'మన వీర ఠాకూర్ను చంపేస్తారంట!' | HP constable Manoj Thakur receives death threat from Pakistan | Sakshi
Sakshi News home page

'మన వీర ఠాకూర్ను చంపేస్తారంట!'

Published Mon, Oct 10 2016 6:43 PM | Last Updated on Sat, Aug 25 2018 3:57 PM

'మన వీర ఠాకూర్ను చంపేస్తారంట!' - Sakshi

'మన వీర ఠాకూర్ను చంపేస్తారంట!'

న్యూఢిల్లీ: 'ఒక వేళ యుద్ధం వస్తే కశ్మీర్ ఉంటుంది. అది కూడా భారత్ లోనే ఉంటుంది. కానీ పాకిస్థాన్ మాత్రం ఉండదు' అంటూ కశ్మీర్కు సంబంధించి దేశభక్తి పద్య రూపంలో పాక్కు చాలా స్ట్రాంగ్ ఇచ్చిన భారత ప్రాదేశిక సైనిక విభాగంలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ మనోజ్ ఠాకూర్కు బెదిరింపులు వస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది ఉగ్రవాదులే కాకుండా, నేరుగా పాక్ పౌరుల్లో రాడికల్ వర్గానికి చెందినవారు ఆయనకు పరోక్షంగా హెచ్చరికలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఠాకూర్ని త్వరలోనే  చంపేస్తామని ఉగ్రవాదులు బెదిరిస్తున్నాంట.

జమ్ముకశ్మీర్లోని ఉడీ సెక్టార్పై అనూహ్యంగా పాక్ ఉగ్రవాదులు దాడులు చేసి 18మంది వీర జవాన్లను బలితీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన సమయంలోనే హిమాచల్ ప్రదేశ్లోని కిన్నౌర్ ప్రాంతంలో భారత ప్రాదేశిక సైనిక విభాగంలో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న మనోజ్ ఠాకూర్ ఉడీ ఘటనకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సింహం(భారత్) ఎవ్వరికీ భయపడదని, ఈ విషయం పాక్ తెలుసుకుంటే మంచిదంటూ వార్నింగ్ ఇచ్చాడు.

గతంలో భారత్ పలుమార్లు పాక్ను యుద్ధంలో మట్టికరిపించిన సందర్భాలు గుర్తు చేశాడు. కశ్మీర్ ఎప్పటికీ భారత్ లోనే ఉంటుందని, మరోసారి యుద్ధం వస్తే పాక్ మిగలదని, కశ్మీర్ మాత్రం ఉంటుందంటూ ఒక దేశ భక్తి రూప పద్యంలో వీడియో ద్వారా వార్నింగ్ ఇచ్చాడు. ఈ వీడియో పెద్ద వైరల్ అయింది. దీనిని ఇప్పటికే లక్షల మంది వీక్షించారు. దీన్ని చూసిన ఉగ్రవాదులు, పాక్ లోని కొంతమంది రాడికల్ ప్రజలు ఠాకూర్ ను చంపేస్తామంటూ హెచ్చరిస్తున్నారని కథనాలు వస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement