్టేషన్లను ఆధునీకరించనున్నారు. ఏపీలోని రైల్వే స్టేషన్లకు రూ.453 కోట్లు తెలంగాణలోని రైల్వే స్టేషన్లకు రూ.893 కోట్ల నిధులతో రైల్వే స్టేషన్లకు కొత్త హంగులు అద్దనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైల్వే స్టేషన్లను ఎయిర్పోర్టుల తరహాలో ప్లాజా మోడల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పునర్నిర్మించనున్నారు. వచ్చే 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రైల్వే స్టేషన్లను పునరుద్ధరించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో.. ఏపీలో కాకినాడ టౌన్ జంక్షన్, తుని, పిడుగురాళ్ల, రేపల్లె, తెనాలి, కర్నూలు సిటీ, దొనకొండ, ఒంగోలు, సింగరాయకొండ, పలాస, అనకాపల్లి, దువ్వాడ, విజయనగరం జంక్షన్, భీమవరం టౌన్, ఏలూరు, నరసపూర్, నిడదవోలు జంక్షన్, తాడేపల్లిగూడెం స్టేషన్లు.. తెలంగాణలో ఆదిలాబాద్, హనుమకొండ కాజీపేట జంక్షన్, హఫీజ్ పేట, హప్పుగూడ, హైదరాబాద్, మలక్ పేట, జనగాం, కరీంనగర్, ఖమ్మం, మధిర, భద్రాచలం రోడ్, మహబూబాబాద్ హైటెక్ సిటీ, మహబూబాబాద్, మహబూబ్ నగర్, కామారెడ్డి, నిజామాబాద్ జంక్షన్, జహీరాబాద్, పెద్దపల్లి రామగుండం, మల్కాజిగిరి జంక్షన్, వికారాబాద్ తాండూరు, యాదాద్రి స్టేషన్లను ఆధునీకరించనున్నారు. ఏపీ, తెలంగాణ మినహాయించి రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్తరప్రదేశ్లో 55, బీహార్లో 49, మహారాష్ట్రలో 44, పశ్చిమ బెంగాల్లో 37, మధ్యప్రదేశ్లో 34, అస్సాంలో 32, ఒడిశాలో 25, పంజాబ్లో 22, గుజరాత్ లో 21, జార్ఖండ్లో 20, తమిళనాడులో 18, హర్యానాలో 15, కర్ణాటకలో 13 రైల్వే స్టేషన్లను ఆధునీకరించనున్నారు. #WATCH | Prime Minister Narendra Modi lays the foundation stone to redevelop 508 railway stations across India under Amrit Bharat Station Scheme; says, "Around 1300 major railway stations in India will now be developed as Amrit Bharat Railway Station. They will be re-developed in… pic.twitter.com/CPC67SWUEV — ANI (@ANI) August 6, 2023 ఈ సందర్బంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ.. ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టి మొత్తం భారతదేశం వైపే ఉందన్నారు. ప్రపంచస్థాయిలో భారత ప్రతిష్ట పెరిగిందని, ప్రపంచం దృష్టిలో భారతదేశ స్థాయి కూడా పెరిగిందని అన్నారు. దీని వెనుక రెండు ప్రధాన కారణాలున్నాయి.. మొదటిది సుమారు 30 ఏళ్ల తర్వాత భారత్ దేశంలో ఒక ప్రభుత్వం పూర్తి స్థాయి మెజారిటీ సాధించడం కాగా రెండవది పూర్తి స్థాయి మెజారిటీ సాధించిన ప్రభుత్వం సవాళ్ళను స్వీకరించి కీలక నిర్ణయాలు తీసుకుని నిర్విరామంగా పనిచేయడమేనని అన్నారు. #WATCH | Prime Minister Narendra Modi says, "Today, the focus of the entire world is on India. India's prestige, on a global scale, has increased. World's attitude towards India has changed. There are two main reasons behind this - 1) Indians brought in a full majority government… pic.twitter.com/H0aoSSyi0M — ANI (@ANI) August 6, 2023 ఇది కూడా చదవండి: పాకిస్తాన్ వధువు, భారత వరుడు.. మరో జంట కథ -
కరీంనగర్ రైల్వేస్టేషన్ పునరుద్ధరణ పనులను వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ రైల్వేస్టేషన్ పునరుద్ధరణ పనులను ప్రధాన మంత్రి ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో కరీంనగర్తో పాటు పెద్దపెల్లి జిల్లా రామగుండం రైల్వేస్టేషన్ల రిన్నోవేషన్కు శ్రీకారం చుట్టారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ప్రారంభించిన కార్యక్రమంలో ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం అధికారుల తీరుపై సంజయ్ మండిపడ్డారు. ఈ అంశంపై మాట్లాడుతూ.. ‘అధికారిక కార్యక్రమానికి అధికారులు ఎందుకు రాలేదు. ఇదేమీ రాజకీయ కార్యక్రమం కాదే...?.. రావొద్దని ఎవరైనా బెదిరించారా..? అని ప్రశ్నించారు. ఎవరొచ్చినా, రాకున్నా కేంద్ర అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందిస్తామని, కరీంనగర్ –హసన్ పర్తి రైల్వే లేన్ సాధించి తీరుతామని స్పష్టం చేశారు. కరీంనగర్ –తిరుపతి రైలును ప్రతిరోజు నడిచేలా రైల్వే మంత్రిని ఒప్పిస్తానన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో రైల్వే స్టేషన్లను అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయలు కేంద్రం ఖర్చు చేస్తోందని.. అతి త్వరలోనే కరీంనగర్ రైల్వే స్టేషన్ ను సుందరంగా తీర్చిదిద్దబోతున్నామని చెప్పారు. పెద్దపల్లి-కరీంనగర్-నిజామాబాద్ కొత్త రైల్వే లేన్ నిర్మాణ పనులు 5 వేల కోట్ల రూపాయలతో కొనసాగుతున్నాయని అన్నారు. ఇప్పటికే 95.6 కిలోమీటర్ల మేరకు పనులు పూర్తవగా.. 178 కి.మీల మేర విద్యుద్దీకరణ పనులు పూర్తయ్యాయి. రూ. 1374 కోట్లతో 151 కిలోమీటర్ల మేరకు మనోహరాబాద్ – కొత్తపల్లి కొత్త రైల్వే లేన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. చదవండి ఆర్టీసీ బిల్లుపై లొల్లి!.. గవర్నర్ వర్సెస్ సర్కార్గా సాగుతున్న వివాదం -
యాదాద్రి రైల్వే స్టేషన్కు సరికొత్త హంగులు
యాదాద్రి: యాదాద్రి రైల్వే స్టేషన్ సరికొత్త హంగులు సంతరించుకోనుంది. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా అత్యున్నత ప్రమాణాలు, సౌకర్యాలతో తీర్చిదిద్దనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 6న వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు సంబంధించి రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన ఎంఎంటీఎస్ రెండో దశ కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న విషయం తెలిసిందే. రూ.320 కోట్లతో ఘట్కేసర్ నుంచి (రాయగిరి) యాదాద్రి వరకు రెండో దశ ప్రాజెక్టును పూర్తి చేస్తానని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ఇటీవల యాదాద్రి రైల్వే స్టేషన్ను సందర్శించారు. ఘట్కేసర్ నుంచి యాదాద్రి వరకు 33 కిలో మీటర్ల మేర అదనపు ట్రాక్ ఏర్పాటు చేయనున్నారు. రూ.24.5 కోట్లతో ఆధునీకరణ అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా యాదాద్రి రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేయనున్నారు. యాదాద్రి ఆలయ క్షేత్ర నమూనాతో రైల్వే స్టేషన్ముఖ ద్వారం నిర్మించనున్నారు. ఎంఎంటీఎస్ నూతన లైన్ కోసం స్టేషన్ను తూర్పు వైపు విస్తరించనున్నారు. ఇందులో భాగంగా నూతన స్టేషన్ బిల్డింగ్ నిర్మాణం, ప్లాట్ఫాం ఎత్తు పెంపు, పైకప్పుల ఆధునీకరణ, ప్రయాణికులకు వెయిటింగ్ హాల్, మంచినీరు, టాయ్లెట్స్ పార్కింగ్ ఏరియా పనులను చేపట్టనున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న రైల్వే స్టేషన్లో నూతనంగా నిర్మించి ప్లాట్ఫాంలను అభివృద్ధి చేయనున్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న రేల్వే స్టేషన్లు భువనగిరి, బీబీనగర్, ఘట్కేసర్ స్టేషన్లలో అదనపు మౌళిక వసతులు కల్పిస్తారు. రెండో దశలో కదలిక 2016 లో మంజూరైన ఎంఎంటీఎస్ రెండో దశ పనులు నిధులలేమితో నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించక ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.330 కోట్ల నుంచి రూ.430 కోట్లకు పెరిగింది. అయితే తమ నిధులతోనే యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ను పొడిగిస్తామని ప్రకటించి పనులకు శ్రీకారం చుట్టింది. అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది. ఇచ్చినమాట ప్రకారం ఎంఎంటీఎస్ యాదాద్రి రైల్వే స్టేషన్కు ఈనెల 6వ తేదీన ప్రధాని మోదీ శంఖుస్థాపన చేయనున్నారు. రైల్వేస్టేషన్ నిర్మాణం కోసం రూ.24.5 కోట్లు కేటాయించారు. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి నుంచి ఆదేశాలు అందాయి. యాదాద్రి నుంచి వయా ఆలేరు జనగామ వరకు ఎంఎంటీఎస్ను పొడిగించాలని రైల్వే మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశాం. కేంద్రం ఇప్పటికే బీబీనగర్లో ఎయిమ్స్ ఏర్పాటు చేసింది. ఏడాదిలోగా నూ తన భవన సముదాయాన్ని ప్రారంభిస్తాం. –పీవీ శ్యాంసుందర్రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంగపల్లి వరకు పొడిగింపు ప్రతిపాదన యాదాద్రి (రాయగిరి) వరకు ఉన్న ఎంఎంటీఎస్ లైన్ను వంగపల్లి వరకు పొడిగించేందుకు రైల్వే శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. రాయగిరి రైల్వే స్టేషన్ ఇరుకుగా ఉన్నందున విస్తరించాల్సి ఉంటుంది. అయితే వంగపల్లి స్టేషన్ అనుగుణంగా ఉన్నందున అక్కడి వరకు ఎంఎంటీఎస్ పొడిగించే యోచనలో రైల్వే శాఖఉంది. వంగపల్లి నుంచి కూడా యాదాద్రి పుణ్యక్షేత్రం ఐదున్నర కిలో మీటర్ల దూరంలో ఉంటుంది.అయితే వంగపల్లి వరకు పొడిగించే విషయం ఇంకా ఫైనల్కాలేదని రైల్వే శాఖఅధికారి ఒకరు చెబుతున్నారు. -
పార్కుగా మారనున్న రైల్వేస్టేషన్
పార్కుగా మారనున్న పాడుబడ్డ స్టేషన్ ఇది పాతకాలం నాటి రైల్వేస్టేషన్. దశాబ్దాలుగా వినియోగంలో లేకపోవడంతో పూర్తిగా పాడుబడింది. ఇంగ్లండ్ కెంట్ కౌంటీలోని లాయిడ్ పట్టణంలో ఉంది ఈ స్టేషన్. దీనిని 1881లో నిర్మించారు. తొలినాళ్లలో ఇక్కడకు రైళ్ల రాకపోకలు బాగానే కొనసాగేవి. అయితే, ఐదు దశాబ్దాలుగా రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచి పోయాయి. స్థానికంగా గొడవలు జరిగినప్పుడు ఇక్కడి యువకులు ఈ స్టేషన్పై రాళ్లు రువ్వడం, నిప్పుపెట్టడం వంటి పనులు చేస్తుండటం పరిపాటిగా మారింది. స్థానికుల దాడుల వల్ల ఈ భవంతి బాగా దెబ్బతింది. దీని గోడల నిండా ఆకతాయిలు రాసిన పిచ్చిపిచ్చి రాతలు కనిపిస్తుంటాయి. ఇన్నాళ్లకు స్థానిక అధికారులకు ఈ రైల్వేస్టేషన్ను పార్కుగా మార్చాలనే బుద్ధిపుట్టింది. పాడుబడిన రైల్వేవ్యాగన్లతో ఇరవై జంట క్యారవాన్లను, ఆరు సింగిల్ క్యారవాన్లను సిద్ధం చేయనున్నారు. పిల్లలు ఆడుకునేందుకు వీలుగా తగిన వసతులను ఏర్పాటు చేసి, త్వరలోనే పూర్తిస్థాయి పార్కుగా మార్చనున్నారు. (చదవండి: ఇంకో యాభై ఏళ్లలో ఆ దేశం అదృశ్యం!) -
ఝరపడా జైలుకు నిందితుల తరలింపు
భువనేశ్వర్: బాలాసోర్ జిల్లా బహనాగా బజార్ రైల్వేస్టేషన్ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో అరెస్టయిన ముగ్గురు నిందితుల రిమాండ్ గడువు శుక్రవారంతో ముగిసింది. ఈ ముగ్గురినీ ఝరపడా జైలుకు తరలించారు. ఈనెల 7న స్థానిక ప్రత్యేక సీబీఐ కోర్టు నిందితులకు 5 రోజుల రిమాండ్ విధించింది. కేసు విచారణ మరింత లోతుగా నిర్వహించాల్సి ఉందనే అభ్యర్థనతో దుర్ఘటనపై దర్యాప్తు చేస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) న్యాయస్థానాన్ని కోరడంతో ఈనెల 11న కోర్టు రిమాండ్ను మరో 4 రోజులు పొడిగించేందుకు అనుమతించింది. ఈ వ్యవధి పూర్తి కావడంతో ముగ్గురు నిందితులు(సీనియర్ సెక్షన్ ఇంజనీర్(సిగ్నల్) అరుణ్కుమార్ మహంత, సీనియర్ సెక్షన్ ఇంజినీర్ మహ్మద్ అమీర్ఖాన్, టెక్నీషియన్ పప్పుకుమార్)ను స్థానిక జైలుకు తరలించారు. కేసు తదుపరి విచారణను ఈనెల 27కి కోర్టు వాయిదా వేసినట్లు ప్రకటించింది. జైలుకు తరలించిన వారిని ఈనెల 7న సీబీఐ దర్యాప్తు బృందం అరెస్ట్ చేసింది. వీరికి వ్యతిరేకంగా ఐిపీసీ సెక్షన్లు 304(మరణానికి కారకులు), 201(సాక్ష్యాధారాల గల్లంతు) ఆరోపణల కింద కేసు నమోదు చేశారు. నార్త్ సిగ్నల్ గూమ్టీ(స్టేషన్) వద్ద సిగ్నలింగ్ సర్క్యూట్ మార్పులో లోపం కారణంగా ప్రమాదం జరిగింది. ఇది మానవ తప్పిదమని ఆగ్నేయ సర్కిల్ రైల్వే భద్రతా కమిషనర్(సీఆర్ఎస్) విచారణ నివేదికలో వెల్లడించింది. నలుగురు ఉద్యోగులపై.. బహనాగా బజార్ రైలు దుర్ఘటన ఘటనలో మరో నలుగురు ఉద్యోగులను సీబీఐ దర్యాప్తు బృందం ప్రశ్నిస్తోంది. స్థానిక ఝరపడా జైలు ప్రాంగణంలో ఈ విచారణ కొనసాగుతోంది. వీరిలో ఇద్దరు సిగ్నల్ ఆపరేటర్లు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, స్టేషన్ మాస్టర్ ఉన్నారు. వీరందరినీ రైల్వేశాఖ విధుల నుంచి తొలగించినట్లు ఉత్తర్వులు జారీ చేసింది. -
స్విమ్మింగ్ పూల్ గా మారిన రైల్వే స్టేషన్
ముంబై: కొద్దిరోజులుగా ఆగకుండా కురుస్తున్న వానలకు నవీ ముంబైలో నూతనంగా నిర్మిస్తున్న రైల్వే స్టేషన్లోకి నీళ్లు చేరాయి. దీంతో స్థానిక యువత అక్కడ నీటిలో జలకాలాడుతూ వీడియో తీసి వర్షం పడితే ఆ లోకల్ రైల్వే స్టేషన్ పరిస్థితి ఏంటనేది కళ్ళకు కట్టారు. రుతుపవనాల రాకతో కొద్ది రోజులుగా ముంబైలో కురుస్తున్న వర్షాలకు ఎక్కడికక్కడ రోడ్ల మీద వరదనీరు నిలిచిపోగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇదిలా ఉండగా నవీ ముంబైలోని ఉరాన్ లోకల్ రైల్వే స్టేషన్ ఐతే స్విమ్మింగ్ పూల్ ని తలపిస్తూ నిండుగా నీళ్లు చేరాయి. దీంతో యువత అందులో హాయిగా జలకాలాడారు. ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో ఎక్కడెక్కడో విహరిస్తోంది. నూతనంగా నిర్మిస్తున్న ఈ రైల్వే స్టేషన్లో నీరు లీక్ అవుతుండడంతోనే ఇంతగా నీరు చేరిందంటున్నారు స్థానికులు. పైగా ఇక్కడి డ్రైనేజి వ్యవస్థ అయితే అత్యంత అధ్వానంగా ఉండడంతో నీరు బయటకు పోయే మార్గమే లేదంటున్నారు స్థానికులు. ఈ వీడియో చూసైనా సిగ్గు తెచ్చుకోండని అధికారులని ఏకిపారేస్తున్నారు నెటిజన్లు. नवीन नेरूळ - उरण लोकल रेल्वे स्टेशन बोकडविरा @CMOMaharashtra @PMOIndia @AshwiniVaishnaw @Dev_Fadnavis @mieknathshinde #uran_local_navi_mumbai pic.twitter.com/mb0Wp5fF1j — Jeetendra N. Thale (@JeetendraThale) July 4, 2023 ఇది కూడా చదవండి: రైలుకు వేలాడుతూ బిత్తిరి చర్య.. పట్టుతప్పితే అంతే సంగతులు! -
రైల్వే స్టేషన్స్ లో అతి తక్కువ ధరలో రిటైరింగ్ రూమ్స్...ఎలా బుక్ చేసుకోవాలంటే..?
-
ఢిల్లీలో భారీ వర్షాలు.. కరెంటు షాక్ కొట్టడంతో యువతి మృతి
న్యూఢిల్లీ: ఢిల్లీలో రుతుపవనాల తాకిడికి శనివారం జోరుగా వర్షం కురిసిన వర్షాలు ఒక యువతిని బలితీసుకున్నాయి. గుంతలుగా మారిన రోడ్డులో నడుస్తూ పొరపాటున కరెంటు స్తంభానికి వేలాడుతున్న వైర్లను తాకడంతో తాకడంతో యువతి విద్యుదాఘాతానికి గురైంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినా కూడా ప్రయోజనం లేకపోయింది. ఆమె అప్పటికే చనిపోయినట్లు ఆసుపత్రి వర్గాలు నిర్ధారించాయి. తూర్పు ఢిల్లీలోని ప్రీతి విహార్ లో నివాసముండే సాక్షి అహూజా తెల్లవారుజాము 5.30 నిముషాలకు ఇద్దరు పెద్దవాళ్ళు ముగ్గురు చిన్నారులతో రైల్వే స్టేషన్ వైపుగా వెళ్తోంది. రోడ్డంతా గుంతలు ఏర్పడటంతో వాటిని తప్పించుకునే ప్రయత్నంలో పక్కనే ఉన్న కరెంటు స్థంభంవైపు అడుగు వేసిన ఆ యువతికి కింద వేలాడుతున్న వైర్లు తాకి అక్కడికక్కడే కూలబడిపోయింది. అక్కడే ఉన్న ఆమె సోదరి మాధవి చోప్రా వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే సాక్షి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించినట్లు పోలీసులు తెలిపారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగానే ఆమె సోదరి మరణించినట్లు సంబంధిత అధికారులపై మాధవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలి తండ్రి లోకేష్ కుమార్ చోప్రా కూడా అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విపరీతమైన ఉక్కపోతతో వేసవిపై విసుగెత్తిపోయిన తరుణంలో తొలకరి చినుకులు ఎట్టకేలకు పలకరించాయని సంతోషించేంతలోపే ఢిల్లీలో పెనువిషాదం చోటు చేసుకోవడంతో స్థానికులు దిగ్భ్రాంతికి గురైయ్యారు. ఇది కూడా చదవండి: ఆ చీకటి రోజులను మరచిపోలేము.. ప్రధాని మోదీ -
ఐ-టిక్కెట్, ఈ- టిక్కెట్.. ఏది వెంటనే కన్ఫర్మ్ అవుతుంది?.. ముందుగానే తెలిస్తే..
రైళ్లలో ఎక్కువగా ప్రయాణాలు సాగించేవారు కన్ఫర్మ్ టిక్కెట్ ఒక టాస్క్ లాంటిదని చెబుతుంటారు. కాగా కన్ఫర్మ్ టిక్కెట్ విషయంలో రకరకాల సమాచారాలు ఇంటర్నెట్లో కనిపిస్తుంటాయి.చాలామంది ఈ-టిక్కెట్, ఐ-టిక్కెట్లను బుక్ చేయడంలో చాలా తేడాలు ఉంటాయని, కన్ఫర్మ్ టిక్కెట్ లభించడం అంత సులభం కాదని అంటుంటారు. దీనిపై క్లారిటీ రావాలంటే ముందుగా ఐ-టిక్కెట్, ఈ -టిక్కెట్ అంటే ఏమిటో తెలుసుకోవాల్సివుంటుంది. ఐఆరర్సీటీసీ వెబ్సైట్ నుంచి టిక్కెట్ బుక్ చేసుకుంటే దానిని ఈ- టిక్కెట్ అంటారు. దీనికి ప్రింట్ కూడా తీసుకోవచ్చు. అయితే ఈ రోజుల్లో ప్రింటెడ్ టిక్కెట్ ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఐ-టిక్కెట్ విషయానికొస్తే దీనిని ప్రింట్ తీసుకోవడం చాలా కష్టం. ఈ టిక్కెట్ కూడా ఐఆర్సీటీసీ నుంచే బుక్ చేయాలి. ఈ తరహా టిక్కెట్ ప్రింటెడ్ కాపీ రైల్వే నుంచి ఇంటికి వస్తుంది. దీనికి ఛార్జీలు వేరుగా ఉంటాయి. ఈ విధమైన టిక్కెట్ను ప్రయాణం చేయాడానికి కొన్నిరోజుల ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. టిక్కెట్ బుకింగ్ విషయంలో చాలామందికి పలు అనుమానాలు ఉన్నాయి. ఈ-టిక్కెట్, ఐ- టిక్కెట్లలో ఏది త్వరగా కన్ఫర్మ్ అవుతుందనే విషయం చాలామందికి తెలియదు. కొందరు ఐ-టిక్కెట్ త్వరగా కన్ఫర్మ్ అవుతుందని అంటారు. అయితే రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఐ-టిక్కెట్, ఈ-టిక్కెట్ల కారణంగా వెయిటింగ్ లిస్ట్ క్లియర్ అవుతుందనడానికి ఏమీ సంభంధం లేదు. ‘ఫస్ట్ కమ్.. ఫస్ట్ సర్వ్’ ఆధారంగా టిక్కెట్ బుక్ అవుతుంది. అంటే ఎవరు ముందుగా టిక్కెట్ బుక్ చేసుకుంటారో వారికే ముందుగా సీట్లు కేటాయిస్తారని అర్థం. రైలు టిక్కెట్ల బుకింగ్ విధానం ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే కన్ఫర్మ్ టిక్కెట్ వస్తుందనే ఆశతో ఐ- టిక్కెట్ లేదా ఈ-టిక్కెట్ తీసుకోవడంలో అర్థం లేదు. జనరల్ వెయిటింగ్, పీక్యూడబ్ల్యుఎల్, ఆర్క్యూడబ్ల్యుఎల్ల ఆధారంగా టిక్కెట్ కన్ఫర్మ్ అవుతుంది. జనరల్ వెయింటింగ్ టిక్కెట్ త్వరగా కన్పర్మ్ అవుతుంది. మిగిలినవి వెయిటింగ్ లిస్టు కోటాలో మిగిలిన సీట్ల ఆధారంగా ఈ సీట్లు అలాట్ అవుతాయి. ఈ-టిక్కెట్ వలన ప్రయోజనం ఏమిటి? ఈ- టిక్కెట్ తీసుకోవడం వలన ప్రయోజనం ఏమిటంటే.. ఒకవేళ మీకు ఈ- టిక్కెట్ కన్ఫర్మ్ కాకపోతే మీరు ట్రైన్లో జర్నీ చేయలేరు. అయితే ఐ-టిక్కెట్ కన్ఫర్మ్ కాని పక్షంలో.. రైల్వేవిభాగం నుంచి వచ్చిన అధికారిక టిక్కెట్ ద్వారా మీరు ప్రయాణం సాగించవచ్చు. ఈ- టిక్కెట్ రిజర్వేషన్ కౌంటర్ వద్ద బుక్ చేసుకున్న టిక్కెట్ మాదిరి గుర్తింపును కలిగివుంటుంది. ఇది కూడా చదవండి: మద్యాన్ని ఫ్రిజ్లో ఎంతసేపు ఉంచినా ఎందుకు గడ్డకట్టదంటే.. -
రైలుకు అడ్డంగా వెళ్లి హంగామా
కామారెడ్డి క్రైం: రైలుకు అడ్డంగా వెళ్లి ఓ వ్యక్తి హంగామా సృష్టించిన ఘటన కామారెడ్డి రైల్వే స్టేషన్లో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామానికి చెందిన పాపాన్నగారి రఘుపతి అనే వృద్ధుడు గ్రామంలో ఇంటి నిర్మాణం చేపడుతున్నాడు. శనివారం ఉదయం నిర్మాణం విషయంలో సమీప బంధువుల, కుటుంబ సభ్యులతో గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన రఘుపతి కామారెడ్డికి వచ్చాడు. ఆత్మహత్య చేసుకుంటానని అప్పుడే వచ్చి నిలిపిన రైలు ముందుర తచ్చాడుతు కనిపించాడు. రైలు నడిపే లోకో పైలెట్, స్థానికులు ఎంతగా వారించిన వినలేదు. 15 నిమిషాల పాటు రైలుకు అడ్డంగా వెళ్తానని మొండి చేశాడు. దీంతో రైల్వే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతోs ఏర్పడింది. -
ఎంపీ భరత్ చొరవతో రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు
-
ఒడిశాలో రైలు నుండి పొగలు... పరుగులు తీసిన ప్రయాణికులు
ఒడిశాలో మరో రైలు సంఘటన ప్రయాణికులను భయబ్రాంతులకు గురిచేసింది. సికింద్రాబాద్-అగర్తలా ఎక్స్ ప్రెస్ లో ఉన్నట్టుండి ఏసీ నుండి పొగలు వస్తుండటంతో ప్రయాణికులంతా కంగారు పడిపోయారు. పరిస్థితిని గమనించిన రైల్వే సిబ్బంది రైలును ఒడిశాలోని బ్రహ్మపూర్ రైల్వే స్టేషన్ లో నిలిపివేశారు. తర్వాత కొద్దిసేపటికి పొగ అదుపులోకి వచ్చినప్పటికీ ప్రయాణికులు ఎలక్ట్రిక్ బ్రేక్ డౌన్ అనుకుని ఆ కోచ్ లో ప్రయాణం చేయమంటే చేయమని పట్టుబట్టారు. ఏం జరిగిందంటే... ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారి ఒకరు మాట్లాడుతూ... సికింద్రాబాద్ - అగర్తలా ఎక్స్ ప్రెస్ రైలు బ్రహ్మపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉండగా బి-5 బోగీలో చిన్న ఎలక్ట్రికల్ సమస్య తలెత్తింది. దీంతో పెట్టె నిండా పొగలు వ్యాప్తి చెందాయి. ప్రయాణికులు అలారం సిగ్నల్ ఇవ్వడంతో రైలులో ఉన్న సిబ్బంది అప్రమత్తమయ్యి పొగను నియంత్రించారు. ఒడిశా రైలు ప్రమాద సంఘటన తర్వాత ప్రయాణికులంతా బిక్కు బిక్కుమంటూనే ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. రైళ్లు పరిగెత్తడం మాట దేవుడెరుగు. ప్రయాణమంటే చాలు ప్రయాణికులకు మాత్రం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. -
రైలు పుస్తకం
ఈ దేశానికి స్వాతంత్య్రం రైలు వల్లే వచ్చిందంటే ఉలిక్కిపడవలసిన అవసరం లేదు. జూన్ 7, 1893 రాత్రి– సౌత్ ఆఫ్రికా డర్బన్ నుంచి ప్రెటోరియాకు గాంధీ ప్రయాణిస్తున్నప్పుడు, ఆయన దగ్గర మొదటి తరగతి టికెట్ ఉన్నా, అది ‘వైట్స్ ఓన్లీ క్యారేజ్’ కావడాన పీటర్మార్టిస్బర్గ్ అనే చిన్న స్టేషన్ లో కిందకు ఈడ్చేశారు. వివక్షతో కూడిన ఆధిపత్యం ఎంతటి క్రూరమైనదో గాంధీకి అవగాహన వచ్చిన సందర్భం అది. భారతదేశం వచ్చాక ఇక్కడ బ్రిటిష్వారి పాలనలో అంతకన్నా ఘోరమైన వివక్షను, ఆధిపత్యాన్ని దేశ జనులు అనుభవిస్తున్నారని ఆయనకు తెలియచేసింది రైలే. ‘మూడవ తరగతి పెట్టెల్లో విస్తృతంగా తిరిగాక ఈ దేశమంటే ఏమిటో అర్థమైంది’ అని ఆయన చెప్పుకున్నాడు. తర్వాత స్వాతంత్య్ర సంకల్పం తీసుకున్నాడు. నిజానికి గాంధీ రైలు ప్రయాణాలే జనం చెప్పుకుంటారుగాని నెహ్రూ కూడా ‘నేను ఈ దేశాన్ని రైలులో తిరగడం ద్వారానే ఆకళింపు చేసుకున్నాను’ అని ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’లో రాసుకున్నాడు. ‘గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా’గా వాసికెక్కిన లార్డ్ డల్హౌసీ బ్రిటిష్ రాజ్యం, పాలన బలపడాలంటే భారతదేశంలో రైళ్ల వ్యవస్థ సమర్థంగా విస్తరించాలని భావించాడు. అయితే డల్హౌసీ ఒకటి తలిస్తే దేశ జనులు మరొకటి తలిచారు. ఏనాడు కనని, వినని ప్రాంతాలను రైలు ద్వారా సగటు భారతీయుడు తెలుసుకున్నాడు. బహు జాతులతో, సంస్కృతులతో సంపర్కంలోకి వచ్చాడు. అలా మనదంతా ఒక జాతి, ‘భారత జాతి’ అనే భావన పాదుకొనడానికి, అందరూ ఏకమై బ్రిటిష్ వారిపై పోరాడటానికి మొదటి భూమికను ఏర్పరించింది ఈ దేశంలో రైలే. ‘భారతీయులు తమ పల్లెటూళ్లను రైల్వేస్టేషన్ లోకి తీసుకొస్తారు. పల్లెల్లో వాళ్ల ఇళ్లల్లోకి రానీయకపోవచ్చు. కాని పల్లె స్వభావం మొత్తం స్టేషన్ లో ప్రదర్శనకు పెడతారు’ అని అమెరికన్ ట్రావెల్ రైటర్ పాల్ థెరూ ‘ది గ్రేట్ రైల్వే బజార్’ (1975) పుస్తకంలో రాశాడు. నిజమే. గడ్డి మోపులు, ధాన్యం బస్తాలు, కోళ్ల గంపలు, కుండలు, గిన్నెలు, కట్టెలు, పాల క్యాన్లు, సైకిళ్లు, పనిముట్లు, అరుపులు, కేకలు, అక్కరలు, మక్కువలు... వారు స్టేషన్ కు తేనిది ఏమిటి? బండి ఎక్కించనిది ఏమిటి? ‘భారతదేశంలో రైలు కంపార్ట్మెంట్ అంటే ఇల్లే. అందులో ప్రతి ఒక్క ఇంటి సభ్యుణ్ణి చూడొచ్చు. రైలులో వారు అక్క, తమ్ముడు, అమ్మ, నాన్నలుగానే ఎక్కువగా ప్రయాణి స్తారు. ప్రయాణికులుగా తక్కువగా మారుతారు’ అని మరొక పాశ్చాత్య రచయిత రాశాడు. దొరలు ఎక్కే ఈ పొగబండి జన సామాన్యానికి అందుబాటులోకి వచ్చాక కథ, కవిత, నవల, సినిమా, నాటకాల్లో దీని ప్రస్తావన లేకుండా సృజన సాగలేదు. భారతీయ రైళ్లను, వాటి కిటికీల గుండా కనిపించే దేశాన్ని మొదట రడ్యార్డ్ కిప్లింగ్ ‘కిమ్’ (1901) నవలలో రాశాడు. అయితే రైలును ఒక చారిత్రక సాక్ష్యంగా కుష్వంత్ సింగ్ మలిచాడు. మనో మజ్రా అనే చిన్న సరిహద్దు గ్రామంలో జనం ఒక ట్రైన్ ఆ ఊరి మీదుగా వెళితే నిద్ర లేస్తారు. మరో ట్రైను కూత వినిపిస్తే మధ్యాహ్నం కునుకు సమయం అని గ్రహిస్తారు. ఇంకో ట్రైన్ శబ్దం వచ్చాక రాత్రయ్యింది పడుకోవాలి అని పక్కల మీదకు చేరుతారు. 1947లోని ఒక వేసవి రోజు వరకూ వారి దినచర్య అలాగే ఉండేది. కాని ఆ రోజున వచ్చిన ఒక రైలు వారి జీవితాలను సమూలంగా మార్చేసింది. ఆ ఊరి వాళ్లు ఆ రైలు రాకతో హిందువులుగా, ముస్లింలుగా, సిక్కులుగా విడిపోయారు. ఆ తర్వాత? ‘ట్రైన్ టు పాకిస్తాన్ ’ నవల చదవాలి. రైలు ప్రయాణాన్ని నేపథ్యంగా తీసుకుని ‘గాలి వాన’ అనే గొప్ప కథ రాశారు పాలగుమ్మి పద్మరాజు. మనుషుల ప్రాథమిక సంవేదనల ముందు వారు నిర్మించుకున్న అహాలు, జ్ఞానాలు, ఆస్తులు, అంతస్థులు, విలువలు గాలికి లేచిన గడ్డిపోచల్లా కొట్టుకుని పోతాయి అని చెప్పిన కథ ఇది. చాసో ‘ఏలూరెళ్లాలి’ కథ రైలు పెట్టెలోనే మనుగడ రహస్యాన్ని విప్పుతుంది. రైలు చుట్టూ ఎన్నో ప్రహసనాలు, పరిహాసాలు. తిలక్ రాసిన ‘కవుల రైలు’లో కవులందరూ ఎక్కి కిక్కిరిసిపోతారు. పాపం ప్లాట్ఫారమ్ మీద ఒక యువతి మిగిలిపోతుంది. ‘నీ పేరేమిటమ్మా’ అంటాడు స్టేషన్ మాస్టరు. యువతి జవాబు– ‘కవిత’! ‘షోలే అంత పెద్ద హిట్ ఎందుకయ్యింది’ అని ఎవరో అడిగితే ‘రైలు వల్ల’ అని సమాధానం ఇచ్చాడు అమితాబ్. ‘షోలే’ సినిమా రైలుతో మొదలయ్యి రైలుతో ముగుస్తుంది. అందులోని ట్రైన్ రాబరీ వంటిది ఇప్పటికీ మళ్లీ సాధ్యపడలేదు. ‘సగటు ప్రేక్షకుడికి రైలు కనపడగానే కనెక్ట్ అయిపోతాడు’ అని అమితాబ్ ఉద్దేశం. ‘ఆరాధన’లో రైలు కిటికీ పక్కన పుస్తకం చదువుకుంటున్న షర్మిలా టాగోర్ను, రోడ్డు మీద జీప్లో పాడుకుంటూ వస్తున్న రాజేష్ ఖన్నాను మర్చిపోయామా మనం? ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ క్లయిమాక్స్– కదిలిపోతున్న రైలులోని హీరోను అందుకోవడానికి హీరోయిన్ పరుగులు– సూపర్హిట్ ఫార్ములా! అందుకే రైలు ఈ దేశ ప్రజల జీవనంలో అవిభాజ్యం. అంతేనా? రైలు ఈ దేశంలో ఎన్నో బరువుల, బాధ్యతల, మమతల, కలతల, కలల వాహిక. గమ్యంపై ప్రయాణికుడు పెట్టుకునే నమ్మకం. ‘చేరి ఫోన్ చేస్తారు’ అని కుటుంబం పెట్టుకునే భరోసా. బెర్త్పై నిశ్చింతగా ముసుగు తన్నే నిద్ర. దానికి దెబ్బ తగిలితే భారతీయుడు విలవిల్లాడతాడు. ‘నువ్వు ఎక్కవలసిన రైలు జీవితకాలం లేటు’ అన్నాడు ఆరుద్ర. మృత్యుశకటం లాంటి రైలు కంటే ఎప్పటికీ రాని రైలు మేలైనది అనిపిస్తే ఆ నేరం ఎవరిది? -
ఖమ్మం రైల్వే స్టేషన్ లో ప్రమాదం
-
ప్లేట్ ఫామ్, రైల్వే ట్రాక్ మధ్య ఇరుక్కుపోయిన మహిళా
-
ట్రైన్ ఎక్కుతూ జారిపడిపోయిన మహిళ.. రైలు, ప్లాట్ఫాం మధ్యలో ఇరుక్కుపోయి
సాక్షి, ఖమ్మం: ఖమ్మం రైల్వే స్టేషన్లో ప్రమాదం జరిగింది. రైలు ఎక్కుతుండగా ఓ మహిళ జారిపడింది. ట్రైన్, ప్లాట్ఫామ్కు మధ్యలో ఇరుక్కుపోయింది. మధిరకు చెందిన రైల్వే ఉద్యోగి నాగేశ్వరరావు అతని భార్య కల్యాణి ఖమ్మంలోని ఓ ఆసుపత్రికి వైద్య పరీక్షల కోసం వచ్చారు. ఆసుపత్రిలో చూపించుకున్న అనంతరం తిరిగి మధిర వెళ్ళడానికి రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. ఇంటర్ సిటీ ట్రైన్ రావడముతో ముందు నాగేశ్వర రావు ఎక్కాడు. వెనుకనే భార్య కల్యాణి కూడా ట్రైన్ ఎక్కుతుండగా ఒక్కసారిగా రైలు కదిలింది. దీంతో మహిళ ట్రైన్కు, ప్లాట్ఫామ్కు మధ్యలో ఇరుక్క పోవడంతో ఏడమ కాలు పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది. దీనిని గమనించిన రైల్వే సిబ్బంది అతి కష్టం మీద మహిళను బయటకు తీసి వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
ప్రాణం పోతున్నా ఎవరూ పట్టించుకోరే?
కర్ణాటక: మైసూరులో రైలు ఎక్కిన ప్రయాణికునికి ఫిట్స్ (మూర్ఛ) వచ్చి కింద పడి గిలగిలాకొట్టుకున్నాడు. కానీ చికిత్స మాత్రం దొరకలేదు. చివరకు అభాగ్యుడు రైల్లోనే మరణించాడు. ఈ ఘటనలో రైల్వే అధికారుల నిర్లక్ష్యముందని తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. మైసూరు రైల్వేస్టేషన్లో నిర్లక్ష్యం ఫిట్స్తో గంట పాటు వృద్ధుని ప్రయాణం చికిత్స అందక కన్నుమూత వివరాలు.. మైసూరు రమాబాయి నగరకు చెందిన పి.స్వామి (83) అనే వృద్ధుడు బెంగళూరుకు వెళ్లేందుకు మైసూరు రైల్వేస్టేషన్లో ప్యాసింజర్ రైలు ఎక్కాడు. రైలు మైసూరు స్టేషన్లో కదలడానికి ముందే అతడు ఫిట్స్ వచ్చి పడిపోయాడు. వెంటనే సహ ప్రయాణికులు ఈ సమాచారాన్ని రైల్వే పోలీసులకు తెలిపారు. రైల్వేస్టేషన్లో ఉన్న నర్సు వచ్చి పరీక్షించి ఏమీ చెప్పకుండా వెళ్లిపోయింది. ఆ తర్వాత రైలు బయలుదేరి ముందుకు కదిలింది. మార్గమధ్యలో శ్రీరంగపట్టణ, పాండవపుర రైల్వేస్టేషన్లో అస్వస్థతకు గురైన స్వామిని చికిత్స కోసం పంపించకుండా రైల్వే పోలీసులు తాత్సారం చేశారు. దీంతో పాండవపుర రైల్వే స్టేషన్లో ప్రయాణికులు గొడవ చేశారు. అనంతరం చిక్కబ్యాడరహళ్లి రైల్వే స్టేషన్కు రైలు చేరుకున్న తర్వాత రైల్వే సిబ్బంది నుంచి ఎలాంటి స్పందన కనిపించకపోవడంతో తోటి ప్రయాణికులు ఇక తమ గొడవను పెద్దగా చేశారు. ముందు వచ్చే యలియూరు రైల్వే స్టేషన్కు అంబులెన్స్ వస్తుందని, అప్పుడు స్వామిని తరలిస్తామని రైల్వే సిబ్బంది తెలిపారు. అయితే రైలు యలియూరు స్టేషన్కు వచ్చినప్పటికీ అక్కడ ఎలాంటి అంబులెన్స్ కనిపించలేదు. ఇదంతా జరిగి అప్పటికే గంట సమయం వృథా అయింది. దీంతో స్వామి రైలులోనే ఎంతో ఇబ్బంది పడుతూ మృతి చెందాడు. మండ్యలోనూ అదే తంతు మధ్యాహ్నం 3.40 గంటలకు మండ్య రైల్వే స్టేషన్కు రైలు వచ్చినప్పుడు పోలీసులతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. పోలీసులపై ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. రైల్వే పోలీసుల నిర్లక్ష్యం కారణంగా సకాలంలో చికిత్స లభించక స్వామి మరణించాడని ప్రయాణికులు ఆరోపించారు. తోటి ప్రయాణికుల సహాయంతో స్వామి మృతదేహాన్ని ఇతర ప్రయాణికులు రైలు నుంచి కిందకి దించి ప్లాట్ఫారమ్పై ఉంచారు. సుమారు 45 నిమిషాల పాటు మృతదేహం ప్లాట్ఫారమ్పైనే ఉంది. తరువాత మృతదేహాన్ని జిల్లాస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి చొక్కాలోని ధ్రువీకరణ పత్రాల ఆధారంగా అతడు మైసూరు రమాబాయినగర నివాసి అని గుర్తించారు. స్వామి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టమ్ నిర్వహించి అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. చికిత్స చేసి ఉంటే బతికేవాడు నేను పాండవపుర పోలీసు స్టేషన్లో రైలు ఎక్కాను.. ఒక ప్రయాణికుడు కుప్పకూలిపోయి ఇబ్బంది పడుతున్నాడు. స్టేషన్ పోలీసులకు సమాచారం ఇచ్చినా ఎలాంటి ప్రయోజనం కలగలేదు. పోలీసుల హామీ మేరకు యలియూరు రైల్వే స్టేషన్లో ఎదురు చూసినా అంబులెన్స్ రాలేదు. మైసూరులోనే అంబులెన్స్ ఏర్పాటు చేసి చికిత్స అందించి ఉంటే బతికేవాడేమో.. అయితే పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఒక ప్రాణం పోయింది. –పుష్పలతా, రైలు ప్రయాణికురాలు, బెంగళూరు -
ఇదేం విచిత్రం.. కిలో మీటర్ వెనక్కి నడిచిన రైలు.. ఎందుకంటే?
కేరళలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. స్టేషన్లో ఆగాల్సిన రైలు ఆగకుండా ముందుకెళ్లింది. కొంత దూరం వెళ్లిన తర్వాత విషయం తెలుసుకున్నలోకోపైలట్ దాదాపు కిలోమీటర్ వరకు రైలును వెనక్కి నడిపి ప్రయాణికులను దింపాడు. ఈ వింత సంఘటన అలప్పుజ జిల్లాలో సోమవారం ఉదయం 7.45 గంటలకు చోటుచేసుకుంది. షోరనూర్ నుంచి వేనాడ్ వెళ్లే ఎక్స్ప్రెస్ రైలు మావెలిక్కర, చెంగన్నూర్ మధ్యనున్న చెరియానాడ్ రైల్వే స్టేషన్లో ఆగాల్సి ఉంది. కానీ రైలు ఆపకుండా ముందుకు వెళ్లిపోయింది. వెంటనే అటు స్టేషన్లో రైలు ఎక్కాల్సినవాళ్లు.. ఇటు రైలు నుంచి దిగాల్సిన ప్రయాణికులు ఆందోళన చెందారు. కాసేపటికి లోకో పైలట్కు వెనక స్టేషన్లో ప్రయాణికులు ఉన్న విషయం గుర్తొచ్చింది. దీంతో రైలును వెనక్కి నడిపాడు. 700 మీటర్లు రైలును వెనక్కిపోనిచ్చి స్టేషన్లో ప్రయాణికులను ఎక్కించుకున్నాడు. కాగా ప్రయాణికులు ఇబ్బంది పడినట్లు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని రైల్వే అధికారులు తెలిపారు. అయినా రైలు సరైన సమయంలో గమ్యస్థానానికి చేరుకుందని వెల్లడించారు. అయితే చేర్యానాడ్ స్టేషన్లో సిగ్నల్ లేదా స్టేషన్ మాస్టర్ లేకపోవడంతో రైలు ఆగకుండా వెళ్లిపోయి ఉందని, ఇది లోకో పైలట్ని తప్పిదంగా అంచనా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అతని నుంచి వివరణ కోరనున్నట్లు పేర్కొన్నారు. స్టేషన్లో ట్రైన్ ఆపకపోవడానికి కారణం ఏంటనే విషయంపై విచారిస్తామని చెప్పారు. చదవండి: Vande Bharat: వడగళ్లు, పిడుగుపడి దెబ్బతిన్న వందేభారత్ -
చీరాల: రైలుకు, ప్లాట్ఫాంకు మధ్య ఇరుక్కున్న మహిళ
చీరాల అర్బన్: రైలు ఎక్కే క్రమంలో ఓ మహిళ రైలుకు, ప్లాట్ఫామ్కు మధ్య ఇరుక్కుపోయింది. రైల్వే పోలీసులు స్పందించి ఆమె ప్రాణాలు కాపాడారు. శుక్రవారం బాపట్ల జిల్లా చీరాల రైల్వేస్టేషన్లో ఈ ఘటన జరిగింది. నెల్లూరు జిల్లా కరేడు గ్రామానికి చెందిన తిరుపతమ్మ, ఆమె భర్త ఇద్దరూ ఉలవపాడు వెళ్లేందుకు తెనాలిలో విజయవాడ–గూడూరు మెమూ ఎక్స్ప్రెస్ ఎక్కారు. రైలు చీరాల వచ్చేసరికి మరుగుదొడ్ల కోసం రైలు నుంచి ఆమె కిందకు దిగింది. అనంతరం రైలు కదలడంతో హడావుడిగా కదులుతున్న రైలు ఎక్కింది. ఈ క్రమంలో రైలుకు, ప్లాట్ఫామ్కు మధ్య ఆమె ఇరుక్కుపోయింది. వెంటనే అక్కడ జీఆర్పీ, ఆరీ్పఎఫ్ కానిస్టేబుళ్లు కోటేశ్వరరావు, నాగార్జున ఇద్దరూ కలిసి తోటి ప్రయాణికుల సాయంతో అతి కష్టం మీద బయటకు తీశారు. తీవ్ర గాయాలపాలైన ఆమెను వెంటనే 108లో చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్కు తరలించారు. సుమారు 50 నిమిషాల పాటు రైలును నిలిపివేశారు. ఇది కూడా చదవండి: వందే భారత్ రైలుపై రాళ్లదాడి.. -
Viral Video: రైల్వే స్టేషన్లో యువతి బిత్తర స్టెప్పులు.. అయినా 10 లక్షల వ్యూస్!
సోషల్ మీడియా పుణ్యమా అని ఎవరూ చూసినా ఇన్స్టాగ్రామ్, ట్విటర్, ఫేస్బుక్, స్నాప్చాట్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. యూట్యూబ్ వీడియోలు, రీల్స్తో తక్కువ సమయంలోనే పాపులర్ అయ్యేందకు ప్రయత్నిస్తున్నారు. కొంతమంది అర్థవంతమైన, ప్రజలకు అవసరమైన కంటెంట్ను అందించి ఫేమస్ అవుతుంటే మరికొందరు జనాల దృష్టిని ఆకర్షించేందకు మితిమీరి ప్రవర్తిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పిచ్చిచేష్టలు, అర్థంపర్థం లేని డ్యాన్స్లతో ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇలాంటి కోవకు సంబంధించిన ఓ వీడియోనే ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. సీమా కనోజియా అనే యువతి రైల్వే స్టేషన్లో డ్యాన్స్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసింది. ఇందులో యువతి రద్దీగా ఉన్న రైల్వే స్టేషన్లో అక్షయ్ ఖన్నా, ఐశ్వర్యరాయ్ నటించిన ‘ఆ అబ్ లౌత్ చలే’ సినిమాలోని ‘మేరా దిల్ తేరా దీవానా’ అనే పాటకు పిచ్చిపిచ్చిగా డ్యాన్స్ చేసింది. బ్లూ కలర్ డ్రెస్లో పాటకు సంబంధం లేకుండా ఆమె వేసిన స్టెప్పులు ఎవరిని ఆకట్టులేకపోకపోయాయి. అయినా యువతి అవేవి పట్టించుకోకుండా ధైర్యంగా డ్యాన్స్ చేయడం కొసమెరుపు. View this post on Instagram A post shared by Seema Kanojiya (@seemakanojiya87) దీనికి సంబంధించిన ఇన్స్టాగ్రామ్లో వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. దీనిని ఇప్పటికే 10 లక్షల మంది వీక్షించారు. యువతి బిత్తర స్టెప్పులపై నెటిజన్లు కడుపుబ్బా నవ్వుతున్నారు. ఆమె డ్యాన్స్ను ట్రోల్చేస్తున్నారు. మరికొందరు ఇతరులకు ఇబ్బంది కలిస్తున్న ఈమెలాంటి వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదికాగా సదరు యువతికి ఇన్స్టాలో 3లక్షలకు పైగా ష్యాన్స్ ఫాలోయింగ్ ఉండటం గమనార్హం. అయితే యువతి ఇలాంటి వీడియోలు పెట్టడం ఇదేం తొలిసారి కాదు, లోకల్ రైలు, రోడ్డు ఎలా ఎక్కడ పడితే అక్కడ డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఉంటుంది. View this post on Instagram A post shared by Seema Kanojiya (@seemakanojiya87) View this post on Instagram A post shared by Seema Kanojiya (@seemakanojiya87) View this post on Instagram A post shared by Seema Kanojiya (@seemakanojiya87) -
రైల్వే ప్లాట్ఫారమ్ టీవీల్లో యాడ్స్కు బదులుగా ..
నిర్లక్ష్యమో, కావాలని జరిగిన ఘటనో తెలియదుగానీ.. స్టేషన్లో ప్రయాణికులను బిత్తర పోయేలా చేసింది ఓ ఘటన. అడ్వర్టైజ్మెంట్ల ప్లేస్లో మూడు నిమిషాల పాటు అశ్లీల వీడియో ప్రదర్శితమైంది. ఈ పరిణామంతో అక్కడున్నవాళ్లంతా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఆదివారం ఉదయం బీహార్ రాజధాని పాట్నా ప్రధాన రైల్వే స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో ప్రయాణాలకు సిద్ధంగా ఉన్న కొందరు ఫ్లాట్ఫారమ్పై ఉన్న టీవీల్లో పో* వీడియో ప్లే కావడంతో ఇబ్బందిపడ్డారు. కొందరు ఆకతాయిలు అరుస్తూ.. ఆ వీడియోను తమ సెల్ఫోన్లతో బంధించారు. ఈలోపు కొందరు ప్రయాణికులు.. గవర్నమెంట్ రైల్వే పోలీస్(జీఆర్పీ), ఆర్పీఎఫ్ పోలీసుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే అడ్వర్టైజ్మెంట్లు ప్రసారం చేసే ఏజెన్సీకి ఫోన్ చేయడంతో.. వీడియో ఆగిపోయింది. ఇక ఈ ఘటనకు సదరు ఏజెన్సీ దత్తా కమ్యూనికేషన్స్ ఘటనకు కారణమని కేసు నమోదు చేశారు పోలీసులు. అంతేకాదు ఆ ఏజెన్సీ కాంట్రాక్ట్ను రద్దు చేయడంతో పాటు మరెప్పుడూ కాంట్రాక్ట్ దక్కకుండా బ్లాక్లిస్ట్లోకి చేర్చారు. అంతేకాదు అదనంగా జరిమానా కూడా విధించారు. మరోవైపు రైల్వే విభాగం ఈ ఘటనపై విడిగా విచారణ చేపట్టింది. అయితే ప్రత్యేకించి ప్లాట్ఫాం నెంబర్ 10పైనే టీవీల్లోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో.. రైల్వే అధికారులు పలు అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ట్విటర్లో ఆ వీడియో వైరల్ అవుతోంది. వీడియో: ఇలాంటి షాపింగ్ను మీరు కచ్చితంగా ఊహించి ఉండరు! -
పట్టాలు తప్పిన ట్రైన్.. వికారాబాద్ స్టేషన్లో నిలిచిపోయిన రైళ్లు
బెంగళూరు: కర్ణాటకలోని చిత్తాపూర్ సులేహళ్లిలో గుడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో వికారాబాద్ రైల్వే స్టేషన్లో పలు రైళ్లు నిలిచిపోయాయి. ఈ క్రమంలో వికారాబాద్ మీదుగా వెళ్లే రైళ్లను రాయచూర్ వైపు దారి మళ్లిస్తున్నారు. కేఎస్ఆర్ బెంగళూరు, యశ్వంత్పూర్, రాయలసీమ ఎక్స్ప్రెస్ రైళ్లను దారి మళ్లిస్తున్నారు. అలాగే ఆర్టీసీ బస్సులను తాండూరు మీదుగా నడపాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పండగ సమయం కావడం, గంటలపాటు రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులను అధికారులు తాండూర్ తరలిస్తున్నారు. చదవండి: శరవేగంగా ఎయిర్పోర్ట్ మెట్రో నిర్మాణానికి ముందస్తు పనులు: ఎన్వీఎస్ రెడ్డి -
సంక్రాంతికి ఎట్లైనా ఊరికి పోవాలె (ఫొటోలు)
-
తెలంగాణకు ప్రధాని మోదీ.. ఈ నెలలోనే.. వివరాలు ఇవే..
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 19న లేదా 20న రాష్ట్రానికి రానున్నట్టు తెలిసింది. పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులను మో దీ ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును ఆయన ప్రారంభిస్తారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి విజయవాడ మధ్య (కాజీపేట మీదుగా) ఈ ఎక్స్ప్రెస్ను నడుపుతారు. తర్వాత ఈ రైలును విశాఖపట్నం దాకా విస్తరించనున్నారు. గతంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వందేభారత్ ఎక్స్ప్రెస్ సర్వీసులను మోదీ ప్రారంభించిన నేపథ్యంలో.. తెలుగురాష్ట్రాల మధ్య నడపనున్న ఈ రైలును కూడా ఆయనే ప్రారంభిస్తారని చెబుతున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మోదీ ప్రసంగించే అవకాశాలున్నాయని పార్టీవర్గాల సమాచారం. చదవండి: (తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మరో డీఏ విడుదల) -
హౌరా రైల్వే స్టేషన్ లో హైడ్రామా
-
దువ్వాడ రైల్వే స్టేషన్ లో గాయపడ్డ విద్యార్థిని శశికళ మృతి
-
దువ్వాడ రైల్వేస్టేషన్లో గాయపడిన విద్యార్థిని మృతి
సాక్షి, విశాఖపట్నం: విశాఖ జిల్లా దువ్వాడ రైల్వేస్టేషన్లో గాయపడిన విద్యార్థిని శశికళ మృతి చెందింది. దువ్వాడ జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది కథనం ప్రకారం.. కాకినాడ జిల్లా అన్నవరం సమీపంలోని గోపాలపట్నం గ్రామానికి చెందిన మెరపల శశికళ దువ్వాడలోని విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. కళాశాలకు వెళ్లడానికి బుధవారం ఉదయం ఆమె గుంటూరు–రాయగడ ఎక్స్ప్రెస్ ఎక్కారు. దువ్వాడ రైల్వేస్టేషన్కు రైలు చేరుకోవడంతో ఆమె దిగే ప్రయత్నంలో కాలుజారి ప్లాట్ఫామ్, రైలు బోగీ మధ్యలో ఇరుక్కుపోయింది. రైలు నిలిపేసి ఆమెను బయటకు తీసుకువచ్చేందుకు అక్కడి సిబ్బంది ప్రయచినా ప్రయోజనం లేకపోయింది. వెంటనే ఆర్పీఎఫ్, జీఆర్పీ, ఆపరేటింగ్ సిబ్బందితోపాటు రెస్క్యూ టీమ్, విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాల రెక్టార్ వి.మధుసూదనరావు, వైస్ ప్రిన్సిపాల్ కె.మధుసూదనరావు అక్కడికి చేరుకుని గంటన్నరపాటు శ్రమించి ప్లాట్ఫామ్ను తవ్వించి ఆమెను బయటకు తీశారు. అంబులెన్స్లో కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె శరీరంలో అంతర్గతంగా రక్తస్రావం జరగడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. నిన్నటి నుంచి ఐసీయూలో అత్యవసర చికిత్స తీసుకుంటున్న శశికళ ఇవాళ తుదిశ్వాస విడిచింది. చదవండి: (కట్టుకథలు..విషపురాతలు.. ఎమ్మెల్యే కేతిరెడ్డిని టార్గెట్ చేస్తూ కథనాలు) -
తొందరగా వెళ్లాలని పట్టాలు దాటుతోంది..సడెన్గా ట్రైయిన్ రావడంతో..
కర్ణాటకలోని ఓ రైల్వేస్టేషన్లో... త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. ఒక తల్లి కొడుకులు ట్రైయిన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో తల్లి మరో ప్లాట్ఫాం మీదకు వెళ్లేందుకని.. రైల్వే ట్రాక్ క్రాస్ చేసి తొందరగా వెళ్లిపోవచ్చు అనుకుంది. అందులో భాగంగానే రైల్వే పట్టాలపైకి వచ్చింది. అంతే ఇంతలో అటువైపుగా ఒక గూడ్స్ రైలు వేగంగా వస్తోంది. దీన్ని గమినించిన కొడుకు వెంటనే స్పందించి...తల్లిని కాపాడుకునేందకు పట్టాలపై దిగాడు. రైల్వే ఫ్లాట్ ఫాంపై ఉన్న ప్రయాణికులంతా ఆ తల్లి కొడుకులు అయిపోయారనుకుని.. నిర్ఘాంతపోయి చూస్తున్నారు. ఈ ఘటన కర్ణాటకలోని కల్బుర్డిలోని రైల్వే ఫ్లాట్ఫాంలో చోటు చేసుకుంది. ఐతే ఆ తల్లికొడుకులిద్దరు పట్టాలకు, ఫ్లాట్ఫాంకికు మధ్యలో కదలకుండా ఒకవైపుకి ఒకరినొకరు పట్టుకుని ఒరిగిపోయి కుర్చొన్నారు. పాపం వాళ్లు ట్రైయిన్ వెళ్లేంతవరకు అలా ఊపిరి బిగబెట్టుకుని కుర్చొన్నారు. స్టేషన్లో ఉన్న మిగతా ప్రయాణికులు కూడా టెన్షన్గా చూస్తున్నారు. ఇంతలో ట్రైయిన్ వెళ్లిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆ తల్లి కొడుకులు బతుకు జీవుడా అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నారు. అందుకు సంబంధించిన నెట్టింట వైరల్ అవుతోంది. Narrow Escape For Karnataka Mother, Son Caught Between Train, Platform https://t.co/VldSfF18fq pic.twitter.com/MXiLp72p9C — NDTV News feed (@ndtvfeed) December 8, 2022 (చదవండి: గురుద్వారాని సందర్శించి..పూజలు చేసిన కింగ్ చార్లెస్) -
దువ్వాడ: రైలు-పుట్పాత్ మధ్య ఇరుక్కున్న విద్యార్థి.. నొప్పి భరించలేక..
సాక్షి, విశాఖపట్నం: రైలు ఎక్కుతున్నప్పుడు లేదా దిగి క్రమంలో జాగ్రత్తలు వహించాలని రైల్వే అధికారులు హెచ్చరిస్తూనే ఉంటారు. కానీ, వారి హెచ్చరికలు పట్టించుకోకుండా కొందరు అజాగ్రత్తతో ప్రమాదాల్లో చిక్కుకుంటారు. ఇలాంటి వీడియోలు ఇప్పటికి చాలానే చూశాము. తాజాగా ఇలాంటి ఘటనే గాజువాకలోని దువ్వాడ రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. గుంటూరు-రాయగఢ్ ఎక్స్ప్రెస్ రైలు దువ్వాడకు వచ్చింది. ఈ సందర్భంగా ప్లాట్ఫామ్ మీద నుంచి రైలు ఎక్కుతున్న క్రమంలో ఇంజనీరింగ్ విద్యార్థిని శశికళ కిందపడిపోయింది. ఈ క్రమంలో ఫుట్పాత్, రైలులో మధ్యలో ఇరుక్కుపోయింది. దీంతో, బయటకు వచ్చేందుకు తీవ్ర అవస్థలు ఎదుర్కొంది. కాగా, విద్యార్ధిని రైలు మధ్యలో పడిపోవడంతో ఆమెను బయటకు తీసెందుకు రైల్వే అధికారులు సహాయక చర్యలు చేపట్టి సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం, హుటాహుటిన ఆమెను అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. -
దువ్వాడ రైల్వే స్టేషన్ లో రైలు క్రింద ఇరుక్కుపోయిన ఇంజినీరింగ్ విద్యార్థిని
-
గంటల తరబడి నిరీక్షణ తర్వాత ట్రైయిన్ ఎంట్రీ..ఒక్కసారిగా ప్రయాణికుల రియాక్షన్
వాస్తవానికి మనం ఏదైనా ఊరు లేదా యాత్రకు వెళ్లేటప్పుడూ ట్రైయిన్/బస్సు లేదా విమానం కోసం ఒక్కోసారి గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. సరిగ్గా ఆ రోజు వాతావరణం బాగోకపోవడమో లేక ఆ వాహనాల్లో సమస్య తలెత్తడం వంటి తదితర కారణాల రీత్యా ఆలస్యమైపోతుంది. దీంతో ఎవరికైనా సహజంగా కోపం, చిరాకు వంటివి వచ్చేస్తాయి. దెబ్బకు మళ్లీ ఎక్కడకి వెళ్లకూడదు అనుకునేంత చిర్రెత్తుకొస్తుంది. అచ్చం అలాంటి ఘటన ఒక రైల్వేస్టేషన్లోని ప్రయాణకులకు ఎదురైంది. అ లాంటి ఇలాంటి లేటు కాదు ఏకంగా 9 గంటలకు పైగా ట్రైయిన్ కోసం నిరీక్షించారు. అన్ని గంటలు అంటే కచ్చితంగా బాబోయ్ అసలు ట్రైయిన్ వస్తుందా రాదా! అన్నంత చిరాకొచ్చి వెళ్లిపోవాలనుకుంటాం. కానీ ఇక్కడ రైల్వేస్టేషన్లో వందలమంది ప్రయాణికులు ట్రైయిన్కోసం అలా పడిగాపులు కాచి ఉన్నారే తప్ప అసహనంగా కూడా లేరు. ఎట్టకేలకు తొమ్మిది గంటల ఆలస్యం తర్వాత ట్రైయిన్ రానే వచ్చింది. అంతే ప్రయాణకులంతా ఒక్కసారిగా విజిల్స్ వేస్తే ఏదో సాధించేసినట్లుగా ఫీలవుతూ హయిగా ఆ రైలు ఎక్కేసారు. అంతేకాదు దూరం నుంచి చిన్న లైటు వెలుగుతో హారన్ వేయిగానే ఎదురుచూస్తున్న ప్రయాణికుల మొహాలు చిచ్చబుడ్డిల్లా వెలిగిపోయాయి. ఐతే ఇంతకీ అదే ఏ స్టేషన్ ఎక్కడ జరిగిందనేది తెలయాల్సి ఉంది. అందుకు సబంధించిన వీడియోని హార్దిక బొంతు అనే సోషల్ మీడియా వినియోగదారుడు ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఐతే నెటిజన్లు మాత్రం ఇండియాలో ప్రజలు ఏ సమస్యనైనా ఇలానే సహనంతో నవ్వుతూ ఎదుర్కొంటారు, ఇదే ఈ దేశంలోని అసలైన అందం అని కామెంట్లు చేస్తూ ట్వీట్ చేశారు. Our train got late by 9 hours. This is how people reacted when it arrived. pic.twitter.com/8jteVaA3iX — Hardik Bonthu (@bonthu_hardik) November 27, 2022 (చదవండి: ఎంతపనిచేసింది ఆ దోమ..నాలుగు వారాల కోమా, ఏకంగా 30 సర్జరీలా!) -
మహారాష్ట్ర : బల్లార్షా రైల్వేస్టేషన్ లో ఘోర ప్రమాదం
-
హౌరా ఎక్స్ప్రెస్లో మంటలు.. కుప్పం రైల్వేస్టేషన్లో ప్రయాణికుల పరుగులు
సాక్షి, చితూర్తు జిల్లా: బెంగళూరు నుంచి కుప్పం మీదగా యశ్వంత్పూర్ వెళ్తున్న హౌరా ఎక్స్ప్రెస్ ఏసీ బోగీలో మంటలు చెలరేగాయి. ఎస్9 బోగీలో మంటలు వ్యాపించాయి. దీంతో కుప్పం రైల్వేస్టేషన్లో రైలు నిలిచిపోయింది. రైలు దిగిన ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చిన రైల్వే సిబ్బంది.. వెంటనే మరమ్మతులు చేపట్టారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడం అంతా ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: ఎవరు హోల్డ్? ఎవరు ఓపెన్?.. అసలు కథేంటో తర్వాత అర్థమైందట.. -
వీడియో: ప్రయాణికులకు అలర్ట్.. రైల్వే టికెట్ కౌంటర్లో ఘరానా మోసం!
ప్రస్తుత కాలంలో జాగ్రత్తగా లేకపోతే ప్రతీ చోట మోసపోక తప్పదు. డబ్బులు, వస్తువులను సెకన్ల వ్యవధిలో మాయం చేసే కేటుగాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే, రైల్వేస్టేషన్లోని టికెట్ కౌంటర్లో రైల్వే ఉద్యోగి చేతివాటం చూపించాడు. ఓ ప్రయాణికుడికే షాకిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే అధికారులు అతడిపై చర్యలకు దిగారు. వివరాల ప్రకారం.. ఢిల్లీలోని హజ్రత్ నిజామోద్దీన్ రైల్వేస్టేషన్లో ప్రయాణికుడు టికెట్ కోసం క్యూలో నిల్చుని కౌంటర్ వద్దకు వచ్చాడు. ఈ క్రమంలో కౌంటర్లో ఉన్న ఉద్యోగికి రూ.500 నోటు ఇచ్చి గ్వాలియర్కు(రూ.125 ధర) టికెట్ ఇవ్వమన్నాడు. ఈ క్రమంలో రైల్వే ఉద్యోగి చేతివాటం చూపించాడు. అదేదో మ్యాజిక్ తనకే వచ్చు అన్నట్టుగా కౌంటర్ నుంచి రూ. 20 నోటు తీసి రూ. 500 నోటును సెకన్లలో దాచేశాడు. అనంతరం.. తనకు 20 రూపాయలే ఇచ్చావని.. ఇంకా డబ్బులు ఇవ్వాలని బుకాయించారు. దీంతో, సదరు ప్రయాణికుడు షాకై.. ఉద్యోగిని నిలదీశాడు. అప్పటికే సదరు ఉద్యోగి తనకు రూ.20 మాత్రమే ఇచ్చాడని ఓవరాక్షన్ చేశాడు. అయితే, ఇదంతా పక్కనే ఉన్న మరో వ్యక్తి వీడియో తీయడం ఉద్యోగి అసలు బండారం బయటకు వచ్చింది. దీంతో, ప్లాన్ రివీల్ కావడంతో ఉద్యోగి నాలుకు కరుచుకున్నాడు. ఇక, వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు వీడియోను రైల్వే ఉన్నతాధికారులకు షేర్ చేశాడు. ఈ క్రమంలో సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకుంటున్నట్టు ఢిల్లీ రైల్వే అధికారులు వెల్లడించారు. #Nizamuddin station booking office Date 22.11.22 Rs 500 converted into Rs 20 by the booking clerk.@GM_NRly @RailwayNorthern @drm_dli @RailMinIndia @AshwiniVaishnaw @IR_CRB @RailSamachar @VijaiShanker5 @PRYJ_Bureau @kkgauba @tnmishra111 @AmitJaitly5 pic.twitter.com/SH1xFOacxf — RAILWHISPERS (@Railwhispers) November 24, 2022 The employee has been taken up and disciplinary proceedings have been initiated against him. — DRM Delhi NR (@drm_dli) November 25, 2022 -
ఒడిస్సా: ప్లాట్ ఫామ్ పైకి దూసుకెళ్లిన గూడ్స్ రైల్..
-
షాకింగ్.. పట్టాలు తప్పి ప్లాట్ఫాం పైకి దూసుకెళ్లిన రైలు.. ముగ్గురు మృతి..
భువనేశ్వర్: ఒడిశాలో సోమవారం ఉదయం రైలు ప్రమాదం జరిగింది. జాజ్పూర్ జిల్లా కొరాయి రైల్వే స్టేషన్లో గూడ్సు రైలు పట్టాలు తప్పి ప్లాట్ఫాంపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మరికొందరు గాయపడ్డారు. పలువురు రైలు కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో రైల్వే స్టేషన్ కూడా పాక్షికంగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ప్యాసెంజర్ల వెయిటింగ్ హాల్లోకి గూడ్స్ రైలు దూసుకెళ్లినట్లు సమాచారం. రైలు పట్టాలు తప్పడంతో స్టేషన్లోని రెండు ట్రాక్లు బ్లాక్ అయి రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో మొత్తం 12 బోగీలు పట్టాలు తప్పాయి. నాలుగు భోగీలు బోల్తాపడ్డాయి. రైల్వే స్టషన్లో ఫుటోవర్ బ్రిడ్జి కూడా ధ్వైంసమైంది. అధికారులు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి రైల్వే స్టేషనలో సేవలు పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు. రూ.5లక్షల పరిహారం.. ఈ ఘటనపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారంగా ప్రకటించారు. తీవ్రంగా గాయపడినవారికి రూ.లక్ష, స్వల్ప గాయాలైన వారికి రూ.25 వేలు సాయంగా అందిస్తామన్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. #JustIn Three passengers killed, while two others sustained grave injuries as a goods train derailed and rammed into passengers waiting at Korai station in #Odisha on Monday.@NewIndianXpress @Siba_TNIE pic.twitter.com/RtjYyhST2z — TNIE Odisha (@XpressOdisha) November 21, 2022 -
బంగారు దోసె @ రూ.వెయ్యి
తుమకూరు: సెట్ దోసె, నీరు దోసె, మసాల దోసె, ప్లెయిన్ దోసె ఇలా అనేక రకాల దోసెలను తినే ఉంటారు. వాటి ధర 50 నుంచి 100 మధ్య ఉంటే గొప్ప. కానీ ఇక్కడ ఎవరూ ఊహించని దోసెను అమ్ముతున్నారు. దానిని ఆరగించాలంటే రూ. వెయ్యి చెల్లించుకోవాలి. దోసెకు అంత ధర అని ఆశ్చర్యపోవద్దు, వివరాలు తెలుసుకుంటే నిజమే అని అంగీకరిస్తారేమో. ఇలా తయారవుతుంది తుమకూరు నగరంలో రైల్వేస్టేషన్ రోడ్డులోని ఓ హోటల్లో బంగారు దోసె లభిస్తోంది. మామూలు మసాలా దోసెను చేయగానే దానిపై అతి పల్చని బంగారు కాగితాన్ని పరుస్తారు. దోసె వేడికి అది అలాగే అతుక్కుపోతుంది. దోసెతో సహా బంగారాన్ని కూడా తినేయవచ్చు. గత మూడు నెలల నుంచి ఇక్కడ బంగారు దోసెలను అమ్ముతున్నారు. ఇప్పటికి 45 దోసెలు మాత్రమే హోటల్ యజమాని కార్తీక్ మాట్లాడుతు కొన్ని సంవత్సరాల కిందట బెంగళూరులో ఒక హోటల్లో ఇలాంటి దోసెను వేశారని, అది మనసులో పెట్టుకుని తాను కూడా బంగారు దోసెకి నాంది పలికినట్లు చెప్పాడు. అప్పటి నుంచి రూ. వెయ్యి చెల్లించి 45 మంది మాత్రం ఈ ఖరీదైన దోసెల సంగతి చూశారు. కాగా, బంగారాన్ని ఆరగించడం ఆరోగ్యానికి మంచిదని కొందరు, ఎలాంటి ఉపయోగం ఉండదని మరికొందరు తెలిపారు. ఎక్కువమంది కొనకపోయినప్పటికీ ఈ హోటల్కు వచ్చి బంగారు దోసెను చూసి ఫోటోలు వీడియోలు తీసుకోవడం పెరిగింది. (చదవండి: సాగర జలాశయంలో వింత మత్స్యం ..రెక్కలతో నిలబడే చేప ) -
భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. రెండు బ్యాగుల నిండా బాంబులు స్వాధీనం
శ్రీనగర్: జమ్ము రైల్వే స్టేషన్ వద్ద పేలుళ్లు జరిపేందుకు చేసిన భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. రైల్వే స్టేషన్ సమీపంలోని టాక్సీ స్టాండ్ వద్ద 18 డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రెండు బ్యాగుల్లో పేలుడు పదార్థాలను గుర్తించినట్లు చెప్పారు. డిటోనేటర్లతో పాటు రెండు బాక్సుల్లో వైర్లను గుర్తించామని, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ‘సుమారు 500 గ్రాముల మైనపు రకం పదార్థం బాక్సులో ప్యాక్ చేసి కనిపించింది. వాటిని సీజ్ చేశాం.’ అని ప్రభుత్వ రైల్వే పోలీసు జీఆర్పీ ఎస్ఎస్పీ ఆరిఫ్ రిషూ తెలిపారు. ట్యాక్సీ స్టాండ్లో అనుమానిత బ్యాగ్ను గుర్తించిన క్రమంలో ఈ విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. రెండు బాక్సుల్లో డిటోనేటర్లు, వైర్లు ఉన్నాయని చెప్పారు. కొద్ది రోజులుగా జమ్ముకశ్మీర్లో ఉగ్రదాడులు జరుగుతున్న క్రమంలో పేలుడు పదార్థాలు లభించటం ఆందోళనలు పెంచుతోంది. ఇదీ చదవండి: ఆ కేసులో దోషిగా తేలిన సైకిల్ పార్టీ కీలక నేత.. ఎమ్మెల్యే పదవికి ఎసరు! -
రైలుకు ప్లాట్ఫాంకు మధ్యలో ఇరుక్కున్న మహిళ.. వీడియో వైరల్
పాట్నా: కదులుతున్న రైలు నుంచి కిందకు దిగడానికి ప్రయత్నిస్తూ కాలుజారి పడిపోయింది ఓ మహిళ. రైలుకు, ప్లాట్ఫాంకు మధ్యల్లో ఇరుక్కుపోయింది. అక్కడున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారి తక్షణమే స్పందించి మహిళ ప్రాణాలు కాపాడాడు. తీవ్ర గాయాలపాలైన ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మధ్యమాల్లో వైరల్గా మారింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన బిహార్ ముజఫర్పుర్ రైల్వే స్టేషన్లో శనివారం జరిగింది. ప్రమాదానికి గురైన మహిళను అంబిషా ఖాతూన్గా గుర్తించారు. పోలీసులు చెప్పిన వివరాల ఈ మహిళ ప్లాట్ఫైం నంబర్ 3పై రైలు కోసం ఎదురుచూస్తోంది. అయితే అక్కడ వాష్రూంలు లేవు. దీంతో అప్పుడే స్టేషన్లో ఆగిన రైలులోకి ఎక్కి వాష్రూం వినియోగించుకుంది. ఆ తర్వాత రైలు వెంటనే కదలడంతో త్వరగా కిందకు దిగేందుకు ప్రయత్నిస్తూ బ్యాలెన్స్ కోల్పోయి పడిపోయింది. రైలు కాసేపు ఆగుతుందని ఆమె భావించినప్పటికీ.. త్వరగా కదలడంతో ప్రమాదానికి గురైంది. చదవండి: ఉచితాలని ప్రజలను అవమానించొద్దు.. మోదీకి కేజ్రీవాల్ కౌంటర్ -
Video: ఏకంగా రైల్వే ప్లాట్ఫామ్ మీదకు ఆటో.. తరువాత ఏం జరిగిందంటే.
మహారాష్ట్రలో వింత ఘటన చోటుచేసుకుంది. ముంబైలోని కుర్లా రైల్వే స్టేషన్లో ఓ ఆటో డ్రైవర్ తన వాహనంతో రైల్వేస్టేషన్లోకి వచ్చాడు. ప్రయాణికులతో రైల్వే స్టేషన్కు వచ్చిన ఆటో డ్రైవర్ ఏకంగా ఏకంగా తన ఆటోను ప్లాట్ఫామ్ మీదకే పోనిచ్చాడు. ఈ దృశ్యాలు రైల్వేస్టేషన్లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో చివరికి రైల్వే పోలీసులు దృష్టికి చేరింది. దీంతో వారు ట్విటర్ ద్వారా వివరణ ఇచ్చారు. కుర్లా రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మీదకు ఆటో తీసుకొచ్చిన డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. రైల్వే యాక్ట్ ప్రకారం నిందితుడిపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన శనివారం జరగ్గా.. తాజాగా నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది ఫన్నీగా కామెంట్ పెడుతుంటే మరికొందరు రైల్వే అధికారులను తీరును తప్పబడుతున్నారు. ఆటో ఏకంగా ప్లాట్ఫామ్పైకి వచ్చేదాక రైల్వే సిబ్బంది ఏం చేస్తున్నారని మండిడుతున్నారు. Kurla station auto mafia on the platform. Please check & verify this. Too much freedom given by Kurla @MTPHereToHelp & @RPFCRBB Coincidentally on the first day of new @drmmumbaicr Isn't this a safety hazard for trains? @SrdsoM @RailMinIndia @RPF_INDIA pic.twitter.com/dXGd95jkHL — Rajendra B. Aklekar (@rajtoday) October 15, 2022 -
మరో విషాదం: రైలు కింద తోసేసి యువతి హత్య.. కూతురు మరణ వార్త తెలియడంతో
సాక్షి, చెన్నై: తమిళనాడులో సంచలనం సృష్టించిన ప్రేమోన్మాది ఘాతుకానికి బలైన యువతి ఘటనలో మరో విషాదం చోటుచేసుకుంది. రైలు కింద పడి కూతురు మృతిచెందిందన్న వార్త తెలియడంతో ఆమె తండ్రి గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం ప్రాణాలు విడిచారు. చెన్నైలోని ఓ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న మృతురాలి తల్లి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. కాగా ప్రేమను నిరాకరించిందన్న కారణంతో యువతిని రైలు కిందకు తోసేసి ఓ వ్యక్తి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులోని చెన్నైలో గురువారం చోటుచేసుకుంది. ఆదంబాక్కంకు చెందిన మాణిక్యం కూతురు సత్య(20) టీనగర్లోని ప్రైవేట్ కళాశాలలో బీకాం రెండో సంవత్సరం చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన సతీష్ అనే యువకుడు ప్రేమ పేరుతో కొంతకాలంగా ఆమెను వేధిస్తున్నాడు. గురువారం ఉదయం కళాశాలకు వెళ్లేందుకు యువతి సెయింట్ థామస్మౌంట్ రైల్వే స్టేషన్కు చేరుకుంది. అక్కడకు వచ్చిన యువకుడు ఆమెతో వాగ్వాదానికి దిగాడు. సంబంధిత వార్త: ప్రేమోన్మాది ఘాతుకం.. కానిస్టేబుల్ కూతురు దారుణ హత్య తనను ప్రేమించమని, పెళ్లి చేసుకోమని చాలా సేపు గొడవ పడ్డాడు. అందుకు యువతి ఒప్పుకోలేదు. అదే సమయంలో ప్లాట్ఫామ్ వైపు రైలు దూసుకొస్తుండగా యువకుడు ఉన్మాదిలా మారాడు. యువతిని ఒక్కసారిగా రైలు కిందకు తోసేసి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో రైలు చక్రాల కింద పడి నలిగిన సత్య అక్కడిక్కడే మృత్యువాతపడింది. కూతురు మరణ వార్త విన్న సత్య తండ్రి మాణిక్యం గుండెపోటుతో శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె తల్లి ఆసుపత్రి పాలైంది. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజీవ్ గాంధీ హాస్పిటక్కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుడు సతీష్ను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా సత్యకు గత నెలలోనే మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. కాగా కొంత కాలంగా రైల్వే స్టేషన్లో ప్రేమ పేరిట యువతులపై వేధింపుల ఘటనలు పెరిగిపోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చదవండి: లవర్తో భర్త షికార్లు.. షాపింగ్ మాల్లో రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న భార్య.. తర్వాత.. -
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని రైలు కిందకు తోసేసి..
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణం జరిగింది. 20 ఏళ్ల కాలేజీ విద్యార్థినిని ఓ ఆకతాయి కదులుతున్న రైలు కిందకు తోసేశాడు. థామస్ మౌంట్ రైల్వే స్టేషన్లో గురవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. అమ్మయి చెన్నై బీచ్కు వెళ్లే రైలు కోసం ఎదురుచూస్తున్న సమయంలో నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఘటనకు ముందు యువతికి, నిందితుడికి మధ్య వాగ్వాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కోపంతో ఉన్న నిందితుడు రైలు ప్లాట్ఫైంకి రావడం చూసి ఆమెను తోసేశాడని చెప్పారు. నిందితుడ్ని అలందూర్కు చెందిన సతీశ్గా(23) గుర్తించారు పోలీసులు. అతను రిటైర్డ్ ఎస్ఐ కుమారుడని వెల్లడించారు. ఎనిమిదో తరగతిలోనే చదువు ఆపేశాడని, చాలా కాలంగా యువతి వెంట పడుతున్నట్లు తెలిపారు. యువతికి నిశ్చితార్థం.. మృతి చెందిన యువతిని సత్యగా గుర్తించారు పోలీసులు. ఆమె తల్లి హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారని తెలిపారు. సత్యకు గతనెలలోనే నిశ్ఛితార్థం జరిగినట్లు వెల్లడించారు. ఆమె తల్లి సహా కుటుంబసభ్యులంతా పోలీస్ శాఖలోనే ఉద్యోగాలు చేస్తున్నట్లు వివరించారు. చదవండి: టీచర్ బ్రేకప్ చెప్పిందని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి -
రైల్వే కోచ్ రెస్టారెంట్.. ఎంత బావుందో చూశారా!
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): దక్షిణమధ్య రైల్వే పరిధిలోనే తొలి వినూత్న ప్రయోగానికి గుంటూరు రైల్వేస్టేషన్ వేదికైంది. అధునాతన హంగులతో ఇక్కడ రైల్వే శాఖ ఫుడ్ ఎక్స్ప్రెస్ పేరుతో కోచ్ రెస్టారెంట్ను ముస్తాబు చేసింది. గుంటూరు తూర్పు నియోజక వర్గ పరిధిలో దీనిని రైల్వే డీఆర్ఎం మోహన్రాజా సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మోహన్రాజా మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో అధునాతనంగా తీర్చిదిద్దిన ఈ కోచ్ రెస్టారెంట్ ప్రయాణికులతోపాటు గుంటూరు ప్రజలకు మంచి అనుభూతినిస్తుందన్నారు. 24 గంటలూ రెస్టారెంట్ పనిచేస్తుందని, రుచికరమైన వేడివేడి వంటకాలు లభిస్తాయని చెప్పారు. ఈ రైల్వే కోచ్ రెస్టారెంట్ను పాత అన్సర్వీస్బుల్ కోచ్ని ఉపయోగించడం ద్వారా రైలు ప్రయాణికులకు ప్రీమియం అనుభవాన్ని అందించడానికి డివిజన్లో ఈ వినూత్న ఆలోచనను రూపొందించడం జరిగిదన్నారు. ఈ కోచ్ను రెస్టారెంట్ అవసరాలకు రీడిజైన్ చేసి లైసెన్స్ మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ వినూత్న కాన్సెప్ట్ ద్వారా రైలు ప్రయాణికులు అందమైన ఇంటీరియర్స్తో పూర్తి ఎయిర్ కండిషన్డ్ మోడిఫైడ్ రైల్ కోచ్లో ప్రీమియం డైనింగ్ అనుభావాన్ని పొందుతారన్నారు. కార్యక్రమంలో డివిజన్ సీనియర్ డీసీఎం వి.ఆంజనేయులు, అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ టి.హెచ్.ప్రసాదరావు, సిబ్బంది, ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు. (క్లిక్ చేయండి: విద్యార్థులను యువ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు..) -
ఇయర్ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ.. ఇంతలోనే షాకింగ్ ఘటన
జడ్చర్ల(మహబూబ్నగర్): ఇయర్ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ, పట్టాలు దాటబోయి రైలు ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం జడ్చర్ల రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. రైల్వేపోలీసుల వివరాల ప్రకారం.. బాదేపల్లిలోని బక్కరావు కాంపౌండ్లో ఉండే వడ్డె వినయ్కుమార్ (19) ఐటీఐ చదువుతున్నాడు. ఉదయం జిమ్కు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మొబైల్లో పాటలు వింటూ రైల్వేస్టేషన్ గేటు దగ్గర పట్టాలు దాటబోయాడు. ఆ సమయంలో అటుగా మహబూబ్నగర్ వైపు గూడ్స్ రైలు వెళ్తోంది. వినయ్ గమనించకుండా పట్టాలు దాటుతూ.. రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. తల్లి కళమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే హెచ్సీ కృష్ణ తెలిపారు. చదవండి: న్యూడ్ ఫోటోలు పంపుతామంటూ బెదిరింపులు.. లాడ్జిలో దంపతుల ఆత్మహత్య -
ఆగ్రా రైల్వేస్టేషన్లో టాయ్లెట్ చార్జీ రూ.112
ఆగ్రా: రైల్వేస్టేషన్లో టాయ్లెట్ వాడుకుంటే ఎంత చెల్లిస్తాం? ఉచితం కాకుంటే గనక ఏ ఐదు రూపాయలో, 10 రూపాయలో. కానీ ఇద్దరు బ్రిటిష్ పర్యాటకులు మాత్రం ఏకంగా రూ.112 చొప్పున చెల్లించుకోవాల్సి వచ్చింది! వారిద్దరూ ఢిల్లీలోని బ్రిటిష్ ఎంబసీ నుంచి ఆగ్రా వెళ్లారు. రైల్వేస్టేషన్లో శ్రీవాత్సవ అనే గైడ్ వారిని రిసీవ్ చేసుకున్నాడు. టాయ్లెట్కు వెళ్లాలని చెప్పడంతో ఐఆర్సీటీసీ ఎగ్జిక్యూటివ్ లాంజ్కు తీసుకెళ్లాడు. బయటికి రాగానే 12 శాతం జీఎస్టీతో కలిపి చెరో రూ.112 రూపాయలు చెల్లించాలని వారిని సిబ్బంది డిమాండ్ చేశారట. ఇదేమిటని ప్రశ్నించినా లాభం లేకపోయిందని, దాంతో ఆ మొత్తాన్ని తానే చెల్లించానని గైడ్ చెప్పుకొచ్చాడు. దీనిపై ఆయన ఐఆర్సీటీసీకి ఫిర్యాదు కూడా చేశాడు. అయితే అది లాంజ్ సేవల చార్జే తప్ప టాయ్లెట్కు వెళ్లినందుకు వసూలు చేసింది కాదని ఐఆర్సీటీసీ స్పష్టం చేసింది. ‘‘లాంజ్ సేవలు వాడుకుంటే కనీస చార్జీ రూ.200. రెండు గంటల పాటు ఏసీ లాంజ్ రూము, కాంప్లిమెంటరీ కాఫీ, ఉచిత వైఫై వంటి సదుపాయాలకు కలిపి ఈ చార్జీ. 50 శాతం డిస్కౌంట్ పోను 12 శాతం జీఎస్టీతో కలిపి రూ.112 చెల్లించాల్సి ఉంటుంది’’ అని వివరించింది. -
టాయిలెట్ బిల్లుకు జీఎస్టీ ఘటన!! ఐఆర్సీటీసీ వివరణ
ఢిల్లీ: జీఎస్టీ.. దేశంలో ఇదొక హాట్ టాపిక్ అయిపోయింది. నిత్యావసరాల మొదలు.. చాలావాటిపై కేంద్రం జీఎస్టీ వడ్డన చేయడంతో.. సోషల్మీడియాలోనూ విపరీతమైన విమర్శలు వినిపించాయి. తాజాగా టాయిలెట్కు వెళ్లినా ఫారినర్లకు భారీ బిల్లుతో పాటు అందులో జీఎస్టీ సైతం పడడంతో కంగుతిన్నారు. దేశ రాజధానిలోనే ఈ ఘటన జరిగింది. ఆగ్రా కాంట్ రైల్వే స్టేషన్లో వాష్ రూమ్ని వాడుకున్నందుకు ఇద్దరు విదేశీ పర్యాటకులు భారీ బిల్లు ఫ్లస్ జీఎస్టీ చెల్లించాల్సి వచ్చింది. అయితే వారిని రిసీవ్ చేసుకునేందుకు వచ్చిన గైడ్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. బ్రిటిష్ ఎంబసీ నుంచి విదేశీయులిద్దరూ గతిమాన్ ఎక్స్ప్రెస్ ద్వారా ఆగ్రా కాంట్ రైల్వే స్టేషన్లో దిగారు. వాళ్లను శ్రీవాస్తవ అనే గైడ్ రీసివ్ చేసుకున్నాడు. అయితే.. స్టేషన్లో దిగిన వెంటనే ఫ్రెష్ అవ్వాలనుకున్నారు. దీంతో స్టేషన్లో ఉన్న ఎగ్జిక్యూటివ్ లాంజ్లోకి తీసుకెళ్లారు శ్రీవాస్తవ. కేవలం ఐదు నిమిషాల్లో వాళ్లు వాష్రూమ్ నుంచి బయటకు వచ్చారు. సాధారణంగా ఐదు, పది రూపాయలు.. మహా అయితే రూ. 20 ఇవ్వాల్సి వస్తుందని శ్రీవాస్తవ భావించారు. కానీ, అక్కడి రిసెప్షనిస్ట్.. రూ. 224 బిల్లు చేతిలో పెట్టడంతో.. ఆయన షాక్ అయ్యారు. ఐదు నిమిషాల పాటు వాష్ రూం వాడుకున్నందుకు ఒక్కొక్కరి బిల్లు రూ. 100లు వేశారు. పైగా దానిపై జీఎస్టీ రూ. 12 జత చేశారు. అలా వారిద్దరికీ కలిపి రూ. 224 బిల్లు అయింది. అంత చెల్లించేందుకు మొదట వాళ్లు ఒప్పుకోలేదు. కానీ, సిబ్బంది ఒత్తిడితో చివరికి చెల్లించాల్సి వచ్చింది. ఈ ఘటనపై ఐఆర్సీటీసీ ప్రతినిధి బ్రజేష్ కుమార్ ఈ ఘటనపై వివరణ ఇచ్చారు. ఎగ్జిక్యూటివ్ లాంజ్లోకి ప్రవేశానికి ప్రత్యేక చార్జ్ ఉందని, దానిపై జీఎస్టీ పడుతుందని చెప్పారు. అంతేకాదు లాంజ్లో ఉన్నంతసేపు టూరిస్టులు, ఫారినర్లు ఫ్రీగా వైఫై వాడుకోవచ్చని, కాంప్లిమెంటరీగా కాఫీ కూడా ఇస్తామని చెప్పుకొచ్చారు. అయితే దీనిపై గైడ్ శ్రీవాస్తవ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జనరల్ కోచ్లో ఆగ్రా నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తే టికెట్ రూ. 90 రూపాయలు మాత్రమేనని, కానీ స్టేషన్లో వాష్రూం వినియోగించుకున్నందుకు రూ. 112 చార్జ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతిథి దేవో భవ పిలుపును ఐఆర్సీటీసీ అవమానిస్తోందని, ఇలా చేయడం వల్ల విదేశీయులు ఇక్కడి వ్యవస్థలపై తప్పుడు అభిప్రాయం ఏర్పరుచుకునే ప్రమాదం ఉందని, ఈ వ్యవహారంపై టూరిజం శాఖలో ఫిర్యాదు చేస్తానన్నారు. ఇదీ చదవండి: గుండెల్ని పిండేస్తున్న వీడియో.. స్పందించిన గడ్కరీ కార్యాలయం -
తల్లి ఒడిలో నిద్రిస్తున్న పసికందును ఎత్తుకుపోయిన దుండగుడు: వీడియో వైరల్
న్యూఢిల్లీ: తల్లి వద్ద హాయిగా నిద్రిస్తున్న చిన్నారిని ఒక దుండగుడు ఎత్తుకుపోయాడు. ఈ ఘటన మధుర రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన కథనం ప్రకారం...మధుర రైల్వేస్టేషన్ ఫ్లాట్ ఫాం పై తల్లి బిడ్లలు హాయిగా నిద్రిస్తున్నారు. ఇంతలో ఒక దుండగుడు వారి వద్దకు సమీపించి నెమ్మదిగా ఆ తల్లి వద్ద నిద్రిస్తున్న ఏడునెలల చిన్నారిని అపహరించాడు. ఈ మేరకు ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవి ఫుటేజ్లో రికార్డు అయ్యాయి. ఆ వీడియోలో సదరు దుండగడు వారిని సమీపంచి పిల్లాడిని ఎత్తుకుని ఫ్టాట్ ఫాం పై ఆగి ఉన్న రైలు వద్దకు పరుగెడుతున్నట్లు కనిపించంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ బిడ్డ ఆచూకి కోసం తీవ్రంగా గాలిస్తున్నామని చెప్పారు. ఆ బిడ్డ ఆచూకి కోసం పోలీసులు పలు బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అంతేకాదు పోలీసులు నిందితుడు ఫోటోని విడుదల చేసి, అతని గురించి సమాచారం అందించాలని ప్రజలను కోరారు. అలాగే మథురతో పాటు ఉత్తరప్రదేశ్లోని అలీఘర్, హత్రాస్లో కూడా తమ రైల్వే పోలీసు బృందాలు చిన్నారి కోసం వెతుకుతున్నాయని చెప్పారు. -
రష్యా నరమేధం.. రక్తమోడిన ఉక్రెయిన్
ఆరు నెలలు యుద్ధం.. ఉక్రెయిన్ను శ్మశానంగా మార్చేసింది. ప్రాణ భయంతో లక్షల మంది వలసలు, ఎటు చూసినా దిబ్బలుగా మారిన భవంతులు, అత్యాచారాలకు, హత్యాచారాలకు గురైన బాధితులు, వాళ్ల కుటుంబాల ఆవేదనలే కనిపిస్తున్నాయి. ఈ విషాదాలకు నివాళిగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సైతం దూరంగా ఉంది ఆ దేశం. అయినప్పటికీ.. రష్యా సైన్యపు మారణ హోమం ఆగలేదు. బుధవారం ఉక్రెయిన్ స్వాతంత్ర దినోత్సవం. ఈ సందర్భంగా.. అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ పిలుపు మేరకు ప్రజలంతా వేడుకలకు దూరంగా ఉన్నారు. అయితే.. ఓ రైల్వే స్టేషన్పై రష్యా మిస్సైల్ను ప్రయోగించడం.. అది ఓ రైలును ఢీకొట్టడంతో 22 మంది దుర్మరణం పాలయ్యారు. యాభై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. రైల్వే స్టేషన్పై దాడి విషయాన్ని అధ్యక్షుడు జెలెన్స్కీ స్వయంగా ప్రకటించారు. బుధవారం సాయంత్రం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. తూర్పు ఉక్రెయిన్లోని డోనెట్స్క్ ప్రాంతానికి 90 మైళ్ల దూరంలో ఉన్న చాప్లీన్ పట్టణంలో ఓ రైలు మీద మిస్సైల్ ప్రయోగం జరిగిందని తెలిపారాయన. ఉక్రెయిన్ స్వాతంత్ర దినోత్సవం నాడు నెత్తుటి మరక వేసింది రష్యా. మాంసం ముద్దలే మిగిలాయి. చాప్లీన్కు తగిలిన గాయం మమ్మల్ని బాధిస్తోంది అని జెలెన్స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే.. అక్రమణదారులను(రష్యా బలగాలను ఉద్దేశించి..) మా నేల నుంచి తరిమికొడతాం. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఉక్రెయిన్ గడ్డపై చెడు జాడ ఉండకూదు అని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉంటే.. రష్యా రక్షణ విభాగం ఈ దాడిపై స్పందించడం లేదు. ‼️Russian troops fired missiles at a railway station in the Dnepropetrovsk region. At least 15 people died. About 50 more were injured. The missile hit passenger railroad car at Chapline station. This was stated by Volodymir Zelenskyy during a speech at the UN Security Council. pic.twitter.com/c4y3LvMnSW — NEXTA (@nexta_tv) August 24, 2022 ఇదీ చదవండి: బైడెన్ టీంలో భారత సంతతి వ్యక్తులదే హవా -
షాకింగ్ వీడియో: భార్యను ట్రైన్ కింద తోసేసి పిల్లలతో పరార్!
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైకి సమీపంలోని వసాయి రైల్వే స్టేషన్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పిల్లలతో నిద్రిస్తున్న మహిళను లాక్కెళ్లి వేగంగా దూసుకొస్తున్న ట్రైన్ కింద తోసేశాడు ఓ కిరాతక భర్త. ఆ తర్వాత తన ఇద్దరు పిల్లలను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. రైల్వే స్టేషన్లోని సీసీటీవీ కెమెరాలో నమోదైన ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. మహిళను ట్రైన్ కింద తోసేసిన సంఘటన సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగింది. వీడియోలో.. ప్లాట్ఫామ్పై ఉన్న బల్లపై తన పిల్లలతో బాధితురాలు పడుకుని ఉంది. అక్కడికి వచ్చిన వ్యక్తి ఆమెను నిద్రలేపాడు. ఆ తర్వాత కొద్దిసేపు ఇరువురు మాట్లాడుకున్నారు. ట్రైన్ వస్తుండడాన్ని గమనించి.. అకస్మత్తుగా మహిళను లాక్కెళ్లి రైల్వే ట్రాక్పై తోసేశాడు. దాంతో ఆమె పైనుంచి అవాధ్ ఎక్స్ప్రెస్ రైలు దూసుకెళ్లింది. మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం ఇద్దరు కుమారులతో అక్కడి నుంచి పరారయ్యాడు నిందితుడు. వారు ఇరువురు ఆదివారం మధ్యాహ్నం నుంచి స్టేషన్లోని ఉన్నట్లు గుర్తించారు రైల్వే పోలీసులు. ఈ ఘటన జరిగిన తర్వాత నిందితుడు దాదర్ వెళ్లాడని, అక్కడి నుంచి కల్యాన్ ప్రాంతానికి వెళ్లినట్లు చెప్పారు. థానేలోని బీవండి నగరంలో అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. shocking video has emerged of a woman sleeping on the platform at Vasai railway station being pushed down by her husband. @saamTVnews @SaamanaOnline @ANI @AmhiDombivlikar @zee24taasnews @ pic.twitter.com/q0OrFTlePg — 𝕄𝕣.ℝ𝕒𝕛 𝕄𝕒𝕛𝕚 (@Rajmajiofficial) August 22, 2022 ఇదీ చదవండి: ‘రియల్ హీరో’.. పిల్లలతో విధులకు జొమాటో డెలివరీ బాయ్ -
లక్షల రూపాయలున్న బ్యాగు రైల్వే స్టేషన్లో మర్చిపోయాడు.. తిరిగి వచ్చేసరికి
హిందూపురం (సత్యసాయి జిల్లా): రూ. లక్షల డబ్బున్న బ్యాగును ఓ వ్యక్తి మరిచి వెళ్లిపోయాడు. కొంతసేపటి తర్వాత తేరుకుని మళ్లీ అక్కడకు చేరుకున్నాడు. బ్యాగు కనిపించకపోవడంతో లబోదిబోమంటూ రైల్వే పోలీసులను ఆశ్రయించగా, బ్యాగును తిరిగి ఆయనకు అప్పగించారు. ఆర్పీఎఫ్ ఎస్ఐ కెంపరాజు తెలిపిన మేరకు.. గుజరాత్ రాష్ట్రం సూరత్ పట్టణానికి చెందిన బిపిన్ చంద్ర చంపక్ లాల్ జరీవాలా హిందూపురం పట్టణంలోని పట్టుచీరల వ్యాపారులతో జరీ వ్యాపారం చేసేవాడు. వ్యాపార లావాదేవీల నిమిత్తం రెండు రోజుల క్రితం హిందూపురం వచ్చాడు. (చదవండి: హనీ ట్రాప్.. యువకులకు యువతి వల.. వీడియో కాల్స్ రికార్డ్ చేసి..) స్థానిక వ్యాపారుల ద్వారా రూ.6,15,900 సేకరించాడు. తిరిగి వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకున్న బిపిన్ చంద్ర.. ఇంకా పని పూర్తి కాకపోవడంతో దాన్ని రద్దు చేసుకునేందుకు శనివారం స్థానిక రైల్వేస్టేషన్కు వచ్చాడు. వెంట తెచ్చుకున్న బ్యాగును అక్కడే మర్చిపోయి హడావుడిగా వెళ్లిపోయాడు. బ్యాగును గుర్తించిన స్టేషన్ సిబ్బంది శ్రీకాంత్దాస్, రామచంద్ర ఆర్పీఎఫ్ పోలీసుస్టేషన్లో అప్పగించారు. ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్న బిపిన్ చంద్ర రైల్వే పోలీసులతో గోడు వెళ్లబోసు కున్నాడు. అతడి వద్ద వివరాలు, బిల్లులను పరిశీలించిన పోలీసులు డబ్బున్న బ్యాగును తిరిగి అప్పగించేశారు. (చదవండి: విషాదం.. డ్రైనేజీ శుభ్రం చేసేందుకు దిగి ముగ్గురు మృతి) -
తమిళ ముల్లె.. అరవ పల్లె.. ‘నందలూరు.. రొంబవూరు’
రాజంపేట: దేశంలోనే అతిపెద్ద రవాణా సంస్థ భారతీయరైల్వే. అటువంటి రైల్వేతో అనేక ప్రాంతాలకు గుర్తింపు వచ్చింది. అలాంటివాటిలో అన్నమయ్య జిల్లా నందలూరు ఒకటి. అందునా.. ఇక్కడ ఉన్న అరవపల్లె.. ప్రత్యేక గుర్తింపు పొందింది. దశాబ్దాల క్రితం తమిళనాడు నుంచి వచ్చిన అనేకమందికి ఈ ప్రాంతం నిలయమైంది. ఆవాసాల ఏర్పాటుతో మొదలై క్రమంగా పెద్దగ్రామంగా రూపుదిద్దుకుంది. కాలానుగుణంగా మారిన పరిస్థితుల్లో కూడా తన ఉనికిని నిలుపుకుంది. ఇది ద్రవిడ జీవన సంస్కృతికి పట్టం కడుతోంది. అమ్మ తల్లి ఆరాధన ఇప్పటికీ కొనసాగిస్తోంది. ఆధునికతను, అభివృద్ధిని సాధించినప్పటికీ ఆత్మను మాత్రం వదులుకోనంటోంది. రైల్వే కేంద్రం ఏర్పాటుతో.. నందలూరు రైల్వే కేంద్రం ఒకప్పుడు సదరన్ రైల్వేలో ఉండేది. ఇక్కడ స్టీమ్ ఇంజన్ రైల్వే లోకో షెడ్ కూడా ఉండేది. ముంబాయి–చెన్నై రైలుమార్గం ఏర్పాటులో భాగంగా స్టీమ్ రైలింజన్లను నడిపేందుకు నందలూరును కేంద్రంగా బ్రిటిషు రైల్వేపాలకులు ఎంచుకున్నారు. చెయ్యేరు నది నీటి నాణ్యత స్టీమ్ ఇంజన్ల నిర్వహణకు ఉపయోగపడుతుందనేది ప్రధాన కారణం. గుంతకల్ రైల్వే జంక్షన్ నుంచి తమిళనాడులోని చెన్నై వరకు నడిచే రైళ్లన్నింటికీ నందలూరులో ఇంజన్ మార్పిడి జరిగేది. సిబ్బంది కూడా అటూ, ఇటూ మారేవారు. ఈ నేపథ్యంలోనే రైల్వేపరంగా నందలూరుకు గుంతకల్ రైల్వేడివిజన్లో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఇక్కడి నుంచి నేరుగా మద్రాసుకు ప్యాసింజర్ రైలు కూడా నడిచేది. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల నుంచి నందలూరుకు ఉద్యోగ, ఉపాధి పనుల నిమిత్తం అనేకమంది వచ్చారు. అయితే వీరిలో అగ్రభాగం తమిళులదే. తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, అరకోణం, పెరంబూరు, తిరుత్తిణి తదితర ప్రాంతాలకు చెందిన వారు వివిధ రకాలలో అధికారులు, ఉద్యోగులు, కార్మికులుగా పనిచేసేందుకు నందలూరు రైల్వే కేంద్రానికి తరలివచ్చారు. వీరిని స్థానికులు అరవోళ్లు అని పిలిచేవారు. ఈ క్రమంలో నందలూరు రైల్వేస్టేషన్కు సమీపంలో వారు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. క్రమేణా అది అరవపల్లె పేరిట గ్రామంగా మారింది. ప్రస్తుతం నాగిరెడ్డిపల్లె అర్బన్ పరిధిలో ఈ పల్లె ఉంది. తొమ్మిది వార్డులకు విస్తరించింది. నందలూరు రైల్వేస్టేషన్ జోన్ మారడంతో.. 1977లో సదరన్ రైల్వే నుంచి దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి నందలూరు మారింది. ఫలితంగా వందలాది మంది తమిళనాడుకు చెందిన వారు చెన్నై సెంట్రల్తో పాటు ఇతర ప్రాంతాలకు బదిలీ చేసుకొని వెళ్లిపోయారు. కొందరు నందలూరు నీళ్లు, వాతావరణం, స్థానికుల మంచితనంతో ఇక్కడే ఉండిపోయారు. చెన్నై, కంచి, సేలం, అరక్కోణం, మధురై తదితర ప్రాంతాలకు చెందినవారు పెద్దసంఖ్యలో అరవపల్లెలోనే నివాసముండేవారు. కాలక్రమేణా 1000 తమిళ కుటుంబాలున్న గ్రామంలో ఆ సంఖ్య ఇపుడు 30కి చేరింది. ఈ పల్లెలో తమిళులతో పాటు ఇపుడు ఇతరులు కూడా ఉంటున్నారు. కాగా, బదిలీలపై ఇక్కడి నుంచి తమ రాష్ట్రాలకు వెళుతూ వెళుతూ తమిళనాడువాసులు ‘నందలూరు.. రొంబవూరు’ అని సర్టిఫికెట్ ఇచ్చారు. ఆరాధ్యదైవం..ముత్తుమారెమ్మ తమిళనాడు ప్రాంతంలో ముత్తుమారెమ్మను ఆరాధ్యదైవంగా కొలుచుకుంటారు. తమ సంప్రదాయంలో భాగంగా అరవపల్లెలో కూడా వారు ముత్తుమారెమ్మ గుడి నిర్మించుకున్నారు. కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారి ఆలయంగా కొలవబడుతోంది. ఈ గుడి మొదలియార్ కుటుంబీకుల ఆధ్వర్యంలో నడుస్తోంది. యేటా జాతర కూడా నిర్వహిస్తుంటారు. రైల్వేకార్మికులతో ఒకప్పుడు కళకళ రైల్వేస్టీమ్ ఇంజన్ లోకోషెడ్ ఏర్పడినప్పటి నుంచి రైల్వేకార్మికులతో అరవపల్లె ఒకప్పుడు కళకళలాడేది. ఇప్పుడు ఆ పరిస్ధితి లేదు. పాల్ఘాట్ నుంచి వచ్చిన మా పూర్వీకులు 1955లో ఏర్పాటుచేసిన శ్రీ లక్ష్మీవిలాస్ హోటల్ ఎంతో ఆదరణ పొందింది. అప్పట్లో రైల్వే స్టాఫ్లో తమిళులు అధికంగా ఉండేవారు. ముత్తుమారెమ్మ ఆలయం అభివృద్ధికి నా తండ్రి నారాయణస్వామి అయ్యర్ తన వంతు కృషిచేశారు. –బాలసుబ్రమణ్యంస్వామి, శ్రీలక్ష్మీవిలాస్, అరవపల్లె నందలూరుతో విడదీయరాని అనుబంధం సదరన్ రైల్వే జోన్ వల్ల తమిళులతో నందలూరు రైల్వేకేంద్రానికి విడదీయ రాని అనుబంధం ఏర్పడింది. తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ విధులు నిర్వహించే వందలాది కార్మికుల కుటుంబాలు ఉండేవి. 1976లో నందలూరు కార్యాలయంలో పనిచేసేటప్పుడు విధుల నిర్వహణకు సంబంధించి సదరన్ రైల్వే జోనల్ కేంద్రమైన మద్రాసు(చెన్నై)కు వెళ్లేవారం. రైల్వే జోన్ మార్పిడిలో చెన్నైకు వెళ్లకుండా చాలా మంది మంది తమిళ కుటుంబీకులు నందలూరులో కొనసాగుతున్నారు. –ఆనంద్కుమార్, రిటైర్డ్ ఎస్ఎంఆర్, న్యాయవాది, నాగిరెడ్డిపల్లె పూర్వీకుల నుంచి ముత్తుమారెమ్మ కోవెల మా పూర్వీకుల నుంచి ముత్తుమారెమ్మ కోవెల ఏర్పాటైంది. అప్పటి నుంచి గుడి నిర్వహణ చేపడుతూ వస్తున్నాం. నందలూరు రైల్వేస్టేషన్ సమీప ప్రాంతంలోనే మా పల్లె ఉంది. రైల్వేతోనే జనజీవనం ముడిపడింది. అది అలాగే కొనసాగింది. –వెంకటరమణ మొదలియార్, ధర్మకర్త, ముత్తుమారెమ్మకోవెల, అరవపల్లె -
సికింద్రాబాద్ విధ్వంసంలో... మరో రెండు అకాడమీలు సైతం...
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో చోటు చేసుకున్న విధ్వంసం కేసులో సూత్రధారిగా భావిస్తున్న ఆవుల సుబ్బారావు ఇప్పటికీ జీఆర్పీ పోలీసుల అదుపులోనే ఉన్నాడు. ఇతడితో సహా మొత్తం ఎనిమిది మందికి శుక్రవారం గాంధీ ఆసుపత్రిలో సాధారణ వైద్య పరీక్షలు చేయించారు. ఆపై వీరందరినీ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లోని జీఆర్పీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. వీరిలో సుబ్బారావుతో పాటు ఇద్దరు వేర్వేరు ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీలకు చెందిన డైరెక్టర్లు కూడా ఉన్నారు. ఒకరు మహబూబ్నగర్కు చెందిన నాయక్ బీసంరెడ్డి కాగా మరొకరు కరీంనగర్కు చెందిన వారుగా తెలుస్తోంది. సుబ్బారావు సూచనల మేరకు ఆర్మీ అభ్యర్థులకు రెచ్చగొట్టడంలో అతడి అనుచరులు మల్లారెడ్డి, శివ కీలక పాత్ర పోషించడంతో వీరినీ కటకటాల్లోకి పంపారు. రెడ్డప్ప, హరి సహా మిగిలిన వాళ్లు విధ్వంసంలో పాత్రధారులుగా తెలుస్తోంది. ఆర్థికంగా నష్టపోతాననే భయంతోనే.. అగ్నిపథ్ స్కీమ్ అమలైతే ఆర్థికంగా నష్టపోతానని భావించిన సుబ్బారావు తనకు సంబంధించిన 12 బ్రాంచ్ల నిర్వాహకులతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, విజయవాడ, విశాఖపట్నంలోని ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీలకు చెందిన వారిని సంప్రదించాడు. వీరందరితో కలిసే ఆర్మీ అభ్యర్థులను రెచ్చగొట్టడం ద్వారా ఆందోళన చేయించాలని పథకం వేశాడు. అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తే కేంద్రం ఈ స్కీమ్ను ఉపసంహరిస్తుందని భావించాడు. ఆందోళనల కోసం ఏర్పాటైన ఎనిమిది వాట్సాప్ గ్రూపుల్లో పలువుర్ని సభ్యులుగా చేర్చాడు. అయితే కనీసం ఒక్క దాంట్లో కూడా సుబ్బారావు చేరలేదు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఏపీకి చెందిన ఆర్మీ అభ్యర్థులు హైదరాబాద్ రావడానికి సహకరించాడు. 16వ తేదీ రాత్రి నరసరావుపేట నుంచి హైదరాబాద్ చేరుకున్న సుబ్బారావు బోడుప్పల్లో బస చేశాడు. తాను హైదరాబాద్ వచ్చానని, మరుసటి రోజు ఉదయం (17న) స్వయంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్దకు వస్తానంటూ మల్లారెడ్డి, శివల ద్వారా ప్రచారం చేయించాడు. అయితే ఆ రోజు అతడు బోడుప్పల్ నుంచి బయలుదేరడం కాస్త ఆలస్యమైంది. సుబ్బారావు ఉప్పల్ వరకు చేరుకునే సమయానికే రైల్వేస్టేషన్లో చేపట్టిన ఆందోళన విధ్వంసంగా మారిపోయింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు సైతం కాల్పుల వరకు వెళ్లారు. ఈ విషయాలు తెలియడంతో సుబ్బారావు ఉప్పల్ నుంచే ఖమ్మం పారిపోయాడు. ఈ వ్యవహారంలో సుబ్బారావు పాత్ర లేదని, ఆయన అకాడమీలకు చెందిన అభ్యర్థులు అంతా కేవలం నిరసనలో మాత్రమే పాల్గొన్నారని, స్టేషన్ బయటనే ఉన్నారని పోలీసులతో చెప్పాలంటూ మల్లారెడ్డి, శివల ద్వారా విధ్వంసంలో పాల్గొన్న అభ్యర్థులకు సూచించాడు. కొందరు ఆర్మీ అభ్యర్థులు సికింద్రాబాద్ చేరుకోవడానికి అవసరమైన ఆర్థిక సాయం కూడా సుబ్బారావు చేసినట్లు సమాచారం. మరోపక్క ప్రస్తుతం రిక్రూట్మెంట్ సాగుతున్న అభ్యర్థుల నుంచి ఇతడికి రూ.50 కోట్లు వరకు వసూలు కావాల్సి ఉందని తెలుస్తోంది. బోడుప్పల్లోని సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సుధాకర్రెడ్డికి రైల్వే పోలీసులు శుక్రవారం రైల్వే యాక్ట్లోని 179 (2) సెక్షన్ కింద నోటీసులు జారీ చేశారు. సుబ్బారావు అరెస్టుకు సిద్ధమవుతూనే ఇవి ఇచ్చినట్లు తెలిసింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో విధ్వంసం జరిగిన రోజు పోలీసు కాల్పుల్లో రాకేష్ కన్నుమూశాడు. ఈ విషయాన్నీ జీఆర్పీ పోలీసులు కేసులో చేర్చారు. ఈ నెల 17న సికింద్రాబాద్ రైల్వేపోలీసుస్టేషన్లో ఎఫ్ఐఆర్ నెం.227/2022 కింద ఈ కేసు నమోదైంది. ఇందులో ఐపీసీ, రైల్వే యాక్ట్, ప్రజా ఆస్తుల విధ్వంసాల నిరోధక చట్టంలోని 15 సెక్షన్ల కింద ఆరోపణలు చేశారు. ఇందులో నిందితులుగా గుర్తుతెలియని వారుగా పేర్కొన్నారు. ఈ నెల 19న 45 మందిని అరెస్టు చేసినప్పుడు ఈ కేసులో కుట్ర సెక్షన్ను జోడించారు. నిందితులుగా 56 మంది పేర్లు చేర్చారు. ఈ నెల 21న మరో పది మంది నిందితులను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే నిందితుల సంఖ్య 63గా పేర్కొన్న పోలీసులు సీఆర్పీసీలోని 174వ సెక్షన్ను కేసుకు జోడిస్తూ కోర్టుకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ కేసులో మొత్తం నాలుగు చట్టాలకు సంబంధించిన 17 సెక్షన్లు ఆరోపణ చేసినట్లు అయింది. రాకేష్ మరణం నేపథ్యంలోనే దీన్ని చేర్చిన జీఆర్పీ పోలీసులు దర్యాప్తు అనంతరం చార్జ్షీట్ సమయంలో ఈ సెక్షన్ తొలగించనున్నారు. ఆవుల సుబ్బారావు సహా మిగిలిన నిందితులను శనివారం అరెస్టు ప్రకటించనున్నారని తెలుస్తోంది. (చదవండి: రైల్వే స్టేషన్ ఘటన: సాయి డిఫెన్స్ అకాడమీదే కీలక పాత్ర!) -
జైలుకు మరో 10 మంది ఆందోళనకారులు
చంచల్గూడ: ఇటీవల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిరసన పేరుతో విధ్వంసం సృష్టించిన కేసులో ఆందోళనకారుల అరెస్టుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే 28 మంది ఆందోళనకారులు చంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఇదే కేసుకు సంబంధించి బుధవారం మరో 10 మందిని అరెస్టు చేసిన పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. వీరిలో పృథ్వీ రాథోడ్, బింగి రమేష్, రాజా సురేంద్రకుమార్, దేవోసత్ సంతోష్, ఎండీ సాబేర్, పద్వల్ యోగేష్, బమన్ పరశురాం, పుప్పాల అయ్యప్ప చారీ, పసునూరి శివసుందర్, సురనర్ తుకారామ్ ఉన్నారు. కారుతో మైనర్ బాలుడి బీభత్సం సైదాబాద్: మైనర్ బాలుడు కారుతో బీభత్సం సృష్టించాడు. సైదాబాద్ పోలీసులు తెలిపిన మేరకు..బుధవారం సాయంత్రం చంపాపేట రహదారిపై చింతల్బస్తీకి వెళ్లే రహదారిపై ఓ మైనర్ బాలుడు కారును నడుపుతూ నిర్లక్ష్యపు డ్రైవింగ్తో వేగంగా వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడ పార్కింగ్ చేసి ఉన్న రెండు కార్లను ఢీ కొట్టాడు. అలాగే ముందుకు వెళుతూ అక్కడి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొని ఆగిపోయాడు. ఆ సమయంలో అక్క డ ఎవరూ లేకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పింది. (చదవండి: తూటా రూట్ మారెన్) -
విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర భారీ బందోబస్తు
-
అగ్నిపథ్: సికింద్రాబాద్లో దాడులు ఇలా జరిగాయి
సాక్షి, హైదరాబాద్: అగ్నిపథ్కు వ్యతిరేకంగా శుక్రవారం ఉదయం.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో దాడులు జరిగిన విషయం తెలిసిందే. కాగా, దాడిలో తీవ్ర నష్టం జరిగింది. ఆర్మీ అభ్యర్థులు సైతం పోలీసుల దాడిలో గాయపడ్డారు. కాగా, దాడి ఇలా జరిగింది.. ప్లాట్ఫామ్ నెం.1: సికింద్రాబాద్–దానాపూర్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ చివరలో నిలిపి ఉండటంతో దీనిపై దాడి జరగలేదు. ప్లాట్ఫామ్ 2: హైదరాబాద్–హౌరా. ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్, లగేజీ వ్యాన్ పోర్షన్ పూర్తిగా, ఒక సీట్ కార్లోని సీట్లన్నీ దహనం. ఏసీ కోచ్ల కిటీకీల అద్దాలన్నీ ధ్వంసం. ప్లాట్ఫామ్ 3: ఖాళీగా ఉంది ప్లాట్ఫామ్ 4: విశాఖపట్నం–సికింద్రాబాద్ గరీబ్రథ్ ఎక్స్ప్రెస్. 8 కోచ్ల కిటికీ అద్దాలన్నీ ధ్వంసం ప్లాట్ఫామ్ 5: సికింద్రాబాద్–త్రివేండ్రం సెంట్రల్ శబరి ఎక్స్ప్రెస్ ఎసీ కోచ్ల కిటికీల అద్దాలన్నీ ధ్వంసం ప్లాట్ఫామ్ 6: రాజ్కోట్–సికింద్రాబాద్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్: ఏసీ కోచ్ల కిటికీల అద్దాలన్నీ ధ్వంసం ప్లాట్ఫామ్ 7: ఖాళీగా ఉంది ప్లాట్ఫామ్ 8: రాయ్పూర్–సికింద్రాబాద్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్: నాలుగు ఏసీ కోచ్లు, ఒక నాన్ ఏసీ కోచ్ కిటికీల అద్దాలన్నీ ధ్వంసం. ఎస్2 కోచ్లో రెండు బెర్తులు దహనం. ప్లాట్ఫామ్ 9: మన్మాడ్ జంక్షన్–సికింద్రాబాద్ జంక్షన్, అజంతాఎక్స్ప్రెస్: ఒక జనరల్ సీటింగ్ కోచ్ పూర్తిగా దహనం స్లీపర్ కమ్ లగేజీ కోచ్ పూర్తిగా దహనం, అన్ని కోచ్ల కిటికీల అద్దాలు పూర్తిగా ధ్వంసం ప్లాట్ఫామ్ 10: లింగంపల్లి–ఫలక్నుమా ఎంఎంటీఎస్: అన్ని కిటీకీల అద్దాలు పూర్తిగా ధ్వంసం పార్కింగ్ లైన్స్ 1: విశాఖపట్నం–సికింద్రాబాద్ దురంతో ఎక్స్ప్రెస్: 4500 బెడ్రోల్స్ బుగ్గి 2: మెడికల్ రిలీఫ్ వ్యాన్: అన్ని కిటికీల అద్దాలు ధ్వంసం 3: సెల్ఫ్ ప్రొపెల్డ్ యాక్సిడెంట్ రిలీఫ్ ట్రెయిన్: కోచ్ల బయటి భాగం ఆహుతి 4: సెల్ఫ్ ప్రొపెల్డ్ ఇన్స్పెక్షన్ కార్: అన్ని కిటికీల అద్దాలు ధ్వంసం అగ్నికి ఆహుతి: ఐదు కోచ్లు ధ్వంసమైన ఏసీ కోచ్లు: 30 ధ్వంసమైన నాన్ ఏసీ కోచ్లు: 47 ఎంఎంటీఎస్: పూర్తి రేక్ అద్దాలు ధ్వంసం దహనమైన బెర్తులు: 150 అద్దాలు ద్వంసమైన కిటికీలు: 400 దహనమైన బెడ్ రోల్స్: 4500 -
అగ్నిపథ్: విశాఖ, గుంటూరు రైల్వేస్టేషన్లలో దాడులకు అవకాశం!
అగ్నిపథ్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీలో కూడా ఇలాంటి దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు తెలిపాయి. విశాఖ, గుంటూరు రైల్వేస్టేషన్లపై సంఘ విద్రోహులు దాడి చేసే అవకాశముందని సీపీ తెలిపారు. దీంతో.. రైల్వే, కేంద్ర ప్రభుత్వ ఆస్తులకు ప్రత్యేక భద్రత కల్పిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల దగ్గర ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే ఆర్మీ అధికారులు, డిఫెన్స్ అకాడమీ వారితో సంప్రదించినట్టు తెలిపారు. ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
రైళ్ల రాకపోకలకు లైన్క్లియర్: డీఆర్ఎమ్ గుప్తా
పోలీసుల బలగాల ఎంట్రీతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పరిస్థితి ఒక్కసారిగి మారిపోయింది. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైల్వే ట్రాక్లను క్లియర్ చేశారు. దీంతో రైళ్ల రాకపోకలకు రూట్ క్లియర్ అయింది. ఈ సందర్బంగా డీఆర్ఎమ్ గుప్తా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మరో గంటలో రైళ్ల రాకపోకలు ప్రారంభం కానున్నట్టు తెలిపారు. ఆందోళనకారులు రైల్వే స్టేషన్లో సామాగ్రిని పూర్తిగా ధ్వంసం చేశారు. ఇప్పటి వరకు రూ. 7 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. గతంలో ఇలాంటి ఆందోళనలు ఎప్పుడూ జరగలేదు. ఆందోళనల్లో 30 భోగీలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. 18 ఎక్స్ప్రెస్, 9 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశాము. 15 రైళ్లను దూరప్రాంతాల నుంచి నడుపుతున్నాము. 7 లోకోమోటివ్ ఇంజిన్లు ధ్వంసమయ్యాయి. రైల్వే సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారు. రెండు లగేజీ, రెండు సాధారణ భోగీలకు ఆందోళనకారులు నిప్పంటించారు. పలు భోగిలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ప్రయాణికులను సురక్షితంగా బయటకు పంపించాము’’ అని స్పష్టం చేశారు. మరోవైపు.. కాసేపట్లో నుంచి మెట్రో రైళ్లు కూడా ప్రారంభం కానున్నట్టు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన రాకేశ్ మృతదేహానికి ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి అయింది. అనంతరం రాకేశ్ డెడ్బాడీని స్వస్థలమైన వరంగల్కు తరలించారు. -
గజ్వేల్ రైల్వేస్టేషన్ సరుకు రవాణా మినీహబ్గా..
సాక్షి, హైదరాబాద్: గజ్వేల్ రైల్వేస్టేషన్ను సరుకు రవాణాకు మినీ హబ్గా మార్చేందుకు రైల్వేశాఖ ఏర్పాట్లు చేస్తోంది. సిద్దిపేట మొదలు గజ్వేల్ వరకు చుట్టుపక్కల ప్రాంతాల్లో పండే వివిధ పంటలతోపాటు పండ్లు, పాలు, చేపలను ఇతర ప్రాంతాలకు రైల్వే ద్వారా సరఫరా చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ ప్రాంతాల నుంచి గూడ్స్ రైళ్ల ద్వారా వాటిని తరలించాలంటే తొలుత సనత్నగర్ రైల్వే యార్డుకు చేర్చాల్సి వస్తోంది. దీంతో ఎక్కువ మంది వ్యాపారులు లారీల ద్వారానే ఇతర ప్రాంతాలకు సరుకు పంపుతున్నారు. తాజాగా రైల్వే ద్వారా సరుకు రవాణాకు గజ్వేల్ను ఎంపిక చేయడంతో దక్షిణమధ్య రైల్వే, భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) మధ్య ఇందుకు సంబంధించి అవగాహన కుదిరింది. ఇటీవల భేటీ అయిన రెండు విభాగాల అధికారులు.. ఇందుకుగల డిమాండ్పై చర్చించారు. నిత్యం 500కుపైగా లారీలు: పూర్తిగా వ్యవసాయాధారిత ప్రాంతాలైన సిద్దిపేట, గజ్వేల్లలో వరి, మొక్కజొన్న, పత్తి, మిరప, కూరగాయలు, పప్పుధాన్యాలు బాగా పండుతాయి. పాడి కూడా విస్తారంగా ఉంది. ఈ ప్రాంతాల నుంచి ప్రస్తుతం నిత్యం 500కుపైగా లారీల్లో సరుకును కొందరు వ్యాపారులు సనత్నగర్కు తరలించి అక్కడి యార్డు ద్వారా గూడ్స్ రైళ్లలోకి తరలిస్తున్న ప్పటికీ ఖర్చు ఎక్కువగా అవుతోంది. మరోవైపు రైల్వేశాఖ ఇటీవల కొన్ని నిబంధనలను సడలించి విడివిడిగా లారీల్లో సరుకు తెచ్చినా కూడా వ్యాగన్లను కేటాయిస్తోంది. తాజాగా గజ్వేల్ స్టేషన్ వద్ద సరుకు రవాణాకు వీలుగా రైల్వేశాఖ పెద్ద యార్డును సిద్ధం చేసింది. ఇటీవలే హైదరాబాద్ డీఆర్ఎం శరత్చంద్రాయణ్ ఇతర అధికారులతో ఆ ప్రాంతాన్ని పరిశీలించి యార్డు వరకు లారీలు వచ్చేలా రోడ్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆ పనులు పూర్తయ్యాయి. వ్యాపారులతో మాట్లాడి సరుకు ఇండెంట్ ఇవ్వాలని ఎఫ్సీఐని రైల్వే అధికారులు కోరారు. ఇండెంట్ రాగానే గూడ్సు రైళ్లు ప్రారంభం కానున్నాయి. -
స్టడీ సెంటర్గా రైల్వే ఫ్లాట్ ఫారం: ఫోటో వైరల్
కరెంట్ సదుపాయం అంతగా లేని కాలంలో క్యాండిల్ లైట్లు కింద చదువుకుని ఇంత గొప్ప స్థాయికి వచ్చాం అని మన పెద్దలు చెబుతుండేవారు. మరికొంతమంది ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కనీస సౌకర్యాలు లేక స్ట్రీట్ లైట్ల కింద చదువుకని పైకి వచ్చిన వాళ్లు ఉన్నారు. ఐతే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే వాళ్లంతా ఏవేవో కారణాల వల్ల చదువుకోవాలనే తాపత్రయంతో అలా కష్టపడి చదువుకున్నారు. అన్ని సౌకర్యాలు ఉన్న ఈ కాలంలో ఒక విద్యార్థి గ్రూప్ రైల్వే ప్లాట్ ఫారంనే స్టడీ సెంటర్గా మార్చేసి మరీ తెగ చదివేస్తున్నారు. వివరాల్లోకెళ్తే...రైల్వే ప్లాట్ ఫారం పై పెద్ద సంఖ్యలో యువకులు చదవుకుంటున్నట్లు ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. అసలు ఫోటో వెనక ఉన్న కథ ఏమిటంటే.. బీహార్లోని ససారమ్ స్టేషన్ నుంచి వచ్చిన కథనం ఇది. ఆ రైల్వే ఫ్లాట్ ఫారం పై చదుకుకుంటన్న విద్యార్థులంతా బీహార్లోని రోహ్తాస్ జిల్లాకు చెందినవారు. వారి గ్రామంలో సరైన కరెంట్ సదుపాయం లేకపోవడంతో ఇలా రైల్వే ఫ్లాట్ ఫారం పై చదువుకుంటున్నారంటూ ఓ వార్త కథనం ప్రచురితమైంది. ఐతే 2002లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి గానీ ఇప్పుడూ అలాంటివేం లేవని ఇండియన్ ఎక్స్ప్రెస్ తేల్చి చెప్పేసింది. విద్యార్థులు పరీక్ష కోసం బయలుదేరి రైలు కోసం వేచి ఉన్నాప్పుడూ చోటు చేసుకున్న ఘటన అని ఒక రైల్వే అధికారి చెప్పారు. ఐతే రైల్వే ఉద్యోగ పరీక్షలను నిర్వహించడంలో జాప్యం కారణంగా 2018లో విద్యార్థుల చేసిన నిరసన అని అక్కడి స్థానికులు చెబుతున్నారు. కొన్ని నెలలు క్రితమే ఈ ఘటనకు సంబంధించిన ఫోటోను ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ ఇదే కథనాన్ని ట్విట్టర్లో ..రైల్వే స్టేషన్లోని 1, 2 ప్లాట్ఫారమ్లు సివిల్ సర్వీసెస్పై ఆసక్తి ఉన్న యువతకు కోచింగ్ క్లాస్గా మారుతున్నాయి అని క్యాప్షన్ జోడించి మరీ ఆ ఫోటోను పోస్ట్ చేశారు. అయితే ఇప్పుడూ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ హరి సింగ్ షెకావత్ లింక్డ్ఐలో అదే ఫోటోతో పోస్ట్ చేయడంతో మళ్లీ వైరల్ అయింది. ఆ ఫోటో వెనుక నిజమైన కథ ఏమిటన్నది కచ్చితంగా తెలియకపోయినప్పటికీ ఆ ఫోటో మాత్రం నెటిజన్లను తెగ ఆకర్షించింది. (చదవండి: మహిళను బలవంతంగా రైల్వే ట్రాక్పైకి తోసేశాడు..!) -
‘కృష్ణా’ వాసుల కష్టాలు.. ఆగని ఎక్స్ప్రెస్.. రాయచూర్ రైల్వేస్టేషన్కు వెళ్లాల్సిందే!
కృష్ణా (మహబూబ్నగర్): కృష్ణా రైల్వేస్టేషన్కు ఓ విశిష్టమైన చరిత్ర ఉంది. దేశంలో మొదటిసారి రైల్వేలైన్ ఏర్పాటు చేసిన సమయంలోనే ఈ రైల్వేస్టేషన్ ఏర్పడింది. అప్పటి నుంచి ఈ ప్రాంతంలోని కృష్ణానదిలో పూజ కార్యక్రమాలకు మహారాష్ట్ర, కర్ణాటక తదితర సూదూర ప్రాంతాల నుంచి ఇక్కడకు భక్తులు వచ్చేవారు. ఆ భక్తులకు ఉపయోగపడే విధంగా ఈ స్టేషన్లో అన్ని సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లను నిలిపేవారు. కాగా కరోనా మహామ్మారి కారణంగా గత కొంత కాలంగా ఈ స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్లు ఇక్కడ నిలపకుండగా రద్దు చేశారు. దీంతో కృష్ణానదికి వచ్చే భక్తులు చుట్టూ పక్కల గ్రామాలకు చెందిన ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ ప్రాంత ప్రజలు ఎక్స్ప్రెస్ రైళ్లకు గాను పక్కన ఉన్న కర్ణాటకలోని రాయచూర్ రైల్వేస్టేషన్కు వెళ్లాల్సి వస్తుందన్నారు. తక్షణమే గతంలో మాదిరిగా ఈ స్టేషన్లో రైళ్లను అన్నింటిని నిలిపే విధంగా తగు చర్యలు తీసుకోవాలని రైల్వే అధికారులకు, కేంద్ర రైల్వే మంత్రికి ప్రత్యేక విజ్ఞప్తులు చేశారు. ఎక్స్ప్రెస్ రైళ్లు నిలపాలని రైల్వేజీఎంకు విజ్ఞప్తి చేస్తున్న కృష్ణా గ్రామస్తులు (ఫైల్) అయినా అధికారుల్లో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఈ విషయంపై రైల్వే స్టేషన్ ముందు అఖిల పక్షాల మద్దతుతో రిలే నిరాహార దీక్షలు చేపడుతామని అంటున్నారు. ఈ ప్రాంత నుంచి ప్రతి నిత్యం వందలాది మంది ప్రయాణికులు ముంబాయి, చెన్నై, బెంగుళూర్ ప్రాంతాలకు వెళ్తుంటారు. వారు ప్రస్తుతం ఇక్కడ రైళ్లను నిలపకపోవడంతో రాయచూర్ స్టేషన్కు వెళ్లాల్సి వస్తుంది. దీని మూలంగా కృష్ణాలోని చిన్న చిన్న వ్యాపారాలు, ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారు. ఈ విషయంపై రైల్వే అధికారులు మరోమారు ఆలోచించి తమకు న్యాయం చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. రిలే నిరాహార దీక్ష చేపడతాం.. స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్లు నిలపాలని అప్పటి కేంద్ర రైల్వే మంత్రిని ఒప్పించాం. అప్పటి నుంచి కృష్ణానదికి వచ్చే భక్తులకు చాల ఉపయోగకరంగా మారింది. అదే సమయంలో జిల్లాలోని అన్ని గ్రామాల ప్రజలకు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఉపయోగకరంగా ఉండేది. కరోనా కారణంగా రద్దు చేసిన రైళ్లను పునరుద్దరించినా ఈ స్టేషన్లో వాటిని నిలపడం లేదు. దీని మూలంగా ప్రయాణికులకు, భక్తులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించకపోతే రిలే నిరాహార దీక్షలు చేపడుతాం. – అమర్కుమార్ దీక్షిత్, పురోహితుడు. కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేస్తాం ఈ స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్లు నిలపాలని కోరుతూ త్వరలోనే అఖిల పక్షాల అధ్వర్యంలో కేంద్ర రైల్వే మంత్రిని, దక్షణ మధ్య రైల్వే ధ్యెంను కలిసి విజ్ఞప్తి చేస్తాం. అప్పటికి మా సమస్య పరిష్కారం కాకపోతే ప్రత్యక్ష ఆందోళనకు పూనుకుంటాం. – మహాదేవ్, కృష్ణా మాజీ సర్పంచ్ రాయచూర్కు వెళ్తున్నాం మా పిల్లలు ఉన్నత చదువుల నిమిత్తం బెంగుళూర్లో ఉంటున్నారు. మేము, మా పిల్లలు బెంగుళూర్కు వెళ్లాలంటే రాయచూర్ స్టేషన్కు వెళ్లాల్సి వస్తుంది. గతంలో కృష్ణాలోనే రైళ్లు నిలవడంతో ఇబ్బందులు ఉండేవి కాదు. ఇప్పుడు నిలపకపోవడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. – విశ్వనాథ్గౌడ, గుర్జాల్ -
వాట్.. రైలు ముందుగా వచ్చిందా..
రైలు లేటొస్తే.. తిట్టుకుంటాం.. మరి ముందొస్తేనో.. మీరైతే ఏం చేస్తారో తెలియదు గానీ.. మధ్యప్రదేశ్లోని రాట్లం రైల్వే స్టేషన్లో మాత్రం జనం ఆశ్చర్యం ప్లస్ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. డ్యాన్స్ చేశారు. బుధవారం బాంద్రా–హరిద్వార్ రైలు రావాల్సిన టైం కన్నా.. 20 నిమిషాలు ముందే వచ్చింది. అప్పటికే బోర్ కొట్టి కూర్చున్న గుజరాతీ ప్రయాణికుల గ్రూపుకు విషయం తెలిసింది. అంతే.. రైలు ముందు రావడంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూనే.. బయలుదేరడానికి బోలెడంత సమయం ఉండటంతో గార్బా నృత్యం చేయడం మొదలుపెట్టారు.. వాళ్ల ఆనందాన్ని చూసిన ఇంకొంతమంది వారికి జత కలిశారు. మొత్తానికి రైల్వే ప్లాట్ఫామ్ కాస్తా డ్యాన్స్ వేదికగా మారిపోయింది. ఈ వీడియో కాస్తా.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి వెళ్లింది. ఆయన దాన్ని సామాజికమాధ్యమం ‘కూ’లో పంచుకోవడంతో తెగ వైరల్ అయ్యింది. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
రైల్వేస్టేషన్లో ఉత్సాహంగా స్టెప్పులేసిన ప్రయాణికులు.. ఎందుకో తెలుసా!
భోపాల్: రైలు ప్రయాణమంటే ఉండే హడావుడి అంతా ఇంత కాదు.. ఎంత ఇంటి నుంచి బయల్దేరినా అప్పుడప్పుడు ట్రాఫిక్లో ఇరుక్కుపోవాల్సిందే. ఏదో కష్టాలు పడి చివరికి స్టేషన్ చేరుకుంటే ట్రైన్ ఆలస్యమని అనౌన్స్ వినిపిస్తోంది. ఈ సౌండ్ చెవికి ఎంత చిరాకుగా ఉంటోందో ప్రతి ఒక్కరికి అనుభవమయ్యే ఉంటుంది. అదే ట్రైన్ రావాల్సిన సమయానికి వస్తే ఎంత ఆనందమో.. అచ్చం ఇలాగో ఓ రైలు అనుకున్న సమయం కంటే ముందే వచ్చినందుకు ప్రయాణికులందరూ తెగ సంబరపడిపోయారు. ఆ సంతోషంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో బుధవారం రాత్రి చోటుచేసుకోగా దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బాంద్రా-హరిద్వార్ రైలు బుధవారం రాత్రి షెడ్యూల్ సమయానికి 20 నిమిషాల ముందే రత్లాం స్టేషన్కి చేరుకుంది. స్టేషన్లో రైలు పది నిమిషాలు ఆగి బయల్దేరుతుంది. దీంతో 30 నిమిషాల సమయం ఉండటంతో ఓ బోగీలోని ప్రయాణికులు గర్భా డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. గుజరాత్ నుంచి కేదార్నాథ్ వెళ్తున్న దాదాపు 90 మంది కలిసి ప్లాట్ఫాంపై ఎంతో ఆనందంగా డ్యాన్స్ చేశారు. చదవండి: బైక్ వెనుక కూర్చొని హెల్మెట్ పెట్టుకోవడం లేదా? ఈ వార్త మీకోసమే! గుజరాత్లో అత్యంత పాపులర్ పాటలు, బాలీవుడ్ పాటలపై స్టెప్పులేశారు. చిన్న పిల్లలనుంచి వృద్ధుల వరకు అందరూ కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. 20 నిమిషాల పాటు బోగీలో కూర్చునే కంటే ఇలా డ్యాన్స్ చేస్తే అలసట తీరిపోతుందనే తాము ఇలా చేశామని ప్రయాణికులు తెలిపారు. ఈ వీడియోను రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూ యాప్లో షేర్ చేశారు. ఇప్పుడిది నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ట్రైన్ సమయానికి వస్తే ఇలాగే ఆనందంగా ఉంటుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ज़िंदगी को जिंदादिली से जियो :) रतलाम रेलवे स्टेशन पर समय से पहले पहुंच गई ट्रेन! हॉल्ट लंबा था लिहाज़ा पैसेंजर्स ने प्लेटफार्म पर गरबा कर बोरियत दूर की @RatlamDRM @RailMinIndia @AshwiniVaishnaw pic.twitter.com/zXg2mVRY1y — Ravish Pal Singh (@ReporterRavish) May 26, 2022 -
వివాహిత మహిళతో యువకుడి సహజీవనం.. కన్న కొడుకుని తీసుకెళ్లి..
మైసూరు(బెంగళూరు): ఇటీవల రాయచూరు బస్టాండులో ఒక యువకుని చేతికి ఒక మహిళ చిన్నారి కొడుకును ఇచ్చి, ఇప్పుడే వస్తానని చెప్పి ఎటో వెళ్లిపోయింది. దీంతో ఆ యువకుడు సొంతూరు మైసూరుకు వచ్చి ఆ బిడ్డను పోలీసులకు ఇచ్చేసి వెళ్లిపోయాడు. ఇదేమిటని మైసూరులోని లష్కర్– రాయచూరు పోలీసులు దర్యాప్తు జరిపితే క్రైం స్టోరీ బయటపడింది. ఆ బిడ్డను అప్పజెప్పిన యువకుడు, ఆ మహిళ ఇందులో సూత్రధారులని అని తేలింది. ఇన్స్టా పరిచయంతో వివరాలు.. మైసూరు జిల్లా హెచ్డి కోటెకు చెందిన రఘు అనే యువకునికి రాయచూరుకు చెందిన వివాహితతో ఇన్స్టా గ్రాంలో పరిచయమైంది. ఆమెకు చిన్నారి కొడుకు, భర్త ఉన్నారు. అయినప్పటికీ ఏడాదిన్నరగా రఘు– ఆమె సహజీవనం చేస్తున్నారు. వీరి అక్రమ సంబంధం మహిళ భర్త యేసురాజుకు తెలిసి ఆమె నుంచి దూరంగా ఉంటున్నాడు. బిడ్డను వదిలించుకుంటే ఇంక ఏ సమస్యా ఉండదని రఘు, ఆమె భావించారు. ఇందుకోసం పై విధంగా నాటకం ఆడారు. రాయచూరు నుంచి బిడ్డను తీసుకొచ్చి ఎవరో మహిళ ఇచ్చి వెళ్లిందని పోలీసులకు అప్పజెప్పి వెళ్లిపోయాడు. పోలీసులు బాలున్ని శిశుగృహకు తరలించి దర్యాప్తు చేపట్టారు. మహిళ భర్తను పిలిచి విచారించగా విషయం బయపడింది. ఆ జంటపై కేసు నమోదు చేశారు. చదవండి: ఒంటరిగా ఉన్న యువతి ఇంట్లోకి వెళ్లి.. పిస్తోల్తో బెదిరించి.. -
పుట్టిన రోజున ముస్తాబై.. సాయంత్రం బర్త్ డే పార్టీ ఇస్తానని..
సాక్షి, హైదరాబాద్: తన పుట్టిన రోజున ఎంతో సంతోషంతో ఇంట్లో ముస్తాబై సెల్ఫోన్లో ఫొటో దిగింది. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత తండ్రికి, తమ్ముడికి సాయంత్రం బర్త్ డే పార్టీ ఇస్తానని చెప్పింది. డ్యూటీకి వెళ్తున్నానంటూ చెప్పి బయల్దేరిన కొద్ది నిమిషాలకే ఆమెను మృత్యువు కబళించింది. ఎంఎంటీఎస్ రైలు వేగం ధాటికి ఎగిరికింద పడిన ఓ మహిళ మృతి చెందిన విషాద ఘటన ఖైరతాబాద్ రైల్వేస్టేషన్ వద్ద బుధవారం ఉదయం చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. మహారాష్ట్ర షోలాపూర్నకు చెందిన లావణ్య తండ్రి, సోదరుడు, ఇద్దరు కూతుళ్లతో కలిసి కొన్నాళ్ల క్రితం నగరానికి వచ్చారు. తుమ్మలబస్తీలో ఉంటున్నారు. లావణ్య ఖైరతాబాద్లో టెలీకాలర్గా పని చేస్తోంది. ఈ క్రమంలో ఆమె బుధవారం తుమ్మల బస్తీ నుంచి ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్ సమీపంలోని పట్టాలు దాటి ఖైరతాబాద్కు వచ్చే క్రమంలో హైదరాబాద్ నుంచి లింగంపల్లి వెళ్లే ఎంఎంటీఎస్ రైలు స్పీడ్కు ఒక్కసారిగా ఎగిరి కిందపడి తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె మృతి చెందింది. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (భువనగిరిలో కిడ్నాప్.. సింగరాయకొండలో పట్టివేత) -
వెరీ స్పెషల్ స్టేషన్.. ఓ భాగం గుజరాత్లో మరో భాగం మహారాష్ట్రలో..!
గుజరాత్ సరిహద్దుల్లోని నవాపూర్ రైల్వేస్టేషన్ సందర్శనకు చాలామంది వస్తుంటారు. రైల్వేస్టేషన్కి సందర్శకులు ప్రత్యేకంగా రావడం ఏమిటో? అనే కదా మీ డౌటనుమానం? దేశంలోనే ఇదో ప్రత్యేకమైన రైల్వేస్టేషన్. ఈ స్టేషన్ సగభాగం గుజరాత్ రాష్ట్రంలో మరో సగభాగం మహారాష్ట్రలో ఉంటుంది. అందుకే ఈ స్టేషన్కు రావడానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పోటెత్తుతుంటారు. ప్రయాణం చేయడానికి కాదు, ఫొటోలు తీసుకోవడానికి. ఈ స్టేషన్కు రైలు వచ్చినప్పుడు ఇంజిన్ ఒక రాష్ట్రంలో బోగీలు మరో రాష్ట్రంలో ఉంటాయి. ఒకవేళ రైలు గుజరాత్ నుంచి వస్తుంటే.. ఇంజిన్ మహారాష్ట్రలో, బోగీలు గుజరాత్లో ఉంటాయి. అదే మహారాష్ట్ర నుంచి గుజరాత్ వెళ్తున్న రైలు ఆగితే.. ఇంజిన్ గుజరాత్లో, బోగీలు మహారాష్ట్రలో ఆగుతాయి. అందుకే ఇక్కడికి వచ్చే సందర్శకులకు ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. మహారాష్ట్రలో నిలబడి గుజరాత్లో ఉన్న కౌంటర్ దగ్గర టికెట్లు కొనుక్కుంటారు. ఇక్కడ బెంచీలు కూడా రెండు రాష్ట్రాల పేర్లను (ఒకవైపు గుజరాత్ అని మరోవైపు మహారాష్ట్ర అని) సూచిస్తుంటాయి. గుజరాత్, మహారాష్ట్రల సరిహద్దు రేఖను ప్లాట్ఫామ్ మీద చూడొచ్చు. ఈ ప్లాట్ఫామ్లో ఉండే ఒక బెం^Œ పైన సరిగ్గా సగానికి లైన్ గీసి.. ఉంటుంది. సగభాగం గుజరాత్లో సగభాగం మహారాష్ట్రలో ఉంటుంది. దాంతో ఈ బెంచ్పై కూర్చుని చాలామంది సెల్ఫీలు దిగుతారు. ఇక ఈ రైల్వేస్టేషన్ను నిర్వాహకులు చాలా శుభ్రంగా ఉంచుతారు. ఈ స్టేషన్కి మరో ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు. ఒకటి గుజరాత్ ప్రయాణికుల కోసం, మరొకటి మహారాష్ట్ర ప్రయాణికుల కోసం. రెండు రాష్ట్రాల ప్రజల కోసం రెండు ప్రత్యేకమైన బ్రిడ్జ్లు మరెక్కడా లేవు. భలే ఉంది కదూ.. అటువైపుగా వెళ్తే మీరూ ఈ స్టేషన్కి వెళ్లి చూడండి. ఆ ప్రత్యేకమైన బెంచ్ మీద కూర్చుని ఓ ఫొటో కూడా దిగండి. -
పాపం రమాదేవి.. భర్త ప్రాణాలు కాపాడబోయి..
అనంతపురం సిటీ: కదులుతున్న రైలు నుంచి పట్టు తప్పి కిందపడిన భర్త ప్రాణాలు కాపాడబోయి ఓ వివాహిత మృతి చెందింది. జీఆర్పీ ఎస్ఐ విజయకుమార్ తెలిపిన మేరకు... అనంతపురం మండలం రాచానుపల్లికి చెందిన గోపాల్, రమాదేవి (35) దంపతులు. వీరికి మూడేళ్ల కుమారుడు యశ్వంత్, రెండేళ్ల కుమార్తె మేఘన ఉన్నారు. శనివారం రాత్రి గుంతకల్లుకు వెళ్లేందుకు అనంతపురం రైల్వే స్టేషన్లో కాచిగూడ రైలు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. చదవండి: మంత్రి కొడుకుపై అత్యాచారం కేసు.. మత్తు మందు ఇచ్చి.. నగ్నంగా ఫొటోలు తీసి తొలుత భార్య, ఇద్దరు పిల్లలను గోపాల్ ఎక్కించారు. అప్పటికే రైలు ముందుకు కదిలింది. ఆ సమయంలో పట్టుతప్పి అతను కిందపడ్డాడు. భర్తను కాపాడబోయి రమాదేవి రైలుకు, ప్లాట్ఫాంకు మధ్యలో ఇరుక్కుపోయింది. విషయాన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే చైన్ లాగి రైలును ఆపారు. అప్పటికే దంపతలిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సర్వజనాస్పత్రికి తరలించారు. చికిత్సకు స్పందించక శనివారం అర్ధరాత్రి రమాదేవి మృతి చెందింది. పిల్లలు సురక్షితంగా ఉన్నారు. ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
సినిమా షూటింగ్లకు కేరాఫ్ అడ్రస్.. రికార్డు స్ధాయిలో ఆదాయం
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ప్రముఖ చారిత్రాత్మక కట్టడమైన ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ (సీఎస్ఎంటీ) రైల్వే స్టేషన్, భవనం ఆవరణలో నిర్వహించిన సినిమా, ప్రకటనల షూటింగులు సెంట్రల్ రైల్వేకు భారీ ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నాయి. వాణిజ్య, వ్యాపార సంస్ధలు, సినీ నిర్మాతలు తమ సినిమాలు, ప్రకటనల షూటింగులకు సీఎస్ఎంటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సినిమా లేదా ప్రకటనలో ఎక్కడో ఒక చోట సీఎస్ఎంటీ రైల్వే స్టేషన్, రైల్వే ప్లాట్ఫారం, వారసత్వ కట్టడమైన ఈ స్టేషన్ భవనం కనిపించాలని నిర్మాతలు తహతహలాడుతుంటారు. దీంతో సీఎస్ఎంటీవద్ద షూటింగ్ చేయడానికి ఎక్కువ ప్రాధా న్యత ఇస్తారు. కాని లాక్డౌన్ కారణంగా 2020 మార్చి తరువాత సినిమా, ప్రకటనల షూటింగులు జరగలేదు. దీంతో సెంట్రల్ రైల్వే ఆదాయాన్ని కోల్పోయింది. కాని గత సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్ తరువాత కరోనా నియంత్రణలోకి రావడంతో సినిమా, ప్రకటనల షూటింగులకు అనుమతివ్వడం మొదలైంది. గడచిన ఐదారు నెలల్లో సీఎస్ఎంటీ వద్ద చేపట్టిన ఆరు సినిమాలు, రెండు వెబ్ సిరీజ్లు, ఒక డాక్యుమెంటరీ, ఒక ప్రకటన షూటింగుల వల్ల సెంట్రల్ రైల్వే రికార్డు స్ధాయిలో ఏకంగా రూ.2.48 కోట్ల ఆదాయం వచ్చింది. చదవండి: ఆసుపత్రిలో కన్నీళ్లు పెట్టుకున్న నవనీత్, ఓదార్చిన భర్త.. వైరల్ వీడియో అదేవిధంగా యేవలలోని కాన్హే గ్రామం రైల్వే స్టేషన్లో ఒక ప్రత్యేక రైలులో 18 రోజులు సినిమా షూటింగ్ జరిగింది. దీనివల్ల సెంట్రల్ రైల్వేకు రూ.1.27 కోట్ల ఆదాయం రాగా ఆదార్కి రైల్వే స్టేషన్లో 9 రోజుల పాటు జరిగిన షూటింగ్ వల్ల రూ.65.95 లక్షల ఆదాయం వచ్చింది. ఇదిలా ఉండగా 2013–14 ఆర్ధిక సంవత్సరంలో సీఎస్ఎంటీలో జరిగిన వివిధ షూటింగుల ద్వారా రైల్వేకు రూ.1.73 కోట్ల ఆదాయం వచ్చింది. అప్పట్లో ఈ ఆదాయాన్ని రికార్డుగా భావించారు. ఆ తరువాత ఇప్పుడు రూ.2.48 కోట్ల ఆదాయం రావడం 2013–14 ఆర్ధిక సంవత్సరం రికార్డును బద్దలు కొట్టింది. అత్యధికంగా షూటింగులు జరిగే స్టేషన్లు... మొదటి స్ధానంలో సీఎస్ఎంటీ ఉండగా, ఆ తరువాత స్ధానంలో ముంబైలోని ఓల్డ్ వాడిబందర్ యార్డ్, దాదర్, ములుండ్లోని ఆర్పీఎఫ్ గ్రౌండ్, ముంబైకి సమీపంలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మాథేరాన్ రైల్వే స్టేషన్, సాతారా జిల్లాలోని అదార్కి రైల్వే స్టేషన్, మన్మాడ్–అహ్మద్నగర్ మధ్యలో ఉన్న యేవలలోని కాన్హేగావ్ స్టేషన్లో జరుగుతాయని సెంట్రల్ రైల్వే చీఫ్ పీఆర్వో శివాజీ సుతార్ తెలిపారు. -
అనగనగా ఓ రైల్వేస్టేషన్.. అక్కడ ఏ సౌకర్యాలు ఉండవ్
పర్లాకిమిడి(భువనేశ్వర్): ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలకు ఏళ్లుగా సేవలందిస్తున్న పర్లాకిమిడి, గుణుపురం రైల్వేస్టేషన్లలో కనీస సదుపాయాలు కరువయ్యాయి. ఈ స్టేషన్ల నుంచి రైల్వేకు అధికంగా ఆదాయం వస్తున్నా అభి వృద్ధి చేయడంలో మాత్రం శీతకన్ను వహిస్తున్నారు. కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాష్ట్రానికి చెందినవారు అయినా ఈ ఏడాది బడ్జెట్లో కేవలం రూ. 10 కోట్లు తప్ప, ఇతర మౌలిక సౌకర్యాలకు నిధుల కేటాయించలేదని పలువురు విమర్శిస్తున్నారు. ప్లాట్ఫారం ఎత్తు పెంచేదెన్నడో..? పర్లాకిమిడి రైల్వేస్టేషన్లో ప్లాట్ఫారం ఎత్తు తక్కువగా ఉండడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎత్తు తక్కువగా ఉండడంతో వయోవృద్ధులు, పిల్లలు అవస్థలు పడుతున్నారు. కొందరైతే ట్రైన్ ఎక్కేందుకు ప్లాస్టిక్ కుర్చీలు తెచ్చుకుంటున్నారు అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు కనీసం షెల్టర్ కూడా నిర్మించలేదు. ఇదివరకు సుమారు రూ.3,050 కోట్లతో పర్లాకిమిడి–గుణుపురం–తెరువల్లి–రాయగడ రైల్వేలైన్ అభివృద్ధి చేస్తామని కేంద్రమంత్రులు ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికైనా రైల్వేశాఖ అధికారులు, స్థానిక నాయకులు స్పందించి రైల్వేస్టేషన్ల అభివృద్ధికి కృషి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. చదవండి: అమ్మానాన్న ప్లీజ్ నన్ను క్షమించండి.. కరిష్మా సూసైడ్ లేఖ -
వలస కూలీపై సామూహిక అత్యాచారం
సాక్షి, గుంటూరు, రేపల్లె రూరల్, సాక్షి, అమరావతి : బతుకుదెరువు కోసం వచ్చిన వలస కూలీ కుటుంబంపై మానవ మృగాలు దాడి చేశాయి. నాలుగు నెలల గర్భిణిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తన భార్యను కాపాడుకునేందుకు ఆ భర్త చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరికి పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో నిందితులు పరారయ్యారు. గంటల వ్యవధిలోనే ఆ మృగాలని పోలీసులు పట్టుకున్నారు. బాధితురాలిని వైద్య సేవల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసుల కథనం మేరకు.. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలానికి చెందిన ఓ కుటుంబం తాపీ పని నిమిత్తం కృష్ణా జిల్లా నాగాయలంక వెళ్లేందుకు శనివారం రాత్రి గుంటూరు నుంచి రేపల్లె రైల్వే స్టేషన్కు చేరుకుంది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో కృష్ణా జిల్లాకు వెళ్లేందుకు బస్సులు, ఆటోలు లేకపోవటంతో తమ ముగ్గురు పిల్లలతో కలిసి రైల్వేస్టేషన్ ప్లాట్ఫారంపై నిద్రించారు. సమయం అడిగి భర్తతో వివాదం.. ఆపై.. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ప్లాట్ఫారంపైకి మద్యం మత్తులో వచ్చిన ముగ్గురు దుండగులు నిద్రిస్తున్న బాధితురాలి (25) భర్తను లేపి సమయం ఎంతైందని అడిగారు. తన దగ్గర వాచ్లేదని సమాధానం చెప్పగా, ఆ వ్యక్తి వద్ద ఉన్న రూ.750 లాక్కొని దాడికి పాల్పడ్డారు. పక్కనే ఉన్న భార్య తన భర్తను కొట్టవద్దని ప్రాధేయపడగా.. వారిలో ఇద్దరు ఆమెను ప్లాట్ఫారంపై కొంత దూరం ఈడ్చుకెళ్లారు. తర్వాత మరో నిందితుడూ వారితో కలిశాడు. ముగ్గురూ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి భర్త ఆర్పీఎఫ్ పోలీసు స్టేషన్కు వెళ్లి.. పలుమార్లు తలుపు కొట్టినా ఎవరూ స్పందించలేదు. వెంటనే స్టేషన్ మెయిన్ గేట్ ఎదురుగా ఉన్న రిక్షా కార్మికులను ఆశ్రయించాడు. బాధితురాలి కుటుంబసభ్యుడికి రూ.50 వేల సాయం అందజేస్తున్న మోపిదేవి రాజీవ్, మంత్రి మేరుగ తాము సహాయం చేయలేమని, కొంత దూరంలో పోలీసు స్టేషన్ ఉందని చెప్పారు. దీంతో ఆ వ్యక్తి పోలీసు స్టేషన్కు పరుగు పరుగున చేరుకుని విషయం చెప్పాడు. సర్కిల్ కార్యాలయ పోలీసు సిబ్బంది రైల్వేస్టేషన్ చేరుకునే లోపు జీపు సైరన్ విన్న దుండగులు పరారయ్యారు. లైంగిక దాడికి గురైన బాధితురాలిని తక్షణ వైద్య సేవల నిమిత్తం రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, 4 నెలల గర్భవతి అని వైద్యాధికారులు చెప్పారు. మెరుగైన చికిత్స కోసం బాధితురాలిని, అమె కుటుంబ సభ్యులను ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కాగా, బాధితురాలి భర్త ఫిర్యాదుతో రేపల్లె సీఐ వి.సూర్యనారాయణ ఐపీసీ సెక్షన్లు 376(డీ), 394, 307 ఆర్/డబ్యూ 34తో కేసు నమోదు చేశారు. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, డీఎప్పీ శ్రీనివాసరావు, ఆర్డీవో గంధం రవీందర్లు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో నిందితులను గుర్తించారు. గంటల వ్యవధిలో నిందితుల అరెస్ట్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారంపై నిందితులవి రెండు జతల చెప్పులు పడివుండటంతో వాటిని డాగ్ స్క్వాడ్తో తనిఖీ చేయగా, అవి కొంతదూరంలో నిందితులలో ఒకరు చొక్కా మార్చుకున్న చోటుకు వెళ్లాయి. అక్కడ పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు లైంగిక దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులు రేపల్లె పట్టణంలోని 24వ వార్డుకు చెందిన పోలుబోయిన విజయ్కృష్ణ, పాలుచూరి నిఖిల్, మరో మైనరు (16) బాలుడిగా గుర్తించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు వారిని అరెస్ట్ చేసినట్లు బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాకు వెల్లడించారు. మైనర్ బాలుడు ఇప్పటికే మూడు దొంగతనం కేసుల్లో నిందితుడుగా ఉన్నాడన్నారు. వీలైనంత త్వరగా చార్జిషీట్ వేసి, శిక్షపడేలా చూస్తామన్నారు. అనంతరం వారిని కోర్టు ముందు హాజరు పరిచారు. కాగా, రైల్వే పోలీసులు స్పందించక పోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. రైల్వే అధికారులెవరూ స్పందించలేదు. ఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమిషనర్ అజయ్ప్రసాద్ విలేకర్లతో మాట్లాడేందుకు నిరాకరించారు. దోషులను కఠినంగా శిక్షిస్తాం ఒంగోలు అర్బన్: మహిళలకు సంబంధించిన ఘటనలు సున్నితమైనవి కాబట్టి వాటిని ఎవరైనా సరే సున్నితంగానే చూడాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని అన్నారు. రేపల్లె ఘటనకు సంబంధించి దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. బాధితురాలిని ఆదివారం ఆమె ఒంగోలు జీజీహెచ్లో పరామర్శించారు. ప్రభుత్వం తరఫున రూ.2 లక్షల పరిహారం చెక్కును అందజేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మీడియాతో మాట్లాడుతూ.. బాధితురాలికి, ఆమె కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. బాధితులు ప్రకాశం జిల్లా వాసులు కావడంతో మెరుగైన వైద్యం, రిహాబిలిటేషన్ కోసంఒంగోలు జీజీహెచ్కు తరలించామన్నారు. బాధితురాలి కుటుంబసభ్యుడికి ప్రభుత్వం తరఫున రూ.2 లక్షల చెక్కుని అందజేస్తున్న మంత్రి విడదల రజని మహిళా కమిషన్ సీరియస్ అత్యాచార ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఘటన సమాచారం తెలియగానే చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్తో ఫోన్లో మాట్లాడారు. కేసును వేగవంతంగా దర్యాప్తు చేయాలన్నారు. రైల్వేస్టేషన్లలో మహిళల భద్రత, రక్షణ ఏర్పాట్లకు సంబంధించి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని రైల్వే శాఖ ఉన్నతాధికారులను కోరారు. ఈ ఘటనపై సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించి పోలీసులకు తగు ఆదేశాలు ఇచ్చారన్నారు. అత్యాచార నిందితులకు చట్టపరంగా కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. ఆదివారం రేపల్లె ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయన మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు, మోపిదేవి రాజీవ్, మోపిదేవి హరనాధబాబులతో కలసి బాధితురాలిని పరామర్శించారు. మీడియాతో మాట్లాడుతూ.. సమాచారం తెలియగానే సీఎం జగన్ తమను అప్రమత్తం చేశారన్నారు. తక్షణ సాయంగా ప్రభుత్వం రూ.2 లక్షల పరిహారాన్ని ప్రకటించినట్లు చెప్పారు. ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు తనయుడు రాజీవ్.. బాధితులకు తక్షణ ఖర్చుల నిమిత్తం రూ.50 వేల ఆర్థిక సాయం అందజేశారు. కాగా, దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. టీడీపీ, జనసేన, బీజేపీ, ఎంఆర్పీఎస్ నాయకులు రేపల్లె ప్రభుత్వ వైద్యశాల వద్ద, ఒంగోలు జీజీహెచ్ వద్ద హడావుడి చేశారు. -
మాట నిలుపుకున్న కేంద్రమంత్రి.. చెప్పినట్లే ఢిల్లీ వెళ్లగానే..
కొరాపుట్(భువనేశ్వర్): తాను కొరాపుట్ నుంచి ఢిల్లీ వెళ్లిన వెంటనే ప్రతిపాదిత స్టేషన్లలో రైళ్లు ఆగుతాయన్న కేంద్ర రైల్వే, టెలికాం మంత్రి అశ్వినీ శ్రీవైష్టవ్ ఇచ్చిన మాటను నిలుపుకున్నారు. ఈ మేరకు మంగళవారం ఆదేశాలు జారీ అయ్యాయి. కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్, బస్తర్ జిల్లా బచేలిలో రైళ్లు ఆగాయి. ఉదయం ఆదేశాలు రావడంతో సాయంత్రం నుంచి ఆయా స్టేషన్లకు హాల్టులు కల్పించారు. మెదటి విడత కోవిడ్ సమయం నుంచి ఈ స్టేషన్లలో రైళ్లు ఆపడం నిలిపివేశారు. అనంతరం కోవిడ్ తగ్గుముఖం పట్టినా రైళ్లను పునరుద్ధరించలేదు. దీంతో ఇటీవల రైల్వే మంత్రి కొరాపుట్ వచ్చినప్పుడు ఈ సమస్యను నాయకులు ప్రస్తావించారు. దీంతో ఆయా స్టేషన్లలో హాల్టులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో పాటు నెరవేర్చారు. దీంతో లక్ష్మీపూర్లో జగధల్పూర్–భువనేశ్వర్, జగధల్పూర్–హౌరా, జగధల్పూర్–రౌర్కెలా రైళ్లు ఆగనున్నాయి. అలాగే బచేలిలో విశాఖపట్నం–కిరండోల్ ఎక్స్ప్రెస్ రైలు (రాత్రిపూట రైలు) ఆగనుంది. ఈ ప్రకటనతో లక్ష్మీపూర్, నారాయణ పట్న, బందుగాం సమితులలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు వాల్తేర్ డీఆర్ఎం అనుఫ్ కమార్ సత్పతి లక్ష్మీపూర్ రైల్వేస్టేషన్ను ఆకస్మికంగా సందర్శించారు. చదవండి: ఎస్ఐ స్కాంలో అభ్యర్థి అరెస్టు... బ్లూటూత్ ద్వారా పరీక్ష రాసిన వైనం -
తిమ్మాపూర్ రైల్వే స్టేషన్: సీన్ ఉంటే.. సినిమా హిట్టే
సాక్షి, రంగారెడ్డి: తిమ్మాపూర్లో ఎనభై ఏళ్ల క్రితం ప్రారంభమైన రైల్వేస్టేషన్ సినిమా షూటింగ్లకు ప్రఖ్యాతి గాంచింది. అగ్ర హీరోలు మొదలుకుని జూనియర్ల వరకు తిమ్మాపూర్ రైల్వే స్టేషన్లో సినిమా షూటింగ్లు చిత్రీకరించడానికి చాలా ఆసక్తి కనబర్చుతారు. వీరి సెంటిమెంటే ఇందుకు కారణం. పెద్ద హీరోలు నటించే సినిమాల్లో రైల్వే స్టేషన్ సీన్ ఉందంటే ముందుగా తిమ్మాపూర్నే ఎంచుకుంటారు. ఇక్కడ ఒక చిన్న సీన్ చిత్రీకరించినా సినిమా హిట్ అవుతుందని హీరోలతో పాటు డైరక్టర్లలో గట్టి నమ్మకం ఉంది. చిరంజీవి నటించిన అల్లుడా మజాకా, వెంకటేశ్ నటించిన సూర్యవంశం, పవన్ కల్యాణ్ సినిమా జానీ, బాలకృష్ణ మూవీ సమరసింహారెడ్డితో పాటు పలు చిత్రాల్లోని సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారు. ఆదర్శంగా.. తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ మిగితా స్టేషన్లకు ఆదర్శంగా నిలుస్తోంది. పరిశుభ్రత, మొక్కల పెంపకం, ప్రయాణికులు కూర్చునేందుకు కుర్చీలు, తాగునీరు, టాయిలెట్లు ఇలా ప్రయాణికులకు అన్ని రకాల వసతులు అందుబాటులో ఉన్నాయి. స్టేషన్ మీదుగా నిత్యం 20 రైళ్లు రాకపోకలు కొనసాగిస్తుండగా 4 రైళ్లు ఇక్కడ ఆగుతాయి. పండగలు ఇతర రద్దీ దినాల్లో ఈ స్టేషన్ నుంచి నిత్యం వంద మందికిపైగా రాకపోకలు కొనసాగిస్తున్నారు. రెండుసార్లు ఉత్తమ అవార్డులు తిమ్మాపూర్ రైల్వే స్టేషన్లో పనిచేసే స్టేషన్ మాస్టర్లు, మేనేజర్తో పాటు ఇతర సిబ్బంది కృషి ఫలితంగా హైదరాబాద్ డివిజన్ పరిధిలో రెండుసార్లు ఉత్తమ స్టేషన్గా అవార్డులు వరించాయి. ప్రస్తుతం పాత భవనాలు, ఫ్లాట్ఫాంలను తొలగించి వాటి స్థానంలో కొత్తవి నిర్మిస్తున్నారు. -
యుద్ధ నేరాలకు... సాక్ష్యాలివిగో
కీవ్: రైల్వే స్టేషన్పై క్షిపణి దాడితో 50 మందికి పైగా అమాయకులను పొట్టన పెట్టుకున్న రష్యాపై మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలను ఉక్రెయిన్ కోరింది. బుచాను తలపించే ఈ మారణకాండకు రష్యా అధ్యక్షుడు పుతిన్ను బాధ్యున్ని చేసి తీరాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. రష్యా యుద్ధ నేరాలకు కావాల్సినన్ని రుజువులు దొరికాయని చెప్పారు. ‘‘మా పౌరులను ఎలా అపహరించింది, ఎలా నిర్దాక్షిణ్యంగా కాల్చేసిందీ, చేతికందిన వాటినల్లా ఎలా దోచేసిందీ రష్యా సైనికులు తమ కుటుంబీకులకు చెప్తున్న ఫోన్ సంభాషణలను రికార్డు చేశాం. మాకు పట్టుబడ్డ రష్యా పైలట్ల దగ్గర పౌర నివాస ప్రాంతాలున్న మ్యాపులు దొరికాయి కూడా’’ అన్నారు. ప్రధాన కారకుడైన పుతిన్తో పాటు ఈ దారుణాలకు ప్లాన్ చేసిన, ఆదేశాలిచ్చిన, వాటిని అమలు చేసిన వారందరిపైనా విచారణ జరిగి కఠినాతి కఠినమైన శిక్షలు పడాల్సిందేనన్నారు. ఈ ఘోరాన్ని వర్ణించేందుకు మాటలే లేవని కీవ్లో పర్యటిస్తున్న యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండెర్ లెయన్ అన్నారు. రష్యా శాడిజం నానాటికీ పరాకాష్టను చేరుతోందని దుయ్యబట్టారు. అయితే తనను దోషిగా చూపేందుకు ఉక్రెయినే రైల్వేస్టేషన్పై దాడికి పాల్పడిందని రష్యా ఆరోపించింది. బుచాలో పౌరులను రష్యా దళాలు సామూహికంగా పొట్టన పెట్టుకున్న కనీసం మూడు చోట్లను తాజాగా గుర్తించినట్టు నగర మేయర్ చెప్పారు. ఒక చోట సామూహికంగా ఖననం చేసిన 70 శవాలను బయటికి తీశామన్నారు. ఈ మారణకాండలో రష్యా కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ హస్తముందని జర్మనీ అభిప్రాయపడింది. ఉక్రెయిన్తో యుద్ధం కారణంగా రష్యా తన సైనిక శక్తిలో కనీసం 20 శాతాన్ని కోల్పోయిందని అమెరికా తాజాగా అంచనా వేసింది. ఉక్రెయిన్కు మరిన్ని ఆయుధాలిస్తామని ఇంగ్లండ్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లిన ఆయన శనివారం కీవ్లో జెలెన్స్కీతో భేటీ అయ్యారు. మరోవైపు, ఉక్రెయిన్లో తమ రాయబార కార్యాలయాన్ని పునఃప్రారంభిస్తున్నట్టు ఆస్ట్రియా ప్రకటించింది. యూరోపియన్ యూనియన్ కూడా తమ రాయబారిని కీవ్కు తిరిగి పంపించింది. ఇటలీ కూడా త్వరలో కీవ్లో తమ ఎంబసీని తెరుస్తామని ప్రకటించింది. ఆదుకోండి: ప్రియాంక శరణార్థులను ఆదుకోవాలని నటి, యునిసెఫ్ గుడ్విల్ అంబాసిడర్ ప్రియాంక చోప్రా ప్రపంచ నేతలను కోరారు. ఈ మేరకు ఇన్స్టాగ్రాంలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘‘20 లక్షలకు పైగా ఉక్రెయిన్ చిన్నారులు దేశం విడిచారు. 30 లక్షలకు పైగా స్వదేశంలోనే నిరాశ్రయులుగా మిగిలారు. కనీవినీ ఎరగని సంక్షోభమిది. యుద్ధం మిగిల్చిన ఈ తీరని వేదన వారి మనసుల్లోంచి ఎన్నటికీ పోయేది కాదు’’ అని ఆవేదన వెలిబుచ్చారు. తన అభిమానులు, ఫాలోవర్లు కూడా వీలైనంత సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. భద్రతామండలి నుంచి రష్యాను బహిష్కరించలేం: అమెరికా ఐరాస భద్రతా మండలి నుంచి రష్యా బహిష్కరణ సాధ్యం కాదని అమెరికా అభిప్రాయపడింది. రష్యా అందులో వీటో అధికారమున్న శాశ్వత సభ్య దేశమ ని వైట్హౌస్ ప్రెస్ సెక్రెటరీ జెన్ సాకి గుర్తు చేశారు. రష్యాకు భారత్ దూరమవాలి: అమెరికా రష్యాతో జి77 అలీన భాగస్వామ్య బంధం నుంచి భారత్ తప్పుకోవాలని అమెరికా విదేశాంగ ఉప మంత్రి వెండీ షెర్మన్ సూచించారు. అమెరికా–భారత్ మధ్య రక్షణ వాణిజ్యాన్ని మరింతగా పెంచుకునేందుకు ఎం తో అవకాశముందన్నారు. ‘అమెరికా, ఆస్ట్రేలి యా, జపాన్లతో కూడిన క్వాడ్ కూటమిలో కూ డా భాగస్వామి అయినా భారత్ వెంటనే రష్యాతో బంధానికి దూరమైతే మేలు’ అన్నారు. -
Russia-Ukraine War: ఆగని దమనకాండ.. రైల్వే స్టేషన్పై రష్యా దాడి
చెర్నిహివ్: ఉక్రెయిన్లో పౌరులను తరలిస్తున్న ఒక రైల్వే స్టేషన్పై రష్యా జరిపిన రాకెట్ దాడిలో 39 మందికి పైగా మృతి చెందినట్లు స్థానిక గవర్నర్ పావ్లోవ్ కిరిలెంకో శుక్రవారం ప్రకటించారు. రష్యన్ సేనలు తూర్పు ఉక్రెయిన్ వైపుగా వెళుతూ ఖాళీ చేస్తున్న నగరాల్లో మరిన్ని దారుణాలు కనిపిస్తాయని అంచనా వేస్తున్నారు. డొనెట్స్క్ ప్రాంతంలోని క్రామటోర్స్క్ స్టేషన్లో వేలాది మంది ప్రజలు ఉన్నారని, ఆ స్టేషన్పై మిసైల్ దాడి జరిగిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. ధ్వంసమైన రైల్ బోగీల దృశ్యాలను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దాడిలో వందమందికి పైగా గాయపడి ఉండొచ్చని అంచనా. యుద్ధంలో తమను గెలవలేక రష్యా ఇలాంటి అమానవీయ చర్యలకు పాల్పడుతోందని జెలెన్స్కీ ఆరోపించారు. మారియుపోల్లో ఘోరాలు బయటపడితే రష్యా అకృత్యాలు మరింతగా తెలియవస్తాయన్నారు. రష్యా సైనికులు ఖాళీ చేసిన బుచా తదితర నగరాల్లో ఏం జరిగిందో ప్రపంచమంతా చూస్తోందని, రష్యా క్రూర నేరాలకు పాల్పడుతోందని చెప్పారు. బుచాకు దగ్గరలోని బొరొడైంకా నగరంలో మరింతమంది మృతులు ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. రష్యా అమానవీయంగా వ్యవహరిస్తోందన్న కారణంగా ఉక్రెయిన్కు మరిన్ని ఆయుధాలు సరఫరా చేసేందుకు నాటో దేశాలు అంగీకరించిన సంగతి తెలిసిందే! అయితే ఇవన్నీ తప్పుడు ఆరోపణలని రష్యా పేర్కొంది. ఎదురుదెబ్బలు నిజమే ఉక్రెయిన్పై దాడిలో తమకు భారీగా నష్టం వాటిల్లినట్లు రష్యా అధికార ప్రతినిధి డిమిట్రీ పెస్కోవ్ చెప్పారు. ఆపరేషన్ వీలైనంత తొందరగా ముగించేందుకు రష్యా సేనలు యత్నిస్తున్నాయని, తమ దాడి త్వరలో ముగుస్తుందని స్కైన్యూస్తో చెప్పారు. భారీగా సైనికులను నష్టపోవడం బాధాకరమన్నారు. రష్యా దాడితో ఉక్రెయిన్ నుంచి దాదాపు 65 లక్షల మంది నిరాశ్రయులయి ఉంటారని ఐరాస అంచనా వేసింది. ఐరాస మానవహక్కుల సంఘ అంచనాల ప్రకారం 43 లక్షలమంది శరణార్ధులయ్యారు. వీరిలో సగం మంది పిల్లలని అంచనా. దాడులు జరుగుతున్న ప్రాంతాల్లో ఇంకా 1.2 కోట్లమంది చిక్కుకుపోయి ఉంటారని ఐఓఎం అంచనా వేసింది. ఈ వారంలో కాల్పుల విరమణ కుదురుతుందన్న ఆశలేదని ఐరాస ప్రతినిధి చెప్పారు. ఉక్రెయిన్కు మరింత మద్దతునందించేందుకు ఇద్దరు ఈయూ అధికారులు, స్లోవేకియా ప్రధాని కీవ్కు చేరారు. అంతర్జాతీయంగా ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా ఆహార ధరలు భారీగా పెరుగుతున్నాయని ఐరాస అనుబంధ సంస్థ తెలిపింది. ఫిబ్రవరితో పోలిస్తే పప్రంచ ఆహారధాన్యాల ధరల సూచీ మార్చిలో 12.6 శాతం పెరిగి 159.3 పాయింట్లకు చేరిందని తెలిపింది. రష్యా సేనలు వైదొలిగిన సుమి నగరంలో ప్రజలు అపమ్రత్తంగా ఉండాలని స్థానిక గవర్నర్ సూచించారు. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంపై రష్యా దృష్టి సారిస్తోందని బ్రిటన్ రక్షణ మంత్రి అంచనా వేశారు. దేశ రక్షణకు విఘాతం కలిగిస్తున్నారంటూ 15 మంది రష్యన్లను డెన్మార్క్ బ్లాక్లిస్ట్లో పెట్టింది. రష్యాకు చెందిన అతిపెద్ద మిలటరీ షిప్ బిల్డింగ్, డైమండ్ మైనింగ్ కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది. అకారణంగా ప్రాణాలు కోల్పోయిన అమాయక ప్రయాణికులు -
మహిళతో అసభ్యకర ప్రవర్తన.. పోలీసును చెప్పుతో కొట్టిన వీరనారి..
లక్నో: అతనో పోలీస్.. ప్రజలకు రక్షణగా ఉండాల్సిందిపోయి.. తాగిన మైకంలో ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమెను బలంగా తోసేశాడు.. చివరకు ఆమె వీరనారిలా పోరాడింది. అందరూ చూస్తుండగానే పోలీసును తన చెప్పుతో చితకబాదింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఓ పోలీస్ కానిస్టేబుల్ మద్యం సేవించి హల్ చల్ చేశాడు. చార్ బాగ్ రైల్వే స్టేషన్లో ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె ప్రతిఘటనకు దిగింది. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడు, మహిళపై తన ప్రతాపం చూపించాడు. లాఠీతో దారుణంగా కొట్టాడు. ఈ క్రమంలో మహిళను తోసివేయగా ఆమె కిందపడిపోయింది. అనంతరం పైకి లేచిన సదరు మహిళ.. పోలీసులపై చెప్పుతో దాడికి దిగింది. ఈ సందర్భంలో వారి పక్కనే ఉన్న మరో మహిళా పోలీస్.. అతడిని వారిస్తున్న అదేమీ పట్టించుకోకుండా వారిపై కానిస్టేబుల్ దాడి చేస్తూనే ఉన్నాడు. ఇంతలో ఇతర పోలీసులు వచ్చి అతడిని అడ్డుకొని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ తతంగమంతా అక్కడ ఉన్న ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వీడియో వైరల్గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. Drunk Black Sheep Beaten By Brave People. Sometimes We Need To Fight With Powerful To Raise Our Voice. Incident : Lucknow's Char Bagh station pic.twitter.com/KCPR2XBK2I — Binita Bhil (@BhilBinita) March 18, 2022