
సాక్షి, న్యూఢిల్లీ : నిప్పులకొలిమిని తలపిస్తున్న మండే ఎండల నుంచి ఉపశమనంలా చల్లని కబురు అందింది. జూన్ 1న నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని ఉపరితల శాస్ర్తాల మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ మాల్దీవులు-కొమోరిన్ ప్రాంతంతో పాటు దక్షిణ బంగాళాఖాతం మీదుగా అండమాన్-నికోబార్ దీవులకు చేరుకున్నాయి.
మరోవైపు అరేబియా సముద్రంలో అల్పపీడన ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) వెల్లడించింది. ఇక రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు 3-4 డిగ్రీలు తగ్గుతాయని శుభవార్త అందించింది. ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్ర వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment