సీఈసీగా నజీం జైదీ! | Naseem Zaidi as Cec | Sakshi
Sakshi News home page

సీఈసీగా నజీం జైదీ!

Published Thu, Apr 9 2015 1:22 AM | Last Updated on Sun, Sep 3 2017 12:02 AM

సీఈసీగా నజీం జైదీ!

సీఈసీగా నజీం జైదీ!

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్(సీఈసీ)గా ఎన్నికల కమిషనర్ నజీం జైదీని నియమించే అవకాశం ఉంది. సీఈసీ హెచ్‌ఎస్ బ్రహ్మ పదవీకాలం ఏప్రిల్ 19తో ముగియనుంది. ఈ నేపథ్యంలో  నజీం జైదీ పేరును కేంద్ర న్యాయ శాఖ ఖరారు చేసినట్లు సమాచారం. ప్రధాని గురువారం నుంచి విదేశీ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో జైదీ నియామకానికి సంబంధించిన లాంఛనాలను న్యాయశాఖ పూర్తి చేసి రాష్ట్రపతి భవన్‌కు పంపించింది.

గత జనవరిలో సంపత్ పదవీ విరమణ అనంతరం అప్పటి ముగ్గురు సభ్యులలో ఒకరైన బ్రహ్మ సీఈసీగా బాధ్యతలు చేపట్టారు. సంపత్ పదవీ విరమణతో ఖాళీ అయిన స్థానాన్ని అప్పుడు భర్తీ చేయలేదు. ఇప్పుడు బ్రహ్మ స్థానంలో జైదీ సీఈసీగా నియమితులైన తరువాత రెండు కమిషనర్ల పోస్టులూ ఖాళీగా ఉంటాయి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement