గుజరాత్ సరికొత్త నిర్ణయం | Internet services to be unavailable on 16 October from 10 am to 2 pm in Gujarat | Sakshi
Sakshi News home page

గుజరాత్ సరికొత్త నిర్ణయం

Published Thu, Oct 13 2016 6:47 PM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM

గుజరాత్ సరికొత్త నిర్ణయం

గుజరాత్ సరికొత్త నిర్ణయం

గాంధీనగర్: పంచాయతీ ఉద్యోగాలకు నిర్వహించే పరీక్ష ప్రశ్నాపత్రం బయటకు రాకుండా నివారించేందుకు గుజరాత్ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఈ నెల 16న పంచాయత్ సేవా మండల్ పరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేయాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది.

పరీక్షా సమయంలో నాలుగు గంటల పాటు ఇంటర్నెట్ పనిచేయదని రాష్ట్ర సర్కారు ప్రకటించింది. టెక్నాలజీని ఉపయోగించుకుని పరీక్షల్లో అక్రమాలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోతున్న నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.  పంచాయత్ సేవా మండల్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్నిఏర్పాట్లు చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement