న్యూఢిల్లీ: సినీతారలు, ప్రముఖులు, తరచూ విదేశాలకు విమాన ప్రయాణాలు చేసే వ్యాపారులు ఇకపై ఎయిర్పోర్ట్ల్లో ఇమిగ్రేషన్ కౌంటర్ల వద్ద క్యూల్లో నిల్చోవాల్సిన అవసరం ఉండదు. అలాంటి వారి జాబితాను రూపొందించి, విమానాశ్రయాల్లో వారి కోసం ప్రత్యేక కియోస్క్లను ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తోంది. వారు నేరుగా ఆ కౌంటర్ల వద్దకు వెళ్లి, క్షణాల్లో తమ ఇమిగ్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. నేర చరిత్ర లేని వారికే ఈ సౌకర్యం కల్పిస్తారు.