రామేశ్వరానికి కలాం భౌతికకాయం తరలింపు | IAF Aircraft carrying late Former President APJ Abdul Kalam's mortal remains leaves for Rameshwaram | Sakshi
Sakshi News home page

కలాం భౌతికకాయం రామేశ్వరానికి తరలింపు

Published Wed, Jul 29 2015 8:23 AM | Last Updated on Tue, Oct 30 2018 7:45 PM

రామేశ్వరానికి కలాం భౌతికకాయం తరలింపు - Sakshi

రామేశ్వరానికి కలాం భౌతికకాయం తరలింపు

న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పార్థీవ దేహాన్ని తీసుకుని ప్రత్యేక విమానం బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి మధురైకి బయల్దేరింది.  కలాం భౌతికకాయంతో సైనిక వాహనం ఈరోజు ఉదయం 7 గంటలకు.. ఆయన నివాసం 10 రాజాజీ మార్గ్ నుంచి పాలం చేరుకుంది. ఈ ప్రత్యేక విమానంలో కలాం పార్థివదేహాంతో పాటు కేంద్రమంత్రులు మనోహర్‌పారికర్, వెంకయ్యనాయుడు బయల్దేరి వెళ్లారు.

అక్కడి నుంచి వైమానికదళ హెలికాప్టర్‌లో కలాం పార్థివదేహాన్ని రామేశ్వరం తీసుకెళతారు. అక్కడ బుధవారం సాయంత్రం 7 గంటల వరకూ ప్రజల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఉంచుతారు. గురువారం ఉదయం 11 గంటలకు రామేశ్వరంలోని ఆయన స్వస్థలంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. కలాం అంత్యక్రియలకు ప్రధానమంత్రి మోదీతో పాటు పలువురు ముఖ్యమంత్రులు, ప్రముఖులు హాజరు కానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement