బోల్తా కొట్టిన బస్సు.. ఒకరు మృతి, 12 మందికి గాయాలు | 1 Dead 12 Injured After HRTC Bus Overturns At Punjab border | Sakshi
Sakshi News home page

బోల్తా కొట్టిన బస్సు.. ఒకరు మృతి, 12 మందికి గాయాలు

Published Sat, Sep 7 2024 5:52 PM | Last Updated on Sat, Sep 7 2024 6:00 PM

1 Dead 12 Injured After HRTC Bus Overturns At Punjab border

పఠాన్‌కోట్‌: పంజాబ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంబా నుంచి అమృత్‌సర్‌ వెళ్తున్న హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ఆర్టీసీ బస్సు పఠాన్‌కోట్ సమీపంలో శుక్రవారం ప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా అదుపుతప్పి బొల్తా కొట్టడంతో బస్సు ముందు అద్దాలు పగిలాయి.

ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.. హిమాచల్‌ ప్రదేశ్‌- పంజాబ్‌ సరిహద్దుల్లోని మమూన్‌ కాంట్‌లో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పఠాన్‌కోట్-చంబా జాతీయ రహదారిపై బస్సు బోల్తా పడిన సీసీటీవీ ఫుటేజీ వైరల్‌గా మారింది.

ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. పఠాన్‌కోట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 41 మంది ప్రయాణికులుఉండగా.. చంబా నుంచి అమృత్‌సర్‌కు వెళుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement