
మా గొంతు నొక్కాలని చూస్తున్నారు
రాయ్బరేలీ: పార్లమెంట్లో పేదలు, సామాన్యుల సమస్యల్ని లేవనెత్తినప్పుడు తమ గొంతు నొక్కాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సోనియాగాంధీ ఆరోపించారు. తన నియోజకవర్గం రాయ్బరేలీలో ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఆమె ప్రసంగించారు. పార్లమెంట్లో తమ పార్టీని మాట్లానివ్వకుండా అడ్డుకోవడంతో పాటు ఆ నెపాన్ని కాంగ్రెస్, నెహ్రూ-గాంధీ కుటుంబంపై నెడుతున్నారని విమర్శించారు. సమావేశాలు సజావుగా సాగకపోవడానికి సోనియా, రాహుల్లే కారణమంటూ ఇటీవల ప్రధాని మోదీ ఆరోపించిన నేపథ్యంలో సోనియా స్పందించారు.