
భాగ్యనగరం సిగలో ముస్తాబైన మరో మణిహారం ప్రారంభానికి సిద్ధమైంది. సుమారు రూ. 413 కోట్ల వ్యయంతో, పర్యావరణ అనుకూలంగా నిర్మించిన చర్లపల్లి నూతన రైల్వే టెర్మినల్ను ప్రధాని మోదీ సోమవారం మధ్యాహ్నం 12:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు

ప్రయాణికుల రాకపోకలకు అనుగుణంగా ఆధునిక హంగులతో చర్లపల్లి రెండవ ప్రవేశద్వారం, నూతన రైల్వే టెర్మినల్ను అభివృద్ధి చేశారు

స్టేషన్లో 6 టికెట్ బుకింగ్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. స్త్రీ, పురుషులకు ప్రత్యేక విశ్రాంతి గదులు ఉన్నాయి

ఒక ప్లాట్ఫాం నుంచి మరో ప్లాట్ఫాంకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రాకపోకలు సాగించేందుకు వీలుగా 12 మీటర్ల వెడల్పుతో ఒక ఫుట్ఓవర్ బ్రిడ్జితోపాటు 6 మీటర్ల వెడల్పుతో మరో బ్రిడ్జిని ఏర్పాటు చేశారు

మొత్తం 9 ప్లాట్ఫాంలలో 7 లిఫ్టులు, 6 ఎస్కలేటర్లు ఉన్నాయి. రైళ్ల నిర్వహణ కోసం ఆధునిక కోచ్ డిపోను కూడా నిర్మించారు. బస్బే తోపాటు కార్లు, బైక్లను నిలిపేందుకు విశాల పార్కింగ్ సదుపాయం కల్పించారు













