cherlapally
-
చర్లపల్లి పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్: చర్లపల్లి పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ కెమికల్ కంపెనీలో మంటలు ఒక్కసారిగా చెలరేగి భారీగా ఎగిసిపడ్డాయి. కంపెనీలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో కెమికల్ వాసనలు చుట్టుపక్కలకు వ్యాపించాయి. రియాక్టర్లు పేలడంతో ఓ బిల్డింగ్ కుప్పకూలినట్లు తెలుస్తోంది. దాంతో పాటు కెమికల్ వాసనలకు భరించలేక స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. ఆరు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేస్తున్నారు. -
హైదరాబాద్ : ముస్తాబైన మరో మణిహారం..చర్లపల్లి నూతన రైల్వే టెర్మినల్ (ఫొటోలు)
-
చర్లపల్లికి చేరేదెలా!
సాక్షి, సిటీబ్యూరో/కుషాయిగూడ: చర్లపల్లి టెర్మినల్ సిద్ధమైంది. ఈ నెలాఖరుకు లేదా వచ్చే సెప్టెంబరు మొదటి వారంలో ప్రారంభించేందుకు దక్షిణమధ్య రైల్వే సన్నాహాలు చేపట్టింది. కానీ ఈ స్టేషన్కు ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు ఇప్పటి వరకు రవాణా సదుపాయాలు మాత్రం అందుబాటులోకి రాలేదు. ఎంఎంటీఎస్ రెండో దశ పనులు పూర్తయినప్పటికీ వివిధ మార్గాల్లో చర్లపల్లికి చేరుకొనేందుకు ఎలాంటి సర్వీసులను ప్రారంభించలేదు. అలాగే.. ఆర్టీసీ సేవలు కూడా వినియోగంలోకి రాలేదు. చర్లపల్లి స్టేషన్కు చేరుకొనేందుకు రెండు మార్గాల్లో రోడ్ల విస్తరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆయా విభాగాల మధ్య సమన్వయలోపం కారణంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా రోడ్ల అభివృద్ధి, విస్తరణ పనులు నిలిచిపోయాయి. దీంతో నగరంలోనే నాలుగో టెర్మినల్గా వినియోగంలోకి రానున్న చర్లపల్లికి ప్రయాణికులు చేరుకోవడం ప్రశ్నార్థకంగా మారింది. అత్యాధునిక సదుపాయాలతో.. సుమారు రూ.430 కోట్లతో చర్లపల్లి టెర్మినల్ను అభివృద్ధి చేశారు. లిఫ్టులు, ఎస్కలేటర్లు, బుకింగ్ కేంద్రాలు, 9 ప్లాట్ఫాంలు తదితర అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన చర్లపల్లి టెర్మినల్ నుంచి నిత్యం సుమారు 50 రైళ్లు రాకపోకలు సాగించేందుకు అవకాశం ఉంది. కానీ మొదట 25 రైళ్లతో స్టేషన్ను వినియోగంలోకి తేనున్నారు. కృష్ణా ఎక్స్ప్రెస్, శబరి, శాతవాహన తదితర రైళ్లను చర్లపల్లి నుంచి నడపనున్నట్లు రైల్వేబోర్డు ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ క్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణికులు చేరుకొనేందుకు ఎలాంటి సదుపాయాలు లేకపోవడం గమనార్హం. ఎంఎంటీఎస్ ఎప్పుడు? ఎంఎంటీఎస్ రెండో దశ పనులు పూర్తయ్యాయి. మేడ్చల్ నుంచి బొల్లారం మీదుగా ఫలక్నుమా, ఉందానగర్ వరకు, లింగంపల్లి నుంచి తెల్లాపూర్ వరకు, సనత్నగర్ నుంచి మౌలాలీ మీదుగా చర్లపల్లి, ఘట్కేసర్ వరకు అన్ని మార్గాల్లో పనులు పూర్తి చేసినప్పటికీ ఎంఎంటీఎస్ సరీ్వసులు మాత్రం అందుబాటులోకి రాలేదు. టెర్మినల్ ప్రారంభమైతే లింగంపల్లి చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు కూడా ఎంఎంటీఎస్లో నేరుగా చర్లపల్లికి చేరుకొని అక్కడి నుంచి ప్రధాన రైళ్లలో బయలుదేరేందుకు అవకాశం ఉంటుంది. ఇటు మేడ్చల్, మల్కాజిగిరి, అటు కాచిగూడ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు కూడా చర్లపల్లికి చేరేలా ఎంఎంటీఎస్ సేవలను విస్తరించాల్సి ఉంది. రెండో దశలో నిర్మించిన మార్గాల్లో ప్రస్తుతం మేడ్చల్– ఫలక్నుమా, లింగంపల్లి–తెల్లాపూర్, మేడ్చల్–లింగంపల్లి తదితర రూట్లలో ఉదయం, సాయంత్రం మాత్రమే పరిమితంగా రైళ్లు నడుస్తున్నాయి. గతంలో రోజుకు 121 సర్వీసులు నడిస్తే ఇప్పుడు వాటి సంఖ్య 78కి తగ్గింది. మరోవైపు సికింద్రాబాద్ – చర్లపల్లి, మేడ్చల్– మల్కాజిగిరి– చర్లపల్లి, కాచిగూడ–చర్లపల్లి తదితర మార్గాల్లో సరీ్వసులను ప్రారంభించాలంటే మరిన్ని రైళ్లు అవసరం. కానీ ఈ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రణాళికలు లేవు. విస్తరణకు నోచుకోని రహదారులు.. నగరంలోని వివిధ మార్గాల్లో సుమారు 40 కిలోమీటర్ల పరిధి నుంచి ప్రయాణికులు చర్లపల్లికి చేరుకొనేందుకు రెండు ప్రధాన రహదారులు ఉన్నాయి. మహాలక్ష్మీనగర్ కాలనీ నుంచి చర్లపల్లి రైల్వేస్టేషన్ వరకు ఉన్న 40 ఫీట్ల పాత రోడ్డును 80 ఫీట్లకు విస్తరించాల్సి ఉంది. అలాగే.. చర్లపల్లి టెర్మినల్ ముఖద్వారం నుంచి ఐఓసీఎల్ను కలుపుతూ మరో 100 ఫీట్ల రోడ్డును విస్తరించాలని ప్రతిపాదించారు. ఈమేరకు జీహెచ్ఎంసీ అధికారులు సర్వేలు నిర్వహించారు. మహాలక్ష్మినగర్ రోడ్డును విస్తరించేందుకు 15 చోట్ల ఆస్తులను తొలగించాల్సి ఉంటుందని గుర్తించారు. ఆస్తులు కోల్పోయిన వారికి టీడీఆర్లు, పరిహారం చెల్లింపునకు కాప్రా మున్సిపల్ అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. స్థలాలు, ఆస్తులను ఇచ్చేందుకు కాలనీవాసులు సుముఖంగా లేకపోవడంతో రోడ్డు విస్తరణ పెండింగ్లో పడిపోయింది. ఈ మార్గంలో భూసేకరణపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. మరోవైపు చర్లపల్లి టెర్మినల్ ముఖద్వారం నుంచి ఐఓసీఎల్ రోడ్డును కలుపుతూ ప్రతిపాదించిన 100 ఫీట్ల రోడ్డు విస్తరణలో 80 శాతం భూములను అటవీశాఖ నుంచి, మరో 20 శాతం భూములను చర్లపల్లి ఐలా నుంచి సేకరించాల్సి ఉంది. గత మార్చి నెలలో రోడ్డు నిర్మాణానికి స్థలాలు ఇవ్వాలని కోరుతూ జీహెచ్ఎంసీ అధికారులు అటవీశాఖ అధికారులు, ఐలా అధికారులకు లేఖలు రాసినట్లు సమాచారం. కానీ ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఈ రోడ్డు నిర్మాణ పనులు కూడా స్తంభించాయి. కొరవడిన సమన్వయం.. అప్రోచ్ రోడ్ల నిర్మాణం చేయకుండానే చర్లపల్లి టెర్మినల్ ప్రారంభమైతే పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. సకాలంలో స్టేషన్కు చేరుకోవడం కూడా కష్టమే. వివిధ విభాగాల మధ్య సమన్వయం కొరవడడంతోనే రోడ్ల నిర్మాణం ముందుకు సాగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమతుల కోసం నిరీక్షిస్తున్నాం.. చర్లపల్లి రైల్వే టెర్మినల్ అప్రోచ్ రోడ్ల నిర్మాణ స్థల సేకరణకు చర్యలు తీసుకున్నాం. స్థల యజమానులకు నోటీసులు కూడా అందజేశాం. నివేదికలను భూసేకరణ అధికారులకు, జిల్లా కలెక్టర్కు, జీహెచ్ఎంసీకి పంపించాం. ప్రస్తుతం వారి పరిశీలనలో ఉంది. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచి్చన వెంటనే రోడ్ల నిర్మాణం చేపడతాం. – ముకుంద్రెడ్డి, కాప్రా డిప్యూటీ కమిషనర్ -
చర్లపల్లిలో భారీ పేలుడు.. కారణం ఇదే..
సాక్షి, హైదరాబాద్: చర్లపల్లిలో భారీ పేలుడు సంభవించింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో పేలుడు ధాటికి మ్యాన్ హోల్ మూత ఎగిరిపడింది. భారీ శబ్ధం రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మధుసూదన్రెడ్డి నగర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పరిశ్రమల వ్యర్థాలను డ్రైనేజీలోకి వదలడంతో ఈ పేలుడు సంభవించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
మేకులు మింగిన ఖైదీ.. ఆసుపత్రి బాత్రూం నుంచి తప్పించుకుని..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : మేకులు (స్క్రూలు) మింగిన ఓ రిమాండ్ ఖైదీని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా సెంట్రీ కళ్లు గప్పి పరారైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వరంగల్ జిల్లా రాయపర్తికి చెందిన సీహెచ్.అరవింద్ పలు దొంగతనం కేసుల్లో నిందితుడు. అతడిని కాకతీయ యూనివర్సిటీ పోలీసులు అరెస్టు చేయగా, ఖమ్మం జైలులో రిమాండ్లో ఉన్నాడు. హైదరాబాద్లోని కూకట్పల్లిలో జరిగిన ఓ దొంగతనం కేసులో పీటీ వారెంట్పై తీసుకువచ్చిన పోలీసులు సంగారెడ్డి సెంట్రల్ జైలుకు రిమాండ్ నిమిత్తం తరలించారు. అరవింద్ శనివారం జైలులో మేకులు మింగడంతో జైలు అధికారులు చికిత్స నిమిత్తం సంగారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు మేల్ సర్జికల్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి బాత్రూంకు వెళ్లి వస్తానని చెప్పిన అరవింద్ బాత్రూంలో ఉన్న కిటికీ ఊచను తొలగించి అందులోంచి పరారైనట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు సంగారెడ్డిటౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. పరారీలో ఉన్న అరవింద్ను పట్టుకునేందుకు మూడు బృందాలను నియమించినట్లు పోలీసులు తెలిపారు. అరవింద్పై తొమ్మిది కేసులు ఉన్నాయి. జైలులో మేకులెలా దొరికాయి? సంగారెడ్డి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అరవింద్కు జైలులో మేకులు ఎలా దొరికాయనేది ప్రశ్నార్థకంగా మారింది. జైలులో ఉండే స్విచ్బోర్డుకు ఉన్న స్క్రూలను మింగినట్లు జైలు అధికారులు భావిస్తున్నారు. అరవింద్ కడుపు నొస్తుందని జైలు అధికారులకు చెప్పగా అతడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు ఎక్స్రే తీయడంతో ఆయన కడుపులో రెండు మేకులు ఉన్నట్లు గుర్తించారు. అబ్జర్వేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో సెంట్రీ విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే అరవింద్ తప్పించుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. రిమాండ్ ఖైదీలు బాత్రూం వెళితే తప్పనిసరిగా చేతులకు గొలుసులు వేయాల్సి ఉంటుంది. అయితే ఏఆర్ పోలీసుల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అరవింద్ పరారైనట్లు పోలీసులు భావిస్తున్నారు. -
టీఆర్ఎస్లో భగ్గుమన్న వర్గపోరు.. కన్నీటి పర్యంతమైన కార్పొరేటర్
సాక్షి, మేడ్చల్ జిల్లా: కుషాయిగూడ ధోబీఘాట్ వేదికగా టీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు మరోసారి భగ్గుమంది. ప్రొటోకాల్ అంశంలో తలెత్తిన వివాదం చినికి చినికి గాలివానలా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, మాజీ మేయర్ బొంతు రాంమోహన్ వర్గాల నడుమ ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నియోజకవర్గంలో రెండు వర్గాలు విడిపోయి తమ కార్యక్రమాలను కొనసాగిస్తూ వస్తున్నాయి. సమయం వచ్చినప్పుడల్లా బలాలను ప్రదర్శించుకుంటూ ఎవరి ఆధిపత్యాన్ని వారు చాటుతున్నారు. ఈ క్రమంలో ఎవరితో ఉండాలో తేల్చుకోలేక నాయకులు, కార్యకర్తలు సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. సోమవారం కుషాయిగూడలో ఆధునిక యాంత్రిక ధోబీఘాట్ ప్రారంభోత్సవం సందర్భంగా తనకు అవమానం జరిగిందని స్థానిక కార్పొరేటర్ మీడియా ముందుకు వచ్చి గోడు వెళ్లబోసుకోగా.. ప్రొటోకాల్ తనకు సంబంధించిన అంశం కాదని అది అధికారుల చూసుకుంటారంటూ ఎమ్మెల్యే చెప్పారు. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి కన్నీటి పర్యంతమైన కార్పొరేటర్ బొంతు శ్రీదేవి మహిళా కార్పొరేటర్నైన తనను ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అడుగడుగునా అవమానపరుస్తున్నారని చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ఆరోపించారు. ఒక మహిళనని చూడకుండా గడిచిన మూడేళ్లుగా అనేక అవమానాలకు గురిచేస్తూ వస్తున్నారని ఆవేదన చెందుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ మేరకు సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఉప్పల్ నియోజకవర్గంలో ఏ డివిజన్లో లేని విధంగా ఎమ్మెల్యే చర్లపల్లి డివిజన్లో కార్పొరేటర్ ప్రమేయం లేకుండానే అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చదవండి: ఎమ్మెల్యేలకు ఎర కేసు: ‘బండి సంజయ్ పేరు చెప్పాలని వేధిస్తున్నారు ’ ఈ క్రమంలో అధికారులపై ఒత్తిడి చేస్తూ ప్రొటోకాల్ సమస్యకు తెరలేపుతూ తనకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. అంతటితో ఆగకుండా తనను కులం పేరుతో దూషిస్తూ అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ మహిళనైన తనను అంతటా అవమానపరుస్తూనే ఉన్నారని ఆవేదన చెందారు. ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలను అధిష్టానానికి అందజేస్తానన్నారు. తాజాగా కుషాయిగూడ ధోబీఘాట్ ప్రారంభోత్సవం సందర్భంగానూ తనను అగౌరవపరిచినట్లు తెలిపారు. ఉదయం 9 నుంచి 10:30 గంటల వరకు ధోబీఘాట్ వద్దే తాను ఉన్నానని తెలిపారు. మంత్రి మల్లారెడ్డి రావడం మరో అరగంట సమయం ఉందని నిర్వాహకులు చెప్పడంతో పూలే వర్ధంతి సభలో పాల్గొనేందుకు వెళ్లి వచ్చేలోపు మంత్రి, ఎమ్మెల్యే ధోబీఘాట్ యంత్రాన్ని ప్రారంభించి వెళ్లిపోయారని ఆమె చెప్పారు. స్థానిక కార్పొరేటర్ ప్రస్తావన లేకుండా నిమిషాల వ్యవధిలో ప్రారంభించి వెళ్లి తనను అవమానపరిచారని ఆవేదన చెందారు. ఈ విషయంపై ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డిని వివరణ కోరగా.. కార్పొరేటర్ బొంతు శ్రీదేవి తనపై చేసిన ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు. అవి పూర్తి అసత్యాలని కొట్టి పడేశారు. -
Hyderabad: నాగారం, ఘట్కేసర్, దమ్మాయిగూడలో లింక్ రోడ్లు
సాక్షి, హైదరాబాద్: నగర శివార్లలోని రహదార్లకు మహద్భాగ్యం కలుగనుంది. నగరానికి తూర్పున ఉన్న మేడ్చల్ జిల్లా పరిధిలోని దమ్మాయిగూడ, జవహర్నగర్, నాగారం, ఘట్కేసర్ స్థానికసంస్థల పరిధిలో 4 లేన్లు, 6 లేన్లతో విశాలమైన రహదారులు రానున్నాయి. ఇన్నర్ రింగ్రోడ్, ఔటర్రింగ్ రోడ్కు అనుసంధానంగా ప్రజల సాఫీ ప్రయాణానికి లింక్, స్లిప్రోడ్లలో భాగంగా ప్రభుత్వం ఇటీవల 104 రోడ్ల పనులకు నిధులు మంజూరు చేస్తూ పరిపాలన అనుమతులు జారీ చేసింది. వాటిల్లో 50 రోడ్ల పనుల్ని ప్రాధాన్యతతో చేపట్టాల్సిందిగా సూచించింది. ఐదు ప్యాకేజీలుగా.. మొత్తం ఐదు ప్యాకేజీలుగా పనులకు నిధులు మంజూరు చేయగా వాటిల్లో మూడో ప్యాకేజీలోని 13 కారిడార్ల (రోడ్ల) పనులు చేసేందుకు హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఆర్డీసీఎల్) టెండర్లు ఆహ్వానించింది. వీటి అంచనా వ్యయం రూ.293.55 కోట్లు. ఏడాదిలోగా పనులు పూర్తిచేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అవసరమైన భూసేకరణ, యుటిలిటీస్ షిఫ్టింగ్ వంటి పనులు లేని ప్రాంతాల్లో రోడ్ల పనులు వేగంగా జరగనున్నాయి. వీటికి అవసరమైన నిధుల్ని హెచ్ఎండీఏ ఇవ్వనున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. టెండర్లు పిలిచిన రోడ్ల వివరాలు.. దమ్మాయిగూడ మునిసిపాలిటీలో.. ► దమ్మాయిగూడ రోజ్గార్డెన్ ఫంక్షన్హాల్ నుంచి నాగారం రోడ్ (ఈసీఐఎల్ను కలుపుతూ): 2.80 కి.మీ.లు. ► చీర్యాల జేఎన్ఎన్యూఆర్ఎం హౌసింగ్ కాలనీ నుంచి అహ్మద్గూడ: 1.70 కి.మీ.లు. జవహర్నగర్ కార్పొరేషన్లో.. ► ఫైరింగ్ కట్ట నుంచి ఎన్టీఆర్ విగ్రహం రోడ్ వరకు: 2.10 కి.మీ.లు ► ఎన్టీఆర్ విగ్రహం నుంచి దమ్మాయిగూడ రోడ్ (మునిసిపల్ పరిధి వరకు ): 1.90 కి.మీ.లు ► ఎన్టీఆర్ విగ్రహం నుంచి డంపింగ్ యార్డ్ వరకు: 2.35 కి.మీ.లు ► ఎన్టీఆర్ విగ్రహం నుంచి వంపుగూడ రోడ్ వరకు: 1.20 కి.మీ.లు నాగారం మునిసిపాలిటీలో.. ► రాంపల్లి క్రాస్రోడ్స్ నుంచి సర్వే నెంబర్ 421 వరకు(హెచ్పీ పెట్రోల్పంప్ దగ్గర) : 3.90 కి.మీ.లు. ► సర్వే నెంబర్ 421 (హెచ్పీ పెట్రోల్పంప్ దగ్గర)నుంచి యామ్నాంపేట (నాగారం మునిసిపాలి టీ సరిహద్దు వరకు): 3.10 కి.మీ.లు. ► చర్లపల్లి నుంచి ఓఆర్ఆర్ సర్వీస్రోడ్ వరకు( వయా కరీంగూడ ): 3.80 కి.మీ.లు ► యామ్నాంపేట ఫ్లైఓవర్ నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వరకు: 2.60 కి.మీ.లు ► చర్లపల్లి బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ నుంచి రాంపల్లి జంక్షన్ వరకు: 3.30 కి.మీ.లు పోచారం మునిసిపాలిటీలో.. ► యామ్నాంపేట నుంచి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ వరకు: 2.10 కి.మీ.లు ఘట్కేసర్ మునిసిపాలిటీలో.. ► శివారెడ్డిగూడ నుంచి మాధవ్రెడ్డి బిడ్జ్రి : 2.50 కి.మీ.లు. ప్రయోజనాలు ఈ రోడ్లు అందుబాటులోకి వస్తే నగరంనుంచి శివారు ప్రాంతాలకు సాఫీ రవాణా సాధ్యమవుతుంది. ప్రజలకు ప్రయాణదూరం, సమయం, ఇంధనవ్యయం తగ్గుతాయి. వాహన కాలుష్యం తగ్గడంతో ప్రయాణాల వల్ల తలెత్తే ఆరోగ్య ఇబ్బందులూ తగ్గుతాయని అధికారులు పేర్కొన్నారు. (క్లిక్: రెండంతస్తుల్లో చర్లపల్లి రైల్వేస్టేషన్ నిర్మాణం) -
2023 నాటికి చర్లపల్లి రైల్వే టెర్మినల్
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ త్వరలో అందుబాటులోకి రానుంది. దీనిని 2023 నుంచి వినియోగంలోకి తెచ్చేవిధంగా పనుల్లో వేగాన్ని పెంచారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఇటీవల చర్లపల్లి రైల్వేస్టేషన్ను సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. నగరంలో నాలుగో టెర్మినల్గా చర్లపల్లి విస్తరణకు దక్షిణ మధ్య రైల్వే అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. ఇది పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తే సుమారు 50 రైళ్ల రాకపోకలకు అవకాశం ఉంటుంది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లపై ప్రయాణికుల ఒత్తిడి తగ్గనుంది. చర్లపల్లి టెర్మినల్ విస్తరణ కోసం రైల్వేశాఖ రూ.220 కోట్ల అంచనాలతో గతేడాది పనులు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది బడ్జెట్లో రూ.70 కోట్లు కేటాయించింది. వివిధ దశల్లో కొనసాగుతున్న పనులను పరిశీలించిన అనంతరం జనరల్ మేనేజర్ సంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో ఇదే వేగాన్ని కొనసాగించాలని, సకాలంలో టెర్మినల్ అందుబాటులోకి వచ్చేవిధంగా కార్యాచరణ ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. తూర్పు వైపు రైళ్లకు హాల్టింగ్ ►సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రోజూ 220 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. సుమారు 2 లక్షలమంది ప్రయాణాలు సాగిస్తున్నారు. దీంతో స్టేషన్లో ఉన్న 10 ప్లాట్ఫామ్లపై రైళ్ల ఒత్తిడి పెరుగుతోంది. శివారు ప్రాంతాల్లో టెర్మినళ్లను విస్తరించాలనే ప్రతిపాదన ముందుకొచ్చింది. ►వట్టినాగులపల్లి, చర్లపల్లిలలో టెర్మినళ్ల విస్తరణకు ప్రణాళికలను రూపొందించినప్పటికీ ప్రస్తుతం చర్లపల్లి స్టేషన్కే దక్షిణ మధ్య రైల్వే ప్రాధాన్యతనిచ్చి పనులను పూర్తిచేస్తోంది. ►చర్లపల్లి టెర్మినల్ వినియోగంలోకి వస్తే మరిన్ని కొత్త రూట్లలో రైల్వేసేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ►కాజిపేట్, విజయవాడ తదితర రూట్లలో రోజూ సుమారు 50 రైళ్లను ఇక్కడి నుంచి నడుపుతారు. తుది దశలో పనులు ►టెర్మినల్ విస్తరణలో భాగంగా ప్లాట్ఫాంలను పొడిగించారు. ►ఎంఎంటీఎస్ రైళ్ల కోసం ఒక ప్రత్యేక ప్లాట్ఫాం ఏర్పాటు చేశారు. ►ప్లాట్ఫాంల ఎత్తుకు అనుగుణంగా పాదచారుల వంతెన విస్తరణ, తాగునీటి వసతులు, విద్యుత్ సదుపాయం ఏర్పాటు చేశారు. ►త్వరలో రోడ్లు, ఇతర సదుపాయాలను పూర్తి చేసి స్టేషన్ను అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు తెలిపారు. -
హైదరాబాదీలకు ఊరట.. నగరంలో మరో రైల్వే టర్మినల్
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో రైల్వే టర్మినల్ అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లపై పెరిగిన ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని గతంలో ప్రతిపాదించిన చర్లపల్లి రైల్వేస్టేషన్ విస్తరణ కోసం కేంద్రం ఈసారి రూ.70 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో తొలిదశ విస్తరణ పనులను చేపట్టనున్నారు. రానున్న రెండేళ్లలో చర్లపల్లి టర్మినల్ను వినియోగంలోకి తెచ్చేందుకు దక్షిణమధ్య రైల్వే కార్యాచరణ చేపట్టింది. తొలిదశలో వచ్చే రెండేళ్లలో పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెచ్చేందుకు దక్షిణమధ్య రైల్వే కార్యాచరణ చేపట్టింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం టెండర్ల ప్రక్రియను పూర్తి చేసినట్లు గురువారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజీవ్ కిషోర్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్కు ఈసారి కేంద్ర బడ్జెట్లో కొత్త రైళ్లు, లైన్లు, ఇతరత్రా ప్రాజెక్టుల కోసం ఎలాంటి నిధులను కేటాయించలేదు. గతంలోనే ప్రతిపాదించిన చర్లపల్లికి మాత్రం ఈసారి నిధులను కేటాయించారు. ఎంఎంటీఎస్ రెండో దశ కోసం రూ.10 లక్షలు కేటాయించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ డెవలప్మెంట్ పనులను కూడా త్వరలో ప్రారంభించనున్నట్లు జీఎం తెలిపారు. భవిష్యత్తులో వందేభారత్ రైళ్లకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉంటుందని, ఇక్కడి నుంచి అన్ని ప్రధాన నగరాలకు, పట్టణాలకు ఈ రైళ్లు నడుస్తాయన్నారు. చర్లపల్లి విస్తరణ ఇలా.. ► మొదటి దశలో రూ.54.58 కోట్ల అంచనాలతో పనులు చేపట్టనున్నారు. రెండు సబ్వేలు, 3 ర్యాంప్లు, 6 చోట్ల మెట్ల మార్గాలను నిర్మిస్తారు. 5 చోట్ల బ్రిడ్జి పనులతో పాటు, 2 హైలెవల్ ఐలాండ్ ప్లాట్ఫామ్లను నిర్మించనున్నారు. ► ఇప్పుడున్న అన్ని ప్లాట్ఫామ్ల ఎత్తు, పొడవు పెంచుతారు. అన్ని ప్లాట్ఫామ్లకు మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయడంతో పాటు, ఓవర్హెడ్ ట్యాంక్ను నిర్మించనున్నారు. మురుగునీటి కాల్వలు, ఇతర పనులను పూర్తి చేస్తారు. (క్లిక్: ప్రతి ఆదివారం.. ప్రాపర్టీ టాక్స్ పరిష్కారం) రెండో దశలో... ► సుమారు రూ.62.67 కోట్ల పనులను చేపట్టనున్న పనుల్లో భాగంగా చర్లపల్లి స్టేషన్ ప్రాంగణం విస్తరణ,సీసీ రోడ్ల నిర్మాణం, విద్యుత్ సబ్స్టేషన్, స్టేషన్ నిర్వహణ షెడ్, తదితర పనులు చేపడతారు. ► 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, 5 ఎస్కలేటర్లు, 9 లిఫ్టులు (వాటిలో 3 సబ్వేల కోసం, 6 ప్లాట్ఫామ్లపైన ఏర్పాటు చేస్తారు). కొత్తగా 4 పిట్లైన్లను నిర్మించనున్నారు. పార్శిల్ షెడ్, బయో టాయిలెట్, తదితర పనులు రెండో దశలో పూర్తి చేయనున్నారు. చర్లపల్లి స్టేషన్ విస్తరణ వల్ల ప్రతి రోజు కనీసం 100 రైళ్లను నిలిపేందుకు అవకాశం లభిస్తుంది. 50 వేల మందికి పైగా ప్రయాణికులకు ప్రయోజనం ఉంటుంది. (చదవండి: హైదరాబాద్ మెట్రోకు వైరస్ బ్రేక్) ఎంఎంటీఎస్కు నిధుల కొరత.. మరోవైపు రక్షణశాఖ పరిధిలో ఉన్న మౌలాలీ– సనత్నగర్ మార్గంలోని 5 కిలోమీటర్లు మినహాయించి ఎంఎంటీఎస్ రెండో దశ పూర్తయిందని జనరల్ మేనేజర్ తెలిపారు. నిధుల కొరత వల్ల రైళ్ల కొనుగోళ్లు నిలిచిపోయినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు రూ.129 కోట్లు మాత్రమే అందాయని, మరో రూ.760 కోట్లు రావాల్సి ఉందని అధికారులు వివరించారు. పెండింగ్ నిధుల కోసం ఇప్పటికే అనేక సార్లు ప్రభుత్వంతో చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. రాష్ట్రం నిధులు ఇస్తే తప్ప ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లబోదన్నారు. యాదాద్రికి ఎంఎంటీఎస్ పొడిగింపు కోసం దక్షిణమధ్య రైల్వే రూ.330 కోట్లతో ప్రణాళికలను రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వం 2/3 వంతు నిధులు ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రాజెక్టుకు కూడా నిధుల కొరతే కారణమని అధికారులు స్పష్టం చేశారు. (క్లిక్: సికింద్రాబాద్ స్టేషన్కు.. ఎయిర్పోర్టు లుక్) -
పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు!
సాక్షి, హైదరాబాద్ : లారీల సమ్మె ప్రభావం పెట్రో ట్యాంకర్లపైనా పడింది. ఐదో రోజున మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 4,500 ఆయిల్ ట్యాంకర్లు నిలిచిపోయాయి. దీంతో అనేక చోట్ల పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. మంగళవారం నుంచి ఆయిల్ ట్యాంకర్లను నిలిపేస్తామని లారీ ఆపరేటర్లు హెచ్చరించడంతో వాహనదారులు సోమవారం బంకుల వద్ద క్యూ కట్టారు. సమ్మె కొనసాగితే గురువారం నాటికి పెట్రోల్ బంకులు పూర్తిగా మూత పడే అవకాశం లేకపోలేదు. పెరిగిన సమ్మె ప్రభావం.. మొదటి నాలుగు రోజులూ తెలంగాణలో లారీల సమ్మె పాక్షికంగా జరిగినా మంగళవారం నుంచి దాని ప్రభావం పెరిగింది. సమ్మె కారణంగా నిత్యావసర సరుకులకు కొంత కొరత ఏర్పడింది. పండ్లు, కూరగాయల ధరలు పెరిగాయి. సమ్మెను బూచీగా చూపించి వ్యాపారులు నిత్యావసర వస్తువుల ధరలు పెంచి దండుకుంటున్నారు. కీలకమైన వ్యవసాయ సీజన్లో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను సరఫరా చేయడానికి సమ్మె అడ్డంకిగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ఎరువులు, విత్తనాల సరఫరా నిలిచిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల యూరియా సరఫరాకూ అడ్డంకులు ఏర్పడ్డాయి. వ్యవసాయ శాఖ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అయితే, విమానాల కోసం ఉపయోగించే ఇంధన సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూస్తామని ఆపరేటర్లు హామీ ఇచ్చినట్లు తెలిసింది. సమ్మెలో 90 లక్షల లారీలు: శ్రీనివాస్గౌడ్ లారీల సమ్మెకు సంఘీభావంగా హైదరాబాద్ చర్లపల్లిలోని ఇండియన్ ఆయిల్, భారత్, హెచ్పీ పెట్రోలియం కార్పొరేషన్ల వద్ద లారీ ఓనర్స్, ట్యాంక్ ట్రక్ ఓనర్స్ అసోసియేషన్స్ నిర్వహించిన నిరసన కార్యక్రమానికి మహబూబ్నగర్ ఎమ్మెల్యే, తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు వి.శ్రీనివాస్గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లారీల యజమానుల న్యాయమైన డిమాండ్లు నెరవేరేదాకా సమ్మె కొనసాగుతుందన్నారు. దేశవ్యాప్తంగా సమ్మెలో 90 లక్షల లారీలు పాల్గొంటున్నాయన్నారు. సమ్మె కారణంగా లారీలపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్న 10 కోట్ల కుటుంబాలకు ఇబ్బందిగా మారిందని, దీనిని దృష్టిలో ఉంచుకుని వెంటనే సమ్మె విరమణకు కేంద్రం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ, ఏపీ మధ్య లారీల రాకపోకలకు ఉద్దేశించిన సింగిల్ పర్మిట్ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిత్యావసర సరుకుల పంపిణీకి బంద్ నుండి మినహాయింపు ఇచ్చామన్నారు. త్వరలో పెట్రోల్ బంక్ల యజమానులు కూడా బంద్కు మద్దతు తెలిపి పాల్గొంటారన్నారు. తెలంగాణ పెట్రోలియం ట్యాంకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ సీఎస్ సూచనల మేరకు అత్యవసర సర్వీసులను దృష్టిలో ఉంచుకుని ఒక్కరోజే సమ్మె చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్, జనార్దన్, సయ్యద్ అరిఫ్ ఉల్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు. కాగా, చర్లపల్లి, ఘట్కేసర్, రామగుండం, వరంగల్, సూర్యాపేట ఐఓసీ డిపోల్లో ఆయిల్ ట్యాంకర్ అసోసియేషన్లుసమ్మెలో పాల్గొన్నాయి. రూ.150 కోట్లు నష్టం లారీల సమ్మె కారణంగా నిత్యం దాదాపు రూ.25–30 కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెలంగాణ లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు భాస్కర్రెడ్డి తెలిపారు. 5 రోజుల సమ్మె కారణంగా లారీ యజమానులకు రూ.150 కోట్లు నష్టం వచ్చిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ లారీలు నిలిచిపోయినా ఇప్పటివరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తమకు ఆహ్వానం రాలేదన్నారు. ప్రభుత్వాలు స్పందించకపోతే తమకు మద్దతుగా ఆయిల్, పాలు, తాగునీటి ట్యాంకర్లు కూడా సమ్మెలో పాల్గొంటాయని ఆయన స్పష్టంచేశారు. -
చర్లపల్లిలో రైల్వే టెర్మినల్
సాక్షి, హైదరాబాద్ : రైలు ప్రయాణికులకు మరింత ప్రయోజనకరంగా ఉండేందుకు, హైదరాబాద్లోని ప్రధాన రైల్వేస్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు శివార్లలోని చర్లపల్లిలో రైల్వే టెర్మినల్ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. సుమారు 150 రైళ్ల రాకపోకలకు అనుగుణంగా ఆరు ప్లాట్ఫామ్లు, లైన్ల నిర్మాణంతోపాటు ఇతర సదుపాయాలు కల్పించనున్నారు. ఈ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని, నాలుగేళ్లలోగా పూర్తి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (జీఎం) వినోద్కుమార్ యాదవ్ వెల్లడించారు. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రతిపాదనలు స్వీకరించేందుకు రైల్వే అధికారులు బుధవారం హైదరాబాద్లోని రైల్ నిలయంలో ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేశారు. పలువురు ఎంపీలు తమ ప్రతిపాదనలను రైల్వే జీఎం వినోద్కుమార్ యాదవ్కు అందజేశారు. ఈ సందర్భంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేపట్టనున్న పలు ప్రాజెక్టులను గురించి జీఎం వివరించారు. చర్లపల్లి మెగా టెర్మినల్ పనులను రెండు, మూడు నెలల్లో ప్రారంభించి నాలుగేళ్లలో పూర్తి చేస్తామన్నారు. ప్రస్తుతం రైల్వే పరిధిలో ఉన్న 50 ఎకరాలు, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్న 100 ఎకరాల విస్తీర్ణంలో టర్మినల్ చేపట్టనున్నామని, దీనికి సుమారు రూ.360 కోట్లు వ్యయమవుతుందని తెలిపారు. హైదరాబాద్లో నాలుగోది.. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడలలో ప్రధాన రైల్వేస్టేషన్లు ఉన్నాయి. నగరానికి రాకపోకలు భారీగా పెరుగుతుండడంతో వీటిలో రద్దీ తార స్థాయికి చేరుకుంది. రోజూ సుమారు 401 రైళ్లు ఈ మూడు స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రయాణికులు, వారి కోసం వచ్చేవారు కలిపి.. నాలుగైదు లక్షల మంది రోజూ ఈ స్టేషన్లకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండడంతోపాటు, ప్రధాన స్టేషన్లలో రద్దీని తగ్గించేందుకు చర్లపల్లిలో మెగా టెర్మినల్ నిర్మాణాన్ని చేపట్టారు. ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉండడంతో చర్లపల్లిలో రైల్వే టర్మినల్ అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని దీనిని ఎంపిక చేశారు. మొదట ఆరు ప్లాట్ఫారాలతో ప్రారంభించి.. తరువాత 10 ప్లాట్ఫారాల వరకు విస్తరించనున్నారు. పూర్తిగా పర్యావరణహితంగా ఈ స్టేషన్ను అభివృద్ధి చేస్తారు. ఢిల్లీ, విజయవాడ, విశాఖ, తిరుపతి, చెన్నై తదితర మార్గాల్లో రాకపోకలు సాగించే 150 రైళ్లను ఇక్కడి నుంచి నడిపేందుకు అవకాశం ఉంటుంది. అటు ముంబై వైపు నుంచి రైళ్ల ఒత్తిడిని తగ్గించేందుకు వట్టినాగులపల్లిలో మరో భారీ టర్మినల్ నిర్మించే ప్రతిపాదనలు ఉన్నాయని జీఎం వినోద్కుమార్ యాదవ్ తెలిపారు. చర్లపల్లి పనులు ఒక దశకు చేరుకున్న తరువాత వట్టినాగులపల్లి టర్మినల్ నిర్మాణం కూడా ప్రారంభించనున్నట్లు చెప్పారు. డిసెంబర్ నాటికి ఎంఎంటీఎస్ రెండో దశ ఎంఎంటీఎస్ రెండో దశ పనులను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేసి.. పలు మార్గాల్లో రైళ్లను అందుబాటులోకి తేనున్నట్లు జీఎం వినోద్కుమార్ తెలిపారు. గత డిసెంబర్ నాటికే ఈ ప్రాజెక్టులో ఒకట్రెండు లైన్లను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. నిధుల కొరత కారణంగా వాయిదా పడిందని చెప్పారు. ఈ సారి ఎలాంటి జాప్యానికి తావు లేకుండా పూర్తి చేస్తామన్నారు. అలాగే అక్కన్నపేట–మెదక్, మనోహరాబాద్–కొత్తపల్లి, భద్రాచలం–కొత్తపల్లి, సికింద్రాబాద్–మహబూబ్నగర్, మంచిర్యాల–పెద్దపల్లి, కాజీపేట–బల్లార్షా తదితర రైల్వేలైన్లను వచ్చే రెండేళ్లలో పూర్తిచేయనున్నట్లు తెలిపారు. ఇక సికింద్రాబాద్ స్టేషన్పై ఒత్తిడిని తగ్గించేందుకు కొన్ని రైళ్లను లింగంపల్లి, వికారాబాద్ స్టేషన్ల వరకు పొడిగించనున్నట్లు వెల్లడించారు. ఆయా చోట్ల అవసరమైన అదనపు సదుపాయాలు ఏర్పాటు చేస్తామన్నారు. పనుల తీరుపై నిలదీసిన ఎంపీలు రాష్ట్రంలో పలు రైల్వే పనులు జరుగుతున్న తీరుపై ఎంపీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం రైల్వే జీఎంతో జరిగిన సమావేశంలో ఎంపీలు బండారు దత్తాత్రేయ, మల్లారెడ్డి, కొండా విశేశ్వర్రెడ్డి, బూర నర్సయ్య, ఎంపీ వినోద్, బాల్క సుమన్, గుత్తా సుఖేందర్రెడ్డి, నంది ఎల్లయ్య, కె.కేశవరావు, రాపోలు ఆనందభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని ప్రాజెక్టుల పనులు దశాబ్దాలు గడిచినా ప్రారంభం కావడం లేదని ఈ సందర్భంగా మండిపడ్డారు. నల్లగొండ–మాచర్ల లైన్ కోసం 20 ఏళ్లుగా ప్రతిపాదనలు చేస్తున్నప్పటికీ ఒక్క అడుగు ముందుకు పడలేదని, ఇప్పుడా ప్రాజెక్టునే నిలిపేశారని గుత్తా ఆవేదన వ్యక్తం చేశారు. మణుగూరు–రామగుండం, ఆర్మూర్–ఆదిలాబాద్, పెద్దపల్లి–జగిత్యాల తదితర లైన్లను వేగంగా పూర్తి చేయాలని ఎంపీ వినోద్ కోరారు. స్టేషన్ ఘన్పూర్ నుంచి పాలకుర్తి మీదుగా సూర్యాపేట వరకు ప్రతిపాదించిన లైన్పై ఇప్పటికీ సర్వే పూర్తి చేయకపోవడం పట్ల రాపోలు ఆనందభాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్–ఢిల్లీ వంటి దూర ప్రాంత రైళ్లకు డిమాండ్ తగ్గుతున్న నేపథ్యంలో అంతర్రాష్ట్ర సర్వీసులకు ప్రాధాన్యతనివ్వాలని కొండా విశ్వేశ్వర్రెడ్డి కోరారు. అన్ని ప్రధాన రైళ్లను భువనగిరి, జనగామలో ఆపేలా చర్యలు తీసుకోవాలని బూర నర్సయ్య కోరారు. పెద్దపల్లి, బెల్లంపల్లి, మంచిర్యాల, మందమర్రి తదితర స్టేషన్లను ఆధునీకరించాలని బాల్క సుమన్ విజ్ఞప్తి చేశారు. -
నయీమ్ అనుచరలు విడుదల
హైదరాబాద్: పోలీసుల ఎన్కౌంటర్లో మృతిచెందని గ్యాంగ్స్టర్ నయీమ్ ఇద్దరు అనుచరులు ఆదివారం చర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. చిన్నకోడూరు వ్యాపారిని బెదిరించిన కేసులో శిక్ష అనుభవిస్తున్న గుడికందుల కృష్ణారెడ్డి, తోగుంట అంజయ్యలకు సిద్దిపేట కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో.. వీరు ఈ రోజు జైలు నుంచి విడుదలయ్యారు. -
శిక్షణ
-
చర్లపల్లి జైలులో ఖైదీ ఆత్మహత్య
హైదరాబాద్: చర్లపల్లి జైలులో ఓ రిమాండ్ ఖైదీ బలవన్మరణం చెందాడు. దొంగతనం నేరంపై అరువు దీపక్ అనే నిందితుడు ఫిబ్రవరి నుంచి జైలులో ఉన్నాడు. అతడు శనివారం ఉదయం తన సెల్లోని ఫ్యాన్కు టవల్తో ఉరి వేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత జైలు సిబ్బంది అతడిని గమనించి, కిందికి దించేసరికే అతను మృతి చెందాడు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
యాదాద్రికి ఎంఎంటీఎస్!
చర్లపల్లి వద్ద భారీ టెర్మినల్ ప్రతిపాదనలు రూపొందిస్తున్న రైల్వేశాఖ రానున్న బడ్జెట్లోనే ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు రాష్ర్ట ప్రతిపాదనలపై కేంద్రం సుముఖత సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి వరకు ఉద్దేశించిన ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టును భువనగిరి నుంచి రాయగిరి వరకు పొడిగించేందుకు రైల్వేశాఖ ప్రతిపాదనలు రూపొందిస్తోంది. అలాగే చర్లపల్లిలో అతిపెద్ద ప్రయాణికుల టెర్మినల్ను నిర్మించాలని భావిస్తోంది. ఈ నెలలో ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్లోనే ఈ రెండు ప్రాజెక్టులను చేర్చడంతో పాటు, నిధులను కేటాయించేందుకు సన్నాహాలు చేపట్టింది. హైదరాబాద్ నుంచి యాదాద్రికి వెళ్లే భక్తుల కోసం ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టును రాయగిరి వరకు పొడిగించాలని కోరుతూ ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి లేఖ రాసిన నేపథ్యంలో రైల్వేశాఖ ఈ చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లపై ఒత్తిడి పెరిగినందున చర్లపల్లి, వట్టినాగులపల్లి వద్ద మరో రెండు టెర్మినళ్లు నిర్మించాలన్న ప్రతిపాదనను కూడా రైల్వేశాఖ ఆమోదించనుంది. అయితే మొదట చర్లపల్లి టెర్మినల్ నిర్మాణానికి మాత్రం ప్రాధాన్యం ఇవ్వనున్నారు. దీంతో సికింద్రాబాద్ స్టేషన్పై ప్రయాణికుల ఒత్తిడి తగ్గనుంది. ఎంఎంటీఎస్ పొడిగింపుతోపాటు రైల్వే టెర్మినళ్ల నిర్మాణానికి మౌలిక సదుపాయాలు కల్పించడం, రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా అందజేసేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ ఈ రెండు ప్రాజెక్టులను సీరియస్గా పరిశీలిస్తోంది. ఇటీవలే దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ ఈ ప్రాజెక్టులపై చర్చించారు. తొలగనున్న అడ్డంకులు పటాన్చెరు, ఘట్కేసర్, ఉందానగర్, శంషాబాద్ వంటి నగర శివార్లను కలుపుతూ మొత్తం 6 మార్గాల్లో రెండేళ్ల క్రితం ప్రారంభించిన ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టు పనుల్లో వేగం పెరగనుంది. రాయగిరి వరకు ఎంఎంటీఎస్ను పొడిగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన నేపథ్యంలో ప్రస్తుతం ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అడ్డంకులు తొలిగిపోయే అవకాశం ఉందని దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. మౌలాలీ నుంచి సనత్నగర్ మధ్యలోని డిఫెన్స్ ఏరియాలో 5 కిలోమీటర్ల మేర పనులు నిలిచిపోయాయి. అలాగే నగరంలో మరో 50 చోట్ల జీహెచ్ఎంసీ నుంచి అనుమతి లభించాల్సి ఉంది. ప్రస్తుతం రైల్వేశాఖ, రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నందున రైల్వేలై న్ల నిర్మాణానికి ఆటంకాలు తొలగిపోనున్నాయి. మౌలాలి-ఘట్కేసర్, మౌలాలి-సనత్నగర్, సనత్నగర్-పటాన్చెరు, తెల్లాపూర్-పటాన్చెరు, ఫలక్నుమా-ఉందానగర్ , ఉందానగర్-శంషాబాద్ విమానాశ్రయం వరకు ఆరు మార్గాల్లో రూ.850 కోట్లతో రెండో దశ ను ప్రారంభించారు. ఉందానగర్-శంషాబాద్ మార్గంలో తప్ప మిగతా అన్ని మార్గాల్లో పనులు జరుగుతున్నాయి. కొత్తలైన్లు, డబ్లింగ్, విద్యుదీకరణ, కొత్త స్టేషన్ల నిర్మాణం తదితర పనుల వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం 2/3 వంతు నిధులను అందజేస్తుంది. శివార్లలోనే నిలిచిపోతున్న రైళ్లు సికింద్రాబాద్ నుంచి ప్రతిరోజు ఎక్స్ప్రెస్లు, ప్యాసింజర్లు, ఎంఎంటీఎస్ రైళ్లు అన్నీ కలిపి సుమారు 200 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. రద్దీ అధికంగా ఉండే రోజుల్లో 2.5 లక్షల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. సికింద్రాబాద్ స్టేషన్పై పెరిగిన ఒత్తిడి దృష్ట్యా చాలా రైళ్లు నగర శివార్లలోనే నిలిచిపోతున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే చర్లపల్లి, వట్టినాగులపల్లిలో టెర్మినల్స్ నిర్మించాలని రైల్వేశాఖ ప్రతిపాదించింది. దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్గా రవీంద్ర గుప్తా బాధ్యతలు చేపట్టిన మొదట్లోనే చర్లపల్లి రైల్వేస్టేషన్ను పరిశీలించి రైల్వేబోర్డుకు ప్రతిపాదనలు అందజేశారు. -
చర్లపల్లిలో రూ. 4 లక్షలు పట్టివేత
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో నగర శివారు ప్రాంతం చర్లపల్లిలో పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా వాహనంలో అక్రమంగా తరలిస్తున్న రూ. 4 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అందుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్కి తరలించి... విచారిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నగరంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే. -
చేపల చెరువులో మొసలి!!
-
అంతరంగాలు.
-
చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలు నుంచి ఖైదీ పరార్
హైదరాబాద్ : చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలు నుంచి నర్సింహులు(32) అనే ఖైదీ గురువారం పరారయ్యాడు. మహబూబ్నగర్ జిల్లా ఫరూక్నగర్ మండలం రంగంపల్లికి చెందిన నర్సింహులు ఓ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇంకో ఏడాదిలో శిక్ష పూర్తి అవుతుండగా ఇంతలోనే జైలు నుంచి పరారయ్యాడు. పోలీసులు నర్సింహులు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.