Himachal Pradesh
-
కంగనా రనౌత్ రెస్టారెంట్.. తొలి కస్టమర్గా స్టార్ హీరోయిన్!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ వ్యాపారం రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. తన సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్లో తన బిజినెస్ను ప్రారంభించనుంది. అందమైన పర్వతాల మధ్యలో సరికొత్త రెస్టారెంట్ను ప్రారంభించనున్నట్లు తెలిపింది. మనాలిలో ఏర్పాటు చేయనున్న ఈ రెస్టారెంట్కు ది మౌంటైన్ స్టోరీ అనే పేరును కూడా ఖరారు చేసింది. తన కొత్త రెస్టారెంట్కు మొదటి కస్టమర్గా బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణెను ఆహ్వానించింది కంగనా రనౌత్. హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో ఏర్పాటు చేసిన ది మౌంటైన్ స్టోరీ రెస్టారెంట్ను ఫిబ్రవరి 14న ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ కంగనా ఓ వీడియోను పోస్ట్ చేసింది.ఈ సందర్భంగా రెస్టారెంట్ను తెరవాలనే తన కోరికను వ్యక్తం చేస్తూ తాను గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియోను షేర్ చేసింది. ప్రపంచస్థాయి మెనూను కలిగి ఉండాలనుకునే రెస్టారెంట్ను తెరవాలనుకుంటున్నా అని కంగనా అన్నారు. అదే ఇంటర్వ్యూలో పాల్గొన్న దీపిక పదుకొణె నీ రెస్టారెంట్కు నేనే మీ మొదటి క్లయింట్ అవుతానని చెప్పింది. మరోసారి ఆ వీడియోను షేర్ చేస్తూ దీపికా పదుకొణె నా నా మొదటి కస్టమర్గా వస్తానని ప్రామిస్ చేశావ్ అంటూ కంగనా పోస్ట్ చేసింది. అంతేకాకుండా రెస్టారెంట్ ప్రారంభించడం చిన్ననాటి కల అని వెల్లడించింది. కాగా.. సినిమాల విషయానికొస్తే కంగనా రనౌత్ చివరిగా ఎమర్జెన్సీలో కనిపించింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జన్సీ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీకి కంగనానే దర్శకత్వం వహించారు. View this post on Instagram A post shared by The Mountain Story ( Restaurant ) (@themountainstorytms) -
హిమాలయాల్లో రెస్టారెంట్ ప్రారంభించిన స్టార్ హీరోయిన్
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్(Kangana Ranaut ) హిమాలయాల్లో ఒక రెస్టారెంట్ను ప్రారంభించారు. ది మౌంటెన్ స్టోరీ (The Mountain Story) పేరుతో ఆమె కేఫ్, రెస్టారెంట్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఫిబ్రవరి 14న హిమాచల్ ప్రదేశ్లో ఎంతో పాపులర్ అయిన వంటకాలతో తన రెస్టారెంట్ ప్రారంభం అవుతుందని ఆమె ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియోతో పంచుకున్నారు.రెస్టారెంట్ ప్రారంభించడం అనేది తన చిన్ననాటి కల అని కంగనా తెలిపారు. తన అమ్మగారి వంటగదిలో ఉన్నప్పుడే అందుకు తొలి బీజం పడిందని గుర్తుచేసుకున్నారు. ఆధునిక టచ్తో పాటుగా సాంప్రదాయ హిమాచల్ ఫుడ్ను అందించాలని తాను అనుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇది మీతో నాకున్న రిలేషన్ షిప్ స్టోరీగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. రెస్టారెంట్ వీడియోను కూడా షేర్ చేయడంతో అందులోని ఇంటీరియర్ డిజైన్ గురించి అందరూ మెచ్చుకుంటున్నారు. స్థానిక హిమాచలీ కళాఖండాలతో పాటు సుందరమైన పర్వత దృశ్యంతో బహిరంగ సీటింగ్ వంటి సదుపాయాలు ఉన్నాయని తెలుస్తోంది.పుట్టిన ఊరు మనాలీలో కేఫ్ అండ్ రెస్టారెంట్ ప్రారంభించిన కంగనా తన ప్రాంతంతో ఉన్న అనుబంధాన్ని ఇలా తెలిపారు. 'పర్వతాలు నా ఎముకలు, నదులు నా సిరలు, అడవులు నా ఆలోచనలు, నక్షత్రాలు నా కలలు" అని రాస్తూ.. ఇన్స్టాగ్రామ్లో రెస్టారెంట్ చిత్రాలను కూడా ఆమె పంచుకున్నారు. చుట్టూ పర్వాతల మధ్యలో మంచు పడుతున్న వేళలో అక్కడి ఫుడ్ ఆస్వాదిస్తూ ఉంటే ఆ సంతోషానికి హద్దులు ఉండవని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. త్వరలో తప్పకుండా అక్కడికి వచ్చి రెస్టారెంట్లోని అన్ని వంటకాలను రుచి చూస్తామని, కంగనాకు శుభాకాంక్షలు చెబుతున్నారు. View this post on Instagram A post shared by The Mountain Story ( Restaurant ) (@themountainstorytms) -
తెలంగాణకు ‘హిమాచల్’ విద్యుత్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విద్యుత్ సామర్థ్యాన్ని పెంపొందించడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచనలతో రాష్ట్ర అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వం బూట్ (బిల్డ్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్ఫర్) విధానంలో 22 హైడ్రో ఎలక్ట్రికల్ (జలవిద్యుత్) ప్రాజెక్టుల ఏర్పాటుపై ప్రతిపాదనలు ఆహ్వనించగా.. రాష్ట్ర విద్యుత్ శాఖ అధికారుల బృందం హిమాచల్ప్రదేశ్ను సందర్శించింది. ఈ సందర్భంగా 100 మెగావాట్లకు పైబడిన సామర్థ్యం గల రెండు ప్రాజెక్టుల ఏర్పాటుపై రాష్ట్రం ఆసక్తిని వ్యక్తం చేసింది.ఇందుకు సంబంధించి హిమాచల్ ప్రభుత్వం ఎంఓయూపై సంతకం చేస్తే త్వరితగతిన తగిన తదుపరి చర్యలు తీసుకుంటామని భట్టి విక్రమార్క తెలిపారు. గురువారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, విద్యుత్ శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాతో కలసి ఢిల్లీలో హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్సింగ్తో సమావేశమయ్యారు. ఇందులో తెలంగాణ ప్రభుత్వం నుంచి సెలి (400 మెగావాట్లు), మియార్ (120 మెగావాట్లు) హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టుల నిర్మాణంపై ఆసక్తిని వ్యక్తం చేస్తూ ఒక లేఖను సమర్పించారు.ఈ సందర్భంగా ఎంఓయూ గురించి చర్చించారు. త్వరలోనే దీనిపై ఒక నిర్ణయానికి రావాలని హిమాచల్ సీఎం, భట్టి నిర్ణయించారు. ఇదిలా ఉండగా ఈ ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి అయ్యే జలవిద్యుత్ రాష్ట్రానికి సరఫరా అవుతుంది. ఈ విద్యుత్ వల్ల రాష్ట్ర అవసరాలు, భవిష్యత్ విద్యుత్ డిమాండ్లను తీర్చేందుకు వీలు ఏర్పడుతుందని అధికార వర్గాలు తెలిపాయి. -
ఈ ఆపిల్ ఎక్కడైనా కాస్తుంది!
హిమవత్పర్వత సానువులకే పరిమితమైన ఆపిల్ సాగును మైదానప్రాంతాలకు తీసుకొచ్చారు ఓ సామాన్య రైతు. ఉష్ణమండలప్రాంతాల్లోనూ సాగయ్యే హెచ్ఆర్ఎంఎన్–49 ఆపిల్ వంగడాన్ని రైతు శాస్త్రవేత్త హరిమాన్ శర్మ(Hariman Sharma) అభివృద్ధి చేశారు. హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్ జిల్లాలోని పనియాలా ఆయన స్వగ్రామం. మామిడితో పాటే ఆపిల్ సాగు(Apple Cultivation)... హిమాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, కశ్మీర్ రాష్ట్రాల్లోని కొండలపై మాత్రమే ఆపిల్ వాణిజ్య పంటగా సాగులో ఉంది. చల్లని వాతావరణం ఉన్న ఆ కొండప్రాంతాలు మాత్రమే ఆపిల్ సాగుకు అనుకూలంగా ఉంటాయి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనూ కొండప్రాంతాల్లో మాత్రమే వాతావరణం చల్లగా ఉంటుంది. అందుకే, ఆ రాష్ట్ర రాజధాని సిమ్లా ఆపిల్ సాగులో దేశంలోనే పేరెన్నికగన్నది. కానీ ఆ రాష్ట్రంలోనూ కొండ లోయల్లో, మైదానప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికమే.బిలాస్పూర్ జిల్లా సముద్ర మట్టానికి 1800 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక లోయ ప్రాంతం. అక్కడ ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో రైతులు మామిడి తోటలను విస్తారంగా సాగు చేస్తున్నారు. అలాంటి వేడి వాతావరణం ఉన్నప్రాంతంలో తన ఇంటి పెరట్లో ఒక ఆపిల్ మొక్క మొలకెత్తటాన్ని హరిమాన్ శర్మ గమనించారు. పనియాలా లాంటి వేడి వాతావరణంలో ఆపిల్ చెట్టు పెరగటం శర్మను ఆలోచనలో పడేసింది. ఆ మొక్కను అతి జాగ్రత్తగా చూసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఒక ఏడాది గడిచాక ఆ ఆపిల్ చెట్టు నుంచి వచ్చిన కొమ్మలను తీసుకొని రేగు మొక్కతో అంటుకట్టారు. ఆప్రాంతంలో అంటు కట్టటానికి కూడా ఆపిల్ చెట్లు అందుబాటులో లేకపోవటమే దీనిక్కారణం. అతని ప్రయోగం విజయవంతమైంది. 45 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ పంట చేతికొచ్చింది! అంతేకాదు.. ఆపిల్ కాయలు సైజులోను, నాణ్యతలోనూ బావున్నాయి. సిమ్లా నుంచి ఆపిల్ విత్తనాలు తెచ్చి పెంచిన మొక్కలతో అంటుకట్టాడు. రెండేళ్ల తరువాత మంచి పంట చేతికొచ్చింది. తను సాగు చేస్తున్న మామిడి చెట్లతో పాటే ఆ ఆపిల్ చెట్లను పెంచాడు. ఆ విధంగా ఒక చిన్న ఆపిల్ తోటనే అతను సృష్టించాడు! సాధారణంగా ఆపిల్లో పూత రావలన్నా పిందెలు రావాలన్నా అతి చల్లని వాతావరణం అవసరం. కానీ హెచ్.ఆర్.ఎం.ఎన్.–99 రకం ఆపిల్ను సాధారణ వాతావరణంలోనూ ఉష్ణమండలప్రాంతాల్లోనూ సాగు చేయవచ్చని హరిమాన్ శర్మ చెబుతున్నారు. ఈ మొక్క మూడేళ్లు తిరిగేసరికి కాపుకొస్తుంది. జూన్లో కాయటం దీని మరో ప్రత్యేకత. ఆ కాలంలో ఇప్పుడున్న దేశీవాళీ ఆపిల్ కాయలు మార్కెట్లోకి రావు. దీంతో ఈ రకం ఆపిళ్లను సాగు చేసే రైతులు లాభపడుతున్నారు. హెచ్.ఆర్.ఎం.ఎన్.–99 వంగడంపై నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్.ఐ.ఎఫ్.) దృష్టి కేంద్రీకరించింది. దేశంలోని విభిన్న వ్యవసాయక వాతావరణ పరిస్థితులున్నప్రాంతాల్లో 2015–17 మధ్యకాలంలో ప్రయోగాత్మకంగా సాగు చేయించింది. 29 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలితప్రాంతాలకు చెందిన 1,190 మంది రైతులకు 10 వేల ఆపిల్ మొక్కలు ఇచ్చి సాగు చేయించారు. చాలా రాష్ట్రాల్లో సత్ఫలితాలు వచ్చాయని ఎన్.ఐ.ఎఫ్. ప్రకటించింది. పరిశోధనాలయాల్లో సాగులో ఉన్న రకాలతో పోల్చితే హెచ్.ఆర్.ఎం.ఎన్.–99 పండ్లు నాణ్యమైనవని తేలింది. కొన్ని రాష్ట్రాల్లో ఏడాది వయసున్న మొక్కలకే పూత వచ్చింది.దక్షిణాదిన కర్నాటకలోని చిక్మగుళూరు, హర్యానా రైతులు హెచ్ఆర్ఎంఎన్–99 ఆపిల్ వంగడాన్ని సాగు చేసి ఏడాదికి రెండు పంటలు తీస్తున్నారు. అన్ని రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ సాగవుతోంది. మంచి దిగుబడులు వస్తున్నాయి. కాయలు రుచిగా ఉండటంతో కొనేందుకు వినియోగదారులు మక్కువ చూపుతున్నారు. బిలాస్పూర్ జిల్లాలోని కొండ దిగువ జిల్లాల్లోనిప్రాంతాల్లోని వేలాది మంది సాధారణ రైతులకు హరిమాన్ శర్మ స్ఫూర్తి ప్రదాతగా మారారు.అంతకు ముందు ఆప్రాంతంలోని రైతులు తాము ఆపిల్ను సాగు చేయటమనేది వారు కలనైనా ఊహించ లేదు. ఆయనను ఇప్పుడు బిస్లాపూర్ జిల్లాలో ‘ఆపిల్ మేన్’ అని ఆత్మీయంగా పిలుస్తున్నారు. ఈ ఆవిష్కరణ ఆయనకు ప్రతిష్టాత్మక అవార్డులను సంపాయించి పెట్టింది. రాష్ట్రపతి చేతుల మీదుగా ఎన్.ఐ.ఎఫ్. జాతీయ పురస్కారాన్ని,‘ప్రేరణా శ్రోత్’ పురస్కారాన్ని పొందారు. హరిమాన్ శర్మ, పనియాల గ్రామం, బిలాస్పూర్ జిల్లా, హిమాచల్ ప్రదేశ్ – 174021. ఫోన్: 09418 867209, 09817 284251 , sharmaharimanfarm @gmail.com‘తెలుగు రాష్ట్రాల్లో రైతులకు 15 వేల మొక్కలు అందించాం’మైదానప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతల్లోనూ సాగు చేయదగిన ఆపిల్ వంగడాన్ని హారిమన్ శర్మ రూపొందించారు. ఆయన దగ్గరి నుంచి ఈ మొక్కల్ని పల్లెసృజన తరఫున తెప్పించి, తెలుగు రాష్ట్రాల్లో పలువురు రైతులకు గత ఐదేళ్లుగా నవంబర్–డిసెంబర్ నెలల్లో ఇస్తున్నాం. ఇప్పటికి సుమారు 15 వేల ఆపిల్ మొక్కల్ని రైతులకు అందించాం. ప్రత్యేకంగా ప్యాక్ చేసి స్పీడ్ కొరియర్లో రైతుల ఊళ్లకే పంపుతున్నాం. ఖర్చులన్నీ కలిపి మొక్క ఖరీదు రూ. 220 అవుతోంది. చాలా చోట్ల ఈ ఆపిల్ చెట్లకు ఇప్పటికే పండ్లు కాస్తున్నాయి. sharmaharimanfarm @gmail.com -
తనయ్, అనికేత్ మాయాజాలం
సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే నాకౌట్ దశకు అర్హత సాధించే అవకాశం కోల్పోయిన హైదరాబాద్ జట్టు రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో రెండో విజయాన్ని అందుకుంది. హిమాచల్ ప్రదేశ్ జట్టుతో ఆదివారం ఉప్పల్ స్టేడియంలో ముగిసిన గ్రూప్ ‘బి’ ఆరో రౌండ్ లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు ఇన్నింగ్స్ 43 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి 7 పాయింట్లు సంపాదించింది. చామా మిలింద్ సారథ్యంలో ఈ మ్యాచ్ ఆడిన హైదరాబాద్ జట్టుకు ఇద్దరు స్పిన్నర్లు తనయ్ త్యాగరాజన్, అనికేత్ రెడ్డి తమ ప్రదర్శనతో విజయాన్ని కట్టబెట్టారు. ఫాలోఆన్ ఆడుతూ ఆఖరి రోజు ఆదివారం ఓవర్నైట్ స్కోరు 21/0తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన హిమాచల్ జట్టు వన్డే తరహాలో ఆడి 45.4 ఓవర్లలో 247 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. హైదరాబాద్ ఎడంచేతి వాటం స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్ 118 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టగా... నిజామాబాద్ జిల్లాకు చెందిన మరో ఎడంచేతి వాటం స్పిన్నర్ గంగం అనికేత్ రెడ్డి 46 పరుగులిచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. హిమాచల్ జట్టు రెండో ఇన్నింగ్స్లో శుభం అరోరా (72 బంతుల్లో 66; 10 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా... అంకిత్ కాల్సి (39 బంతుల్లో 44; 6 ఫోర్లు), వైభవ్ అరోరా (22 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించారు. మ్యాచ్ మొత్తంలో తొమ్మిది వికెట్ల తీసిన అనికేత్ రెడ్డికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఎనిమిది జట్లున్న గ్రూప్ ‘బి’లో హైదరాబాద్ ఆరు మ్యాచ్లు పూర్తి చేసుకుంది. రెండు మ్యాచ్ల్లో ఇన్నింగ్స్ విజయాలు సాధించి... రెండు మ్యాచ్లను ‘డ్రా’ చేసుకొని, రెండు మ్యాచ్ల్లో ఓడిపోయి 16 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. నాగ్పూర్లో ఈనెల 30 నుంచి జరిగే చివరి రౌండ్ లీగ్ మ్యాచ్లో విదర్భ జట్టుతో హైదరాబాద్ ఆడుతుంది. -
అనికేత్ అదుర్స్
సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో భాగంగా హిమాచల్ ప్రదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో హైదరాబాద్ బౌలర్ అనికేత్ రెడ్డి (5/72) సత్తా చాటాడు. ఫలితంగా ఓవర్నైట్ స్కోరు 33/1తో శనివారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హిమాచల్ ప్రదేశ్ జట్టు 92 ఓవర్లలో 275 పరుగులకు ఆలౌటైంది. ఇనేశ్ మహజన్ (79 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్స్లు) అజేయ అర్ధశతకం సాధించగా... శుభమ్ అరోరా (53; 7 ఫోర్లు) హాఫ్సెంచరీ చేశాడు.అంకిత్ (31), అపూర్వ్ వాలియా (37), ఆకాశ్ వశిష్ట్ (46) తలా కొన్ని పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో తనయ్ త్యాగరాజన్ రెండు వికెట్లు తీయగా... నిశాంత్, వరుణ్ గౌడ్లకు చెరో వికెట్ దక్కింది. దీంతో హైదరాబాద్కు 290 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించడంతో ప్రత్యర్థిని ఫాలోఆన్కు ఆహ్వానించింది. శనివారం ఆట ముగిసే సమయానికి హిమాచల్ జట్టు రెండో ఇన్నింగ్స్లో 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. శుభమ్ అరోరా (16 బ్యాటింగ్), ప్రశాంత్ చోప్రా (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. నేడు ఆటకు చివరి రోజు కాగా... చేతిలో 10 వికెట్లు ఉన్న హిమాచల్ జట్టు... హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 269 పరుగులు వెనుకబడి ఉంది. స్కోరు వివరాలు హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: 565; హిమాచల్ ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్: శుభమ్ అరోరా (ఎల్బీ) (బి) అనికేత్ రెడ్డి 53; ప్రశాంత్ చోప్రా (సి) రాహుల్ రాధేశ్ (బి) నిశాంత్ 1; అంకిత్ (సి) తన్మయ్ అగర్వాల్ (బి) తనయ్ త్యాగరాజన్ 31; అపూర్వ్ వాలియా (స్టంప్డ్) రాహుల్ రాధేశ్ (బి) అనికేత్ రెడ్డి 37; ఆకాశ్ వశిస్ట్ (సి) మిలింద్ (బి) అనికేత్ రెడ్డి 46; రిషి ధవన్ (ఎల్బీ) తనయ్ త్యాగరాజన్ 22; ఇనేశ్ మహజన్ (నాటౌట్) 68; ముకుల్ నేగీ (సి) హిమతేజ (బి) అనికేత్ రెడ్డి 0; మయాంక్ డాగర్ (సి) రక్షణ్ రెడ్డి (బి) వరుణ్ గౌడ్ 0; వైభవ్ అరోరా (సి) రక్షణ్ రెడ్డి (బి) అనికేత్ రెడ్డి 3; దివేశ్ శర్మ (రనౌట్/హిమతేజ) 1; ఎక్స్ట్రాలు 13; మొత్తం (92 ఓవర్లలో ఆలౌట్) 275. వికెట్ల పతనం: 1–11, 2–78, 3–111, 4–144, 5–188, 6–217, 7–217, 8–218, 9–267, 10–275, బౌలింగ్: నిశాంత్ 12–3–52–1; చామా మిలింద్ 13–1–32–0; తనయ్ త్యాగరాజన్ 24–4–62–2; అనికేత్ రెడ్డి 25–5–72–5; రక్షణ్ రెడ్డి 13–1–29–0; వరుణ్ గౌడ్ 5–0–16–1. హిమాచల్ ప్రదేశ్ రెండో ఇన్నింగ్స్: శుభమ్ అరోరా (బ్యాటింగ్) 16; ప్రశాంత్ చోప్రా (బ్యాటింగ్) 1; ఎక్స్ట్రాలు 4; మొత్తం (5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 21. బౌలింగ్: తనయ్ త్యాగరాజన్ 3–0–13–0; రక్షణ్ రెడ్డి 2–1–4–0. -
డోన్లతో ఉత్తరాల బట్వాడా.. 10 నిముషాల్లో డెలివరీ
ధర్మశాల: ఉత్తరాల బట్వాడాలో పోస్టల్శాఖమరో ముందడుగు వేసింది. హిమాచల్ పోస్టల్ విభాగం డ్రోన్ల సాయంతో మారుమూల, మంచు ప్రాంతాలకు ఉత్తరాలను బట్వాడా చేయనుంది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు పోస్టల్శాఖ అప్పర్ సిమ్లాలో డ్రోన్ ద్వారా ఉత్తరాలను డెలివరీ చేసే ట్రయల్ను ప్రారంభించింది.డ్రోన్ల సాయంతో సబ్ పోస్టాఫీసు నుండి బ్రాంచ్ పోస్టాఫీసులకు ఐదు నుంచి పది నిమిషాల్లో ఉత్తరాలు డెలివరీ అవుతున్నాయి. గతంలో ఇలా ఉత్తరాలు చేరడానికి ఒక రోజు పట్టేది. ఈ ట్రయల్ విజయవంతం అయిన దరిమిలా కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు పోస్టల్ విభాగం హైటెక్ టెక్నాలజీని ఉపయోగించి ఇతర మారుమూల ప్రాంతాలకు కూడా ఉత్తరాలను బట్వాడా చేసే అవకాశం ఏర్పడనుంది.హిమాచల్ తపాలా శాఖ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల మధ్య డ్రోన్ల ద్వారా సబ్ పోస్టాఫీస్ హట్కోటి నుంచి నందపూర్, కథాసు, ఆంటి, జాధగ్ బ్రాంచ్ పోస్టాఫీసులకు ఉత్తరాలను పంపుతోంది. ఒకేసారి ఏడు కిలోగ్రాముల వరకు భారాన్ని మోయగల ఈ డ్రోన్ ఐదు నుండి పది నిమిషాల్లో ఏడు నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలకు ఉత్తరాలను చేరవేసి, తిరిగివస్తోంది. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా ఉత్తరాల డెలివరీకి సంబంధించిన పూర్తి డేటాను ఆన్లైన్లో ఉంచుతున్నారు. డ్రోన్ ట్రయల్స్ కోసం ఒక ప్రైవేట్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోస్టల్శాఖ అధికారి ఒకరు తెలిపారు.ఇది కూడా చదవండి: Republic Day 2025: అందమైన ఈ శకటాలను చూసితీరాల్సిందే -
హిమాచల్ పోలీసుల అకృత్యం
బనీఖేత్(హిమాచల్ ప్రదేశ్): నూతన సంవత్సర వేడుకల వేళ అర్ధరాత్రి దాటాక తాము అడిగిన మద్యం, ఆహారం ఇవ్వలేదన్న అక్కసుతో రిసార్ట్ మేనేజర్ను పోలీసులు కొట్టి చంపేసిన ఘటన హిమాచల్ ప్రదేశ్లో చోటుచేసుకుంది. రిసార్ట్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు, నమోదైన ఎఫ్ఐఆర్లోని వివరాల ప్రకారం డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రిదాటాక పర్వతమయ పర్యాటక ప్రాంతం డల్హౌసీ దగ్గర్లోని బనీఖేత్లోని ఒక ప్రైవేట్ రిసార్ట్కు ముగ్గురు కానిస్టేబుళ్లు వచ్చారు. రాత్రి రెండు గంటల సమయంలో తాము అడిగిన భోజనం, మద్యం ఏర్పాట్లు చేయాలని రిసార్ట్ సిబ్బందికి ఆదేశాలిచ్చారు. రాత్రి సమయంలో తాము చేయాల్సిన ‘సర్వీస్’సమయం మించిపోయిందని, ఇప్పుడు నిబంధనలు ఒప్పుకోవని, ఈ సమయంలో సర్వీస్ చేయడం కుదరని అక్కడి రిసెప్షనిస్ట్ సచిన్ చెప్పాడు. దీంతో పట్టరాని ఆవేశంతో కానిస్టేబుల్స్ అనూప్, అమిత్లు రిసెప్షనిస్ట్ను చితకబాదారు. ఇదంతా చూసిన రిసార్ట్ మేనేజర్ రాజీందర్ హుటాహుటిన అక్కడికొచ్చి కానిస్టేబుళ్లను నిలువరించబోయారు. అప్పటికే కోపంతో ఊగిపోతున్న కానిస్టేబుళ్లు రాజీందర్పైనా దాడికి తెగించారు. ఈ దాడిలో రాజీందర్ అక్కడికక్కడే చనిపోయారు. దాడి సమయంలో కానిస్టేబుళ్లు పూటుగా మద్యం తాగి ఉన్నారని వార్తలొచ్చాయి. విషయం తెల్సుకున్న స్థానికులు వెంటనే చంబా–పఠాన్కోట్ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. రాజీందర్ మృతికి కారణమైన కానిస్టేబుళ్లను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్ట్చేశారు. ఇద్దరినీ విధుల నుంచి తప్పించి దర్యాప్తు మొదలుపెట్టామని చంబా ఎస్పీ గురువారం చెప్పారు. తీవ్రంగా గాయపడిన రిసెప్షనిస్ట్ను ఆస్పత్రిలో చేర్పించారు. -
హిమాచల్లో భారీ మంచు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో గత 24 గంటల్లో భారీగా మంచు కురియడంతో నలుగురు మృతి చెందారు. మూడు జాతీయరహదారు లు, మరో 220 దారులను మూసివేశారు. సిమ్లా, కులు, మండి, చంబా, సిర్మౌర్ జిల్లాలతో పాటు కిన్నౌర్, లాహౌల్, స్పితి జిల్లాల్లో భారీగా మంచు కురిసింది. పలు వాహనాలు అదుపుతప్పి బోల్తా పడటంతో నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. దీంతో సిమ్లాలో 145, కులులో 25, మండీ జిల్లాల్లో 20 రహదారులను మూసివేశారు. 356 ట్రాన్స్ ఫార్మర్ ఫెయిల్యూర్ కావడంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ లేదు. క్రిస్మస్, న్యూ ఇయర్ కోసం సిమ్లా, మనాలీలకు పర్యాటకులు పోటెత్తారు. స్థానిక నివేదికల ప్రకారం, అట్టారి నుంచి లేహ్, కులు జిల్లా లోని సంజ్ నుంచి ఔత్, కిన్నౌర్ జిల్లాలోని ఖాబ్ సంగం, లాహౌల్, స్పితి జిల్లాలోని గ్రామ్ ఫూ వరకు జాతీయ రహదారులు ట్రాఫిక్ కారణంగా మూసివేశారు. రోడ్లను క్లియర్ చేయడానికి హిమాచల్ ప్రభుత్వం రెండు స్నో బ్లోయర్లతో సహా 268 యంత్రాలను ఏర్పాటు చేసింది. జిల్లా యంత్రాంగం సూచనలను పాటించాలని, స్థానికులు చెప్పేది వినాలని, మంచులో డ్రైవింగ్ చేయవద్దని పర్యాటకులు సూచించింది.తెల్లని వండర్ల్యాండ్గా హిమాచల్.. హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా, మనా లీ వంటి పర్యాటక కేంద్రాలు తెల్లని వండర్ల్యాండ్గా మారాయి. అలాగే జమ్మూకాశీ్మర్లోని కొన్ని ప్రాంతాల్లో తాజాగా మంచుకురిసింది. ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థాయి కంటే అనేక డిగ్రీలు పడిపోయా యి. ఇది క్రిస్మస్ సెలవుల కోసం ప్రదేశాలను సందర్శించే పర్యాటకులకు ఉత్సాహాన్ని కలిగిస్తోంది. మరోవైపు వాహనాల రాకపోకలకు కష్టమవుతోంది. సోమవా రం అర్థరాత్రి మనాలీ, డల్హౌసీ శివారు ప్రాంతాల్లో తేలికపాటి హిమపాతం నమోదైంది. ఖద్రాలాలో అత్యధికంగా 24 సెంటీమీటర్లు, సంగ్లాలో 16.5 , షిల్లారోలో 15.3, చోపాల్, జుబ్బల్లో 15 సెంటీమీటర్ల చొప్పున, కల్పాలో 14, నిచార్లో 10, సిమ్లాలో 7, పూహ్లో 6, జోత్లో 5 సెంటీమీటర్ల చొప్పున మంచు కురిసింది. ప్రతికూల వాతావరణం, హిల్ స్టేషన్కు వెళ్లే మార్గంలో రహదారిపై ప్రాణాంతక పరిస్థితులు ఉన్నా పర్యాటకులు పోటెత్తారు. సిమ్లాలోని హోటల్ గదుల ఆక్యుపెన్సీ 70 శాతం నమోదైంది. గత ఏడాది డిసెంబర్ కంటే ఇది 30 శాతం ఎక్కువ. మంచు దుప్పటితో అందంగా కప్పబడిన సిమ్లా, మనాలీ చిత్రాలతో సోషల్ మీడియా నిండిపోయింది. శుక్రవారం సాయంత్రం నుంచి ఆదివారం మధ్యా హ్నం వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా సిమ్లాలో భారీ వర్షా లు, మంచు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. -
అంతిమసంస్కారాలైన 25 ఏళ్లకు ఆమె తిరిగొస్తే..
ఆమె తన ఆచూకీని కోల్పోయి 25 ఏళ్లుగా ఆశ్రమంలో కాలం గడుపుతోంది. మరోవైపు ఆమె ఎక్కడి నుంచి ఈ ఆశ్రమానికి వచ్చిందన్న సంగతి ఆ ఆశ్రమ నిర్వాహకులకూ తెలియదు. ఇది హిమాచల్ ప్రదేశ్లోని మండి నగరానికి చెందిన కథనంఏళ్ల తరబడి ఆశ్రమంలో..పాతికేళ్ల తర్వాత అనూహ్య పరిస్థితుల్లో ఆమె తన కుటుంబాన్ని కలుసుకోగలుగుతోంది. మండి పరిపాలన అధికారుల చొరవతో ఇది సాధ్యమయ్యింది. అయితే ఆమె కుటుంబ సభ్యులు 25 ఏళ్ల క్రితమే ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. కర్ణాటక వాసి సాకమ్మ కథ ఇది. పాతికేళ్ల క్రితం ఆమె కర్ణాటక(Karnataka) నుండి ఉత్తర భారతదేశయాత్రలకు వెళ్లి, అక్కడ తప్పిపోయింది. అప్పటి నుంచి ఆమె మండి జిల్లా సుందర్నగర్లోని భంగ్రోటు వృద్ధాశ్రమంలో ఉంటోంది.కన్నడలో మాట్లాడటంతో..మండి అడ్మినిస్ట్రేటివ్ అధికారులు ఎప్పటికప్పుడు ఇలాంటి ఆశ్రమాలను సందర్శించి, అక్కడ సౌకర్యాలను పరిశీలిస్తుంటారు. దీనిలో భాగంగా అధికారి రోహిత్ రాథోడ్ ఇటీవల ఈ వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. అక్కడ సాకమ్మను చూసి, ఆమెతో మాట్లాడారు. ఈ సమయంలో ఆమెకు హిందీ రాదని, కన్నడ భాష వచ్చని గుర్తించారు. దీంతో ఆమె కర్నాటకు చెందినదై ఉంటుందని భావించారు. వెంటనే ఆయన కన్నడ తెలిసిన ఒక అధికారిని పిలిపించి, ఆమెతో మాట్లాడించి పలు వివరాలు సేకరించారు.ఉత్తరభారతదేశ యాత్రలకు వెళ్లి..తరువాత ఆ మహిళ చెబుతున్న వివరాలతో కూడిన ఒక వీడియో(Video)ను రూపొందించి కర్ణాటక ప్రభుత్వానికి పంపించారు. ఆ దరిమిలా ఆమె కుటుంబ సభ్యులను మండీ అధికారులు గుర్తించారు. కాగా 25 ఏళ్ల క్రితం ఉత్తరభారతదేశ యాత్రలకు వెళ్లిన సాకమ్మ ఎంతకాలానికీ తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ దరిమిలా పోలీసులు అందించిన సమాచారం మేరకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఒక మహిళను సాకమ్మగా భావించి, ఆమె కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించి, క్రమంగా ఆమెను మరచిపోయారు.చనిపోయిందనుకున్న తల్లి వస్తుండటంతో..అయితే ఇప్పుడు సాకమ్మ బతికే ఉందని తెలియడంతో ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాగా మండీ అధికారులతో మాట్లాడిన సాకమ్మ తనకు 25 ఏళ్ల క్రితం నాటి విషయాలు మాత్రమే గుర్తున్నాయని, తనకు చిన్న పిల్లలు ఉన్నారని తెలిపింది. ప్రస్తుతం సాకమ్మ మతిస్థిమితం లేని స్థితిలో ఉంది. కాగా సాకమ్మకు నలుగురు పిల్లలు. వారిలో ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె బతికే ఉన్నారు. వారిందరికీ వివాహాలు కూడా అయిపోయాయి. సాకమ్మను తీసుకురావడానికి కర్ణాటక ప్రభుత్వం(Government of Karnataka) ముగ్గురు అధికారులను హిమాచల్ప్రదేశ్లోని మండీకి పంపింది. వారు సాకమ్మకు తీసుకుని కర్నాటకకు వచ్చి ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇది కూడా చదవండి: ఆవి క్రిస్మస్ పక్షులు.. వాటి కువకువలు సుమధుర సరాగాలు -
రోడ్లపై మంచు గుట్టలు..చిక్కుకుపోయిన టూరిస్టులు
షిమ్లా:హిమాచల్ప్రదేశ్లో భారీగా మంచు కురుస్తోంది. భారీ మంచు ప్రభావంతో రోడ్లపై ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతోంది. రోడ్లపై మంచు గుట్టలుగుట్టలుగా పేరుకుపోవడంతో రోహ్తక్, సోలాంగ్, అటల్ టన్నెల్ మార్గంలో వెయ్యి వరకు వాహనాలు సోమవారం రాత్రి కొన్ని గంటల పాటు చిక్కుకుపోయాయి.స్థానిక అధికారులు,పోలీసుల సాయంతో ట్రాఫిక్ క్లియర్ చేశారు. మొత్తం 700 మంది టూరిస్టులను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. క్రిస్మస్, న్యూఇయర్ కావడంతో టూరిస్టుల తాకిడి ఎక్కువవడం ఇదే సమయంలో మంచు భారీగా కురుస్తుండడంతో సమస్యలు ఎదురవుతున్నాయని పోలీసులు చెప్పారు. ఈ సీజన్లో ఇక్కడుండే మంచు పర్వతాలను చూడడానికి ఎక్కువ మంది టూరిస్టులు వస్తుండడం గమనార్హం. #WATCH | Himachal Pradesh: Heavy snowfall causes a long traffic jam as nearly 1000 vehicles get stuck between Solang and Atal Tunnel, Rohtang. The police team is busy clearing the traffic jam amid snowfall. 700 tourists have been rescued safely. (23.12)Source: Himachal Pradesh… pic.twitter.com/wb9ZfKh6H6— ANI (@ANI) December 23, 2024 -
అహో.. మైమరిపిస్తున్న మంచు అందాలు (ఫొటోలు)
-
స్వర్ణ పతక విజేతను ప్రోత్సహించే తీరిదేనా?: సుప్రీం కోర్టు అసంతృప్తి
‘క్రీడాకారులకు మీరిచ్చే ప్రోత్సాహం ఇదేనా? ముఖ్యమంత్రి ప్రకటనలు, హామీలు కాదు... ఆచరణాత్మక నిర్ణయాలు తీసుకోవాలి. ఓ చాంపియన్ క్రీడాకారిణి పట్ల మీరు వ్యవహరించిన తీరు గర్హనీయం’.. అని సుప్రీం కోర్టు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. ఆసియా క్రీడల్లో (2014)లో స్వర్ణ పతక విజేత పట్ల వ్యవహరించిన తీరు సరికాదని అసంతృప్తి వ్యక్తం చేసింది. కాగా పూజ ఠాకూర్ అనే క్రీడాకారిణి ఇంచ్వాన్ (దక్షిణ కొరియా) ఆసియా క్రీడల్లో పసిడి పతకం నెగ్గిన భారత కబడ్డీ జట్టు సభ్యురాలు. అయితే స్పోర్ట్స్ కోటా కింద గ్రేడ్–1 ఉద్యోగానికి అర్హురాలైన ఆమెకు ఎక్సైజ్–టాక్సేషన్ ఆఫీసర్ ఉద్యోగం ఇచ్చినట్లే ఇచ్చిన హిమాచల్ ప్రభుత్వం నియామకం మాత్రం జరపలేదు. దీని కోసం ఏళ్ల తరబడి హిమాచల్ సీఎం కార్యాలయం చుట్టూ పూజా ఠాకూర్ తిరుగుతోంది.స్పందించిన రాష్ట్ర హైకోర్టు సింగిల్ జడ్జిఈ నేపథ్యంలో.. జూలై 2015 నుంచి పూజ ఠాకూర్ చేస్తున్న పోరాటానికి స్పందించిన రాష్ట్ర హైకోర్టు సింగిల్ జడ్జి... ఆమెను ఎక్సైజ్–టాక్సేషన్ ఆఫీసర్గా నియమించాలని తీర్పు ఇచ్చారు. అయినా సరే నియామకం జరపకుండా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీలు చేసింది. ఈ క్రమంలో.. శుక్రవారం విచారణ సందర్భంగా జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిలతో కూడిన ద్విసభ్య బెంచ్ వెంటనే ఆమెను ప్రభుత్వ ఉద్యోగంలో నియమించాలని ఆదేశించింది.సర్వోన్నత న్యాయస్థానం అసంతృప్తిఈ సందర్భంగా.. హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పును యథాతథంగా అమలు చేయాలని... ఇందులో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు తెలిపింది. అదే విధంగా.. ఇన్నేళ్లయినా రాష్ట్ర ప్రభుత్వం పూజ ఠాకూర్ నియామకానికి సంబంధించి ఏ చర్యలు చేపట్టకపోవడంపై సర్వోన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతేకాదు.. జూలై 2015 నుంచే సినియారిటీ సహా ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రూల్స్కు లోబడి పొందే అన్ని ప్రయోజనాలకు ఆమె అర్హురాలని సుప్రీం బెంచ్ తీర్పులో వెల్లడించింది. -
కాంగ్రెస్ హామీలపై కేటీఆర్ ఛలోక్తులు
-
హిమాచల్ భవన్ జప్తు.. కాంగ్రెస్ సర్కార్పై కేటీఆర్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలను కాకుండా.. బదులుగా సర్కస్లను నడుపుతోంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. హిమాచల్లో రెండేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్.. తన చేతకాని ప్రభుత్వం వల్ల రాష్ట్రం తీసుసుకున్న అప్పును తీర్చలేక ఢిల్లీలో హిమాచల్ భవన్ను కోల్పోవాల్సి వస్తుందని విమర్శలు గుప్పించారు. గద్దెనెక్కడం కోసం అడ్డగోలు గారంటీలు ఇవ్వడం, చేతికందినన్ని అప్పులు చెయ్యడం, ఆఖరికి ఉన్న ఆస్తులు జప్తు చెయ్యించుకునే పరిస్థితికి రావడం కాంగ్రెస్ అలవాటుగా మారిపోయిందని మండిపడ్డారు. మొన్న గారంటీలు అమలు చెయ్యలేక, గంజాయి కూడా అమ్మకునే పరిస్థితి హస్తానికి తలెత్తిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. నేడు కాంగ్రెస్ చెల్లించాల్సిన అప్పు తేల్చకపోతే, డిల్లీలో హిమాచల్ భవన్ను జప్తు చేస్తాం అని హైకోర్టు తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. ఇది ఎంత సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు. తమ హామీలకు నిధులు సమకూర్చడం కోసం చట్టబద్ధంగా గంజాయిని విక్రయించడానికి కాంగ్రెస్ అనుమతి కోరిందని ప్రస్తావించారు. మరి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు హామీలను నెరవేర్చడానికి ఏం విక్రయిస్తారంటూ రాహుల్ గాంధీని ప్రశ్నించారు.కాగా ఓ విద్యుత్తు సంస్థకు చెల్లించాల్సిన రూ.150 కోట్లను రికవరీ చేసేందుకు ఢిల్లీలోని హిమాచల్ భవన్ జప్తుకు రాష్ట్ర హైకోర్టు సోమవారం ఆదేశాలు ఇచ్చింది. ఈ భవనాన్ని వేలం వేసి బకాయిలు తీర్చేసుకోవాలని సదరు కంపెనీకి సూచించింది. దీంతో పది గ్యారెంటీల పేరుతో రెండేళ్ల క్రితం హిమాచల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.గద్దెనెక్కడం కోసం అడ్డగోలు గారంటీలు ఇవ్వడం! చేతికందినన్ని అప్పులు చెయ్యడం! ఆఖరికి ఉన్న ఆస్తులు జప్తు చెయ్యించుకునే పరిస్థితికి రావడం! ఇది ఏ జూదగాని ఇంటి కథ కాదు! సాక్షాత్తు హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరు! గారంటీలు అమలు చెయ్యలేక, గంజాయి కూడా అమ్మకునే పరిస్థి… pic.twitter.com/1lfvoR1Bu7— KTR (@KTRBRS) November 20, 2024 -
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మోదీ కీలక వ్యాఖ్యలు
-
సీఎం ‘సమోసా’ వివాదం.. దర్యాప్తు ఏం లేదు: సీఐడీ
హిమాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో ‘సమోసా’ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీఐడీ కార్యాలయంలో సీఎం సుఖ్వీందర్ సింగ్ హాజరైన ఓ కార్యక్రమంలో ఆయనకు ఇవ్వాల్సిన సమోసాలు మాయం అయినట్లువార్తలు రావడంతో..ఈ అంశంపై వివాదం చెలరేగింది.. దీనిపై సీఐడీ దర్యాప్తు కూడా ప్రారంభించినట్లు ఆరోపణలు రావడంతో.. తాజాగా దర్యాప్తు సంస్థ స్పందించింది. తాము ఎలాంటి విచారణ చేపట్టలేదని స్పష్టం చేసింది.అసలేం జరిగిందంటే.. అక్టోబర్ 21న ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు సీఐడీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. అక్కడ జరిగిన కార్యక్రమం కోసం ప్రముఖ హోటల్ నుంచి సమోసాలు తెప్పించారని, అయితే వాటిని సెక్యూరిటీ స్టాఫ్ తినేశారని వార్తలు వచ్చాయి. సీఎం వద్దకు చేరాల్సిన అవి ఎవరి వల్ల మధ్యలో మిస్ అయ్యాయే గుర్తించేందుకు సీఐడీ విచారణకు ఆదేశించినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి.ఈ మేరకు హిమాచల్ ప్రదేశ్ సీఐడీ డైరెక్టర్ జనరల్ సంజీవ్ రంజన్ ఓజా మాట్లాడుతూ.. సమోసాలు కనిపించకుండా పోవడంపై ఎలాంటి దర్యాప్తు జరపడం లేదని తెలిపారు. ఇది అంతర్గత విషయమని చెప్పారు. అయితే అధికారుల సమావేశానికి ఆర్డర్ చేసిన స్నాక్స్ బాక్స్లు కనిపించకుండా పోవడంపై ఆశ్చర్యం వేయడం చాలా సాధారణమైన విషయమని అన్నారు.దీనిపై విచారణ ఏం లేదని, కేవలం బాక్సుల గురించి తెలుసుకోవడానికి ఒక విజ్ఞప్తి మాత్రమే జరిగిందని చెప్పారు.మరోవైపు ప్రతిపక్ష బీజేపీ.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిందిు. ఇదంతా హాస్యాస్పదమైన వ్యవహారమని, సమోసాలను ఎవరు తింటే ఏమవుతుందని ప్రశ్నించింది. ‘సీఎం తినాల్సిన సమోసాలను తీసుకెళ్లిందెవరు..? సీఐడీ తేల్చనుంది..’’ అని బీజేపీ నేత అమిత్ మాలవీయ ఎక్స్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతుండటంతో సీఎం కార్యాలయం కూడా స్పందించింది. ప్రభుత్వం అటువంటి విచారణకు ఆదేశించలేదని, ఈ విషయంతో సంబంధం లేదని చీఫ్ మీడియా అడ్వైజర్ నరేష్ చౌహాన్ వెల్లడించారు. ఇది సీఐడీ అంతర్గత వ్యవహారమని చెప్పారు. -
సీఎం సమోసాలు ఎవరు తిన్నారు? సీఐడీ దర్యాప్తు..
-
హిమాచల్ కాంగ్రెస్ సంచలన నిర్ణయం
షిమ్లా: కాంగ్రెస్ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్లో రాష్ట్ర కాంగ్రెస్ యూనిట్ను రద్దు చేయాలని నిర్ణయించింది. హిమాచల్లో పీసీసీ యూనిట్తో పాటు జిల్లా, బ్లాక్ కమిటీలు రద్దు చేస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘హిమాచల్ ప్రదేశ్ పీసీసీ యూనిట్, జిల్లా అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ కమిటీలను రద్దు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. ఈ ప్రతిపాదనకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుంది’ అని ప్రకటనలో తెలిపారు. Congress dissolved the entire state unit of the PCC, District Presidents and Block Congress Committees of Himachal Pradesh Congress Committee, with immediate effect. pic.twitter.com/zfXcnb2S2o— ANI (@ANI) November 6, 2024కాంగ్రెస్ యూనిట్ రద్దు అనంతరం హిమాచల్ మంత్రి అనిరుధ్ సింగ్ మాట్లాడుతూ.. త్వరలోనే కొత్త పీసీసీ చీఫ్ని నియమిస్తామని ప్రకటించారు. కాంగ్రెస్లో ఇది సాధారణ చర్యగా పేర్కొన్నారు. పీసీసీ, డీసీసీ, బ్లాక్ యూనిట్ల పదవీకాలం ముగిసినందున వాటిని రద్దు చేయాలనేది హిమాచల్ కాంగ్రెస్ కార్యకర్తలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారని తెలిపారు.కాగా ప్రస్తుత కార్యవర్గాన్ని రద్దు చేసి, కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతించాలని కోరుతూ ఇటీవల హిమాచల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రతిభా సింగ్ పార్టీ హైకమాండ్కు లేఖ రాశారు. దీని ద్వారా కొత్త కమిటీలలో క్రియాశీల సభ్యులకు ప్రాధాన్యత లభిస్తుందని ఆమె తెలిపారు. దీనిపై ఆమె సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖుతో మాట్లాడినట్లు పేర్కొన్నారు. -
‘ఇంకో నెల తర్వాతే మాకు దీపావళి’
దేశం మొత్తం దీపావళి సంబురాల్లో మునిగిపోయింది. పెద్దలు పిల్లలతో చేరి సరదాగా బాణాసంచాలు కాలుస్తూ అల్లరి చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్లకు పని చెప్తూ.. కోట్ల మంది సోషల్ మీడియాలో ‘ఫెస్టివ్ వైబ్’ అంటూ పోస్టులు పెడుతున్నారు. కాకపోతే ఈ పండుగను మన దేశంలోని ఆ ప్రాంతంలో మాత్రం నెల తర్వాతే.. అదీ కాస్త భిన్నంగా జరుపుకుంటారు.దీపావళి అంటే పూలు.. వాటి మధ్య ప్రమిధలు.. బాణాసంచాల మోత.. స్వీ ట్లు కచ్చితంగా ఉండాలి. కానీ, దీపావళి పండుగ జరిగిన నెలరోజుల తర్వాత హిమాచల్ ప్రదేశ్లో బుద్ధి దీపావళి budhi diwali చేస్తారు. ఇది మామూలు దీపావళిలాగా ఉండదు. పెద్ద తాడుతో మానవ హారంగా ఏర్పడి అక్కడి ప్రజలు నృత్యాలు చేస్తారు. వీధుల్లో వాయిద్యాలు వాయిస్తూ.. తిరుగుతారు. రాత్రి కాగానే పెద్ద కాగడాలకు మంటలు అంటించి.. జానపద పాటలతో చిందులేస్తారు. ప్రత్యేక పిండి వంటలను తోటి వాళ్లతో పంచుకుంటారు. అయితే ఈ కోలాహలంలో బయటివాళ్లకు అనుమతి ఉండదు.ఆడామగా అంతా ఈ వేడుకలో పాల్గొంటారు. ఇంతకు ముందు.. జంతు బలి కొన్నేళ్లుగా సంప్రదాయంగా కొనసాగింది. అయితే న్యాయ స్థానాల జోక్యంతో ఆ ఆచారానికి బ్రేకులు పడ్డాయి. గతంలో కొందరు మద్యం సేవించి ఇందులో పాల్గొనేవారు. ఇప్పుడు దానికి దూరంగానే ఉంటున్నారు వాళ్లు. రాముడు వనవాసం ముగిసి అయోధ్యకి వచ్చాక.. ఆ సమాచారం నెలరోజులకు ఇక్కడి ప్రజలకు తెలిసిందట. అప్పటి నుంచి తరతరాలుగా ఆలస్యంగా ఇక్కడి ప్రజలు దీపావళిని జరుపుకుంటున్నారు. నెల తర్వాత.. మార్గశిర అమవాస్య సమయంలో మూడు నుంచి వారం బుద్ధి దీపావళి వేడుక ఘనంగా జరుగుతుంది. అయితే రాక్షస సంహారం వల్లే తాము ఈ సంబురం చేసుకుంటున్నామని.. వ్యవసాయంతో తీరిక లేకుండా దీపావళికి దూరమైన తమ కోసమే బుద్ధి దీపావళి పుట్టుకొచ్చిందని మరికొందరు చెబుతుంటారు. హిమాచల్ ప్రదేశ్లోని కులు, మండి, షిమ్లా, సిర్మౌర్ జిల్లాలో, ఉత్తరాఖండ్ జౌన్సర్ రీజియన్లోని కొన్ని చోట్ల బుద్ధి దీపావళి తరతరాలుగా వేడుకగా జరుగుతోంది. కొందరు దీపావళితో పాటు బుద్ధి దీపావళిని జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు దీపావళి. అలాగే బుద్ధి దీపావళి ద్వారా తాము వెలిగించిన కాగడాల వెలుతురులో దుష్ట శక్తుల్ని పారదోలడంతో పాటు.. తమకు మంచి బుద్ధి ప్రసాదించమని దేవుళ్లను అక్కడి ప్రజలు వేడుకుంటారు. -
ఆంధ్ర 344 ఆలౌట్
సాక్షి, విశాఖపట్నం: ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో హిమాచల్ ప్రదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో ఆంధ్ర బౌలర్ శశికాంత్ మూడు వికెట్లతో మెరిశాడు. గ్రూప్ ‘బి’లో భాగంగా విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరుగుతున్న పోరులో ఆదివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి హిమాచల్ ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్లో 65 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. అంకిత్ (53; 3 ఫోర్లు), ఆకాశ్ వశిష్ట్ (52 బ్యాటింగ్; 5 ఫోర్లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. ఓపెనర్లు శుభమ్ అరోరా (16), ప్రశాంత్ చోప్రా (10)తో పాటు... ఏకాంత్ సేన్ (20) విఫలమయ్యారు. ఆంధ్ర బౌలర్లలో శశికాంత్ 3 వికెట్లు పడగొట్టగా... విజయ్ ఒక వికెట్ తీశాడు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 295/6తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర జట్టు 92.4 ఓవర్లలో 344 పరుగులకు ఆలౌటైంది. ఆదివారం 49 పరుగులు చేసి మిగిలిన 4 వికెట్లు కోల్పోయింది. మనీశ్ (42; 4 ఫోర్లు), త్రిపురాణ విజయ్ (33; 2 ఫోర్లు) చివర్లో కీలక పరుగులు చేశారు. హిమాచల్ ప్రదేశ్ బౌలర్లలో దివేశ్ శర్మ 5 వికెట్లు పడగొట్టగా... రిషీ ధావన్ మూడు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో మెరుగైన ప్రదర్శనతో ఆంధ్ర జట్టు దీటుగా బదిలిస్తున్న హిమాచల్ ప్రదేశ్ జట్టు ఇంకా 146 పరుగులు వెనుకబడి ఉంది. చేతిలో ఆరు వికెట్లు ఉండగా... కెపె్టన్ రిషీ ధావన్ (38 బ్యాటింగ్; 4 ఫోర్లు), ఆకాశ్ వశి‹Ù్ట క్రీజులో ఉన్నారు. స్కోరు వివరాలు ఆంధ్ర తొలి ఇన్నింగ్స్: అభిõషేక్ రెడ్డి (ఎల్బీ) (బి) రిషీ ధావన్ 5; మహీప్ కుమార్ (ఎల్బీ) (బి) రిషీ ధావన్ 4; షేక్ రషీద్ (బి) అరి్పత్ 69; హనుమ విహారి (సి) రిషీ ధావన్ (బి) ముకుల్ నేగీ 66; శ్రీకర్ భరత్ (సి) ఆకాశ్ (బి) దివేశ్ శర్మ 65; అశ్విన్ హెబ్బర్ (సి) ఏకాంత్ సేన్ (బి) దివేశ్ శర్మ 15; మనీశ్ (సి) ముకుల్ నేగీ (బి) దివేశ్ శర్మ 42; త్రిపురాణ విజయ్ (సి) ఆకాశ్ వశి‹Ù్ట (బి) రిషీ ధావన్ 33; శశికాంత్ (సి) శుభమ్ అరోరా (బి) దివేశ్ శర్మ 6; లలిత్ మోహన్ (సి) శుభమ్ అరోరా (బి) దివేశ్ శర్మ 14; సత్యనారాయణ రాజు (నాటౌట్) 1, ఎక్స్ట్రాలు 24; మొత్తం (92.4 ఓవర్లలో ఆలౌట్) 344. వికెట్ల పతనం: 1–5, 2–11, 3–136, 4–202, 5–226, 6–245, 7–317, 8–321, 9–341, 10–344. బౌలింగ్: వినయ్ 9–0–41–0; రిషీ ధావన్ 19–3–80–3; అర్పిత్ గులేరియా 11–0–47–1; దివేశ్ శర్మ 20.4–4–60–5; మయాంక్ డాగర్ 18–2–53–0; ముకుల్ నేగీ 15–2–52–1. హిమాచల్ ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్: శుభమ్ అరోరా (సి) శ్రీకర్ భరత్ (బి) శశికాంత్ 16; ప్రశాంత్ చోప్రా (సి) శ్రీకర్ భరత్ (బి) శశికాంత్ 10; అంకిత్ (బి) విజయ్ 53; ఏకాంత్ సేన్ (బి) శశికాంత్ 20; ఆకాశ్ వశిష్ట్ (బ్యాటింగ్) 52; రిషీ ధావన్ (బ్యాటింగ్) 38; ఎక్స్ట్రాలు 9, మొత్తం (65 ఓవర్లలో 4 వికెట్లకు) 198. వికెట్ల పతనం: 1–12, 2–31, 3–59, 4–124. బౌలింగ్: శశికాంత్ 15–6–50–3; సత్యనారాయణ రాజు 14–1–40–0; లలిత్ మోహన్ 11–1–26–0; విజయ్ 13–1–41–1; మహీప్ కుమార్ 4–1–10–0; మనీశ్ 7–0–28–0; రషీద్ 1–0–2–0. -
ఆంధ్ర 295/6
సాక్షి, విశాఖపట్నం: ప్రధాన బ్యాటర్లంతా రాణించడంతో రంజీ ట్రోఫీలో హిమాచల్ ప్రదేశ్తో పోరులో ఆంధ్ర జట్టు మంచి స్కోరు దిశగా సాగుతోంది. గ్రూప్ ‘బి’లో భాగంగా శనివారం విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ప్రారంభమైన పోరులో... తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర జట్టు 80 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. కెప్టెన్ షేక్ రషీద్ (69; 9 ఫోర్లు), హనుమ విహారి (66; 12 ఫోర్లు) అర్ధ శతకాలు సాధించగా... వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ (39 బంతుల్లో 65; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) టి20 తరహాల్లో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి హాఫ్ సెంచరీ చేశాడు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఆంధ్ర జట్టుకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు అభిõÙక్ రెడ్డి (5), మహీప్ కుమార్ (4) విఫలం కావడంతో 11 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును రషీద్, విహారి ఆదుకున్నారు. ప్రత్యర్థి బౌలర్లు చెలరేగిపోతున్న సమయంలో సంయమనం పాటించిన ఈ జోడీ... క్రీజులో కుదురుకున్నాక వేగంగా పరుగులు రాబట్టింది. రెండో వికెట్కు 125 పరుగులు జోడించిన తర్వాత హనుమ విహారి వెనురదిగగా... షేక్ రషీద్తో కలిసి శ్రీకర్ భరత్ ఇన్నింగ్స్ను నడిపించాడు. అప్పటి వరకు నిధానంగా సాగిన స్కోరుబోర్డు... భరత్ రాకతో పరుగులు పెట్టింది. బౌలర్తో సంబంధం లేకుండా భరత్ ఎడాపెడి బౌండ్రీలతో విజృంభించాడు. ఇక మరింత భారీ స్కోరు చేయడం ఖాయమే అనుకుంటున్న దశలో వీరిద్దరూ వెనుదిరగడంతో పరుగుల వేగం తగ్గింది. అశ్విన్ హెబర్ (15) ఎక్కువసేపు నిలవలేకపోగా... మనీశ్ (31 బ్యాటింగ్; 2 ఫోర్లు), త్రిపురన విజయ్ (20 బ్యాటింగ్; ఒక ఫోర్) క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ ఏడ వికెట్కు అజేయంగా 50 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. -
విశాఖలో మ్యాచ్.. క్రికెట్ అభిమానులకు శుభవార్త
సాక్షి, విశాఖపట్నం: దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ మ్యాచ్కు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనుంది. ఎలైట్ గ్రూప్-బిలో ఉన్న ఆంధ్ర- హిమాచల్ ప్రదేశ్ మ్యాచ్కు నగరం వేదిక కానుంది. పీఎం పాలెంలో గల ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శనివారం నుంచి ఈ ఫస్ట్క్లాస్ మ్యాచ్ మొదలుకానుంది. ఇందుకు సంబంధించిన నిర్వహణ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.కాగా అక్టోబరు 26- 29 వరకు ఆంధ్ర- హిమాచల్ ప్రదేశ్ మ్యాచ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారు కాగా.. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఇన్నింగ్స్ సాగనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం సెషన్లో సెషన్లో ఆంధ్ర, మధ్యాహ్నం సెషన్లో హిమాచల్ప్రదేశ్ జట్లు నెట్స్లో ప్రాక్టీసు చేశాయి. అయితే, ఈ మ్యాచ్కు ముందు నిర్వాహకులు క్రికెట్ ప్రేమికులకు గుడ్న్యూస్ అందించారు.క్రికెట్ అభిమానులకు శుభవార్తరేపటి నుంచి ఆరంభం కానున్న రంజీ మ్యాచ్ను వీక్షించేందుకు ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. స్టేడియం వద్ద 15వ నంబర్ గేట్ నుంచి ఉచిత ప్రవేశం ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి స్టేడియంలోకి అనుమతిస్తారు. ఇదిలా ఉంటే.. రంజీ ట్రోఫీ తాజా ఎడిషన్లో ఆంధ్ర జట్టు తొలుత విదర్భ చేతిలో 74 పరుగులు, రెండో మ్యాచ్లో గుజరాత్ చేతిలో ఒక్క వికెట్ తేడాతో ఓడిపోయింది.ఆంధ్రా జట్టు కెప్టెన్గా రషీద్ఆంధ్రా జట్టు కెప్టెన్ రికీబుయ్, బ్యాటింగ్ ఆల్రౌండర్ నితీష్కుమార్ ఆస్ట్రేలియా టూర్లో భాగంగా అనధికార నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్లకు ఎంపికవడంతో అందుబాటులో లేరు. ఆంధ్రా జట్టుకు షేక్ రషీద్ నాయకత్వం వహించనుండగా అభిషేక్ రెడ్డి, హానుమ విహారి ఓపెనింగ్ చేయనుండగా అశ్విన్ హెబ్బర్ మిడిలార్డర్లోను, శ్రీకర్ భరత్ కీపింగ్ చేస్తారు. మహీప్కుమార్, వంశీకృష్ణ బ్యాట్ ఝళిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో స్టీఫెన్, సత్యనారాయణ, శశికాంత్, స్పిన్ బౌలింగ్ విభాగంలో లలిత్, విజయ్ బంతి, మనీష్ మెరుపులు మెరిపించనున్నారు. రఫీ, కరణ్ షిండే సైతం జట్టుకు ఎంపికయ్యారు.చదవండి: ఇదేం కెప్టెన్సీ రోహిత్?.. మాజీ హెడ్కోచ్ ఘాటు విమర్శలు -
వీధుల్లో బిక్షాటన చేసే అమ్మాయి నేడు డాక్టర్గా..!
జీవితం అంటేనే కష్టాల మయం అనుకుంటాం. కటిక దారిద్ర్యంలో మగ్గుతున్న వాళ్లకు కూడా జీవితం కొన్ని సువర్ణావకాశాలు అందిస్తుంది. అయితే ఆ అవకాశాలను తెలివిగా అందిపుచ్చుకున్న వారే అద్భుతాలు చేసి చూపిస్తారు. అలాంటి కోవకు చెందిందే పింకీ హర్యాన్. మురికి వాడల్లో తల్లిదండ్రులతో బిక్షాటన చేస్తూ బతికిన అమ్మాయి..నేడు డాక్టర్ అయ్యి అందర్నీ ఆశ్చర్యపరిచడమే గాక ఎందరికో స్ఫూర్తిని కలిగించింది. వివరాల్లోకెళ్తే.. పింకీ హర్యానా హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలోని మెక్లీడ్గంజ్లో నిరుపేద కుటుంబంలో జన్మించింది. చరణ్ ఖుద్లోని మురికివాడలో నివసించే ఆ కుటుంబం రోడ్డుపై భిక్షాటను చేస్తూ జీవనం సాగిస్తుండేది. చెత్త కుండిల్లో ఆహారాన్ని ఏరుకుని తినే దుర్భర జీవితాన్ని సాగించేది పింకీ కుటుంబం. ప్రారంభ జీవితం అంతా కటిక దారిద్య్రం, కష్టాల మధ్య సాగింది. ఏదో అద్భుతం జరిగినట్లుగా ధర్మశాలలోని టోంగ్ లెన్ ఛారిటబుల్ ట్రస్ట్కు నేతృత్వం వహించే బౌద్ధ సన్యాసి లోబ్సాంగ్ జమ్యాంగ్ దృష్టిలో పింకీ పడింది. అదే ఆమె జీవితాన్ని మార్చబోతుందని ఆనాడు ఊహించలేదు. ఆయన పింకీని చూసి చదివించాల్సిందిగా ఆమె తండ్రి కాశ్మీరీ లాల్ను కోరాడు. అందుకు మొదట కాశ్మీరీ లాల్ అంగీకరించలేదు. ఐతే జమ్యాంగ్ తన మాటలతో అతడిని ఒప్పించి పింకీని ధర్మశాలలోని దయానంద్ పబ్లిక్ స్కూల్లో చేరిపించాడు. అలా అక్కడ నిరుపేద పిల్లల కోసం ఏర్పాటు చేసిన ట్రస్ట్ హాస్టల్లో నివశించిన తొలి విద్యార్థిగా పింకీ నిలిచింది. తన జీవితాన్ని మంచిగా మార్చుకునేందుకు దేవుడిచ్చిన ఈ సువర్ణావకాశాన్ని పింకీ అస్సలు వదులుకోలేదు. ఆ పాఠశాలలో చేరినప్పటి నుంచి తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చకోవడమే గాక మంచి మార్కులతో అన్ని తరగతులు పాసయ్యింది. చివరికీ పింకీ 12వ తరగతి పరీక్షలు పూర్తి అయిన వెంటనే రాసిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్లో కూడా ఉత్తీర్ణత సాధించింది. కానీ ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు సంపాదించుకునేలా మంచి ర్యాంకు సాధించలేకపోయింది. అందువల్ల మిగతా పిల్లలు మాదిరిగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలో అంతంతా ఫీజులు చెల్లించి చదవుకులేని నిస్సహయ స్థితిలో పడింది పింకీ. మళ్లీ తన పరిస్థితి మొదటకొచ్చింది అనుకునేలోపే 2018లో, టోంగ్-లెన్ ఛారిటబుల్ ట్రస్ట్ మరోసారి ఆమెను ఆదుకుంది. చైనాలోని ప్రఖ్యాత మెడికల్ కాలేజ్లో అడ్మిషన్ పొందడంలో పింకీకి సహాయం చేసింది. అలా ఆమె ఆరేళ్లలో చైనీస్ కళాశాల నుంచి ఎంబీబీఎస్ పట్టా పొంది డాక్టర్ అయ్యింది. ఇప్పుడు మళ్లీ ధర్మశాలకు తిరిగి వచ్చేసింది. ప్రస్తుతం ఆమె భారతదేశంలో వైద్యం అందించేందుకు అవసరమైన మెడికల్ లైసెన్స్ని పొందేందుకు ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎగ్జామినేషన్(ఎఫ్ఎంజీఈ) కోసం సిద్ధమవుతుంది. ఇంతలా పింకీ జీవితాన్ని మార్చిన బౌద్ధ సన్యాసి లోబ్సాంగ్ జమ్యాంగ్ ఆమెను చూసి గర్వపడుతున్నానని అన్నారు. పిల్లలు మంచి మనుషులుగా మారేలా ప్రోత్సహించబడితే నిస్సందేహంగా అద్భుతాలు చేస్తారని విశ్వసిస్తానని చెప్పారు. ఇక పింకీ తన జీవితాన్ని ఇంతలా గౌరవప్రదంగా మార్చిన జమ్యాంగ్ని తన తండ్రిగా అభివర్ణించింది. అంతేగాదు పింకీలా ఆ ధర్మశాలలో చదివిన వందలాది మంది పిల్లలు జీవితాలు మారడమే గాక వారంతా వైద్యులు, ఇంజనీర్లు, ప్రభుత్వాధికారులుగా స్థిరపడ్డారు. ఈ పింకీ గాథ జీవితంలో లభించే అవకాశాన్ని అందిపుచ్చుకుని కష్టపడితే కష్టాల నుంచి బయటపడటమే గాక అద్భుతాలు చేసి చూపించొచ్చని తెలుస్తోంది కదూ..!.(చదవండి: ఈసారి దీపావళికి చీరను వెరైటీగా కట్టుకోండిలా..!) -
రంజీ ట్రోఫీ చరిత్రలో అరుదైన ఘట్టం
రంజీ ట్రోఫీ చరిత్రలో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. ఉత్తరాఖండ్తో జరుగుతున్న మ్యాచ్లో హిమాచల్ ప్రదేశ్కు చెందిన టాప్-4 బ్యాటర్లు సెంచరీలు చేశారు. రంజీ ట్రోఫీ చరిత్రలో ఇలా జరగడం ఇది రెండో సారి మాత్రమే. 2019 ఎడిషన్లో అరుణాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో గోవా టాప్-4 ఆటగాళ్లు సెంచరీలు చేశారు. నాడు అమోన్కర్ (160), గోవెకర్ (160), స్మిత్ పటేల్ (137 నాటౌట్), అమిత్ వర్మ (122 నాటౌట్) మూడంకెల స్కోర్ను చేశారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్తో జరుగుతున్న మ్యాచ్లో హిమాచల్ టాప్-4 బ్యాటర్లు శుభమ్ అరోరా (11), చోప్రా (171), అంకిత్ కల్సి (205 నాటౌట్), ఏకాంత్ సేన్ (101) సెంచరీలు చేశారు. ఓవరాల్గా ఫస్టక్లాస్ క్రికెట్ చరిత్రలో ఇలా టాప్-4 బ్యాటర్లు సెంచరీలు చేయడం ఇది 14వ సారి.మ్యాచ్ విషయానికొస్తే.. టాప్-4 బ్యాటర్లు సెంచరీలతో కదంతొక్కడంతో తొలుత బ్యాటింగ్ చేసిన హిమాచల్ తొలి ఇన్నింగ్స్ను 663 పరుగుల వద్ద (3 వికెట్ల నష్టానికి) డిక్లేర్ చేసింది. డబుల్ సెంచరీ చేసిన అంకిత్ కల్సితో పాటు మయాంక్ డాగర్ (56) క్రీజ్లో ఉన్నాడు. ఉత్తరాఖండ్ బౌలర్లలో మయాంక్ మిశ్రా, స్వప్నిల్ సింగ్, యువరాజ్ చౌదరీ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఉత్తరాఖండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. కెప్టెన్ రవికుమార్ సమర్థ్ 21 పరుగులు చేసి ఔట్ కాగా.. అవ్నీశ్ సుధా (24), వైభవ్ బట్ (1) క్రీజ్లో ఉన్నారు. రవికుమార్ వికెట్ వైభవ్ అరోరాకు దక్కింది. హిమాచల్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఉత్తరాఖండ్ ఇంకా 613 పరుగులు వెనుకపడి ఉంది.చదవండి: మాహారాజు కాబోతున్న టీమిండియా మాజీ క్రికెటర్.. ఎవరంటే? -
ఇండియా-చైనా సరిహద్దుల్లో డ్రోన్ కదలికలు: హిమాచల్ మంత్రి
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లోని కిన్నౌర్ జిల్లాలో ఉన్న ఇండియా-చైనా సరిహద్దుల్లో డ్రోన్ కదలికలను గుర్తించినట్లు హిమాచల్ ప్రదేశ్ మంత్రి జగత్ సింగ్ నేగి తెలిపారు. సరిహద్దుల్లో పొరుగు దేశం చైనా.. డ్రోన్లను నిఘా, గూఢచర్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నట్లు ఆయన ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వం బోర్డర్లో డ్రోన్ల కదలికల విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘‘కిన్నౌర్ జిల్లాలోని షిప్కి లా , రిషి డోగ్రీ గ్రామాల్లో డ్రోన్ కార్యకలాపాలను గుర్తించాం. సరిహద్దు ప్రాంతానికి సమీపంలో తరచుగా డ్రోన్లు ఎగురుతున్నట్లు గత వారంలో కూడా గుర్తించాం. షిప్కిలా, రిషిడోగ్రి గ్రామాల్లో వాస్తవ నియంత్రణ రేఖ వరకు రహదారి నిర్మాణం పురోగతిలో ఉంది. ..పొరుగుదేశం చైనా ఈ డ్రోన్ల ద్వారా నిఘా, గూఢచర్యానికి పాల్పడే అవకాశాన్ని తోసిపుచ్చలేం. డ్రోన్లను పోలీసులు, ఆర్మీ సిబ్బంది సైతం చూశారు. చైనా డ్రోన్లు భారత గగనతలంలోకి చొరబడటం చట్టాలను ఉల్లంఘించినట్లు అవుతుంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని అవసరమైన ఆదేశాలు జారీ చేయాలి’ అని అన్నారు.ఇక.. హిమాచల్ ప్రదేశ్లోని కిన్నౌర్, లాహౌల్, స్పితి గిరిజన జిల్లాలు చైనాతో 240 కిలో మీటర్ల సరిహద్దును కలిగి ఉన్నాయి. -
వంకర బుద్ధులు మారవా?
ఏదో వంకన కులమతాల కుంపట్లు రాజేసే పనికి పాల్పడవద్దని సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన హితవు కూడా ప్రభుత్వాల చెవికెక్కడంలేదు. ఇందుకు ఉత్తరప్రదేశ్, హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వాల పోకడలు నిదర్శనం. కావడ్ యాత్ర సాగే పొడవునా ఆహారం, ఇతర తినుబండారాలు విక్రయించే వ్యాపారులు తమ పేర్లను తెలిపే బోర్డుల్ని ప్రదర్శించాలని ఉత్తరప్రదేశ్ పోలీసు విభాగం జారీ చేసిన హుకుంను మొన్న జూలైలో సుప్రీంకోర్టు నిలిపి వేయగా, దాన్ని వమ్ము చేస్తూ వేరే మార్గంలో అమలు చేయటానికి అక్కడి ప్రభుత్వం పూనుకోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. యూపీని చూసి మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లు సైతం వాతలు పెట్టుకున్నాయి. అవి కూడా బీజేపీ ప్రభుత్వాలే. కానీ ఈ మాదిరి ధోరణులకు వ్యతిరేకమని చెప్పే కాంగ్రెస్ నేతృత్వంలోని హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వం సైతం ఈ ప్రయత్నమే చేయటం మరింత దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. ఒక మంత్రి తెలిసీ తెలియక ఏదో అన్నారని కాంగ్రెస్ సంజాయిషీ చెబుతున్నా ఆత్మవిమర్శ చేసుకోవటం ఆ పార్టీ బాధ్యత. ఎవరూ కుల మతాలను ఎంచుకుని పుట్టరు. కానీ పుట్టకనుబట్టి వివక్ష ప్రదర్శించే దురాచారం మన దేశంలో రాజ్యాంగం నిషేధించినా కొనసాగుతూనేవుంది. దహనకాండకు దిగే వ్యక్తులను దుస్తుల్ని బట్టి పోల్చుకోవచ్చని అయిదేళ్లక్రితం ప్రధాని నరేంద్ర మోదీ అన్నప్పుడు దుమారం రేగింది. అప్పటికి పౌరసత్వ సవరణ చట్టంపై కొనసాగుతున్న ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. దుస్తులే కాదు... ఇంటిపేర్లూ, పేర్లూ, పేర్లచివరవుండే తోకలు, తినే తిండి కూడా సమ స్యాత్మకం కావటం వర్తమానంలో ఎక్కువైంది. దీన్నంతటినీ గమనించబట్టే యూపీ పోలీసుల ఉత్తర్వులను సుప్రీంకోర్టు నిలిపివేసింది. ఇలాంటి ఉత్తర్వులిచ్చే అధికారం పోలీసు విభాగానికిఉండదని చెబుతూనే తోపుడు బండ్లు, ధాబాలు, హోటళ్ల యజమానులు స్వచ్ఛందంగా తమ పేర్లు ప్రదర్శించదల్చుకుంటే అభ్యంతరంలేదని, అయితే బలవంతంగా ఆ పని చేయించరాదని సుప్రీంకోర్టు అప్పట్లో తెలిపింది. ఇప్పుడు ఏకంగా ఆహార భద్రత, ప్రమాణాల చట్టం సవరణ మాటున యూపీ సర్కారు దాన్ని అమలుచేయడానికి పూనుకుంటున్నది. ఆహారంలో కల్తీ జరగకుండా, అపరిశుభ్రత లేకుండా చూడటం తన ఉద్దేశమంటున్నది. హిమాచల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి విక్రమాదిత్య సింగ్ సైతం ఆ బాణీనే వినిపిస్తున్నారు. రాష్ట్రంలో ఇటీవల మతఘర్షణలు చెలరేగటం వెనక ఆహారపదార్థాల విక్రయానికి సంబంధించి బలమైన చట్టం లేకపోవటమే కారణమని ఆయనకు అనిపించిందట!యూపీఏకు ఆవును చేరిస్తే అది ఎన్డీయే అవుతుందని చాన్నాళ్లక్రితం ఎవరో చమత్కరించారు. తమ చాపకిందకు నీళ్లు రాబోతున్నాయని చివరాఖరులో అర్థమయ్యాక హిందూ ఓటు బ్యాంకును కాపాడుకోవటానికి ఆనాటి యూపీఏ సర్కారు వేసిన అనేక పిల్లిమొగ్గలు చూశాకే అలాంటి వ్యాఖ్యా నాలు వినబడ్డాయి. ఆ మన స్తత్వం పార్టీలో ఇంకా సజీవంగా ఉండటంవల్లే విక్రమాదిత్యసింగ్ ఇలా అన్నారా లేక సీఎం రేసులో భంగపడి కేబినెట్ పదవితో సరిపెట్టుకోవటం జీర్ణించుకోలేక వివాదా స్పదంగా మాట్లాడారా అన్నది ఆ పార్టీ తేల్చుకోవాలి. ఆహార విక్రయ దుకాణాల దగ్గర యజ మానుల పేర్లుండాలన్న అంశంలో కమిటీ వేశామని, ఇంతకుమించి ముందుకుపోలేదని కాంగ్రెస్ ప్రతినిధి ఇస్తున్న వివరణ సందేహాలను తగ్గించకపోగా పెంచింది. పార్టీకంటూ ఒక సిద్ధాంతం, విధానం ఉందా లేదా? యూపీ నిర్ణయాన్ని నిర్ణయాన్ని పార్టీ వ్యతిరేకించినప్పుడు వేరే రాష్ట్రంలో ఆ పార్టీ ప్రభుత్వం సరిగ్గా అదే పనికి పూనుకోవటంలోని మతలబేమిటి? పేర్లు కాదు... వారి వారి గుర్తింపు కార్డులు ప్రదర్శించాలన్న ప్రతిపాదన వచ్చిందని మరో సంజాయిషీ. ఏమైతేనేం... మతంపేరిట విద్వేషాలు సృష్టించటమే అంతరార్థంగా కనబడుతోంది. దుకాణంలో విక్రయించే ఆహార పదార్థాలు పరిశుభ్రమైనవని, ప్రామాణికమైనవని విశ్వసిస్తేనే వాటిని జనం కొనుక్కుతింటారు. కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేయటమే మన దేశంలో కనిపిస్తుంది. ఈ విషయంలో అవసరమైన చట్టాలున్నాయి. ఆ నిబంధనలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకునే విభాగాలు ఉంటున్నాయి. కానీ వాటిని పకడ్బందీగా అమలు చేయటానికి సిద్ధపడని ప్రభుత్వాలు ఆ వంకన విభజన రాజకీయాలకు తెరతీస్తున్నాయి. ప్రత్యర్థులను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అలవికాని హామీలిచ్చి అధికారంలోకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం అందరూ ఎంతో భక్తివిశ్వాసాలతో స్వీకరించే లడ్డూపై ఎలాంటి దుష్ప్రచారం చేసిందో దేశమంతా చూస్తూనే వుంది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ తెలివితక్కువ చర్యను స్ఫూర్తిగా తీసుకున్నట్టు కనబడుతోంది. మనుషుల పేర్లనుబట్టి, వారి ఆహారపుటలవాట్లనుబట్టి వారి మతాలను తెలుసుకోవటం సులభ మవుతుందన్నది వాస్తవమే కావొచ్చు. కానీ వారు విక్రయించే పదార్థాలు సమస్తం కేవలం ఆ కారణంతో మంచివి, ప్రామాణికమైనవి లేదా అపరిశుభ్రమైనవి ఎలా అవుతాయో అనూహ్యం. విపరీత పోకడలున్నవారికి తప్ప ఇటువంటి ఆలోచనలు రావు. సొంతంగా ఎటూ ఉన్నతమైన ఆలోచనలు రావు. కనీసం రాజ్యాంగాన్ని అనుసరించి మాత్రమే పాలించాల్సినవారు సర్వోన్నత న్యాయస్థానం హితవు చెప్పాకైనా మారాలికదా! వ్యక్తులుగా వక్రమార్గాలు వెదుక్కోవటం మానవ స్వభావమని సరిపెట్టుకోవచ్చు. రాజ్యం అటువంటి పనులకు పూనుకుంటే అంతిమంగా అరాచకానికి దారితీస్తుంది. కనుక మతిమాలిన చేష్టలను ఇకనైనా మానుకోవాలి. -
సోనియాగాంధీపై కంగన సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీపై బీజేపీ ఎంపీ కంగనరనౌత్ సంచలన ఆరోపణలు చేశారు. హిమాచల్ ప్రదేశ్ దివాలా తీయడానికి సోనియాగాంధీయే కారణమన్నారు. హిమాచల్ప్రదేశ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులన్నీ సోనియాగాంధీకే వెళ్లాయని,దీనివల్లే రాష్ట్రం దివాలా తీసిందన్నారు.చివరకు వరద సాయానికిగాను విరాళాలుగా వచ్చిన సొమ్ము కూడా సోనియాకే వెళ్లిందని తీవ్ర ఆరోపణలు చేశారు.‘హిమాచల్లో కాంగ్రెస్ అవినీతి ఎంతుందనేది ప్రతి ఒక్కరికి తెలుసు.ఈ అవినీతి వల్లే రాష్ట్రం దశాబ్దాల వెనుకబాటుకు గురైంది. ఇందుకే కాంగ్రెస్ను కూకటివేళ్లతో పెకిలించాలని హిమాచల్ ప్రజలను కోరుతున్నా’అని కంగన పిలుపిచ్చారు.కాగా,ప్రస్తుతం హిమాచల్ప్రదేశ్ నిధులలేమితో దివాలా అంచున ఉంది. దీంతో సీఎం, మంత్రులు,కార్పొరేషన్ల చైర్మన్లు రెండు నెలల పాటు జీతాలు తీసుకోరని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో కంగన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
హిమాచల్ సీఎం సుఖూకు అస్వస్థత
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖూ అస్వస్థతకు గురయ్యారు. ఈ మేరకు ఆయన సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో పరీక్షలు చేయించుకున్నారు. ఆయనను పరీక్షించిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ నేపధ్యంలో సీఎం జమ్మూ ఎన్నికల పర్యటన వాయిదా పడింది.మీడియాకు అందిన వివరాల ప్రకారం సీఎం సుఖూ శనివారం ఉదయం ఐజీఎంసీలో ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా సీఎంకు అల్ట్రాసౌండ్ పరీక్ష చేయడంతో పాటు వైద్యులు అతని రక్త నమూనాలు కూడా తీసుకున్నారు. సీఎం ఆరోగ్యంపై ఐజీఎంసీ ఎంఎస్ డాక్టర్ రాహుల్ రావు ఓ ప్రకటన విడుదల చేశారు.సీఎం సుఖూ తనకు కడుపు పైభాగంలో నొప్పి వస్తోందని తెలిపారని, ఈ నేపధ్యంలోనే అతనికి అల్ట్రాసౌండ్ చేయించామన్నారు. దీని రిపోర్టు నార్మల్ గా ఉందని, అయితే ముందుజాగ్రత్తగా రక్తపరీక్ష కూడా చేశామన్నారు. ఈ రిపోర్టు ఇంకా రావాల్సి ఉందన్నారు. కాగా గత ఏడాది సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖూ కడుపునొప్పితో బాధపడుతూ వారం రోజుల పాటు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు.ఇది కూడా చదవండి: తెరుచుకున్న జార్ఖండ్- బెంగాల్ సరిహద్దు -
గ్యారంటీల అమలుకు గంజాయి సాగు.. కాంగ్రెస్ సర్కార్కు బీజేపీ మద్దతు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో గెలుపే లక్క్ష్యంగా కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు అంటూ ప్రజలపై పథకాల వర్షం కురిపించింది. తీరా ఎన్నికల్లో గెలిచాక.. ఆర్థిక నష్టాల కారణంగా హామీలను తీర్చడంలో భారంగా మారింది. ఈ నేపథ్యంలో ఆర్థిక భారం తగ్గించుకునేందుకు హిమాచల్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. హిమాచల్లో గంజాయి సాగుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీని ద్వారా ఏడాదికి రూ.2000 కోట్లు సమకూరుతాయని అంచనా వేసుకుంది.అయితే, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీల అమలు కోసం గంజాయి సాగు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం సూచన మేరకు రెవెన్యూ శాఖ మంత్రి జగత్ సింగ్ నేగి నేతృత్వంలో శాస్త్రవేత్తలు, ఉద్యానవన నిపుణులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్పీకర్ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. తాజాగా కమిటీ నివేదిక శాసనసభలో ప్రవేశపెట్టగా ఏకగ్రీవ ఆమోదం పొందింది. దీనికి ప్రతిపక్ష బీజేపీ సభ్యులు కూడా మద్దతు ఇవ్వడం గమనార్హం.ఇక.. ఔషధ, శాస్త్రీయ, పారిశ్రామిక అవసరాల కోసం నియంత్రిత పద్ధతిలో గంజాయి సాగు చేయాలని నిపుణుల బృందం ప్రతిపాదన చేసినట్టు మంత్రి నేగి తెలిపారు. గంజాయి సాగు సులభం కాబట్టి దీనికి ప్రజల మద్దతు కూడా ఉందని చెప్పారు. ఈ తీర్మానాన్ని అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించినట్టు చెప్పారు. గంజాయి సాగుకు అనుమతించేందుకు నార్కోటిక్ నిబంధనలను(ఎన్డీపీఎస్ చట్టం) సవరించాలని నిపుణుల కమిటీ సూచించినట్టు చెప్పుకొచ్చారు.ఈ కమిటీ హిమాచల్ ప్రదేశ్లోని అన్ని జిల్లాల్లోనూ పర్యటించి.. ఔషధ, పారిశ్రామిక అవసరాల కోసం గంజాయి సాగును ఎలా ఉపయోగించవచ్చనే దానిపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంది. అంతేకాకుండా జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో గంజాయి సాగు విజయవంతమైన నమూనాలను కూడా అధ్యయనం చేసింది. వాటన్నింటినీ పరిశీలించిన తర్వాతే హిమాచల్ ప్రదేశ్లో గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పించినట్లు నేగి స్పష్టం చేశారు.వైద్యంలో గంజాయి వాడకం..గంజాయిని కేవలం మాదక ద్రవ్యంగా సేవించడమే కాకుండా పలు ఔషధాల్లో కూడా ఉపయోగిస్తారు. మూర్ఛ, మానసిక అనారోగ్యం, క్యాన్సర్ రోగులకు గంజాయి మొక్కలోని మత్తు లేని భాగాన్ని తీసుకుని చికిత్స చేయవచ్చని పరిశోధనల్లో వెల్లడైంది. గంజాయి మొక్కలో రెండు రకాల రసాయనాలను గుర్తించారు. ఒకటి టెట్రాహైడ్రోకాన్నబినాల్(టీహెచ్సీ), మరొకటి కాన్నబిడాల్(సీబీడీ). టీహెచ్సీ కంటెంట్ ఎక్కువగా ఉండడంతో గంజాయి మొక్కను నార్కోటిక్ పంటగా కూడా పిలుస్తారు. కాన్నబిడాల్లో ఎలాంటి మత్తు పదార్థాలు ఉండవు. గంజాయి మొక్కలోని ఈ రసాయనాన్ని వైద్యంలో వాడుతున్నారు. నేషనల్ బొటానికల్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్లోని సమాచారం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా గంజాయి మొక్క నుంచి 25వేలకు పైగా ఉత్పత్తులను తయారు చేస్తున్నారు.చట్టం ఏం చెబుతోంది?మన దేశంలో ఎన్డీపీఎస్ యాక్ట్-1985 ప్రకారం, హెరాయిన్, మార్ఫిన్, గంజాయి, హశిష్, హశిష్ ఆయిల్, కొకైన్, మెఫిడ్రిన్, ఎల్ఎస్డీ, కేటమైన్, అంఫెటమైన్ లాంటి మత్తు పదార్థాల ఉత్పత్తి, రవాణా, అమ్మకం చట్టవిరుద్ధం. ఈ యాక్ట్లోని 20వ సెక్షన్ ప్రకారం గంజాయిని అక్రమంగా సాగు చేస్తే 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది.అయితే, గంజాయి సాగుపై దేశమంతటా నిషేధం ఉన్నప్పటికీ, ఈ విషయంలో చట్టాలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు వెసులుబాటు ఉంది. దేశంలో ఒక్క ఉత్తరాఖండ్లో మాత్రమే గంజాయి సాగుకు షరతులతో కూడా అనుమతులు ఉన్నాయి. యూపీ, జమ్మూకశ్మీర్, మణిపూర్ రాష్ట్రాల్లో పరిశోధనాపరమైన అవసరాల కోసం మాత్రమే గంజాయి సాగుకు అనుమతి ఉంది. గంజాయి పంటను ఏడాదిలో రెండు సార్లు పండించవచ్చు.అమెరికాలో ఇలా.. ప్రపంచంలో చాలా దేశాల్లో గంజాయి వాడకం తప్పేం కాదు. అలాగే గంజాయిని చట్ట బద్ధం చేయాలనే డిమాండ్ అమెరికాలో ఎప్పటి నుంచో ఉంది. ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వే ప్రకారం.. 88 శాతం అమెరికన్లు గంజాయి వాడకాన్ని చట్టబద్ధం చేయాలని కోరుతున్నారు. కేవలం 11 శాతం మంది మాత్రమే వద్దని కోరారు. తాజాగా బైడెన్ హయాంలో మాదకద్రవ్యాల చట్టంలో మార్పులు జరిగాయి. గంజాయిని షెడ్యూల్-3 డ్రగ్ నుంచి షెడ్యూల్-1 డ్రగ్ కేటగిరీకి మార్చారు. అంటే ప్రమాదకరమైన మాదక ద్రవ్యాల జాబితా నుంచి తక్కువ ప్రమాదకరమైన మాదకద్రవ్యాల జాబితాలోకి చేర్చుతున్నారు. -
బోల్తా కొట్టిన బస్సు.. ఒకరు మృతి, 12 మందికి గాయాలు
పఠాన్కోట్: పంజాబ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంబా నుంచి అమృత్సర్ వెళ్తున్న హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఆర్టీసీ బస్సు పఠాన్కోట్ సమీపంలో శుక్రవారం ప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా అదుపుతప్పి బొల్తా కొట్టడంతో బస్సు ముందు అద్దాలు పగిలాయి.ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.. హిమాచల్ ప్రదేశ్- పంజాబ్ సరిహద్దుల్లోని మమూన్ కాంట్లో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పఠాన్కోట్-చంబా జాతీయ రహదారిపై బస్సు బోల్తా పడిన సీసీటీవీ ఫుటేజీ వైరల్గా మారింది.ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. పఠాన్కోట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 41 మంది ప్రయాణికులుఉండగా.. చంబా నుంచి అమృత్సర్కు వెళుతోంది. -
ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే.. పెన్షన్ రద్దు
సిమ్లా: పార్టీ ఫిరాయింపులను అరికట్టేందుకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు మరో పార్టీకి చేరకుండా ఉండేందుకు బుధవారం అసెంబ్లీలో ఓ కొత్త బిల్లును తీసుకువచ్చింది. పార్టీ మారితే ఎమ్మెల్యేల పెన్షన్ రద్దు చేసేలా ఆ బిల్లును రూపొందించింది. ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు హిమాచల్ ప్రదేశ్ శాసనసభలో.. సభ్యుల భత్యాలు ,పెన్షన్ (సవరణ బిల్లు)- 2024 పేరుతో నూతన బిల్లును ప్రవేశపెట్టగా ఆమోదం పొందింది. ఇక ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు కొత్త బిల్లు ప్రకారం పెన్షన్ రద్దు వర్తిస్తుంది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఏ సమయంలోనైనా ఎమ్మెల్యేలుగా అనర్హతకు గురైతే.. కొత్త బిల్లు ప్రకారం పెన్షన్కు అర్హులు కాదు’అని ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ఈ బిల్లు ప్రస్తావించింది.ఇక..ఫిబ్రవరి 27న హిమచల్ ప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కాకుండా బీజేపీ అభ్యర్థికి ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓటు వేశారు. అనంతరం వారంతా బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఇటువంటి పరిస్థితులు ఎదురుకాకుండా ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కీలకమైన బిల్లును ఆమోదించింది. -
మహిళల కనీస వివాహ వయసు 21 ఏళ్లు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో ఇకపై మహిళల కనీస వివాహ వయసు 21 ఏళ్లు. నిర్దేశిత వయసు కంటే తక్కువ వయసున్న మహిళలకు పెళ్లి చేస్తే నేరం అవుతుంది. మహిళ కనీస వివాహ వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచుతూ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందింది. ఈ మేరకు బాల్య వివాహాల నిషేధ చట్టం–2006 స్థానంలో బాల్య వివాహాల(హిమాచల్ ప్రదేశ్) నిషేధ సవరణ–2024 చట్టం తీసుకొచ్చారు. 2006 నాటి చట్టం ప్రకారం మహిళల కనీస వివాహ వయసు 18 ఏళ్లు కాగా, పురుషుల కనీస వివాహ వయసు 21 ఏళ్లుగా ఉంది -
హిమాచల్ ప్రదేశ్ లో వరద బీభత్సం..
-
వాగులో కొట్టుకుపోయిన కారు
సిమ్లా: ఎగువన కురుస్తున్న వర్షాలకు ఉనా జిల్లాలోని జైజోన్ చో వాగు ఉప్పొంగడంతో ఎస్యూవీ వాహనం కొట్టుకుపోయి తొమ్మిది మంది మృతి చెందారు. ఇద్దరు గల్లంతయ్యారు. మృతుల్లో 8 మంది ఒకే కుటుంబానికి చెందినవారు కాగా, మరొకరు డ్రైవర్. ఉనా జిల్లాలోని డెహ్రా నుంచి పంజాబ్లోని ఎస్బీఎస్ నగర్ జిల్లా మెహ్రోవాల్ గ్రామానికి ఓ వివాహానికి హాజరయ్యేందుకు ఎస్యూవీ వాహనంలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది, డ్రైవర్ ప్రయాణిస్తున్నారు. భారీ వర్షం కారణంగా ఉప్పొంగి ప్రవహిస్తున్న జైజోన్ చో నదిని దాటుతుండగా వారి వాహనం కొట్టుకుపోయింది. స్థానికులు దీపక్ భాటియా అనే వ్యక్తిని రక్షించి జైజోన్ లోని ప్రభుత్వ డిస్పెన్సరీకి తరలించారు. వాహనం వరద నీటిలో ఇరుక్కుపోయింది. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందం రంగంలోకి దిగింది. వాగు నుంచి ఐదుగురు మహిళలతో సహా తొమ్మిది మంది మృతదేహాలను వెలికితీసింది. గల్లంతైన ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టింది. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో దాటొద్దని స్థానికులు హెచ్చరించినా డ్రైవర్ పట్టించుకోలేదని పోలీసులు తెలిపారు. మృతులను సూర్జిత్ భాటియా, అతని భార్య పరమజీత్ కౌర్, సోదరుడు స్వరూప్ చంద్, మరదలు బిందర్, మెహత్పూర్లోని భటోలీకి చెందిన షినో, ఆమె కుమార్తెలు భావన, అను, కుమారుడు హర్షిత్, డ్రైవర్ బిందుగా గుర్తించారు. -
Himachal: వరదలతో విలవిల.. 87 రహదారులు మూసివేత
గత కొన్ని రోజులుగా హిమాచల్ప్రదేశ్ను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో వరదలు సంభవిస్తున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ పరిస్థితులను గమనించిన అధికారులు మనాలి-లేహ్ జాతీయ రహదారితో పాటు 87 ఇతర రహదారులను మూసివేశారు. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తాయని ప్రకటించిన వాతావరణ శాఖ ఆగస్టు 7, 8 తేదీల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా చంద్రభాగ్ నది నీటిమట్టం పెరిగిందని హిమాచల్ ప్రదేశ్ పోలీసులు తెలిపారు. లాహౌల్, స్పితి జిల్లాలో రెండు చోట్ల ఆకస్మిక వరదలు సంభవించాయి. జింగ్ జింగ్బర్ సమీపంలో మనాలి-లేహ్ జాతీయ రహదారి మట్టిపెళ్లలు పేరుకుపోయాయి. దర్చా, సర్చు పోలీసు చెక్పోస్టుల వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బ్రో) హైవేపై పేరుకుపోయిన చెత్తను తొలగిస్తోంది. కాగా కేదార్నాథ్ నడక మార్గంలో భారీ వర్షం కారణంగా వివిధ ప్రదేశాలలో చిక్కుకుపోయిన యాత్రికులు, స్థానికులను రక్షించే కార్యక్రమం ఐదవ రోజు కూడా కొనసాగింది. సోమవారం 1,401 మందిని రక్షించారు. గుజరాత్లోని నవ్సారి, వల్సాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ ప్రాంతాల నుంచి వెయ్యి మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
ఉత్తరాన వరుణాగ్రహం
డెహ్రాడూన్/సిమ్లా/న్యూఢిల్లీ/జైపూర్: కేరళ కొండల్లో బురద, బండరాళ్లు సృష్టించిన విలయ విషాద ఘటన మరువకముందే ఉత్తరాదిపై వరుణుడు తన ప్రకోపం చూపించాడు. ఉత్తరాఖండ్ మొదలు రాజస్థాన్దాకా ఉత్తరభారత రాష్ట్రాల్లో ఎడతెగని వానలు పడ్డాయి. దీంతో ఏడు రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా 36 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరాఖండ్లో 12 మంది, హిమాచల్ ప్రదేశ్లో ఐదుగురు, ఢిల్లీలో ఆరుగురు, ఉత్తరప్రదేశ్లో ఇద్దరు, హరియాణాలో ముగ్గురు, రాజస్థాన్లో ముగ్గురు, బిహార్లో ఐదుగురు చనిపోయారు. చాలా మంది జాడ గల్లంతైంది. నదులు ఉప్పొంగి ప్రవహిస్తూ సమీప జనావాసాలను తమలో కలిపేసుకున్నాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో కొండప్రాంతాల్లోని ఇళ్లు నేలమట్టమయ్యాయి. పలుచోట్ల రోడ్లు తెగిపోయాయి. దీంతో రాకపోకలు స్తంభించాయి. ఎన్డీఆర్ఎఫ్, రాష్ట్ర విపత్తు స్పందన దళాలు, పోలీసులు, స్థానికులు ముమ్మర సహాయక చర్యల్లో మునిగిపోయారు. ఉత్తరాఖండ్లో ఎక్కువ మరణాలు ఉత్తరాఖండ్లో కుంభవృష్టి కారణంగా 12 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. నదులు ఉప్పొంగి ప్రవహిస్తూ సమీప ఇళ్లను నేలమట్టంచేశాయి. హరిద్వార్, తెహ్రీ, డెహ్రాడూన్, ఛమోలీ జిల్లాలో వర్షపాత ప్రభావం ఎక్కువగా ఉంది. హరిద్వార్లోని రోషనాబాద్లో 210 మిల్లీమీటర్లు, డెహ్రాడూన్లో 172 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెహ్రీ జిల్లా జఖన్యాలీ గ్రామంలో రోడ్డ పక్కన రెస్టారెంట్పై కొండచరియలు పడటంతో ఒకే కుటుంబంలో ముగ్గురు మట్టిపెళ్లల కింద సజీవసమాధి అయ్యారు. గౌరీకుండ్–కేదార్నాథ్ కొండమార్గంలో పాతిక మీటర్ల దారి వర్షాలకు కొట్టుకుపోవడంతో భీమ్బలీ చౌక్ వద్ద చిక్కుకుపోయిన 1,525 మందిలో 425 మందిని సురక్షితంగా తీసుకొచ్చామని సీఎం చెప్పారు. 1,100 మందిని సోనప్రయాగ్కు సురక్షితంగా తీసుకొచ్చామని విపత్తు కార్యదర్శి వినోద్ సుమన్ చెప్పారు. మిగతా వారిని హెలీకాప్టర్లలో తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హిమాచల్లో 50 మంది జాడ గల్లంతు హిమాచల్ ప్రదేశ్నూ వర్షాలు ముంచెత్తాయి. వర్ష సంబంధ ఘటనల్లో ఐదుగురు మరణించారు. వేర్వేరు జిల్లాల్లో మొత్తంగా 50 మంది జాడ గల్లంతైంది. పలు వంతెనలు, రోడ్లు, ఇళ్లు వరదనీటి ఉధృతికి కొట్టుకుపోయాయి. మండీ, రాంపూర్, సిమ్లా జిల్లాల్లో వర్షప్రభావం ఎక్కువగా ఉంది. మనాలీ–చండీగఢ్ జాతీయ రహదారిపై చాలాచోట్ల కొండచరియలు పడటంతో రాకపోకలు స్తంభించాయి. గల్లంతైన వారి జాడ కోసం ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీసులు డ్రోన్ల సాయంతో గాలిస్తున్నారు. కూలూలోని మలానా డ్యామ్ పై నుంచి నీరు కిందకు ప్రవహిస్తోంది. దీంతో భారీఎత్తున నీరు దిగువ ప్రాంతాలను ముంచేసింది. దీంతో ఎగువ ప్రాంతాలకు తక్షణం వెళ్లిపోవాలని స్థానికులకు అధికారులు హెచ్చరికలు పంపారు. ఢిల్లీలో 108 మిల్లీమీటర్ల వర్షపాతం గురువారం ఢిల్లీలో వర్ష సంబంధ ఘటనల్లో ఆరుగురు చనిపోయారు. 24 గంటల వ్యవధిలో ఢిల్లీలో 108 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత 14 ఏళ్లలో ఢిల్లీలో జూలై నెలలో ఒక్కరోజులో ఇంతటి వర్షం పడటం ఇదే తొలిసారి. ముఖ్యంగా మయూర్విహార్ వద్ద 147 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డయింది. -
చూస్తుండగానే కుప్పకూలిన భవనం..
-
Himachal: కుంభవృష్టితో 50 మంది గల్లంతు
ఢిల్లీ: హిమాచల్ప్రదేశ్లోని షిమ్లా జిల్లా రాంపూర్ ప్రాంతంలోని సమేజ్ ఖాడ్ వద్ద కుంభవృష్టి కారణంగా మెరుపు వరదలు పోటెత్తాయి. ఈ ఘటనలో 50 మంది గల్లంతై ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే నలుగురి మృతదేహాల్ని హిమాచల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీంలు వెలికి తీశాయి. మిగతా వాళ్ల కోసం గాలింపు కొనసాగుతోంది.గురువారం వేకువజామున ఈ ఘటన జరిగినట్లు డిప్యూటీ కమిషనర్ అనురాగ్ కశ్యప్ వెల్లడించారు. ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు సహా ఇతర సహాయక సిబ్బంది సైతం అక్కడికి చేరుకున్నట్లు ఆయన తెలిపారు. #WATCH | Himachal Pradesh | The SDRF team at the spot in Shimla for the search and rescue operation where 36 people are missing and 2 bodies have been recovered so far after a cloudburst in the Samej Khad of Rampur area in Shimla district. (Visual source - CMO) pic.twitter.com/WqF6vDk4Tx— ANI (@ANI) August 1, 2024 -
హిమాచల్ ఉప ఎన్నికల్లో సీఎం భార్య విజయం
దేశంలోని ఏడు రాష్టాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జూలై 10న ఎన్నికలు జరగగా, నేడు(శనివారం) ఓట్ల లెక్కింపు జరుగుతోంది. తాజాగా హిమాచల్ ప్రదేశ్లోని డెహ్రా ఉపఎన్నికకు సంబంధించిన ఫలితం వెలువడింది.ఇక్కడి నుంచి పోటీచేసిన బీజేపీ అభ్యర్థి హోషియార్ సింగ్ ఓటమి పాలయ్యారు. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ భార్య, కాంగ్రెస్ అభ్యర్థి కమలేష్ ఠాకూర్ విజయం సాధించారు. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ స్థానానికి సంబంధించిన 11 రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసింది. హిమాచల్ ప్రదేశ్లో ఉప ఎన్నికలు జరిగిన మూడు స్థానాల్లో డెహ్రా స్థానం ఫలితం మొదట వెలువడింది. -
మరో వివాదంలో చిక్కుకున్న కంగనా రనౌత్
ధర్మశాల : బీజేపీ ఎంపీ,బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ‘ఆధార్ కార్డ్’ వివాదంలో చిక్కుకున్నారు.ఇటీవల హిమాచల్ ప్రదేశ్ లోక్సభ ఎన్నికల్లో మండీ లోక్సభ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించిన ఆమె తన నియోజకవర్గ ప్రజలతో భేటీ అవుతున్నారు. ఈ తరుణంలో సమస్యల్ని పరిష్కరించమని తన వద్దకు వచ్చే వారు తప్పని సరిగా ఆధార్ కార్డ్ తెచ్చుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలపై కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది.కంగనా రౌనత్పై పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ నేత విక్రమాధిత్య సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు నియోజక వర్గ ప్రజలకు ఏదైనా సమస్యలుంటే తనని కలవవచ్చు. ఇందుకోసం ఆధార్ కార్డ్ అవసరం లేదు. మనం ప్రజలకు ప్రతినిధులం.రాష్ట్ర ప్రజల సమస్యల్ని పరిష్కరించాలి.అది పెద్దదవ్వొచ్చు. చిన్నదవ్వొచ్చు. లేదంటే వారి వ్యక్తిగత పనులు కావొచ్చు.గుర్తింపు కార్డ్ అవసరం లేదుని స్పష్టం చేశారు.ప్రజలు ఐడెంటిటి కార్డ్లు తీసుకొని రావాలని చెప్పడం సరైన పద్దతి కాదని ధ్వజమెత్తారుప్రజల్ని ఆధార్ కార్డ్ అడగడంపై వస్తున్న విమర్శలకు కంగనా రౌనత్ స్పందించారు. హిమాచల్ ప్రదేశ్ మండి నియోజకవర్గం టూరిస్ట్లకు హాట్స్పాట్.ఇక్కడికి అనేక మంది వస్తుంటారు.అందుకే నియోజక వర్గ ప్రజల్ని ఆధార్ కార్డ్ అడిగాను. ప్రతి ఒక్కరి సమస్యల్ని పరిష్కరించడమే నా లక్ష్యం. ఎవరూ ఇబ్బంది పడకూడదు’అని వ్యాఖ్యానించారు. నెటిజన్లు సైతం కంగనా రనౌత్ను విమర్శిస్తున్నారు. ఓట్లు అడిగే సమయంలో ఆధార్ కార్డ్ అడగలేదు. ఎన్నికల ముందు ఆధార్ కార్డ్ అవసరం లేదు. మరి ఇప్పుడు ఆధార్ కార్డ్ ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నిస్తున్నారు. -
ఢిల్లీలో దాహం.. దాహం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని తీవ్ర జల సంక్షోభం నెలకొంది. పొరుగు రాష్ట్రాల నుంచి నీటి సరఫరా తగ్గడంతో ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడి దారుణంగా పెరిగింది. యమునా నదీ జలాల సరఫరా విషయంలో ఢిల్లీ, హరియాణా, హిమాచల్ప్రదేశ్ మధ్య వివాదాలు తారాస్థాయికి చేరడంతో నీటి కష్టాలు తీవ్రమయ్యే ప్రమాదకర పరిస్థితి దాపురించింది. మండుతున్న ఎండలకు తోడు నీటి కొరతతో ప్రజలు అల్లాడుతుంటే ట్యాంకర్ మాఫియా, రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం ఈ సమస్యను మరింత జఠిలం చేస్తున్నాయి. ఆగిన సరఫరా.. తగ్గిన నిల్వలుఢిల్లీ తాగునీటి అవసరాల్లో 90 శాతం యమునా నదీ మునాక్ కాలువ ద్వారా తీరుతోంది. మరికొంత ఉత్తర్ప్రదేశ్లోని ఎగువ గంగ కాల్వల ద్వారా వచ్చే నీటితో ఢిల్లీ నీటి కష్టాలు తీరుతున్నాయి. యమునా నదిపై ఉన్న చంద్రవాల్, వజీరాబాద్, ఓక్లా నీటి శుద్ధి కర్మాగారాలుసహా మరో నాలుగు ప్లాంట్ల ద్వారా ఢిల్లీకి అవసరమైన నీటి సరఫరా జరుగుతోంది. ఢిల్లీకి ప్రతి రోజూ 1,200 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరం ఉండగా ఢిల్లీ జల్ బోర్డు 950 మిలియన్ గ్యాలన్ల నీటినే సరఫరా చేస్తోంది. హరియాణా ప్రభుత్వం మునాక్ ఉప కాల్వల ద్వారా 683 క్యూసెక్కులు, ఢిల్లీ చిన్న కాల్వల ద్వారా మరో 330 క్యూసెక్కుల నీటిని వజీరాబాద్ నీటి శుద్ధి రిజర్వాయర్కు సరఫరా చేయాల్సి ఉంది. మొత్తంగా రోజుకి 1,013 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సి ఉన్నా హరియాణా ప్రభుత్వం కేవలం 840 క్యూసెక్కుల నీటినే విడుదల చేస్తోందని ఢిల్లీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. హరియాణా నీటి సరఫరాను తగ్గించడంతో ఉత్తర, పశ్చిమ ఢిల్లీకి నీటిని సరఫరా చేసే వజీరాబాద్ రిజర్వాయర్లో నీటి మట్టాలు తగ్గుతున్నాయి. రిజర్వాయర్లో సగటు నీటి మట్టం 674.5 అడుగులు కాగా ప్రస్తుతం 669 అడుగులకు పడిపోయింది. దీంతో రిజర్వాయర్ నుంచి రోజుకు 70 మిలియన్ గ్యాలన్ల నీరు మాత్రమే విడుదల అవుతోందని ఢిల్లీ జల వనరుల మంత్రి అతిశి ఆరోపించారు. దీంతో చాలా ప్రాంతాల్లో నీటి సరఫరా తగ్గి ట్యాంకర్లపై జనం ఆధారపడుతున్నారు. ఇదే అదునుగా ట్యాంకర్ మాఫియా రెచ్చిపోయింది. ఇష్టారీతిగా డబ్బులు వసూలు చేస్తోంది. నీటి ఎద్దడి అంశంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా హరియాణా ముఖ్యమంత్రి నయాబ్సింగ్ షైనీతో మాట్లాడి, నీటి సరఫరా పెంచే విషయమై చర్చలు జరుపుతున్నారు. మునాక్ కాలువ, ఇతర కాల్వల నుంచి ట్యాంకర్ మాఫియా నీటి దోపిడీపై ప్రత్యేక దర్యాప్తు బృందంచే విచారణ చేపట్టాలని బుధవారం బీజేపీ రాష్ట్ర శాఖ డీజీపీకి విజ్ఞప్తి చేసింది. నీటి ఎద్దడికి రాజధానిలా మారుతున్న ఢిల్లీలో చాలా కాలనీల్లో ఎటు చూసినా మహిళలు, చిన్నారులు బిందెలు, బకెట్లు పట్టుకుని పెద్దపెద్ద క్యూ లైన్లలో నిల్చున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. మాట మార్చిన హిమాచల్ప్రదేశ్ఇన్నాళ్లూ నీటిని సరఫరా చేసిన హిమాచల్ ప్రదేశ్ మాట మార్చింది. తమ వద్ద 135 క్యుసెక్కుల మిగులు జలాలు లేవని, కావాలంటే యమునా బోర్డును ఆశ్రయించాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. హిమాచల్ నుంచి హరియాణాకు వచ్చిన మిగులు జలాలను ఢిల్లీ కోసం విడుదల చేయాలంటూ కేజ్రీవాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేసిన నేపథ్యంలో ప్రతిగా హిమాచల్ సర్కార్ కోర్టులో అఫిడవిట్ సమర్పించింది. ఈ కేసును గురువారం జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ప్రసన్న బి.వరాలేల సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. ‘‘ నీటి నిర్వహణలో ఢిల్లీ ప్రభుత్వం విఫలమైంది. కాల్వల ద్వారా నీటి పంపిణీ నష్టాలను తగ్గించడంలో, నీటి చౌర్యాన్ని నియంత్రించడం, తలసరి నీటి వినియోగాన్ని నియంత్రించడంలో ఢిల్లీ వైఫల్యం చెందింది. అభివృధ్ధి చెందుతున్న దేశాల్లో పంపిణీ నష్టాలు 10శాతం ఉంటే ఢిల్లీలో ఏకంగా 52.35 శాతం నష్టాలు ఉన్నాయి. కేంద్ర పట్టణాభివృధ్ధి శాఖ నిర్దేశకాల ప్రకారం పట్టణ నీటి తలసరి సరఫరా 135 లీటర్లుగా ఉంటే ఢిల్లీలో అతిగా 172 లీటర్లు సరఫరాచేస్తున్నారు. హిమాచల్ వద్ద వాస్తవానికి మిగులు జలాలు లేవు. ఉన్నాయంటూ గతంలో ఇచ్చిన ప్రకటనను ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వండి’ అని హిమాచల్ అడ్వకేట్ జనరల్ కోర్టుకు విన్నవించుకున్నారు. దీనిపై కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘‘ ఇదెంత తీవ్రమైన అంశమో మీకు తెలియట్లేదు. మీపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలో వద్దో తర్వాత తేలుస్తాం’ అని ఆగ్రహం వ్యక్తంచేసింది. దీంతో గత ప్రకటన ఉపసంహరణకు పద్దతి ప్రకారం అఫిడవిట్ సమర్పిస్తానని అడ్వకేట్ జనరల్ చెప్పారు.మాకంత నైపుణ్యం లేదుహిమాచల్ వాదనలు విన్నాక మానవతా దృక్పథంతో నీటిని సరఫరా చేయాలని సాయంత్రంకల్లా ఎగువ యమునా జలబోర్డ్ వద్ద దరఖాస్తు పెట్టుకోవాలని ఢిల్లీ సర్కార్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ‘‘ యమునా నదీ జలాల పంపకం అనేది సంక్లిష్టమైన వ్యవహారం. ఇప్పటికిప్పుడు మధ్యేమార్గంగా నదీజలాల పంపకం సమస్యను తీర్చేంత స్థాయిలో మాకు సాంకేతిక నైపుణ్యం లేదు. 1994 అవగాహనా ఒప్పందం ద్వారా రాష్ట్రాలు ఏర్పాటు చేసుకున్న యమునా బోర్డే ఈ సమస్యకు పరిష్కారం చూపగలదు. అదనంగా 150 క్యూసెక్కుల కోసం ఢిల్లీ గతంలోనే దరఖాస్తు చేసుకుంది. దానిపై జలబోర్డ్ త్వరగా నిర్ణయం వెలువర్చాలి. లేదంటే శుక్రవారం నుంచి రోజువారీగా బోర్డ్ సమావేశమై సమస్యను పరిష్కరించాలి’’ అని కోర్టు వ్యాఖ్యానించింది.ఢిల్లీ ప్రభుత్వ వాదనేంటి?నీటి ట్యాంకర్ల మాఫియాపై ఢిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు బుధవారం తలంటిన నేపథ్యంలో గురువారం కేజ్రీవాల్ సర్కార్ అఫిడవిట్ సమర్పించింది. ‘‘ ట్యాంకర్ల మాఫియా హరియాణా వైపు ఉన్న యమునా నది వెంట రెచ్చిపోతోంది. ఆ ప్రాంతం ఢిల్లీ జలబోర్డ్ పరిధిలోకి రాదు. అసలు అక్కడ చర్యలు తీసుకునే అధికారం ఎవరికి ఉందో తేల్చాలని ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్కు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాం. స్పందన శూన్యం. హరియాణా నుంచి ఢిల్లీకి నీటి సరఫరా వృథాను 30 శాతం ఉంచి ఐదు శాతానికి తగ్గించాం’’ అని అఫిడవిట్లో పేర్కొంది. గురువారం ఢిల్లీ ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వీ కోర్టులో వాదించారు. ‘‘ జలబోర్డులు ప్రభుత్వ అనుకూల అధికారులతో నిండిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో కమిటీ వేసి సుప్రీంకోర్టే సమస్యను పరిష్కరించాలి’ అని అన్నారు. ఈ వాదనతో హరియాణా విభేధించింది. ‘‘ ఢిల్లీకి నీటిని సరఫరా చేసే వజీరాబాద్ బ్యారేజీలో కనీస నీట నిల్వలు ఉండాల్సిందే. అతి సరఫరా కుదరదు. ఈ అంశాన్ని యమునా బోర్డ్కు వదిలేస్తే మంచిది’ అని హరియాణా తరఫున లాయర్ శ్యామ్ దివాన్ వాదించారు. ఈ అంశాన్ని ఇకపై జలబోర్డే చూసుకుంటుందని అదననపు సొలిసిటర్ జనరల్ విక్రమ్జీత్ బెనర్జీ చెప్పారు. దీంతో జలబోర్డులో తేల్చుకోండంటూ ఢిల్లీ సర్కార్ వేసిన పిటిషన్ను కోర్టు కొట్టేసింది. మరోవైపు రోజుకు 5 కోట్ల గ్యాలెన్ల నీటి సరఫరా తగ్గడంతో నీటిని వృథా చేయకండని ఢిల్లీవాసులకు ప్రభుత్వం సూచనలు చేసింది. -
ఎంపీని కానిస్టేబుల్ కొట్టడం దేనికి సంకేతం?
హిమాచల్ ప్రదేశ్ మండీ లోక్ సభ స్థానం నుండి నూతనంగా ఎన్నికైన ప్రముఖ సినీ తార కంగనా రనౌత్ను చండీగఢ్ విమానాశ్రయంలో సెక్యూరిటీ విధులను నిర్వహిస్తున్న కుల్విందర్ కౌర్ అనే సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ చెంప మీద కొట్టడం దేశ ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఎందుకు కొట్టావు అని సదరు ఎంపీ అడిగినప్పుడు రైతు చట్టాల వ్యతిరేక ఉద్యమానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు ఈ చెంప దెబ్బ అని దురుసుగా సమాధానం చెప్పడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. ఆ కానిస్టేబుల్ సోదరుడు కిసాన్ మజ్దూర్ సంఘ్లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉండడం, ఆమ్ ఆద్మీ సపోర్టుగా ఉండడం బట్టి చూస్తే– కంగనా రనౌత్పై దాడి యాదృచ్చికంగా జరిగింది కాదనీ, ఇది ఒక ప్రణాళికా బద్ధంగానే జరిగిందనే భావన కలుగక మానదు. నూతనంగా ఎన్నికైన కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై సమగ్రమైన విచారణ జరిపి, దేశ ప్రజలకు వాస్తవ విషయాలు తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. రైతు వ్యతిరేక చట్టాల ఉద్యమం పేరుతో రైతుల ముసుగులో ఖలిస్థాన్ వేర్పాటు వాదుల మద్దతుదారులు రిపబ్లిక్ డే రోజున ఎర్రకోటపై ఖలిస్థాన్ జెండాను ఎగరవేయడం, శాంతి భద్రతలను పరిరక్షించడానికి వచ్చిన అనేకమంది పోలీసుల తలలు పగలగొట్టడం వంటి దృశ్యాలు దేశ ప్రజల స్మృతి పథంలో ఇప్పటికీ స్థిరంగానే ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ప్రతిపక్షాలు తమ రాజకీయ స్వార్థం కోసం రైతు చట్టాల వ్యతిరేక ఉద్యమకారులను రెచ్చగొడుతున్నాయనీ, పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశంలో అనేక చోట్ల హింస చెలరేగి శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతుందనీ నిఘా వర్గాలు హెచ్చరించడంతో పోలీసులు సందర్భోచితంగా సంయమనం పాటించారు. దీంతో దేశానికి పెద్ద ముప్పే తప్పింది.ప్రభుత్వ విధానాలపైనా, దేశంలో జరుగుతున్న అనేక సంఘటనలూ, ఉద్యమాలపైనా అనేకమంది వ్యతిరేకంగా, అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తుంటారు. అలాగే ఒక పౌరురాలిగా కంగనా కూడా రైతు ఉద్యమంపై వ్యాఖ్య చేశారు. ఈ చెంప దెబ్బ ఆ వ్యాఖ్యలు చేసినందుకే కొట్టానని కౌర్ చెప్పిన సమాధానం నమ్మశక్యంగా లేదు. సిక్కు తీవ్రవాద భావాలు కుల్విందర్ కౌర్ మనసులో ఎవరైనా నాటి ఉండవచ్చునేమో! ఈ కోణంలో ఎందుకు ఆలోచించకూడదు? 1984 అక్టోబర్ 31న భారత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీని కాల్చి చంపిన ఆమె అంగరక్షకులైన సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్లు సిక్కులు అనే విషయం మరవకూడదు. నాడు వారు ‘ఖలిస్థాన్’ వేర్పాటు వాద భావజాలాన్ని తలకెక్కించుకుని ఆ ఘాతుకానికి ఒడిగట్టారు.సిక్కు వేర్పాటు వాద నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ 2023 జూన్ 18న కెనడాలో హత్యకు గురైన తర్వాత, కెనడా, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఇటలీ వంటి దేశాలలో ఖలిస్థాన్ వేర్పాటు వాదుల మద్దతుదారులు భారతదేశానికి వ్యతిరేకంగా, హిందువులకు వ్యతిరేకంగా ప్రకటనలు గుప్పించారు. కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో... నిజర్ హత్య వెనుక భారత ప్రభుత్వ నిఘా వర్గాలు ఉన్నాయని పేర్కొన్నారు. దీనికి మద్దతుగా అమెరికా దౌత్యవేత్తలు మాట్లాడడం, భారత ప్రభుత్వం ఇందుకు ఆధారాలు చూపించాలని కౌంటర్ వేయడం వంటి వాటి నేపథ్యంలో ఈ సంఘటనను పరిశీలించాలి. ఉల్లి బాల రంగయ్య వ్యాసకర్త సామాజిక, రాజకీయ విశ్లేషకులు -
లోక్ సభ ఫలితాలపై ఖర్గే అసంతృప్తి..
-
ఢిల్లీ నీటి సంక్షోభం: నీటిని విడుదల చేయాలని హిమాచల్కు సుప్రీం ఆదేశం
ఢిల్లీ: గత కొన్ని రోజులుగా ఢిల్లీలో నీటి సంక్షోభం తీవ్రంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఢిల్లీకి సాయంగా మిగులు నీటిని విడుదల చేయాలని తాజాగా సుప్రీంకోర్టు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ఆదేశాలు జారీ చేసింది. రేపు(శుక్రవారం) 137 క్యూసెక్కుల నీటిని ఢిల్లీకి విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నీటి విడుదలకు హిమాచల్ ప్రదేశ్ అంగీకారం తెలిపిందని కోర్టు తెలిపింది. అదేవింధంగా వాజీరాబాద్ బ్యారేజ్ ద్వారా నీటి విడుదలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని హర్యానాను సుప్రీం కోర్టు ఆదేశించింది. నీటి విడుదల చేసే సమయంలో హర్యానాకు ముందుస్తు సమాచారం అందించాలని హిమాచల్ ప్రదేశ్కు కోర్టు సూచించింది.సంక్షోభ సమయంలో నీటిని ఎట్టిపరిస్థితుల్లో వృథా చేయవద్దని ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఢిల్లీలో తీవ్రమైన నీటి సంక్షోభం నెలకొనడంతో తమ రాష్ట్రానికి సరిహద్దు రాష్ట్రాలు ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా నుంచి నీటిని అందించాలని ఆప్ ప్రభుత్వం గతవారం సుప్రీకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.దేశ రాజధాని ఢిల్లీ వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రత కారణంగా నీటి సంక్షోభం ఏర్పడింది. ఇలాంటి సమయంలో నీటిని వృథా చేస్తే రూ. 2 వేలు జరిమానా వేస్తామని ఆప్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటక చేసిన విషయం తెలిసిందే. -
హిమాచల్ ప్రదేశ్ లో 4 చోట్ల బీజేపీ ఆధిక్యం
-
హిమాచల్లో సుఖు సర్కార్ సేఫ్!
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో రాజకీయ అస్థిరతకు తాత్కాలికంగా తెరపడింది. ముఖ్యమంత్రి సుఖి్వందర్ సింగ్ సుఖు ప్రభుత్వం ఊపిరిపీల్చుకుంది. ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కే.ఎల్.ఠాకూర్, హోషియార్ సింగ్, ఆశిష్ శర్మలు మార్చి 22న రాజీనామా చేయగా, స్పీకర్ కుల్దీప్సింగ్ పథానియా సోమవారం వాటిని ఆమోదించారు. తొలుత కాంగ్రెస్కు మద్దతు ప్రకటించిన ఈ ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు.. ఫిబ్రవరిలో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారు. బీజేపీ అభ్యర్థి హర్‡్ష మహజన్ గెలుపునకు దోహదపడ్డారు. మెజారిటీ ఉండి కూడా కాంగ్రెస్ తమ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్విని గెలిపించుకోలేకపోయింది. అప్పటి నుంచి బీజేపీ హిమాచల్ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి పావులు కదుపుతోంది. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడగా.. వారు బీజేపీలో చేరి ఆ పార్టీ గుర్తుపై ఉప ఎన్నికల్లో పోటీచేశారు. మంగళవారం ఫలితాలు వెలువడనున్నాయి. హిమాచల్ అసెంబ్లీ బలం 68 కాగా... తొమ్మిది మంది పోను ప్రస్తుతం 59గా ఉంది. కాంగ్రెస్కు 34 మంది ఎమ్మెల్యేలు ఉండగా, బీజేపీకి 25 మంది సభ్యులున్నారు. మంగళవారం వెలువడే ఉప ఎన్నికల ఫలితాల్లో ఆరింటికి ఆరు స్థానాలు బీజేపీ నెగ్గినా వారి బలం 31 మాత్రమే అవుతుంది. ఈ పరిస్థితుల్లో గనక ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల బలం కూడా తోడైతే బీజేపి 34కు చేరుకునే అవకాశాలుండేవి. అలా కాకుండా సరిగ్గా ఫలితాలకు ముందు రోజు ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదించడంతో మళ్లీ ఉప ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చేదాకా సుఖు ప్రభుత్వం కొంతకాలం ఊపిరిపీల్చుకున్నట్లే. అదీ మళ్లీ తాజాగా ఫిరాయింపులేవీ జరగకుండా ఉంటే! -
Lok Sabha Election 2024: హిమాచల్ప్రదేశ్లో.. బీజేపీకి పరీక్ష!
హిమాచల్ప్రదేశ్లోని 4 లోక్సభ స్థానాలనూ గత రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ క్లీన్స్వీప్ చేసింది. కానీ ఈసారి హ్యాట్రిక్ కొట్టాలన్న కమలనాథుల యత్నాలకు కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఉత్తరాదిన కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం ఇదే. ఈసారి లోక్సభ ఎన్నికల్లో కచి్చతంగా ఖాతా తెరవాలని ఆ పార్టీ పట్టుదలతో ఉంది. కాంగ్రా, మండి, సిమ్లా, హమీర్పూర్ స్థానాలకు శనివారం తుది విడతలో పోలింగ్ జరగనుంది. ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే అయినా బీఎస్పీ కూడా అన్నిచోట్లా బరిలో ఉంది. ప్రముఖ అభ్యర్థుల్లో కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, మాజీ మంత్రి ఆనంద్ శర్మ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తదితరులున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వేటు ఫలితంగా 6 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. వాటి ఫలితాలు సుఖి్వందర్ సింగ్ సుఖు సర్కారు భవితవ్యాన్ని నిర్దేశించనున్నాయి... కాంగ్రా ఇక్కడ అభ్యరి్థని మార్చే ఆనవాయితీని బీజేపీ ఈసారి కూడా కొనసాగించింది. సీనియర్ నేత, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు రాజీవ్ భరద్వాజ్కు టికెటిచి్చంది. కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత ఆనంద్ శర్మ బరిలో ఉన్నారు. ఈ లోక్సభ పరిధిలోని 17 అసెంబ్లీ స్థానాల్లో 11 కాంగ్రెస్ చేతిలోనే ఉన్నాయి. తన ఏడాదిన్నర పాలన చూసి శర్మను గెలిపించాలని ఓటర్లను సీఎం సుఖు కోరుతున్నారు. ఇక్కడ 10 మంది పోటీలో ఉన్నారు.సిమ్లా 2009 నుంచీ బీజేపీయే గెలుస్తోంది. సిట్టింగ్ ఎంపీ సురేశ్ కుమార్ కాశ్యప్కే టికెటిచ్చింది. 15 ఏళ్ల క్రితం చేజారిన ఈ స్థానాన్ని సొంతం చేసుకోవాలనికాంగ్రెస్ పట్టుదలతో ఉంది. కసౌలి ఎమ్మెల్యే వినోద్ సుల్తాన్పురికి టికెటిచ్చింది. ఈ లోక్సభ పరిధిలోని 17 అసెంబ్లీ స్థానాల్లో 13 కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి. ఇక్కడ యాపిల్ రైతులు కీలకం. హట్టి సామాజికవర్గానికి కేంద్రం ఎస్టీ హోదా కలి్పంచడాన్ని బీజేపీ ప్రముఖంగా ప్రచారం చేసుకుంది.మండి 2021 ఉప ఎన్నికలో నెగ్గిన పీసీసీ చీఫ్ ప్రతిభాసింగ్ ఈసారి పోటీకి అనాసక్తి చూపారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ను బీజేపీ పోటీకి పెట్టింది. దాంతో ప్రతిభాసింగ్ కుమారుడు, మంత్రి విక్రమాదిత్య సింగ్కు కాంగ్రెస్ టికెటిచి్చంది. అభ్యర్థులిద్దరూ హోరాహోరీ ప్రచారం చేశారు. మండిలో విజయం బీజేపీ, కాంగ్రెస్ మధ్య చేతులు మారుతూ ఉంటుంది. మొత్తమ్మీద కాంగ్రెస్దే పై చేయి.హమీర్పూర్ కేంద్ర మంత్రి అనురాగ్సింగ్ ఠాకూర్ మళ్లీ బీజేపీ నుంచి బరిలోకి దిగారు. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే సత్పాల్ సింగ్ రజ్దా పోటీ చేస్తున్నారు. ఇది బీజేపీ కంచుకోట. ఎనిమిదిసార్లుగా గెలుస్తూ వస్తోంది. ఈసారి బీజేపీ ఫోర్, సిక్స్ కొడుతుందని అనురాగ్ ఠాకూర్ ప్రచారం చేశారు. అంటే మొత్తం 4 లోక్సభ, 6 అసెంబ్లీ స్థానాలనూ కైవసం చేసుకుంటుందన్నది ఆయన ధీమా. ఉప ఎన్నికలు జరుగుతున్న 6 అసెంబ్లీ స్థానాల్లో 4 ఈ లోక్సభ సీటు పరిధిలోనే ఉన్నాయి.ప్రధానాంశాలు→ అయోధ్య రామమందిర నిర్మాణాన్ని, జమ్మూ కశీ్మర్లో ఆరి్టకల్ 370 రద్దును బీజేపీ ప్రముఖంగా ప్రచారం చేసింది. → పాత పింఛను విధానం పునరుద్ధరణ, 2023 భారీ వరదల అనంతరం చేపట్టిన సహాయక చర్యలను కాంగ్రెస్ గుర్తు చేసింది. → బీజేపీ వస్తే రిజర్వేషన్లు రద్దేనంటూ ప్రచారం చేసింది. కేంద్రంలో అధికారంలోకొస్తే అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. → కాంగ్రా, హమీర్పూర్ వాసులు ఆర్మీలో ఎక్కువగా చేరుతుంటారు. అగి్నపథ్ పథకాన్ని రద్దు చేస్తామన్న కాంగ్రెస్ హామీ వారిపై ప్రభావం చూపొచ్చు. → వరదలు ఇక్కడి ప్రజల ప్రధాన సమస్యల్లో ఒకటి. → రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయడమే గాక అసెంబ్లీలో బడ్జెట్పై ఓటింగ్కు హాజరు కాకుండా విప్ను ధిక్కరించినందుకు ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. ఉప ఎన్నికల్లో ఆ ఆరుగురికి బీజేపీ టికెటిచ్చింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok shabha Elections 2024: ఎవరిని ఎన్నుకుందాం?!
400కు పైగా అని ఒక కూటమి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని మరో కూటమి. హోరాహోరీగా సాగిన సార్వత్రిక ఎన్నికల పోరు తుది అంకానికి చేరుతోంది. జూన్ 1న చివరిదైన ఏడో విడతతో దేశవ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. చివరి విడతలో పోలింగ్ జరుగుతున్న రాష్ట్రాల్లో హిమాచల్ప్రదేశ్ ఒకటి. అక్కడి తొలి ఓటర్లు పలు అంశాలపై చురుగ్గా స్పందిస్తున్నారు. నాణ్యమైన విద్య, ఉద్యోగావకాశాలు, మహిళా భద్రత తదితరాలకే తమ ప్రాధాన్యత అని చెబుతున్నారు. అయితే అధికార ఎన్డీఏ, విపక్ష ఇండియా కూటముల్లో ఎవరికి ఓటేయాలో తేల్చుకోలేని డైలమాలో ఉన్నామని ఈ యంగ్ ఓటర్స్లో పలువురు అంటున్నారు. నోటాకే తమ ఓటని పలువురు చెబుతుండటం విశేషం. రాష్ట్రంలో 4 లోక్సభ సీట్లతో పాటు ఉప ఎన్నికలు జరుగుతున్న 6 అసెంబ్లీ స్థానాలకు జూన్ 1న పోలింగ్ జరగనుంది.ఉచితాలు అనుచితాలే...! కొన్నేళ్లుగా పారీ్టలన్నీ పోటాపోటీగా ప్రకటిస్తున్న పలు ఉచిత హామీలపై, అమలు చేస్తున్న ఉచిత పథకాలపై యువ ఓటర్లలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతుండటం విశేషం. ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాల భారమంతా అంతిమంగా పన్నులు చెల్లిస్తున్న మధ్యతరగతి ప్రజానీకంపైనే పడుతోందని వారంటున్నారు. అధికారంలోకి వచ్చే పార్టీ ఏదైనా హిమాచల్లో ఉచితాలను నిలిపివేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ‘‘అభివృద్ధి పనులకు ఉపయోగించాల్సిన నిధులు ఉచితాల కారణంగా పక్కదారి పడుతున్నాయన్నది నిస్సందేహం’’ అంటున్నారు సోలన్కు చెందిన రియా. ఆమె ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటేస్తున్నారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపైనా యువత నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. పదేళ్ల బీజేపీ పాలనను కొందరు విమర్శిస్తుంటే మరికొందరు ప్రశంసిస్తున్నారు. ‘‘బీజేపీ సారథ్యంలోని నియంతృత్వమా? విపక్ష ఇండియా కూటమి సంకీర్ణమా? కేంద్రంలో ఎవరికి మద్దతివ్వాలో తేల్చుకోలేకపోతున్నా. ఏమైనా రాజకీయాల్లో సానుకూల మార్పు మాత్రం కోరుకుంటున్నా’’ అంటున్నాడు మరో ఓటరు నితీశ్. బీజేపీ సర్కారు అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని, రాజ్యాంగ సంస్థలన్నింటినీ దురి్వనియోగం చేస్తోందని డిగ్రీ ఫస్టియర్ విద్యార్థి రోహిత్ విమర్శిస్తున్నారు. ‘‘మోదీకి ఓటేయడమంటే నియంతృత్వాన్ని సమర్థించడమే. అయితే సంకీర్ణ ప్రభుత్వాలు కూడా దేశానికి మంచివి కావు. కనుక ఇండియా కూటమికి ఓటేయడం కూడా సరికాదు’’ అంటున్నాడతను! ఔత్సాహిక జర్నలిస్టు...సంజౌలీ ప్రభుత్వ పీజీ కాలేజీలో జర్నలిజం చదువుతున్న అన్షుల్ ఠాకూర్ ఈసారి ఓటేయాలని ఉత్సాహంతో ఉన్నాడు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు కలి్పంచి, మహిళలకు భద్రతను పెంచేవారికే తన ఓటని స్పష్టంగా చెబుతున్నాడు. పారిశ్రామికవేత్త కావాలన్నది తన కల అని మరో పీజీ విద్యార్థి పరీక్షిత్ అంటున్నాడు. ఆధునిక సాంకేతికతను, స్టార్టప్ సంస్కృతిని, యువతను ప్రోత్సహించే వారికే తన ఓటని చెబుతున్నాడు. ‘‘ఏ పార్టీ అధికారంలోకి వచి్చనా ఉమ్మడి పౌరస్మృతి, నూతన విద్యా విధానాలను సమర్థంగా అమలు చేయాలి. ఈశాన్య ప్రాంతాలతోపాటు లద్దాఖ్ వంటి ప్రదేశాలపై దృష్టి పెట్టాలి. భారత సంస్కృతిని పరిరక్షించాలి. తొలిసారి ఓటరుగా ఇది నా ఆకాంక్ష’’ అని సంజౌలీ పీజీ కాలేజీకి చెందిన మరో విద్యార్థి వశి‹Ù్ట శర్మ చెప్పాడు. అభ్యర్థులెవరూ నా అంచనాలకు తగ్గట్టుగా లేరు. అందుకే నా తొలి ఓటు నోటాకే’’ అని మంచీకి చెందిన అదితి ఠాకూర్ చెప్పుకొచి్చంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha election 2024: కింగ్ వర్సెస్ క్వీన్
హిమాచల్ప్రదేశ్లో రాజవంశీయుల కంచుకోట అయిన మండి లోక్సభ స్థానంలో ‘కింగ్’, ‘క్వీన్’ మధ్య ఆసక్తికర పోరు సాగుతోంది. క్వీన్ తదితర సినిమాలతో అలరించిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బీజేపీ తరఫున ఎన్నికల అరంగేట్రం చేస్తున్నారు. రాంపూర్ బుషహర్ రాజ సంస్థాన వారసుడు విక్రమాదిత్యసింగ్ కాంగ్రెస్ అభ్యరి్థగా ఆమెతో తలపడుతున్నారు. దాంతో ఇక్కడ విజయం రెండు పారీ్టలకు ప్రతిష్టాత్మకంగా మారింది...తొలి నుంచీ రాజులే... పారీ్టలేవైనా మండిలో రాజకుటుంబీకుల హవాయే కొనసాగుతూ వస్తోంది. రెండు ఉప ఎన్నికలతో సహా 19సార్లు లోక్సభ ఎన్నికలు జరిగితే 13సార్లు రాజ కుటుంబీకులే గెలిచారు. కాంగ్రెస్కు ఇక్కడ బలమైన ఓటు బ్యాంకు ఉంది. పీసీసీ చీఫ్, సిట్టింగ్ ఎంపీ ప్రతిభా సింగ్ ఈసారి పోటీ చేయబోనని ప్రకటించారు. బీజేపీ నుంచి కంగనా బరిలో దిగడంతో తనయుడు విక్రమాదిత్య సింగ్ను బరిలో దించారు. ఆయన సిమ్లా (రూరల్) నుంచి రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. ఆయన తండ్రి వీరభద్రసింగ్ ఏకంగా ఆరుసార్లు రాష్ట్ర సీఎంగా చేశారు. తల్లిదండ్రులిద్దరూ మండి లోక్సభ స్థానం నుంచి మూడేసిసార్లు నెగ్గారు. 2021 మండి ఉపఎన్నికలో తల్లి కోసం విక్రమాదిత్య విస్తృతంగా ప్రచారం చేశారు.కంగనాకు ఆదరణ... కంగనాకు ఊహించని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నాయకుడు జైరాం ఠాకూర్ మద్దతుతో పాటు మండి లోక్సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లన్నీ బీజేపీ చేతిలోనే ఉండటం ఆమెకు కలిసొచ్చే అంశాలు. తొలుత ఆమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన సీనియర్ నేత మహేశ్వర్ సింగ్ తర్వాత మనసు మార్చుకున్నారు. కార్గిల్ యుద్ధ వీరునిగా స్థానికంగా బాగా ఆదరణ ఉన్న బ్రిగేడియర్ (రిటైర్డ్) ఖుషాల్ ఠాకూర్, కేంద్ర మాజీ మంత్రి సుఖ్రామ్ మనవడు ఆశ్రయ్ శర్మ తదితరులు కంగనాకు మొదటినుంచి మద్దతిస్తున్నారు.పరస్పర విమర్శలు... పరస్పర విమర్శల్లో కంగనా, విక్రమాదిత్య ఇద్దరూ హద్దులు దాటిపోయారు. ఎన్నడూ లేనంతగా వ్యక్తిగత దాడులకు దిగుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై కంగనాకు ఎలాంటి విజన్ లేదని, ఆమె కేవలం పొలిటికల్ టూరిజం చేస్తున్నారని విక్రమాదిత్య ఎద్దేవా చేస్తుంటే, ఆయనను ‘చోటా పప్పు’ అంటూ కంగనా ఎగతాళి చేస్తున్నారు. రైతులపై కంగనా అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో సంయుక్త కిసాన్ మంచ్ విక్రమాదిత్యకు మద్దతిస్తోంది. హిమాచల్లో విపత్తు వేళ బాధితుల పట్ల కంగనా సానుభూతి చూపలేదని, మండిని కనీసం సందర్శించలేదని విమర్శలున్నాయి. ఒక్కసారి చాన్సిస్తే నియోజకవర్గ ప్రజల కోసం పనిచేస్తానని కంగనా అంటున్నారు. గిరిజన ప్రాంతాలకు కనెక్టివిటీ మెరుగుపరచడం, ఆగిన ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు స్థానిక సంస్కృతీ సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ పర్యాటకాన్నీ ప్రోత్సహిస్తానని హామీ ఇస్తున్నారు. మండీని స్మార్ట్ సిటీగా మారుస్తానని విక్రమాదిత్య వాగ్దానం చేస్తున్నారు.‘మండి’ ప్రస్థానం.. మండిని ఒకప్పుడు మండి మహాసు నియోజకవర్గంగా పిలిచేవారు. ఆరు జిల్లాల్లో విస్తరించిన ఈ నియోజకవర్గంలో 13,77,173 మంది ఓటర్లున్నారు. దీని పరిధిలో ఏకంగా 17 అసెంబ్లీ సెగ్మెంట్లుండటం విశేషం. వీరభద్రసింగ్ 1971లో తొలిసారి ఇక్కడి నుంచి గెలిచారు. 1977లో ఎమర్జెన్సీ వ్యతిరేక వెల్లువలో ఓటమి చవిచూసినా 1980లో మళ్లీ విజయం సాధించారు. 1989లో బీజేపీ, 1991, 1996ల్లో కాంగ్రెస్, 1998, 1999 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాయి. 2004లో ప్రతిభా సింగ్ తొలిసారి గెలిచారు. 2009లో మళ్లీ వీరభద్రసింగ్ విజయం సాధించారు. ఆయన సీఎంగా కావడంతో 2013లో జరిగిన ఉప ఎన్నికలో ప్రతిభాసింగ్ నెగ్గారు. 2014, 2019ల్లో బీజేపీకి చెందిన రామ్ స్వరూప్ శర్మ గెలుపొందారు. 2021లో ఆయన మరణంతో జరిగిన ఉప ఎన్నికలో మళ్లీ ప్రతిభా సింగ్ గెలిచారు. -
ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి?.. ఖర్గే చమత్కారం
ఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఆరు విడతల్లో పోలింగ్ పూర్తి అయింది. అయితే.. విపక్షాల ఇండియా కూటమి ప్రభుత్వం కొలువుదీరితే.. ప్రధానమంత్రి ఎవరూ అని అడిగిన మీడియా ప్రశ్నకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున చమత్కారంగా స్పందించారు. ఈ ప్రశ్న ‘కౌన్ బనేగా క్రోర్పతి?’లా ఉందని అన్నారు. ఆయన శనివారం సిమ్లాలో మీడియాతో మాట్లాడారు. ‘‘ ఇండియా కూటమి గెలిచి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మా ప్రధాని మంత్రి ఎవరూ అనేవిషయంపై నాయకులమంతా కలిసి నిర్ణయం తీసుకుంటాం. 2004 నుంచి 2014 వరకు యూపీఏ కూటమి పదేళ్లు పాలన చేసింది. ప్రధాని అభ్యర్థి ప్రకటన లేకుండా ఎన్నికల బరిలోకి దిగారు. అయితే 2004లో కాంగ్రెస్లో కొంతమంది నాయకులకు సోనియా గాంధీ ప్రధాని కావాలని ఉండేది. కానీ ఆమె తిరస్కంచారు. అప్పుడు మాకు మేజార్టీ(140 సీట్లు) లేదు. 2009లో మేము 209 సీట్లను గెలిచాం. అలా యూపీఏ కూటమిగా పదేళ్లు పాలన అందించాం. కొన్నిసార్లు తెలివైనవాళ్లు కూడా చరిత్ర మర్చిపోతారు( బీజేపీ నేతలను ఉద్దేశించి). 2014లో బీజేపీ ఇచ్చిన రెండు కోట్ల ఉద్యోగాల కల్పన, ద్రవ్యోల్బణం తగ్గింపు ఏమి జరగలేదు. ప్రధాని మోదీ, 2014, 2019లో ఇచ్చిన పెద్దపెద్ద హామీలను పక్కన పడేశారు. ప్రకృతి విపత్తులతో తల్లిడిల్లిన హిమాచల్ ప్రదేశ్ ప్రధాని మోదీ చిన్న సాయం కూడా చేయలేదు. దేశంలో బీజేపీ ప్రభుత్వాలను కూలగొట్టింది. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపర్చడానికి కుట్రలు పన్నింది’’ అని ఖర్గే తీవ్రంగా మండిపడ్డారు. ఫిబ్రవరి 27 జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా ఆరుగురు కాంగ్రెస్ ఎమ్యెల్యేలు బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా క్రాస్ ఓటు వేశారు. అనంతరం వారు బీజేపీలో చేరారు. ఇక.. హిమాచల్ ప్రదేశ్లో ఏడో విడతలో జూన్ 1 నాలుగు పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఫలితాలు జూన్ 4న విడదల కానున్నాయి. -
దేశాభివృద్ధి కోసమే మూడోసారి
సిమ్లా: బీజేపీని వరుసగా మూడోసారి గెలిపించాలని, దేశ అభివృద్ధి కోసమే తప్ప ఈ గెలుపు తన కోసం, తన కుటుంబం కోసం కాదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. దేశ అభివృద్ధి కోసం అన్ని గ్రామాల్లో దేవాలయాలకు వెళ్లి, దేవుళ్లను ప్రారి్థంచి ఆశీస్సులు పొందాలని కోరారు. కాంగ్రెస్ పారీ్టకి అధికారం అప్పగిస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు బలవంతంగా లాక్కొని ఓటు బ్యాంక్కు కట్టబెడతారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అయోధ్య రామమందిరానికి తాళం పడుతుందని అన్నారు. శుక్రవారం హిమాచల్ ప్రదేశ్లోని నాహన్, మండీ, పంజాబ్లోని గురుదాస్పూర్, జలంధర్లో సార్వత్రిక ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించిందని ఆరోపించారు. మందిర నిర్మాణానికి తాము పూనుకుంటే తేదీ చెప్పండి అంటూ ఎగతాళి చేశారని అన్నారు. తేదీ ప్రకటించడమే కాకుండా ఆలయ నిర్మాణం పూర్తిచేసి ప్రాణప్రతిష్ట సైతం జరిపించామని గుర్తుచేశారు. ఓటు బ్యాంక్ను బుజ్జగించడానికి కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని బహిష్కరించిందని మండిపడ్డారు. హిమాచల్ ప్రదేశ్లో 2.50 లక్షల జనాభా ఉన్న హట్టీ సామాజికవర్గానికి ఎస్టీ హోదా కలి్పస్తామని హామీ ఇచ్చారు. ఓడిపోయే కాంగ్రెస్కు ఓటు వేసి ఓటు వృథా చేసుకోవద్దని ప్రజలకు సూచించారు. -
హిమాచల్ అడవుల్లోనూ కార్చిచ్చు
ఉత్తరాఖండ్లో మాదిరిగానే హిమాచల్ ప్రదేశ్లోని అడవుల్లోనూ కార్చిర్చు కనిపిస్తోంది. సోలన్, మండి, కాంగ్రాలో కోట్లాది రూపాయల విలువైన అటవీ సంపద బూడిదగా మారింది. తాజాగా హిమాచల్లోని మండీ జిల్లా ధరంపూర్ మండప్ గ్రామ అడవుల్లోకి మంటలు వ్యాపించాయి. సోలన్ సమీపంలోని అడవిని కూడా మంటలు చుట్టుముట్టాయి. ఈ మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం ఉండటం లేదు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం సోలన్ సమీపంలోని కాలాఘాట్లో తాజాగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అటవీ శాఖ ఉద్యోగులు తమ ప్రాణాలను పణంగా పెట్టి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయినా మంటలు అదుపులోకి రాలేదు. అడవుల్లో దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర మంటలు వ్యాపించాయి. దీంతో అటవీ శాఖ ఉద్యోగులు స్థానికులను సహాయం కోసం అభ్యర్థించారు. ఎనిమిది గంటలపాటు ఎదురు చూసినా అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకోలేదు.అటవీ శాఖ డిప్యూటీ రేంజర్ నీలం ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ చాలాసేపటి నుంచి తాము మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నామని, స్థానికుల సహాయం కూడా అందడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఉద్యోగులు ప్రాణాలను పణంగా పెట్టి మంటలను ఆర్పుతున్నారన్నారు. -
నల్లత్రాచు నుంచి ‘అప్సరస’ వరకు..
సిమ్లా: ఎన్నికలన్నాక పరస్పర విమర్శలు సహజమే. కానీ హిమాచల్ప్రదేశ్ ప్రచారంలో అభ్యర్థులు విమర్శలు దాటి.. వ్యక్తిగత తిట్ల వరకూ వచ్చేశారు. ఈ దండకంలో కాంగ్రెస్ నుంచి బీజేపీ వరకూ అందరూ ఆ తాను ముక్కలే. ఒకరు ‘కాలే నాగ్’ అంటే.. మరొకరు ‘బిగ్డా షెహజాదా’ అంటూ ప్రచార పదజాలంలో కొత్త తిట్లను చేరుస్తున్నారు.ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో హిమాచల్ప్రదేశ్లోని ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటేసిన విషయం తెలిసింది. వారిపై అనర్హత వేటు పడి ఆ ఆరుస్థానాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు.. పార్టీ తిరుగుబాటుదారులను ‘కాలే నాగ్’(నల్లత్రాచు)లు, బికావు (అమ్ముడుపోయినవాళ్లు) అంటూ విమర్శించారు. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి దేవేందర్ కుమార్ భుట్టో నియోజకవర్గమైన కుట్లేహార్లో సీఎం మాట్లాడుతూ.. ‘భుట్టో కో కూటో’ (భుట్టోను కొట్టండి) అంటూ పిలుపునిచ్చారు. సుఖూ వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయంటూ బీజేపీ రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది. ఇక ‘మండీ మే భావ్ క్యా చల్ రహా హై’ అంటూ బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్పై కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాతే చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. నేను రెండాకులు ఎక్కువే చదివానంటూ రనౌత్ చెలరేగిపోయారు. రాహుల్గాం«దీ, విక్రమాదిత్య పేర్లు చెప్పకుండా.. ‘బడా పప్పు’, ‘ఛోటా పప్పు’ అని పదేపదే వాడారు. గాంధీ కుటుంబం, కాంగ్రెస్ పారీ్ట.. ఈ దేశానికి బ్రిటిష్ వాళ్లు వదిలి వెళ్లిన ‘రోగం’ అంటూ వ్యాఖ్యానించారు. 2014 వరకు చెద పురుగుల్లా దేశాన్ని తినేశారన్నారు. విక్రమాదిత్యను.. ‘బిగ్డా షెహజాదా’ (చెడిపోయిన యువరాజు) అంటూ సంబోధించారు. ఇక కంగనాను ‘ఆమె హుస్న్ కి పరి’ (అప్సరస) అని, ప్రజలు ఆమెను చూడటానికి మాత్రమే వస్తారు.. ఓట్లేయరని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రతిభా సింగ్ వ్యాఖ్యానించారు. దీనిపై కంగనా తల్లి ఆశా రనౌత్ స్పందించారు. తన కూతురును ‘అప్సరస’, ‘క్యా చీజ్ హై’ అంటున్నవాళ్లు తమ ఇళ్లలో ఆడపిల్లలున్నారన్న విషయం మరుస్తున్నారని మండిపడ్డారు. -
గైటీ థియేటర్ ప్రత్యేకత ఏమిటి? బ్రిటీషర్లు ఎందుకు నిర్మించారు?
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు, రేపు హిమాచల్లో పర్యటించనున్నారు. ఈరోజు (మంగళవారం) సాయంత్రం గైటీ థియేటర్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాన్ని ఆమె వీక్షించనున్నారు. గైటీ థియేటర్ను సందర్శించిన తొలి రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము రికార్డుకెక్కనున్నారు.గైటీ థియేటర్ చారిత్రాత్మక భవనం. దీనిని బ్రిటిష్ వారు నిర్మించారు. బ్రిటిష్ పాలనలో 1884లో సిమ్లా వేసవి రాజధానిగా ఉండేది. ఆ కాలంలో బ్రిటిష్ పాలకులు వినోదం కోసం ఇంగ్లండ్ నుండి కళాకారులను సిమ్లాకు పిలిపించేవారు. అయితే ఆ సమయంలో సిమ్లాలో థియేటర్ లేదు. ఫలితంగా కళాకారుల ప్రదర్శనలు బ్రిటిష్ పాలకుల ఇళ్లలో లేదా అన్నాడేల్ గ్రౌండ్లో జరిగేవి.గైటీ థియేటర్ను 1887లో హెన్రీ ఇర్విన్ నిర్మించారు. ఈ థియేటర్ నియో-విక్టోరియన్ గోతిక్ శైలిలో నిర్మించారు. బ్రిటిష్ పాలకులు సిమ్లాను సాంస్కృతిక కేంద్రంగా మార్చాలనుకున్నారు. గైటీ థియేటర్కు 137 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ థియేటర్లో పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనలు జరిగాయి. ప్రపంచ స్థాయి కళాకారులు ఇక్కడ ప్రదర్శనలు నిర్వహించారు.గైటీ థియేటర్ నిర్మాణం యూ ఆకారంలో ఉంటుంది.ఈ థియేటర్ ప్రత్యేకత ఏమిటంటే స్టేజ్పై వినిపించే చిన్నపాటి శబ్దం కూడా చివరి వరుసలో కూర్చున్న ప్రేక్షకులకు వినిపిస్తుంది. ఇక్కడ ప్రదర్శన సమయంలో ఎలాంటి మైక్ ఉపయోగించరు. ప్రపంచంలో కేవలం ఆరు గైటీ థియేటర్లు మాత్రమే ఉన్నాయి. వాటిలో ఒకటే సిమ్లాలోని ఈ థియేటర్. దీనిని ప్రారంభించిన సమయంలో లాంతర్లను ఉపయోగించేవారు. దీనిలో ఉపయోగించే బ్యాటరీని ఇంగ్లండ్ నుంచి దిగుమతి చేసుకునేవారు.అనుపమ్ ఖేర్, నసీరుద్దీన్ షా తదితర ప్రముఖ బాలీవుడ్ నటులు ఇక్కడ ప్రదర్శనలు ఇచ్చారు. వీరితోపాటు కేఎల్ సెహగల్, టామ్ ఆల్టర్, పృథ్వీరాజ్ కపూర్ తదితరులు కూడా ఇక్కడ తమ ప్రతిభను చాటారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు శశికపూర్ తన భార్య జెన్నిఫర్కు ఇక్కడే పెళ్లికి ప్రపోజ్ చేశారు. -
కంగనా ముంబైకి ముల్లె సర్దుకోవాల్సిందే: మంత్రి విక్రమాధిత్య
సిమ్లా: సినీ నటి, బీజేపీ మండి అభ్యర్థిని కంగనా రనౌత్ దిగుమతి చేసుకున్న నాయకురాలని హిమాచల్ కాంగ్రెస్ మంత్రి విక్రమాధిత్య సింగ్ విమర్శలు చేశారు. ఆమెను మండి ఓటమిపాలైతే.. ముంబైకి సాగనంపే ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ఎద్దేవా చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాసౌలీలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని విక్రమాధిత్య మాట్లాడారు.‘‘హిమాచల్ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నాలుగు పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధిస్తుంది. మండిలో అయితే రాష్ట్రానికి దిగిమంతి చేయబడిన కంగనా రనౌత్ను ముంబైకి సాగనంపడానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశాం. ఈ ఎన్నికల పోటీలో మేము ముందడుగు వేశాం. మండిలో ప్రతిరోజు రాత్రిపగలు పనిచేస్తున్నాం. హిమాచల్లో నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని హామీ ఇవ్వగలను’’అని విక్రమాధిత్య అన్నారు.గత నెలలో కూడా విక్రమాధిత్య కంగనా రనౌత్పై తీవ్ర విమర్శలు చేశారు. కంగనా రనౌత్ వర్షం కాలంలో వచ్చే కప్ప లాంటి వారని ఎద్దేవా చేశారు. ‘‘ఎన్నికల ప్రచారం అనంతరం మండి నుంచి ఆమె వెళ్లిపోతుంది. కంగనా హిమాచల్ ప్రదేశ్కు కేవలం టూర్ కోసమే వస్తారు. కంగనా ఈ రోజు ఇక్కడ ఉంటారు.. రేపు మళ్లీ వెళ్లిపోతారు. వర్ష కాలంలో కప్ప మాదిరి కంగనా హిమాచల్కు వస్తూ.. వెళ్తూ ఉంటారు’’ అని విమర్శలు చేశారు. నాలుగు లోక్సభ స్థానాలు.. మండి, సిమ్లా, కాంగ్రా, మహీర్పూర్లలో చివరి విడత జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఫతితాలు జూన్ 4న వెలువడనున్నాయ. -
మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
హిమాచల్ ప్రదేశ్లో ఓ ఆసక్తికర ఉదంతం వెలుగు చూసింది. గడ్డం, మీసాలతో డ్యూటీకి వచ్చారంటూ ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీ 80 మంది ఉద్యోగులను తొలగించింది. సంస్థలోని ఉద్యోగులంతా క్లీన్ షేవ్తో రావాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో బాధిత ఉద్యోగులంతా లేబర్ కమిషనర్ను ఆశ్రయించారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఇది సోలన్లోని పారిశ్రామిక ప్రాంతమైన పర్వానూలో చోటుచేసుకుంది. గడ్డం, మీసాలు ఉన్నందుకు ఓ కంపెనీ 80 మంది కార్మికులను విధుల నుంచి తొలగించింది. అయితే తర్వాత ఆ కార్మికులు క్లీన్ షేవ్తో కంపెనీకి వచ్చారు. అయినా సదరు కంపెనీ వారిని తిరిగి నియమించుకునేందుకు నిరాకరించింది. వారు పరిశ్రమలోకి రాకుండా అడ్డుకుంది.దీంతో కార్మికులంతా నిరసన చేపట్టి లేబర్ కమిషనర్తో పాటు ముఖ్యమంత్రికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం లేబర్ ఇన్స్పెక్టర్ లలిత్ ఠాకూర్ కంపెనీని సందర్శించి ఇరువర్గాల వాదనలు విన్నారు. దీనిని డీసీ సోలన్ మన్మోహన్ శర్మ దృష్టికి తీసుకెళ్లారు. పరిశ్రమలో ఇలాంటి సంఘటనలు జరిగితే నిబంధనల ప్రకారం పరిశ్రమపై చర్యలు తీసుకుంటామని మన్మోహన్ శర్మ హెచ్చరించారు. ఈ కేసుపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
Lok sabha elections 2024: హిమజ్వాల!
పేరులో మంచు ఉన్నా హిమాచల్ప్రదేశ్లో రాజకీయాలు మాత్రం ఎప్పుడూ సెగలు కక్కుతుంటాయి. రాష్ట్రంలో అధికార పార్టీ ఓడిపోయే ఆనవాయితీ 1985 నుంచీ కొనసాగుతోంది. రాష్ట్ర కాంగ్రెస్ సర్కారుపై ఎమ్మెల్యేల తిరుగుబాటు తాజాగా రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తోంది. రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్, బీజేపీ మధ్య మారుతున్నా లోక్సభ ఎన్నికల్లో మాత్రం 2009 నుంచీ బీజేపీదే పై చేయి. గత రెండు ఎన్నికల్లో 4 సీట్లూ ఆ పార్టీయే క్లీన్స్వీప్ చేసింది. ఈసారి హ్యాట్రిక్పై కన్నేసింది. పదేళ్లుగా ఒక్క ఎంపీ సీటూ గెలవలేని పేలవమైన రికార్డును ఎలాగైనా మెరుగు పరుచుకోవాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది... ఆపరేషన్ కమలం... సుఖ్విందర్ సింగ్ సుఖు సీఎంగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచే రాష్ట్ర కాంగ్రెస్లో అసంతృప్తి సెగలు మొదలయ్యాయి. బీజేపీ దీన్ని యథాశక్తి ఎగదోస్తూ ఆపరేషన్ కమలానికి తెర తీసింది. ఇటీవలి రాజ్యసభ ఎన్నికలు దీనికి మరింత ఆజ్యం పోశాయి. కాంగ్రెస్ నుంచి జంప్ చేసిన హర్‡్ష మహాజన్ను బలం లేకపోయినా బీజేపీ రాజ్యసభ పోటీలో నిలిపింది. ముగ్గురు స్వతంత్రులతో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలూ అనూహ్యంగా బీజేపీకి ఓటేయడంతో హర్‡్షకు, కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వికి 34 ఓట్లు వచ్చాయి. లాటరీలో హర్‡్షనే విజయం వరించింది. స్వతంత్ర ఎమ్మెల్యేలు ముగ్గురూ ఇప్పటికే బీజీపీలో చేరారు. ఆరుగురు కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలు కూడా తాజాగా కాషాయ కండువా కప్పుకున్నారు. దాంతో ప్రస్తుతం కాంగ్రెస్ బలం 34కు పడిపోయి సర్కారు సంక్షోభంలో పడింది. బీజేపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ప్రభుత్వం కూలిపోయేలా ఉంది. ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. బీజేపీ టికెట్పై పోటీ చేస్తామని ప్రకటించారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓటేసిన ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. దాంతో ఆ ఆరు అసెంబ్లీ స్థానాల్లోనూ లోక్సభతో పాటే జూన్ 1న ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్కు ప్రాణసంకటం...! తాజా రాజకీయ సంక్షోభం నేపథ్యంలో లోక్సభ, 6 అసెంబ్లీ సీట్ల ఉప ఎన్నికలు కాంగ్రెస్కు విషమపరీక్షగా మారాయి. ఎమ్మెల్యే సీట్లు బీజేపీ పరమైతే రాష్ట్రంలో ప్రభుత్వం కమలనాథుల పరమవుతుంది. రామ మందిరం, హిందుత్వ, అభివృద్ధి నినాదాలతో బీజేపీ హోరెత్తిస్తోంది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, కార్పొరేట్లతో మోదీ కుమ్మక్కు, సామాజిక న్యాయం, సంక్షేమం తదితరాలను కాంగ్రెస్ నమ్ముకుంది. హమీర్పూర్ నుంచి రాజ్పుత్ సామాజిక వర్గానికి చెందిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఐదోసారి ఎంపీగా విన్నింగ్ షాట్ కొట్టేందుకు బరిలోకి దిగుతున్నారు. ఆయన హిమాచల్కు రెండుసార్లు సీఎంగా చేసిన ప్రేమ్కుమార్ ధుమాల్ తనయుడు. మండి స్థానంలో బాలీవుడ్ ఫైర్బ్రాండ్, ‘క్వీన్’ కంగనా రనౌత్ బీజేపీ తరఫున రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి రాజ వంశీయుడు, మాజీ సీఎం వీరభద్రసింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ పోటీలో ఉన్నారు. బీజేపీ ఎంపీ రామ్ స్వరూప్ శర్మ ఆత్మహత్య చేసుకోవడంతో 2021లో మండికి ఉప ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ తరఫున విక్రమాదిత్య సింగ్ తల్లి ప్రతిభా సింగ్ విజయం సాధించడంతో బీజేపీ బలం మూడుకు తగ్గింది.సర్వేల మాటేంటి? దాదాపు అన్ని సర్వేలూ బీజేపీ హ్యాట్రిక్ క్లీన్స్వీప్ ఖాయమని అంచనా వేస్తున్నాయి.పర్యాటక స్వర్గధామమైన హిమాచల్లో ఓటర్ల మూడ్ ఒక్కో ఎన్నికల్లో ఒక్కోలా మారుతుంటుంది. కాంగ్రెస్, బీజేపీలే ఇక్కడ నువ్వా నేనా అంటూ తలపడుతున్నాయి. 2014లో లోక్సభ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన బీజేపీ 2017 అసెంబ్లీ ఎన్నికల్లోనూ పూర్తి మెజారిటీతో అధికారాన్ని దక్కించుకుంది. 2019 లోక్సభ ఎన్నికల్లోనూ మరోసారి క్లీన్స్వీప్ చేసింది. కానీ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఓటర్లు కాంగ్రెస్కు పట్టం కట్టారు. 68 అసెంబ్లీ స్థానాల్లో 40 చోట్ల నెగ్గి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని 4 లోక్సభ స్థానాల్లో సిమ్లాను ఎస్సీలకు కేటాయించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బాలీవుడ్ నటి కంగనపై హిమాచల్ మంత్రి పోటీ
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్లోని మండి నుంచి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా మంత్రి విక్రమాదిత్య సింగ్ పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయన తల్లి రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్ వెల్లడించారు. కాగా మండి నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కంగనాకు పోటీగా మంత్రి విక్రమాదిత్య సింగ్ను కాంగ్రెస్ బరిలోకి దింపింది. ఇక్కడ నుంచి ప్రస్తుతం ప్రతిభా సింగ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. గత మూడు పర్యాయాలు ఆమె గెలిచారు. ఈ సందర్భంగా ప్రతిభా సింగ్ మాట్లాడుతూ. మండి ప్రజలు ఎల్లప్పుడూ తమతోనే ఉన్నారని పేర్కొన్నారు. విక్రమాదిత్యపై కంగనా రనౌత్ చేస్తున్న వ్యాఖ్యలను తాను పట్టించుకోనని అన్నారు. గతంలో క్లిష్ట పరిస్థితుల్లోనూ తాను గెలిచాను అని అన్నారు. హిమాచల్ ప్రజల గురించి కంగనాకు ఏం తెలియదని, ఈ ఎన్నికల్లో ఆమె గెలవదని అన్నారు. ‘దేవ్ భూమి’ హిమాచల్ నుంచి బాలీవుడ్కు స్వచ్చంగా తిరిగి వెళ్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. కాగా జూన్ 1న హిమాచల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి, చదవండి: కేజ్రీవాల్ పిటిషన్పై ఏప్రిల్ 15న సుప్రీంకోర్టు విచారణ -
కాంగ్రెస్ వెనకడుగేస్తే మొత్తం మేమే పోటీ చేస్తాం: ఆప్
సిమ్లా (హిమాచల్ ప్రదేశ్): ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో పోటీకి సంబంధించి హిమాచల్ ప్రదేశ్ ఆప్ నేత కీలక వ్యాఖ్యలు చేశారు. పోటీకి కాంగ్రెస్ వెనకడుగు వేస్తే హిమాచల్ ప్రదేశ్లోని నాలుగు లోక్సభ స్థానాల్లోనూ పోటీ చేసేందుకు తమ పార్టీ సుముఖంగా ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత ఒకరు తెలిపారు. ఆప్ నేత అనుజ్ నాథూరామ్ చౌహాన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ నేతలు పోటీ చేసేందుకు సంకోచిస్తే నాలుగు లోక్సభ స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ విషయమై పార్టీ హైకమాండ్తో మాట్లాడుతాం’ అన్నారు. రాబోయే ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించడంలో జాప్యంపై కాంగ్రెస్ విమర్శలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ‘ఇండియా’ కూటమి మిత్ర పక్షమైన ఆప్ నుంచి ఇలాంటి ప్రకటన రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్ మొదట పోటీ చేయడానికి నిరాకరించారు. అయితే మండి పార్లమెంటరీ సెగ్మెంట్ నుండి భారతీయ జనతా పార్టీ (BJP) నటి కంగనా రనౌత్ను పోటీకి దింపుతుండటంతో ఆమె తన నిర్ణయంపై పునరాలోచన చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పోటీ చేయాలనుకుంటే ఆప్ మద్దతునిస్తుందని చౌహాన్ తెలిపారు. అయితే, కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తే ఆప్ తన అభ్యర్థులను నిలబెట్టేందుకు సిద్ధంగా ఉందని ఆయన ఉద్ఘాటించారు. హిమాచల్ ప్రదేశ్లోని నాలుగు లోక్సభ స్థానాలు, ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లకు ఉప ఎన్నికలతో పాటు జూన్ 1న చివరి దశలో ఎన్నికలు జరుగుతాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. -
Lok Sabha Elections 2024: మండిలో కంగన రోడ్ షో
సిమ్లా: బాలీవుడ్ నటి, బీజేపీ లోక్సభ అభ్యర్థి కంగనా రనౌత్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తాను తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్న హిమాచల్ప్రదేశ్లోని మండిలో శుక్రవారం రోడ్ షో చేశారు. కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనేత్ ఇటీవల తనపై చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా తీవ్రంగా దుయ్యబట్టారు. ‘‘మీ అక్కాచెల్లెళ్లకు, కూతుళ్లకు వెల కట్టేవాళ్లు ఎప్పటికీ మీవాళ్లు కాలేరు. ఇక్కడ తపస్సు చేసిన మాండవ రుషి నుంచి ఈ పట్టణానికి మండి అని పేరొచి్చంది. అలాంటి పేరును కూడా కించపరుస్తున్నారు’ అని రోడ్ షోకు పోటెత్తిన జనాన్ని ఉద్దేశించి అన్నారు. ‘మండిలో ఇప్పుడు ఏ రేటు పలుకుతోంది’ అని కంగనాపై సుప్రియ ఇన్స్ట్రాగాంలో పెట్టిన పోస్టు దుమారం రేపడం తెలిసిందే. -
కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలను బరిలోకి దింపిన బీజేపీ
ఢిల్లీ:లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఐదు జాబితాను విడుదల బీజేపీ ప్రచారంలో దూసుకుపోతోంది. తాజాగా లోక్సభ ఎన్నికలతో పాటు హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఉప ఎన్నికలకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్లో రాజ్యసభ ఎంపీ ఎన్నికల సందర్భంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థికి ఆరుగురు రెబల్ ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఓటు వేసిన విషయం తెలిసిందే. దీంతో ముగ్గురు కాంగ్రెస్, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. అనంతరం హిమాచల్ కాంగ్రెస్ అనర్హత ఎమ్మెల్యేలు శనివారం బీజేపీలో చేరారు. తాజాగా ప్రకటించిన బీజేపీ అభ్యర్థుల జాబితాలో వారు చోటు సంపాధించుకున్నారు. సుధీర్శర్మ- ధర్మశాల, రవి ఠాకుర్- లాహౌల్ అండ్ స్పితి, రాజిందర్ రానా- సుజన్పూర్, ఇందర్ దత్ లకాన్ పాల్- బర్సార్, చైతన్య శర్మ- గాగ్రేట్, దేవిందర్ కుమార్ భుట్టో- కుట్లేహర్ స్థానాల్లో బరిలోకి దిగనున్నారు. ఈ ఆరు స్థానాలకు ఏడు విడతలో భాగంగా జూన్ 1న పోలింగ్ జరగనుంది. అదే రోజు హిమాచల్ప్రదేశ్లోని నాలుగు లోక్సభ స్థానాకుల కూడా పోలింగ్ జరగనుంది. అదే విధంగా గుజరాత్లో ఐదు స్థానాలు, కర్ణాటకలో ఒక స్థానం, పశ్చిమ బెంగాల్లో రెండు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ప్రకటించింది. BJP releases a list of candidates for upcoming by-elections in Gujarat, Himachal Pradesh, Karnataka and West Bengal pic.twitter.com/xiZsleW91d — ANI (@ANI) March 26, 2024 -
కంగనా రనౌత్పై హిమాచల్ మంత్రి కీలక వ్యాఖ్యలు
సిమ్లా: లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ ఐదో జాబితాలో భాగంగా 111 మంది అభ్యర్థులను ఆదివారం విడుదల చేసింది. ఈ జాబితా హిమాచల్ ప్రదేశ్లోని మండి సెగ్మెంట్ బాలీవుడ్ నటీ కంగనా రనౌత్కు బీజేపీ టికెట్ కేటాయింది. కంగనా రనౌత్కు బీజేపీ టికెట్ ప్రకటించటంపై హిమాచల్ప్రదేశ్ మంత్రి విక్రమాధిత్య సింగ్ స్పందించారు. కంగనా రనౌత్ మూడింట ఒక వంతు సమయం కూడా తాను పోటీచేసే నియోజకవర్గంలో అందుబాటులో ఉండరని అన్నారు. ‘అభ్యర్థుల ఎంపిక బీజేపీ పార్టీ అంతర్గత విషయం. నేను వారు ఎంపిక విధానంపై ఎటువంటి వ్యాఖ్యలు చేయను. ఎంపిక విధానం ఆ పార్టీ స్వేచ్చ. మేము మా బలంలో లోక్సభ ఎన్నికల బరిలోకి దిగుతాం. మేము కంగనా రౌనత్ను గౌరవిస్తాం. సినిమాల్లో నటించి పలు అవార్డులు అందుకొని.. హిమాచల్ ప్రదేశ్కు పేరు తెచ్చారు. కానీ ఇది రాజకీయ రంగం. అతిపెద్ద సందేహం ఏమిటంటే.. ఒక నటిగా ఆమెకు సినిమాల్లో నటించటం, నిర్మించటమే తొలి ప్రాధాన్యం. ఆమె కనీసం మూడింట ఒకవంతు సమయమైనా హిమాచల్ ప్రదేశ్కు కేటాయించగలరా?’ అని ప్రశ్నించారు. ‘స్టార్డమ్తో రాజకీయాలు చేయటం అంత సులభం కాదు. బీజేపీ కంగనా స్టార్డమ్ మీద మత్రమే ఆధారపడుతోంది. కేవలం స్టారడమ్ ఆధారంగా ఆమె అభ్యర్థిగా బరిలో దింపటం సరికాదు. ఆమె ప్రాధాన్యం ఎప్పుడూ బాలివుడ్ సినిమా పరిశ్రమే. గెలిచినా లేదా ఓడినా రాజకీయాలు ఆమెకు తొలి ప్రాధాన్యం కాదు. అందుకే మండి నియోజకవర్గం ప్రజలు పూర్తిగా మీకు అందుబాటులో ఉండే నేత కావాలా? లేదా స్టార్డమ్ ఉన్న వాళ్లకు ఓటు వేస్తారో నిర్ణయించుకోవాలి’ అని మంత్రి విక్రమాధిత్య అన్నారు. ఇక.. ప్రస్తుతం మండి నియోజకవర్గం ఎంపీగా వ్యవహిరిస్తున్న హిమాచల్ ప్రదేశ్ పీసీసీ చీఫ్ ప్రతిభా సింగ్ ఇటీవల తాను వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు. కంగనాకు బీజేపీ టికెట్ ప్రకటించటంపై ప్రతిభా సింగ్ కూడా స్పందించారు. ‘ఆమెకు ఎంపీగా పోటీ చేసే అవకాశం లభించినందుకు సంతోషం. కానీ ఆమె ఒక సినిమా సెలబ్రిటీ. ఆమె ఇంత సడన్గా రాజకీయాల్లోకి వచ్చి ఎలాంటి పాత్ర పొషిస్తారో చూస్తాం’ అని ప్రతిభా సింగ్ అన్నారు. -
విరిగిపడిన కొండచరియలు.. ఇద్దరు మృతి!
హోలీ పర్వదినాన హిమాచల్ ప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హోలీ వేడుకలు జరుగుతున్న ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. ఉనా జిల్లా అంబ్ సబ్ డివిజన్లోని మేడిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే హోలీ వేడుకల్లో భాగంగా భక్తులు గంగా నదిలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఇంతలో అకస్మాత్తుగా కొండపై నుంచి రాళ్లు పడటం మొదలైంది. దీంతో భక్తుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ నేపధ్యంలో తొమ్మిది మంది భక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సివిల్ ఆస్పత్రికి తరలించగా, ఇద్దరు భక్తులు మృతి చెందారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఉనా ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. -
ఎన్నికల బరిలో మరో స్టార్ హీరోయిన్.. పోటీ ఎక్కడంటే?
లోక్సభ ఎన్నికల బరిలో మరో స్టార్ హీరోయిన్ నిలిచారు. ఇవాళ ప్రకటించిన బీజేపీ జాబితాలో బాలీవుడ్ క్విన్ కంగనా రనౌత్ సీటును కేటాయించారు. ఆమె సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్లోనే ఆమె పోటీ చేయనున్నారు. మండి లోక్సభ నియోజకవర్గం నుంచి కంగనా అభ్యర్థిత్వాన్ని బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఈ విషయాన్ని కంగనా ట్విటర్ ద్వారా పంచుకున్నారు. కంగనా తన ట్వీట్లో రాస్తూ..'నా ప్రియమైన భారత్, భారతీయ జనతా సొంత పార్టీ, బీజేపీకి ఎల్లప్పుడూ నా మద్దతు ఉంటుంది. ఈ రోజు బీజేపీ జాతీయ నాయకత్వం నా జన్మస్థలం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రమైన మండి నియోజకవర్గం నుంచి లోక్సభ అభ్యర్థిగా నన్ను ప్రకటించింది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడమనేది హైకమాండ్ నిర్ణయం. పార్టీలో అధికారికంగా చేరడం గౌరవంగా, ఆనందంగా భావిస్తున్నా. నేను ఒక కార్యకర్తగా, నమ్మకమైన ప్రజా సేవ కోసం ఎదురుచూస్తున్నా' అంటూ పోస్ట్ చేశారు. ఇక సినిమాల విషయానికొస్తే గతేడాది చంద్రముఖి-2, తేజస్ సినిమాలతో మెప్పించింది. ఈ ఏడాదిలో ఎమర్జన్సీ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవలే లోక్సభ బరిలో మరో సీనియర్ హీరోయిన్ రాధిక శరత్కుమార్ సైతం తమిళనాడులోని విరుధునగర్ నుంచి పోటీలో నిలిచారు. My beloved Bharat and Bhartiya Janta’s own party, Bharatiya Janta party ( BJP) has always had my unconditional support, today the national leadership of BJP has announced me as their Loksabha candidate from my birth place Himachal Pradesh, Mandi (constituency) I abide by the high… — Kangana Ranaut (@KanganaTeam) March 24, 2024 -
ఒళ్లో పేలిన ఫోను.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!
హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లాలో మొబైల్ ఫోన్ పేలిన ఉదంతం వెలుగు చూసింది. స్థానిక కోచింగ్ సెంటర్లో క్లాసులు జరుగుతుండగా ఒక విద్యార్థిని ఒళ్లోవున్న మొబైల్ ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో తరగతిలో కలకలం చెలరేగింది. అయితే వెంటనే అప్రమత్తమైన ఆ విద్యార్థిని మొబైల్ ఫోనును బయటకు విసిరేసింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం హమీర్పూర్ ప్రధాన మార్కెట్ ప్రాంతంలో ఒక ప్రైవేట్ విద్యాసంస్థ ఉంది. ఇక్కడ దాదాపు 40 మంది చదువుకుంటున్నారు. క్లాసులో తరగతి జరుగుతుండగా ఓ విద్యార్థిని దగ్గరున్న ఫోనులో నుంచి మంటలు చెలరేగాయి దీంతో ఆమె భయంతో ఆ మొబైల్ ఫోనును మెయిన్ రోడ్డు వైపునకు విసిరేసింది. ఆ ఫోను అక్కడున్న సైన్ బోర్డుకు తగిలి పేలిపోయింది. దీంతో సైన్ బోర్డుకు మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత మొబైల్ ఫోను పూర్తిగా కాలిపోయింది. అనంతరం స్థానికులు అప్రమత్తమై ఆ మంటలపై బకెట్లతో నీళ్లు పోసి, ఆర్పివేశారు. భవనం మొదటి అంతస్థులో ఈ ఘటన జరిగింది. అక్కడికి సమీపంలోనే దుస్తుల దుకాణాలు ఉన్నాయి. రోడ్డుపైనో, తరగతి గదిలోనో ఆ మొబైల్ ఫోన్ పేలి ఉంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని స్థానికులు అంటున్నారు. -
హిమాచల్లో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు రాజీనామా
సిమ్లా: హిమాచల్ప్రదేశ్లో కాంగ్రెస్కు చెందిన సీఎం సుఖూ ప్రభుత్వాన్ని కష్టాలు చుట్టుముడుతున్నాయి. ఇటీవలి రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు చెందిన ఆరుగురితోపాటు సుఖూ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటేయడం సంచలనం రేపింది. బీజేపీకి ఓటేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరుగురు అనర్హత వేటుకు గురికాగా, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు తాజాగా పదవులకు రాజీనామా చేశారు. బీజేపీలో చేరి, ఆ పార్టీ టిక్కెట్పై మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని వీరు తెలిపారు. శుక్రవారం బీజేపీ నేతలతో కలిసి వెళ్లి అసెంబ్లీ లో రాజీనామా పత్రాలను అందజేశారు. -
సగం టార్గెట్ ఇవే.. నిలిచేదెవరు.. గెలిచేదెవరు?
దేశవ్యాప్తంగా లోక్సభ సార్వత్రిక ఎన్నికల కాక మొదలైంది. వరుసగా రెండుసార్లు అధికారం దక్కించుకుని హాట్రిక్ కోసం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఉత్సాహంతో ఉరకలు వేస్తుంటే ఈసారి ఎలాగైనా ఎన్డీఏ కూటమి దూకుడుకు అడ్డుకట్ట వేయాలని కాంగ్రెస్ నాయకత్వంలోని ‘ఇండియా’ కూటమి గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అత్యధిక స్థానాలు ఉన్న ఉత్తర ప్రదేశ్ సహా ఈ తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కువ లోక్సభ సీట్లు ఏ కూటమి గెలుచుకుంటే ఆ కూటమికే అధికారం ఖాయమని చెప్పవచ్చు. ఉత్తర ప్రదేశ్ ఉత్తర ప్రదేశ్లో 80 లోక్సభ నియోజక వర్గాలు ఉన్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ 1, బీజేపీ 62, ఎస్పీ 5, ఇతరులు 12 సీట్లు గెలుచుకున్నారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో 403 స్థానాలు ఉండగా ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ పార్టీలు ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. యోగి ఆదిత్యనాథ్, అఖిలేశ్, మాయావతి కీలక నేతలు. వారణాసీ, రాయ్బరేలి, మైన్పురీ కీలక నియోజకవర్గాలు. అయోధ్య రామాలయం, కుల సమీకరణాలు, నిరుద్యోగం ఇక్కడ ప్రస్తుత ఎన్నికల అంశాలు. బిహార్ బిహార్లో 40 లోక్సభ నియోజక వర్గాలు ఉన్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ ఎన్డీఏ కూటమి 39 స్థానాలను, యూపీఏ 1 సీటు గెలుచుకున్నాయి. బిహార్ అసెంబ్లీలో 243 స్థానాలు ఉండగా ప్రస్తుతం ఎన్డీఏ అధికారంలో ఉంది. బీజేపీ, కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీ పార్టీలు ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్, సుశీల్ మోదీ, తేజస్వీ యాదవ్ కీలక నేతలు. హాజీపూర్, పట్నా సాహిబ్, పాటలీపుత్ర కీలక నియోజకవర్గాలు. కుల సమీకరణాలు, హిందూత్వ వాదం, నిరుద్యోగం ఇక్కడ ప్రస్తుత ఎన్నికల అంశాలు. రాజస్థాన్ రాజస్థాన్లో 25 లోక్సభ నియోజక వర్గాలు ఉన్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 25 స్థానాలనూ ఎన్డీఏ కూటమి గెలుచుకుంది. రాజస్థాన్ అసెంబ్లీలో 200 స్థానాలు ఉండగా ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. భజన్లాల్ శర్మ, అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ కీలక నేతలు. జోధ్పూర్, కోటా-బూందీ కీలక నియోజకవర్గాలు. కుల సమీకరణాలు, రైతుల సమస్యలు ఇక్కడ ప్రస్తుత ఎన్నికల అంశాలు. పంజాబ్ పంజాబ్లో 13 లోక్సభ నియోజక వర్గాలు ఉన్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ 8 స్థానాలు, ఎన్డీఏ కూటమి 4, ఆప్ 1 సీటు గెలుచుకున్నాయి. పంజాబ్ అసెంబ్లీలో 117 స్థానాలు ఉండగా ప్రస్తుతం ఆప్ అధికారంలో ఉంది. ఆప్, బీజేపీ, కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ పార్టీలు ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. భగవంత్మాన్, సుఖ్బీర్సింగ్ బాదల్, సునీళ జాఖడ్ కీలక నేతలు. అమృత్సర్, గురుదాస్పుర్ కీలక నియోజకవర్గాలు. రైతు సమస్యలు, శాంతి భద్రతలు ఇక్కడ ప్రస్తుత ఎన్నికల అంశాలు. హరియాణా హరియాణాలో 10 లోక్సభ నియోజక వర్గాలు ఉన్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ మొత్తం స్థానాలనూ బీజేపీ గెలుచుకుంది. హరియాణా అసెంబ్లీలో 90 స్థానాలు ఉండగా ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ, కాంగ్రెస్, జేజేపీ, ఐఎన్ఎల్డీ పార్టీలు ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. మనోహర్లాల్ ఖట్టర్, నాయబ్సింగ్ సైనీ, భూపీందర్ హుడా, కుమారి శెల్జా, ఓంప్రకాశ్ చౌతాలా కీలక నేతలు. రోహ్తక్, కురుక్షేత్ర కీలక నియోజకవర్గాలు. రైతుల సమస్యలు, హిందూత్వ వాదం ఇక్కడ ప్రస్తుత ఎన్నికల అంశాలు. ఢిల్లీ ఢిల్లీలో 7 లోక్సభ నియోజక వర్గాలు ఉన్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 7 స్థానాలనూ బీజేపీ గెలుచుకుంది. ఢిల్లీ అసెంబ్లీలో 70 స్థానాలు ఉండగా ప్రస్తుతం ఆప్ అధికారంలో ఉంది. బీజేపీ, ఆప్, కాంగ్రెస్ పార్టీలు ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. అరవింద్ కేజ్రీవాల్, వీరేందర్ సచ్దేవ, అర్విందర్ సింగ్ కీలక నేతలు. న్యూఢిల్లీ, ఈశాన్య ఢిల్లీ కీలక నియోజకవర్గాలు. సీఏఏ, ఆప్-కాంగ్రెస్ జట్టు కట్టడం ఇక్కడ ప్రస్తుత ఎన్నికల అంశాలు. ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్లో 5 లోక్సభ నియోజక వర్గాలు ఉన్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 5 స్థానాలనూ బీజేపీ గెలుచుకుంది. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో 70 స్థానాలు ఉండగా ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. పుష్కర్సింగ్ ధామీ, కరణ్ మాహరా కీలక నేతలు. హరిద్వార్, నైనిటాల్-ఉద్దమ్ సింగ్ నగర్ కీలక నియోజకవర్గాలు. యూసీసీ, నిరుద్యోగం, మహిళలపై నేరాల పెరుగుదల ఇక్కడ ప్రస్తుత ఎన్నికల అంశాలు. హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్లో 4 లోక్సభ నియోజక వర్గాలు ఉన్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 4 స్థానాలనూ బీజేపీ గెలుచుకుంది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో 68 స్థానాలు ఉండగా ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. సుఖ్విందర్ సింగ్ సుఖ్ఖూ, రాజీవ్ బిందల్ కీలక నేతలు. హమీర్పుర్, మండి కీలక నియోజకవర్గాలు. అయోధ్య రామాలయం, కాంగ్రెస్లో అంతర్గత కలహాలు ఇక్కడ ప్రస్తుత ఎన్నికల అంశాలు. జమ్మూకశ్మీర్ ప్రస్తుతం గవర్నర్ పాలనలో ఉన్న జమ్మూకశ్మీర్లో 5 లోక్సభ నియోజక వర్గాలు ఉన్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ 2 స్థానాలు, నేషనల్ కాన్ఫరెన్స్ 3 సీట్లు గెలుచుకున్నాయి. భారతీయ జనతా పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీలు ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ కీలక నేతలు. ఆర్టికల్ 370 రద్దు, తగ్గుతున్న ఉగ్రవాద ఘటనలే ఇక్కడ ప్రస్తుత ఎన్నికల అంశాలు. నియోజకవర్గాల పునర్విభజన కోసం ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ నివేదిక ఇంకా కొలిక్కిరాకపోవడంతో అధికారికంగా ఇంకా అసెంబ్లీ సీట్ల సంఖ్య ఖరారు కాలేదు. -
15,256 అడుగుల ఎత్తులో 52 మంది ఓటర్లు!
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ బూత్ అయిన తాషిగ్యాంగ్ పోలింగ్ కేంద్రం హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఇది సముద్ర మట్టానికి 15,256 అడుగుల ఎత్తులో ఉంది. ఈ పోలింగ్ బూత్లో మూడోసారి ఓటింగ్ జరగనుంది. తాషిగ్యాంగ్లో పోలింగ్ స్టేషన్ను నిర్మించిన తర్వాత 2019లో తొలిసారిగా లోక్సభ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. 2021లో తాషిగ్యాంగ్ పోలింగ్ బూత్లో లోక్సభ ఉప ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు మూడోసారి. 2024లో ఈ పోలింగ్ స్టేషన్లో లోక్సభ ఎన్నికలు జరుగుతాయని అధికారులు తెలిపారు. భారత ఎన్నికల సంఘం ఈ సంవత్సరం దీన్ని మోడల్ పోలింగ్ స్టేషన్గా మార్చింది. ఇక్కడ 52 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 52 మంది ఓటర్లలో 30 మంది పురుషులు, 22 మంది మహిళలు ఉన్నారు. ఈ పోలింగ్ స్టేషన్ కాజా సబ్ డివిజన్ నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. రహదారి నుండి కేవలం 200 మీటర్ల దూరంలో ఉంది. అయితే, ప్రస్తుతం ఇక్కడ అడుగు మందం మేర మంచు కురుస్తోంది. దీంతో ఎన్నికల సంఘం జూన్ 1న ఇక్కడ ఓటింగ్ను ఏర్పాటు చేసింది. తాషిగ్యాంగ్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటుకు ముందు గ్రామస్థులు ఓటు వేయడానికి 14,567 అడుగుల ఎత్తులో ఉన్న హిక్కిమ్ గ్రామానికి వెళ్లాల్సి ఉండేది. తాషిగ్యాంగ్ కంటే ముందు, ఇదే భారతదేశంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ బూత్. 2019 లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ 45 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 27 మంది పురుషులు, 18 మంది మహిళలు ఉన్నారు. 2021లో మండి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరిగినప్పుడు 49 మంది ఓటర్లు ఉండగా వీరిలో 29 మంది పురుషులు, 20 మంది మహిళలు. ఈ రెండు ఎన్నికల్లోనూ ఇక్కడ 100 శాతం ఓటింగ్ నమోదైంది. -
సొంత నేతలతో కాంగ్రెస్కు తలనొప్పులు?
హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని కష్టాలు వెంటాడుతున్నాయి. దీనికి ఆ పార్టీలోని సీనియర్ నేతలే కారణమంటూ పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాబోయే లోక్సభ ఎన్నికలు పార్టీకి కత్తిమీద సాములా మారాయి. హిమాచల్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్ హిమాచల్లోని మండి స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేయడానికి ససేమీరా అంటున్నారు. ప్రతిభా సింగ్ 2019లో మండి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక్కడ ఆమెకు అమితమైన ప్రజాదరణ ఉంది. కాగా మండి స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా సినీ నటి కంగనా రనౌత్ పోటీ చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. రాబోయే లోకసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రతిభా సింగ్తో పాటు పలువురు సీనియర్ నేతలు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ప్రతిభా సింగ్ తనయుడు విక్రమాదిత్య సింగ్ కూడా ఇదే వైఖరితో ఉన్నట్లు సమాచారం. దీనికితోడు వీరభద్ర సింగ్ గ్రూపులోని పలువురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు వైఖరిని ప్రదర్శిస్తున్నారట. విక్రమాదిత్య సింగ్ వర్గం హిమాచల్ సీఎం కుర్చీపై కన్నేసింది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు మరింతగా పెరిగిపోతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. -
కాంగ్రెస్ రెబల్స్కు సుప్రీంలో చుక్కెదురు
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్లోని అధికార కాంగ్రెస్కు చెందిన ఆరుగురు రెబల్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ అనర్హులుగా ప్రకటించడంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ ఆరుగురు శాసనసభ్యులు ఇటీవలి రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడిన విషయం తెలిసిందే. అనర్హత నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వీరు దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం విచారణ జరిపింది. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలంటూ స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా కార్యాలయానికి నోటీసు పంపింది. పిటిషన్లు పెండింగ్లో ఉన్నందున అసెంబ్లీ కార్యకలాపాలతోపాటు ఓటింగ్లోనూ పాల్గొనరాదని ఆరుగురికి ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను మే 6వ తేదీకి వాయిదా వేసింది. ఖాళీ అయిన ఆరు స్థానాల్లో నామినేషన్ల దాఖలుకు మే 7 ఆఖరు తేదీ. -
Rishikesh: ‘హిమాచల్’ సంక్షోభం మళ్లీ మొదటికి..?
రిషికేష్: హిమాచల్ప్రదేశ్ సంక్షోభం మళ్లీ మొదటికి వచ్చినట్లు కనిపిస్తోంది. ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ఓటింగ్కు పాల్పడ్డ ఆరుగురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు మొత్తం 11 మంది తాజాగా శనివారం(మార్చ్ 9) ఒక ప్రత్యేక బస్సులో బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరాఖండ్లోని రిషికేష్ చేరుకున్నారు. అత్యంత భద్రత నడుమ బస్సు దిగి తాజ్ రిషికేష్ హోటల్లోనికి ఎమ్మెల్యేలు వెళ్లారు. శుక్రవారమే హిమాచల్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిశారు. రెబల్స్ను మళ్లీ తీసుకుంటారా అని ఢిల్లీలో మీడియా ఆయనను ప్రశ్నించగా తప్పు తెలుసుకుంటే మరో చాన్స్కు అర్హులవుతారు అని సుఖు సమాధానమిచ్చారు. ఇంతలోనే రెబల్ ఎమ్మెల్యేలు మళ్లీ క్యాంపునకు వెళ్లడం చర్చనీయాంశమైంది. కాగా, ఫిబ్రవరిలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటు వేయడంతో బలం లేని కాషాయ పార్టీ అభ్యర్థి రాజ్యసభ ఎంపీగా గెలిచారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మనుసింఘ్వి ఓటమి పాలయ్యారు. ఈ సంక్షోభం తర్వాత స్పీకర్ ఆరుగురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీ నుంచి బయటపడి మళ్లీ మెజారిటీలోకి వెళ్లింది. అయితే స్పీకర్ నిర్ణయంపై రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్పై సుప్రీం నిర్ణయం వెల్లడించాల్సి ఉంది. ఇదీ చదవండి.. లోక్సభ ఎన్నికల వేళ.. బిహార్లో ఈడీ దాడుల కలకలం -
Suman Kumari: స్నైపర్ గురి
800 మీటర్ల దూరం.. అంటే ముప్పావు కిలోమీటరు నుంచి కూడా గురి తప్పకుండా కాల్చే రైఫిళ్లు స్నైపర్లు. వీటిని ఉపయోగించే వారిని కూడా స్నైపర్లు అనే అంటారు. ఇంతకాలం మగవాళ్లే స్నైపర్లుగా ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్కు చెందిన బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ సుమన్ కుమారి అత్యంత కఠినమైన శిక్షణ పొంది మన దేశ తొలి మహిళా స్నైపర్గా అర్హతను పొందింది. 1984 ‘ఆపరేషన్ బ్లూస్టార్’ తర్వాత రాజీవ్ గాంధీ హయాంలో 1988లో ‘ఆపరేషన్ బ్లాక్ థండర్’ పేరుతో స్వర్ణదేవాలయంలో మిగిలి ఉన్న సిక్కు వేర్పాటువాదులను ఏరివేసే మిలటరీ చర్య జరిగింది. ‘ఆపరేషన్ బ్లూస్టార్’ సమయంలో ఇరువర్గాల్లోనూ ప్రాణనష్టం ఎక్కువ. కాని ‘ఆపరేషన్ బ్లాక్ థండర్’లో మిలటరీ సిబ్బంది ప్రాణనష్టం జరక్కుండా సిక్కు వేర్పాటువాదులను అణిచివేయగలిగారు. దీనికి కారణం స్వర్ణ దేవాలయాన్ని మారణాయుధాలతో పై నుంచి కాపలాకాస్తున్న ఐదుగురు వేర్పాటువాదులను చాలా దూరం నుంచి కాల్చి చంపడం. మొదటిసారి ‘స్నైపర్స్’ ఉపయోగం వల్ల కలిగిన ప్రయోజనం అది. స్నైపర్ అంటే శత్రునిర్మూలన ఏదో సినిమాలో ‘నన్ను చూడాలంటే నీ జీవితం సగం తగలడిపోయి ఉండాలి’ అని బ్రహ్మానందం అంటాడు. స్నైపర్ రంగంలో దిగాడంటే శత్రువు జీవితం ముగింపు దశలో ఉందని అర్థం. స్నైపర్లు శత్రువును బంధించడానికి కాదు. నిర్మూలించడానికి. మనదేశంలో ముందు నుంచి కూడా అత్యాధునిక ఆయుధాల పట్ల కాకుండా సంప్రదాయ ఆయుధాల పట్ల మొగ్గు ఉండటం వల్ల స్నైపర్లను ఆదరించింది లేదు. కిలోమీటరు నుంచి ఒకటిన్నర కిలోమీటరు దూరం వరకూ కూడా శత్రువును కాల్చి చంపగల స్నైపర్ రైఫిల్స్ను ఎలా ఉపయోగించాలో తెలియడానికి ఆ కాలంలో మన మిటలరీ యోధులు ఇజ్రాయిల్, ఫ్రాన్స్ వెళ్లాల్సి వచ్చేది. 1980లలోనే కొద్దిగా స్నైపర్స్ ఉపయోగం తెలిసింది. ఇటీవల సరిహద్దుల వెంబడి వివిధ దేశాల దాడులను ప్రతిఘటించడానికి స్నైపర్లు సమర్థంగా ఉపయోగపడుతున్నాయని వాటిని ఉపయోగించే నిపుణులను తయారు చేస్తున్నారు. మధ్యప్రదేశ్– మహౌలోని ‘ఇన్ఫాంట్రీ స్కూల్’లో, ‘ఇండోర్లోని సెంట్రల్ స్కూల్ ఆఫ్ వెపన్స్ అండ్ టాక్టిక్స్’ కేంద్రంలో స్నైపర్స్ శిక్షణ ఇస్తున్నారు. ఇంతవరకూ మగవాళ్లకే సాగిన ఈ శిక్షణ సుమన్ కుమారి వల్ల స్త్రీలకు కూడా ఇవ్వడం మొదలైంది. పంజాబ్లో చూసి హిమాచల్ ప్రదేశ్లో మండి జిల్లాకు చెందిన సుమన్ కుమారి 2021లో బి.ఎస్.ఎఫ్.లో ఇన్స్పెక్టర్ హోదాలో చేరింది. పంజాబ్లో ఆమెకు విధులు కేటాయించారు. అక్కడ ఉండగా సరిహద్దు దేశాల నుంచి శత్రువులు స్నైపర్లతో మనవారి మీద దాడులు చేయడం సుమన్ గమనించింది. మన వద్ద తగినంత మంది స్నైపర్లు లేరని కూడా అవగాహన చేసుకుంది. అంతే. తనకు తానే స్నైపర్గా శిక్షణ తీసుకునేందుకు అనుమతి అడిగింది. ‘సాధారణంగా స్నైపర్గా తీసుకునే శిక్షణ కఠినమైనది. మగవారే వెనకాడుతారు. శిక్షణలో సగం మంది వెనుతిరుగుతారు. కాని సుమన్ 8 వారాల పాటు శిక్షణను సమర్థంగా పూర్తి చేసింది. 56 మంది ఉన్న బ్యాచ్లో ఆమె మాత్రమే మహిళ. శిక్షణ బాగా పూర్తి చేసిన వారిని ‘ఆల్ఫా’ అని, ‘బ్రేవో’ అని నైపుణ్యాన్ని బట్టి విభజిస్తాం. కాని సుమన్ ప్రతిభ అంతకు మించింది. అందుకే ఆమెకు ఇన్స్ట్రక్టర్ హోదా ఇచ్చాం. దాని అర్థం ఆమె స్నైపర్ మాత్రమే కాదు స్నైపర్ శిక్షకురాలు కూడా’ అని ఒక మిలటరీ అధికారి తెలియచేశారు. ఎప్పుడెప్పుడు హైజాక్లు, కిడ్నాప్లు, టెర్రరిస్ట్ అటాక్లు, ముఖ్య నేతలను బందీలుగా పట్టుకోవడం, సరిహద్దులు దాటి శత్రువులు రావడం వంటి సందర్భాలలో స్నైపర్లు రంగంలో దిగుతారు. పరిసరాలకు తగినట్టుగా పై తొడుగులు (కామూఫ్లాజ్) ధరించి శత్రువుకు వీలైనంత దగ్గరగా వెళ్లి తూటాతో సమాధానం చెప్పడమే వీరు చేసేపని. సుమన్ సేవలు ఇకపై దేశానికి రక్షణ ఇస్తాయి. ‘నేను స్నైపర్ కావడం స్త్రీలకు స్ఫూర్తినిస్తుందనే అనుకుంటున్నాను. మిలటరీలోకి మరింతమంది మహిళలు రావాలని కోరుకుంటున్నాను’ అందామె. -
మైనస్ 25 డిగ్రీల టెంపరేచర్లో... మాంగల్య తంతునానేనా!
సాధారణంగా ఎవరైనా పెళ్లిమండపం ఎంపిక చేసుకోవడానికి సౌకర్యాలు, అనుకూలతలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. అయితే అన్ని పెళ్లిళ్లూ ఒకేలా ఉండవు అని చెప్పడానికి ఈ పెళ్లి ఒక ఉదాహరణ. హిమాచల్ప్రదేశ్లోని స్పితి వ్యాలీలో మైనస్ 25 డిగ్రీల ఉష్ణోగ్రతలో గుజరాతీ జంట పెళ్లి చేసుకుంది. ‘ఏ మ్యారేజ్ లైక్ దిస్ టూ! ఏ లవింగ్ కపుల్ ఫ్రమ్ గుజరాత్’ కాప్షన్తో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్గా మారింది. పెళ్లికి వచ్చిన అతిథుల సందడి కూడా వీడియోలో కనిపిస్తుంది. వరుని పక్కన కూర్చోబెట్టుకొని పూలతో అలంకరించిన ఎరుపు రంగు కారును వధువు నడపడంతో వీడియో ముగుస్తుంది. అయితే ఈ వీడియోను చూసి ప్రశంసించిన వాళ్ల కంటే ‘ఓవర్ యాక్టింగ్’ అని వెక్కిరించిన వాళ్లే ఎక్కువ. ‘మీ పెళ్లి సంబరం సరే, అక్కడ ఎంత చెత్త పేరుకు పోయి ఉంటుందో’ అని ఒక యూజర్ స్పందించాడు. -
హిమాచల్ కాంగ్రెస్లో రగులుతున్న అసమ్మతి
సిమ్లా/చండీగఢ్: హిమాచల్ ప్రదేశ్లోని అధికార కాంగ్రెస్లో అసమ్మతి రోజురోజుకీ ముదురుతోంది. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు రాజిందర్ రాణా సారథ్యంలో క్రాస్ ఓటింగ్కు పాల్పడిన విషయం తెలిసిందే. అనంతరం అసెంబ్లీలో జరిగిన ఓటింగ్కు గైర్హాజరైన వీరిని కాంగ్రెస్ పార్టీ అనర్హులుగా ప్రకటించింది. అదే ఎమ్మెల్యే రాజిందర్ రాణా శనివారం మరో బాంబు పేల్చారు. సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కూ వైఖరితో విసుగుచెందిన మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నట్లు చెప్పుకున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రులతోపాటు మరో తొమ్మిది మంది తనతో టచ్లో ఉన్నట్లు ఓ ఇంటర్వ్యూలో రాణా చెప్పారు. సీఎం సుక్కూను అబద్ధాల కోరుగా ఆయన అభివర్ణించారు. ఇలా ఉండగా, హిమాచ్ కేబినెట్ సమావేశంలో విధానపర అంశాలపై వాడీవేడి చర్చ అనంతరం మంత్రులు జగత్ నేగి, రోహిత్ ఠాకూర్ అర్ధంతరంగా బయటకు వెళ్లిపోయినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. -
అందుకే క్రాస్ ఓటేశాం.. హిమాచల్ రెబల్స్
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి క్రాస్ ఓటు వేసిన విషయం తెలిసిందే. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్య ఓట్లు టై కావటంతో టాస్ వేసి ఫలితాలు ప్రకటించారు. ఈ అనూహ్య పరిణామాల నడుమ బీజేపీ అభ్యర్థి హర్ష మహాజన్ గెలుపొందారు. అయితే సర్కార్ కూలిపోయే అవకాశాలు కనిపించడంతో.. ఆ వెంటనే క్రాస్ ఓటింగ్కు పాల్పడిన ఆరుగురు ఎమ్మెల్యేలపై ఆ రాష్ట్ర స్పీకర్ అనర్హత వేటు వేశారు. తాజాగా ఈ మొత్తం పరిణామాలపై రెబల్ ఎమ్మెల్యేలు స్పందించారు. ఎమ్మెల్యే రాజేంద్ర రానా క్రాస్ ఓటింగ్ విషయంపై మాట్లాడుతూ.. ‘హిమాచల్ ప్రదేశ్ ప్రజలపై ఉన్న గౌరవం, మర్యాద ప్రకారం మేం క్రాస్ ఓటు నిర్ణయం తీసుకున్నాం. హిమాచల్ ప్రదేశ్కు దేవభూమిగా పేరుంది. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా నిలపడానికి ఇంకా ఎవరూ లేరా?. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు కాంగ్రెస్కి కనిపించలేదా?. అసలు హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎవరూ ప్రాతినిధ్యం వహించాలి?’ అని రాజేంద్ర రానా ప్రశ్నించారు. ‘మేము కోర్టుకు వెళ్తాం. తీవ్రమైన ఒత్తిడి కారణంగా స్పీకర్ మాపై అనర్హత వేటు వేశారు. పోలీసు మా అనుచరులకు చలాన్లు జారీ చేయటం మొదలుపెట్టారు. మేము రాష్ట్రం ఆత్మాభిమానాన్ని రక్షిస్తాం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు.. కేవలం సుఖ్విందర్ సింగ్ సుఖు స్నేహితుల ప్రభుత్వం. ప్రతిఒక్కరికి రాష్ట్ర పరిస్థితి ఏంటో తెలుసు. యువత ఉద్యోగ పరీక్షలు రాసి రోడ్లమీద ఉన్నారు. వారు ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చటం లేదు. కొంత మంది ఎమ్మెల్యేలను అవమాన పరుస్తున్నారు. మరో తొమ్మిది మంది మా వెంట వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు’ అని రాజేంద్ర రానా అన్నారు. -
హిమాచల్లో మళ్లీ కాంగ్రెస్ అలర్ట్.. సీన్లోకి విక్రమాదిత్య
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో అధికార కాంగ్రెస్లో ముసలం ఇంకా ముగియలేదనే సంకేతాలు అందుతున్నాయి. రెబల్ ఎమ్మెల్యేలకు మరికొందరు తోడవుతున్నట్లు సమాచారం. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీ మరింత జాగ్రత్త పడింది. ప్రభుత్వం కుప్పకూలిపోయే అవకాశాలు పూర్తిగా పోయేంతవరకు అప్రమత్తత అవసరమని ఆ పార్టీ భావిస్తోంది. ఈ తరుణంలో మంత్రి విక్రమాదిత్య సింగ్ను రంగంలోకి దించింది. . రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డ ఆరుగురు ఎమ్మెల్యేలపై హిమాచల్ ప్రదేశ్ స్పీకర్ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వాళ్లంతా హర్యానా(బీజేపీ పాలిత రాష్ట్రం) పంచకుల్లాలో మకాం వేశారు. స్పీకర్ నిర్ణయాన్ని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో సవాల్ చేశారు వాళ్లంతా. ఈ క్రమంలో.. ఆ రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య సింగ్ ఆ ఆరుగురిని కలవడం అక్కడి రాజకీయాలను ఆసక్తికరంగా మార్చేసింది. మాజీ ముఖ్యమంత్రి అయిన విదర్భ సింగ్(దివంగత) కుమారుడు విక్రమాదిత్య సింగ్.. హిమాచల్ కేబినెట్లో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. మొన్నటి రాజ్యసభ ఎన్నికల్లో విక్రమాదిత్య క్రాస్ ఓటింగ్కు పాల్పడకపోయినప్పటికీ.. అదేరోజు భావోద్వేగపూరితంగా మీడియా ముందుకు వచ్చారు. తన తండ్రిని కాంగ్రెస్ తీవ్రంగా అవమానిస్తోందని చెబుతూనే.. బీజేపీతో పోరాటే శక్తి కాంగ్రెస్కు లేదంటూ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే పార్టీకి, పదవికి సైతం ఆయన రాజీనామా చేశారు. అయితే హైకమాండ్ జోక్యంతో సాయంత్రానికి ఆయన చల్లబడ్డారు. తన రాజీనామాను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇలాంటి సంక్షోభ సమయంలో తాను పార్టీని వీడొద్దని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఇక.. ఈ ఉదయం రెండ్రోజుల ఢిల్లీ పర్యటనకు బయల్దేరిన విక్రమాదిత్య.. మార్గం మధ్యలో ఆ ఆరుగురు రెబల్ ఎమ్మెల్యేలను కలుసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఢిల్లీ పర్యటన ముగిశాక తిరుగు ప్రయాణంలోనూ ఆయన మరోసారి వాళ్లతో భేటీ అవుతారని సమాచారం. ఇదిలా ఉంటే.. ఆరుగురు రెబల్స్కు మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సంఖ్య మరింత పెరగకమునుపే.. విక్రమాదిత్యను సీన్లోకి దించి మంతనాలు జరిపిస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. అవునా.. నాకు తెలియదు! ఇదిలా ఉంటే.. రెబల్స్ను విక్రమాదిత్యసింగ్ కలిసినట్లు వస్తున్న వార్తలపై ఆయన తల్లి, హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్ స్పందించారు. ఓ జాతీయ మీడియా సంస్థతో ఆమె మాట్లాడుతూ.. తన కుమారుడి పర్యటన షెడ్యూల్ వివరాలు తనకి తెలియవని అన్నారు. గత రాత్రి తను(విక్రమాదిత్య) ఇక్కడే ఉన్నాడు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్లాడో నాకు తెలియదు అని అంటున్నారామె. అయితే ఎప్పటికప్పుడు పరిణామాలను మాత్రం హైకమాండ్కు తాము నివేదిస్తామని చెప్పారామె. ఇక ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడంతో మొదటి నుంచి అసంతృప్తిగా ఉంటోంది వీరభద్ర సింగ్ కుటుంబం. తాజా సంక్షోభం నేపథ్యంలో.. మరోసారి ఆ డిమాండ్నే అధిష్టానం వద్ద ఉంచినట్లు వినవస్తోంది. అయితే సుఖ్విందర్ సింగ్ సుఖు మాత్రం తాను ఫైటర్ని అని.. తానే ఐదేళ్ల పాటు సీఎంగా ఉంటానని ప్రకటించుకుంటున్నారు. ఆ ఆరుగురికి కాంగ్రెస్ ఆఫర్ అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలను తిరిగి సొంతగూటికి తెచ్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. సుధీర్ శర్మ, రవి ఠాకూర్, రాజిందర్ రాణా, ఇందర్ దత్, చేతన్య శర్మ, దేవిందర్ కుమార్తో చర్చలు జరిపే బాధ్యతను మంత్రి విక్రమాదిత్యకు అప్పగించింది. పార్టీలోకి వచ్చే అవకాశం ఉంటే.. అనర్హత వేటు వెనక్కి తీసుకుంటామని హామీ ఇస్తున్నారని హిమాచల్ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. -
ఇదేందయ్యా ఇది..! డెస్టినేషన్ వెడ్డింగ్.. వేరే లెవల్!
ఆకాశమంత పందిరి, భూదేవి అంత పీట. అచ్చం..మురారీ సినిమాలోలాగ, అదీ కాదంటే తమ అభిమాన హీరో హీరోయిన్ల పెళ్లిలా..ఎవరైనా ఇలాంటి పెళ్లి సందడి కోరు కుంటారు. కానీ గుజరాత్కు చెందిన జంట మాత్రం వెరైటీ పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అదేంటో చూసేయండి మరి..! అందిరిలా మేమూ చేసుకుంటే ‘కిక్’ ఏంటి అనుకున్నారేమో ఈ జంట మైనస్ 25 డిగ్రీల ఉష్ణోగ్రతలో చలికి గజ గజ వణికిపోతూ మూడు ముళ్ల ముచ్చటను తీర్చుకున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని మంచుతో కప్పి ఉండే స్పితి లోయలో వివాహం చేసుకున్నారు. ఒక పక్క మంచు పూలవర్షమే అక్షితలుగా చలికి వణికి పోతూ మంచులో ముచ్చటగా పెళ్లి చేసుకున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు అంతేనా ఈ పెళ్లి ఫోటోషూట్, కెమెరామెన్లు, బంధువులు, పంతుళ్లు ఇలా అందరికీ హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. పెళ్లికి సంబంధించిన వీడియోలను హిమాచల్ ప్రభుత్వ అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీస్ అజయ్ బన్యాల్, గో హిమాచల్ ట్విటర్ ఖాతాలో షేర్ అయ్యాయి. కుండలినీ యోగాతో అల్జీమర్స్కు చెక్: తాజా పరిశోధన లవర్ మాట కాదనలేక ఈ పెళ్లికి ఒప్పుకున్నాడట అబ్బాయి. స్పితిలోని మురాంగ్లో జరిగిన అపూర్వ వివాహం జరిగింది. డెస్టినేషన్ వెడ్డింగ్కి అనే మాట ఇది వేరే లెవల్ అంటూ నెటిజన్లు కమెంట్ చేశారు. అంతేనా 'ఓవర్యాక్టింగ్' అని ఒకరు, "షాదీ అండ్ హనీమూన్ డన్’’ అటూ మరొకరు కమెంట్ చేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేసి, మీకే మనిపించిందో కమెండ్ చేయండి. అంతలోనే ఎంత విషాదం : మాజీ మిస్ ఇండియా కన్నుమూత एक विवाह ऐसा भी! गुजरात का प्रेमी जोड़ा, प्रेमिका की जिद्द ने स्पीति पहुंचाया, फिर माईनस 25 डिग्री तापमान में सजाया मंडप, यह अपने आप में पहली तरह का मामला है। स्पीति के मुरंग में आज हुआ अनोखा विवाह। यह है डेस्टिनेशन वेडिंग का example। pic.twitter.com/4lnaRl0c5h — Ajay Banyal (@iAjay_Banyal) February 26, 2024 Gujarat couple gets married at -25 degrees in Himachal Pradesh's Spiti Valley.😍 pic.twitter.com/nGLImoguLh — Go Himachal (@GoHimachal_) February 29, 2024 -
హిమాచల్ రాజకీయ సంక్షోభంలో కీలక ట్విస్ట్
-
ఆరుగురు కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు
హిమాచల్ ప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికల అనంతరం నెలకొన్న రాజకీయ గందరగోళం మరో మలుపు తిరిగింది. ఆరుగురు కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దయ్యింది. కాంగ్రెస్ పిటిషన్ నేపధ్యంలో స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా ఈ నిర్ణయం తీసుకున్నారు. ధర్మశాల ఎమ్మెల్యే సుధీర్ శర్మ, సుజన్పూర్ ఎమ్మెల్యే రాజేంద్ర రాణా, కుత్లహర్ ఎమ్మెల్యే దేవేంద్ర భుట్టో, గాగ్రెట్ ఎమ్మెల్యే చైతన్య శర్మ, లాహౌల్ స్పితి ఎమ్మెల్యే రవి ఠాకూర్, బాద్సర్ ఎమ్మెల్యే ఇంద్ర దత్ లఖన్పాల్ తదితరులు సభ్యత్వం రద్దయిన ఎమ్మెల్యేల జాబితాలో ఉన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద స్పీకర్ ఈ నిర్ణయం తీసుకుని వీరందరినీ అనర్హులుగా ప్రకటించారు. ఈ ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ ఎన్నికల అభ్యర్థి హర్ష్ మహాజన్కు అనుకూలంగా ఓటు వేశారు. ఈ ఆరుగురు తిరుగుబాటు ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయాలనే డిమాండ్ను రాష్ట్ర బడ్జెట్ సమావేశంలో ఇతర సభ్యులు లేవనెత్తారు. బుధవారం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ప్రభుత్వం బడ్జెట్ను ఆమోదించింది. మరోవైపు భోజన విరామానికి ముందు భారతీయ జనతా పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు సస్పెన్షన్కు గురయ్యారు. ఇది కాకుండా మిగిలిన ఎమ్మెల్యేలు తమ మాట విననందుకు నిరసనగా సభను బహిష్కరించారు. సభలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు లేకపోవడంతో అధికార పక్షానికి అనుకూలంగా మూజువాణి ఓటుతో బడ్జెట్ ఆమోదం పొందింది. అనంతరం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ కార్యకలాపాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులు తలెత్తకపోతే, తదుపరి సమావేశాలు జూలై, ఆగస్టులలో వర్షాకాల సమావేశాలుగా ప్రారంభమయ్యే అవకాశముంది. #WATCH | Himachal Pradesh Assembly Speaker Kuldeep Singh Pathania says, "Six MLAs, who contested on Congress symbol, attracted provisions of anti-defection law against themselves...I declare that the six people cease to be members of the Himachal Pradesh Assembly with immediate… pic.twitter.com/QQt92aM10v — ANI (@ANI) February 29, 2024