
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమితులయ్యారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్గా జగదీప్ దంకర్... త్రిపుర గవర్నర్ గా రమేష్ బైస్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనంది బెన్ పటేల్ను ఉత్తరప్రదేశ్ గవర్నర్గా...బిహార్ గవర్నర్గా పనిచేస్తున్న లాల్ జీ టాండన్ను మధ్యప్రదేశ్ గవర్నర్గా కేంద్రం బదిలీ చేసింది. అదే విధంగా బిహార్ గవర్నర్గా పగు చౌహాన్... నాగాలాండ్ గవర్నర్గా ఆర్ ఎన్ రవి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నియామక ఉత్తర్వులు జారీ చేసింది.