
బాలికపై ఏడుగురు యువకుల సామూహిక అత్యాచారం!
రాయ్పూర్: ఏడుగురు యువకులు ఓ గిరిజన బాలికపై 9 రోజులపాటు సామూహిక అత్యాచారం చేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని జిల్లా కేంద్రం జష్పూర్ శివారులో ఈ దారుణం జరిగింది. నిందితులలో ఆరుగురిని వేరువేరు ప్రదేశాలలో ఈరోజు అరెస్ట్ చేసినట్లు జష్పూర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ జీఎస్ దుబే చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం తప్కరా ప్రాంతానికి చెందిన ఆ బాలిక ఈ నెల 18వ తేదీన తన బంధువుల ఇంటికి వెళ్లేందుకు బస్టాండ్కు వెళ్లే సమయంలో నలుగురు యువకులు రెండు మోటార్ సైకిళ్లపై వచ్చారు. లిప్ట్ ఇస్తామని చెబితే, ఆ బాలిక రానని తిరస్కరించింది.
కానీ వాళ్లు ఆ బాలికను బలవంతంగా ఓ టూరిస్ట్ ప్రదేశంలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశారు. ఆ తరువాత మరో ముగ్గురు స్నేహితులు కూడా వచ్చి అత్యాచారం చేశారు. అలా వారు ఆ బాలికను 9 రోజుల పాటు వివిధ ప్రదేశాలకు తీసుకువెళ్లి సామూహికంగా ఈ అఘాయిత్యానికి పాల్పడారు. చివరకు ఈ నెల 28న ఆ బాలికను ఓ స్టేడియం వద్ద వదిలి వెళ్లారు.
బాధితురాలి ఫిర్యాదు, నిందితులకు సంబంధించి చెప్పిన వివరాల మేరకు పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. నిందితులు అందరూ జష్పూర్కు చెందినవారేనని పోలీసులు తెలిపారు.
**