ప్రేమకు నో చెప్పిందని... అత్యాచారయత్నం | Girl attacked on way to examination centre in West Bengal | Sakshi
Sakshi News home page

ప్రేమకు నో చెప్పిందని... అత్యాచారయత్నం

Published Wed, Feb 10 2016 4:10 PM | Last Updated on Wed, Sep 26 2018 3:23 PM

ప్రేమకు నో చెప్పిందని... అత్యాచారయత్నం - Sakshi

ప్రేమకు నో చెప్పిందని... అత్యాచారయత్నం

కోల్ కతా: పరీక్ష రాసేందుకు వెళ్తోన్న ఓ టీనేజీ విద్యార్థినిపై ఓ అల్లరి మూక దాడిచేయడంతో పాటు అత్యాచారానికి పాల్పడింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని జల్పాయ్ గురి ఏరియాలో మంగళవారం చోటుచేసుకుంది. దాడి చేసిన వారి గ్రూపులో మహిళలు ఉండటం గమనార్హం. పోలీసుల కథనం ప్రకారం... ఓ విద్యార్థిని బోర్డ్ ఎగ్జామ్ రాసేందుకని దూప్ గురి ఏరియాకి వెళ్తోంది. దారిలో ఓ గ్యాంగ్ ఆ బాలికను అడ్డుకుంది. అందులోని ఓ యువకుడు తనను ప్రేమించాలంటూ అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. ఆ విద్యార్థిని అతడి ప్రేమకు నో చెప్పింది.

ఆవేశానికి లోనైన ఆ గ్యాంగ్ సభ్యులు ఆ విద్యార్థినిపై దాడికి పాల్పడ్డారు. అందులోని ఓ మహిళ బాధిత విద్యార్థినిపై తిట్ల పురాణం మొదలెట్టగా, యువకులు అమెను కొట్టడం ప్రారంభించారు. ఆ తర్వాత విద్యార్థినిపై అత్యాచారయత్నం చేశారు. చివరికి ఆ విద్యార్థిని వారి నుంచి తప్పించుకోగా.. పంచాయతీరాజ్ అధికారి ఆ విద్యార్థినిని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాడు. బాధితురాలు ఆస్పత్రి బెడ్ మీద నుంచే బోర్డ్ ఎగ్జామ్ రాయాల్సి వచ్చింది. మంగళవారం సాయంత్రం ఈ దాడికి పాల్పడ్డ అసలు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు జల్పాయ్ గురి ఎస్పీ ఆకాశ్ మేఘారియా తెలిపారు. బాధితురాలిపై దాడి చేసి అత్యాచారానికి యత్నించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, కేసు విచారణ త్వరగా పూర్తిచేస్తామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement