జాబిల్లిపైకి మన ల్యాండర్‌! | Our lander to the Moon | Sakshi

జాబిల్లిపైకి మన ల్యాండర్‌!

Jun 5 2019 2:25 AM | Updated on Jun 5 2019 2:25 AM

Our lander to the Moon - Sakshi

అగ్రరాజ్యం అమెరికా జాబిల్లిపైకి ఓ వ్యోమనౌకను పంపుతోందట! ఇందులో మరో విశేషం ఉంది. అదేంటంటే చందమామపై దిగే మూన్‌ల్యాండర్‌ను ఓ భారతీయ కంపెనీ డిజైన్‌ చేస్తోంది. అది కూడా బెంగళూరుకు చెందిన టీమ్‌ ఇండస్‌ అనే సంస్థ. కొన్నేళ్ల కిందట గూగుల్‌ కంపెనీ లూనార్‌ ఎక్స్‌ప్రైజ్‌ పేరుతో ఓ పోటీ పెట్టింది. రోబోను సొంతంగా తయారుచేసుకుని అంతరిక్షంలోకి పంపితే 3 కోట్ల డాలర్ల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించింది. కారణాలేవైనా ఈ పోటీ విజయవంతం కాలేదు.

కాకపోతే ఇందులో పాల్గొన్న టీం ఇండస్‌ మాత్రం జాక్‌పాట్‌ కొట్టేసింది. 2021 నాటికి జాబిల్లిపైకి ల్యాండర్‌ను పంపాలని నాసా నిర్ణయించడం.. సమయం తక్కువగా ఉన్న కారణంగా కొన్ని పనులు ప్రైవేట్‌ కంపెనీలకు ఇస్తామని ప్రకటించడంతో టీం ఇండస్‌కు ఈ అరుదైన అవకాశం లభించింది. దీంతోపాటు ఆస్ట్రోబయోటిక్, ఇంట్యూటివ్‌ మెషీన్స్, ఆర్బిట్‌ బియాండ్‌ అనే మూడు అమెరికన్‌ కంపెనీలు కూడా నాసా ప్రణాళికలకు అనుగుణంగా పనిచేస్తున్నాయి. ఇందులో ఆర్బిట్‌ బియాండ్‌ కంపెనీకి సంబంధించిన వ్యోమనౌకను టీం ఇండస్‌ తయారు చేసి ఇవ్వనుంది.

ఈ వ్యోమనౌక జాబిల్లిపై ఉన్న ఓ భారీ లోయలోని మేర్‌ ఇబ్రియం అనే ప్రాంతంలో ల్యాండ్‌ కావాలి. నాసాకు మొత్తం 9 మూన్‌ల్యాండర్ల అవసరం ఉండగా.. వాటిని తయారు చేసేందుకు సరిపడా ఉద్యోగులు అమెరికన్‌ కంపెనీల్లో లేరని.. వేరే కంపెనీలతో వ్యోమనౌకను డిజైన్‌ చేయిస్తోందని ఇంట్యూటివ్‌ మెషీన్స్‌ సీఈవో స్టీవ్‌ ఆల్టిమస్‌ చెబుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement