
క్షమాభిక్ష తీర్పును పునఃసమీక్షించం: సుప్రీం
న్యూఢిల్లీ: క్షమాభిక్ష పిటిషన్లపై ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించేది లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న క్షమాభిక్ష పిటషన్లకు సంబంధించి మరణశిక్షలను జీవిత ఖైదుగా మారుస్తూ ఇటీవల దేశ అత్యున్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఉరిశిక్ష పడ్డ 15 మంది ఖైదీలకు శిక్షను జీవిత ఖైదుగా మార్చడాన్ని రద్దు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తిరస్కరించింది.