
ఉచిత వై-ఫై
బెంగళూరు: బెంగళూరుతోపాటు కర్ణాటకలోని పలు ప్రాంతాలలో ఉచిత వై-ఫై సదుపాయాన్ని కల్పించడానికి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఫిబ్రవరి నుంచి ఈ సౌకర్యం ప్రజలకు అందుబాటులోకి వస్తుందని ఐటీ శాఖ మంత్రి ఎస్.ఆర్.పాటిల్ చెప్పారు
అయితే కొన్ని పరిమితులకు లోబడి మాత్రమే ఈ సదుపాయాన్ని అందించనున్నట్లు ఆయన తెలిపారు. బెంగళూరులోని 110 ప్రాంతాలతోపాటు అన్ని జిల్లా కేంద్రాలలో మూడు మూడు ప్రాంతాలలో ఉచిత వై-ఫై సదుపాయం కల్పించనున్నట్లు పాటిల్ చెప్పారు.