verdict
-
అలా చేస్తే అత్యాచారం కిందికి రాదు : అలహాబాద్ కోర్టు తీర్పుపై దుమారం
ఒక అత్యాచార కేసులో అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యలు వివాదాన్నిరేపుతున్నాయి వక్షోజాలను పట్టుకోవడం(Grabbing Breasts), పైజామా నాడాను చింపేయడం (Snapping Pyajama String) అత్యాచార యత్నం కిందికి రావంటూ హైకోర్ట్ తీర్పునిచ్చింది. ఈ చర్యలు అత్యాచారంగా పరిగణించ లేమని పేర్కొంది దీనిని పోక్సో చట్టం కింద తీవ్రమైన లైంగికదాడిగా పరిగణించవచ్చని వెల్లడించింది. అత్యాచారయత్న దశ (preparation stage) కు, వాస్తవ ప్రయత్నం (actual attempt) మధ్య తేడాను ఉందని వ్యాఖ్యానించింది. నిందితుడు అత్యాచారం చేయాలని నిశ్చయించుకున్నట్లు రికార్డులో ఉన్న ఏ సాక్ష్యమూ లేదని న్యాయమూర్తి తేల్చిచెప్పారు. దీనిపై మహిళా ఉద్యమకారులు, ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ప్రముఖ గాయని, చిన్మయి శ్రీపాద (Chinmayi Sripada) కూడా ఈ వివాదాస్పద తీర్పుపై సోషల్ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసింది.2021 నాటి కేసులో పవన్, ఆకాశ్ అనే వ్యక్తులు 11 ఏళ్ల చిన్నారిని లైంగికంగా దాడి చేసినట్లు ఆరోపణలు నమోదైనాయి. ప్రాసిక్యూషన్ ప్రకారం, లిఫ్ట్ ఇస్తామని చెప్పి నిందితులు మైనర్ బాలిక పట్ల అభ్యంతకరంగా ప్రవర్తించారు. బలవంతంగా ఆమెను కల్వర్ట్ క్రింద లాగే ప్రయత్నం చేశారు. బాటసారులు జోక్యం చేసుకోవడంతో నిందితులు అక్కడి నుండి పారిపోయారు.వారు ఆ బాలికను రక్షించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో విచారణలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం నిందితులైన పవన్ , ఆకాష్లపై మోపబడిన ఆరోపణలు అత్యాచార ప్రయత్నం నేరంగా పరిగణించబడని స్పష్టం చేసింది.ఈ చర్య వల్ల బాధితురాలు నగ్నంగా లేదా వివస్త్రగా మారినట్టు సాక్షులు చెప్పలేదు. అంతేకాదు లైంగిక దాడికి ప్రయత్నించాడన్న ఆరోపణ లేవీ లేని కోర్టు తెలిపింది.చదవండి: Sunita Williams Earth Return: అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే? ఏలా మేనేజ్ చేస్తారు?నిందితులను ఐపీసీ సెక్షన్ 354-బి (దుస్తులను తొలగించే ఉద్దేశ్యంతో దాడి లేదా నేరపూరిత బలప్రయోగం)తో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్ 9/10 (తీవ్రమైన లైంగిక దాడి) కింద విచారించాలని ఆదేశించింది. మరోవైపు పవన్ తండ్రి, మూడో నిందితుడు అశోక్ బాధితురాల్ని దుర్భాషలాడి, బెదిరించాడన్న ఆరోపణలున్నాయి. -
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ సంచలన తీర్పు
-
Amrutha Pranay case : చివరికి మిగిలిందేమిటి?
రామ నామ జపముచే మున్ను వాల్మీకి, / బోయడయ్యు బాపడయ్యే! / కులము ఘనము కాదు గుణమే ఘనమ్మురా / విశ్వదాభిరామ వినురవేమ! అని వేమన వందల సంవత్సరాల క్రితమే చెప్పినప్పటికీ ఈనాటికీ ఆ పద్య భావం పెడచెవిన పెట్టబడుతోంది. వేమన, కులం కాదు ‘గుణమే’ ముఖ్యమన్నాడు. ‘మంచి అన్నది మాల అయితే మాల నేనవుతాను‘ అని గురజాడ అన్నారు. ఇవేమీ పట్టించుకోని మిర్యాలగూడకు చెందిన అమృత తండ్రి మారుతీరావు 2018లో దళితుడైన ఆమె భర్త ప్రణయ్ (Pranay Perumalla)ను పాశవికంగా పరువు పేరుతో హత్య చేయించాడు. ఇలాంటివారు దేశమంతా ఎందరో ఉన్నారు. ఆరేళ్ల తర్వాత నల్లగొండ జిల్లా సెషన్స్ కోర్ట్ ఇచ్చిన తీర్పు... మనిషి కంటే కులమే గొప్పదని నమ్మే హైందవ నాగరాజులకు చెంప దెబ్బనే చెప్పాలి. ఈ అంశం సమాజానికి ఎన్నో విషయాలను మరోసారి బహిర్గతం చేసింది. మరీ ముఖ్యంగా తల్లి దండ్రులు–పిల్లల బాంధవ్యాలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేదాన్ని సుస్పష్టం చేసింది. ఈ మధ్యకాలంలో రచయిత డా‘‘ స్టీఫెన్ ఆర్... ఒక పనిని ప్రారంభించే ముందు, దాని ముగింపును దృష్టిలో పెట్టుకోవాలని పేర్కొన్నారు. అమృత తండ్రి మారుతీరావులో మొదలైన అల్లుణ్ణి హత్య చేయించాలనే ఆలోచన నేడు కొన్ని కుటుంబాల శోకానికి కారణమైంది. కన్న కూతురిపై అపారమైన ప్రేమను పెంచు కున్న మారుతీ రావు జీవితాన్ని కోల్పోయాడు. అతని భార్య భర్తను కోల్పోయింది. అతని కూతురు తండ్రిని కోల్పోయింది. ఇటు అమృత భర్తను కోల్పోయింది. ఆమెకు పుట్టిన బిడ్డకు కన్నతండ్రి లేకుండా పోయాడు. మొదటి ముద్దాయికి ఉరిశిక్ష ఖరారుఅయింది. మిగిలిన వారికి జీవిత ఖైదు విధించబడింది. ఒక్క మాటలో చెప్పాలంటే అందరికీ శూన్యమే మిగిలింది. చదవండి : Amrutha Pranay Case Verdict : పీవోడబ్ల్యూ సంధ్య స్పందన ఇదే!నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అహ్మదాబాద్లో హరేన్ పాండ్యా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి అస్గర్ అలీ ఈ కేసులో కూడా నిందితుడు కావడం సామాన్య మనిషికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇలాంటి వ్యక్తులకు అసలు బెయిల్ మంజూరు కాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ‘పరువా, కులమా... మీ చిరునామా ఎక్కడ’ అంటూ వెతికితే... దానికి సాహిత్యకారుల రచనల్లో సమాధానం దొరుకుతుంది. ‘ఎంచి చూడగా మనుజులందున మంచి– చెడులు అను రెండే కులములు’ అన్నాడు మహాకవి. సాటి మనిషిని మనిషిగా చూడలేని మనిషి మనోమందిరాలు ‘అపరిశుభ్ర విసర్జన శాలలుగానే’ మిగిలిపోతాయి. దీని ప్రక్షాళనకై అంతరంగ పారిశుద్ధ్య కార్మికులు కావాలి.– డా. ఉడుము ఝాన్సీ తెలుగు అధ్యాపకురాలు, ఆర్జీయూకేటీ, నూజివీడు -
ఏడేళ్ల తర్వాత అమృతకు న్యాయం.. ప్రణయ్ ఆత్మకు శాంతి
-
దళిత యువకుడి హత్య కేసులో సంచలన తీర్పు
-
పీజీ మెడికల్ సీట్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
-
షారన్ రాజ్ హత్య కేసులో గర్ల్ ఫ్రెండ్ గ్రీష్మకు ఉరిశిక్ష
-
కోల్ కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసులో దోషికి - శిక్ష ఖరారు
-
నాంపల్లి కోర్టు తీర్పుపై ఉత్కంఠ
-
భార్యకు మత్తిచ్చి.. ఏకంగా పదేళ్లపాటు పలువురితో సామూహిక అత్యాచారం
ఒక సామూహిక అత్యాచార కేసు ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఆమె కథలోని భయంకర నిజాలు కన్నీళ్లు పెట్టిస్తాయి. ఆమెను జీవచ్ఛంగా మార్చి, స్వయంగా భర్తే పలువురితో (72మందికిపైగా) దాదాపు పదేళ్ల పాటు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన సభ్య సమాజాన్ని నివ్వెర పర్చింది. ఈ కేసును విచారించిన కోర్టు జెసిల్ మాజీ భర్తకు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దోషులుగా తేలిన మరో 51 మందికి కూడా శిక్షలు ఖరారు చేసింది. ఈ కేసులోని షాకింగ్ విషయాలు ఇలా ఉన్నాయిజెసిల్ పెలికో కేసు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేయడం మాత్రమే కాదు, ఫ్రాన్స్లో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద అత్యాచార కేసు కావడంతో తీవ్ర చర్చకు దారి తీసింది. జెసిల్ ఫెలికో భర్త డొమినిక్ పెలికో. జిసిల్కు ముగ్గురు పిల్లలు, మనవలు మనవరాళ్లు కూడా ఉన్నారు. 57 ఏళ్ల వయసులో ఉండగా భర్త ఎవ్వరూ ఊహించని విధంగా ఆమెపై భయంకరమైన అఘాయిత్యాలకు పాల్పడ్డాడు.తన భార్యపై అత్యాచారానికి రావాల్సిందిగా ఆన్లైన్ చాట్ రూమ్స్ ద్వారా ఆహ్వానం పలికాడు. ఇలా వచ్చిన వాళ్లు 20-72 వయస్సున్నవారున్నారు. ఇలా ఒకటి రెండూ కాదు ఏకంగా పదేళ్ల పాటు, భార్యకు మత్తుమందు ఇచ్చి తన అకృత్యాన్ని కొనసాగించాడు. ఈ విషయాలను చిత్రీకరించి, భద్రపరిచాడు కూడా. ఈ నేరానికి పాల్పడిన వారిలో కొందరు ఒక్కసారి, మరికొందరు ఆరుసార్లు అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. అలాగే బాధితురాలు పూర్తి అచేతనంగా, దాదాపు కోమాలాంటి పరిస్థితిలో ఉండగా జరిగినట్టు పోలీసులు ధృవీకరించుకున్నారు.అయితే ఇంత జరుగుతున్నా, అనేక సార్లు తీవ్ర అనారోగ్యానికి గురైనా ఆమెకు ఏమాత్రం తెలియలేదు. ఆమెకు తనపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి 2020లో పోలీసుల ద్వారా మాత్రమే తెలిసింది.వెలుగులోకి ఎలా వచ్చింది2020లో ఒక షాపింగ్ మాల్లో యువతులపై అభ్యంతరంగా వీడియో చూస్తున్న క్రమంలో పోలీసులు అతగాణ్న అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా పోలీసులు విచారణలో తాను చేసిన మొత్తం దురాగతాల్ని బహిర్గతం చేశాడు. దీంతో విచారణాధికారులే నివ్వెరపోయారు. అతని ల్యాప్టాప్లో వేల వీడియోలను కనుగొన్నారు, దాదాపు 200 అత్యాచారాలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఈ సమాచారాన్ని అంతటినీ ‘అబ్యూజ్’అనే ఫోల్డర్లో స్టోర్ చేసి పెట్టాడు. ఈ వీడియోలను పోలీసులు జెసికా(ఆమె అనుమతి మేరకు) చూపించారు. దీంతో ఆమె కదిలిపోయింది. తనపై అత్యాచారం చేసిన వాళ్లలో తన మనవడు వయస్సున్న వాడు ఉన్నాడంటూ తీరని ఆవేదనకు గురైంది జెసికా. దాదాపు ఇదే తరహాలో కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. అయితే వీటిని డొమినిక్ ఖండించాడు.ఈ కేసు విచారణ సందర్బంగా వందలాదిమంది ఆమెకు మద్దతుగా కోర్టుకు హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు తీర్పుకోసం ఎదురు చూశారు. అనేకమంది స్త్రీవాద గీతాలను ఆలపించారు. అటు జెసికా ముగ్గురు పిల్లలు కూడా కోర్టు ఆవరణలో తీర్పు వెలువరిస్తున్న సమయంలో భావోద్వేగానికి లోనయ్యారు. యుక్తవయస్సులో ఉన్న ఆమె మనవడు తొలిసారి ఆమె పక్కన నిలబడి, ఆమె మీడియాను ఉద్దేశించి ఆమె భుజంపై చేయి భరోసా ఇచ్చాడు. అయితే దోషులకు విధించిన శిక్షలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.71 ఏళ్ల జెసిల్ పెలికా మీడియాతో ఈ విచారణ సందర్భంగా జెసికా మాటలు ఆమెలోని అంతులేని ఆవేదనతోపాటు, తెగువకు నిదర్శంగా నిలిచాయి. నేరస్తులు సిగ్గుపడాలి తప్ప, తానెందుకు కృంగిపోవాలని అంటూ ధైర్యంగా ముందుకొచ్చింది ఇంతటి ఘోరం సమాజానికి తెలియాలి తన గొంతును వినిపించింది. ఇలాంటివి మరో చోట మరొకరికి జరగకూడదని నినదించింది. అంతేకాదు అత్యాచారాలకు ఆడవాళ్ల వేషధారణే, వారి వ్యవహారమే కారణమన్న వాదనను గట్టిగా తోసిపుచ్చింది. స్త్రీల పట్ల చాలా మంది పురుషుకున్న ఇలాంటి అసహ్యకరమైన వైఖరి మారాలని నినదించింది. దీనిపై చర్చ జరగాలని, ఈ కేసుపై నిజా నిజాలు ప్రపంచానికి తెలియజెప్పాలని కూడా మీడియాను కోరింది. తనపై జరిగిన దుర్మార్గంపై బహిరంగ విచారణ జరగాలని కోరుకున్న ధీర ఆమె.2021లో పోలీసులు తమ ప్రాథమిక విచారణను నిర్వహించినప్పుడు అరెస్టయిన దోషుల్లో చాలా మంది ఇప్పటికే జైలు జీవితం గడిపారు. కనుక కొంతమంది త్వరలో విడుదల కానున్నారు. మరోవైపుతాజా తీర్పుపై అప్పీల్లా? వద్దా? అనేది ఆలోచిస్తున్నానని డొమినిక్ న్యాయవాది తెలిపారు. అప్పీల్కు వెళ్లేందుకు 10 రోజుల సమయం ఉంది. గత వారం (డిసెంబరు 19)న తీర్పు వెలువడినప్పటి నుండి, పారిస్ ఆసుపత్రి హెల్ప్లైన్ నెంబర్లు కాల్స్ సంఖ్య విపరీతంగా పెరిగిందట. -
లగచర్ల కేసులో నేడు తీర్పు
సిటీ కోర్టులు: లగచర్లలో అధికారులపై దాడి కేసులో రైతులు, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి బెయిల్ పిటిషన్పై నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో ఇరుపక్షాల వాదనలు మంగళవారం ముగిశాయి. సొమవారం రైతుల తరఫున సురేందర్రావు, జక్కుల లక్ష్మణ్, జి.కిరణ్లు వాదనలు వినిపించగా, మంగళవారం పబ్లిక్ ప్రాసిక్యూటర్ కౌంటర్ దాఖలు చేసి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి అఫ్రోజ్ అక్తర్ తీర్పును రిజర్వ్ చేస్తూ బుధవారానికి వాయిదా వేశారు.మొదటగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ ఎలక్ట్రానిక్ సమాచారంతోపాటు ఘటనకు సంబంధించి కొన్ని ఫొటోలు, వీడియోలు కోర్టుకు సమర్పించారు. వాటిని పరిశీలించి వెంటనే జోక్యం చేసుకున్న రైతుల తరఫు న్యాయవాదులు పీపీ దాఖలు చేసిన ఫొటోల్లో ఉన్న ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదని, ఈ ఘటనకు సంబంధం లేని రైతులు, మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు.పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు సమర్పించిన ఆధారాల్లో ఒక్కరూ కూడా అరెస్టై రిమాండ్లో లేరని గుర్తు చేశారు. అయితే మాజీ ఎమ్మెల్యే అక్కడ దాడికి పాల్పడిన వ్యక్తితో ఫోన్లో మాట్లాడటం, వాట్సాప్ చాట్లు ఉన్నాయని అవన్నీ కోర్టుకు సమర్పించామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుర్తుచేశారు. మాజీ ఎమ్మెల్యేతోపాటు రైతుల అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారని వారి ఆరోగ్యం క్షీణిస్తుందని రైతుల తరఫు న్యాయవాదులు కోర్టు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి తీర్పును రిజర్వ్ చేశారు. నేడు తీర్పును వెలువరించే అవకాశముంది. -
పర్సనల్ బాండ్ తీసుకుని విడుదల చేయాలని ఆదేశం
-
ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు సంచలన తీర్పు
-
ఈడీ కేసులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
-
ఎస్సీ వర్గీకరణ: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
హైదరాబాద్, సాక్షి: ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. సబ్ కమిటీ సూచనల ఆధారంగా ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ వర్గీకరణపై 60 రోజుల్లో వన్మెన్ కమిషన్ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించారు. వన్ మెన్ కమిషన్ రిపోర్ట్ సమర్పించాకే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నట్లు తెలిపారు. 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. ఇక.. 24గంటల్లో కమిషన్కు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో గడువులోగా వన్ మెన్ కమిషన్ రిపోర్టు సమర్పించాల్సిందేనని స్పష్టం చేశారు. తెలంగాణలో 60 రోజుల వరకు కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకూడదని, కమిషన్ రిపోర్ట్ ఇచ్చాకే కొత్త ఉద్యోగ నోటీఫికేషన్లు ఇవ్వాలని సీఎం రేవంత్ అధికారులు సూచనలు చేశారు. -
ఆ వీడియోలు చూడటం పోక్సో కింద నేరం..
-
కారు ధర రూ.51 లక్షలు, రిపేరుకు రూ.50 లక్షల అంచనా..
హైదరాబాద్: అది 2020 అక్టోబర్ నెల.. హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షాలు కురిశాయి. ఓ సర్వీస్ సెంటర్ నిర్లక్ష్యం వల్ల వరదల్లో కారు మునిగిపోయింది. పరిహారం కోసం బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. దీంతో రూ.31 లక్షల పరిహారం చెల్లించాలని రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ సర్వీస్ సెంటర్ను ఆదేశిస్తూ సంచలన తీర్పును వెల్లడించింది. సర్వీస్ కోసం వచ్చిన కారును బయటకు తీయకుండా కారు పూర్తిగా దెబ్బతినడానికి సర్వీస్ సెంటర్ సిబ్బందే కారణమని కమిషన్ తేల్చింది. ఈ పరిహారాన్ని 45 రోజుల్లోపు పిటిషనర్కు చెల్లించాలని రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలు సీహెచ్ లతాకుమారి, సభ్యులు పారుపల్లి జవహర్బాబు, శ్యామలతో కూడిన బెంచ్ తీర్పును ఇచ్చింది. కారు ధర రూ.51 లక్షలు, రిపేరుకు రూ.50 లక్షల అంచనా.. హైదరాబాద్లోని బ్లూ ఓషన్ మల్టీ క్టయింట్ ఆఫీస్ వారు 2015లో రూ.51 లక్షలు వెచ్చించి వోల్వో కారును కొనుగోలు చేశారు. 2019లో కారు అకస్మాత్తుగా ఎయిర్ కండీషన్ పనిచేయకుండా ఆగిపోయింది. అంతేగాకుండా ఇంజిన్ వేడెక్కి ప్రమాదకరంగా మారింది. దీంతో వెంటనే పిటిషనర్ తల్వార్ కార్స్ ప్రైవేట్ సర్వీస్ సెంటర్ దగ్గర రూ.83 వేలు వెచ్చించి రిపేరు చేసుకున్నాడు. తర్వాత కొద్ది రోజులకే కారులో మళ్లీ సమస్యలు వచ్చాయి. కారు ఏసీ పూర్తిగా నీటితో నిండిపోవడంతో పలు రకాల సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో కారు యజమాని 2020లో కృష్ణ ఎక్స్క్లూజీవ్ ప్రైవేట్ లిమిటెడ్ సర్వీస్ సెంటర్ను సంప్రదించగా కారు రిపేరు కోసం రూ.2.73 లక్షల ఖర్చు అవుతుందని తెలిపారు. దీంతో కారు రిపేరు కోసం సర్వీస్ సెంటర్లోనే పెట్టుకున్నారు. 2020లో భారీ వర్షాలు కురిసి వరదలు రావడంతో సర్వీస్ సెంటర్లోకి నీరు వచి్చ, కారు మునిగిపోయి పూర్తిగా దెబ్బతిన్నది. దీంతో కారు రిపేరు కోసం రూ.50.45 లక్షల వరకు ఖర్చు అవుతుందని సర్వీస్ సెంటర్ సిబ్బంది అంచనా వేసి చెప్పారు. సరైన సమయానికి కారు రిపేరు చేయకుండా పెట్టి వరదల్లో మునిగిపోవడానికి కారణం అయిన సర్వీస్ సెంటర్ సిబ్బంది దీనికి పూర్తి బాధ్యత వహించాలని పిటిషనర్ సూచించాడు. దీనికి వారు అంగీకరించకపోవడంతో పిటిషనర్ రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ను సంప్రదించి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కమిషన్ కారు పూర్తిగా దెబ్బతినడానికి కృష్ణ ఎక్స్క్లూజీవ్ ప్రైవేట్ లిమిటెడ్ సర్వీస్ సెంటర్ కారణమని తేల్చింది. అందుకు పైన తెలిపిన విధంగా పరిహారం అందించాలని ఆదేశాలు జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచి్చంది. -
రేపే కేజ్రీవాల్ బెయిల్ తీర్పు
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో అరెస్టై.. తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్పై సుప్రీం కోర్టు రేపు(శుక్రవారం) తీర్పు వెల్లడించనుంది. సీబీఐ కేసులో బెయిల్ ఇవ్వాలని అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు ఇప్పటికే విచారణ పూర్తి చేసింది. రేపు బెయిల్ మంజూరు అయితే అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి విడుదల కానున్నారు. సెప్టెంబర్ 5వ తేదీన చేపట్టిన విచారణలో ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం బెయిల్ తీర్పును రిజర్వ్ చేసి రేపు (సెప్టెంబర్ 10)న వెల్లడిస్తామని పేర్కొంది.చదవండి: కేజ్రీవాల్ బెయిల్పై సుప్రీంలో వాడీవేడి వాదనలు -
ఓటుకు నోటు కేసుపై సుప్రీం కోర్టు తీర్పు.. ఆళ్ల రామకృష్ణారెడ్డి రియాక్షన్
-
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రాష్ట్రాలు ఉప వర్గీకరణ చేయవచ్చు : సుప్రీంకోర్టు తీర్పు
-
కోటాలో సబ్ కోటా తప్పు కాదు..
-
ఎస్సీ,ఎస్టీ వర్గీకరణపై సీఎం రేవంత్ రియాక్షన్..
-
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై దామోదర రాజనర్సింహ రియాక్షన్
-
నీట్ ప్రశ్నాపత్రం లీక్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
-
హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ..
-
దిశ ఎఫెక్ట్: విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు సంచలన తీర్పు
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో 2017వ సంవత్సరంలో సంచలనం రేపిన కిడ్నాప్, లైంగిక దాడి కేసులో సంచలన తీర్పు వెలువరించింది. 5 వ తరగతి చదువుతున్న బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడు గణేష్ కి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. బాధితురాలుకి 4 లక్షల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని జడ్జి తీర్పు చెప్పారు.న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదవ్వగా, దిశ ఎఫెక్ట్తో విచారణ వేగవంతంగా జరిగింది. ముద్దాయికి కఠిన శిక్ష పడేలా వాదించిన స్పెషల్ పోక్సో పీపీ కరణం కృష్ణకు బాధితులు ధన్యవాదాలు తెలిపారు. -
నటి కుటుంబం దారుణ హత్య.. తీర్పు వెలువరించిన కోర్టు!
బాలీవుడ్ నటి లైలా ఖాన్ ఫ్యామిలీ దారుణ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఆమె సవతి తండ్రికి ముంబయి సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించింది. దాదాపు 13 ఏళ్ల క్రితం జరిగిన ఈ దారుణ ఘటనపై విచారణ చేపట్టిన ముంబయి సెషన్స్ కోర్టు తుది తీర్పు వెలువరించింది.అసలేం జరిగిందంటే?బాలీవుడ్ నటి లైలా ఖాన్ ఫ్యామిలీ దారుణ హత్యకు గురికావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆమె సవతి తండ్రి అయిన పర్వేజ్ తక్ వారి ఫ్యామిలీ మొత్తాన్ని హతమార్చాడు. ఈ ఘటన 2011లో మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలోని ఇగత్పురిలో జరిగింది. ఈ ఘటనలో లైలా ఖాన్తో పాటు ఆమె తల్లి షెలీనా, తోబుట్టువులైన అజ్మీనా, జారా, ఇమ్రాన్, కజిన్ రేష్మాను అతను కాల్చిచంపాడు. వారి మృతదేహాలను వారి బంగ్లాలోనే పాతిపెట్టి పరారయ్యాడు.అయితే ఈ ఘటన జరిగిన దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఈ దారుణం బయటకొచ్చింది. ఆ తర్వాత కేసు నమోదు చేసుకున్న పోలీసులు పర్వేజ్ తక్ను జమ్మూకశ్మీర్లో అరెస్ట్ చేశారు. కాగా.. పర్వేజ్ తక్ లైలా తల్లి షెలీనాకి మూడవ భర్తగా పోలీసులు నిర్ధారించారు. ఆస్తి వివాదం కారణంగానే ఆరుగురిని అత్యంత కిరాతకంగా కాల్చి చంపినట్లు విచారణలో వెల్లడైంది.అసలు లైలా ఖాన్ ఎవరు?బాలీవుడ్ నటి లైలా ఖాన్ 2008లో విడుదలైన వాఫా: ఎ డెడ్లీ లవ్ స్టోరీలో నటించింది. ఈ చిత్రానికి రాకేశ్ సావంత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రాజేష్ ఖన్నా సరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత 2008లో కూల్ నహీ హాట్ హై హమ్ చిత్రంలో కనిపించింది. కాగా.. అంతకుముందే లైలా ఖాన్ 2002లో కన్నడ చిత్రం మేకప్తో సినిమాల్లోకి అడుగుపెట్టింది. -
వేలం వద్దు.. మేమే కేటాయిస్తాం.. మీ తీర్పును సవరించండి
న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులపై 2012లో ఇచ్చిన తీర్పును సవరించాలని 12 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తిచేసింది. వేలం విధానంలో కాకుండా తామే కేటాయింపులు జరుపుతామని కోర్టుకు తెలిపింది. వేలం ద్వారా మాత్రమే కేటాయింపులు జరపాలంటూ ఇచ్చిన గత తీర్పును సవరించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలాల ధర్మాసనం ఎదుట కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి అభ్యర్థించారు. ఈ అంశంపై తక్షణం విచారణ చేపట్టాలని కోరారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్(ముందు వచ్చిన వారికే ప్రాధాన్యత) పద్ధతిలో యూపీఏ హయాంలో ఏ.రాజా టెలికం మంత్రిగా ఉన్నపుడు 2జీ స్పెక్ట్రమ్కు సంబంధించి కంపెనీలకు ఇచ్చిన 122 లైసెన్సులను రద్దుచేస్తూ సుప్రీంకోర్టు తీర్పునివ్వడం తెల్సిందే. కొన్ని సందర్భాల్లో వేలంలో కాకుండా ప్రభుత్వమే కేటాయింపులు జరపాలని ఆశిస్తోందని, అందుకే పాత తీర్పును సవరించాలని అటార్నీ జనరల్ సోమవారం కోరారు. ఈ విషయాన్ని పరిశీలిస్తామని, వివరాలను ఈ–మెయిల్లో పంపాలని సీజేఐ చంద్రచూడ్ సూచించారు. అయితే తీర్పును సవరించాలంటూ ప్రభుత్వం చేసిన అభ్యర్థనను సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తప్పుబట్టారు. నాటి తీర్పు సమంజసంగానే ఉందని, సవరణ అనవసరమని ఆయన వాదించారు. ఆనాడు యూపీఏ సర్కార్కు వ్యతిరేకంగా 2జీ స్పెక్ట్రమ్పై ప్రజా ప్రయోజనా వ్యాజ్యం దాఖలుచేసిన ఎన్జీవో సంస్థ తరఫున ఆనాడు ప్రశాంత్భూషణే వాదించారు. కేటాయింపుల వల్ల ప్రభుత్వ ఖజానాకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని మన్మోహన్ ప్రభుత్వంలో నాటి కమ్యూనికేషన్స్, ఐటీ సహాయ మంత్రి కపిల్సిబల్ 2011లో వాదించారు. అయితే ఈ కేసులో ఎ.రాజా, డీఎంకే నాయకురాలు కనిమొళిలను నిర్దోషులుగా ప్రకటిస్తూ 2017 డిసెంబర్ 21న ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరిచింది. ఈ తీర్పును సవాల్చేస్తూ సీబీఐ 2018 మార్చి 20న హైకోర్టును ఆశ్రయించింది. అక్రమ కేటాయింపుల వల్ల కేంద్ర ఖజానాకు రూ.30,984 కోట్ల నష్టం వాటిల్లిందని వాదించింది. వేలం విధానంలో జరగని కేటాయింపుల లైసెన్స్లను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. -
డిజైన్ టెక్ ఆస్తులను ఈడీ జప్తు చేయడం సబబే
సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో కీలక పాత్రధారైన డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్కు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థకు చెందిన రూ.31.20 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లను జప్తు చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన ప్రాథమిక జప్తు ఉత్తర్వులను (పీఏవో) హైకోర్టు సమర్థించింది. అలాగే మనీలాండరింగ్ చట్టం కింద డిజైన్ టెక్కు అడ్జ్యుడికేటింగ్ అథారిటీ జారీ చేసిన షోకాజ్ నోటీసులు సైతం సబబేనని పేర్కొంది. ఈడీ జారీ చేసిన ప్రాథమిక జప్తు ఉత్తర్వులను, అడ్జ్యుడికేటింగ్ అథారిటీ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ డిజైన్ టెక్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. ఈడీ జారీ చేసిన ప్రాథమిక జప్తు ఉత్తర్వులను అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ముందే తేల్చుకోవాలని డిజైన్ టెక్కు స్పష్టం చేసింది. ఈ విషయంలో ఈడీ తరపు న్యాయవాది జోస్యుల భాస్కరరావు చేసిన వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. ఈ కుంభకోణం తీవ్రత, ఇందులో ప్రజాధనం ముడిపడి ఉన్న నేపథ్యంలో ఈడీ ఉత్తర్వులు, అడ్జ్యుడికేటింగ్ అథారిటీ నోటీసుల విషయంలో డిజైన్ టెక్ వాదనను ఆమోదించలేమని తేల్చిచెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ఇటీవల కీలక తీర్పు వెలువరించారు. ఆధారాలను బట్టి జప్తు చేసే అధికారం ఈడీకి ఉంది ‘మనీలాండరింగ్ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం ఈడీ అధికారులు ఏ వ్యక్తి ఆస్తినైనా జప్తు చేయొచ్చు. ఆ ఆస్తిని నేరం ద్వారా సంపాదించారనేందుకు తమ ముందున్న ఆధారాలను బట్టి జప్తు చేసే అధికారం అధికారులకు ఉంది. ఈ అధికారాన్ని ఉపయోగించే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో డిజైన్ టెక్ ఫిక్స్డ్ డిపాజిట్లను ఈడీ జప్తు చేసింది. నేరం ద్వారా సంపాదించిన డబ్బు లేదా ఆస్తి (ప్రొసీడ్స్ ఆఫ్ క్రైం)కి విస్తృత నిర్వచనం ఉంది. సీఐడీ జప్తు చేసే నాటికి బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.2.8 కోట్లను మాత్రమే ప్రొసీడ్స్ ఆఫ్ క్రైంగా భావించవచ్చని, అంతకు మించిన మొత్తాలను జప్తు చేసే అధికారం ఈడీకి లేదన్న డిజైన్ టెక్ తరఫు సీనియర్ న్యాయవాది వాదనలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. వాస్తవానికి సీఆర్పీసీ సెక్షన్ 102 కింద సీఐడీ చేపట్టిన చర్యలు, మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ చేపట్టిన చర్యలు పరస్పరం భిన్నమైనవి. సీఐడీ జప్తుపై కింది కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ముందు దాఖలైన వ్యాజ్యాల్లో ఈడీ ప్రతివాది కాదు. ఈ కోర్టులన్నీ కూడా కేవలం సీఐడీ జప్తు అంశానికే పరిమితమయ్యాయి. అందువల్ల ఈడీ జారీ చేసిన జప్తు ఉత్తర్వులను ‘రెండో జప్తు’ అనడానికి ఏమాత్రం వీల్లేదు’ అని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు. డిజైన్ టెక్ వాదనలో ఏమాత్రం పస లేదు.. ‘అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసులకు వివరణ ఇచ్చేందుకు, ఈడీ జారీ చేసిన ప్రాథమిక జప్తు ఉత్తర్వులపై అభ్యంతరం తెలిపేందుకు ఉన్న ప్రత్యామ్నాయాలను డిజైన్ టెక్ ఉపయోగించుకోవచ్చు. అడ్జ్యుడికేటింగ్ అథారిటీ నోటీసులకు వివరణ ఇచ్చినట్లు డిజైన్ టెక్ చెబుతోంది. అందువల్ల ఈడీ ప్రాథమిక జప్తు ఉత్తర్వులను కూడా ఆ అథారిటీ ముందే తేల్చుకోవచ్చు. అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ముందుకు వెళితే తమకు ఇబ్బంది కలుగుతుందన్న డిజైన్ టెక్ వాదనలో ఏమాత్రం పస లేదు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా, ఇందులో ప్రజాధనం ముడిపడి ఉన్న కారణంతో ఆ వాదనను ఆమోదించలేకున్నాం. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని డిజైన్ టెక్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేస్తున్నాం. ఈ తీర్పులో వ్యక్తం చేసిన అభిప్రాయాల ప్రభావానికి లోనవకుండా అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ఈ వ్యవహారాన్ని పరిష్కరించాలి’ అని జస్టిస్ రవి తన తీర్పులో పేర్కొన్నారు. స్కిల్ కుంభకోణంపై రంగంలోకి దిగిన ఈడీ.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ఏర్పాటు పేరుతో వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసిన సంగతి తెలిసిందే. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కుంభకోణంపై సీఐడీ కేసు నమోదు చేసింది. చంద్రబాబు, అప్పటి మంత్రి అచ్చెన్నాయుడులతో పాటు పలువురు అధికారులను సీమెన్స్, డిజైన్ టెక్ తదితరులను నిందితులుగా చేర్చింది. వందల కోట్ల రూపాయల ప్రజాధనం దారి మళ్లడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. దర్యాప్తులో భాగంగా డిజైన్ టెక్ బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.31.20 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు స్కిల్ కుంభకోణానికి సంబంధించినవేనని తేల్చింది. ఈ మొత్తాన్ని జప్తు చేస్తూ గతేడాది ఏప్రిల్ 21న ఈడీ ప్రాథమిక జప్తు ఉత్తర్వులు ఇచ్చింది. అనంతరం అడ్జ్యుడికేటింగ్ అథారిటీకి ఫిర్యాదు చేసింది. దీంతో అడ్జ్యుడికేటింగ్ అథారిటీ.. డిజైన్ టెక్కు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. గతేడాది జూలై 13లోపు ఈ నోటీసులకు సమాధానం ఇవ్వాలని డిజైన్ టెక్ను ఆదేశించింది. ఈడీ ప్రాథమిక జప్తు ఉత్తర్వులను, అడ్జ్యుడికేటింగ్ అథారిటీ షోకాజ్ నోటీసులను సవాల్ చేస్తూ డిజైన్ టెక్ చైర్మన్ కమ్ ఎండీ వికాస్ వినయ్ ఖాన్వీల్కర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీది రెండో జప్తు అవుతుంది.. డిజైన్ టెక్ తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు, ఈడీ తరఫున సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్ జోస్యుల భాస్కరరావు వాదనలు వినిపించారు. డిజైన్ టెక్ బ్యాంకు ఖాతాలో ఉన్న నగదును సీఐడీ జప్తు చేసిందని, దానిపై తాము కింది కోర్టును ఆశ్రయించామని ఆదినారాయణరావు చెప్పారు. బ్యాంకు ఖాతా నిర్వహణకు అనుమతినిచ్చిన కింది కోర్టు.. నగదును ఫిక్స్డ్ డిపాజిట్లుగా మార్చాలని ఆదేశించిందన్నారు. తరువాత ఈడీ ఆ ఫిక్స్డ్ డిపాజిట్లను జప్తు చేస్తూ ప్రాథమిక జప్తు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. వాస్తవానికి ఆ డబ్బును వినియోగించుకునేందుకు హైకోర్టు తమకు అనుమతినిచ్చిందని ఆదినారాయణరావు తెలిపారు. సీఐడీ జప్తు చేసిన మొత్తాలను తిరిగి ఈడీ జప్తు చేయడం రెండో జప్తు కిందకు వస్తుందని, ఒకే ఆస్తికి రెండు జప్తు ఉత్తర్వులు చెల్లవన్నారు. అందువల్ల ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని విన్నవించారు. బ్యాంకులో ఉన్న నగదు ఖాతాదారులకు చెల్లించాల్సిన మొత్తమన్నారు. తాము అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ముందుకు వెళితే నిర్దిష్ట గడువు లోపు చేయాల్సిన చెల్లింపులు చేయలేమని, దీంతో ఖాతాదారుల నుంచి సివిల్, క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని కోర్టుకు నివేదించారు. సీఐడీ, ఈడీ జప్తులు వేర్వేరు డిజైన్టెక్ వాదనలను ఈడీ తరఫు న్యాయవాది భాస్కరరావు తోసిపుచ్చారు. ఈ మొత్తం వ్యవహారంపై అడ్జ్యుడికేటింగ్ అథారిటీ విచారణ పూర్తి కాకుండా ఈ వ్యాజ్యం దాఖలు చేశారని, అందువల్ల ఇది అపరిపక్వ వ్యాజ్యమని.. దీన్ని కొట్టేయాలని కోరారు. అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వులపై డిజైన్ టెక్కు అభ్యంతరం ఉంటే అప్పిలేట్ అథారిటీ వద్దకు వెళ్లాలని, ఆ తరువాతే హైకోర్టుకు రావాల్సి ఉంటుందన్నారు. ఈడీ జప్తు చేసిన మొత్తాలకు, నేరానికి సంబంధం లేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత డిజైన్ టెక్పైనే ఉందన్నారు. షోకాజ్ నోటీసుకు ఆ సంస్థ ఇచ్చిన వివరణను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాల్సింది అడ్జ్యుడికేటింగ్ అథారిటీయేనన్నారు. సీఆర్పీసీ సెక్షన్ 102 కింద సీఐడీ జారీ చేసిన జప్తు ఉత్తర్వులకు, మనీలాండరింగ్ కింద ఈడీ జారీ చేసిన ఉత్తర్వులకు ఏ మాత్రం సంబంధం లేదని, అవి రెండూ వేర్వేరని నివేదించారు. బ్యాంకు ఖాతాల్లో ఉన్న మొత్తాల విషయంలో కింది కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సీఐడీ జప్తునకు సంబంధించినవే తప్ప, ఈడీ జప్తుకు సంబంధించినవి కావన్నారు.అందులో ఈడీ పార్టీ కూడా కాదన్నారు. అందువల్ల తమ జప్తు ఉత్తర్వులు రెండో జప్తు కిందకు రావని స్పష్టం చేశారు. ఈ మేరకు ఇరుపక్షాల వాదనలు విని గతేడాది అక్టోబర్ 10న తీర్పును వాయిదా వేసిన న్యాయమూర్తి జస్టిస్ రవి ఇటీవల తన తీర్పును వెలువరించారు. -
జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇచ్చిన కీలక తీర్పులు ఇవే..
అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు మనదేశంలో రాజ్యాంగపరంగా ఉన్నతమైన గౌరవం ఉంది. సుప్రీం కోర్టు తీర్పులు యావత్ సమాజంతో పాటు పలు రంగాలపై తీవ్ర ప్రభావం చూపెడుతుంటాయి. అటువంటి కీలకమైన తీర్పులు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ వెల్లడించారు. ఆయన ఇచ్చిన తీర్పులను కొన్నింటిని పరిశీలిస్తే.. గోప్యత హక్కు: డీవై చంద్రచూడ్ జస్టిస్గా వ్యవహరించిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం.. గోప్యత హక్కుపై కీలకమైన తీర్పును వెలువరించింది. గోప్యతను ప్రథమిక హక్కుగా గుర్తిస్తూ తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు రాజ్యంగం.. వ్యక్తిగత గోప్యతకు కల్పించే రక్షిణ ప్రాధాన్యతను తెలియజేస్తుంది. స్వలింగ సంపర్కం నేరం కాదు: చారిత్రక నవ్తేజ్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆప్ ఇండియా కేసులో భారతీయ శిక్షా స్మృతి( ఐపీసీ)లోని సెక్షన్ 377పై సుప్రీం కోర్టు వెల్లడించిన సంచలన తీర్పులో కీలక పాత్ర పోషించారు. సెక్షన్ 377ను రద్దు చేస్తూ.. సుప్రీం కోర్టు స్వలింగం సంపర్కం నేరం కాదని తీర్పనిచ్చింది. అదే విధంగా స్వలింగ సంపర్కానికి చట్టపబద్దత కల్పించింది. ఈ తీర్పు వెల్లడించిన ఐదుగురు న్యాయముర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ డీవై చంద్రచూడ్ కూడా ఉన్నారు. ఆధార్ చట్టబద్దత: కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆధార్ పథకం రాజ్యాంగపరంగా చట్టబద్దమైనది అని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులో సైతం జస్టిస్ డీవై చంద్రచూడ్ కీలకంగా వ్యవహిరించారు. ఈ కేసులో రాజ్యాంగ ధర్మాసనం ఆధార్ పథకం చెల్లుబాటను పరిశీలించింది. సంక్షేమ పథకాలకు ఈ ఆధార్ స్కీమ్ను ఉపయోగించడాన్ని సుప్రీంకోర్టు బెంచ్ సమర్ధించింది. అయితే ప్రభుత్వ పథకాల్లో, ఇతరాత్ర కార్యక్రమాల్లో ప్రజలు సమర్పించిన ఆధార్ డేటా రక్షణ, గోపత్య భద్రత అవసరాన్ని కూడా కోర్టు గుర్తు చేసింది. ఢిల్లీ ప్రభుత్వం వర్సెస్ లెఫ్టినెంట్ గవర్నర్: ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతత్వంలోని ధర్మాసనం 2023 మే 11న ఢిల్లీ ప్రభుత్వం వర్సెస్ లెఫ్ట్నెంట్ గవర్నర్ కీలక తీర్పు ఇచ్చింది. దేశ రాజధానిలో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) సేవలపై ఢిల్లీ ప్రభుత్వానికి నియంత్రణ ఉంటుందని పేర్కొంది. రాజధాని పరిధిలోని భూములు, పోలీసు వ్యవస్థ, శాంతి భద్రత విషయంలో ప్రభుత్వ నియంత్రణ ఉండదని తెలిపింది. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం, లెఫ్ట్నెంట్ గవర్నర్ అధికారులను పంపిణీ చేయటంలో జస్టిస్ చంద్రచూడ్ వెల్లడించిన తీర్పు కీలకంగా మారింది. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం: 34 ఎమ్మెల్యేల మద్దతు ఉన్న శివసేన చీలిక వర్గం (ఏక్నాథ్ షిండే) వర్గానికి బల పరీక్షకు అనుమతించిన మాజీ మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ భగత్ సింగ్ కోష్యారీ నిర్ణయం సరికాదని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెల్లడించింది. ఇటువంటి సందర్భాల్లో సదురు విషయం తీవ్రతను పరిగణలోకి తీసుకోవాలని సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది. జస్టిస్ డీవై చంద్రచూడ్ వెల్లడించిన తీర్పుల్లో రాజ్యాంగ నియమాలు, వ్యక్తిగత హక్కులు, న్యాయం ప్రధానంగా కనిపిస్తాయి. ఆయన తీర్పులు భారత్ న్యాయవ్యవస్థలో చెరిగిపోని ముద్ర వేశాయి. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ భారత దేశ 50వ ప్రధాన న్యాయమూర్తిగా 9 నవంబర్ 2022 ప్రమాణ స్వీకారం విషయం తెలిసిందే. -
సాయిబాబా నిర్దోషి
సాక్షి, న్యూఢిల్లీ: మావోయిస్టులతో సంబంధాల కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబాతోపాటు మరో ఐదుగురు నిందితులను బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ నిర్దోషులుగా ప్రకటించింది. 2017లో సాయిబాబాతో పాటు ఇతరులను దోషులుగా నిర్ధారిస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పుపై నాగ్పూర్ బెంచ్ న్యాయమూర్తులు జస్టిస్ వినయ్ జోషీ, జస్టిస్ వాల్మికి మెనెజెస్లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. నిందితులపై వచ్చిన ఆరోపణలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని, అందుకే వారిపై అభియోగాలను కొట్టివేస్తున్నట్లు పేర్కొంది. నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం తోసిపుచ్చింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని, దేశంపై యుద్ధంపై చేసే కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ 2017 మార్చిలో సాయిబాబా, ఇతరులను మహారాష్ట్రలోని గడ్చిరోలీ సెషన్స్ కోర్టు దోషులుగా నిర్ధారించింది. దీనిపై సాయిబాబా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. 2022 అక్టోబరు 14న జస్టిస్ రోహిత్ నేతృత్వంలోని ధర్మాసనం సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తదుపరి రోజు శనివారమైనప్పటికీ ప్రత్యేకంగా విచారించింది. హైకోర్టు ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేసింది. అనంతరం జస్టిస్ షా, జస్టిస్ రవికుమార్ సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపి 2023 ఏప్రిల్ 19న బాంబే హైకోర్టు తీర్పును పక్కనపెట్టింది. ఈ తీర్పును మళ్లీ పరిశీలించాలని బాంబే హైకోర్టుకు పంపించింది. ఈ నేపథ్యంలో జస్టిస్ జోషీ, జస్టిస్ వాల్మికిల హైకోర్టు ధర్మాసనం విచారించి, సాయిబాబా, ఇతరులను నిర్దోషులుగా ప్రకటించింది. ప్రొఫెసర్ సాయిబాబా 2014లో అరెస్టయ్యారు. ప్రస్తుతం నాగ్పూర్ సెంట్రల్ జైల్లో ఉన్నారు. పదేళ్ల పోరాటం తర్వాత ఊరట దక్కింది బాంబే హైకోర్టు తీర్పు పట్ల సాయిబాబా భార్య వసంత ఆనందం వ్యక్తం చేశారు. పదేళ్ల తర్వాత ఊరట లభించిందన్నారు. సాయిబాబాకు అండగా నిలిచిన లాయర్లకు, సామాజిక కార్యకర్తలకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. తన భర్త పది సంవత్సరాలు జైలులో ఉన్నారని, ఆర్థికంగా, మానసికంగా తాము ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామని చెప్పారు. సాయిబాబా గురించి ప్రజలకు వాస్తవాలు తెలుసని, ఆయన పట్ల వారికి సంపూర్ణ విశ్వాసం ఉందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో మహారాష్ట్ర సర్కారు పిటిషన్ మావోయిస్టులతో సంబంధాల కేసులో మాజీ ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా విడుదల చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు మంగళవారం అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. బాంబే హైకోర్టు తీర్పును కొట్టివేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం విన్నవించింది. సాయిబాబాతోపాటు ఇతరులను నిర్దోషులుగా నిర్ధారిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుపై సుప్రీంకోర్టును ఆశ్రయించామని మహారాష్ట్ర అడ్వొకేట్ జనరల్ బీరేంద్ర షరాఫ్ ఈ సందర్భంగా చెప్పారు. నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును కొంతకాలం నిలిపివేయాలని కోరుతూ హైకోర్టు ధర్మాసనం ముందు అప్లికేషన్ దాఖలు చేశారు. ధర్మాసనం స్పందిస్తూ.. న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని పునఃపరిశీలించే అధికారం ఉండదని, ఇది వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన విషయమని స్పష్టం చేసింది. అడ్వొకేట్ జనరల్ దాఖలు చేసిన అప్లికేషన్ను కొట్టివేసింది. -
ఆరుగురు కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు
హిమాచల్ ప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికల అనంతరం నెలకొన్న రాజకీయ గందరగోళం మరో మలుపు తిరిగింది. ఆరుగురు కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దయ్యింది. కాంగ్రెస్ పిటిషన్ నేపధ్యంలో స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా ఈ నిర్ణయం తీసుకున్నారు. ధర్మశాల ఎమ్మెల్యే సుధీర్ శర్మ, సుజన్పూర్ ఎమ్మెల్యే రాజేంద్ర రాణా, కుత్లహర్ ఎమ్మెల్యే దేవేంద్ర భుట్టో, గాగ్రెట్ ఎమ్మెల్యే చైతన్య శర్మ, లాహౌల్ స్పితి ఎమ్మెల్యే రవి ఠాకూర్, బాద్సర్ ఎమ్మెల్యే ఇంద్ర దత్ లఖన్పాల్ తదితరులు సభ్యత్వం రద్దయిన ఎమ్మెల్యేల జాబితాలో ఉన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద స్పీకర్ ఈ నిర్ణయం తీసుకుని వీరందరినీ అనర్హులుగా ప్రకటించారు. ఈ ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ ఎన్నికల అభ్యర్థి హర్ష్ మహాజన్కు అనుకూలంగా ఓటు వేశారు. ఈ ఆరుగురు తిరుగుబాటు ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయాలనే డిమాండ్ను రాష్ట్ర బడ్జెట్ సమావేశంలో ఇతర సభ్యులు లేవనెత్తారు. బుధవారం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ప్రభుత్వం బడ్జెట్ను ఆమోదించింది. మరోవైపు భోజన విరామానికి ముందు భారతీయ జనతా పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు సస్పెన్షన్కు గురయ్యారు. ఇది కాకుండా మిగిలిన ఎమ్మెల్యేలు తమ మాట విననందుకు నిరసనగా సభను బహిష్కరించారు. సభలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు లేకపోవడంతో అధికార పక్షానికి అనుకూలంగా మూజువాణి ఓటుతో బడ్జెట్ ఆమోదం పొందింది. అనంతరం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ కార్యకలాపాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులు తలెత్తకపోతే, తదుపరి సమావేశాలు జూలై, ఆగస్టులలో వర్షాకాల సమావేశాలుగా ప్రారంభమయ్యే అవకాశముంది. #WATCH | Himachal Pradesh Assembly Speaker Kuldeep Singh Pathania says, "Six MLAs, who contested on Congress symbol, attracted provisions of anti-defection law against themselves...I declare that the six people cease to be members of the Himachal Pradesh Assembly with immediate… pic.twitter.com/QQt92aM10v — ANI (@ANI) February 29, 2024 -
సీఐడీకి స్వేచ్ఛ !..చంద్రబాబు గుండెల్లో రైళ్లు
-
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు షాక్.. కేసును కొట్టివేసేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరణ..ఇంకా ఇతర అప్డేట్స్
-
‘సాక్షి’ పెట్టుబడులు సక్రమమే..
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: సాక్షి మీడియాలోకి వచ్చిన పెట్టుబడులన్నీ సక్రమమేనని, చట్టబద్ధమేనని 2022 డిసెంబర్లో ఐటీ అప్పిలేట్ ట్రిబ్యునల్ స్పష్టంగా చెప్పింది. జగతి పబ్లికేషన్లో ఇన్వెస్టర్లంతా చట్టానికి లోబడే పెట్టుబడులు పెట్టారని, ఇన్వెస్ట్మెంట్లు స్వీకరించడంలో కంపెనీలు చట్టప్రకారం పాటించాల్సిన నిబంధనలన్నిటినీ జగతి పబ్లికేషన్స్ పాటించిందని ఐటీ శాఖ అప్పిలేట్ ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. ఈ కంపెనీలోకి పెట్టుబడులన్నీ క్విడ్–ప్రో–కో రూపంలో వచ్చాయి కనుక వాటిని ఆదాయంగా పరిగణించి, ఆ మొత్తం పై పన్ను చెల్లించాలంటూ 2011లో నాటి ఐటీ అధికారి ఇచ్చిన నోటీసులను ట్రిబ్యునల్ కొట్టివేసింది. ఐటీ విభాగం తమ వాదనకు మద్దతుగా సమర్పించిన సీబీఐ ఛార్జిషీట్లను... అసలు సాక్ష్యంగానే పరిగణించలేమని తెగేసి చెప్పింది. సాక్ష్యానికి ఉండాల్సిన కనీస లక్షణాలేవీ ఆ ఛార్జిïÙట్లకు లేవని కూడా బెంచ్ వ్యాఖ్యానించింది. ‘ఆ ఛార్జిషిట్లలో ఉన్నవన్నీ సీబీఐ చేసిన ఆరోపణలే తప్ప నిరూపితమైనవేమీ కావు. అయినా మీరు నోటీసులిచ్చిన అసెస్మెంట్ ఇయర్ దాటి ఇప్పటికి పదేళ్లు గడిచింది. మీరేమైనా దర్యాప్తు చేశారా? క్విడ్ ప్రోకో ఆరోపణలు నిరూపించే ఆధారాలేమైనా సంపాదించారా? సీబీఐ ఆరోపణలనే సాక్ష్యంగా సమర్పిస్తే ఎలా? సీబీఐ ఛార్జిషీట్లకు ఎలాంటి హేతుబద్దతా లేదు. ఈ కేసులో అవి అనవసరం, అప్రస్తుతం కూడా‘ అని జ్యుడిషియల్, అకౌంటింగ్ సభ్యులతో కూడిన ట్రిబ్యునల్ బెంచ్ తేల్చిచెప్పింది. తద్వారా... సాక్షి మీడియాలోకి వచ్చిన పెట్టుబడులపై రామోజీరావు, టీడీపీ అధిపతి చంద్రబాబునాయుడు, మిగిలిన ఎల్లో గ్యాంగ్ పనిగట్టుకుని చేస్తున్న దు్రష్పచారానికి విలువ లేదని, అదంతా బూటకమని స్పష్టమయింది. సుదీర్ఘకాలం విచారించి, ఇరుపక్షాల వాదనలూ సమగ్రంగా విన్న అనంతరం 2022 డిసెంబరు 23న బెంచ్ 153 పేజీల ఉత్తర్వులను వెలువరించింది. ఒక్కొక్కరికీ ఒక్కో’లా’ ఎలా? ‘‘కొందరు ఇన్వెస్టర్ల విషయంలో ఇదే సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో మెమో దాఖలు చేసింది. వారి విషయంలో ఎలాంటి క్విడ్ ప్రో కో లావాదేవీలూ జరగలేదని స్పష్టంగా చెప్పింది. పోనీ... మిగతా ఇన్వెస్టర్ల విషయంలో క్విడ్ ప్రోకో జరిగిందని కూడా ఆ మెమోలో చెప్పలేదు. మరి క్విడ్ ప్రో కో అని మీరెలా అంటారు?‘ అని బెంచ్ తన ఉత్తర్వుల్లో ఐటీ విభాగాన్ని ప్రశ్నించింది. ప్రయివేటు లిమిటెడ్లో షేరు ప్రీమియం అనేది ఇన్వెస్టర్లతో జరిగే చర్చలు, వారి అంచనాల వల్లే నిర్ణయమవుతుందని పేర్కొంది. ఇన్వెస్టర్ల వాదనను గమనించారా? సాక్ష్యాలుగా సమరి్పంచిన పలు వాదనల్లో నిమ్మగడ్డ గ్రూపు సంస్థల డైరెక్టరు నిమ్మగడ్డ ప్రకాశ్ చేసిన వాదనను బెంచ్ ప్రస్తావించింది. ‘‘ఈనాడులో పెట్టుబడులకోసం బ్లాక్స్టోన్ అనుకున్న విలువలో 20 శాతం డిస్కౌంట్కే సాక్షిలో వాటా దొరికింది. ఐదు ప్రాధాన్య రంగాల్లో పెట్టుబడులు పెడదామని అనుకున్నాం. అందులో మీడియా ఒకటి. అందుకే సాక్షిలో పెట్టాం’’ అనే ప్రకాశ్ వ్యాఖ్యల్ని పరిగణనలోకి తీసుకోవాలని బెంచ్ వ్యాఖ్యానించింది. వచి్చన పెట్టుబడులను ఆదాయంగా పరిగణించలేమని విస్పష్టంగా తేల్చిచెప్పింది. తెలియని మార్గాలంటే ఎలా? కోల్కతాలోని కొన్ని కంపెనీల నుంచి వచ్చిన రూ.15 కోట్లను తెలియని మార్గాల నుంచి వచ్చిన మొత్తంగా ఐటీ విభాగం పేర్కొంది. దాన్ని బెంచ్ తప్పుబడుతూ... కోల్కతా కంపెనీలతో సహా పెట్టుబడి ప్రతి కంపెనీ పాన్, రిజిస్ట్రేషన్ నెంబరు, అడ్రసు వంటి వివరాలన్నీ జగతి సంస్థ సమర్పించిందని, అన్నీ చట్టబద్ధంగానే ఉన్నప్పుడు ’గుర్తు తెలియని ఆదాయం’ ఎలా అవుతుందని ప్రశ్నించింది. వాల్యుయేషన్ నివేదిక నిజమేగా? ‘‘వాల్యుయేషన్ రిపోర్టును అస్సలు తప్పు బట్టడానికి లేదు. అందులో పేర్కొన్న అంశాలన్నీ సాక్షి పత్రిక విషయంలో నిజమయ్యాయి. అనుకున్నట్లుగానే సర్క్యులేషన్ పెరిగింది. పోటీపత్రిక ఈనాడు గుత్తాధిపత్యం తగ్గింది. పోటీపత్రిక 30 ఏళ్లలో సాధించిన సర్క్యులేషన్ను సాక్షి ఏడాదిన్నరలోనే సాధించింది. కనుక వాల్యుయేషన్ నివేదికను తప్పుబట్టలేం. సాక్షి యాజమాన్యానికి అనుభవం లేకున్నా అంత ప్రీమియం తీసుకున్నారనే వాదన అర్థరహితం. వారి లీడర్షిప్లో ఆ పత్రిక అంచనాలన్నిటినీ అందుకుంది. కాబట్టి క్విడ్ ప్రో కో వాదనకు అర్థమే లేదు’’ అని బెంచ్ పేర్కొంది. ఐటీ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఇంత విస్పష్టంగా తీర్పునిచ్చినా... రామోజీ, చంద్రబాబు గ్యాంగ్ మాత్రం ఇప్పటికీ పాత పాటే పాడుతూ... పాచి కథనాలనే మళ్లీ మళ్లీ ప్రచురిస్తూ ఏదో చేసేయాలని ఆరాటపడుతుండటమే విచిత్రం. -
క్షమాభిక్ష రద్దు..సుప్రీం కోర్టు సంచలన తీర్పు
-
ఊపిరి ఉన్నంత వరకు జైల్లోనే
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలిలోని బొటానికల్గార్డెన్ వద్ద రెండు గోనె సంచుల్లో ఏడు ముక్కలుగా దొరికిన బింగి దారుణహత్య కేసులో కూకట్పల్లి సెషన్స్ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. నలుగురిని దోషులుగా తేలుస్తూ వారు బతికి ఉన్నతంకాలం జైల్లోనే ఉండేలా జీవితఖైదు విధించింది. బిహార్లోని బాంకా జిల్లా మోహన్మల్టీ గ్రామానికి చెందిన బింగి అలియాస్ పింకి అలియాస్ శాలినిది నిరుపేద కుటుంబం. రాజస్తాన్లో ఓ ఇటుకల పరిశ్రమలో పనిచేసే ఈమె తండ్రి దబ్బోలెయ్యా ఏడాదికి ఓసారి మాత్రమే సొంతూరుకు వచ్చి వెళ్లేవాడు. 2005లో ఉత్తరప్రదేశ్లోని సన్బల్ జిల్లా చాందూసిటౌన్కు చెందిన దినేష్ తో బింగి వివాహం జరగ్గా, వీరికి ముగ్గురు సంతానం. భర్తతో విభేదాలు ఏర్పడిన తర్వాత బింగికి చాందూసి ప్రాంతానికే చెందిన వికాస్ కశ్యప్తో వివాహేతర సంబంధం ఏర్పడింది. వికాస్తోపాటు ఒక కుమారుడిని తీసుకొని బింగి 2017లో సొంతూరుకు వెళ్లింది. ఈ క్రమంలోనే అక్కడ వికాస్కు మరో మహిళ మమత ఝాతో సన్నిహిత సంబంధం ఏర్పడింది. దీంతో బింగిని వికాస్ను వదిలిపెట్టాడు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో వికాస్, భర్త అనిల్ ఝాలతో కలిసి మమత హైదరాబాద్కు వచ్చింది. అప్పటికే మమత ఝా కుమారుడు అమర్కాంత్ ఝా నగరంలోని దలాల్ స్ట్రీట్ బార్లో వెయిటర్గా పనిచేస్తున్నాడు. వీరంతా కలిసి సిద్ధిఖీనగర్లోని ఓ ఇంట్లో దిగారు. వికాస్, మమత సిద్ధిఖీనగర్లోనే చాట్బండార్ నిర్వహించేవారు. హైదరాబాద్కు వచ్చి హతం: అతికష్టం మీద వికాస్ చిరు నామా తెలుసుకొని బింగి వీరి వద్దకు చేరుకుంది. అప్పటి నుంచి వికాస్, మమత మధ్య గొడవలు మొదలయ్యాయి. అప్పటికే బింగి 8 నెలల గర్భిణి. ఆమెను ఆస్పత్రికి తీసు కెళితే ఖర్చు అవుతుందని, బిడ్డ పుడితే వికాస్ డబ్బులన్నీ వారికే ఖర్చుపెట్టాల్సి వస్తుందని భావించిన మమత ఆమె హత్యకు పథకం వేసింది. దీనికి వికాస్ సహా మిగిలిన వారూ సహకరించడానికి అంగీకరించారు. 2018 జనవరి 27 రాత్రి 12 గంటల ప్రాంతంలో మమత, వికాస్లు బింగితో గొడవపడ్డారు. ఈ క్రమంలో మమత బింగి మెడ పట్టుకుని బలంగా గోడవైపు తోసింది. దీంతో బింగి కుప్పకూలిపోగా మమత, వికాస్ ఆమె నోరు, కాళ్లు, చేతులు గట్టిగా పట్టుకున్నారు. మమతతోపాటు ఆమె భర్త అనిల్ ఝా, కుమారుడు అమర్కాంత్ ఝా బింగి శరీరంపై ఇష్టమొచి్చనట్టు పిడిగుద్దులు కురిపించారు. దీంతో బింగి చనిపోయింది. మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి.... బింగి మృతదేహాన్ని ఒకరోజంతా బాత్రూమ్లోనే ఉంచారు. మర్నాడు అమర్కాంత్ ఎలక్ట్రికల్ కటింగ్ మెషీన్, రెండు గోనె సంచులు తీసుకొచ్చాడు. మెషీన్తో బింగి తల, మొండెం, కాళ్లు, చేతులు ముక్కలుగా చేసి రెండు గోనె సంచుల్లో ప్యాక్ చేశారు. అమర్కాంత్ తాను పనిచేస్తున్న బార్లో ఫ్లోర్ మేనేజర్, ఒడిశావాసి అయిన సిద్ధార్థ బర్దన్కు చెందిన బైక్ తీసుకొచ్చాడు. మమత సాయంతో గోనె సంచుల్నీ తీసుకువెళ్లి బొటానికల్ గార్డెన్ వద్ద పడే శారు. దీనిపై జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికుల ద్వారా సమాచారం అందుకున్న గచ్చి»ౌలి పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్ లో నీలిరంగు చొక్కా ధరించి.. ముఖానికి కళ్లద్దాలు పెట్టుకున్న వ్యక్తి, గోనెసంచులతో మహిళ వెనుక కూర్చు న్న దృశ్యాలు కనబడ్డాయి. నిందితులు వినియోగించిన ఆ బైక్ బౌద్దనగర్కు చెందిన విజయ్కుమార్ బాద్రే పేరు మీద ఉంది. అతడి నుంచి 2009లో శశికుమార్గౌడ్ వద్దకు చివరకు సిద్ధార్థ బర్దన్ చేతికి వచ్చింది. ఇతడు హఫీజ్నగర్లో రాంగ్రూట్లో వెళుతూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. ఆ సమయంలో విధించిన ‘స్పాట్ పేమెంట్ చలాన్’ద్వారా అతడి ఫోన్ నంబరు తెలిసింది. అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా, అమర్కాంత్, మమత, వికాస్, అనిల్ పేర్లు వెలుగులోకి వచ్చి కేసు ఓ కొలిక్కి వచ్చింది. 13 రోజుల్లోనే పోలీసులు ఈ కేసులో నిందితులను అరెస్టు చేశారు. ఆ తర్వాతే హతురాలు బింగి అని తేలింది. కేసు దర్యాప్తు చేసిన గచ్చిబౌలి పోలీసులు నిందితులపై అభియోగపత్రాలు దాఖలు చేశారు. కేసు విచారించిన కూకట్పల్లిలోని ఆరో మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జ్ కోర్టు దోషులుగా తేలిన నలుగురూ బతికి ఉన్నంత కాలం జైల్లోనే ఉండేలా శిక్ష విధించింది. ఈ కేసు దర్యాప్తు అధికారిగా ఇన్స్పెక్టర్ ఎం.గంగాధర్ (ప్రస్తుతం ఏసీపీ) దాఖలు చేసిన చార్జ్షీట్ పోలీసు అకాడమీలో ఓ సబ్జెక్ట్గా మారింది. -
హిండెన్బర్గ్ నివేదిక.. సుప్రీంకోర్టు తీర్పు.. అదానీ ఏమన్నారంటే..
అదానీ-హిండెన్బర్గ్ వివాదంలో అదానీ గ్రూపునకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అదానీ గ్రూప్ కంపెనీలపై సెబీ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను అనుమానించలేమని అత్యన్నత న్యాయ స్థానం తేల్చి చెప్పింది. ప్రముఖ బిలియనీర్ జార్జ్ సోరోస్ ఆధ్వర్యంలోని ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (ఓసీసీఆర్పీ) నివేదిక ఆధారంగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దర్యాప్తు జరిపిన విషయం తెలిసిందే. ఈ మేరకు సెబీ చేస్తోన్న దర్యాప్తులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. ఈ కేసు విచారణను సెబీ నుంచి సిట్కు బదిలీ చేయడానికి తగిన ఆధారాలు లేవని పేర్కొంది. మిగిలిన దర్యాప్తును మూడు నెలల్లోగా పూర్తి చేయాలని నియంత్రణ సంస్థను ఆదేశించింది. అదానీ గ్రూప్.. షేర్ల అవకతవకలకు పాల్పడిందంటూ వచ్చిన ఆరోపణలపై నియంత్రణ సంస్థల వైఫల్యం లేదంటూ నిపుణుల కమిటీ గతంలో నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో కమిటీ సభ్యులు పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉన్నారంటూ పిటిషనర్ పేర్కొనడం గమనార్హం. హిండెన్బర్గ్ వివాదానికి సంబంధించి 24 కేసుల్లో 22 కేసుల విచారణను సెబీ పూర్తి చేసింది. మిగతా కేసుల్లో మూడు నెలల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీం ఆదేశించింది. ‘షార్ట్ సెల్లింగ్’ విషయంలో హిండెన్బర్గ్ మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందా..? లేదా..? అని తనిఖీ చేయాలని ప్రభుత్వాన్ని, సెబీని కోరింది. వార్తా పత్రికలు, థర్డ్ పార్టీ నివేదిక ఆధారంగా సెబీని ప్రశ్నించలేమని కోర్టు తెలిపింది. సెబీ దర్యాప్తును అనుమానించడానికి వాటిని ఆధారాలుగా చేసుకోబోమని కోర్టు చెప్పింది. అదానీ గ్రూప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందంటూ హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదిక తీవ్ర దుమారానికి దారితీసిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించి కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని విచారించిన సుప్రీంకోర్టు కొన్ని పిటిషన్లపై తీర్పును వెలువరించింది. తాజాగా విడుదలైన తీర్పును ఉద్దేశించి ఛైర్మన్ గౌతమ్ అదానీ స్పందించారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పును స్వాగతిస్తానని ఆయన తన ఎక్స్ ఖాతా ద్వారా తెలిపారు. ఎప్పటికైనా నిజం బయటకొస్తుందన్నారు. ‘సత్యమేవ జయతే, మాకు అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు. భారతదేశవృద్ధికి అదానీ గ్రూప్ సహకారం కొనసాగుతుంది’ అని అన్నారు. The Hon'ble Supreme Court's judgement shows that: Truth has prevailed. Satyameva Jayate. I am grateful to those who stood by us. Our humble contribution to India's growth story will continue. Jai Hind. — Gautam Adani (@gautam_adani) January 3, 2024 ఇదీ చదవండి: కొత్త ఏడాది మొదలవనున్న పబ్లిక్ ఇష్యూలు.. అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీలు.. అదానీ ఎంటర్ప్రైజెస్ అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ అదానీ పవర్ లిమిటెడ్ అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ అదానీ విల్మర్ లిమిటెడ్ ఎన్డీటీవీ అంబుజా సిమెంట్స్ ఏసీసీ లిమిటెడ్ -
కీచక టీచర్.. విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు సంచలన తీర్పు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది మైనర్పై అత్యాచారానికి పాల్పడిన నిందితునికి 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పవిత్రమైన ఉపాధ్యాయుడి స్థానంలో ఉండి.. పదో తరగతి చదువుతున్న బాలికపై పలు మార్లు లైంగిక దాడికి పాల్పడిన జనకేశ్వరరావుకి 25 ఏళ్లు జైలు శిక్షతో పాటు, 50 వేల రూపాయలు జరిమానాను కోర్టు విధించింది. విశాఖలోని నాలుగోవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 2020 ఏడాదిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి ఆధారాలతో కేసును పోలీసులు దర్యాప్తు చేశారు. బాధితురాలికి 4 లక్షల 50 వేల రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలని విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు తీర్పు చెప్పింది. బాధితులకు న్యాయం జరిగేలా వాదనలు వినిపించిన స్పెషల్ పోక్సో పీపీ కరణం కృష్ణకి బాధితులు ధన్యవాదాలు తెలిపారు. ఇదీ చదవండి: సినిమా స్టోరీలా.. పరువు హత్య -
10 ‘సుప్రీం’ తీర్పులు.. 2023లో భవితకు దిశానిర్దేశం!
ఏ దేశంలోనైనా వ్యవస్థకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. భారత అత్యున్నత న్యాయస్థానం తన నిర్ణయాల ద్వారా పలు వివాదాలకు పరిష్కారం చూపింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా దేశ అత్యున్నత న్యాయస్థానం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏడాది పొడవునా సుప్రీంకోర్టు అనేక సమస్యలకు పరిష్కారం చూపింది. వాటిలో 10 తీర్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఆర్టికల్ 370 రద్దు జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు అంశంపై సుప్రీం కోర్టు ఈ ఏడాది కీలక తీర్పు వెలువరించింది. ఆర్టికల్ 370 రద్దుపై కేంద్రం వాదనలను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. ఆర్టికల్ 370 అనేది తాత్కాలిక నిబంధన మాత్రమేనని, శాశ్వతం కాదని స్పష్టం చేసింది. 2. విడాకుల విషయంలో.. విడాకులపై ఈ ఏడాది సుప్రీంకోర్టు కీలక తీర్పు నిచ్చింది. ఇక విడాకులు ఇచ్చేందుకు న్యాయస్థానాలు ఆరు నెలలు వేచిచూడనక్కరలేదని పేర్కొంది. విడాకులకు దంపతులు ఆసక్తి చూపిన వెంటనే జారీ చేయవచ్చని పేర్కొంది. విడాకుల మంజూరు కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 3. ద్వేషపూరిత ప్రసంగాలు.. ద్వేషపూరిత ప్రసంగం అనేది దేశ సెక్యులరిజాన్ని ప్రభావితం చేసే తీవ్రమైన నేరమని సుప్రీంకోర్టు తెలిపింది. ద్వేషపూరిత ప్రసంగాలపై ఎవరూ ఫిర్యాదు చేయనప్పటికీ కేసులు నమోదు చేయాలని పేర్కొంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. 2022లో కేవలం మూడు రాష్ట్రాలకు వర్తించే తీర్పు పరిధిని విస్తరించింది. 4. డీమోనిటైజేషన్ నిర్ణయంపై.. మోదీ ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 2016లో రూ.500, రూ.1000 నోట్ల రద్దు నిర్ణయం చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లపై 2023లో తీర్పు వెలువరించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. ఈ అంశానికి సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. 5. ఎన్నికల కమిషనర్ల నియామకం ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్లను ప్యానెల్ ద్వారా నియమిస్తామని కోర్టు తెలిపింది. ఈ ప్యానెల్లో ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్సభలో ప్రతిపక్ష నేత ఉంటారు. ఈ ముగ్గురు కలిసి తదుపరి ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని నిర్ణయిస్తారని కోర్టు పేర్కొంది. 6. స్వలింగ జంటల వివాహం 2023లో సుప్రీంకోర్టు స్వలింగ జంటల వివాహానికి సంబంధించి నిర్ణయం తీసుకుంది. అలాంటి వివాహాలకు చట్టబద్ధత కల్పించడాన్ని కోర్టు నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. స్వలింగ సంపర్కుల వివాహాలపై చట్టం చేసే హక్కు పార్లమెంటుకు మాత్రమే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 7. పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 153ఏ (ఐటీ యాక్ట్ సెక్షన్ 153ఏ) కింద సోదాలు జరిపినప్పుడు నిర్దిష్టమైన ఆధారాలు లభించకపోతే పన్ను చెల్లింపుదారుల ఆదాయాన్ని ఏకపక్షంగా పెంచలేరని సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తాజా ఆదేశంతో ఇలాంటి సందర్భాల్లో ఆదాయ పన్ను విభాగం ఇష్టారాజ్యం ఇకపై తగ్గుతుందని నిపుణులు భావిస్తున్నారు. 8. జల్లికట్టుపై కీలక నిర్ణయం తమిళనాడు, మహారాష్ట్రల సంప్రదాయ క్రీడలైన జల్లికట్టు, ఎడ్ల బళ్ల పందేలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడులో జల్లికట్టు, మహారాష్ట్రలో ఎద్దుల బండి పందేలను అనుమతించే చట్టం చెల్లుబాటుపై కోర్టు తన నిర్ణయాన్ని వెలువరించింది. ఈ ఆటలు శతాబ్దాలుగా సంస్కృతిలో భాగమని, వాటికి అటంకం కలిగించలేమని కోర్టు పేర్కొంది. 9. అవినీతి అధికారులపై కఠిన చర్యలు అవినీతి అధికారులపై ఉక్కుపాదం మోపేందుకు సుప్రీంకోర్టు ఈ ఏడాది తన నిర్ణయాన్ని వెలువరించింది. అవినీతికి పాల్పడుతున్న అధికారులను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2014కు ముందు నమోదైన అవినీతి కేసుల్లో ప్రమేయం ఉన్న అధికారులకు అరెస్టు నుంచి రక్షణ కల్పించబోమని కోర్టు స్పష్టం చేసింది. 10. అదానీ-హిండెన్బర్గ్ కేసులో.. అదానీ-హిండెన్బర్గ్ కేసు ఈ ఏడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సుప్రీంకోర్టు మార్చి 2న ఈ కేసులో కీలక నిర్ణయం తీసుకుంది. అదానీ గ్రూప్ కంపెనీలపై హిండెన్బర్గ్ రిసోర్స్ రిపోర్ట్ లేవనెత్తిన ప్రశ్నలపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏఎం సప్రే నేతృత్వంలోని ఈ కమిటీలో ఆరుగురు సభ్యులను చేర్చాలని కోరింది. ఇది కూడా చదవండి: గోవా విముక్తికి భారత్ ఏం చేసింది? -
ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమేనని చరిత్రాత్మక తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు..ఇంకా ఇతర అప్డేట్స్
-
ఈ నియోజకవర్గ ఓటర్లు చరిత్ర తిరగరాస్తారా?
ఆ నియోజకవర్గ ఓటర్ల తీర్పు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయం ముఖచిత్రంలో ఆసక్తికర చర్చగా మారింది. ఎంతటి ఉద్దండులైనా సరే, ఒక్కసారికి మించి గెలిచిన చరిత్ర లేదు. ఏదో ఒక కారణంతో వారికి పదవి గండం తప్పడం లేదు. మరి ఈ సారి పోటీ చేసే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆ చరిత్ర తిరగ రాస్తారా.. మళ్లీ గెలుపు యోగం ఉందా.. అక్కడి ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది. రాజకీయ చైతన్యానికి, ప్రజా పోరాటాలకు కేరాఫ్ అడ్రస్ ఓరుగల్లు. ఎంతోమంది గొప్ప గొప్ప నేతలకు రాజకీయ జన్మనిచ్చిన గడ్డ ఈ అడ్డ. అలాంటి ఓరుగల్లు గడ్డపైన ఓ విచిత్ర తీర్పు ఆసక్తికరంగా మారింది. అదే వరంగల్ నియోజకవర్గం. వరంగల్ తూర్పు నియోజకవర్గంగా రూపాంతరం చెందిన తర్వాత ఎవరైనా ఒక్కసారికి మించి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టిన చరిత్ర లేదు. మంచి మంచి దిగ్గజాలకు కూడా ఇక్కడ రెండోసారి ఓటమి తప్పలేదు.వరంగల్ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంగా రూపాంతరం చెందింది. 2009లో అప్పటి మాజీ మంత్రి బస్వరాజు సారయ్య ఇక్కడి నుండి గెలుపొందారు. నియోజకవర్గం పునర్విభజనకు ముందు వరుసగా మూడు పర్యాయాలు గెలిచిన ఆయన, 2014 ఎన్నికల్లో కొండా సురేఖ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బస్వరాజు సారయ్య కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఊహించని పరిణామాలు నేపథ్యంలో 2018 ఎన్నికల్లో కొండా సురేఖకు టిక్కెట్ దక్కలేదు. దీంతో బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ లో చేరారు కొండా సురేఖ దంపతలు.. ఏకంగా ఈ నియోకవర్గాన్నే వదిలి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2018 లో పరకాల నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే 2009 నుంచి ఇప్పటి వరకు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచినవారు లేరు. ఇక, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్ ఇక్కడి నుండి గెలుపొందారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నరేందర్ తిరిగి మళ్లీ అధికార బీఆర్ఎస్ పార్టీ నుండి టిక్కెట్ సాధించి బరిలోకి దిగారు. ఆయనపై సొంత పార్టీలోనే ఇప్పుడు తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవడం ఓరుగల్లు హాట్ టాపిక్ గా మారింది. మళ్ళీ చరిత్ర రిపీట్ అవుతుందా. అనే చర్చ జరుగుతుంది. వరంగల్ తూర్పులో కొనసాగుతున్న చరిత్ర రిపీట్ అవుతుందా. సిట్టింగ్ ఎమ్మెల్యే నరేందర్ ఆ చరిత్ర ను తిరగ రాస్తారా. అనే చర్చ ఇప్పుడు ఓరుగల్లు వాసుల్లో హాట్ టాపిక్గా మారింది. -
మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోండి..
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న రూ.6,756.92 కోట్ల విద్యుత్ బకాయిల వివాదంలో కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. 30 రోజుల్లోగా ఏపీకి రూ.6,756.92 కోట్లు (అసలు 3,441.78 కోట్లు, వడ్డీ, సర్చార్జీలు కలిపి మరో రూ.3,315.14 కోట్లు) చెల్లించాలంటూ 2022, ఆగస్టు 29న కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నోటీసులను కొట్టివేసింది. ఇరు రాష్ట్రాలు మధ్యవర్తిత్వం ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం, విద్యుత్ పంపిణీ సంస్థలు.. అలాగే ఏపీ ప్రభుత్వం, విద్యుదుత్పత్తి సంస్థలు మధ్యవర్తిత్వం ద్వారా సామరస్యపూర్వకంగా ఈ అంశాన్ని పరిష్కరించుకుంటాయని ఆశిస్తున్నట్లు పేర్కొంది. చట్టప్రకారం అందుబాటులో ఉన్న పరిష్కారాన్ని ఆశ్రయించే స్వే చ్ఛను ఇరు పక్షాలకు ఇస్తున్నామంది. తెలంగాణ వాదన కూడా వినకుండా కేంద్రం నోటీసులు జారీచేయడాన్ని తప్పుబట్టింది. వివాదం ఏంటంటే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏపీ జెన్కో/ట్రాన్స్కో/డిస్కమ్లు 2000 నుంచి 2013 వరకు పలు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు) చేసుకున్నాయి. ఇవి రాష్ట్ర విభజన తర్వాత 2019 వరకు కొనసాగాయి. విభజన తర్వాత కేంద్రం ఆదేశాల మేరకు 2014 నుంచి 2017 వరకు తెలంగాణకు ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలు విద్యుత్ సరఫరా చేశాయి. దీనికైన మొత్తాన్ని చెల్లించాలని ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలు కొన్నేళ్లుగా కోరుతున్నాయి. ఈ వివాదం కేంద్రం వద్దకు చేరడంతో రూ.6,756.92 కోట్ల బకాయిలను ఏపీకి చెల్లించాలని తెలంగాణకు విభజన చట్టం సెక్షన్ 92 కింద నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను సవాల్ చేస్తూ తెలంగాణ డిస్కంలు, తెలంగాణ సర్కార్ 2022 సెప్టెంబర్లో తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. అలాగే ఆర్బీఐలోనే తమ రాష్ట్ర ఖాతా నుంచి బకాయి మొత్తాన్ని మినహాయించుకొని ఆంధ్రప్రదేశ్కు చెల్లించే ప్రయత్నం కేంద్రం చేస్తున్నట్లు తెలిసిందని.. దీనిపై నిర్ణయం తీసుకోకుండా ఆదేశాలివ్వాలని తెలంగాణ సర్కార్ కోరింది. దీనిపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ ధర్మాసనం రెండు వారాల క్రితం తీర్పును రిజర్వు చేసి.. గురువారం తుది ఉత్తర్వులు వెలువరించింది. కేంద్రం వైఖరి సమంజసం కాదు: తెలంగాణ తెలంగాణ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం కారణంగా ఉత్పన్నమయ్యే సమస్యలపై ముందుగా చర్చించాలని చెప్పారు. దీనిపై పూర్తిగా చర్చించకపోవడంతోనే సమస్య ఉత్పన్నమవుతోందన్నారు. కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులు ఏపీకి అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో పునర్వ్యవస్థీకరణ చట్టం నుంచి ఉత్పన్నమయ్యే సమస్యలు ఇంకా పెండింగ్లో ఉన్నప్పుడు, కేంద్రం ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదని చెప్పారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 92 ప్రకారం ఈ వివాదంలో జోక్యం చేసుకునే అధికారం కేంద్రానికి లేదన్నారు. బకాయిలు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో డిస్కంలు: ఏపీ తెలంగాణ పెద్ద మొత్తంలో పేరుకుపోయిన బకాయిలు చెల్లించకపోవడంతో ఏపీ డిస్కంలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఏపీ విద్యుదుత్పత్తి సంస్థ తరఫు సీనియర్ న్యాయవాది సీవీ మోహన్రెడ్డి వాదించారు. మౌలిక వసతుల కల్పన కోసం ఏపీ డిస్కంలు ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకున్నాయన్నారు. విభజన తర్వాత విద్యుదుత్పత్తి, సరఫరా చేసినందుకు ఈ బకాయిలు చెల్లించాల్సి ఉందని, దీనికీ.. పునర్వ్యవస్థీకరణ చట్టానికీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. కేంద్రం ఆదేశాల మేరకు విభజన తర్వాత 2017 వరకు ఏపీ డిస్కంలు విద్యుత్ సరఫరా చేస్తూనే ఉన్నాయన్నారు. బకాయిలు చెల్లించపోవడంతో బొగ్గు సరఫరా నిలిచిపోయిందని, దీంతో తెలంగాణకు విద్యుత్ నిలిపివేసినట్లు వెల్లడించారు. ఇరు రాష్ట్రాలు అంగీకరించిన తర్వాతే కేంద్రం నోటీసులు జారీ చేసిందన్నారు. బకాయి ఉన్న విషయాన్ని తెలంగాణ కూడా అంగీకరిస్తోందని పేర్కొన్నారు. కేంద్రానికి అధికారం ఉంది: ఏఎస్జీ కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) సుందరేశన్ వాదనలు వినిపిస్తూ.. కేంద్రం జోక్యంతోనే తెలంగాణకు ఏపీ విద్యుత్ సరఫరా చేసిందని నివేదించారు. ఈ నేపథ్యంలో బకాయిల చెల్లింపుపై ఉత్తర్వులిచ్చే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని వివరించారు. ఇరు రాష్ట్రాల కార్యదర్శులు హాజరై ఒప్పుకున్న తర్వాతే బకాయిలపై కేంద్రం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఏపీ స్పెషల్ జీపీ గోవింద్రెడ్డి కూడా వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం.. నోటీసులు జారీచేసే అధికారం కేంద్రానికి ఉందా? లేదా? అన్నది తేల్చాల్సిన అవసరం లేదంటూ కేంద్రం ఉత్తర్వులను కొట్టివేసింది. -
డబుల్ మర్డర్ కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సంచలనం సృష్టించిన ఇబ్రహీంపట్నం కాల్పుల కేసులో నిందితులకు యావజ్జీవ శిక్ష విధిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. కర్ణంగూడలోని లేక్విల్లా ఆర్చిడ్స్లో నెలకొన్న భూ వివాదాలపై శ్రీనివాస్రెడ్డి, రాఘవేందర్ రెడ్డిల హత్య కేసులో ప్రధాన నిందితుడు మేరెడ్డి మట్టారెడ్డితో పాటుగా ఖాజా మొయినోద్దీన్ , భిక్షపతిలకు రంగారెడ్డి కోర్టు జీవిత ఖైదు విధించింది. కర్ణంగూడ గ్రామ సమీపంలో ఇద్దరు భాగస్వాములైన రియల్ ఎస్టేట్ వ్యాపారులు శ్రీనివాస్రెడ్డి, కోమటిరెడ్డి రాఘవేందర్రెడ్డిలు 10 ఎకరాల భూమి కొన్నారు. కానీ అప్పటికే ఆ భూమి తనదేనంటూ మట్టారెడ్డి దాన్ని కబ్జా చేశారు. ఈ విషయంలో వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శ్రీనివాస్ రెడ్డి మరో వ్యక్తితో కలిసి సైట్ వద్దకు వెళ్లగా, అక్కడే ఉన్న మట్టారెడ్డితో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో 2022 మార్చి 1, మంగళవారం ఉదయం మట్టారెడ్డి ఇతరులతో కలిసి శ్రీనివాస్రెడ్డి, రాఘవేందర్రెడ్డిపై కాల్పులు జరిపారు. శ్రీనివాస్ అక్కడికక్కడే చనిపోగా, రాఘవేందర్రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. హత్య అనంతరం మృతుల రెండు కుటుంబాల వారు కూడా మట్టారెడ్డిపైనే అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులకు విచారణ మరింత సులువు అయ్యింది. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ జరపగా మట్టారెడ్డే సుపారీ గ్యాంగ్తో ఈ హత్యలు చేయించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కర్ణంగూడలోని లేక్ విల్లా ఆర్చిడ్స్ లో నెలకొన్న భూ వివాదం ఈ హత్యలకు కారణమైంది. దీంతో శ్రీనివాస్రెడ్డి, రాఘవేందర్రెడ్డిలను హత్య చేయాలని సుఫారీ ఇచ్చి మట్టారెడ్డి ప్లాన్ చేశారు. వివాదంలో ఉన్న భూమి వద్దకు వచ్చిన శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలపై కాల్పులకు దిగి హత్య చేశారు నిందితులు. ఈ కేసులో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అప్పటి ఇబ్రహీం పట్నం ఏసీపీ బాలకృష్ణ రెడ్డిపై పోలీస్ శాఖ విధుల నుండి తప్పించి శాఖపరమైన చర్యలు తీసుకుంది. చదవండి: ‘మణప్పురం’లో బంగారం మాయం -
స్వలింగ జంటల వివాహంపై సుప్రీంకోర్టు తీర్పు
ఢిల్లీ: కొంతకాలంగా ఉత్కంఠ రేపుతోన్న స్వలింగ వివాహాల చట్టబద్దతపై రెడ్ సిగ్నల్ ఇస్తూ సుప్రీంకోర్టు మంగళవారం తుది తీర్పు వెలువరించింది. స్వలింగ సంపర్కాలపై భిన్నాభిప్రాయాలున్నాయన్న సీజేఐ చంద్రచూడ్.. స్వలింగ వివాహనికి చట్టబద్దత కల్పించలేమని తెలిపారు. స్వలింగ వివాహం చేసుకున్న వారిని దంపతులుగా గుర్తించలేమని స్పష్టం చేశారు. వివాహం చేసుకోవడం ప్రాధమిక హక్కు కాదని తీర్పులో పేర్కొన్నారు. ఈ కేసుపై పార్లమెంటే నిర్ణయం తీసుకోవాలని తెలిపిన సీజేఐ.. అది న్యాయ సమీక్షకు లోబడి ఉండాలని తీర్పులో పేర్కొన్నారు. ఈ మేరకు 3:2 మెజారిటీతో రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. 'స్వలింగ వివాహనికి చట్టబద్దత కల్పించలేం. స్వలింగ వివాహం చేసుకున్న వారిని దంపతులుగా గుర్తించం. వివాహం చేసుకోవడం ప్రాధమిక హక్కు కాదు. కలిసి జీవించడం గుర్తిస్తున్నాం.. కానీ దాన్ని వివాహంగా పరిగణించలేం. స్వలింగ సంపర్కులను దంపతులుగా గుర్తించలేము. స్వలింగ జంటల అభ్యర్ధనల పట్ల సానుభూతి ఉంది కాని అభ్యర్ధనలకు చట్టబద్ధత లేదు. ప్రత్యేక వివాహ చట్టం లో మార్పు చేయాలా వద్దా అనేది పార్లమెంటు నిర్ణయిస్తుంది. శాసన వ్యవస్థలో జోక్యం చేసుకోలేం. ప్రత్యేక వివాహ చట్టాన్ని రద్దు చేయలేం. వివాహ వ్యవస్థకు సంబందించిన నిర్ణయాలు పార్లమెంట్ మాత్రమే చేయగలదు.' అని సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొంది. 'ప్రేమ అనేది మానవత్వ లక్షణం. వివాహ హక్కుల నిర్ధారణకూ ప్రభుత్వం కమిటీ వేయాలి. ప్రతి ఒక్కరికి తమ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే హక్కు ఉంటుంది. అసహజ వ్యక్తుల హక్కులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు,కేంద్రపాలిత ప్రాంతాలు వివక్ష చూపకూడదు. అసహజ వ్యక్తుల హక్కులు, అర్హతలను నిర్ణయించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందని సొలిసిటర్ జనరల్ ప్రకటనను రికార్డు చేస్తున్నాం. రేషన్ కార్డ్లలో అసహజ జంటలను కుటుంబంగా చేర్చడం, అసహజ జంటలు ఉమ్మడి బ్యాంకు ఖాతా కోసం నామినేట్ చేయడానికి వీలు కల్పించడం, పెన్షన్, గ్రాట్యుటీ మొదలైన వాటి నుంచి వచ్చే హక్కులను కేంద్రం ఏర్పాటు చేసే కమిటీ పరిశీలించాలి.' అని సుప్రీంకోర్టు స్పష్టం తీర్పును వెల్లడించింది. స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్లోని సెక్షన్ 4 రాజ్యాంగ విరుద్ధం అనొచ్చని సీజేఐ చంద్రచుడ్ అన్నారు. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్ ఎస్కే కౌల్, రవీంద్ర భట్, హిమా కోహ్లీ, పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ అంశంపై సుప్రీంకోరు తీర్పును మే 11న రిజర్వ్ చేసింది. తీర్పును రిజర్వ్ చేసిన 5 నెలల తర్వాత సర్వోన్నత న్యాయస్థానం నేడు తీర్పును వెలువరించింది. స్వలింగ సంపర్క వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దాఖలైన 20 పిటిషన్లపై విచారణ పూర్తైన అనంతరం ధర్మాసనం మేలో తీర్పును రిజర్వ్లో ఉంచింది. కాగా, 2018 సెప్టెంబర్లోనే భారత సర్వోన్నత న్యాయస్థానం స్వలింగ సంపర్కం శిక్షార్హం కాదని తేల్చింది. పాతకాలపు చట్టాన్ని పక్కనపెట్టి ఇచ్చిన ఈ సంచలన తీర్పుపై అప్పట్లోనే గగ్గోలు పుట్టింది. సాంస్కృతిక విలువలకు తిలోదకాలిచ్చి, పాశ్చాత్య సంస్కృతిని అలవరుచుకుంటున్నామంటూ విమర్శలు రేగాయి. తీరా స్వలింగ సంపర్కం తప్పు కాదని కోర్టు చెప్పినా తమకు సామాజిక అంగీకారం లభించడం లేదనీ, తమపై దుర్విచక్షణ సాగుతూనే ఉందనీ లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్ల (ఎల్జీబీటీక్యూ) వర్గం ఫిర్యాదు చేస్తోంది. స్వలింగ సంపర్కం నేరం కాదనే దశ నుంచి స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కోరడం దాకా ఇప్పుడు వచ్చింది. హోమో సెక్సువల్ పెళ్ళిళ్ళను చట్టబద్ధమైనవని గుర్తించాలని కోరుతూ, 2020లోనే ఢిల్లీ, కేరళ హైకోర్టుల్లో కొన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. తర్వాత సుప్రీమ్కు పిటిషన్లు చేరాయి. కోర్టు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. మార్చి 13న సుప్రీంకోర్టులో కేంద్రం తన అఫిడవిట్ దాఖలు చేస్తూ, స్వలింగ వివాహాల చట్టబద్ధతకు ససేమిరా అంది. సహజ ప్రకృతికి విరుద్ధంగా జరిపే లైంగిక చర్యలు శిక్షార్హమని భారత శిక్షాస్మృతిలోని 377వ సెక్షన్ మాట. ఆ సెక్షన్ కింద స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించరాదని అయిదేళ్ళ క్రితం తీర్పునిచ్చినంత మాత్రాన ఏకంగా స్వలింగ వివాహాన్ని వివిధ చట్టాల కింద తమ ప్రాథమిక హక్కని పిటిషనర్లు అనుకోరాదని ప్రభుత్వం వెల్లడించింది. స్వలింగ వివాహాలు సమాజంలో కొత్త సమస్యను సృష్టిస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఈ వివాహాలకు గుర్తింపు కల్పించకపోవడం వివక్ష కాదని ప్రభుత్వం వాదించింది. ఇదీ చదవండి: ఢిల్లీ మద్యం కేసు.. నిందితుల జాబితాలో ఆప్! స్వలింగ సంపర్కుల విషయంలో వివిధ దేశాల్లో ఉన్న శిక్షలు/హక్కులు... వాటి వివరాలు.. 1. మరణ శిక్ష 2. జీవితకాల ఖైదు 3. జైలు శిక్ష 4. హక్కులు లేవు 5. చట్టప్రకారం శిక్షలు 6. యూనియన్లకు కలిగి ఉండే హక్కు 7. చట్టప్రకారం వివాహం చేసుకోవచ్చు 8. ఉమ్మడిగా దత్తత తీసుకునే హక్కు -
చంద్రబాబు కస్టడీపై తీర్పు నేటికి వాయిదా
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉన్నందున, ఆయన్ని ఐదు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్లో ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం తన తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది. వాస్తవానికి గురువారమే తీర్పు ఇవ్వాల్సి ఉంది. అయితే, సీఐడీ నమోదు చేసిన కేసులు కొట్టేయాలని, రిమాండ్ సైతం చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పు వెలువరించాల్సి ఉంది. దీంతో ఏసీబీ కోర్టు తన తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది. చంద్రబాబు పిటిషన్పై హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరిస్తే పోలీసు కస్టడీపై తన నిర్ణయాన్ని వాయిదా వేస్తామని, ఒకవేళ హైకోర్టు తీర్పు వెలువరించకుంటే శుక్రవారం ఉదయం 10.30 గంటలకే తీర్పునిస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది. జ్యుడిషియల్ రిమాండ్ ముగింపు గడువు దగ్గర పడుతున్నందున, ఈరోజే కస్టడీ పిటిషన్పై ఉత్తర్వులు జారీ చేయాలని సీఐడీ న్యాయవాదులు పట్టుబట్టారు. చంద్రబాబును ఐదు రోజుల పాటు సీఐడీ కస్టడీకి ఇవ్వాలని కోరామని చెప్పారు. న్యాయస్థానం మాత్రం చంద్రబాబు పిటిషన్ హైకోర్టులో పెండింగ్లో ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. చంద్రబాబు పిటిషన్పై హైకోర్టు శుక్రవారం తీర్పు ఇస్తుందని తాము భావించడంలేదని సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి చెప్పారు. దీనిపై న్యాయస్థానం చంద్రబాబు తరఫు న్యాయవాదుల అభిప్రాయం కోరింది. తీర్పు నేడు ఇవ్వాలా లేక శుక్రవారానికి వాయిదా వేయాలా అన్నది కోర్టు ఇష్టమని చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ తెలిపారు. అనంతరం న్యాయస్థానం స్పందిస్తూ.. శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరిస్తుందేమో చూద్దామని తెలిపింది.ఇదిలా ఉంటే.. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించడంలేదు. శుక్రవారం నాటి హైకోర్టు కేసుల విచారణ జాబితాలో చంద్రబాబు కేసు లిస్ట్ కాలేదు. దీంతో ఏసీబీ కోర్టు శుక్రవారం ఉదయం తన తీర్పును వెలువరించి తీరాల్సి ఉంటుంది. -
సామూహిక అత్యాచారం కేసులో ఇద్దరికి 20 ఏళ్ల జైలు
సాక్షి, అమరావతి/ గుంటూరు లీగల్/నగరంపాలెం: రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన రేపల్లె రైల్వేస్టేషన్లో జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ఇద్దరు ముద్దాయిలకు 20 సంవత్సరాల జైలు శిక్ష, ఒక్కొక్కరికీ రూ.2,500 జరిమానా విధిస్తూ నాలుగో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి ఆర్.శరత్బాబు బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా, యర్రగొండపాలెం మండలం, వెంకటాద్రిపురానికి చెందిన కొర్రపోలు రమేష్ వ్యవసాయ, తాపీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య ఏసమ్మ, ముగ్గురు పిల్లలు సంతానం కాగా, భార్య మళ్లీ గర్భంతో ఉంది. కృష్ణాజిల్లా నాగాయలంకలో కూలి పనులు చేసుకునేందుకు రమేష్ తన భార్య, పిల్లలతో 2022 ఏప్రిల్ 30న గుంటూరులో రైలు ఎక్కి రేపల్లె వెళ్లాడు. అప్పటికి సమయం 11.45 కావడంతో రైల్వేస్టేషన్లోనే తన భార్య, పిల్లలతో రమేష్ నిద్రకు ఉపక్రమించాడు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో పాలుబోయిన విజ యకృష్ణ, పలుచూరి నిఖిల్, మరో మైనర్ బాలు డు మద్యం మత్తులో రైల్వేస్టేషన్లోకి వచ్చారు. అక్కడ భార్య,పిల్లలతో నిద్రిస్తున్న రమేష్ను నిఖిల్ నిద్రలేపి టైం అడిగాడు. టైం చెప్పకపోవడంతో రమేష్ను కొట్టడం ప్రారంభించాడు. దీంతో రమేష్ స్టేషన్ బయటకు పరుగెత్తాడు. అక్కడే ఉన్న రమేష్ భార్యపై విజయకృష్ణ లైంగికదాడికి పాల్పడ్డాడు. రమేష్ పోలీసుస్టేషన్కు వెళ్లి పోలీసులను తీసుకొచ్చేసరికి నిందితులు పారిపోయారు. నిందితులు తన భార్యపై సామూహిక అత్యాచారం చేసినట్లు రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రేపల్లె డీఎస్పీ టి.మురళీకృష్ణ, దిశ డీఎస్పీ యు.రవిచంద్ర దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పీపీ శారదమణి వాదించారు. ఈ కేసులో మూడో ముద్దాయి మైనర్ కావడంతో తెనాలి పోక్సో కోర్టులో విచారణ జరుగుతుంది. సత్ఫలితాలనిస్తున్న కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ అత్యాచార కేసుల్లో దోషులకు సత్వరం శిక్షలు విధించేలా పోలీసు శాఖ కోర్ట్ ట్రయల్ మానిటరింగ్ విధానాన్ని సమర్థంగా అమలు చేస్తున్నదని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. బాపట్ల జిల్లా రేపల్లె రైల్వేస్టేషన్లో గతేడాది ఓ మహిళపై అత్యాచారం చేసిన కేసులో పాలుబోయిన విజయకృష్ణ, పాలుచురి నిఖిల్ను దోషులుగా గుర్తిస్తూ న్యాయస్థానం 20 ఏళ్లు జైలు శిక్ష విధించడం కేసు దర్యాప్తులో పోలీసుల సమర్థతకు నిదర్శనమన్నారు. కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ ద్వారా గతేడాది కాలంగా గుర్తించిన 122 కేసుల్లో 102 కేసుల్లో దోషులకు శిక్షలు పడ్డాయన్నారు. ముగ్గురికి మరణశిక్ష, 37మందికి జీవిత ఖైదు, 62 కేసుల్లో 7 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడిందన్నారు. ఈ తీర్పు ఓ గుణపాఠం.. రేపల్లె రైల్వేస్టేషన్లో జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ఇచ్చిన తీర్పు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి ఓ గుణపాఠమని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్జిందాల్ తెలిపారు. గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని స్పందన హాల్లో బుధవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు బాధితురాలికి తక్షణ సాయంగా రూ.10 లక్షలు, ఎస్సి, ఎస్టి కేసు కింద రూ.8.50 లక్షలు, ఎంపీ, ఎమ్మెల్యే నుంచి రూ.1.50 లక్షలు అందజేసినట్లు చెప్పారు. కాగా, ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు వేగవంతం చేసి, నిందితులకు శిక్షలు పడే వరకు ప్రతిభ కనబరిచిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శారదామణి, డిప్యూటీ డైరెక్టర్ ప్రాసిక్యూషన్ మధుసూదనరావు, తదితర పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించి, ప్రశంసాపత్రాలు, రివార్డులు అందజేశారు. -
సుప్రీం తీర్పు నేపథ్యంలో రాహుల్ గాంధీకి లాలూ డిన్నర్ పార్టీ
న్యూఢిల్లీ: ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న తర్వాత ఆరోగ్యం మెరుగై రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. తాజాగా మోదీ ఇంటి పేరు వివాదంలో సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చి రాహుల్ గాంధీకి ఊరటనివ్వడంతో లాలూ రాహుల్ గాంధీని తాను ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకు ఆహ్యానించారు. విందులో బీహార్ స్పెషల్ చంపారన్ మటన్ తెప్పించి స్వయంగా తానే వండి వడ్డించారు. రాహల్ గాంధీపై నమోదైన పరువు నష్టం కేసులో అమలు కావాల్సిన శిక్షపై సుప్రీం కోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా రాష్ట్రీయ జనతా దళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఈ విందుకు హాజరైన రాహుల్ గాంధీని లాలూ మొదట పుష్పగుచ్ఛమిచ్చి అభినందించి ఆలింగనం చేసుకున్నారు. అనంతరం కొద్దిసేపు రాజకేయాలు మాట్లాడుకుని తర్వాత ఇద్దరూ విందులో పాల్గొన్నారు. విందులో రాహుల్ కోసం లాలూ స్వయంగా మటన్ వండటం విశేషం. లాలూ చేసిన ప్రత్యేక వంటకాన్ని రాహుల్ చాలా ఆస్వాదించారు. దీని కోసం లాలూ బీహార్ నుండి ప్రత్యేకంగా చంపారన్ దేశీయ మటన్ తెప్పించి బీహార్ స్టైల్లో దాన్ని తానే స్వయంగా వండారు. రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టు భారీ ఉపశమనం ఇవ్వడంతో ఆయన పార్లమెంటులో తిరిగి అడుగు పెట్టడానికి మార్గం సుగమమైంది. అయితే దానికి ఎంత సమయం పడుతుంది, ప్రభుత్వంపై జరగనున్న అవిశ్వాస తీర్మానంపై చర్చలో ఆయన పాల్గొంటారా లేదా అన్నదే తేలాల్సి ఉంది. మోదీ ఇంటిపేరు వివాదంలో రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించి పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు వేస్తూ సూరత్ ట్రయల్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును ఆయన సుప్రీం కోర్టులో సవాల్ చేయగా అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పుపై స్టే విధించింది. आज @RahulGandhi जी ने RJD अध्यक्ष @laluprasadrjd जी से उनके दिल्ली स्थित निवास पर मुलाकात की। pic.twitter.com/NMXa4jP8hi — Congress (@INCIndia) August 4, 2023 ఇది కూడా చదవండి: కాశ్మీర్లో ఉగ్రవాదుల ఘాతుకం.. ముగ్గురు భారత సైనికులు మృతి -
రాహుల్ వ్యాఖ్యలు తప్పే కానీ.. తీర్పులో ఏముందంటే..?
ఢిల్లీ: మోదీ ఇంటిపేరు వ్యాఖ్యల పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి ఊరట లభించిన విషయం తెలిసిందే. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. అయితే.. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పులో ఏం చెప్పిందంటే.. 'దొంగలందరికీ మోదీ ఇంటి పేరే ఎందుకుంటుందని' రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. బహిరంగంగా మాట్లాడేప్పుడు జాగ్రత్తగా ఉండాలని హితువు పలికింది. కానీ పార్లమెంట్ పదవికి రద్దు చేయడం వంటి చర్యలు వ్యక్తి హక్కుకు భంగపరచడమే గాక.. ఎన్నికలపై ప్రభావం పడుతుందని పేర్కొంది. అయితే పరువు నష్టం కేసులో ట్రయల్ కోర్టు రాహుల్ గాంధీకి గరిష్ఠంగా రెండేళ్ల జైలు శిక్షను విధించింది. దీని కారణంగా రాహుల్ గాంధీ తన పార్లమెంట్ సభ్యత్వానికి దూరమయ్యారు. దీనిపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇంతటి గరిష్ఠ శిక్ష విధించడానికి ట్రయల్ కోర్టు ఎలాంటి సరైన కారణం ఇవ్వలేదని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. కాగా.. తుది తీర్పు పెండింగ్లో ఉన్నందున ట్రయల్ కోర్టు తీర్పుపై స్టే విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. కర్ణాటకలో జరిగిన ఓ ఎన్నికల సభలో రాహుల్ మాట్లాడుతూ..‘దొంగలందరికీ మోదీ ఇంటి పేరే ఎందుకుంటుందని వ్యాఖ్యానించారు. దీనిపై గుజరాత్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారించిన సూరత్ కోర్టు మార్చి 23న రాహుల్ గాంధీకి రెండేళ్ల శిక్ష విధించింది. ఫలితంగా ప్రాతినిధ్య చట్టం కింద మార్చి 24న లోక్సభలో అనర్హుడిగా ప్రకటించడంతో వయనాడ్ ఎంపీ పదవి కోల్పోయారు. సూరత్ కోర్టు విధించిన శిక్షపై రాహుల్ హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టులో ఊరట దక్కపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదీ చదవండి: రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. రెండేళ్ల జైలు శిక్షపై స్టే -
ఆర్-5 జోన్ ఇళ్ల నిర్మాణాలపై న్యాయపోరాటమే!
సాక్షి, గుంటూరు: పేదల ఇళ్ల నిర్మాణంపై న్యాయపోరాటం చేయాలనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఆర్-5 జోన్ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఇవాళ ఏపీ హైకోర్టు వెల్లడించిన తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రాజకీయ కుట్రలు, కోర్టు కేసుల ఆటంకాలు దాటుకుని ఇటీవలే అమరావతిలోని ఆర్-5 జోన్లో సీఎం జగన్ చేతుల మీదుగా పట్టాలు అందజేయించి మరీ ఇళ్ల నిర్మాణం ప్రారంభించింది ప్రభుత్వం. అయితే ఇళ్ల నిర్మాణాన్ని ఆపేలా కుట్రపూరితంగా కొన్ని వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో గురువారం హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇళ్ల నిర్మాణాలు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. స్టే ద్వారా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏపీ హైకోర్టు విధించిన స్టేను జగన్ సర్కార్ సవాల్ చేయనుంది. -
అటు వనమా.. ఇటు జలగం..
సాక్షి, హైదరాబాద్: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్రావు ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చి న తీర్పుతో బీఆర్ఎస్లో వింత పరిస్థితి నెలకొంది. మూడు రోజుల క్రితం ఇ చ్చి న తీర్పుపై వనమా చే సుకున్న అప్పీల్ను హైకోర్టు కొట్టివేయడంతో జల గం వెంకట్రావు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని వనమా చెప్తుండగా, హైకో ర్టు తీర్పును అమలు చేయాలని జలగం కోరుతున్నారు. ఈ మేరకు ఆయన హైకోర్టు తీర్పు ప్రతిని బుధవారం అసెంబ్లీ కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి కూడా అందజేసిన విషయం తెలిసిందే. జలగంకు అనుకూలంగా హైకోర్టు ఇచ్చి న తీర్పుపై అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం, ఎన్నికల కమిషన్ ఎప్పటిలోగా, ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇద్దరు నేతలూ బీఆర్ఎస్లోనే.. కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2018లో బీఆర్ఎస్ నుంచి జలగం వెంకట్రావు, కాంగ్రెస్ నుంచి వనమా వెంకటేశ్వర్రావు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన వనమా ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం వనమా, జలగం.. ఇద్దరూ ఒకే పార్టీలో కొనసాగుతున్నారు. జలగం బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నా అధికారిక కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటూ వస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ నేపథ్యంలో 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ తరపున గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావు గుర్తింపు పొందారు. ప్రస్తుతం కోర్టు తీర్పు మేరకు తాను ఎమ్మెల్యేగా పదవి స్వీకరించినా బీఆర్ఎస్లోనే కొనసాగుతానని జలగం ప్రకటించారు. అయితే ఈ అంశంపై బీఆర్ఎస్ నుంచి అధికారికంగా ఎలాంటి స్పందన వెలువడలేదు. కోర్టు తీర్పు నేపథ్యంలో సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం జలగం ప్రయతి్నంచినట్లు తెలుస్తోంది. అయితే పార్టీ పూర్తిగా తమ వెంటే ఉందని వనమా వర్గీయులు ‘సాక్షి’తో అన్నారు. జలగం ప్రమాణ స్వీకారంపై స్పష్టత వ చ్చి న తర్వాతే స్పందించాలని బీఆర్ఎస్ అధినేత భావిస్తున్నట్లు తెలిసింది. వనమాపై ఐదేళ్ల నిషేధం నేపథ్యంలో.. వనమా ఎన్నిక చెల్లదని తీర్పుని చ్చి న హైకోర్టు ఆయన ఐదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది. దీంతో వచ్చే ఎన్నికల్లోనూ తనకు బీఆర్ఎస్ టికెట్ లభిస్తుందని జలగం భావిస్తున్నారు. మరోవైపు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్రావు కూడా కొత్తగూడెం బీఆర్ఎస్ టికెట్ను ఆశిస్తున్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కొత్తగూడెం రాజకీయాలతో బీఆర్ఎస్లో వింత స్థితి నెలకొందని పరిశీలకులు అంటున్నారు. -
గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదురు
సాక్షి, ఢిల్లీ: గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదురయింది. పరువు నష్టం కేసులో గుజరాత్ హైకోర్టు శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. సూరత్ ట్రయల్ కోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ కేసులో స్టే ఇవ్వడానికి తగిన కారణాలు కనిపించలేదని హైకోర్టు పేర్కొంది. "దొంగలందరి ఇంటిపేరు మోదీయే" అంటూ వ్యాఖ్యానించిన కేసులో తనకు శిక్ష నిలుపుదల చేయాలని రాహుల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ట్రయల్ కోర్టు.. రెండేళ్ల జైలు శిక్ష విధించగా, ఈ తీర్పును రాహుల్.. హైకోర్టులో సవాలు చేశారు. మే 2న విచారణ పూర్తి చేసిన గుజరాత్ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ హైకోర్టు ఇవాళ తీర్పునిచ్చింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు న్యాయబద్ధంగానే ఉందన్న జడ్జి.. రాహుల్ పిటిషన్ను కొట్టేశారు. సావర్కర్ను కించపరిచారని ఆయన మనవడు వేసిన పిటిషన్ను ప్రస్తావించిన న్యాయస్థానం.. రాహుల్పై 10 పరువు నష్టం కేసులు పెండింగ్లో ఉన్నాయని గుర్తు చేసింది. 2019 లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటకలోని కోలార్లో నిర్వహించిన ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఇంటి పేరును ఉద్దేశిస్తూ.. ‘దొంగలందరి ఇంటిపేరు మోదీయే’ ఎందుకంటూ.. ప్రశ్నించారు. చదవండి: ఛత్తీస్గఢ్లో రెండోసారి కూడా కాంగ్రెస్సేనా?.. ఆ సర్వే రిపోర్ట్ ఏం చెబుతోంది? రాహుల్ వ్యాఖ్యలపై అభ్యంతం వ్యక్తం చేసిన గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ సూరత్ కోర్టులో పరువునష్టం దావావేశారు. దీనిపై న్యాయస్థానం విచారణ జరిపింది. తాను ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని రాహుల్ తన వాదనను వినిపించారు. విచారణ అనంతరం కోర్టు.. ఈ ఏడాది మార్చి 23న ఆయనను దోషిగా తేల్చుతూ రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. -
సెంథిల్ బాలాజీ విడుదలపై మద్రాస్ హైకోర్టు భిన్న తీర్పులు..
సాక్షి, చెన్నై: తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ విడుదలకు సంబంధించి మద్రాసు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్నమైన తీర్పులు ఇచ్చింది. మంత్రిని విడుదల చేయాలని జస్టిస్ నిషా భాను నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు చెప్పగా.. సెంథిల్ను విడుదల చేయకూడదని జస్టిస్ భరత చక్రవర్తి భిన్నంగా మరో తీర్పును వెలువరించారు. దీంతో ఈ కేసును మద్రాసు కోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్ విచారణ జరపనుంది. 'ఈడీకి అధికారం లేదు..' మనీ లాండరింగ్ కేసులో పోలీసు కస్టడీని కోరే అధికారం ఈడీకి ఉండదని జస్టిస్ నిషా భాను ధర్మాసనం తెలిపింది. కావున సెంథిల్ బాలాజీ భార్య మేఘాలా దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ చెల్లుబాటు అవుతుందని చెప్పారు. అంతేకాకుండా సెంథిల్ ఆస్పత్రిలో ఉన్న వ్యవధిని కస్టోడియల్ గడువు నుంచి మినహాయించాలని ఈడీ దాఖలు చేసిన పిటిషన్ను తోసిపుచ్చింది. భిన్నమైన తీర్పు.. జస్టిస్ నిషా భాను ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు పూర్తి విరుద్ధంగా జస్టిస్ భరత చక్రవర్తి తీర్పును వెలువరించారు. మేఘాలా దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ చెల్లుబాటు కాదని ధర్మాసనం తెలిపింది. కేవలం అరెస్టు, నిర్బంధం చట్టవిరుద్ధమని చూపితే తప్పా హెబియస్ కార్పస్ చెల్లుబాటు కాదని వెల్లడించారు. అంతేకాకుండా కస్టోడియల్ గడువును కూడా పెంచుతున్నట్లు తీర్పును వెలువరించారు. ఆరోగ్యం బాగా లేని కారణంగా ఒక్కరోజు కూడా ఈడీ విచారణలో సెంథిల్ గడపనందున జూన్ 14 నుంచి ఇప్పటివరకు కస్టోడియల్ గడువును మినహాయింపునిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. సెంథిల్ బాలాజీ అరెస్టులో ఈడీ చట్టపరమైన విధివిధానాలు పాటించలేదని మేఘాలా కోర్టుకు విన్నవించారు. సెషన్స్ కోర్టు ఇచ్చిన కస్టడీ గడువు తాత్కాలికమైనదని ధర్మాసనానికి తెలిపారు. దీనిపై స్పందించిన ఈడీ తరుపు న్యాయవాదులు.. అరెస్టుకు సంబంధించిన పంచనామాను సెంథిల్ బాలాజీ స్వీకరించలేదని తెలిపారు. సెషన్ కోర్టు రిమాండ్ ఇచ్చే క్రమంలోనే అరెస్టుకు సంబంధించిన కారణాలను సెంథిల్ బాలాజీకి వివరంగా తెలిపారని వెల్లడించారు. మంత్రి సెంథిల్ బాలాజీ అరెస్టు అక్రమమంటూ ఆయన భార్య మేఘలా జూన్ 14న హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేస్తూ కోర్టు మెట్లెక్కారు. అనారోగ్యం కారణంగా సెంథిల్ బాలాజీని కావేరీ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. అయితే.. ఈడీ దర్యాప్తు నిమిత్తం సెంథిల్ బాలాజీకి సెషన్స్ కోర్టు 8 రోజుల కస్టడీని విధించింది. ఇదీ చదవండి: పురుషులకు జాతీయ కమిషన్.. పిల్ కొట్టేసిన సుప్రీంకోర్టు -
ఎల్లో మీడియాకు హైకోర్టు దిమ్మదిరిగే గుణపాఠం.. ఆ కుట్రకు గండి పడిందా?
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎమ్ లక్ష్మీణ్ ఇచ్చిన తీర్పు మీడియాకు ఒక గుణపాఠం అని చెప్పాలి. జస్టిస్ను ఈ సందర్భంగా అభినందించాలి. అవినాష్కు బెయిల్ ఇవ్వడం, ఇవ్వకపోవడం కాదు ఇక్కడ ఇష్యూ. తనను ప్రభావితం చేయాలని ప్రయత్నించిన మీడియాకు ఆయన దిమ్మదిరిగే సమాధానం ఇచ్చారు. తనను భయపెట్టాలని అనుకున్న మీడియాకు ఆయన తనేమిటో తెలియచెప్పారని అనుకోవచ్చు. న్యాయ వ్యవస్థకు సంబంధించి కొంత సంయమనం అవసరం. అలాగనీ న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులపై విశ్లేషణ చేయరాదని కాదు. జనాన్ని నమ్మించాలని చూశారు.. కానీ.. అందులో తప్పుఒప్పుల గురించి మాట్లాడుకోరాదని కాదు. కాని గౌరవ న్యాయమూర్తిపై దురుద్దేశాలు ఆపాదించకూడదు. అభియోగాలు చేయరాదు. అవినాష్ రెడ్డిని సీబిఐ అరెస్టు చేయడానికి యత్నించిందన్న సన్నివేశం సమయంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి 5 వంటి మీడియా సంస్థలు చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. ఏకంగా అవినాశ్ ను హెలికాప్టర్లో ఈ మీడియా తరలించేసింది. ఈ మీడియా సీఆర్ పిఎఫ్ దళాలను కూడా తెచ్చేసింది. అవినాష్ తల్లి చికిత్స పొందుతున్న ఆస్పత్రిలో ఏమి జరుగుతుందో శోధించడానికి వీరు చేయని అకృత్యాలు లేవు. ఇంకేముంది అవినాశ్ అరెస్టు ఖాయం అని వారు నమ్మారో లేదో కాని, జనాన్ని నమ్మించాలని చూశారు. కాని వారు అనుకున్నదానికి రివర్స్లో కేసు సాగడంతో ఏకంగా న్యాయమూర్తిపై దాడికి దిగారు. అలా చేయకుండా.. అదేదో.. ఒక సస్పెండెడ్ మెజిస్ట్రేట్ను కూర్చోబెట్టి చండాలపు ఆరోపణలు చేయించారు. ఆ టివీలో చర్చ చూస్తే అదంతా మాచ్ ఫిక్సింగ్ ప్రకారమే హైకోర్టు న్యాయమూర్తిపై ఆరోపణలు చేయించినట్లు కనిపిస్తుంది. నిజానికి అలాంటి అభ్యంతర వ్యాఖ్యలు చేస్తే వెంటనే సంబంధిత చానల్ వారు వెంటనే నిలుపుదల చేయడం, క్షమాపణ చెప్పించడం, తాము కూడా క్షమాపణ చెప్పడం చేయాలి. అలా చేయకుండా, అదేదో తమ చానల్కు సంబంధం లేని వ్యవహారంగా వదలివేశారు. చట్టం ప్రకారం న్యాయమూర్తులపై సంచులు వెళ్లాయి అంటూ ఆరోపణలు చేయడం ఎంత తప్పో, వాటిని ప్రచారం చేయడం కూడా అంతే తప్పు అవుతుంది. ఎవరూ చట్టానికి అతీతులు కారు.. కాని గత నాలుగేళ్లుగా న్యాయ వ్యవస్థతో తమ ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటున్న ఈ మీడియా సంస్థలు అహంకారానికి ప్రతిరూపంగా మారిపోయాయి. తాము ఏమి చేసినా ఎదురులేదన్న చందంగా మారాయి. తమకు న్యాయ వ్యవస్థలో ఎవరో పెద్ద స్థాయిలో ఉన్నవారితో పరిచయం ఉందన్న అతిశయంతో వారు చెలరేగిపోయారు. నిజానికి ఈ మీడియావారికి పరిచయం ఉన్నంతమాత్రాన గౌరవ జడ్జిలు వారికి అనుకూలంగా ఉంటారని అనుకోజాలం. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉండకుండా ఎందుకు ఉంటారు?. మార్గదర్శి కేసు కూడా ఇందుకు ఒక ఉదాహరణే అవుతుంది. ఆ కంపెనీ డిపాజిట్ల వివరాలన్నిటిని సమర్పించాలని గౌరవ న్యాయస్థానం స్పష్టం చేయడం ద్వారా ఎవరూ చట్టానికి అతీతులు కారని తేల్చింది. ఆ టీవీ సైలెంట్ అయిపోయింది.. గతంలో ఒక కేసులో కొందరికి జైలు శిక్ష పడింది. అలా శిక్ష పడినవారి మహిళా బంధువు ఒకరు సంబంధిత న్యాయాధికారిపై ఆరోపణలు చేస్తూ ఒక టీవీ ముందు మాట్లాడారు. ఆ టీవీవారు తెలిసో, తెలియకో ఒకటికి రెండుసార్లు ప్రసారం చేశారు. దాంతో ఆ న్యాయాధికారి ఆ టీవీవారికి, ఆరోపణ చేసిన మహిళకు నోటీసు జారీ చేసి కేసు చేపట్టారు. ఆ తర్వాత ఆ టీవీ సైలెంట్ అయిపోయింది. ఈ నాలుగేళ్లలో ఏపీలో న్యాయ వ్యవస్థను అడ్డుపెట్టుకుని రెచ్చిపోయిన మాట నిజమే కావచ్చు. ప్రతిదానికి పిల్ రూపంలో కేసులు వేయించడం, వాటిని తమ మీడియాలో ప్రచారం చేయడం, ఎవరైనా గౌరవ న్యాయమూర్తి ప్రభుత్వంపై ఏదైనా కామెంట్ చేస్తే దానిని బ్యానర్ కథనాలుగా చేసి జనంలో పలచన చేయాలని యత్నించారు. ఇటీవల ఏపీ నుంచి సుప్రీంకోర్టు జ్జడి అయిన ఛీప్ జస్టిస్ పి.కె.మిశ్ర ఈ పరిణామాలపై విసుగు చెందారు. సీబీఐ డొల్లతనం.. ప్రశ్నల రూపంలో అసలు ప్రభుత్వం పనిచేసుకోవాలా? వద్దా? ప్రతిదానికి పిల్ వేయడం ఏమిటని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశంకు మద్దతు ఇచ్చే మీడియా సీబిఐలో ఎవరితోనో రహస్య సంబంధాలు పెట్టుకుని ఉన్నవి, లేనివి రాయడం అలవాటు చేసుకున్నారు. ఆ దర్యాప్తు సంస్థకు చెందిన కొందరు అధికారులు తమ చెప్పుచేతలలో ఉన్నట్లుగా ప్రవర్తించిన ఈ మీడియా న్యాయ వ్యవస్థను కూడా అలాగే లొంగదీసుకోవాలని యత్నించి విఫలం అయింది. గౌరవ న్యాయమూర్తి లక్ష్మణ్ మొత్తం కేసును క్షుణ్ణంగా పరిశీలించి అనేక అబ్జర్వేషన్లు చేశారు. కేసు దర్యాప్తు తీరులో సిబిఐ డొల్లతనాన్ని ఆయన ప్రశ్నల రూపంలో బహిర్గతం చేశారు. అలాగని అవినాశ్కు ఏమీ పూర్తి స్థాయి రిలీఫ్ ఇవ్వలేదు. ముందస్తు బెయిల్ ఇచ్చారు తప్ప, ఒకవేళ అవినాశ్ను అరెస్టు చేయదలిస్తే ఐదు లక్షల పూచీకత్తు తీసుకుని బెయిల్ ఇవ్వాలని ఆదేశించారు. మరికొన్ని కండిషన్లు పెట్టారు. అదే టైమ్లో తనపై ముడుపుల ఆరోపణ చేసిన ఏబిఎన్, మహా టీవీలపై చర్య తీసుకునే విషయాన్ని ఛీఫ్ జస్టిస్కు నివేదించారు. ఇంత బేలెన్స్డ్గా వ్యవహరించడం ఆ న్యాయమూర్తి విశిష్టత అని చెప్పాలి. ఆయన కావాలనుకుంటే ఏబిఎన్, మహా టీవీల వారికి వెంటనే నోటీసు ఇచ్చి చర్య తీసుకోవచ్చు. అయినా ఆ పని చేయలేదు. కాని ఈ సందర్భంగా ఆయన కలత పడిన తీరును వివరించారు. ఒక దశలో కేసు నుంచి తప్పుకుందామని అనుకున్న విషయాన్ని కూడా చెప్పారు. ఒకవేళ అలా చేసి ఉంటే ఈ ఎల్లో మీడియా లక్ష్యం నెరవేరినట్లయ్యేది. ఒక చిన్న లాజిక్.. చాలా పెద్ద విషయం.. అందుకే ఆయన పూర్తి స్థాయిలో విచారణ చేశారు. ముందస్తు బెయిల్ కేసులలో ఇంతగా పరిశీలించరట. కాని తనపై టీవీలలో చర్చలు ఇష్టారీతిగా జరిపిన కారణంగా ఆయనకు బాధ్యత ఏర్పడింది. కేసుకు సంబంధించి ఆయన లేవనెత్తిన ఒక చిన్న లాజిక్ చాలా పెద్ద విషయాన్నే తెలియచెప్పింది. సీబిఐ దర్యాప్తులో సహేతుకత కొరవడిన విషయం తేటతెల్లమైంది. వైఎస్ వివేకా హత్య జరిగినట్లు నిందితుడు ఒప్పుకున్నాక, ఆయన శరీరంపై గాయాలు స్పష్టంగా కనబడుతున్న తరుణంలో రక్తం తుడిస్తే ఆధారాలు ఏలా మాయమవుతాయని ఆయన ప్రశ్నించారు. అలాగే వైఎస్ వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి కొన్ని ఆధారాలను దాచిన వైనం గురించి ప్రశ్నించారు. ఒక జర్నలిస్టు ఆసక్తికర విశ్లేషణ.. వివేకాకు ఇంతర మహిళలతో ఉన్న సంబంధాలపై కూడా అడిగారు. వీటిలో అనేకం అవినాశ్ కూడా ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయినా సిబిఐ వాటిని పట్టించుకోకుండా దూకుడుగా ఎవరో ఎజెండా ప్రకారం అవినాశ్ ను ఇబ్బంది పెట్టడానికే అన్నట్లు విచారణ సాగించిందన్న విమర్శలు వచ్చాయి. ఎల్లో మీడియాకు ఈ విషయంలో చాలా పవర్ ఉందన్నది వాస్తవమే. ఎందుకంటే సిబిఐలో చీమ చిటుక్కుమన్నా ఈ మీడియాకు ముందుగానే తెలిసిపోతుండడమే ఇందుకు ఉదాహరణ అవుతుంది. గతంలో సీబిఐ నుంచి సమాచారం రాబట్టాలంటే చాలా కష్టంగా ఉండేది. అలాంటిది వీరికి అంత తేలికగా సమాచారం ఎలా వస్తుందా అన్న సంశయం వస్తుంది. ఇంకో విశేషం ఉంది. సోషల్ మీడియాలో ఒక జర్నలిస్టు ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. టీడీపీ తన పుస్తకంలో ఏమి చెప్పిందో.. సీబీఐ కూడా.. టీడీపీ వివేకా హత్య కేసులో ముఖ్యమంత్రి జగన్ను లాగాలన్న దురుద్దేశంతో వేసిన ఒక పుస్తకంలో ఉన్న అంశాలనే సీబిఐ తన దర్యాప్తులో కొన్ని భాగాలుగా చేసిందని ఆయన చెబుతున్నారు. ప్రత్యేకించి గుండెపోటు, రక్తం తుడువడం మొదలైన విషయాలలో టీడీపీ తన పుస్తకంలో ఏమి చెప్పిందో సిబిఐ తన అభియోగాలలో అదే చెప్పిందట. అందులో నిజం ఉండవచ్చు. లేకపోవచ్చు. కాని అలాంటి అనుమానాలకు ఆస్కారం ఇచ్చి ఉండాల్సిందికాదు. వివేకా కుమార్తె చేస్తున్న ఆరోపణలను విచారించడంతో పాటు అవినాశ్ తదితర వ్యక్తులు చెబుతున్న కోణాలపై కూడా దర్యాప్తు చేసి ఉంటే సీబిఐపై ఇంతగా విమర్శలు వచ్చేవి కావు. చదవండి: Fact Check: పోలవరం పూర్తవుతున్నందుకా.. ఈనాడు ‘రంకెలు’ ఇప్పుడు బ్రేక్ పడిందా? ఈ కేసులో తానే వివేకాను చంపానని చెప్పిన వ్యక్తి అప్రూవర్ అవడం, అతనికి బెయిల్ ఇవ్వడానికి సీబీఐతో పాటు వివేకా కుమార్తె సహకరించడం వంటివి చూస్తే ఇందులో ఏదో మతలబు ఉందన్న అభిప్రాయం కలుగుతుంది. అలాగే హత్య జరిగిన తొలి రోజులలో సునీత మాట్లాడిన తీరుకు, ఇప్పుడు చేస్తున్న ఆరోపణలకు సంబంధం లేకపోవడం కూడా గమనించదగ్గ సంగతే. ఈ కేసును రాజకీయ కుట్రగా చేసేసి చేతులు దులుపుకోవాలని సీబిఐ చేసిన యత్నానికి ఇప్పుడు బ్రేక్ పడిందని అనుకోవచ్చు. నేర్చుకోవలసిన పాఠం ఇదే.. ఈ కేసు ద్వారా నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే సీబిఐ తన ఇష్టం వచ్చినట్లు విచారణ చేస్తే అన్నిసార్లు కుదరదన్నది ఒకటైతే, మీడియా తనతోచిన విధంగా, తాము కోరిన విధంగా ట్రయల్ చేసే తీర్పులు ఇచ్చేస్తే ప్రభావం అవడానికి న్యాయ వ్యవస్థ సిద్దంగా ఉండదని తెలుసుకోవాలి. జస్టిస్ లక్ష్మణ్ న్యాయ వ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టారని చెప్పవచ్చు. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ -
36 వేల టీచర్ల నియామకం రద్దు.. హైకోర్టు సంచలన తీర్పు..
కోల్కతా: పశ్చిమబెంగాల్లో ఏడేళ్ల క్రితం ఉపాధ్యాయ నియా మక ప్రక్రియలో నిబంధనావళి ఉల్లంఘన ద్వారా ఉద్యోగాలు పొందిన 36వేల మంది ఉపాధ్యాయుల నియామకాన్ని రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. 3 నెలల్లోపు ఆ పోస్టులను భర్తీచేయాలని తృణమూల్ కాంగ్రెస్ సర్కార్ను జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. ‘ఇంతటి అవినీతిని పశ్చిమబెంగాల్ లో ఏనాడూ చూడలేదు. ఉద్యోగాలు కోల్పోయిన ప్రైమరీ టీచర్లు 4 నెలలపాటు విధుల్లో కొనసాగవచ్చు. అప్పటిదాకా పారా టీచర్ల స్థాయిలో తక్కువ జీతమే తీసుకోవాలి’ అని జడ్జి జస్టిస్ అభిజిత్ సూచించారు. ‘నాటి రాష్ట్ర ప్రాథమిక విద్యా బోర్డు అధ్యక్షుడు మాణిక్ భట్టాచార్య, బోర్డ్ సభ్యులు ఈ నియామకాల ప్రక్రియను ఒక లోకల్ క్లబ్ మాదిరిగా మార్చే శారు’ అని జడ్జి ఆగ్రహం వ్యక్తంచేశారు. 2016 నాటి బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల కుంభకోణాన్ని కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లు విచారణచేపట్టిన విషయం విదితమే. ‘2016లో రిక్రూట్ అయిన 42,500 మందిలో 36వేల మంది ఆప్టిట్యూట్ పరీక్ష అర్హత లేకుండా, శిక్ష ణ లేకుండా ఉద్యోగాలు పొందారు. అందుకే వీరి నియామకం మాత్రమే రద్ద యింది’ అని ఓ న్యాయవాది చెప్పారు. చదవండి: కేరళలో రూ.12 వేల కోట్ల డ్రగ్స్ పట్టివేత.. సముద్రంలో 134 సంచుల్లో.. -
స్టేల బాబుపై కేఎస్ఆర్ కామెంట్..
-
విధాన పరమైన నిర్ణయాలతో రాష్ట్రానికి నష్టం కలిగిస్తే తప్పే: సజ్జల
-
సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి భారీ విజయం
-
తుని రైలు దగ్ధం కేసు కొట్టివేత
-
రాహుల్ గాంధీ పిటిషన్ పై నేడు సూరత్ కోర్టు తీర్పు
-
TS: హైకోర్టు తీర్పుపై స్పందించిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
సాక్షి, హైదరాబాద్: అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం కేసులో హైకోర్టులో తెలంగాణ సర్కార్కు మళ్లీ చుక్కెదురైంది. సీబీఐ విచారణకే మొగ్గు చూపిస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తీర్పు వెలువరించింది. సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సమయం కోరగా.. అందుకు కూడా హైకోర్టు నిరాకరించింది. దీనిపై ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్పందిస్తూ.. ఎమ్మెల్యేల ఎర కేసులో సీబీఐ విచారణకు సహకరిస్తామని, కేంద్ర దర్యాప్తు సంస్థలకు భయపడం అన్నారు. న్యాయ వ్యవస్థపై తమకు ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను, ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నారని గువ్వల ఆరోపించారు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తామని ఆయన అన్నారు. చదవండి: దమ్ముంటే నన్ను సస్పెండ్ చేయండి.. బీఆర్ఎస్కు పొంగులేటి సవాల్.. -
నోట్ల రద్దుపై తీర్పు వెల్లడించిన సుప్రీం కోర్టు
ఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థించింది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. పెద్ద నోట్ల రద్దులో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రూ.500, రూ.1000 నోట్లు రద్దు చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. మొత్తం అయిదుగురు న్యాయమూర్తులు ఈ కేసును విచారించగా.. నోట్ల రద్దు నిర్ణయాన్ని నలుగురు న్యాయమూర్తులు సమర్థించారు. జస్టిస్ నాగరత్నం మాత్రం తన నిర్ణయాన్ని దీనికి వ్యతిరేకంగా వెలువరించారు. అధికారిక ఉత్తర్వుల ద్వారా కాకుండా పార్లమెంట్ చట్టం ద్వారా నిర్ణయం అమలు చేస్తే బాగుండేది అని తన తీర్పు ప్రతిలో వెల్లడించారు జస్టిస్ నాగరత్నం. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు పార్లమెంటును విస్మరించడం సరైనది కాదని పేర్కొన్నారు జస్టిస్ నాగరత్న. అయితే, మెజార్టీ జడ్జిలు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో నోట్ల రద్దు అంశంలో కేంద్రానికి ఉపశమనం లభించింది. పెద్ద నోట్ల రద్దు అంశంలో కేంద్రం ఉద్దేశమే ముఖ్యమన్న సుప్రీంకోర్టు, ఆ ఉద్దేశాలు నెరవేరలేదన్న కారణంతో నిర్ణయాన్ని కొట్టివేయలేమని తెలిపింది. పూర్తి స్థాయి సంప్రదింపుల తర్వాతే నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. 2016 నవంబర్ 8వ తేదీన కేంద్రం ఇచ్చిన నోట్ల రద్దు నోటిఫికేషన్ సరైందనేనని బెంచ్ స్పష్టం చేసింది. జస్టిస్ నాగరత్న నోట్ల రద్దుకు వ్యతిరేకంగా మొత్తం 58 పిటిషన్లపై విచారణ జరిగింది. జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ నేతృత్వంలో.. బీఆర్ గవాయ్, ఏఎస్ బొప్పన్నా, వీ రామసుబ్రమణియన్, బీవీ నాగరత్నలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే తీర్పుపై స్పందిస్తూ.. ఆర్థిక విధాన అమలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. నోట్ల రద్దుపై కేంద్రం, ఆర్బీఐ సంప్రదింపులు జరిగాయి. అటువంటి చర్యను తీసుకురావడానికి సహేతుకమైన కారణం ఉంది. దామాషా సిద్ధాంతం వల్ల పెద్ద నోట్ల రద్దు జరగలేదని మేము భావిస్తున్నాము అని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే జస్టిస్ గవాయి వెల్లడించిన తీర్పుతో బెంచ్లోని జస్టిస్ నాగర్నత ఒక్కరే విభేధించడం గమనార్హం. నోట్ల రద్దు విషయంలో కేంద్రం వైఖరిని జస్టిస్ నాగరత్న తప్పుపట్టారు. ‘రహస్యంగా చేసిన ఈ చట్టం ఒక ఆర్డినెన్స్. నోట్ల రద్దు విషయంలో ప్రభుత్వం కేవలం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా కాకుండా ప్లీనరీ చట్టం రూపంలో నిర్ణయం వెలువరించాల్సింది’’ అని పేర్కొన్నారు. ఇక.. 2016లో వెయ్యి, 500 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. కేంద్రం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన రికార్డులను అందజేయాలని కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐలను గత డిసెంబరు 7న ఆదేశించింది దేశ అత్యున్నత న్యాయస్థానం. ఆపై ఇరువర్గాల వాడి వేడి విచారణ పూర్తి కావడంతో.. ఇవాళ్టి తుది తీర్పు మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ధర్మాసనం మాత్రం కేంద్రం తీసుకున్న నిర్ణయాన్నే సమర్థించింది. -
'నా భర్త గే.. ఎంత ట్రై చేసినా దగ్గరకు రానివ్వట్లేదు..' కోర్టు కీలక తీర్పు
ముంబై: ప్రభుత్వ ఉద్యోగి అయిన తన భర్త స్వలింగ సంపర్కుడని, ఈ విషయం దాచి తనను పెళ్లి చేసుకున్నాడని ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది. పెళ్లయిన తర్వాత ఆయనకు దగ్గరయ్యేందుకు ఎంత ట్రై చేసినా ఫలితం లేకపోయిందని, ఆయనకు పురుషులతో శారీరక సంబంధాలు ఉన్నాయని చెప్పింది. అంతేగాక తనను శారీరకంగా వేధిస్తున్నాడని, దుర్భాషలాడుతూ తన ఆర్థిక పరిస్థితి, కుటుంబాన్ని కించ పరిచేలా మాట్లాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా కోర్టుకు సమర్పించింది. అయితే వాదనలు విన్న న్యాయస్థానం ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది. గే అని దాచినందుకు ఆమెకు రూ.లక్ష పరిహారంగా ఇవ్వాలని, అలాగే ప్రతి నెల రూ.15వేలు ఆర్థిక సాయం అందించాలని ఆదేశించింది. మెజిస్ట్రేట్ కోర్టు ఈమేరకు తీర్పునిచ్చింది. ఈ తీర్పును ముంబై సెషన్స్ కోర్టులో సవాల్ చేశాడు భర్త. ఆధారాలు పరిశీలించిన న్యాయస్థానం కింది కోర్టు ఇచ్చిన తీర్పునే సమర్థించింది. ఆమెకు రూ.లక్ష, ప్రతి నెల రూ.15 చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ దంపతులకు 2016లో వివాహం జరిగింది. పెళ్లై రోజులు గడుసున్నా ఆమెను అతడు దగ్గరకు రానివ్వలేదు. హింసించడం మొదలుపెట్టాడు. అనుమానంతో అతడ్ని గమనించిన భార్య.. చివరకు గే అని కనిపెట్టింది. ఇతర పురుషులతో అతడు నగ్నంగా దిగిన ఫొటోలోను అతని ఫోన్లో చూసింది. వాటినే కోర్టుకు సాక్ష్యంగా సమర్పించింది. చదవండి: డబ్బు విషయంలో భర్తతో గొడవ.. 8 ఏళ్ల కుమారుడ్ని కాలువలోకి విసిరి.. -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నేడు హైకోర్టు తీర్పు
-
Gyanvapi: వాయిదాతో కొనసాగనున్న ఉత్కంఠ!
వారణాసి: ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఉత్తర ప్రదేశ్ వారణాసి జ్ఞానవాపి కేసులో ఇవాళ(నవంబర్ 8, మంగళవారం) కీలక తీర్పు వెలువడాల్సి ఉంది. అయితే ఈ పిటిషన్లపై తదుపురి విచారణను నవంబర్ 14 తేదీకి వాయిదా వేసింది వారణాసి కోర్టు. మసీదు ప్రాంగణంలో ఉన్న శివలింగాన్ని పూజించేలా అనుమతి ఇవ్వాలని, హిందువులకు ఆ ప్రాంగణం అప్పగించాలని, అలాగే ముస్లింల ప్రవేశాన్ని నిషేధించేలా ఆదేశాలు ఇవ్వాలని.. మొత్తం మూడు డిమాండ్లతో కూడిన హిందువుల పక్షాన దాఖలైన పిటిషన్పై తీర్పు వెలువడాల్సి ఉంది. ఈ మేరకు సివిల్ జడ్జి(సీనియర్ డివిజన్) మహేంద్ర పాండే తీర్పును అక్టోబర్ 27న రిజర్వ్ చేసి ఉంచారు. ముందుగా నవంబర్ 8వ తేదీన తీర్పు వెలువడాల్సి ఉంది. అయితే జడ్జి అనివార్య కారణాల వల్ల అందుబాటులో లేకపోవడంతో నవంబర్ 14వ తేదీకి వాయిదా పడింది. ప్రస్తుతానికి ముస్లిం వర్గాలకు అక్కడ నమాజ్కు అనుమతి ఇస్తున్నారు. ఇక.. గత విచారణ సందర్భంగా వాజుఖానాలో ఉన్న శివలింగం అంశంపై సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్కు అనుమతించాలని, కార్బన్ డేటింగ్ చేయించాలనే అభ్యర్థనను వారణాసి కోర్టు తోసిపుచ్చింది. ఇక ఆ ఆకారం శివలింగం కాదని, ఫౌంటెన్ భాగమని ముస్లిం వర్గాలు వాదిస్తున్నాయి. మసీదు నిర్వహణను చూసుకుంటున్న ఏఐఎంసీ.. హిందు సంఘాల తరపున పిటిషన్ వేసిన వీవీఎస్ఎస్ వాదనను తోసిచ్చుతోంది. ఇదీ చదవండి: కర్మ అంటే ఇదేనేమో.. దెబ్బకు తిక్క కుదిరింది! -
ఇదెక్కడి న్యాయం.. బతకాలని లేదు!
పదేళ్ల కిందటినాటి కేసులో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై.. యావత్ దేశం రగిలిపోతోంది. కళ్లలో యాసిడ్పోసి.. జనానాంగాల్లో సీసాలు జొప్పించి అతికిరాతంగా హత్య చేశారామెను. అలాంటి కేసులో మరణ శిక్ష పడ్డ ఖైదీలను నిర్దోషులుగా ప్రకటించింది సుప్రీం కోర్టు. ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లలిత్ ఆఖరిరోజు ఇచ్చిన తీర్పుల్లో ఇది ఒకటి కావడం గమనార్హం. 2012 చావ్లా గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ కేసులో నేరారోపణలను ప్రాసిక్యూషన్ వారు నిరూపించని కారణంగానే.. మరణ శిక్ష పడ్డ ఆ ముగ్గురు ఖైదీలను విడుదల చేస్తున్నట్లు చీఫ్ జస్టిస్ లలిత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం తీర్పు ఇచ్చింది. వారిని దోషులుగా నిర్ధారించే సమయంలో దిగువ న్యాయస్థానం సైతం పారదర్శకత లేకుండా వ్యవహరించిందని బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వాళ్లను నిర్దోషులుగా ప్రకటించినట్లు వెల్లడించింది. ఏడేళ్లుగా సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణ కొనసాగగా.. తీర్పుపై బాధితురాలి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తీర్పు తమకు దిగ్భ్రాంతి కలిగించిందని ఓ జాతీయ మీడియా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘‘ఇది మాకు పెద్ద ఎదురు దెబ్బ. న్యాయం జరుగుతుందనే ఇక్కడికి(సుప్రీం కోర్టు) వచ్చాం. న్యాయవ్యవస్థ మీద నమ్మకమే మమ్మల్ని ఇక్కడికి రప్పించింది. కానీ, అది నెరవేరలేదు. చట్టం ఇలాగే ఉంటే.. ఇంక న్యాయవ్యవస్థ మీద నమ్మకం ఎవరికి ఉంటుంది?.. న్యాయం జరగకపోవడం వల్లే కదా ఇంకా ఇలాంటి నేరాలు పెరిగిపోతాయ్. మా బిడ్డకు న్యాయం జరుతుందని వచ్చాం. కానీ, మా గుండెలు బద్ధలయ్యాయి. ఇదేనా న్యాయమంటే?. పదకొండేళ్లపాటు పోరాడిన మాకు దక్కిన తీర్పు ఇదా? పోరాటంలో మేం ఓడినట్లేనా? అసలు మాకు బతకాలనే లేదు. కానీ, ఇన్నాళ్లు ఒపిక పట్టిన మేం.. వెనక్కి వెళ్లాలని అనుకోవడం లేదు. కచ్చితంగా పోరాడతాం.. ముందుకెళ్తాం అని పేర్కొన్నారు. ఇక కోర్టు తీర్పు కాపీని అందుకున్నాకే.. రివ్యూ పిటిషన్కు వెళ్తామని బాధితుల తరపు న్యాయవాది పేర్కొన్నారు. కోర్టు తీర్పు మాకు ఆశ్చర్యం కలిగింది. ఏడేళ్ల తర్వాత.. అదీ నేను గట్టిగా అడిగిన తర్వాతే కోర్టు విచారణ ముందుకు కదిలింది. వారంలోపే.. అదీ సీజేఐ ఆఖరి రోజున ఇలాంటి తీర్పు వచ్చింది. ఈ కేసులో వెనక్కి వెళ్లం.. తీర్పుపై పునసమీక్షకు వెళ్తాం అని ఆమె పేర్కొన్నారు. అంతకు ముందు సీజేఐ నేతృత్వంలోని.. ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించింది. హేతుకమైన సందేహం లేకుండా అభియోగాలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని చీఫ్ జస్టిస్ యుయు లలిత్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు బెంచ్ అభిప్రాయపడింది. అంతేకాదు.. కోర్టు విచారణ సమయంలోనూ లోపాలు స్పష్టంగా గమనించామని, 49 సాక్ష్యుల్లో పది మందిని విచారించలేదని ధర్మాసనం తెలిపింది. అంతేకాదు.. న్యాయస్థానాలు చట్టపరిధిలో ఉండాలే తప్ప.. బయటి నుంచి వచ్చే నైతిక ఒత్తిళ్లకు తలొగ్గకూడదనే అభిప్రాయం వెలుబుచ్చింది. ఢిల్లీ పోలీసుల కథనం ప్రకారం.. గురుగావ్లో పని చేసే 19 ఏళ్ల యువతిని.. 2012 ఫిబ్రవరి 9వ తేదీన తనతో శారీరక సంబంధానికి ఒప్పుకోలేదన్న కారణంతో ముగ్గురు నిందితుల్లో ఒకడైన వ్యక్తి.. ఎత్తుకెళ్లి మూడు రోజులపాటు చిత్రహింసలకు గురి చేశాడు. ఆపై మృగచేష్టలతో సామూహికంగా హత్యాచారానికి పాల్పడ్డారు. మూడు రోజుల తర్వాత శవాన్ని హర్యానా శివారులో పడేసి వెళ్లిపోయారు. కుళ్లిపోయిన స్థితిలో దొరికిన ఆమె మృతదేహానికి శవపరీక్ష నిర్వహించి.. షాకింగ్కు గురి చేసే విషయాలు బయటపెట్టారు వైద్యులు. ఆపై నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేయగా.. 2014లో ఢిల్లీ కోర్టు, ఆపై హైకోర్టు కూడా ఈ మానవ మృగాలకు సంఘంలో తిరిగే హక్కు లేదంటూ మరణ శిక్ష విధించాయి. చివరికి.. అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో ఆ ముగ్గురు నిర్దోషులుగా బయటకు రాబోతున్నారు!. సంబంధిత వార్త: భావోద్వేగాలకు.. సెంటిమెంట్లకు చోటు లేదిక్కడ! -
హిజాబ్ తీర్పుపై సుప్రీం కోర్టులో ఊహించని పరిణామం
-
హిజాబ్ తీర్పు: సుప్రీంలో ఊహించని పరిణామం
న్యూఢిల్లీ: కర్ణాటకలో విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించటంపై నిషేధం విధించటాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై గురువారం తీర్పు సందర్భంలో.. సుప్రీం కోర్టులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సుప్రీం ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు తీర్పులు వెలువరించారు. దీంతో సరైన దిశానిర్దేశం కోసం ఈ పిటిషన్లను సీజేఐకి సిఫారసు చేస్తున్నట్లు జస్టిస్ హేమంత్ గుప్తా తెలిపారు. సుమారు పదిరోజులపాటు హిజాబ్ పిటిషన్లపై వాదనలు వినింది ద్విసభ్య న్యాయమూర్తుల ధర్మాసనం. చివరికి.. కర్ణాటక హైకోర్టును తీర్పును జస్టిస్ హేమంత్ గుప్తా సమర్థించగా.. తీర్పును తోసిపుచ్చారు జస్టిస్ సుధాన్షు దులియా. దీంతో ఈ వివాదం సీజేఐకి ముందుకు చేరగా.. మరో బెంచ్ లేదంటే రాజ్యాంగ ధర్మాసనం ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యాసంస్థల్లో విద్యార్థుల దుస్తులపై కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. స్కూల్స్, పాఠశాలల్లో హిజాబ్ ధరించకూడదని ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయటంతో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. హిజాబ్ నిషేధాన్ని సవాల్ చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. అయితే, హిజాబ్పై నిషేధాన్ని ఎత్తివేయాటనికి నిరాకరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. 10 రోజుల పాటు వాదనలు విన్న జస్టిస్ హేమంత్ గుప్తా, సుధాన్షు ధులియాల ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఇరువురు జడ్జీలు హిజాబ్ నిషేధంపై ఏకాభిప్రాయానికి రాకపోవటం గమనార్హం. ఇదీ చదవండి: గాల్లోకి ఎగిరాక ఊడిపోయిన విమానం టైర్.. వీడియో వైరల్ -
తాజా తీర్పు: పోల్చి తిడితే ఇంతే సంగతులు
భర్తల నోటికి తాళం. భార్యల వేదనకు ఈ తీర్పు ఒక అవసరం. ఇరుగింటామెతోనూ పొరుగింటామెతోనూ సినిమా హీరోయిన్తోనూ పోల్చి భార్యను చులకన చేస్తే సూటిపోటి మాటలంటే అది ‘మానసిక క్రూరత్వం’ కిందకే వస్తుందని కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అటువంటి భర్తతో కాపురం చేయనవసరం లేదని విడాకులు మంజూరు చేసింది. గతంలో ముంబై ఫ్యామిలీ కోర్టు కూడా ‘ఆ నువ్వు పెద్ద మగాడివని’ లాంటి గుచ్చే మాటలు మాట్లాడే భార్య నుంచి విడాకులు ఇప్పించింది. భార్యాభర్తలు ఇలాంటి మాటలు అనుకోవడం ఎందుకు? భార్యను చులకన చేయడం భర్తకు సమాజం నుంచి కుటుంబం నుంచి అంగీకారం పొందిన విషయంగా అనిపిస్తుంది. సినిమాల్లో పాత్రలు, టీవీల్లో స్కిట్లు భార్యను భర్త నానా విధాలుగా హేళన చేయడం చూపిస్తూనే ఉంటాయి. ‘మసిబొగ్గులా ఉన్నావు’, ‘బోండాంలా ఉన్నావు’, ‘నిన్ను చేసుకునే బదులు అడవిలో మొద్దును చేసుకుని ఉంటే నయం’, ‘ఏదో ఒక మాయలో పడినట్టుగా నిన్ను చేసుకున్నాను. కాని నీలో ఏ ఆకర్షణ లేదు’, ‘ఆ ఎదురింటామెను చూడు ఎంత అందంగా ఉందో’, ‘ఇదంతా నా ఖర్మ’... ఇలాంటి మాటలు భర్త మాట్లాడితే భార్య లోలోపల బాధ పడటమో తిరిగి తగాదా పడటమో చేస్తూ ఉంటుంది. కాని ‘ఇది అవసరమా నాకు’ అని భార్య అనుకుంటే విడాకులు మంజూరు చేయడానికి ఈ కారణం సరిపోతుందని తాజాగా కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. కేరళ హైకోర్టు బెంచిలో జస్టిస్ కె.నరేంద్రన్, సి.ఎస్.సుధ ఈమేరకు తీర్పు వెలువరించారు. ఏమిటి కేసు? కేరళలో ఒక జంట 2009లో పెళ్లి చేసుకున్నారు. అప్పుడు ఆమెకు 26. అతనికి 29. పెళ్లయిన తర్వాత భర్త కొత్త పెళ్లికూతురు అని కూడా చూడక వెంటనే ఇతర స్త్రీలతో పోల్చసాగాడు. ‘నీకన్నా ఆమె బాగుంది’, ‘ఆమెకున్న మంచి జుట్టు నీకు లేదు’ లాంటి కామెంట్లు చేసేవాడు. అతని తమ్ముడు పెళ్లి ప్రయత్నాలు చేస్తుంటే పెళ్లిచూపులకు అన్నగా హాజరయ్యి భార్యతో ‘నా తమ్ముడు అదృష్టవంతుడు. మంచి అమ్మాయిలను వెతుకుతున్నాడు’ లాంటి కామెంట్లు చేసేవాడు. దాంతో ఆమె కనీసం ఆరునెలలు కూడా అతనితో కాపురం చేయలేకపోయింది. జనవరిలో పెళ్లయితే నవంబర్లో విడాకులకు ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసింది. ఫ్యామిలీ కోర్టు ‘లైంగిక దూరాన్ని’ కారణంగా చూపుతూ విడాకులు మంజూరు చేసింది. దాని మీద భర్త హైకోర్టుకు అప్లయి చేశాడు. కేరళ హైకోర్టు కూడా తాజాగా విడాకులే సబబైనవిగా తీర్పు ఇచ్చింది. మానసిక క్రూరత్వం ఈ కేసులో విడాకులకు కనిపించే సగటు కారణాల కన్నా భర్త తన భార్యను ఇతర స్త్రీలతో పోల్చుతూ చిన్నబుచ్చడాన్నే హైకోర్టు ప్రధాన కారణంగా తీసుకుంది. దానిని ‘మానసిక క్రూరత్వం’గా వ్యాఖ్యానించింది. అలాంటి క్రూరత్వంతో బంధం నిలవదు అని చెప్పింది. ‘వారు మంచి వయసులో ఉన్న జంటే అయినా ఈ కేసు కొనసాగిన ఇన్నేళ్లుగా తిరిగి కలవలేదు. భాగస్వాములలో ఒకరు విడాకులకు దరఖాస్తు చేసి, ఏళ్ల తరబడి ఇద్దరూ విడిగా ఉండగా ఆ పెళ్లి కుటుంబాలకు, సంఘానికి చెప్పుకోవడానికి ఉంటుందిగాని నిజంగా మనలేదు’ అని విడాకులు మంజూరు చేసింది. భర్తను చిన్నబుచ్చినా అంతే! అయితే 2013లో ముంబై ఫ్యామిలీ కోర్టులో భర్త తరఫు నుంచి ఇటువంటి తీర్పే ఇచ్చింది. భార్య భర్తను ‘నువ్వు పెద్ద మగాడివిలే’, ‘నేను సరిగా ఏడ్చి ఉంటే మావాళ్లు నీకంటే తెలివైన, మంచి కుటుంబం నుంచి కుర్రాణ్ణి వెతికి ఉండేవారు’, ‘నాకు నువ్వు ఏమాత్రం సరి తూగవు’ లాంటి మాటలతో బాధించేది. అప్పటికి వారికి పెళ్లయి పదేళ్లు. ఇద్దరు పిల్లలు. కాని భర్త అలసిపోయి ఆఫీసు నుంచి వస్తే ‘ఒక ముద్దు ముచ్చట లేదు. మగాడివైతేగా’ వంటి మాటలతో బాధించేది. ఏమైనా అంటే ‘ఉరేసుకుని చస్తా’ అని బెదిరించేది. ఈ మాటలన్నింటినీ కోర్టు ‘మానసిక క్రూరత్వం’గా పరిగణించి విడాకులు ఇచ్చింది. ముఖ్యంగా ‘ఆత్మహత్య బెదిరింపులు’ భర్తకు నరక ప్రాయం అవుతాయని వ్యాఖ్యానించింది. ఎందుకు ఈ మాటలు? భార్యాభర్తల మధ్య ప్రేమ, స్నేహం, గౌరవం, సర్దుబాటు ధోరణి, అవగాహన, అర్థం చేసుకోవడం, బలహీనతలను గుర్తించడం, ఎదుటివారికి ఏ పని నచ్చదో దానిని వదలిపెట్టడం... ఇవన్నీ ఉంటే తప్ప కాపురం సజావుగా సాగదు. పెళ్లయ్యాక ఒకరికొకరు సరిపడరు అని అనుకుంటే విడిపోవడం లేదా మౌనంగా కొనసాగడం మేలు. కాని మాటలు చాలా గాయం చేస్తాయి. నిజానికి అవి వంటి మీద పడే దెబ్బల కంటే తీవ్రమైనవి. మాటలతో హింసించి సంతృప్తి పడదామంటే కాలక్రమంలో ఆ బంధం మరింత పలుచనవుతుంది తప్ప గట్టి పడదు. కాబట్టి తిడితే ఏమవుతుందిలే అని భార్య/భర్త అనుకోవద్దు. విడాకులకు అవి చాలు. -
Triple Talaq: రాతపూర్వకంగా కూడా తలాక్ చెల్లదు.. తేల్చి చెప్పిన ఏపీ హైకోర్టు
సాక్షి, అమరావతి: నోటి మాటగా మూడుసార్లు తలాక్ చెప్పడం ఇస్లాం చట్ట నిబంధనలకు విరుద్ధమైనప్పుడు, తలాక్నామా రూపంలో లిఖితపూర్వకంగా రాసుకున్నా కూడా చెల్లదని, వివాహం రద్దుకాదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఏక వాక్యంలో మూడుసార్లు చెప్పే తలాక్కు ఎలాంటి గుర్తింపు లేదంది. మూడుసార్లు తలాక్ చెప్పి, దాన్ని రాతపూర్వకంగా పంపడం చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది. ఒకవేళ ఇస్లాం చట్ట నిబంధనల ప్రకారం విడాకులు తీసుకోవాలంటే.. భార్య, భర్త ఇద్దరి తరపు మధ్యవర్తులు వారి మధ్య సయోధ్యకు ప్రయత్నించాలంది. అది సాధ్యం కానప్పుడే సహేతుక కారణాలతో తలాక్ చెప్పొచ్చునని, అలా చెప్పే తలాక్ల మధ్య తగిన వ్యవధి ఉండి తీరాలని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హారీ ఇటీవల తీర్పు వెలువరించారు. ఇదీ వివాదం... తను, తన భర్త వేర్వేరుగా ఉంటున్న నేపథ్యంలో భర్త నుంచి జీవన భృతి ఇప్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పి.గౌస్బీ 2004లో పొన్నూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ అభ్యర్థనను ఆమె భర్త జాన్ సైదా వ్యతిరేకించారు. తాను తలాక్ చెప్పి, దాన్ని రిజిస్టర్ పోస్టులో భార్యకు పంపానని, అయితే అది తిరస్కరణ కారణంతో తిరిగి వచ్చిందని, కాబట్టి జీవన భృతి చెల్లించాల్సిన అవసరం లేదని సైదా వాదించారు. పొన్నూరు కోర్టు సైదా వాదనలను తోసిపుచ్చుతూ గౌస్బీ, ఆమె కుమారుడికి నెలకు రూ.8 వేలు జీవన భృతి కింద చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ జాన్ సైదా అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్పై విచారణ జరిపిన గుంటూరు మొదటి అదనపు సెషన్స్ కోర్టు, కుమారుడికి జీవనభృతి చెల్లించాలని, గౌస్బీకి అవసరం లేదంటూ తీర్పునిచ్చింది. దీనిని సవాలు చేస్తూ గౌస్బీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ రవినాథ్ తిల్హారీ విచారణ జరిపి ఇటీవల తీర్పు వెలువరించారు. గౌస్బీ, ఆమె కుమారుడికి జీవనభృతి చెల్లించాలంటూ పొన్నూరు కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించారు. భార్యకు మూడుసార్లు తలాక్ చెప్పి, దాన్ని రిజిస్టర్ పోస్టులో పంపి వివాహం రద్దయినట్లు పేర్కొనడాన్ని తప్పుపట్టారు. అలా చేయడం ద్వారా వివాహం రద్దు కాదన్నారు. భార్య, భర్త వేర్వేరుగా ఉంటున్నందున భర్త నుంచి భరణం పొందేందుకు ఆ మహిళ అర్హురాలేనని స్పష్టంచేశారు. -
వాన్పిక్ ప్రాజెక్ట్ లిమిటెడ్కు ఊరట
-
తెలంగాణ హైకోర్టులో వాన్పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఊరట
-
సుప్రీం కోర్టులో తెలంగాణ సర్కార్కు భారీ ఊరట
బంజారాహిల్స్ (హైదరాబాద్): సుప్రీం కోర్టులో రాష్ట్ర సర్కారుకు భారీ ఊరట లభించింది. రూ.300 కోట్ల విలువైన స్థలం ప్రభుత్వానిదేనంటూ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీంతో షేక్పేట రెవెన్యూ అధికారులు సదరు స్థలాన్ని మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. అది ప్రభుత్వ స్థలమని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. షేక్పేట తహసీల్దార్ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... షేక్పేట మండలం బంజారాహిల్స్ రోడ్ నెం. 14 ప్రధాన రహదారిలోని సర్వే నెంబర్ 403లో ప్రభుత్వానికి రెండెకరాల పది గుంటల స్థలం ఉంది. చదవండి: హుస్సేన్సాగర్కు భారీగా వరద నీరు.. జీహెచ్ఎంసీ అలర్ట్ ఈ స్థలం తనదేనంటూ డి. రంగస్వామి అనే వ్యక్తి రెండు దశాబ్దాలుగా న్యాయస్థానంలో పోరాడుతున్నాడు. దాదాపు రూ.300 కోట్ల విలువ చేసే ఈ స్థలంపై ప్రభుత్వం కూడా సిటీ సివిల్ కోర్టులో విజయం సాధించగా సదరు కబ్జాదారు జాగా తనదేనంటూ హైకోర్టును ఆశ్రయించాడు. వాదనలు విన్న తర్వాత 2021 ఏప్రిల్ 1న హైకోర్టు ఈ స్థలం బి. రంగస్వామికి చెందినదని తీర్పునిచ్చింది. ఆ తెల్లవారే సదరు వ్యక్తి హైకోర్టు తీర్పుతో స్థలం చూట్టూ బ్లూషీట్లు ఏర్పాటు చేసుకొని జీపీఏ అగ్రిమెంట్ చేసిన శాంతా శ్రీరాం రియల్టర్కు అప్పగించాడు. ఈ నేపథ్యంలో ఖరీదైన స్థలాన్ని కావాలనే అప్పగించేశారంటూ ఆరోపణలు వినిపించాయి. ప్రభుత్వ వాదనలు సరిగా లేవంటూ పలువురు విమర్శించారు. దీంతో స్పందించిన ప్రభుత్వం 2021 జూన్లో సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ను దాఖలు చేసింది. ఆ కొద్ది రోజులకే సుప్రీం కోర్టు ఈ స్థలంపై స్టేటస్కో విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం నుంచి ఈ స్థలం తమదేనంటూ పక్కాగా ఆధారాలు సమర్పించారు. ఏడాది కాలంలో స్థలానికి సంబంధించిన కీలక పత్రాలను కోర్టులో సమర్పించారు. దీంతో సుప్రీం కోర్టు ఈ స్థలం ప్రభుత్వానిదేనంటూ సోమవారం కీలక తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలోనే షేక్పేట మండల రెవెన్యూ అధికారులు స్థలాన్ని స్వాదీనం చేసుకొని తమ అదీనంలోకి తీసుకున్నారు. -
'మాల్యా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు'! రేపే శిక్ష ఖరారు చేయనున్న సుప్రీం కోర్టు!
లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. విజయ్ మాల్యాకు వ్యతిరేకంగా సోమవారం భారత అత్యున్నత న్యాయ స్థానం విచారణ జరపనుంది. జస్టిస్ యూయూ లలిత్, రవీంద్ర ఎస్ భట్, పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించనుంది. 2017లో విజయ్ మాల్యా సుప్రీం కోర్ట్ తీర్పును ఉల్లంఘిస్తూ మాల్యా 40మిలియన్ డాలర్లను తన పిల్లలకు ట్రాన్స్ఫర్ చేశారు. ఆ సమాచారాన్ని కోర్ట్కు చెప్పే ప్రయత్నం చేయలేదు. పైగా ఆ విషయాన్ని రహస్యంగా ఉంచాడు. దీంతో మాల్యాపై సుప్రీం కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణ జరిపింది. ఇప్పటికే కేసు విచారణ నేపథ్యంలో పలు మార్లు మాల్యా కోర్ట్కు హాజరు కావాలని సుప్రీం కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. కానీ మాల్యా సుప్రీం కోర్టు హాజరవ్వలేదు. ఈ తరుణంలో కోర్ట్ ధిక్కారం కేసుకు సంబంధించి ఏప్రిల్11న సుప్రీం కోర్ట్ తుది తీర్పు ఇవ్వనుంది. మాల్యాకు వ్యతిరేకంగా శిక్ష ఖరారు కానుంది. -
కమెడియన్ లైంగిక వేధింపులు.. 50 ఏళ్ల తర్వాత తీర్పు..
Comedian Bill Cosby Found Guilty Sexually Assaulting In 1975: ఎంతటి ప్రముఖులైన చేసిన నేరానికి శిక్ష అనుభవించక తప్పదని మరో సంఘటన నిరూపించింది. ఓ ప్రముఖ కమెడియన్ 1975లో చేసిన నేరం సుమారు 50 ఏళ్ల తర్వాత రుజువైంది. 5 దశాబ్దాల క్రితం అమెరికన్ కమెడియన్ బిల్ కాస్బీ ప్లేబాయ్ మాన్షన్లో ఓ మైనర్ బాలికను లైంగికంగా వేధించాడు. కొన్ని ఏళ్ల తర్వాత ఆమె బిల్పై కేసు పెట్టింది. తర్వాత విచారించిన కాలిఫోర్నియాలోని జ్యూరీ తాజాగా మంగళవారం (జూన్ 21, 2022) తీర్పునిచ్చింది. హాస్య నటుడు బిల్ కాస్బీ నేరం చేసినట్లు నిర్ధారించింది. అంతేకాకుండా బాధితురాలు జూడీ హుత్కు 5 లక్షల డాలర్లు నష్టపరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. 1975లో 36 ఏళ్ల వయసున్న బిల్ కాస్బీ 16 సంవత్సరాల జూడీ హుత్ను లైంగికంగా వేధించాడు. ఓ సినిమా సెట్లో జరిగిన ఈ ఘటనలో జూడీతోపాటు ఆమె స్నేహితురాలు డొన్నా శామ్యూల్ సన్ (17) కూడా బాధితురాలైంది. చదవండి: బుల్లితెర నటి ఆత్మహత్య.. అతడే కారణమని తండ్రి ఆరోపణ ప్రస్తుతం 84 ఏళ్ల వయసున్న బిల్ కాస్బీపై పలువురు మహిళలు లైంగిక ఆరోపణలతో కేసులు వేశారు. ఈ క్రమంలోనే బిల్కు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. కాగా 'అమెరికాస్ డాడ్'గా పిలవబడే బిల్ కాస్బీ 2018లో కూడా ఒక క్రిమినల్ కేసులో జైలుపాలయ్యాడు. తర్వాత పలు కారణాల వల్ల నేరం రద్దు కావడంతో గతేడాది విడుదల అయ్యాడు. చదవండి: సినిమా సెట్లో ఇద్దరు నటులు మృతి.. ఆరుగురికి గాయాలు -
టీసీఎస్కి న్యాయస్థానంలో చుక్కెదురు !
ఉద్యోగికి పట్ల టీసీఎస్ న్యాయస్థానం ప్రవర్తించిన తీరు పట్ల చెన్నై సిటీ కార్మిక న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది. అర్థరహితమైన కారణాలు చెప్పి ఉద్యోగులు జీవితాలతో ఆడుకోవద్దని హెచ్చరించింది. ఈ మేరకు సదరు ఉద్యోగికి జరిగిన అన్యాయం సరి చేయాలంటూ తీర్పు వెలువరించింది. తిరుమలై సెల్వన్ (48) టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో మేనేజర్ హోదాలో పని చేస్తున్న సమయంలో ఊహించిన విధంగా యాజమాన్యం ప్రవర్తించింది. సరైన కారణాలు పేర్కొనకుండా అతన్ని ఫ్రీలాన్సర్గా మారమంటూ ఒత్తిడి తెచ్చింది. దీంతో గడిచిన ఏడేళ్లుగా అతను ఫ్రీలాన్సర్గా పని చేస్తూ నెలకు కేవలం రూ. 10,000 జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. కుటంబం గడిచేందుకు అతని భార్య కూడా పని చేస్తోంది. సరైన కారణాలు పేర్కొనకుండా తనను ఉద్యోగంలోంచి తొలగించారంటూ తిరుమలై సెల్వన్ చెన్నైలోని లేబర్కోర్టును ఆశ్రయించాడు. అతనికి మద్దతుగా ది ఫోరమ్ ఫర్ ఐటీ ఎంప్లాయిస్ కూడా నిలబడింది. ఇలా ఏడేళ్లలో 150 సార్లు కోర్టులో వాదప్రతివాదనలు జరిగాయి. మొత్తంగా ఉద్యోగంలోకి తీసుకున్న వ్యక్తిని సరైన కారణాలు చూపకుండా తొలగించడం తప్పని చెబుతూ న్యాయస్థానం తాజాగా తీర్పు ఇచ్చింది. సెల్వన్కు వ్యతిరేకంగా టీసీఎస్ తరఫున వినిపించిన వాదనలుఅ అర్థరహితమంటూ వ్యాఖ్యానించింది. ఒక ఉద్యోగిగా సెల్వన్ నష్టపోయిన కాలానికి సంబంధించి పూర్తి పరిహారాన్ని జీతం, ఇతర బెనిఫిట్స్తో సహా చెల్లించాలని టీసీఎస్ను న్యాయస్థానం ఆదేశించింది. అంతేకాదు అతన్ని మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోవాలని చెప్పింది. కోర్టు తీప్పు పట్ల ఐటీ ఎంప్లాయిస్ ఫోరం హర్షం వ్యక్తం చేసింది. చదవండి: రెండు వారాలు ఇంటినుంచే పని -
ఆ కారులోనే నా బిడ్డ ఆత్మ! దోషికి శిక్ష ఖరారు
కొల్లం: కేరళలో వరకట్న వేధింపులకు బలైన ఆయుర్వేద వైద్య విద్యార్థిని విస్మయ కేసులో కోర్టు తీర్పు వెలువరించింది. కొల్లాం అదనపు సెషన్స్ కోర్టు-1 కిరణ్ కుమార్కు పదేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే 12.5 లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. ఈ మొత్తాన్ని బాధితురాలి తల్లిదండ్రులకు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం తీర్పు వెలువరించింది.వరకట్న వేధింపులకు గురిచేసిఆత్మహత్యకుప్రేరేపించినట్లు విశ్వసించిన కోర్టు కిరణ్ కుమార్ను సోమవారం దోషిగా నిర్ధారించింది. ఆత్మహత్యకు ప్రేరేపించడం, వేధింపుల నేరాలకుగాను ఈ శిక్ష విధించినట్లు అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి-1 సుజిత్ కెఎన్ ,స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి మోహనరాజ్ విలేకరులకు తెలిపారు. ఈకేసులో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న కుమార్కు గతంలో ప్రభుత్వం ఉద్యోగం నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. పెళ్లయిన కొద్ది రోజులకే ఇంట్లో శవమై కనిపించింది విస్మయ.ఈ ఘటనకు ఒక రోజు ముందు, విస్మయ తన బంధువులకు వరకట్న వేధింపుల గురించి వాట్సాప్ సందేశాలను పంపింది, అలాగే ఆమె శరీరంపై గాయాల ఫోటోలు, కొట్టిన గుర్తుల ఫోటోలను పంపించింది. 2020లో పెళ్లి సందర్భంగా కుమార్కి 100 కాసుల బంగారం, ఎకరానికి పైగా భూమితో పాటు 10 లక్షల విలువైన కారు కూడా కుమార్కి కట్నంగా ఇచ్చారు. కారు, నచ్చలేదని, వద్దన్న కిరణ్ ఆ పది లక్షల నగదు రూపంలో కావాలని వేధించి, చిత్ర హింసలకు గురి చేయడంతో విస్మయ ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఫిర్యాదు నమోదు చేశారు. వరకట్న వేధింపుల కారణంగానే విస్మయ ఆత్మహత్యకు పాల్పడిందని కేరళ పోలీసులు 500 పేజీలకు పైగా ఉన్న చార్జిషీట్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ అనంతరం కోర్టు తాజా తీర్పును వెలువరించింది. అయితే, దోషిగా నిర్ధారించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్ రద్దు అయింది. దీంతో పోలీసులు కిరణ్ను కస్టడీలోకి తీసుకున్నారు. ఈ పరిణామంపై స్పందించిన విస్మయ తల్లితండ్రులు త్రివిక్రమన్ నాయర్, సజిత సంతోషం వ్యక్తం చేశారు. అయితే కిరణ్కు యావజ్జీవ శిక్ష పడాలని కోరుకున్నారు. అంతేకాదు ఏ కారు అయితే విస్మయ మరణానికి కారణమైందో ఆ కారులోనే ఆమె తండ్రి విచారణకు హాజరయ్యారు. ‘‘నా కూతురు ఆత్మ ఈ కారులోనే ఉంది. ఆమె కోసం సీటు ఎపుడూ ఖాళీగా ఉంచుతా’’ అంటూ కన్నీరు పెట్టుకున్నారు. మరోవైపు కోర్టు తాజా తీర్పును పైకోర్టులో సవాల్ చేయనున్నామని కిరణ్ తండ్రి సదాశివన్ పిళ్లై వెల్లడించారు. -
జ్ఞానవాపి మసీదు కేసు: వారణాసి కోర్టులో విచారణ పూర్తి, తీర్పు రిజర్వ్
లక్నో: జ్ఞానవాపి మసీదు వ్యవహారంపై వారణాసి జిల్లా కోర్టులో విచారణ పూర్తి అయ్యింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రేపటికి (మంగళవారం) రిజర్వ్ చేసింది. హిందూ వర్గం దాఖలుచేసిన రెండు పిటిషన్లతోపాటు ముస్లిం కమిటీ వేసిన ఒక పిటిషన్ను జిల్లా జడ్జ్ అజయ్కృష్ణ విశ్వేష విచారించారు. విచారణ సందర్భంగా కోర్టు హాలులోకి 23 మందిని మాత్రమే అనుమతించారు. వీరిలో 19 మంది లాయర్లు కాగా, నలుగురు పిటిషనర్లు. జ్ఞాన్వాపి ప్రాంగణంలోని శృంగార గౌరి కాంప్లెక్స్లో నిత్యపూజలకు, వజుఖానాలో వెలుగుచూసిన శివలింగాన్ని ఆరాధించేందుకు అనుమతి ఇవ్వడంతోపాటు శివలింగం లోతు ఎత్తు తెలుసుకునేందుకు సర్వే కొనసాగించాలని హిందూవర్గం కోరుతోంది. వజుఖానా మూసేయవద్దని ముస్లిం కమిటీ డిమాండ్ చేస్తోంది. అలాగే 1991 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కింద జ్ఞానవాపి సర్వేను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతోంది. చదవండి: Vismaya Case: నాన్నా! భయమేస్తోంది.. వచ్చేయాలనుంది -
Rajiv Gandhi Assassination Case: సుప్రీం కోర్టు సంచలన తీర్పు
-
రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో మూడు దశాబ్దాలకు పైగా జైలు శిక్ష అనుభవిస్తున్న దోషి ఎ.జి.పేరరివాళన్ విడుదల చేయాలని జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు, బీఆర్ గవాయి, ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తమిళనాడు రాష్ట్ర క్యాబినెట్ అంగీకరించిందని, ఇక ఆర్టికల్ 142 ప్రకారం పేరరివాళన్ను విడుదల చేయడం సమంజసమే అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పేరరివాళన్ విడుదలతో ఈ కేసులో జీవితఖైదు అనుభవిస్తోన్న నళిని, ఆమె భర్త మురుగన్ సహా ఇతర దోషుల విడుదలకు కూడా మార్గం సుగమమైనట్లైంది. చదవండి: Who Is VTuber: వీట్యూబర్లు ఎవరో తెలుసా..వీళ్లు సృష్టిస్తున్న హంగామా ఏంటో విన్నారా కాగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని మే 21, 1991న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్లో ఎన్నికల ర్యాలీలో ధను అనే మహిళ ఆత్మాహుతి దాడి చేసి హత్య చేసింది. ఈ హత్య కేసులో పేరరివాళన్తో పాటు దోషులుగా తేలిన మురుగన్, అతని భార్య నలిని, సుతేంతిరా రాజా అలియాస్ సంతన్, రాబర్ట్ పయాస్, జయకుమార్, రవిచంద్రన్లకు కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే ఈ ఏడుగురిని విడుదల చేయాలనే గతంలో తమిళనాడు మంత్రివర్గం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఇటీవల పేరరివాళన్ను విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. ఈ కేసుని విచారించిన ధర్మాసనం రాజీవ్ గాంధీ హత్య కేసులో పెరారివాలన్ను నిర్దోషిగా ప్రకటించింది. జైలు నుంచి విడుదల అనంతరం పెరారివాలన్ కుటుంబ సభ్యులను కలిశాడు. సుమారు 30 ఏళ్ల తర్వాత కుటుంబాన్ని చేరుకున్న పెరారివాలన్ భావోద్వేగానికి లోనయ్యారు. బుధవారం సుప్రీం కోర్టు తీర్పు అనుసరించి అతను విడుదలైన సంగతి తెలిసిందే. చదవండి: Karti Chidambaram: కార్తీ చిదంబరం ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు.. సెటైర్ వేసిన ఎంపీ -
రాజీవ్ గాంధీ హత్య కేసు.. సుప్రీం కోర్టు తుది తీర్పు ఎలా ఉండబోతోంది!
Rajiv Gandhi Assassination Case: రాజీవ్ గాంధీ హత్య కేసులో యావజ్జీవ ఖైదీలలో ఒకరైన ఏజీ పెరారివాలన్ను జైలు నుంచి విడుదల చేయాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు నుంచి బుధవారం తుది తీర్పు వెలువడనుంది. నళిని శ్రీహరన్, శ్రీలంక జాతీయుడైన ఆమె భర్త మురుగన్తో సహా ఈ కేసులో మరో ఆరుగురు దోషుల విడుదలకు అనుకూలమైన తీర్పుకు మార్గం సుగమం కానున్నట్లు సమాచారం. రాజీవ్ గాంధీ హత్యకు సూత్రధారి అయిన ఎల్టీటీఈ వ్యక్తి శివరాసన్ కోసం పెరారివాలన్ రెండు 9-వోల్ట్ బ్యాటరీలను కొనుగోలు చేశాడు. ఆ సమయంలో పెరారివాలన్ వయసు 19 సంవత్సరాలు. రాజీవ్ గాంధీని హత్య చేసేందుకు బాంబులో బ్యాటరీలను ఉపయోగించారు. దీంతో ఈ కేసుకు సంబంధించి 1998లో పేరారివాలన్కు టాడా కోర్టు మరణశిక్ష విధించింది. మరుసటి సంవత్సరం, సుప్రీంకోర్టు ఆ శిక్షతో ఏకీభవించింది కానీ 2014లో దానిని జీవిత ఖైదుగా మార్చింది. ఈ ఏడాది మార్చిలో, ఉన్నత న్యాయస్థానం అతనికి బెయిల్ మంజూరు చేసింది. అయితే కొంతకాలం తర్వాత, పెరారివాలన్ జైలు నుంచి త్వరగా విడుదల చేయాలని కోరుతూ విజ్ఞప్తి చేశారు. పెరారివాలన్ అభ్యర్థనను కేంద్రం వ్యతిరేకించింది, కానీ తమిళనాడు గవర్నర్ ఈ విషయాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్కు సూచించినప్పటికీ ఇంతవరకు దీనిపై ఎలాంటి కదలిక లేదు. ఈ వ్యవహారంలో జాప్యాన్ని, గవర్నర్ చర్యను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రాజ్యాంగంలోని సెక్షన్ 161 ప్రకారం క్షమాభిక్ష ప్రసాదిస్తూ ఏడుగురు దోషులను విడుదల చేయాలన్న క్యాబినెట్ నిర్ణయానికి తమిళనాడు గవర్నర్ కట్టుబడి ఉన్నారని, అందువల్ల రాష్ట్రపతి ప్రతిస్పందన కోసం వేచి ఉండబోమని కోర్టు పేర్కొంది. కాగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని మే 21, 1991న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్లో ఎన్నికల ర్యాలీలో ధను అనే మహిళ ఆత్మాహుతి దాడి చేసి హత్య చేసింది. ఈ కేసులో ఏడుగురికి శిక్ష పడింది. అందరికీ మరణశిక్ష విధించబడినప్పటికీ, 2014లో, వారి క్షమాభిక్ష పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో రాష్ట్రపతి తీవ్ర జాప్యం చేశారని పేర్కొంటూ సుప్రీంకోర్టు వారిని జీవిత ఖైదీలుగా మార్చింది. చదవండి: జ్ఞానవాపి మసీదు సర్వే: తప్పు చేయలేదు.. నన్ను మోసం చేశారు: అజయ్ మిశ్రా -
Marital Rape: మారిటల్ రేప్పై భిన్న తీర్పులిచ్చిన జడ్జిలు
భార్యతో బలవంతంగా శృంగారంలో పాల్గొనడాన్ని (మారిటల్ రేప్).. నేరంగా పరిగణించాలంటూ దాఖలైన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెలువడింది. ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ వేర్వేరు అభిప్రాయాలను వెలువరించడంతో గందరగోళం నెలకొంది. అంతేకాదు ఈ గందరగోళం నడుమ.. తాము ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకునేందుకు పిటిషర్లకు అనుమతి ఇచ్చింది బెంచ్. న్యూఢిల్లీ: దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న తీర్పు ఇవాళ రానే వచ్చింది. అయితే మారిటల్ రేప్ (వైవాహిక అత్యాచారం)పై ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు ఇవాళ భిన్న తీర్పులు వెలువరించారు. వైవాహిక జీవితంలో భార్యతో బలవంతపు శృంగారం నేరమే అవుతుందని ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ రాజీవ్ షక్దేహర్ ఆదేశాలు ఇచ్చారు. అయితే బెంచ్లోని మరో న్యాయమూర్తి జస్టిస్ సీ హరిశంకర్ మాత్రం ఆ ఆదేశాలతో విభేధించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 19, 21లను సెక్షన్ 375(మినహాయింపు 2) ధిక్కరిస్తుందనడానికి ఎలాంటి మద్ధతు కనిపించడం లేదని, కాబట్టి, భార్యపై బలవంతపు శృంగారం నేరం కిందకు రాదని అన్నారు. ఈమేరకు జస్టిస్ రాజీవ్ ఇచ్చిన ఆదేశాలను అంగీకరించడం లేదంటూ పేర్కొన్నారు. దీంతో భిన్నాభిప్రాయాల తీర్పు వెలువడినట్లయ్యింది. బుధవారం ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు మారిటల్ రేప్పై ఈ తరహా తీర్పు వెలువరించింది. ఐపీసీలోని అత్యాచార సెక్షన్-375(మినహాయింపు 2) నుంచి మారిటల్ రేప్నకు మినహాయింపు ఇవ్వడంపై అభ్యంతరాలతో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఏడేళ్ల కిందట(2015లో) ఈ వ్యవహారంపై మొదటి పిటిషన్ దాఖలుకాగా, ఆ తర్వాత మరికొన్ని దాఖలు అయ్యాయి. ఈ పిటిషన్లకు కౌంటర్గా.. పురుష హక్కుల సంఘాలు కౌంటర్ పిటిషన్లు దాఖలు చేశాయి. మారిటల్ రేప్ను నేరంగా పరిగణించకూడదనే ఆ పిటిషన్లో కోరాయి పురుష హక్కుల సంఘాలు. అయితే ఈ పిటిషన్లపై ఈ ఏడాది జనవరి నుంచి రోజూవారీ వాదనలు జరిగాయి. చివరికి.. తీర్పును ఫిబ్రవరి 21వ తేదీన రిజర్వ్లో ఉంచింది కోర్టు. గతంలో మారిటల్ రేప్ను నేరంగా పరిగణించలేమంటూ కేంద్రం పేర్కొనగా.. ఢిల్లీ హైకోర్టు నోటీసుల నేపథ్యంలో తమ ప్రకటనను పరిశీలిస్తామంటూ డబుల్ గేమ్ ఆడింది. మరోవైపు మారిటల్ రేప్ నేరం కాదంటూ సుప్రీం కోర్టు సైతం కొన్ని కేసుల్లో తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు తాజా తీర్పుపై.. పిటిషనర్లు సుప్రీంకు వెళ్లేందుకు మార్గం సుగమం కావడం గమనార్హం. చదవండి: సెక్స్ బానిసగా భార్య.. కూతురి ముందే అసహజ శృంగారం! -
ముగ్గురు అధికారులకు జైలుశిక్ష, జరిమానా
సాక్షి, అమరావతి: కోర్టుధిక్కార కేసులో వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, కమిషనర్ హెచ్.అరుణ్కుమార్, ఐఏఎస్ అధికారి జి.వీరపాండియన్లకు హైకోర్టు ఒక్కొక్కరికి నెలరోజుల జైలుశిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. అరుణ్కుమార్, వీరపాండియన్ కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరుకావడంతో అప్పీల్ దాఖలు చేసుకునేందుకు వీలుగా శిక్ష, జరిమానా అమలును ఆరువారాలు నిలుపుదల చేసింది. తీర్పు వెలువరించే సమయానికి పూనం మాలకొండయ్య హాజరుగాకపోవడంతో ఆమెకు విధించిన శిక్షను నిలుపుదల చేయలేదు. మే 13వ తేదీలోపు రిజిస్ట్రార్ (జ్యుడిషియల్) ముందు లొంగిపోవాలని పూనం మాలకొండయ్యను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ శుక్రవారం తీర్పు చెప్పారు. ఈ తీర్పుపై పూనం మాలకొండయ్య అత్యవసరంగా సీజే ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం సింగిల్ జడ్జి తీర్పు అమలును తదుపరి విచారణ వరకు నిలుపుదల చేసింది. కర్నూలు జిల్లా సెలక్షన్ కమిటీ తనను విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గ్రేడ్–2గా ఎంపిక చేయకపోవడాన్ని సవాలుచేస్తూ ఎన్.ఎం.ఎస్.గౌడ్ 2019లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన హైకోర్టు పిటిషనర్ పేరును పరిగణనలోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఆ ఆదేశాలను అమలు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ గౌడ్ కోర్టుధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ ధిక్కార పిటిషన్ను జస్టిస్ దేవానంద్ విచారించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. కోర్టుధిక్కార పిటిషన్ దాఖలు చేసిన తరువాతనే కోర్టు ఆదేశాలను అమలు చేశారని, కోర్టు ఆదేశాల అమలులో ఉద్దేశపూర్వక జాప్యం కనిపిస్తోందని చెప్పారు. కోర్టు ఉత్తర్వులను సకాలంలో అమలుచేసే పరిస్థితి లేకపోతే, గడువు పెంచాలని కోరుతూ అఫిడవిట్ వేయవచ్చని, అధికారులు ఆ పని చేయలేదని పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలను అమలుచేసే సదుద్దేశం అధికారుల్లో కనిపించడం లేదన్నారు. అధికారులది ఉద్దేశపూర్వక ఉల్లంఘనేనంటూ ముగ్గురు అధికారులకు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. -
రమ్య హత్య కేసులో సంచలన తీర్పు.. సీఎం జగన్ ట్వీట్
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్ విద్యార్థిని రమ్య హత్య కేసులో గుంటూరు కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ‘దిశ’ స్ఫూర్తితో ఈ కేసు దర్యాప్తులో సమర్థవంతంగా వ్యవహరించిన పోలీసులను, ప్రాసిక్యూషన్ న్యాయవాదిని ఆయన అభినందించారు. మహిళల రక్షణ, భద్రత పట్ల ప్రభుత్వ సంకల్పాన్ని ఈ కేసు చాటి చెప్పిందన్నారు. చదవండి: బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో సంచలన తీర్పు మహిళలు, యువతులు, బాలికలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి ఈ తీర్పు గట్టి సందేశాన్ని పంపిందని వ్యాఖ్యానించారు. నేరాల నిరోధంలో, దురదృష్టవశాత్తూ జరిగే నేరాల దర్యాప్తులో పోలీసులు ఇదే స్ఫూర్తితో పని చేసి మహిళల భద్రత, రక్షణకు పెద్దపీట వేయాలన్నారు. ఈ తరహా కేసుల సత్వర పరిష్కారం కోసం ఇదే చిత్తశుద్ధితో పనిచేసి, దోషులకు కఠినంగా శిక్షలు పడేలా కృషి చేయాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన వెలువరించింది. కాగా, ఇదే విషయమై పోలీసు శాఖకు అభినందనలు అంటూ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ కూడా చేశారు. చదవండి: రమ్య హత్య కేసులో సంచలన తీర్పు: కుటుంబ సభ్యులు ఏమన్నారంటే.. విద్యార్థిని రమ్య హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును స్వాగతిస్తున్నాను. ఈ కేసు విషయంలో వేగంగా దర్యాప్తు పూర్తిచేసి, నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ శాఖకు అభినందనలు. — YS Jagan Mohan Reddy (@ysjagan) April 29, 2022 -
Ramya Murder Case: ఉరిశిక్షపై శశికృష్ణ తల్లి స్పందన ఇదే..
సాక్షి గుంటూరు: శశికృష్ణకు ఉరిశిక్ష విధిస్తూ వచ్చిన తీర్పుపై ఏమీ మాట్లాడలేనని.. హైకోర్టుకు వెళ్లే ఆర్థిక స్థోమత మాకు లేదు. తమకు ప్రభుత్వమే న్యాయం చేయాలని శశికృష్ణ తల్లి భూలక్ష్మి అన్నారు. చదవండి: (రమ్య హత్య కేసులో సంచలన తీర్పు: కుటుంబ సభ్యులు ఏమన్నారంటే..) ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 'మా అబ్బాయి ఇలా చేస్తాడని అసలు ఊహించలేదు. అసలు వారి మధ్య ఏం జరిగిందో కూడా మాకు తెలియదు. అంతకుముందు వారి ప్రేమ విషయం మాకు చెప్పలేదు. రమ్య తల్లిదండ్రులకు నేనేమీ చెప్పలేను. మావాడికి ఉరిశిక్ష వేస్తే చనిపోయిన పాప తిరిగి రాలేదు కదా?. ఆవేశం మీద మావాడు తప్పు చేశాడు. ఏ తల్లిదండ్రులకు ఇలాంటి బాధ రాకూడదు' అని శశికృష్ణ తల్లి భూలక్ష్మి అన్నారు. చదవండి: (బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో సంచలన తీర్పు) -
సత్తా చాటిన ‘దిశ’.. న్యాయం జరిగింది
సాక్షి, అమరావతి: ‘మహిళలపై అకృత్యాలకు పాల్పడిన వారికి దిశ వ్యవస్థ ద్వారా ఉరి శిక్ష వేయించండి చూద్దాం..’ అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు తరచూ ప్రభుత్వానికి విసురుతున్న సవాల్కు శుక్రవారం జవాబు లభించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం విప్లవాత్మకంగా ప్రవేశపెట్టిన దిశ వ్యవస్థ తన సత్తా చాటింది. రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే అతి తక్కువ వ్యవధిలో ఓ హంతకుడికి న్యాయస్థానం ద్వారా ఉరిశిక్ష వేయించింది. గుంటూరుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడు శశికృష్ణను 10 గంటల్లోనే అరెస్టు చేయడంతోపాటు.. సత్వరం చార్జ్షీట్ దాఖలు, ఫోరెన్సిక్ నివేదికల సమర్పణ, క్రమంతప్పని రీతిలో విచారణ ద్వారా నిందితుడి నేరాన్ని రుజువు చేసి, కేవలం 257 రోజుల్లోనే దోషిగా తేల్చి.. కోర్టు ద్వారా ఉరి శిక్ష వేయించగలిగింది. మహిళా భద్రత పరిరక్షణలో దేశానికే దిశ వ్యవస్థ చుక్కానిగా నిలిచింది. యుద్ధప్రాతిపదికన స్పందన మహిళలపై నేరాలకు పాల్పడే వారిని తక్షణం గుర్తించి సత్వరం శిక్ష విధించే ప్రక్రియలో దిశ వ్యవస్థ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. 2021 ఆగస్టు 15న గుంటూరులో ఇంజనీరింగ్ విద్యార్థిని రమ్యపై శశికృష్ణ అనే యువకుడు నడిరోడ్డుపై దాడి చేసి కత్తితో పొడిచి హత్య చేశాడు. సీసీ కెమెరాల సహాయంతో పోలీసులు నిందితుడిని కేవలం 10 గంటల్లోనే అరెస్టు చేశారు. నేర నిరూపణకు కీలకమైన ఫోరెన్సిక్, డీఎన్ఏ పరీక్షలను కేవలం 48 గంటల్లోనే పూర్తి చేసి నివేదికలు తెప్పించారు. నిందితుడు సాంకేతికపరమైన లోపాలను అవకాశంగా చేసుకుని తప్పించుకునేందుకు ఏమాత్రం వీలులేకుండా చేశారు. రమ్య మృతదేహం, నిందితుడి దుస్తులు, కత్తి, ఘటనా స్థలంలో ఉన్న రక్తపు నమూనాలను సరిపోల్చి నిర్ధారించారు. ఫోరెన్సిక్ వ్యవస్థ బలోపేతం కేవలం రెండ్రోజుల్లోనే ఫోరెన్సిక్, డీఎన్ఏ నివేదికలు తెప్పించడం దిశ వ్యవస్థతోనే సాధ్యమైంది. ఎందుకంటే రాష్ట్ర విభజన అనంతరం ఫోరెన్సిక్ సైన్స్ విభాగం హైదరాబాద్లోనే ఉండిపోయింది. దర్యాప్తు కోసం ఫోరెన్సిక్ నివేదికల కోసం నమూనాలను హైదరాబాద్లోని ల్యాబొరేటరీకి పంపించి నివేదికలు తెప్పించడంలో తీవ్ర జాప్యం జరిగేది. కానీ దిశ వ్యవస్థలో భాగంగా ప్రభుత్వం రాష్ట్రంలో ఫోరెన్సిక్ సైన్స్ విభాగాన్ని బలోపేతం చేసింది. గుజరాత్లోని యూనివర్సిటీ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ సౌజన్యంతో రాష్ట్రంలో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలను నెలకొల్పడంతో పాటు ఈ వ్యవస్థను మూడింతలు అభివృద్ధి చేసింది. ఆ విభాగంలో నిపుణులను ఐదింతలు పెంచింది. తద్వారా రమ్య కేసులో కేవలం 48 గంటల్లోనే ఫోరెన్సిక్, డీఎన్ఏ నివేదికలను తెప్పించారు. దిశ వ్యవస్థలో భాగంగా సైబర్ క్రైమ్ విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఐదింతలు బలోపేతం చేసింది. దాంతో ఈ కేసులో నిందితుడి కాల్డేటాను పోలీసులు సత్వరం, సమర్థవంతంగా విశ్లేషించగలిగారు. హత్యకు ముందు నిందితుడు తన మొబైల్ ఫోన్ ద్వారా మాట్లాడిన టవర్ లొకేషన్, రమ్యను వేధిస్తూ అంతకుముందు మాట్లాడిన కాల్డేటా, పంపిన వాట్సాప్ మెసేజ్లు అన్నింటినీ నిర్ధారించారు. పక్కాకుట్రతోనే రమ్యను శశికృష్ణ హత్య చేశాడని నిరూపించే సాక్ష్యాలను పోలీసులు న్యాయస్థానం ముందుంచారు. చకచకా కొలిక్కి.. రమ్య హత్య కేసును పోలీసులు దిశ పోలీస్ స్టేషన్కు బదిలీ చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. కేంద్ర హోం శాఖ ప్రమాణాల ప్రకారం 60 రోజుల్లో చార్జ్షీట్ దాఖలు చేయాల్సి ఉండగా, ఈ కేసులో కేవలం వారం రోజుల్లోనే చార్జ్షీట్ దాఖలు చేయడం విశేషం. దిశ కేసుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించడం కేసు సత్వర విచారణకు దోహదపడింది. గతంలో మహిళలపై దాడుల కేసుల్లో విచారణ ఏళ్ల తరబడి సాగేది. ఎందుకంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఇతర పోలీసు కేసులతోపాటు ఈ కేసులను కూడా వాదించాల్సి వచ్చేది. దాంతో పని భారంతో తరచూ వాయిదాలు కోరేవారు. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ అడ్డంకిని తొలగించింది. దిశ కింద నమోదు చేసిన కేసుల విచారణ కోసం ప్రత్యేకంగా జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ను నియమించింది. దాంతో రమ్య హత్య కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ క్రమం తప్పకుండా న్యాయస్థానంలో విచారణకు హాజరై నేరాన్ని పూర్తి ఆధారాలతో నిరూపించారు. తద్వారా హత్య జరిగిన 257 రోజుల్లోనే కోర్టు హంతకుడికి ఉరిశిక్ష విధించేలా దిశ వ్యవస్థ తన సత్తా చాటింది. ‘దిశ’తో దర్యాప్తు వేగవంతం ఇలా మహిళలపై దాడుల కేసుల్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. కేంద్ర హోం శాఖ ప్రమాణాల ప్రకారం 60 రోజుల్లో చార్జ్షీట్ దాఖలు చేయాలి. కాగా ఏపీ పోలీసులు 164 అత్యాచారం కేసులు, 378 లైంగిక వేధింపుల కేసుల్లో వారం రోజుల్లోనే చార్జ్షీట్లు దాఖలు చేశారు. దేశంలోనే అత్యధికంగా 854 కేసుల్లో జీరో ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. 2020–21లో దేశంలోనే అత్యధికంగా 92.21 శాతం కేసుల్లో 60 రోజుల్లోనే చార్జ్షీట్లు దాఖలు చేశారు. 2022లో ఇప్పటి వరకు 94.94 శాతం కేసుల్లో 60 రోజుల్లోనే చార్జ్షీట్లు నమోదు చేశారు. -
రమ్య హత్య కేసులో సంచలన తీర్పు: కుటుంబ సభ్యులు ఏమన్నారంటే..
సాక్షి, గుంటూరు: బీటెక్ విద్యార్థి రమ్య హత్య కేసులో గుంటూరు ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితుడి శశిక్రిష్టకి ఉరిశిక్ష విధిస్తూ తీర్పును ఇచ్చింది. కోర్టు తీర్పుపై రమ్య కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఉరిశిక్ష అమలైన రోజు మరింత సంతోషిస్తామని రమ్య తల్లి అన్నారు. కష్టకాలంలోనూ ప్రభుత్వం పూర్తి అండగా నిలిచిందని తెలిపారు. ఇంత వేగంగా కేసు పూర్తవుతుందనుకోలేదన్నారు. రమ్య సోదరి మౌనిక మాట్లాడుతూ కేసు విచారణలో ఎక్కడా ఏ చిన్న అలక్ష్యం జరగలేదన్నారు. ప్రభుత్వం మొదటి నుంచి మాకు పూర్తి అండగా నిలిచిందని తెలిపారు. ఇదిలా ఉంటే, గతేడాది ఆగస్టు 15న తనను ప్రేమించడంలేదంటూ టిఫిన్ కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన బీటెక్ విద్యార్థి రమ్యను శశికృష్ణ దారుణంగా పొడిచి చంపాడు. ఘటన జరిగిన 9 నెలల్లోనే కేసు విచారణ పూర్తి చేసింది. సుదీర్ఘ వాదనల తర్వాత శశికృష్ణకు కోర్టు ఉరిశిక్ష విధించింది. 28 మంది సాక్షుల నుంచి వాంగూల్మం సేకరించింది. నేర నిర్థారణలో సీసీ ఫుటేజీ కీలకంగా మారిందని, సెక్షన్ 302 కింద ఉరిశిక్షను కోర్టు ఖరారు చేసిందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ప్రత్యక్ష సాక్షులతో పాటు డిజిటల్ ఎవిడెన్స్ కీలకంగా మారాయని ఎస్పీ తెలిపారు. పోలీసులు ప్రత్యేక శ్రద్ధతో కేసును పరిష్కరించారన్నారు. చదవండి: (బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో సంచలన తీర్పు) కేసు వివరాలిలా.. ►ఆగస్టు 15, 2021న రమ్య హత్య ►సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి గుర్తింపు ►10 గంటల వ్యవధిలో అరెస్టు ►2 రోజుల్లో ఫోరెన్సిక్, డీఎన్ఏ నిర్ధారణ ►దిశ కింద కొత్త ల్యాబులు, సామర్థ్యం పెంపుతో అత్యంత వేగంగా ఫోరెన్సిక్ ఫలితాలు ►ఘటన జరిగిన వారంరోజుల్లో దిశ ప్రకారం ఛార్జి షీటు దాఖలు ►క్రమం తప్పకుండా కోర్టు విచారణ ►వాదనలు వినిపించిన దిశ ప్రత్యేక న్యాయవాది ►257 రోజుల్లో తీర్పు ఇచ్చిన గుంటూరు కోర్టు ►ఏప్రిల్ 29, 2022న నిందితుడికి ఉరిశిక్ష విధించిన కోర్టు -
బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో సంచలన తీర్పు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని నల్లపు రమ్య కేసులో న్యాయస్థానం శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. గుంటూరులో రమ్యను పాశవికంగా నడిరోడ్డుపై హత్య చేసిన కుంచాల శశికృష్ణకు ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఉరి శిక్ష విధించింది. నడిరోడ్డుపై ఒక విద్యార్థినిని అత్యంత పాశవికంగా చంపడం, ముద్దాయిని పట్టుకునే సమయంలో ఆత్మహత్యాయత్నం చేయడం, విచారణ సందర్భంగా కోర్టు నుంచి పరారు కావడానికి ప్రయత్నించడం తదితర కారణాల వల్ల ఈ కేసును అత్యంత అరుదైనది (రేరెస్ట్ ఆఫ్ ది రేర్)గా భావిస్తున్నామని న్యాయమూర్తి రాంగోపాల్ తన తీర్పులో పేర్కొన్నారు. క్రైం నెంబర్ 446/2021 అండర్ సెక్షన్ 354(డి).. 302 ఐపీసి, సెక్షన్3 (2)(విఎ)ఆఫ్ ఎస్సి–ఎస్టీ యాక్ట్ కింద నమోదైన కేసులో ఉరి శిక్ష (దీన్ని హైకోర్టు నిర్దారించాల్సి ఉంటుంది), రూ.వెయ్యి జరిమానా లేదా ఒక నెల సాధారణ జైలు శిక్ష విధించారు. 354(డి) సెక్షన్ కింద రెండేళ్లు కఠిన కారాగార శిక్ష, రూ.500 జరిమానా లేదా 15 రోజుల జైలు శిక్ష, ఎస్సి–ఎస్టీ కేసు సెక్షన్ 3 (2)(వి) కింద జీవిత ఖైదు, రూ.500 జరిమానా లేదా 15 రోజుల జైలు శిక్ష, ఎస్సి–ఎస్టీ కేసు సెక్షన్ 3 (2)(విఎ) కింద రెండేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.500 జరిమానా లేదా 15 రోజుల జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పొడిచి పొడిచి హత్య గుంటూరు పరమాయకుంటలో నివాసముంటూ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న నల్లపు రమ్య(20)కు వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామం వడ్డెరపాలెంకు చెందిన కుంచల శశికృష్ణ(19)తో ఇన్స్ట్రాగామ్ ద్వారా పరిచయం అయ్యింది. పదోతరగతి మధ్యలో మానేసి, ఆటోమొబైల్ షాపులో పనిచేసిన శశికృష్ణ.. తర్వాత తన నానమ్మ ఊరు వెళ్లి అక్కడ కూలి పనులు చేసుకుంటూ ఉండేవాడు. రమ్యను బస్టాండ్లో తరచూ కలిసే శశికృష్ణ.. తాను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అందుకు రమ్య తిరస్కరించింది. అతని ఫోన్ నంబర్ను కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టింది. దీంతో కోపం పెంచుకున్న శశికృష్ణ గత ఏడాది ఆగస్టు 15న తన ఇంటి నుంచి టిఫిన్ కోసం హోటల్కు వచ్చిన రమ్యను నడిరోడ్డుపై కత్తితో పలుమార్లు పొడిచి చంపాడు. ప్రభుత్వం ఈ కేసును సీరియస్గా తీసుకుంది. సీసీ కెమెరాలో నమోదైన హత్య దృశ్యాల ఆధారంగా శశికృష్ణను 12 గంటల్లోనే నరసరావుపేట సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్వంలో పోలీసులు 36 మందిని విచారించి ఏడు రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేశారు. సెప్టెంబర్ 13న కోర్టు విచారణకు తీసుకుంది. డిసెంబర్ 31న విచారణ ప్రారంభించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్.శారదామణి 28 మంది సాక్షులను విచారించారు. హత్యకు సంబంధించి కీలకమైన సీసీ టీవీ వీడియోను పరిశీలించిన న్యాయమూర్తి ఇరువర్గాల వాదనలు విని, ఈనెల 26న విచారణ పూర్తి చేశారు. కేసును ఛాలెంజింగ్గా తీసుకున్న పోలీసులు ఈ కేసును పోలీసులు ఛాలెంజ్గా తీసుకున్నారు. గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ నేతృత్వంలో అన్ని సాక్ష్యాలను సేకరించారు. ఆఖరుకు డీఎన్ఎ టెస్ట్ కూడా చేయించారు. సాక్షులు అందరూ సామాజిక బాధ్యతగా ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పారు. మంగళవారంతో వాదనలు పూర్తి అయ్యాయి. శుక్రవారం తీర్పు వెలువడనున్న నేపథ్యంలో న్యాయవాదులు, ప్రజా సంఘాలు, మీడియాతో కోర్టు ఆవరణ కిక్కిరిసిపోయింది. మధ్యాహ్నం 12 గంటలకు కోర్టు మొదలవ్వగానే.. శశికృష్ణ దోషిగా నిర్ధారణ అయ్యిందని, మధ్యాహ్నం 2.30 గంటలకు తీర్పు వెలువరిస్తానని న్యాయమూర్తి ప్రకటించారు. సరిగ్గా 2.30 గంటలకు దోషికి ఉరి శిక్ష విధిస్తూ తీర్పు వెలువడింది. అనంతరం భారీ బందోబస్తు నడుమ ముద్దాయిని జైలుకు తరలించారు. కాగా, గుంటూరు జిల్లా చరిత్రలో విద్యార్థినిపై హత్య కేసులో ఉరిశిక్ష పడటం ఇది రెండోసారి. 1999లో జెకేసీ కళాశాలలో సాయిలక్ష్మీ ప్రసన్న అనే విద్యార్థినిని సుభాని అనే వ్యక్తి కత్తితో నరికి చంపాడు. ఆ కేసులోనూ దోషికి ఉరి శిక్ష పడింది. అన్ని విధాలా అండగా నిలిచిన ప్రభుత్వం రమ్య హత్య జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించింది. ముఖ్యమంత్రి ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. నిందితులను వెంటనే అరెస్టు చేయడంతో పాటు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు. అప్పటి హోం మంత్రి మేకతోటి సుచరిత, ఇతర ప్రజా ప్రతినిధులు రమ్య కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని ప్రకటించారు. రెండో రోజే ముఖ్యమంత్రి ప్రకటించిన ఎక్స్గ్రేషియా రూ.10 లక్షలు రమ్య తల్లి నల్లపు జ్యోతికి అందించారు. అదే నెల 20వ తేదీకల్లా రమ్య తల్లికి నవరత్నాలు – పేదలందరికి ఇల్లు పథకం కింద గుంటూరులో ఇంటి పట్టా అందించారు. పోస్టుమార్టం, ఛార్జ్షీట్ వేసే దశలో అమె తల్లికి మరో రూ.8,25,000 ఇచ్చారు. ఇంటి నిర్మాణం కోసం రూ.1.80 లక్షలు చెల్లించారు. రమ్య సోదరి నల్లపు మౌనికకు సెప్టెంబర్ 16న రెవిన్యూ విభాగంలో ఉద్యోగం ఇచ్చారు. అప్పటికి మౌనికకు డిగ్రీ పూర్తి కాకపోవడంతో ఐదేళ్లలోగా డిగ్రీ పూర్తి చేసుకునే అవకాశం కల్పించారు. ప్రభుత్వం ఆ కుటుంబానికి ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయించింది. వారు కోరిన విధంగా వారి సొంత గ్రామమైన అమృతలూరు మండలం యలవర్రులో కోటీ 61 లక్షల 25 వేల 300 రూపాయల ఖర్చుతో ఐదు ఎకరాల పట్టా భూమిని కొనుగోలు చేసి రమ్య తల్లి పేరున రిజిస్టర్ చేశారు. ప్రభుత్వ స్పందనను జాతీయ ఎస్సీ కమిషన్ కొనియాడిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ కేసులో ప్రభుత్వం స్పందించిన తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రభుత్వానికి కృతజ్ఞతలు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఆగష్టు 15న నా కుమార్తె హత్యకు గురైందని తెలిసి సృహ కోల్పోయాను. తర్వాత ఎస్పీ వచ్చి ధైర్యం చెప్పారు. దిశ డీఎస్పీ రవికుమార్ నాతో వివరాలు సేకరించారు. సీఎం ఆదేశాల మేరకు దోషిని వెంటనే పట్టుకుంటామన్నారు. ఆ మాట నిలుపుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మొదలుకుని పోలీస్ శాఖలో ప్రతి ఒక్కరూ మాకు వెన్నంటి ఉండి అండగా నిలిచారు. ఆ సమయంలో ఇప్పుడు మంత్రిగా ఉన్న మేరుగ నాగార్జున పరామర్శించి, మరింత ధైర్యం చెప్పారు. న్యాయస్థానమంటే ఎరుగని మాకు ప్రత్యేక పీపీ శారదామణి సొంత మనిషిగా భావించి సహకరించారు. ఇవాళ దోషికి ఉరి శిక్ష విధించడంతో మాకు ఊరట లభించింది. మాకు సహకరించిన ప్రభుత్వం, పోలీసులు, దళిత ప్రజా సంఘాల నాయకులందరికీ ధన్యవాదాలు – జ్యోతి, హత్యకు గురైన రమ్య తల్లి సీఎంతో మాట్లాడాకే ధైర్యం వచ్చింది మా అక్కను చంపిన వాడిని గంటల వ్యవధిలోనే గుర్తించి పట్టుకున్నారు. ఈ కేసులో మాకు న్యాయం జరుగుతుందని తొలుత భావించలేదు. సీఎం జగన్మోహన్రెడ్డి వద్దకు వెళ్లే ముందు కూడా న్యాయం జరుగుతుందని పెద్దగా అనిపించలేదు. అయితే సీఎంతో మాట్లాడిన తర్వాతే ధైర్యం వచ్చింది. అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సీఎం దగ్గరుండి అన్నీ తానై చూసుకున్నారు. ప్రభుత్వం, పోలీసులు, న్యాయస్థానం, ప్రజాప్రతినిదులు మాకు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. – మౌనిక, హత్యకు గురైన రమ్య సోదరి ఈ తీర్పుతో మహిళలకు భరోసా గత ఏడాది ఆగస్టు 15న బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకు గురవ్వగానే ఘటనా స్థలాన్ని పరిశీలించాం. అనంతరం జీజీహెచ్కు వెళ్లి రమ్య కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పాం. హత్య చేసిన యువకుడిని సాంకేతిక ఆధారాలతో గుర్తించి, పది గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేశాం. సాక్ష్యాలు, సీసీ పుటేజీ, వేలి ముద్రలు, డీఎన్ఏ తదితర ఆధారాలు సేకరించాం. పోలీస్, ఫోరెనిక్స్, న్యాయస్థానం.. ఒక బృందంగా పని చేశాం. ఎస్సీ, ఎస్టీ కమిషన్ సైతం పోలీసుల పనితీరును అభినందించింది. ఈ తీర్పుతో మహిళలకు భరోసా కలుగుతుందనడంలో సందేహం లేదు. – కె.ఆరిఫ్హఫీజ్, గుంటూరు జిల్లా ఎస్పీ ఈ శిక్షకు అతను అర్హుడే రమ్య హత్య కేసుపై జిల్లా పోలీసులు ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. కోర్టు ట్రయల్ జరుగుతున్న క్రమంలో పలువురు సాక్షులను విచారించాం. సాక్ష్యాధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన న్యాయస్థానం దోషికి మరణ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. హత్యకు పాల్పడిన అతను ఈ శిక్షకు పూర్తిగా అర్హుడే. – శారదామణి, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరణ శిక్ష సరికాదు క్షణికావేశంలో చేసిన తప్పుకు మరణ శిక్ష సరికాదు. ఘటన జరిగిన రోజు నుంచి నా కుమారుడు ఏడుస్తూనే ఉన్నాడు. తప్పు చేశానని పశ్చాత్తాప పడుతున్నాడు. నా కుమారుడికి ఉరి శిక్ష వేస్తే రమ్య తిరిగి వస్తుందనుకుంటే ఆ శిక్ష వేయొచ్చు. కోర్టు తన నిర్ణయాన్ని పునరాలోచించాలి. – భూలక్ష్మి, శశికృష్ణ తల్లి ‘దిశ’ను విమర్శిస్తున్న వారికి ఇదో చెంపపెట్టు ఇంజనీరింగ్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ గుంటూరు కోర్టు ఇచ్చిన తీర్పు దిశ చట్టంపై విమర్శలు చేస్తున్న వారికి చెంపపెట్టు. దేశంలో ఎక్కడాలేని రీతిలో పిల్లలు, మహిళల రక్షణ కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశ చట్టానికి రూపకల్పన చేశారు. పార్లమెంట్ ఆమోదించడంలో జాప్యం వల్ల దిశ ఇంకా చట్ట రూపం సంతరించుకోలేదు. ఆ చట్టం స్ఫూర్తితో దిశ యాప్ను ప్రభుత్వం రూపొందించింది. కోటి మంది ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. ఆపదలో ఉన్న మహిళలు యాప్లో సమాచారం ఇచ్చిన వెంటనే పోలీసులు రక్షణ చర్యలు చేపడుతున్నారు. – సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు కోర్టు తీర్పు చరిత్రాత్మకం విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడు శశికృష్ణకు ఉరిశిక్ష విధిస్తూ గుంటూరు కోర్టు తీర్పునివ్వడం చరిత్రాత్మకం. హత్య జరిగిన 10 గంటల్లోపే నిందితుణ్ణి అరెస్ట్ చేసి.. 24 గంటల్లోనే చార్జిషీట్ దాఖలు చేశాం. కోర్టు తీర్పుతో ఇలాంటి ఘటనలకు పాల్పడే మృగాలకు వణుకు పుడుతుంది. ఈ తీర్పు ఇప్పుడు దిశ చట్టం అవసరాన్ని మరింత గుర్తు చేస్తోంది. – తానేటి వనిత, హోంమంత్రి ‘దిశ’ గొప్పదనమిది విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడు శశికృష్ణకు గుంటూరు కోర్టు ఉరిశిక్ష విధించడాన్ని స్వాగతిస్తున్నాం. 9 నెలల్లోనే నిందితుడికి ఉరి శిక్షపడేలా చేయడం సీఎం వైఎస్ జగన్ పరిపాలన గొప్పదనం. దిశ చట్టాన్ని కేంద్రం ఆమోదిస్తే.. 21 రోజుల్లోనే నిందితులకు ఉరి శిక్ష పడేలా చేయడానికి ఆస్కారం ఉండేది. – ఆర్కే రోజా, పర్యాటక శాఖ మంత్రి ‘దిశ’తో సత్వర న్యాయం గుంటూరులో ఉన్మాది కత్తిపోట్లకు బలైన రమ్య హత్యకేసు నిందితునికి ఉరిశిక్ష ఖరారు చేస్తూ ప్రత్యేక కోర్టు తీర్పునివ్వడం హర్షణీయం. ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ’దిశ’ బిల్లు స్ఫూర్తితో సత్వర న్యాయానికి ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఈ కేసు విచారణ, బాధిత కుటుంబాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని జాతీయ ఎస్సీ కమిషన్ సైతం మెచ్చుకుంది. మహిళలపై అకృత్యాలకు పాల్పడే మృగాళ్లకు ఈ కేసు ఒక హెచ్చరికగా నిలుస్తుంది. – వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్, మహిళా కమిషన్ మృగాళ్లకు కనువిప్పు రమ్య హత్య కేసులో ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు మృగాళ్లకు కనువిప్పు అవుతుంది. ఎవరైనా మహిళల జోలికి వస్తే తమ ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో చెప్పడానికి ఈ కేసు ఒక ఉదాహరణ. రమ్య కేసును దిశ చట్టం రూపకల్పనలో పేర్కొన్నట్టుగా వేగవంతంగా చర్యలు చేపట్టి శిక్ష పడేలా చేశారు. – విడదల రజని, వైద్యారోగ్య శాఖ మంత్రి -
ఏపీ: మూడు రాజధానులు, సీఆర్డీఏపై వెలువడిన తీర్పు
-
అహ్మదాబాద్ బాంబు పేలుళ్ల కేసులో సంచలన తీర్పు
-
సంచలన తీర్పు: దేశ చరిత్రలో తొలిసారి 38 మందికి మరణశిక్ష
సాక్షి, న్యూఢిల్లీ: అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. 49 మంది దోషుల్లో 38 మందికి మరణశిక్ష విధించగా.. 11 మందికి జీవిత ఖైదు విధించింది. ఈ మేరకు జడ్జి ఏఆర్ పాటిల్ తీర్పు వెలవరించారు. ఒక కేసులో ఇంత మందికి ఉరిశిక్ష విధించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. కాగా, అహ్మదాబాద్లో రద్దీ ప్రాంతాలే లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు 2008లో 18 చోట్ల వరుస బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ప్రభుత్వ సివిల్ ఆస్పత్రి, మున్సిపల్ ఎల్జీ ఆస్పత్రి, కార్లు, పార్కింగ్ ప్రదేశాల్లో జరిగిన పేలుళ్లలో 58 మంది మృతి చెందగా, 200 మందికి గాయాలయ్యాయి. కొన్ని బాంబులను ముందే గుర్తించిన భద్రతా దళాలు వాటిని నిర్వీర్యం చేశాయి. దీంతో కొంత ప్రాణనష్టం తప్పింది. చదవండి: (వివక్ష, వివాదం ఉంటేనే జోక్యం) -
అలా చేస్తే ఒప్పుకోం.. ఇన్సురెన్సు కంపెనీలకు సుప్రీం కోర్టు హెచ్చరిక!
న్యూఢిల్లీ: బీమా తీసుకునే సమయంలో పాలసీదారు దరఖాస్తులో వెల్లడించిన (అప్పటి) వైద్య పరిస్థితిని ఉదహరించడం ద్వారా.. బీమా సంస్థ సంబంధిత వ్యక్తి క్లెయిమ్ను తిరస్కరించలేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. బాధ్యత ఉంది బీమా తీసుకునే వ్యక్తిపైనా తనకు తెలిసిన అన్ని వాస్తవాలను బీమా సంస్థకు వెల్లడించాల్సిన అవసరం, బాధ్యత ఉంటుందని స్పష్టం చేసింది.‘‘బీమా చేసిన వ్యక్తి వైద్య పరిస్థితిని అంచనా వేసి, పాలసీ జారీ చేసిన తర్వాత ఏదై నా క్లెయిమ్కు సంబంధించి బీమాదారుడికి అప్పటికే ఉన్న వైద్య పరిస్థితిని ఉదహరించడం ద్వారా ఆ క్లెయిమ్ను బీమా సంస్థ తిరస్కరించలేదు’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఇచ్చిన ఒక రూలింగ్పై దాఖలైన అప్పీల్ను పరిష్కరిస్తూ, సుప్రీం తాజా తీర్పు ఇచ్చింది. చదవండి:ఆమ్వే, ఓరిఫ్లేమ్, టప్పర్వేర్.. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలకు షాక్ ! -
‘బ్రెయిన్లో చిప్స్.. కళ్లల్లో కెమెరా అంటూ ’
‘నా ఫొటోలు ఎక్కడో ఉన్నాయని ఎందరో చెబుతున్నారు. అవి ఎక్కడో ఏంటో మీరే తెలుసుకుని తీసేయండి’ , ‘నేను ఫలానా హీరోకు ఆన్లైన్లో డబ్బులిచ్చా. వెంటనే కేసు పెట్టి అవి వసూలు చేయండి’, ‘కెనడా ప్రభుత్వం నా మీద సాంకేతిక నిఘా పెట్టింది. వాళ్లు నా బ్రెయిన్లో పెట్టిన చిప్స్ తీసేయండి’ , ‘ఆస్తి కోసం నా కళ్లల్లో కెమెరా పెట్టిన వాళ్లను పట్టుకోండి. ఎలాగైనా సరే ఆ కెమెరాలు బయటపడేయండి..’ సాక్షి, హైదరాబాద్: ఇవన్నీ ఏంటనుకుంటున్నారా? గడచిన కొన్నాళ్లుగా సైబర్ క్రైమ్ పోలీసులకు షాక్ ఇస్తున్న పలువురి ఫిర్యాదులు. వీరిలో కొందరైతే కమిషనర్ కార్యాలయం, మంత్రుల వరకు వెళ్లి చుక్కలు చూపించారు. ఈ తరహాకు చెందిన నలుగురు ‘బాధితులు’ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను చిత్రంగా ‘వేధించారు’. ఆయా ఫిర్యాదులు చందమామ కథల్ని తలపించేరీతిలో ఉండటం గమనార్హం. ఆ కథలు.. పోలీసుల వ్యథలు ఇలా ఉన్నాయి.. ఆ మాత్రం తెలుసుకోలేరా.. ► కొన్ని రోజుల క్రితం సిటీ సైబర్ పోలీసులను ఓ మహిళ ఆశ్రయించింది. తాను సిద్దిపేట జిల్లా నుంచి వచ్చినట్లు పరిచయం చేసుకుంది. తనకు తెలిసిన వాళ్లు, తెలియని వాళ్లు ఇటీవల ఫోన్లు చేస్తున్నారని, ‘నీ ఫొటోలు ఇంటర్నెట్లో ఉన్నాయి’ అంటూ చెబుతున్నారని మౌఖికంగా ఫిర్యాదు చేసింది. మీ అనుమతి లేకుండా పొందుపర్చారా? ఏయే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఉన్నాయి? లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇస్తారా? అంటూ అధికారులు ఆమెను ప్రశ్నించారు. ‘కంప్లైంట్ ఇవ్వను... ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉందని చెబుతున్నారు? ఆ మాత్రం తెలుసుకోలేరా?’ అంటూ సమాధానం ఇచ్చింది. ► దీంతో పోలీసులు ఆమెకు నచ్చజెప్పి పంపారు. అంతటితో ఆగని ఆమె నేరుగా కమిషనరేట్లో ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసింది. అక్కడి అధికారులు ఓ మహిళా కానిస్టేబుల్ను తోడుగా ఇచ్చి సైబర్ ఠాణాకు పంపారు. రెండోసారి వచ్చినప్పుడు ‘నా ఫొటోలు ఎక్కడో ఉన్నాయి. అది ఎక్కడో తెలుసుకుని మీరే తొలగించండి’ అంటూ చెప్పింది. దీంతో తోడుగా వచ్చిన మహిళా కానిస్టేబుల్ అసలు విషయం తెలుసుకుని ఉన్నతాధికారులకు చెప్పారు. ఈ ‘బాధిత మహిళ’ను పంపడానికి సైబర్ క్రైమ్ పోలీసులు నానా పాట్లు పడ్డారు. బ్రెయిన్లో చిప్స్.. కళ్లల్లో కెమెరా అంటూ.. ► గడచిన కొన్ని నెలల్లో ఈ రెండింటితో పాటు మరికొందరు విచిత్ర ఫిర్యాదుదారులూ సైబర్ క్రైమ్ పోలీసులకు చుక్కలు చూపించారు. హఠాత్తుగా ఠాణాకు వచ్చిన ఓ వ్యక్తి తాను కెనడాలో చదువుకుని, ఉద్యోగం చేసి వచ్చానని అధికారులకు చెప్పాడు. తన మేధస్సు ఇతర దేశాలకు ఉపయోగపడకూడదని ఆ ప్రభుత్వం నిఘా వేసిందని వివరించాడు. దీనికోసం బ్రెయిన్లో చిప్స్ ఏర్పాటు చేసిందని, అవి తీసేందుకు చర్యలు తీసుకోవాలని కోరడంతో అధికారులకు అవాక్కయ్యారు. ► మరో విద్యాధికుడైన యువకుడు తన బంధువుల పైనే ఫిర్యాదు చేశాడు. ఆస్తి వివాదాల నేపథ్యంలో తన కళ్లల్లో కెమెరాలు పెట్టిన వాళ్లు ఎక్కడికి వెళ్తున్నానో కంప్యూటర్ ద్వారా తెలుసుకుంటున్నారని చెప్పాడు. తక్షణం కేసు నమోదు చేసి ఆ కెమెరాలు తీయించడంతో పాటు బంధువును జైలుకు పంపాలన్నాడు. అనునిత్యం చిన్న చిన్న చిత్రమైన ఫిర్యాదులూ తమకు వస్తుంటాయని, ఓర్పుతో వారిని వెనక్కు పంపుతున్నామని ఓ అధికారి తెలిపారు. ముందు హీరో పేరు.. ఆపై పోలీసులే అంటూ.. ► సైబర్ క్రైమ్ పోలీసులకు ఈ షాక్ తగలడానికి కొన్నాళ్ల ముందు మరో చిత్రమైన ఫిర్యాదుదారు ముప్పతిప్పలు పెట్టారు. నగరానికి చెందిన ఓ మహిళ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్కు వరుసగా కొన్నాళ్లు వచ్చారు. తొలుత కొన్ని రోజుల పాటు ఏమీ మాట్లాడకుండా వచ్చి, కూర్చుని వెళ్లిపోయేవారు. ఆమెకు ఎదురైన ఇబ్బంది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ అధికారులు ఆమెను అడిగారు. ► ఓ పెద్ద హీరోకు తాను ఆన్లైన్లో డబ్బు చెల్లించానని, ఆ మొత్తం తిరిగి ఇప్పించాలంటూ ఆమె చెప్పడంతో పోలీసులు ఆలోచనలో పడ్డారు. ఎందుకు ఇచ్చారు? ఆధారాలు ఏమున్నాయని? పోలీసులు కోరడంతో ‘బాధితురాలి’కి చిర్రెత్తుకొచ్చింది. మరుసటి రోజు నేరుగా ఓ మంత్రి కార్యాలయానికి వెళ్లింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడానికి పోలీసులే డబ్బు అడిగారని ఫిర్యాదు చేసింది. ఆ కార్యాలయం ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. ఈమెను ఠాణాకు రాకుండా చేయడానికి పోలీసులు చాలా ప్రయాసపడాల్సి వచ్చింది. -
అత్యాచారం కేసులో... ఒకే రోజులో తీర్పు
అరారియా: అత్యాచార బాధితులకి న్యాయం జరగాలంటే కోర్టుల్లో ఏళ్లకి ఏళ్లు ఎదురు చూసే రోజులు ఇక ముందు ఉండవని ఆశ కలిగేలా బిహార్ కోర్టు మెరుపువేగంతో తీర్పు చెప్పింది. ఎనిమిదేళ్ల బాలికపై దారుణంగా అత్యాచారం చేసిన ఒక వ్యక్తికి పోక్సో కోర్టు కేవలం ఒక్క రోజులోనే విచారణ పూర్తి చేసి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. బిహార్లోని అరారియా జిల్లాలో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ (పోక్సో) కోర్టు ఇచ్చిన తీర్పు దేశంలోనే అత్యంత వేగంగా ఇచ్చిన మొదటి తీర్పుగా రికార్డులెక్కింది. పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి శశికాంత్ రాయ్ దోషికి యావజ్జీవ కారాగారశిక్ష, రూ. 50 వేల జరిమానా విధించారు. బాధితురాలి భవిష్య™Œ కోసం పరిహారంగా రూ.7 లక్షలు చెల్లించాలని ఆదేశించారు. అక్టోబర్ 4నే కోర్టు ఈ తీర్పు ఇచ్చినప్పటికీ, తీర్పు పూర్తి పాఠం ఈనెల 26న అందుబాటులోకి వచ్చింది. జూలై 22న ఈ అత్యాచార ఘటన జరగ్గా, ఆ మర్నాడు ఎఫ్ఐఆర్ దాఖలైంది. అరారియా మహిళా పోలీసు స్టేషన్ ఇన్చార్జ్ రీటా కుమారి ఈ కేసును ప్రత్యేకంగా పర్యవేక్షించారు. రేప్ కేసుల్లో అత్యంత వేగంగా విచారణ పూర్తి చేసిన కేసు ఇదేనని పోక్సో పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్యామల యాదవ్ తెలిపారు. 2018 ఆగస్ట్లో మధ్యప్రదేశ్లోని దాటియా జిల్లా కోర్టు ఒక అత్యాచారం కేసులో మూడు రోజుల్లో తీర్పు ఇచ్చి రికార్డుకెక్కిందని ఇప్పుడు బిహార్ కోర్టు దానిని తిరగరాసిందన్నారు. -
ఏపీ: సర్వత్రా ఉత్కంఠ.. ‘పరిషత్’ ఎన్నికలపై నేడే తీర్పు
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టు గురువారం తీర్పు వెలువరించనుంది. ఉదయం 10.30 గంటలకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు గతంలో ఏ దశలో అయితే నిలిచిపోయాయో అక్కడి నుంచి తిరిగి నిర్వహించేందుకు వీలుగా మళ్లీ తాజా నోటిఫికేషన్ జారీచేయాలని ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇటీవల తీర్పు ఇచ్చారు. (చదవండి: సీఎం జగన్ లేఖపై తక్షణం స్పందించిన విదేశాంగ శాఖ) ఈ తీర్పును రద్దుచేయాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దాఖలు చేసిన అప్పీలుపై ఆగస్టు 5న విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. తిరిగి ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా తాజా నోటిఫికేషన్ ఇవ్వాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను ధర్మాసనం సమర్థిస్తుందా? లేక పూర్తయిన ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు చేయాలని ఆదేశిస్తుందా? అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.(చదవండి: జేసీ బ్రదర్స్కు టీడీపీ ఝలక్) -
ఈ విషయంలో కేంద్రానికి ఆదేశాలు ఇవ్వలేం: సుప్రీం
Supreme Court Rejects Plea To Recognize Hockey As India's National Game: హాకీని జాతీయ క్రీడగా అధికారికంగా గుర్తించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని భారత దేశపు అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. న్యాయవాది విశాల్ తివారీ దాఖలు చేసిన పిల్పై బుధవారం విచారణ చేపట్టిన జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని తగు రీతిలో తాము ఆదేశించలేమంటూ స్పష్టం చేసింది. క్రికెట్ వల్ల హాకీ తన ప్రభావాన్ని కోల్పోతోందని.. ఈ విషయంలో కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని.. విశాల్ తివారీ తన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే, ఇందులో తాము చేయడానికి ఏమీ లేదని, పిటిషనర్ కోరిన విధంగా తాము కేంద్రాన్ని ఆదేశించలేమని కోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి విషయాలపై ప్రజల్లో చైతన్యం రావాలని అభిప్రాయపడింది. మహిళా బాక్సర్ మేరీకోమ్ వంటి క్రీడాకారిణిలు ప్రతికూల పరిస్థితుల్లోనూ రాణించారని, ఆ స్ఫూర్తి అందరిలో కనిపించాలని పేర్కొంది. బెంచ్ ఆదేశాలతో విశాల్ తివారీ తన పిటిషన్ ను వెనక్కి తీసుకున్నారు. చదవండి: టీమిండియా గెలుపు.. నాగిని డ్యాన్స్తో ఖుషీ చేసుకున్న మాజీ క్రికెటర్ -
ట్విన్ టవర్స్ కూల్చోద్దు.. ఒక్కసారి మా మాట వినండి
ట్విన్ టవర్స్ కూల్చివేత తీర్పుపై నిర్మాణ సంస్థ సుప్రీం కోర్టులో రివ్యూ పిటీషన్ దాఖలు చేసింది. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై తమకు గౌరవం ఉందని సూపర్ టెక్ చైర్మన్ ఆర్కే అరోరా అన్నారు. రేరా చట్టంలో ఉన్న నిబంధనల ప్రకారమే ఈ భవనాలు నిర్మించామని తెలిపారు. అంతేకాదు కోర్టు తీర్పు వల్ల తమ కంపెనీపై చెడు ప్రభావం ఉంటుందని తాను అనుకోవడం లేదన్నారు. నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని నోయిడాలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి 40 అంతస్థుల ట్విన్ టవర్స్ నిర్మిచండంపై ఇటు అలహాబాద్ హైకోర్టుతో పాటు దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేశాయి. మూడు నెలలల్లోగా ఈ భవనాలను కూల్చేయడంతో పాటు అందులో ప్లాట్లను కొనుగోలు చేసిన వారికి 12 శాతం వడ్డీతో డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ కోర్టు తీర్పు వెలువరించింది. ట్విట్ టవర్స్లో 21 దుకాణాలతో పాటు 915 ప్లాట్స్ ఉన్నాయి. చదవండి: నోయిడా ట్విన్ టవర్ల కూల్చివేత.. ‘రేరా’ ఎక్కడ విఫలమవుతోంది? -
నోయిడా ట్విన్ టవర్ల కూల్చివేత.. ‘రేరా’ ఎక్కడ విఫలమవుతోంది?
నిబంధనలు అతిక్రమించి నిర్మాణాలు చేపట్టారంటూ నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని 40 అంతస్తుల ట్విన్ టవర్లను కూల్చేయాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రియాల్టీ రంగానికి పెనుషాక్లా తగిలింది. రేరా చట్టం (రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ డెవలప్మెంట్ యాక్ట్ -2016) అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఇంత తీవ్ర స్థాయిలో కోర్టు తీర్పు వెలువడానికి కారణం ఏంటీ. ఇంత భారీ స్థాయిలో తప్పులు చోటు చేసుకుంటుంటే దాన్ని అరికట్టడంలో రేరా ఎక్కడ విఫలమైంది అనేది ఇప్పుడు రియాల్టీ రంగంలో చర్చకు దారి తీసింది. రేరా సరిపోదా ? దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఇతర కోర్టులకు కూడా మార్గదర్శనం కానుంది. ఈ తరహా తీర్పులు మరిన్ని వెలువడితే రియల్టీ రంగంలో ఉన్న వారికి సైతం ఇబ్బంది. రియాల్టీలో ఉన్న ప్రధాన లోపాలు ఏంటీ వీటిని పరిష్కరించాలంటే రేరా లాంటి చట్టాలే సరిపోతాయా? ఈ వ్యాపారంలో ఉన్న వారు, కొనుగోలుదారులు, ఇతర ప్రభుత్వ విభాగాల బాధ్యత ఏంటీ అనే తెర మీదకు వస్తోంది. - రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎవరు ప్రవేశించాలి. అందుకు అర్హతలు ఏముండాలి అనే విషయంలో ఎటువంటి నిబంధనలు లేవు. దీంతో ఈ రంగంపై అనుభవం లేకపోయినా తమ బ్లాక్మనీని వైట్ చేసుకునేందుకు రియాల్టీ రంగంలోకి వస్తున్న వారి సంఖ్య ఎక్కువైపోతుంది. వీరికి ప్రాజెక్టును పూర్తి చేయడం మీద కన్న తమ లాభం, ఇతరత్రా వ్యవహరాలపైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. ఫలితంగా ఇలాంటి వారి వెంచర్లను నమ్మినవారు మధ్యలో మునిగిపోతున్నారు. రేరా చట్టంతో ఈ సమస్య సమసిపోతుందనుకున్నారు. అయితే వాస్తవంలో అలా జరగడం లేదు - బిల్డర్కి కొనుగోలుదారుడికి మధ్య సమస్య తలెత్తిన సందర్భంలో వాటిని పరిష్కరించడంలో రేరాది ప్రేక్షక పాత్రే అవుతుంది. రేరా చట్టంలో ఉన్న నిబంధనలు లీగల్ ఫైట్ టైమ్ని మరింతగా పెంచుతున్నాయి. ఫలితంగా ఆర్థికంగా బలంగా ఉండే బిల్డర్లతో కొనుగోలుదారులు లీగల్గా ఎక్కువ కాలం పోటీ పడలేని పరిస్థితి నెలకొంది. ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఫాస్ట్ట్రాక్ కోర్టులు అవసరమనే అభిప్రాయం వినిపిస్తోంది. - సబ్బు బిళ్ల మొదలు బట్టల వరకు ఏదైనా వస్తువును కొనేప్పుడు దాన్ని పరిశీలించి.. బాగుందని నమ్మితేనే కొంటాం. కానీ రియల్ ఎస్టేట్, ఇళ్ల కొనుగోలు విషయంలో ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. కనీసం నిర్మాణం మొదలుకాకముందే బిల్డర్లు అమ్మకాలు మొదలుపెడతారు. వారి ఏజెంట్లు ఆహా ఓహో అని చెబుతారు. ఆలస్యం చేస్తే రేటు పెరుగుతుందని తొందరపెడతారు. మరోవైపు బ్యాంకర్లు, ఇతర ఫైనాన్షియల్ సంస్థలు సైతం లోన్లు ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో డబ్బులు చెల్లించినా సకాలంలో ఇళ్లు చేతికి అందక చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేల రూపాయల సొమ్మును ఈఎంఐ, వడ్డీలుగా అదనంగా చెల్లిస్తున్నారు. ఈ విషయంలో కనీసం ప్రభుత్వ విభాగాలు సైతం చేష్టలుడిగి చూస్తుండి పోతున్నారు. ఇచ్చిన గడువులోగా ఇంటి నిర్మాణం పూర్తి చేయని బిల్డర్కి ఎటువంటి జవాబుదారితనం లేకపోయినా వచ్చిన నష్టమేమీ లేకుండా పోయింది. చదవండి : 40- Storey Noida Towers: కుమ్మక్కయ్యారు.. కూల్చేయండి -
బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సు, అదనంగా ఎంత ప్రీమియం చెల్లించాలి?
వాహనదారుల సంక్షేమాన్ని కోరుతూ బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సు తప్పనిసరి చేస్తూ మద్రాసు హై కోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పు అమల్లోకి వస్తే వాహనం కొనుగోలు చేసేప్పుడు ఎంత ఆర్థిక భారం పడుతుంది. అమలు విధానం ఎలా ఉండవచచ్చు, కోర్టు తీర్పుపై ఇటు వాహన తయారీ సంస్థలు, అటు ఇన్సురెన్సు కంపెనీలు ఏమనుకుంటున్నాయి ? బంపర్ టూ బంపర్ లక్షలు ఖర్చు పెట్టి వాహనం కొనుగోలు చేసే సందర్భంలో ఇన్సెరెన్సు ప్రీమియం కట్డడంలో చాలా మంది వెనుకాముందు ఆలోచిస్తారు. ప్రీమియం తగ్గించుకునేందుకు రకరకాల ప్లాన్లు వేస్తారు. దీనికి తగ్గట్టే ఇన్సెరెన్సు సంస్థలు, వాటి ఏజెంట్లు అతి తక్కువ ప్రీమియం ఉండే థర్డ్ పార్టీ ఇన్సురెన్సు ప్లాన్లనే చెబుతుంటారు. ఇప్పటి వరకు ఈ తరహా పద్దతే ఎక్కువగా చెల్లుబాటు అవుతూ వస్తోంది. అయితే వాహనం కొనుగోలు చేసిన తర్వాత మొదటి ఐదేళ్ల పాటు బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సును తప్పనిసరి చేసింది మద్రాసు హై కోర్టు. అంటే వాహనానికి ఏదైనా ప్రమాదం వాటిలినప్పుడు ఆ వాహనంతో పాటు దాని యజమాని లేదా డ్రైవరు, అందులో ప్రయాణించే వ్యక్తులందరికీ నష్టపరిహారం పొందే హక్కు ఉంటుంది. ప్రీమియం ఎంత పెరుగుతుంది? కొత్త వాహనాలకు కొనుగోలు చేసేప్పుడు నూటికి తొంభైశాతం మంది బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సునే చేయిస్తున్నారు. ఆ తర్వాత రెన్యువల్ చేయించేప్పుడే థర్డ్ పార్టీ ఇన్సురెన్సులకు వెళ్తున్నారు. ప్రస్తుతం వాహన నెట్ప్రైస్లో 3 శాతం మొత్తాన్ని ఒక ఏడాది పాటు బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సు ప్రీమియంగా చెల్లిస్తున్నారు. ఇప్పుడు ఈ కాలాన్ని ఐదేళ్లకు పొడిగించాలని కోర్టు సూచించింది. ఆ లెక్కన వాహనం ధరలో 3 శాతం మొత్తాన్ని ఐదేళ్లకు పెంచితే మార్కెట్వాల్యూ, తరుగుదల ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఇన్సురెన్సు ప్రీమియం దాదాపు మూడింతలు పెరిగిపోతుంది. ఆర్థిక భారం ఎంతంటే ? ఐదేళ్ల కాలానికి బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సును లెక్కించందుకు హ్యుందాయ్ కంపెనీకి చెంది వెన్యూ కారును పరిగణలోకి తీసుకుంటే.. ఇప్పుడు ఒక ఏడాది బంపర్ టూ బంపర్ ఇన్సురెన్స్కి రూ. 38,900 ప్రీమియంగా ఉంది. ఇదే ఇన్సురెన్సును ఐదేళ్ల కాలానికి తీసుకుంటే ప్రీమియం మొత్తం ఒకేసారి రూ. 1,26,690కి చేరుతుంది. అంటే వినియోగదారుడు ప్రస్తుతం చెల్లిస్తుదానికి అదనంగా రూ. 87,790లు చెల్లించాల్సి వస్తుంది. వివిధ మోడళ్లను బట్టి ఈ ప్రీమియం మారుతుంది. వాహన తయారీ సంస్థలు ఏమంటున్నాయి ? కరోనా సంక్షోభం తర్వాత ఇప్పుడిప్పుడే ఆటో మొబైల్ పరిశ్రమ కొలుకుంటోంది. కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు వాహన తయారీ సంస్థలు ధరల తగ్గింపు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఒకసారి ఐదేళ్లకు బంపర్ టూ బంపర్ ఇన్సురెన్స్ని కోర్టు తప్పనిసరి చేసింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే వాహనాల ధరలు పెరిగిపోతాయని, ఫలితంగా అమ్మకాలపై ప్రభావం పడుతుందని వాహన తయారీ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉదాహరణకి హ్యుందాయ్ వెన్యూ వాహనానికి సంబంధించి ఒక ఏడాది బంపర్ టూ బంపర్ రెండేళ్లు థర్డ్ పార్టీ ఇన్సురెన్సుతో కలిసి నెట్ప్రైస్ రూ. 9,96,310 ఉంది. ఇప్పుడు కోర్టు తీర్పు ప్రకారం ఐదేళ్ల ఇన్సునెన్సు ప్రీమియం చెల్లించాలంటే రూ.10,84,295 చెల్లించాల్సి వస్తుంది. అదే మారుతి బ్రెజా విషయానికి వస్తే ఈ మొత్తం రూ.9,86,199 నుంచి రూ. 10,76,180కి చేరుకుంటుంది. ఇన్సురెన్సు కంపెనీ స్పందన ఏంటీ ? ఏ తరహా పాలసీ తీసుకోవాలి, ప్రీమియం ఎంత చెల్లించాలనే అంశంపై వాహన కొనుగోలుదారులను తాము ఒత్తిడి చేసేది ఏమీ ఉండదని ఇన్సురెన్సు కంపెనీలు చెబుతున్నాయి. మోటారు వాహన చట్టాలను లోబడి వాహన కొనుగోలుదారుడి ఇష్టాఇష్టాలకు అనుగుణంగానే పాలసీలు చేయిస్తామని చెబుతున్నాయి. వాహనం కొనుగోలు చేసేప్పుడు చాలా మంది మొదటి ఏడాదికి బంపర్ టూ బంపర్ ఇన్సురెన్స్ చేయిస్తారని, ఆ తర్వాత వాహనం వాడే విధానం, రిస్క్ ఆధారంగా థర్డ్పార్టీ లేదా బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సులు తీసుకుంటారని ఇన్సురెన్సు కంపెనీ ఏజెంట్లు వెల్లడిస్తున్నారు. చదవండి : బంపర్ టూ బంపర్ ఇన్సురెన్స్ తప్పనిసరి..మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు -
సుప్రీం కోర్టులో రిలయన్స్కి చుక్కెదురు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో రిలయన్స్కు చుక్కెదురైంది. ఫ్యూచర్ రిటైల్ విషయంలో అమెజాన్కు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. గతంలో ఫ్యూచర్, రిలయన్స్ రిటైల్ గ్రూపుల మధ్య రూ 24,713 కోట్ల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని అమెజాన్ సవాల్ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత రిలయన్స్ ఫ్యూచర్ డీల్ ఒప్పందాన్ని నిలిపేస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఈ వివాదానికి సంబంధించి సింగపూర్ ఎమర్జెన్సీ ఆర్బిట్రేటర్ ఇచ్చిన తీర్పు అమలు చేయాలని ఆదేశించింది. -
అమరారెడ్డి కాలనీ వాసులు రెండు వారాల్లో ఇళ్లు ఖాళీ చేయాలని హైకోర్టు ఆదేశం
-
కోర్టు ధిక్కరణ కేసుల్లో.. తెలంగాణ హైకోర్టు వినూత్న తీర్పులు
సాక్షి, హైదరాబాద్: కోర్టు ఆదేశాల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులకు సమాజ సేవ చేసేలా సామాజిక శిక్షలు విధిస్తూ హైకోర్టు వినూత్న తీర్పులు ఇస్తోంది. కోర్టు ఆదేశాలు అమలు చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తూనే సంబంధిత అధికారులను సమాజ సేవలో భాగస్వామ్యం చేస్తోంది. ఆయా అధికారులకు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు, పదవీ విరమణ బెనిఫిట్స్ పొందడంలో ఇబ్బంది తలెత్తకుండా సామాజిక సేవ చేయాలనే షరతులతో అంతకుముందు వారికి విధించిన జరిమానా, జైలు శిక్షను రద్దు చేస్తోంది. వారి తప్పును తెలుసుకొని మళ్లీ కోర్టు ఆదేశాల అమలులో జాగరూకతతో వ్యవహరించేలా చేస్తోంది. ఇలాంటి సేవకు అధికారులు సైతం ఆనందంగా ముందుకొస్తున్నారు. ఈ ఆరు నెలల కాలంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పుల్లో కొన్ని. అనాథలకు బోధన చేయండి.. వరంగల్ జిల్లా జాయింట్ కలెక్టర్గా 2015లో విధులు నిర్వహించిన సమయం (ప్రస్తుతం నల్లగొండ జిల్లా కలెక్టర్)లో కోర్టు ఆదేశాల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి ప్రశాంత్ జే.పాటిల్కు సింగిల్ జడ్జి రూ.2 వేలు జరిమానా విధించారు. కోర్టు ఆదేశాల అమలులో జాప్యానికి క్షమాపణ కోరుతూ పాటిల్ అప్పీల్ దాఖలు చేసుకున్నారు. ఈ అప్పీల్ను విచారించిన ధర్మాసనం.. నల్లగొండ జిల్లాలో ని ఏదైనా ఒక అనాథ శరణాలయంలో ఆరు నెలలపాటు వారంలో 2 గంటలు చిన్నారులకు విద్యను బోధించాలనే షరతుతో సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేసింది. ఆకతాయికి గాంధీలో పారిశుధ్య పనులు.. సామాజిక శిక్షలు విధించడం 2010లో జస్టిస్ బి.చంద్రకుమార్ తీర్పులతో మొదలయ్యింది. రోడ్డుపై వెళ్తున్న ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఓ యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ సదరు యువకుడు హైకోర్టును ఆశ్రయించాడు. బెయిల్ మంజూరు చేస్తానని, అయితే గాంధీ లాంటి ఆస్పత్రిలో నెల రోజులపాటు కొన్ని గంటలు పారిశుధ్య పనుల్లో పాల్గొనాలని షరతు విధించారు. భోజనం ఏర్పాటు చేయండి.. వరంగల్ జిల్లా జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో)గా పనిచేసి పదవీ విరమణ చేసిన సంధ్యారాణికి సర్వీసులో ఉన్న సమయంలో ఓ తీర్పు అమలులో జాప్యానికి సింగిల్ జడ్జి రూ.2 వేలు జరిమానా విధించారు. అయితే 2019లో తాను పదవీ విరమణ చేశానని, ప్రస్తుతం తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఉన్నానని.. సింగిల్ జడ్జి తనకు విధించిన శిక్షను రద్దు చేయాలని కోరుతూ సంధ్యారాణి అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్ను విచారించిన ధర్మాసనం.. సింగిల్ జడ్జి విధించిన శిక్షను రద్దు చేస్తామని, అనాథ శరణాలయంలో ఉండే వారికి ఉగాది, శ్రీరామనవమి పండులకు ఉచితంగా పంచభక్ష పరమాన్నాలతో కూడిన భోజనం ఏర్పాటు చేయాలని ఆదేశించింది. 20 మందికి వారంపాటు ఇఫ్తార్ ఇవ్వండి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సయ్యద్ యాసీన్ ఖురేషీ సింగిల్ జడ్జి ఆదేశాలను అమలు చేయడంలో కొంత జాప్యం చేశారు. దీంతో జడ్జి ఆయనకు రూ.వెయ్యి జరిమానా విధించారు. ఈ జరిమానాను ఆయన జీతం నుంచి వసూలు చేయాలని, అలాగే ఆయన సర్వీసు రికార్డులో శిక్షను నమోదు చేయాలని తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఖురేషీ దాఖలు చేసిన అప్పీల్ను జస్టిస్ హిమకోహ్లీ ధర్మాసనం విచారించింది. గతంలో ఎటువంటి కోర్టుధిక్కరణ కేసులు ఎదుర్కొలేదని, తీర్పు అమలులో జాప్యానికి భేషరతుగా క్షమాపణలు కోరుతున్నారని.. సింగిల్ జడ్జి తీర్పుతో ఆయనకు పదోన్నతుల్లో ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందని ప్రభుత్వ న్యాయవాది నివేదించారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం సింగిల్ జడ్జి విధించిన శిక్షను రద్దు చేస్తామని పేర్కొంది. అయితే ఈ కేసు విచారణ సమయంలో రంజాన్ మాసం ఉండటంతో.. ఖురేషీ తన ఇంటికి సమీపంలోని మసీదు దగ్గర ఉపవాస దీక్ష విరమించే వారికి వారం రోజులపాటు 20 మందికి తగ్గకుండా ఇఫ్తార్ ఇవ్వాలని షరతు విధించింది. -
వంశధార ట్రిబ్యునల్ తీర్పు సంతోషకరం: సీఎం జగన్
-
ఆ కేసు మూసివేతపై 15న ఆదేశాలిస్తాం: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: కేరళ తీరంలో ఇద్దరు మత్స్యకారులను చంపిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇటాలియన్ నావికా దళం సిబ్బందిపై కేసు మూసివేతకు సంబంధించి ఈ నెల 15వ తేదీన ఆదేశాలు జారీ చేయనున్నట్లు సుప్రీంకోర్టు తెలి పింది. అంతర్జాతీయ మధ్యవర్తిత్వ నిబంధనలు, భారత్, ఇటలీ, కేరళ ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందాలను అనుసరించి, ఆరోపణలు ఎదు ర్కొంటున్న మెరైనర్లు మస్సిమిలానో లాటొర్రె, సల్వటోర్ గిరోన్లపై ఇటలీలో విచారణ జరుగు తుందని ఈ కేసును శుక్రవారం విచారించిన జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం పేర్కొంది. అప్పటి ఘటనలో చనిపోయిన ఇద్దరు మత్స్యకారుల కుటుంబాలకు రూ.4 కోట్ల చొప్పున, మిగతా రూ.2 కోట్లను ఘటన చోటుచేసుకున్న పడవ ‘సెయింట్ ఆంథోనీ’ యజమానికి అందజే యనున్నట్లు కేరళ ప్రభుత్వం ధర్మాసనానికి నివేదిం చింది. ఈ కేసును మూసివేయాలన్న కేంద్రం విన తిపై ధర్మాసనం స్పందిస్తూ మంగళవారం ఇందుకు సంబంధించిన విధివిధానాలపై ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది. అదేవిధంగా, పరిహారం సొమ్ములో ఎలాంటి కోత విధించకుండా పూర్తిగా బాధితులకు అందేలా చూసేందుకు కేరళ హైకోర్టు కు బదలాయించాలని తెలిపింది. ఎంవీ ఎన్రికా లెక్సీ అనే ఇటాలియన్ ఆయిల్ ట్యాంకర్లోని నేవీ సిబ్బంది మస్సిమిలానో లాటొర్రె, సల్వటోర్ గిరోన్ లు పడవలో చేపల వేటకు వెళ్లి వస్తున్న కేరళకు చెందిన ఇద్దరు మత్స్యకారులను కాల్చి చంపినట్లు ఆరోపణలున్నాయి. 2012 ఫిబ్రవరిలో కేరళ సమీపంలోని అంతర్జాతీయ జలాల్లో చోటు చేసు కున్న ఈ ఘటన భారత్, ఇటలీ మధ్య కొంతకాలం దౌత్య పరమైన ఉద్రిక్తతలకు కూడా దారితీయడం తెలిసిందే. చదవండి: పెళ్లైన రెండోరోజే పారిపోయి.. రైలులో ప్రేమించిన వాడితో పెళ్లి -
న్యాయస్థానాల్లో విచారణల ప్రత్యక్ష ప్రసారాలపై సూచనలివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: న్యాయస్థానాల్లో విచారణల ప్రత్యక్ష ప్రసారాలు, రికార్డింగ్లపై సుప్రీంకోర్టు ఈ–కమిటీ నమూనా నిబంధనల ముసాయిదాను విడుదల చేసింది. ముసాయిదాను పబ్లిక్ డొమైన్ ఉంచి దీనిపై సూచనలు, సలహాలు ఇవ్వాలని భాగస్వాములను కోరింది. న్యాయ ప్రక్రియలో పారదర్శకతను, సంబంధిత పక్షాల భాగస్వామ్యాన్ని పెంచడమే లక్ష్యంగా... ఈ సదుపాయాన్ని తెస్తున్నారు. నమూనా నిబంధనలను బాంబే, ఢిల్లీ, మద్రాస్, కర్ణాటక హైకోర్టుల న్యాయమూర్తులతో కూడిన కమిటీ రూపొందించింది. ‘‘నమూనా నిబంధనల ముసాయిదా తయారీకి ఉపకమిటీ విస్తృతమైన చర్చలు చేసింది. స్వప్నిల్ త్రిపాఠి వర్సెస్ సుప్రీంకోర్టు కేసులో 2018లో ఇచ్చిన తీర్పులో పేర్కొన్న అంశాలు పరిగణనలోకి తీసుకుంది. న్యాయవాదులు, సాక్షుల గోప్యత, ఇతరత్రా గోప్యతలకు సంబంధించిన అంశాలు, కొన్ని సందర్భాల్లో కేసు సున్నితత్వం కారణంగా ప్రజా ప్రయోజనాన్ని కాపాడడంతోపాటు విచారణపై కేంద్ర, రాష్ట్ర చట్టాల నియంత్రణ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంది’’ అని సుప్రీంకోర్టు ఓ ప్రకటనలో తెలిపింది. నమూనా నిబంధనల ముసాయిదా ఈ–కమిటీ వెబ్సైట్లో లభ్యమవుతాయని తెలిపింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు ఈ–కమిటీ ఛైర్ పర్సన్ జస్టిస్ డీవై చంద్రచూడ్.. సలహాలు, సూచనలు ఇవ్వాలని లేఖ రాశారు. ఆర్టికల్ 21 ప్రకారం అందరికీ సమన్యాయం హక్కులో భాగంగా ఈ ప్రత్యక్షప్రసారాలు అందుబాటులో ఉండనున్నాయని లేఖలో నొక్కి చెప్పారు. నమూనా నిబందనలపై సూచనలు సలహాలు ఈ నెల 30 లోగా ecommissione ree@aij.gov.inకు పంపాలని సూచించింది. ముసాయిదాలో ముఖ్యాంశాలు ►కోర్టు హాలులో ఐదు కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ఒకటి నేరుగా ధర్మాసనం వైపునకు ఉంటుంది. రెండు కెమెరాలు న్యాయవాదుల వైపు ఉంటాయి. నాలుగో కెమెరా అవసరమైన సమయంలో నిందితుడి కోసం వినియోగిస్తారు. ఐదో కెమెరా సాక్షలు వైపు ఉంటుంది. ►ఏ క్షణంలోనైనా ప్రత్యక్ష ప్రసారం నిలిపివేయడానికి ధర్మాసనంలోని న్యాయమూర్తి వద్ద రిమోట్ కంట్రోల్ ఉంటుంది. ధర్మాసనం అనుమతించిన తర్వాత న్యాయవాదులు, సాక్షులు, నిందితులు లేదా ఇతరత్రా వ్యక్తులు కోర్టులో సంభాషించడానికి మైక్రోఫోన్లు అందిస్తారు. ►ప్రత్యక్ష ప్రసారాలు, రికార్డింగ్ నిమిత్తం ప్రతి కోర్టు కాంప్లెక్స్లోనూ డెడికేటెడ్ కంట్రోల్ రూమ్ (డీసీఆర్) ఏర్పాటు చేస్తారు. ►రిజిస్ట్రార్ (ఐటీ) పర్యవేక్షణలో సాంకేతిక నిపుణులు ప్రత్యక్ష ప్రసారాలను సమన్వయం చేస్తారు. ►వివాహ సంబంధ అంశాలు, బదిలీ పిటిషన్లు, లైంగిక వేధింపుల కేసులు, ఐపీసీ సెక్షన్ 376 ప్రొసిడీంగ్స్, మహిళలపై లింగ వివక్ష దాడులు, చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుల్లో ప్రత్యక్షప్రసారాలు ఉండవు. ప్రధాన న్యాయమూర్తి లేదా ధర్మాసనంలోని న్యాయమూర్తి సూచనల మేరకు ఇతర అంశాల్లోనూ ప్రత్యక్షప్రసారాలను అనుమతించరు. శాంతి భద్రతల ఉల్లంఘనలకు దారితీసే వర్గాల మధ్య విభేదాల కేసులు కూడా ధర్మాసనం అనుమతి ఉంటేనే ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ►విచారణకు ముందే ప్రత్యక్ష ప్రసారంపై అభ్యంతరాలు ఉంటే చెప్పాలని పార్టీలకు కోర్టు మాస్టర్/రీడర్ తెలియజేస్తారు. ఆయా అభ్యంతరాలు సంబంధిత ధర్మాసనానికి పార్టీలు తెలియజేయాల్సి ఉంటుంది. ►ప్రత్యక్ష ప్రసారం చేయని కేసుల రికార్డింగులు కోర్టు నిర్వహణలో భాగంగా భద్రపరుస్తారు. ►విచారణలకు హాజరయ్యే విజిటర్లు, మీడియా వ్యక్తులు ఆడియో, వీడియో రికార్డు చేయడానికి అనుమతి ఉండదు. ►విచారణ సమయంలో అందరూ న్యాయమూర్తి సూచనలు తప్పకుండా పాటించాలి. ►నిబంధనలు ఉల్లంఘించి వారికి చట్ట ప్రకారం ప్రాసిక్యూషన్తోపాటు కమ్యూనికేషన్ పరికరాలను సీజ్ చేస్తుంది. ►ట్రాన్స్స్రిప్ట్లను ఆంగ్లంతోపాటు ఇతర భారతీయ భాషల్లోకి అనువదిస్తారు. -
మహిళా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు
సాక్షి, విజయవాడ: భార్య హత్య కేసులో భర్తకు ఉరిశిక్ష విధిస్తూ మహిళా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కృష్ణలంకలో 2019లో గర్భవతి అయిన భార్యపై పెట్రోల్ పోసి హతమార్చిన భర్త సుజిత్కు ఉరిశిక్ష విధించింది. 2019, జూన్ 15న ఫకీర్గూడెంలో జరిగిన ఈ ఘటనను సీరియస్గా పరిగణించిన కోర్టు.. భర్త బత్తుల సంబియార్ సుజిత్కు ఉరిశిక్షను విధించింది. ఈ తీర్పు పట్ల బాధితురాలి కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. చదవండి: అమ్మా .. ఎందుకిలా చేశావ్.. మేయరమ్మా... ఇదేంటమ్మా! -
సుప్రీం తీర్పుపై సైరస్ మిస్త్రీ స్పందన
సాక్షి, న్యూఢిల్లీ: టాటా గ్రూప్తో వివాదం కేసులో ప్రతికూల తీర్పు వచ్చిన నేపథ్యంలో టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ స్పందించారు. అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులు తనను నిరాశపర్చాయని ఆయన పేర్కొన్నారు. తన హయాంలో సంస్థ శ్రేయస్సు కోసమే నిర్ణయాలు తీసుకున్నానని, అంతరాత్మ సాక్షిగా తాను ఏ తప్పూ చేయలేదని విశ్వసిస్తున్నానని మిస్త్రీ తెలిపారు. ‘తాము తీసుకున్న నిర్ణయాలకు న్యాయ స్థానాల్లాంటి వ్యవస్థల నుంచి తోడ్పాటు లభిస్తుందని సమాజంలో ప్రతీ ఒక్కరు ఆశిస్తారు. టాటా సన్స్ మైనారిటీ షేర్హోల్డరుగా, మా కేసులో వచ్చిన తీర్పు నాకు వ్యక్తిగతంగా నిరాశ కలిగించింది‘ అని ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. (మిస్త్రీకి టాటా రైటే..!) వ్యక్తుల కన్నా గవర్నెన్స్కు ప్రాధాన్యం ఉండేలా, షేర్హోల్డర్ల అభిప్రాయాలకు విలువ ఇస్తూనే డైరెక్టర్లు నిర్భయంగా విధులను నిర్వర్తించేలా టాటా గ్రూప్లో మార్పులను తెచ్చేందుకు తాను ప్రయత్నించానని ఆయన తెలిపారు. ‘టాటా గ్రూప్ గవర్నెన్స్ను నేను ఇకపై ప్రత్యక్షంగా ప్రభావితం చేయలేకపోయినా నేను లేవనెత్తిన అంశాల గురించి పునరాలోచన జరుగుతుందని ఆశిస్తున్నాను. జీవితం అంటే పూలబాటే కాదు, సమస్యలూ ఉంటాయి. అయితే కష్టకాలంలో కుటుంబసభ్యులు, మిత్రులు, సహచరులు నా వెన్నంటే ఉంటుండటం అదృష్టం‘ అని మిస్త్రీ పేర్కొన్నారు. (ఆ ఐటీ నిపుణులకు కాగ్నిజెంట్ తీపి కబురు) -
తీర్పు రాజకీయ కరపత్రం కాకూడదు!
ఒక న్యాయమూర్తి రిటైర్ అయిన తర్వాత రోడ్డుకు రెండు వైపులా కొంతమంది అమరావతి వాసులు నిలబడి వీడ్కోలు చెప్పడం జరిగింది. వీరంతా ఎలాంటి సంకేతం ఇచ్చారు? ఏపీలో పౌరుల హక్కులను కాపాడలేకపోతున్నామంటూ హైకోర్టువారు గంపగుత్తగా వ్యాఖ్యలు చేశారు. అదేదో ప్రతిపక్ష పార్టీ అందంటే వారి రాజకీయ అవసరం అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక జడ్జిగారు అలా మాట్లాడారంటే ఏమని అనుకోవాలి? ఏపీలో రాజ్యాంగం విచ్ఛిన్నం అయిందంటూ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపడితే, దానికి ఎందుకు సమాధానం ఇవ్వలేకపోయారు? న్యాయమూర్తులకు రాజకీయ దురుద్దేశాలు ఆపాదించకూడదు. కానీ న్యాయమూర్తులు కూడా తమ తీర్పులను రాజకీయ ప్రసంగాలుగా మార్చరాదు. కొద్దికాలం క్రితం సుప్రీంకోర్టులో రిటైర్ అయిన జడ్జి దీపక్ గుప్తా ఒక వ్యాఖ్య చేశారు. న్యాయవ్యవస్థ ధనికులకు, శక్తిమంతులకు మాత్రమే అధికంగా ఉప యోగపడుతోందని అన్నారు. ఈ వ్యాఖ్య ఎంత అర్థవంతమైనదో ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ రాకేశ్ కుమార్ రిటైర్ అయిన తర్వాత ఆయనకు వీడ్కోలు చెప్పిన వారిని చూస్తే తెలుస్తుంది. రోడ్డుకు రెండు వైపులా కొంతమంది అమరావతి ప్రాంతవాసులు నిలబడి ఆయనకు వీడ్కోలు చెప్పడం జరిగింది. వీరంతా ఏం కోరుతున్నారు? మిగిలిన రాష్ట్రం ఎటైనా పోనీ, తమ భూములకు మాత్రం కోట్ల విలువ ఉండాలని ఆశిస్తున్నారు. అలాంటివారు ఒక న్యాయమూర్తికి వీడ్కోలు తెలిపా రంటే ఎలాంటి సంకేతం ఇచ్చారు? అలాగే కొన్ని నెలల క్రితం హైకోర్టుకు వెళ్లే న్యాయమూర్తులకు రోడ్డుపై నిలబడి దండాలు పెట్టారు. వారి వినతులను ఆలకించిన గౌరవ హైకోర్టు వారు, అదే సమయంలో కొందరు నిరసన బ్యాడ్జీలు పెట్టుకున్నారని మండి పడ్డారు. నిరసన చెప్పడం తప్పే కావచ్చు. కానీ దండాలు పెట్టడం మాత్రం సమర్థనీయమా ఆలోచించాలి. ఇక రాకేశ్ కుమార్ గారు కొన్నాళ్ల క్రితం ఏపీలో రాజ్యాంగ విచ్ఛిన్నత జరిగిందంటూ ఆయనకు ఆయనే భావించి, కొందరు పిటిషనర్లను ఆ మేరకు పిటిషన్ వేయండని అడగటంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ముప్పై ఏళ్లలో ఎన్నడైనా ఇలాంటి తీర్పు చూశామా అని చీఫ్ జస్టిస్ బాబ్డే వ్యాఖ్యానించారంటేనే అది ఎలాంటి తీర్పో విశ్లేషించుకోవచ్చు. దానికి సమాధానం చెప్పలేని రాకేశ్ కుమార్ సుప్రీంకోర్టు కొలీజియం ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ను, తెలంగాణ చీఫ్ జస్టిస్ను బదిలీ చేయడాన్ని తప్పు పట్టినట్లు వ్యాఖ్యానించారు. మరి ఇది కోర్టు ధిక్కరణ కిందకు రాదా అంటే వస్తుందని న్యాయనిపుణులు అంటున్నారు. పైగా ముఖ్యమంత్రి జగన్ రాసిన లేఖ ఆధారంగానే ఈ రెండు రాష్ట్రాల చీఫ్ జస్టిస్లు బదిలీ అయ్యారని ప్రజలు అనుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు. దీనివల్ల జగన్కు ఏదో అనుచిత లబ్ధి వచ్చిందని అనడం దారుణంగా ఉంది. తెలంగాణ సీజేపై జగన్ ఎక్కడా ఫిర్యాదు చేయలేదే? దానికి, జగన్కు ఏమి సంబంధం ఉందని రాకేశ్ గారు కనిపెట్టారో తెలియదు. జగన్ కేసుల గురించి, ఆయన జైలులో ఉన్నప్పుడు కేటాయించిన నంబర్ గురించి కూడా జడ్జి గారు మాట్లాడారంటే ఆయన ద్వేషంతోనో, లేదా మరే ఉద్దేశంతోనో ఇలాంటి తీర్పు ఇచ్చారని కొందరు న్యాయనిపుణులు వ్యాఖ్యానిస్తు న్నారు. న్యాయమూర్తులకు రాజకీయ దురుద్దేశాలు ఆపాదించ కూడదు. అలాగే న్యాయమూర్తులు కూడా తమ తీర్పులను రాజకీయ ప్రసంగాలుగా మార్చరాదు. ఇదే సందర్భంలో జస్టిస్ రాకేశ్ను పట్నా హైకోర్టు నుంచి ఎందుకు బదిలీ చేశారో గుర్తుకు తెచ్చుకోవాలని మరో న్యాయ ప్రముఖుడు అన్నారు. అక్కడ కొందరు జడ్జీలపై ఈయన ఆరోపణ చేయడం, వారంతా దానిని ఖండించడం, ఈయనకు కేసులు విచారణకు ఇవ్వకుండా ఉండాలని నిర్ణయించడం, తదుపరి అక్కడ నుంచి బదిలీ చేయడం జరిగాయి. అప్పుడే సుప్రీంకోర్టు కొలీజియంపై ఎందుకు ఈయన దావా వేయలేదని మరో ప్రముఖ లాయర్ ప్రశ్నిం చారు. మూడు రాజధానుల కేసు గురించి, శాసనమండలి రద్దు గురించి, చివరికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వివాదం గురించి కూడా తీర్పులో రాయవలసిన అవసరం ఏమిటి? అసలు కేసు ఏమిటి? రాజ్యాంగం విచ్ఛిన్నం అంటూ గతంలో వ్యాఖ్యలు చేసినందున మిషన్ బిల్డ్ ఏపీ కేసును జస్టిస్ రాకేశ్ కుమార్ విచారించడానికి వీలు లేదని ప్రభుత్వ తరపు న్యాయవాది పిటిషన్ వేశారు. అంటే ఈ న్యాయమూర్తి నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని పరోక్షంగా చెప్పడమే కదా. అలాంటప్పుడు విజ్ఞత కలిగిన ఏ జడ్జి అయినా ఆ కేసు నుంచి తప్పుకుంటారని చెబుతారు. కానీ ఆయన ఆ పని చేయకపోగా, ఆ పిటిషన్ను కొట్టివేసి, ఆ పిటిషన్ వేసిన ప్రభుత్వ అధికారిపై కోర్టు ధిక్కార కేసు పెట్టాలని తీర్పిచ్చారు. తన రిటైర్మెంట్కు ఒక రోజు ముందు ఇలాంటి తీర్పు ఇవ్వడం అంటే ఆయన ఉద్దేశాలు ఏమిటో తెలుస్తున్నాయని కొందరు అంటున్నారు. జడ్జీలకు దురుద్దేశాలు ఆపాదించకూడదు కానీ, కొన్నాళ్ల క్రితం ఇదే కేసులో వాదించిన పోలీసు శాఖ తరపు న్యాయవాది ఎస్.ఎస్. ప్రసాద్... జడ్జి రాకేశ్ కుమార్ ఈ కేసులో ముందుకు వెళితే రాజకీయ దురుద్దేశం ఆపాదించవలసి వస్తుందని ఆనాడే చెప్పారు. అయినా జడ్జి గారు పట్టించుకోకుండా తన రాజకీయ ప్రసంగం మాదిరి తీర్పు ఇచ్చే శారు. ఈయనతో పాటు ఉన్న మరో జడ్జి రమేష్ మాత్రం ఈ వ్యాఖ్య లతో తనకు సంబంధం లేదని స్పష్టంగా చెప్పారట. ప్రభుత్వంలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని ప్రస్తావించడం తప్పు కాదు. అది కూడా ఆయా విషయాలపై ఎవరైనా పిటిషన్లు వేస్తే తీర్పులు ఇవ్వవచ్చు. అలాకాకుండా జడ్జీలు వారికి వారే ఏవో ఊహిం చుకుని తీర్పులు ఇచ్చేయడం మొదలుపెడితే ఈ విషయం ఎక్కడిదాకా వెళుతుంది? శాసనమండలి రద్దు తీర్మానం గురించి జడ్జిగారికి ఏమి సంబంధం? ఆయన ఆ కేసును విచారిస్తుంటే సంబంధిత ప్రశ్నలు వేయవచ్చు. అలాకాకుండా దేశంలో ఎప్పుడూ శాసన మండలి రద్దు జరగనట్లుగా మాట్లాడితే వారికి ఉన్న సమాచార జ్ఞానం ఏమిటన్న ప్రశ్న వస్తుంది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనమండలి రద్దు చేయాలని శాసనసభ తీర్మానాలు చేయడం, ఆ తర్వాత కొంత కాలానికి అది రద్దు కావడం కూడా జరిగింది. ఇప్పుడు మండలి రద్దు అవుతుందా, లేదా అన్నది కేంద్రం నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అది వేరే సంగతి. కానీ జడ్జిగారికి ఏమి సంబంధం? శాసనసభకు అసలు హక్కులు ఉండవనీ, మొత్తం పాలన వ్యవస్థను కూడా తామే నడుపుతామనీ గౌరవ న్యాయమూర్తులు భావిస్తే అది సమంజసం అవుతుందా? ఏపీలో పౌరుల హక్కులను కాపాడలేకపోతున్నా మంటూ గంపగుత్తగా వ్యాఖ్యలు చేయడం కూడా సమర్థనీయం కాదు. అదేదో ప్రతిపక్ష పార్టీ అందంటే వారి రాజకీయ అవసరం అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక జడ్జిగారు అలా మాట్లాడా రంటే ఏమని అనుకోవాలి? హైకోర్టు మీద ప్రభుత్వం యుద్ధం చేస్తోందని హైకోర్టువారు వ్యాఖ్యానించారు కానీ నిజానికి హైకోర్టువారే ఏపీ ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నారని ప్రజలలో ఏర్పడిన అభిప్రాయం. రాజ్యాంగం విచ్ఛిన్నం అయిందంటూ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పు పడితే, మరి దానికి జస్టిస్ రాకేశ్ ఎందుకు సమాధానం ఇవ్వలేక పోయారు? రాజకీయ నేతల కేసుల గురించి ప్రస్తావిస్తున్న న్యాయ మూర్తి, న్యాయవ్యవస్థ అంతా కడిగిన ముత్యంలా ఉందని చెప్ప గలరా? ఆయనే ఒకప్పుడు న్యాయవ్యవస్థలో అవినీతిపై ఏమి మాట్లా డింది తెలియదా? తాజాగా ఏపీ హైకోర్టులో వచ్చిన ఒక తీర్పు గురించి తెలియదా? న్యాయవ్యవస్థలోని వారిపై అవినీతి కేసులు వస్తే అసలు విచారణే జరపరాదనీ, అసలు ఆ వార్తలే ప్రచారం చేయరాదనీ ఆదేశాలు ఇవ్వడాన్ని ఎలా సమర్థిస్తారు? కొన్ని కేసుల్లో నెలల తరబడి కొందరిని జైళ్లలో ఉంచే కోర్టులు, మరికొందరి విషయంలో భిన్నంగా ఎందుకు వ్యవహరిస్తున్నాయి? ప్రతిపక్ష నేత చంద్రబాబు ఓటుకు నోటు కేసులో ఆయనకేమి సంబంధం అని ప్రశ్నించిన జడ్జిగారు కూడా ఉన్నారు. ఒక నేతకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన ఒక న్యాయ మూర్తికి ఆయన రిటైర్ అయిన వెంటనే ప్రభుత్వంలో పెద్ద పదవి కూడా వచ్చింది. అవన్నీ సమర్థనీయమని గౌరవ రాకేశ్ కుమార్ భావి స్తున్నారా? ఒక హైకోర్టు జడ్జికి సుప్రీంకోర్టు జడ్జిగా ప్రమోషన్ వచ్చింది. కానీ అప్పుడు ఆయనపై ఒక కేసు పెండింగులో ఉందన్న సమాచారం బయటకు వచ్చింది. దాంతో వెంటనే రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుకుని ఆ కేసును ఎత్తివేయించుకున్నారే! రాజకీయ నేతలు తమపై వచ్చిన కేసులు విత్డ్రా చేసుకుంటే తప్పు అయితే ఇది రైటు అవుతుందా? ఏ వ్యవస్థలో అయినా మంచి, చెడు ఉండవచ్చు. కానీ న్యాయ వ్యవస్థ మాత్రం చెడుకు దూరంగా ఉండాలి. ప్రభావాలకు లోను కాకుండా ఉండాలి. రాకేశ్ కుమార్ వల్ల న్యాయ వ్యవస్థ ప్రతిష్ట పెరి గిందా, తగ్గిందా ఆయనే ఆలోచించుకోవాలి. జనం దృష్టిలో మాత్రం ఆయన రాసిన తీర్పు అంతా రాజకీయ ప్రసంగంగానే మిగిలిపోయిం దన్న విమర్శను ఎదుర్కోక తప్పదు. న్యాయ వ్యవస్థ భ్రష్టు పట్టేలా ఎవరూ వ్యవహరించరాదని సలహా ఇవ్వడం తప్ప మనం ఏమి చేయగలం? న్యాయవ్యవస్థకు ఆ పరిస్థితి ఎదురైతే సమాజానికి ప్రమాదం. ఇదంతా న్యాయ వ్యవస్థ బాగుపడాలని తప్ప, జడ్జీలపై అగౌరవంతో కాదనీ, ధిక్కార స్వరం అసలు కాదనీ న్యాయమూర్తులు భావిస్తే అదే పదివేలు. -వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు -
ఆ అవసరాలకు సీమ ఎత్తిపోతల అవసరమే
సాక్షి, అమరావతి: రాయలసీమ, నెల్లూరు జిల్లాల తాగు, సాగునీటి అవసరాలను తీర్చేందుకు ఉద్దేశించిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) గురువారం తన నిర్ణయాన్ని వెలువరించింది. రాయలసీమ, నెల్లూరు జిల్లాల తాగు, సాగునీటి అవసరాలకు ఈ ప్రాజెక్టు ఆవశ్యకమని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అందచేసిన ఈ ప్రాజెక్టు స్కీంను పరిశీలిస్తే ప్రధానంగా రాయలసీమ కరువు తీర్చేందుకు తాగు, సాగునీటి అవసరాల కోసం రోజూ 8 టీఎంసీల వరద నీటిని మళ్లించి, వీలైనంత తక్కువ వరద జలాలు సముద్రంలో కలిసేందుకు ఉద్దేశించిన పథకమని తెలిపింది. అయితే ఈ ప్రాజెక్టులో సాగునీటి అంశం కూడా ముడిపడి ఉన్నందున నిర్మాణానికి ముందు పర్యావరణ అనుమతి అవసరమని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది.(చదవండి: సాఫీగానే ‘సీమ ఎత్తిపోతల’) ఈ ఎత్తిపోతలకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్)ను కృష్ణా నదీ జలాల నిర్వహణ బోర్డు (కేఆర్ఎంబీ)కు సమర్పించకుండా ముందుకెళ్లవద్దంటూ కేంద్ర జలశక్తి శాఖ ఇప్పటికే ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిందని హరిత ట్రిబ్యునల్ గుర్తు చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేఆర్ఎంబీ నుంచి ముందస్తు అనుమతి అవసరమా? లేదా? అన్న అంశం జోలికి తాము వెళ్లడం లేదని పేర్కొంది. ఈ మేరకు ఎన్జీటీ దక్షిణ ప్రాంత బెంచ్ జ్యుడీషియల్ మెంబర్ జస్టిస్ కె.రామకృష్ణన్, ఎక్స్పర్ట్ మెంబర్ సైబల్ దాస్ గుప్తాలతో కూడిన ధర్మాసనం 134 పేజీల తీర్పు వెలువరించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు లేవని, ఈ పథకం వల్ల తెలంగాణలోని పలు ప్రాజెక్టుల ఆయకట్టుతో పాటు హైదరాబాద్కు తాగునీటి సమస్య ఏర్పడుతుందంటూ తెలంగాణ, నారాయణపేట జిల్లాకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాదనలు వినిపించిన సంగతి విదితమే.(చదవండి: రూ.17,300 కోట్లతో వైద్య రంగానికి చికిత్స) -
కాళేశ్వరంపై ఎన్జీటీ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ హరిత ట్రిబ్యునల్ తీర్పును వెల్లడించింది. ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల్లో అతిక్రమణలు జరిగినట్లు ఎన్జీటీ మంగళవారం పేర్కొంది. ఈ సందర్భంగా ఎన్జీటీ పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినందున ఇప్పుడు ఉపశమన చర్యల తీసుకోవాల్సిన బాధ్యత ఉందిని తెలిపింది. సరైన పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టరాదని స్పష్టం చేసింది. అయితే, ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడంతో పర్యావరణ ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలు, పర్యావరణ అనుమతులపై కమిటీ ఏర్పాటు అవసరమని ఎన్జీటీ అభిప్రాయపడింది. ఈ మేరకు ఏడుగురు సభ్యుల నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యావరణ శాఖను ఆదేశించింది. 2008 నుంచి 2017 వరకు పర్యావరణ అనుమతుల లేకుండా చేసిన నిర్మాణాలకు.. జరిగిన పర్యావరణ నష్టాన్ని పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. నిర్వాసితులకు పరిహారం, పునరావసం అంశాలను కూడా అధ్యయనం చేయాలని చెప్పింది. ఇందుకు సంబంధించి నెల రోజుల్లో కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తర్వాత నెల రోజుల్లో అధ్యయనం పూర్తి చేయాలని కమిటీకి ఆదేశాలిచ్చింది. కమిటీ పురోగతిని కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ తన తీర్పులో వెల్లడించింది. ప్రాజెక్టు విస్తరణపై సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకారం పర్యావరణ అనుమతులు లేకుండా ముందుకెళ్లొద్దని తేల్చి చెప్పింది. ఇటీవల అపెక్స్ కౌన్సిల్లో చెప్పినట్లు డీపీఆర్లు సమర్పించి, కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత ముందుకెళ్లొచ్చని ఆదేశాలు జారీ చేసింది. -
మసీదు దానికదే కూలిపోయిందా?
సాక్షి, న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కేసులో అందరూ నిర్దోషులైతే.. మరి మసీదును ఎవరు కూల్చారు.. దానికదే కూలిపోయిందా అంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నల వర్షం కురిపించారు. చరిత్రలో ఈ రోజు నిజంగా బ్లాక్ డే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 1992 నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నిందితులంతా నిర్దోషులేనని లక్నోలోని ప్రత్యేక న్యాయస్థానం తుది తీర్పును వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందిస్తూ అసదుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘కోర్టు తీర్పు బాధ కలిగించింది. సరైన న్యాయం జరగలేదు. ఆధారాలు లేవని అందరిపై అభియోగాలు కొట్టేయడం సరైన నిర్ణయమా? మసీదును ఎవరు కూల్చారో యావత్ ప్రపంచం చూసింది. అందరూ నిర్దోషులైతే.. మరి మసీదును ఎవరు కూల్చారు.. దానికదే కూలిపోయిందా. ఉమాభారతి మసీదును కూల్చండి అంటూ నినాదాలు చేయడం నిజం కాదా’ అంటూ ఒవైసీ ప్రశ్నించారు. అంతేకాక ఈ తీర్పుపై యావత్ ముస్లిం లోకం, పర్సనల్ లా బోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తుందన్నారు ఒవైసీ. (చదవండి: ‘ఆ వివాదం మళ్లీ తెరపైకి తెచ్చారు’) ‘ఈ వివాదానికి సంబంధించి సుప్రీం కోర్టు గతంలోనే ‘చట్ట నియమాలను అతిగా ఉల్లంఘించడం.. బహిరంగ స్థలంలోని ప్రార్థనా స్థలాన్ని నాశనం చేసిన చర్య’గా వర్ణించింది. కానీ సీబీఐ కోర్టు మాత్రం అందరిని నిర్దోషులుగా ప్రకటించింది. సీబీఐ ఛార్జిషీట్లో అనేక విషయాలు దాచిపెట్టింది. ఇందులో ఎలాంటి కుట్ర లేదని తీర్పు వెల్లడించింది. దయచేసి నాకు జ్ఞానోదయం చేయండి.. చరిత్రలోని ఒక చర్యను అనర్హమైనదానిగా ప్రకటించడానికి ఇన్ని రోజుల సన్నహాలు అవసరమా. నాకు సమాధానం చెప్పండి’ అంటూ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సంశయాలు రావడంలో తప్పేముంది?
ప్రభుత్వంపై ప్రతిపక్ష టీడీపీ, ప్రైవేట్ వ్యక్తులు ఇస్తున్న ప్రతి పిటిషన్నూ విచారణకు స్వీకరిస్తూ ఆదేశాలు జారీ చేస్తున్న ఏపీ హైకోర్టు అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న పిటిషన్లను టోకున కొట్టివేయడం, స్టేలు విధించడం చూస్తున్న సగటు మనిషికి కూడా హైకోర్టు తీరులో ఏదో తేడా ఉన్నట్లు అనుమానాలు వస్తున్నాయంటే దీనికి ఎవరు కారణం? ప్రభుత్వ యంత్రాంగంలో కూడా తప్పులు ఉంటే ఉండవచ్చు. వాటిని సరిచేయడానికి హైకోర్టుకు అధికారాలు ఉంటాయి. కానీ కోర్టువారు తీసుకునే నిర్ణయాలు చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఉండాలనీ; కొన్నిసార్లు అలా లేవేమో అన్న సంశయాలు వచ్చినప్పుడే ఈ విషయాలు ప్రస్తావనకు వస్తాయి. దీనివల్ల ఏపీ ప్రభుత్వం పట్ల న్యాయస్థానం వ్యతిరేక ధోరణితో ఉందా అన్న సందేహం సామాన్య ప్రజల్లో తలెత్తే ప్రమాదం ఉంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వస్తున్న తీర్పులు ప్రభుత్వానికి అత్యధికంగా వ్యతిరేకంగా ఉండడం సహజంగానే చర్చనీయాంశం అవుతోంది. ప్రభుత్వ యంత్రాంగం తప్పులు చేస్తోందా అన్న అనుమానం కలుగుతోంది. గౌరవ హైకోర్టువారికి కానీ, న్యాయమూర్తులకు కానీ దురుద్దేశాలు ఆపాదించజాలం. కానీ వారి తీర్పులు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా అనిపిస్తే, కొన్ని తీర్పులు పరస్పర విరుద్ధంగా కనిపిస్తే ప్రజలలో అనుమానాలు రావడం సహజం. ఇందుకు కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఒక బాధ్యత కలిగిన వైద్యుడు విశాఖ నడిరోడ్డుమీద అల్లరి చేస్తే హైకోర్టు వారు సంబంధిత కానిస్టేబుల్, ఇతర పోలీసులపై ఏకంగా సీబీఐ విచారణకు ఆదేశించారు. దీనిమీద కొందరు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. వారిపై కోర్టు ధిక్కారమన్నంతవరకు ఫర్వాలేదు. కానీ అలాంటి నిర్ణయాల వల్ల తాగుబోతు డాక్టర్కు మద్దతు ఇచ్చినట్లు అవుతుందేమో, ఇది సమాజానికి మంచిది కాదేమోనని పద్ధ్దతిగా మాట్లాడినవారికి కూడా ధిక్కార నోటీసులు ఇచ్చారు. ప్రతి పక్ష నేత చంద్రబాబు నాయుడు విశాఖ వెళ్లినప్పుడు అక్కడ కొంత నిరసన అనండి, లేదా గొడవ అనండి జరిగింది. ఆ ఘటనలో పోలీసులపై హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. ఒక ప్రతిపక్ష నేతను తిరగనివ్వరా? అనుకోవచ్చు. కాకపోతే చంద్రబాబు ప్రభుత్వంలో ఆనాటి విపక్షనేత వైఎస్ జగన్ను, మరికొందరు నేతలను అసలు రన్వే మీదే నిలిపివేసిన ఘట్టాలు చూసినవారికి కొంత అభ్యంతరం అనిపించి ఉండవచ్చు. అప్పుడు కోర్టుదాకా వ్యవహారం వెళ్లలేదు కనుక ఇప్పుడు కోర్టు నిర్ణయాన్ని తప్పుపట్టలేమనుకుందాం. కరోనా సంక్షోభ ఆరంభ సమయంలో పేదలకు పలువురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు రకరకాలుగా సాయం చేశారు. ఆ సమయంలో ఎవరో వీరివల్ల కరోనా వ్యాప్తి చెందుతోందని హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. వెంటనే కోర్టువారు ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని ఆదేశాలిచ్చారు. కానీ ఆ తర్వాత ప్రతిపక్ష నేత బాబు తన కుమారుడితో కలిసి ఒక ర్యాలీగా హైదరాబాద్ నుంచి విజయవాడ కృష్ణానది తీరాన కరకట్టమీద ఉన్న తన ఇంటి వరకు వెళ్లే సందర్భంలో పలుచోట్ల టీడీపీ కార్యకర్తలు ర్యాలీలు తీశారు. అప్పుడు కరోనా నిబంధనలు పట్టించుకోలేదన్న విమర్శలు వచ్చాయి. దానిపై ఎవరో పిటి షన్ వేస్తే అప్పుడు బాబుకు హైకోర్టు నోటీసు జారీ చేయలేదు. డీజీపీ లేదా సంబంధిత అధికారులు స్పందించాలని ఆదేశం ఇచ్చారు. తదుపరి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వివాదం తెరపైకి వచ్చింది. ఆయన కనీసం చీఫ్ సెక్రటరీని, డీజీపీని పిలిచి కరోనా సమస్యపై మాట్లాడి ఎన్నికల వాయిదాపై నిర్ణయం తీసుకుని ఉంటే గొడవ లేదు. కానీ ఆ పని చేయలేదు. హైకోర్టు ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు కనబడలేదు. పైగా ఎన్నికలు లేకపోయినా, నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే యత్నం చేశారు. దీనిపై సుప్రీంకోర్టు వరకు వెళ్లి కోడ్ అమలులో లేకుండా చేసుకోవలసి వచ్చింది. తదుపరి ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని తగ్గిస్తూ, ఒక రిటైర్డ్ న్యాయమూర్తిని ఈ పదవిలో నియమించాలని ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ చెల్లదని హైకోర్టు తీర్పిచ్చింది. కానీ అందులో అసలు ప్రభుత్వానికి ఎన్నికల కమిషనర్ను నియమించే అధికారం లేదని కొత్త వాదన తెచ్చింది. సుప్రీంకోర్టు కూడా నిమ్మగడ్డను కొనసాగించాలన్నం తవరకు చెప్పింది. చట్టపరమైన, రాజ్యాంగపరమైన అంశాల జోలికి ఇంకా పోలేదు. ఇక ఎన్నికల కమిషనర్ పేరుతో కేంద్రానికి వెళ్లిన ఒక లేఖను గమనిస్తే అందులో పలు కోణాలు కనిపించాయి. ముఖ్యమంత్రిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు ఉన్నాయి. అసలు ఎన్నికల కమిషనర్ ఆఫీస్లో ఆ లేఖ తయారు కాలేదని సీఐడీ విచారణలో తేలింది. అయినా ఆ దర్యాప్తునే కొనసాగించవద్దని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మాజీ ఇంటెలిజెన్స్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావుపై చర్య తీసుకోవడానికి అన్ని ఆధారాలు ఉన్నాయని కేంద్రం కూడా తెలిపినా, ఆయనపై సస్పెన్షన్ను గౌరవ హైకోర్టు వారు రద్దు చేశారు. తెలుగుదేశం కార్యాలయం ఒక ఆక్రమిత ప్రాంతంలో నిర్మితమైందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిల్ వేస్తే మీకేం సంబంధం అని తోసిపుచ్చిన న్యాయస్థానం వారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరెవరో పిటీషన్లు వేసినా స్వీకరించి విచారణ జరి పించడం చర్చనీయాంశం అయింది. వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై ఎవరో రాజుపాళెం మండలంలో మైనింగ్ అక్రమాలపై విచారణ జరిపించాలని కోరగా, హైకోర్టు స్పందించి నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. గతంలో కూడా టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై వచ్చిన అక్రమ మైనింగ్ అభియోగాలపై కూడా సీబీఐ విచారణకు ఓకే చేసింది. అయితే ఆసక్తికరంగా టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కంపెనీ అక్రమ మైనింగ్కు పాల్పడిందని, గత ప్రభుత్వ హయాంలోనే నోటీసులు వెళ్లాయి. ఆయన కంపెనీకి 216 కోట్ల్ల జరిమానా విధిస్తూ ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే సాంకేతిక కారణాలతో హైకోర్టువారు స్టే ఇచ్చారు. అలాగే మరో మాజీ టీడీపీ ఎమ్మెల్యే పోతుల రామారావుకు స్టే లభించింది. విశాఖలో ఎల్జీ పాలి మర్స్ సంస్థ నుంచి స్టెరైన్ గ్యాస్ విడుదల అయి పదమూడు మంది మరణించినప్పుడు హైకోర్టు తీవ్రస్థాయిలో సుమోటోగా స్పందించి యాజమాన్యాన్ని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది. కానీ విజ యవాడలో స్వర్ణ ప్యాలెస్ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పది మంది మరణించినా, అందుకు బాధ్యుడైన ఆస్పత్రి యజమాని జోలికి వెళ్లవద్దని, అలా వెళితే కలెక్టర్ను కూడా బాధ్యుడిని చేస్తామని చిత్రమైన వాదనను హైకోర్టువారు తెచ్చారు. ప్రభుత్వం 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సంకల్పించింది. స్థల సేకరణలో అవినీతి జరిగిందని కొన్ని పిటిషన్లు, ఫలానా స్థలాన్ని పేదలకు ఇవ్వకూడదని మరికొన్ని పిటిషన్లు పడ్డాయి. అవినీతి ఎక్కడ జరిగినట్లు ఆరోపణలు వచ్చినా విచారించవచ్చు. కానీ రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం తలపెట్టినా స్టే ఇచ్చారు. అమరావతి భూముల స్కామ్పై విచారణ జరపవద్దని, మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వేసిన పిటిషన్కు సంబంధించిన వార్తలను ఎక్కడా ప్రచారం చేయవద్దని ఆదేశాలను ఇవ్వడం విమర్శలకు గురవుతోంది. టీడీపీ నేతలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వర్ల రామయ్య కూడా ఈ భూముల స్కామ్పై విచారణ జరపరాదని, సిట్ ఏర్పాటు చెల్లదంటూ వేసిన పిటిషన్లో కూడా స్టే ఇచ్చారు. చట్టం ప్రకారం ఏసీబీ దర్యాప్తును నిలువరించే అధికారం హైకోర్టుకు లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్లమెంటులో ప్రస్తావించారు. ఇక టెలిఫోన్ ట్యాపింగ్ అంటూ ఒక పత్రిక కథనంపై హైకోర్టువారు దేశంలో ఉన్న అన్ని సంస్థలకు నోటీసులు ఇచ్చారు కానీ సంబంధిత వార్త రాసిన పత్రికకు మాత్రం నోటీసు ఇవ్వకపోవడం ఆశ్చర్యం. ఏ న్యాయమూర్తి ఫోన్ టాప్ అయింది? అన్న విషయాలు ఇంతవరకు తెలియదు. ఈఎస్ఐ స్కామ్లో నిందితుడుగా ఉన్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు పైల్స్కు సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేసి డాక్టర్లు సర్టిఫై చేస్తే, హైకోర్టు వారు మాత్రం ఆయనను ప్రైవేటు ఆసుపత్రికి పంపించడానికి ఆదేశాలు ఇచ్చారు. ఇక ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణ చట్టం చేస్తే దానిని తాత్కాలికంగా నిలుపుదల చేయిం చారు. ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం పెట్టాలనుకున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. ప్రైవేటు స్కూళ్లలో పెద్దవాళ్ల పిల్లలు ఆంగ్ల మాధ్యమంలోనే చదువుకుంటున్నారు కదా, మరి పేదలకు ఆ అవకాశం ఇవ్వరాదా? మాతృభాషను పరిరక్షించుకుంటూనే ఇలా చేయరాదా అని ఎవరైనా సామాన్యుడు భావిస్తే దానికి ఏమి జవాబు దొరుకుతుంది? ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల విషయం కూడా వివాదం అయింది. కరోనా వేళ పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉద్యోగుల, పెన్షనర్ల జీతాలలో కోత పెట్టాయి. కానీ ఏపీ హైకోర్టు వారు వారందరికీ బకాయిలను వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశం ఇచ్చి ఆశ్చర్యం కలిగించారు. సచివాలయ ఉద్యోగుల సంఘం వారు తమకు వడ్డీ అవసరం లేదనీ, తమ బకాయిలు చెల్లించగలిగితే చాలనీ అనడం విశేషం. ఈ అంశాలలో ప్రభుత్వ యంత్రాంగంలో కూడా తప్పులు ఉంటే ఉండవచ్చు. వాటిని సరిచేయడానికి హైకోర్టుకు అధికారాలు ఉంటాయి. కానీ కోర్టువారు తీసుకునే నిర్ణయాలు చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఉండాలనీ; కొన్నిసార్లు అలా లేవేమో అన్న సంశయాలు వచ్చినప్పుడే ఈ విషయాలు ప్రస్తావనకు వస్తాయి. దీనివల్ల ఏపీ ప్రభుత్వం పట్ల న్యాయస్థానం వ్యతిరేక ధోరణితో ఉందా అన్న సందేహం సామాన్య ప్రజల్లో తలెత్తే ప్రమాదం ఉంది. వ్యాసకర్త: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
30న బాబ్రీ కూల్చివేత తీర్పు
లక్నో: అయోధ్యలో వివాదాస్పద బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ప్రత్యేక కోర్టు ఈ నెల 30న తీర్పు వెల్లడించనుంది. కూల్చివేత ఘటన జరిగిన 28 ఏళ్ల తర్వాత చరిత్రాత్మక తీర్పు రాబోతోంది. ఈ కేసులో బీజేపీ అగ్రనేతలు అడ్వాణీ, మురళీమనోహర్ జోషి సహా 32 మంది అభియోగాలు ఎదుర్కొంటూ ఉండడంతో తీర్పుపై ఉత్కంఠ నెలకొని ఉంది. ఈ కేసుని విచారిస్తున్న లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్కే యాదవ్ తీర్పు వెలువడే 30వ తేదీన నిందితులు అందరూ న్యాయస్థానానికి హాజరు కావాలని బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఉమా భారతి, కళ్యాణ్ సింగ్, వినయ్ కటియార్, స్వాధి రితంబర వంటి బీజేపీ సీనియర్ నాయకులు ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నారు. 28 ఏళ్లుగా విచారణ కొనసాగుతున్న బాబ్రీ కేసులో ఈ నెల 1న వాదనలు పూర్తయ్యాయి. 351 సాక్షులు, 600 డాక్యుమెంట్లు బాబ్రీ కేసుని విచారించిన సీబీఐ 351 మంది సాక్షుల్ని న్యాయస్థానం ఎదుట ప్రవేశపెట్టింది. 600 డాక్యుమెంట్లను రుజువులుగా చూపించింది. 48 మందిపై అభియోగాలు నమోదు చేయగా, విచారణ జరుగు తుండగానే 16 మంది ప్రాణాలు కోల్పోయారు. 16వ శతాబ్దం నాటి బాబ్రీ మసీదుని కూల్చివేతలో పాల్గొన్న కరసేవకుల్ని ఈ కేసులో నిందితులందరూ కుట్ర పన్ని వారిని రెచ్చగొట్టారని సీబీఐ వాదనలు వినిపించింది. 1992 డిసెంబర్ 6న కరసేవకులు అయోధ్యలో బాబ్రీ మసీదుని కూల్చివేశారు. -
అది రాజ్యాంగ విరుద్ధం
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు ఉద్యోగుల విభజనకు సంబంధించి రాజ్యాంగ విరుద్ధంగా, పునర్విభజన చట్టం మార్గదర్శకాలకు విరుద్ధంగా కేటాయింపులు చేశారంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల విభజనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన (అపాయింటెడ్ డే) జూన్ 2, 2014ను ప్రాతిపదికగా తీసుకోవాలని స్పష్టం చేసింది. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పడిన 2019 జనవరి 1వ తేదీ ప్రాతిపదికగా ఉమ్మడి హైకోర్టు ఉద్యోగుల విభజన ప్రక్రియ చేపట్టడం రాజ్యాంగ విరుద్ధమని, పునర్విభజన చట్టంలోని సెక్షన్ 77కు విరుద్ధమని తేల్చిచెప్పింది. హైకోర్టు ఏర్పడిన తేదీ ప్రాతిపదికగా విభజన ప్రక్రియ చేపట్టడంతో 2018 జూలై 30న పిటిషనర్లు పదవీ విరమణ చేయాల్సి వచ్చిందని తెలిపింది. 2014 జూన్ 2వ తేదీ ప్రాతిపదికగా ఉమ్మడి హైకోర్టు ఉద్యోగుల నుంచి ఆప్షన్స్ తీసుకొని విభజన ప్రక్రియ పూర్తిచేసి ఉంటే..పిటిషనర్లు 60 ఏళ్లకు పదవీ విరమణ చేసేవారని పేర్కొంది. 2019 జనవరి 1 నుంచి 60 ఏళ్లు పూర్తయ్యే వరకు పిటిషనర్లకు రావాల్సిన జీతభత్యాలను 6 శాతం వడ్డీతో ఎనిమిది వారాల్లో చెల్లించాలని, ఈ మొత్తాన్ని ఏపీ, తెలంగాణ æప్రభుత్వాలు సమానంగా భరించాలని తీర్పులో స్పష్టంచేసింది. ఉమ్మడి హైకోర్టు పూర్వ ఉద్యోగులు కె.బలరామరాజు, మరో 9 మంది దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎస్ రామచందర్రావు, జస్టిస్ టి.అమర్నాథ్గౌడ్లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. తీర్పులో ఇంకా ఏమన్నారంటే.. పిటిషనర్ల పెన్షన్ మదింపునకు కూడా 60 ఏళ్ల సర్వీసు పూర్తి చేసినట్లుగా పరిగణనలోకి తీసుకొని 8 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని, పిటిషనర్ల సర్వీసు రికార్డులను ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ను ఆదేశించారు. అలాగే ఆప్షన్ ఇచ్చే అవకాశం తిరస్కరించినందుకు ఒక్కో పిటిషనర్కు రూ.3 వేల చొప్పున పరిహారం చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. కాగా, ఉద్యోగుల కేటాయింపుల ప్రక్రియలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు రెండు హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్స్కు జరిమానా విధించింది. వివక్షత చూపించడం సరికాదు.. ‘‘న్యాయాధికారుల విభజనకు సంబంధించి 2017 జూలై 8న జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం.. 2014 జూన్ 2 నాటికి సర్వీసులో ఉన్న వారి నుంచి ఆప్షన్స్ తీసుకున్నారు. ఉద్యోగుల విభజనకు సంబంధించి సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. అయితే ఉమ్మడి హైకోర్టు అధికారులు, ఉద్యోగుల విషయంలో మాత్రం 2018 నవంబర్ 1 నాటికి సర్వీసులో ఉన్న వారి నుంచి మాత్రం ఆప్షన్స్ తీసుకోవడం వివక్షత చూపించడమే. ఇందుకు సహేతుకమైన కారణాలను కూడా చూపించలేదు. 2019 జనవరి 1వ తేదీ ప్రాతిపదికగా అధికారులు, ఉద్యోగుల సర్వీసును 60 ఏళ్ల వరకు కొనసాగించాలన్న ఫుల్ కోర్టు నిర్ణయం సరైనది కాదు. సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా, వివక్షతాపూరితంగా హైకోర్టు ఆప్షన్స్ తీసుకుంది. సెక్షన్ 77(2) ప్రకారం అపాయింటెడ్ డే నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు.. ఏ రాష్ట్రంలో పనిచేయాలో కోరుకునే హక్కు ఉందని స్పష్టం చేస్తోంది. 2014 జూన్ ప్రాతిపదికగా వీరి కేటాయింపులు పూర్తిచేసి ఉంటే పిటిషనర్లు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు కూడా పొందేవారు. తమకు జరిగిన అన్యాయంపై 2019 జూలై 6న పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. 2020 జూలై 30కి వీరికి 60 ఏళ్లు పూర్తయ్యాయి. అయితే ఈలోగానే తీర్పు ఇవ్వాల్సి ఉన్నా లాక్డౌన్తోపాటు ప్రతివాదులు కౌంటర్లు దాఖలు చేయడంతోపాటు వాదనలు వినిపించడంలో జాప్యంలాంటి ఇతర కారణాలతో తీర్పు ఇవ్వలేకపోయాం. 2018 జూలై 30న పిటిషనర్లు పదవీ విరమణ చేసినా వారికి జీతభత్యాలు, పెన్షన్ పొందే హక్కు ఉంది’’అని ధర్మాసనం తీర్పులో పేర్కొంది. కాగా, పిటిషనర్ల తరఫున న్యాయవాది కేఎస్ మూర్తి వాదనలు వినిపించారు. -
ఆ వారసులకు రూ.20 వేల కోట్లు
చండీగఢ్: ఫరీద్ కోట్ మహారాజు హరీందర్ సింగ్ బ్రార్కు చెందిన రూ. 20 వేల కోట్ల విలువైన ఆస్తికి వారసులెవరనే విషయంలో పంజాబ్ అండ్ హరియాణా హైకోర్టు సోమవారం కీలక తీర్పును వెలువరించింది. మహారాజు కూతుళ్లు అమృత్ కౌర్, దీపిందర్ కౌర్లకు 75%, తల్లి దివంగత మొహిందర్ కౌర్కు మిగతా 25% వాటా చెందుతుందని స్పష్టం చేసింది. మొహిందర్ కౌర్ వాటాపై హరీందర్ సింగ్ సోదరుడైన మంజిత్ ఇందర్ సింగ్ వారసులకు హక్కు ఉంటుందని పేర్కొంది. మూడేళ్ల వయసులో హరీందర్ సింగ్ ఫరీద్కోట్ ఎస్టేట్కు రాజయ్యారు. ఆ సంస్థానం చివరి రాజు ఆయన నరీందర్ కౌర్ను వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు కూతుళ్లు. ఒక కుమారుడు. కూతుళ్లు అమృత్ కౌర్, దీపిందర్ కౌర్, మహీపిందర్ కౌర్. కుమారుడు హర్మొహిందర్ సింగ్ 1981లో ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు. కూతురు మహీపిందర్ కౌర్ పెళ్లి కాకముందే మరణించారు. మహారాజు హరీందర్ సింగ్ 1989లో చనిపోయారు. అనంతరం ఆయన ఎస్టేట్ ఆస్తులపై వివాదం మొదలైంది. మహారాజు హరీందర్కు వంశపారంపర్యంగా వచ్చిన విలువైన ఆస్తులు హిమాచల్ప్రదేశ్, ఢిల్లీ, చండీగఢ్, హరియాణాల్లో ఉన్నాయి. వాటి విలువ రూ. 20 వేల కోట్లకు పైనే. కోర్టు కేసు నడుస్తుండగా దీపిందర్ కౌర్ మరణించారు. మహారాజు హరీందర్ సింగ్ మరణం తరువాత ఆయన రాసినట్లుగా చెబుతున్న వీలునామా ఒకటి వెలుగులోకి వచ్చింది. అందులో దీపిందర్ సింగ్ నిర్వహిస్తున్న ‘మహర్వాల్ కేవాజీ ట్రస్ట్’కు ఆస్తి చెందాలని ఉంది. అయితే, ఆ వీలునామా చెల్లదని ముందుగా చండీగఢ్ కోర్టు, ఆ తరువాత తాజాగా హైకోర్టు తేల్చిచెప్పాయి. హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఆస్తి పంపకం జరగాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజ్మోహన్ సింగ్ తీర్పునిచ్చారు. ఆ ప్రకారం, ఇద్దరు కూతుళ్లకు, మహారాజు చనిపోయిన సమయంలో జీవించి ఉంది కనుక ఆయన తల్లి మొహిందర్ కౌర్కు ఆస్తి చెందుతుందని పేర్కొన్నారు. మొహిందర్ కౌర్ రాసిన వీలునామా ప్రకారం తనకు సంక్రమించే ఆస్తి ఆమె మరో కుమారుడు మంజిత్ ఇందర్ సింగ్ కుటుంబానికి చెందుతుంది. ఎస్టేట్స్ యాక్ట్, 1948 ప్రకారం ఆస్తి అంతా తనకే చెందుతుందని అమృత్ కౌర్ వాదించారు. జేష్టస్వామ్య సంప్రదాయం ప్రకారం.. పెద్ద కుమారుడికి కానీ, లేదా జీవించి ఉన్న పెద్ద సోదరుడి కుటుంబానికి కానీ ఆస్తిపై హక్కు ఉంటుందని మంజిత్ ఇందర్ సింగ్ కుమారుడు భరత్ ఇందర్సింగ్ వాదించారు. వీలునామా ప్రకారం ఆస్తి అంతా తాను నిర్వహిస్తున్న ట్రస్ట్కు చెందాలని దీపిందర్ సింగ్ కోరారు. వీరి వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. ఆస్తిపై హక్కు కోసం కుట్రపూరితంగా రూపొందించారని పేర్కొంటూ వీలునామాను కొట్టివేసింది. ఫరీద్ కోట్ రాజమహల్ -
చిన్నారి వర్షిత కేసులో సంచలన తీర్పు
-
నేడు ఉగ్రవాది తుండా కేసులో తీర్పు
-
చిన్నారి వర్షిత కేసు తీర్పు వాయిదా
సాక్షి, చిత్తూరు : మదనపల్లె సమీపంలోని అంగళ్లులో గతేడాది నవంబర్ 7న హత్యకు గురైన చిన్నారి వర్షిత కేసు తీర్పు మంగళవారానికి వాయిదా పడింది. తన వాదనలు వినేందుకు సమయం కావాలని ముద్దాయి రఫీ కోరడంతో కేసు విచారణను రేపటికి వాయిదా వేశారు. వాదనలు విన్న తర్వాతే తీర్పు ఇచ్చే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ లోకనాథ్ పేర్కొన్నారు. కాగా, గతేడాది నవంబర్ 7న మదనపల్లె సమీపంలోని అంగళ్లులో చిన్నారి వర్షిత హత్యాచారానికి గురైంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మదనపల్లె మండలంలోని బసినికొండకు చెందిన లారీ క్లీనర్ మహ్మద్ రఫీ(27) ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సీసీ పుటేజీల ద్వారా గుర్తించారు. అప్పటికే తప్పించుకున్న నిందితుడు ఛత్తీస్ఘడ్కు పారిపోయాడు. కేసును చాలెంజ్గా తీసుకున్న ఎస్పీ సెంథిల్ కుమార్ నిందితుడిని పట్టుకోవడానికి మదనపల్లె డీఎస్పీ రవిమనోహరచ్చారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు నియమించారు. ఎట్టకేలకు నవంబర్ 16న రఫీని అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరపరిచారు. ఈ ఘటనకు సంబంధించి పలు ఆధారాలు సేకరించి న్యాయస్థానానికి అందజేశారు. నేరం జరిగిన 17 రోజుల్లోనే చార్జిషీట్ పత్రాన్ని న్యాయస్థానానికి అందించారు. చిత్తూరులోని జిల్లా మొదటి అదనపు సెషన్స్ న్యాయస్థానం న్యాయమూర్తి వెంకట హరినాథ్ ఈ కేసు విచారణ ప్రారంభించారు. పోలీసులు ఇచ్చిన అన్ని సాక్ష్యాలను పరిశీలించారు. ఈనెల 14న విచారణ కూడా పూర్తయింది. ఈ రోజు తీర్పు వెలువరిస్తారనే ప్రచారంతో బాధితులంతా ఆసక్తిగా ఎదురు చూశారు. కేసును ఈ నెల 18కి వాయిదా వేశారు. -
చిన్నారి వర్షిత కేసులో నేడు తుది తీర్పు
-
తల్లీకూతుళ్ల హత్యకేసులో ఇంతియాజ్కు ఉరిశిక్ష
-
నెల్లూరు కోర్టు సంచలన తీర్పు
సాక్షి, నెల్లూరు: డబుల్ మర్డర్ కేసులో జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 2013లో జరిగిన తల్లీకూతుళ్ల హత్యకేసులో న్యాయస్థానం గురువారం తీర్పును వెల్లడించింది. నిందితుడు షేక్ ఇంతియాజ్కు ఉరిశిక్ష విధిస్తూ ఎనిమిదో అదనపు న్యాయమూర్తి సత్యనారాయణ తీర్పునిచ్చారు. కాగా హరినాథపురం 4వ వీధికి చెందిన దినకర్ రెడ్డి భార్య శకుంతలతో పాటు మెడిసిన్ చదువుతున్న కుమార్తె భార్గవిని ముగ్గురు దుండగులు దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళితే నగరంలోని వాగ్దేవి డి-ఫార్మసీ కళాశాల కరెస్పాండెంట్ దినకర్ రెడ్డి, స్థానిక హరనాథపురంలో భార్య, కుమార్తెతో నివాసం ఉండేవారు. ఆయన కుమార్తె భార్గవి ఎంబీబీఎస్ చదువుతోంది. 2013 ఫిబ్రవరి 12న దినకర్రెడ్డి నూతన గృహానికి సంబంధించిన ప్లాన్ ఇచ్చేందుకు వచ్చిన ముగ్గురు..శకుంతల, భార్గవిపై కత్తులు, రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్ర రక్తగాయాలైన తల్లీకూతురు కిందపడిపోయారు. వారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. -
హాజీపూర్ హత్యల కేసులో నేడు తుది తీర్పు
-
సత్వర న్యాయం
రెండు నెలలక్రితం కుమురం భీం అసిఫాబాద్ జిల్లాలో చిరు వ్యాపారం చేసుకుంటున్న మహిళను అపహరించి, సామూహిక అత్యాచారం చేసి, హత్య చేసిన కేసులో ముగ్గురు నిందితులు షేక్ బాబు, షాబుద్దీన్, షేక్ మఖ్దూంలకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ ఫాస్ట్ట్రాక్ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ఈ ఉదంతం జరిగిన మూడు రోజులకు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని చకచకా దర్యాప్తు చేశారు. గత నెల 11న ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటుకాగా 14న పోలీసులు చార్్జషీటు దాఖలు చేశారు. ఈ కేసులో ఫాస్ట్ట్రాక్ కోర్టు కూడా అంతే వేగంతో దర్యాప్తు జరిపి 45 రోజుల్లో తీర్పు వెలువరించింది. నిందితులకు ఉరిశిక్ష పడింది కనుక తెలంగాణ హైకోర్టు దీన్ని ధ్రువీకరించాల్సివుంటుంది. ఉరిశిక్ష విధింపు విషయంలో భిన్నాభిప్రాయం ఉన్నవారు సైతం తెలంగాణ పోలీ సులు పకడ్బందీగా దర్యాప్తు చేయడాన్ని, ఫాస్ట్ట్రాక్ కోర్టు కూడా ఈ కేసు విచారణను సత్వరం పూర్తి చేయడాన్ని హర్షిస్తారు. అత్యాచారాలు తరచుగా చోటుచేసుకోవడానికి గల ముఖ్య కారణాల్లో వ్యవస్థలు సక్రమంగా స్పందించకపోవడం ఒకటని 2012లో నిర్భయ ఉదంతం తర్వాత కేంద్రం నెలకొల్పిన జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ చెప్పడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. తెలంగాణలోని వరంగల్ జిల్లాలో తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారం జరిపి, హత్య చేసిన ఉదంతంలో కూడా పోలీసులు ఇంతే వేగంతో స్పందించారు. ఘటన జరిగిన 48 రోజుల్లో విచారణ పూర్తయి నేరగాడికి ఉరిశిక్ష పడింది. ఈ కేసు తీర్పును సమీక్షించిన తెలంగాణ హైకోర్టు ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చింది. గత నవంబర్ 27న వైద్యురాలు దిశను అపహరించి, సామూహిక అత్యాచారం చేసి, హతమార్చిన నిందితులు ఆ తర్వాత డిసెంబర్ 6న ఎన్కౌంటర్లో మరణించారు. ఆ నిందితులు ఇదే తరహాలో తెలంగాణ, కర్ణాటకల్లో 15మంది మహిళల ప్రాణాలు తీసినట్టు తమ దర్యాప్తులో వెల్ల డైందని పోలీసులు చెప్పారు. యాదాద్రి జిల్లాలోని హాజీపూర్లో బాలికల ప్రాణాలు తీసిన కేసులోని నిందితుడికి ఇంకా శిక్ష పడాల్సివుంది. సమాజంలో ఆగ్రహావేశాలు పెల్లుబికి, మీడియాలో బాగా ప్రచారంలోకొచ్చిన కేసుల విషయంలో మాత్రమే పోలీసులు శ్రద్ధ పెడుతున్నారని, న్యాయస్థానాలు కూడా వేగంగా విచారణ చేస్తున్నాయన్న విమర్శలున్నాయి. అత్యాచారం కేసుల్లో మాత్రమే కాదు... ఆడపిల్లల పట్ల జరిగే ఏ చిన్న లైంగిక నేరంలోనైనా ఇదేవిధమైన శ్రద్ధ పెట్టడం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అవసరం. ముఖ్యంగా తమ కుమార్తెను ఫలానా వ్యక్తి వేధిస్తున్నాడని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పుడు దాన్ని అత్యంత సాధారణమైన విషయంగా తీసుకోవడం పోలీసు విభాగాల్లో రివాజు అయింది. అసలు బాధితులు ఫిర్యాదు చేసేవరకూ వచ్చారంటేనే పరిస్థితి వారి చేయి దాటిపోయిందని అర్థం. మన సమాజంలో ఏ ఆడపిల్లయినా వేధింపులు ఎదుర్కొన్నప్పుడు అంత త్వరగా తల్లిదండ్రులకు చెప్పడానికి కూడా సిద్ధపడదు. కుటుంబాల్లో ఆడపిల్లల్ని పెంచే విధానం ఇందుకు ఒక కారణం. అలా చెబితే తననే నిందిస్తారేమో, అసలు బయటకే వెళ్లొద్దని కట్టడి చేస్తారేమో అని సందేహపడుతుంది. చదువుకునే బాలికైతే చదువు ఆపేస్తారని భయపడుతుంది. వేధింపుల స్థాయి పెరిగాక తప్పనిసరై ఇంట్లో చెబుతుంది. తల్లిదండ్రులు సైతం పోలీసుల వరకూ వెళ్లకుండా ఈ సమస్యను పరిష్కరిద్దామని చూస్తారు. పోలీస్ స్టేషన్ కు వెళ్తే కుటుంబం పరువు పోతుందని భయపడతారు. అందరూ వేలెత్తి చూపుతారని సందేహపడతారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా మరింత తాత్సారం చేస్తే ఏమవుతుందో వేరే చెప్పనవసరం లేదు. దిశ విషయంలో పోలీసులు వెంటనే స్పందించలేదు. ఆమె తన సోదరికి ఫోన్ చేసి తన టూ వీలర్ పాడైందని, బాగు చేసుకొస్తానని వెళ్లినవాడు ఇంకా రాలేదని చెప్పిన కాసేపటికే స్విచాఫ్ కావడంతో వెంటనే ఆ కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కానీ వారి నుంచి సరైన స్పందన రాలేదని, వెంటనే కదిలివుంటే ఆమె ప్రాణాలు నిలిచేవని కుటుంబసభ్యులు ఆరోపిం చారు. బాధితులకు ఎవరూ అండగా రారని, వారు నిస్సహాయులని తెలిసినప్పుడే నేరగాళ్లు మరింత పేట్రేగిపోతారు. కనుకనే సమాజంలో నిస్సహాయులుగా ఉండేవారి రక్షణకు ఉద్దేశించిన వ్యవస్థలు ఏవిధంగా పనిచేస్తున్నాయో, అవి తమ విధులను ఎలా నిర్వర్తిస్తున్నాయో ఎప్పటికప్పుడు తనిఖీ చేసే యంత్రాంగం ఉండాలని జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ సూచించింది. తనిఖీల్లో అలసత్వంతో ఉన్నట్టు తేలినపక్షంలో కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపింది .లోగడ వరంగల్ జిల్లాలో జరిగిన ఉదంతంలోగానీ, ఇప్పుడు సమత కేసు ఉదంతంలోగానీ సత్వర దర్యాప్తు జరగడం, వెనువెంటనే నేరగాళ్లకు కఠిన శిక్షలు పడటం వంటివి హర్షించదగ్గవే అయినా... వాటి తీవ్రతతో నిమిత్తం లేకుండా ఏ కేసు విషయంలోనైనా ఇదే స్థాయిలో స్పందించే స్వభావాన్ని పోలీసులు అలవర్చుకుంటే నేరస్వభావాన్ని మౌలిక దశలో కట్టడి చేయడం వీలవుతుంది. ఈ క్రమంలో నిందితులు పలుకుబడి కలిగినవారైనా ఉపేక్షించకూడదు. ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో శాసనసభ్యుడిపై అత్యాచారం ఆరోపణలొచ్చినప్పుడు పోలీసులు ఎంతో తాత్సారం చేయడం వల్ల అతగాడు మరింత రెచ్చిపోయాడు. ఆ ఎమ్మెల్యే మనుషులు ఆమె తండ్రితోసహా కుటుంబంలో నలుగురిని హతమార్చడంతోపాటు రోడ్డు ప్రమాదం పేరిట బాధితురాలినే హత్య చేయాలనుకున్నారు. తీవ్రమైన నేరాలకు కఠిన శిక్షలు విధించడానికి అనువుగా చట్టాలు సవరించడం, వెంటవెంటనే నేరగాళ్లకు శిక్షలు పడేవిధంగా అన్ని వ్యవస్థలూ చురుగ్గా పనిచేయడం నేరాలను అరికట్టడంలో ఎంతో ఉపయోగపడతాయి. అదే సమయంలో మద్యపానం మహమ్మారిని అదుపు చేయడం, అశ్లీల వీడియోలపై కట్టడం చేయడం అత్యంత ముఖ్యం. ఒక మనిషి మృగంగా మారడానికి తోడ్పడుతున్న ఈ మాదిరి ప్రమాదకరమైన వాటిని నిర్మూలించకుండా నేరాలను అరికట్టడం సాధ్యం కాదు. కనుక ప్రభుత్వాలు వీటిపై కూడా దృష్టి పెట్టాలి. -
కట్టుకథలపై కొరడా.. శ్రీలంక ‘సుప్రీం’ తీర్పు
శ్రీలంకలో 2010లో పోలీసు కస్టడీలో ఉన్న ఒక వ్యక్తిని కాల్చి చంపి ఎన్కౌంటర్ ముద్ర వేసిన ఘటనపై ఆ దేశ సుప్రీంకోర్టు స్ఫూర్తిదాయకమైన తీర్పును తాజాగా ప్రకటించింది. కరడుగట్టిన నేరస్తుడికి బేడీలు వేయకుండా తక్కువ భద్రతతో బయటకు పోలీసులు తీసుకెళ్లడంలోనే ఎన్కౌంటర్ కట్టుకథకు మూలం ఉందని తేల్చి చెప్పిన శ్రీలంక సుప్రీంకోర్టు నేరస్తులకు ఉన్న జీవించే హక్కును శాసనం ద్వారా తప్ప హరించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేసింది. ‘మనుషులందరిలోనూ రక్తమే ఉన్నట్టు, పోలీసులందరూ చెప్పే కథల్లోనూ ఒకే రకమైన సృజనాత్మకత ఉంటుంది. మనుషులందరూ ఒక్కటే. పోలీసులందరూ ఒక్కటే’ అంటూ ఓ తెలుగు కథలోని ఒక పాత్ర అంటుంది. కానీ, పోలీసులందరిలో ప్రవహించేది ఒకే రక్తమే కానీ, కథనాలు వేరన్న రోజు ఎప్పుడు వస్తుందో ఎదురుచూడాలి. ఎదురుకాల్పులన్నీ, బూటకపు ఎన్కౌంటర్లనేవి మన దేశానికే పరి మితం కాదు. ఇది చాలా దేశాల్లో ఉంది. నేరస్తులను, తీవ్రవాదు లను, అదే విధంగా కరడుగట్టిన నేరస్తులను ఎన్కౌంటర్ల పేరుమీద ఏరి వేయడం ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఎన్కౌంటర్లో చనిపోయిన ఓ వ్యక్తి కుటుంబానికి శ్రీలంక సుప్రీంకోర్టు పది లక్షల రూపాయల నష్ట పరిహారాన్ని చెల్లించాలని శ్రీలంక ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలుగులో ఓ కథ ఉంది. ఆ కథలోని ఓ పాత్ర ఇలా అంటుంది. ‘అందరి మనుషుల్లోనూ రక్తమేనన్నట్టు, పోలీ సులందరూ చెప్పే కథల్లోనూ ఒకే రకమైన సృజనాత్మకత ఉంటుంది. మనుషులందరూ ఒక్కటే. పోలీసులందరూ ఒక్కటే’. శ్రీలంక సుప్రీంకోర్టు గత నెలలో చెప్పిన తీర్పుని గమనించినప్పుడు ఈ వాక్యాలు గుర్తుకొచ్చాయి. ఎందు కంటే ఆ కేసులో కూడా పోలీసుల కథనం మన పోలీసుల మాదిరిగానే ఉంది. రాణా మునేజ్ అజిత్ ప్రసన్న అనే వ్యక్తి పోలీసు కస్టడీలో సెప్టెంబర్, 2010వ సంవత్సరంలో చనిపో యాడు. పోలీసులు కాల్చి చంపారని ఆరోపిస్తూ అతని భార్య సుప్రీంకోర్టులో దరఖాస్తుని అదే సంవత్సరంలో దాఖలు చేసింది. పోలీసుల కథనం ప్రకారం అతను అండర్ వరల్డ్ నేర స్తుడని, ఓ హత్య కేసులో అతన్ని అరెస్టు చేశామని పోలీ సులు కోర్టుకి చెప్పారు. దగ్గర్లో ఉన్న పొదలో తన ఆయు ధాన్ని దాచానని అతను చెబితే, అక్కడికి అతన్ని తీసుకొని వెళ్తున్న క్రమంలో పోలీసుల దగ్గరినుంచి రైఫిల్ లాక్కో వడానికి ప్రయత్నం చేశాడనీ, ఆ ఘర్షణలో రైఫిల్ పేలి అతను మరణించాడనీ పోలీసులు కోర్టుకి విన్నవించారు. అయితే కోర్టు ఈ పోలీసుల కథనాన్ని విశ్వసించలేదు. కరడుగట్టిన ముద్దాయికి బేడీలు వేయకుండా, సరైన పోలీసు బలగాలు లేకుండా అతన్ని ఆ రాత్రి ఎందుకు తీసు కొని వెళ్లారని కోర్టు ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచింది. కోర్టు తన తీర్పులో ఇలా పేర్కొంది. ‘కోర్టుకి సమ ర్పించిన ఆధారాల ప్రకారం అతను కరడుగట్టిన నేరస్తుడు. కిరాయి హంతకుడు. అండర్వరల్డ్కి చెందిన వ్యక్తి. అతను చాలా అపాయకరమైన వ్యక్తి అని పోలీసులు భావించి అతన్ని ప్రత్యేక రక్షణలో ఉంచారు. 17, 18 తేదీలలో అతన్ని అత్యంత భద్రత మధ్య స్టేషన్కి తరలించారు. ఈ పరిస్థితులు ఉన్నప్పుడు 18 రాత్రి అతనికి సంకెళ్లు వేయ కుండా ముగ్గురు పోలీసులు, డ్రైవర్తో సరైన నిర్వహణలేని వాహనంలో తీసుకొని వెళ్లడానికి ఎలాంటి సంతృప్తికరమైన సమాధానాన్ని పోలీసులు కోర్టుకి వివరించలేకపోయారు. పోలీసుల ప్రకారం– అతను చాలా తీవ్రమైన నేరాల్లో ప్రధాన పాత్ర ఉన్న వ్యక్తి. అది నిజమైతే పోలీసులు మరింత జాగ్రత్తగా ఉండాల్సింది. తుపాకులని ఉపయో గించడం బాగా తెలిసిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి సంకెళ్లు వేయకుండా లోడెడ్ తుపాకులతో ఎందుకు తీసుకుని వెళ్లారనే విషయానికి పోలీసుల దగ్గర సరైన సమాధానం లేదు. అందుకని ప్రతివాదుల (పోలీసుల) వాదనని ఆమో దించలేమని కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. పోస్టుమార్టం నివేదికలో అతను చనిపోవడానికన్నా ముందే అయిన గాయాలు ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు. అవి అన్నీ మొరటుగా, బలంగా తగిలినట్టు ఉన్నాయని కోర్టు భావించింది. శ్రీలంక రాజ్యాంగంలోని అధికరణ 13(4) ప్రకారం– కోర్టు ఉత్తర్వులు లేకుండా ఏ వ్యక్తిని నిర్బంధించడానికి, చంపడానికి వీల్లేదు. శిక్ష పడిన ముద్దాయి జీవితాన్ని కూడా ఏకపక్షంగా అంతం చేయ డానికి వీల్లేదు. శాసనం ప్రకారం మాత్రమే అతని జీవి తాన్ని అంతం చేయాల్సి ఉంటుంది. శ్రీలంక రాజ్యాంగం వ్యక్తులకి జీవించే హక్కుని ప్రత్యే కంగా పేర్కొనలేదు. కానీ అంతర్జాతీయ ఒప్పందాలపై శ్రీలంక సంతకం చేసింది. అందుకని వ్యక్తులకి జీవించే హక్కు ఉన్నట్టుగా భావించాల్సి ఉంటుందని శ్రీలంక సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. ఈ కారణాలని పేర్కొంటూ శ్రీలంక సుప్రీంకోర్టు మృతుని భార్య దాఖలు చేసిన దరఖాస్తుని ఆమోదించి శ్రీలంక ప్రభుత్వం పది లక్షల రూపాయలని అతని భార్యకు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. దేశంలోని ప్రతి పౌరుడిని రక్షించాల్సిన బాధ్యత ‘రాజ్యం’పై ఉందనీ, ఆ బాధ్యతలో రాజ్యం విఫలం అయిందని కోర్టు తన తీర్పులో పేర్కొంది. ఇక్కడితో సుప్రీంకోర్టు ఊరుకోలేదు. మృతుని ప్రాథ మిక హక్కులకి భంగం కలిగించిన నలుగురు పోలీసు అధికారులు ఒక్కొక్కరు సొంతంగా రూ.2,50,000లు చెల్లించాలని, తమ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించని మరో ముగ్గురు పైఅధికారులు ఒక్కొక్కరు సొంతంగా రూ. 25,000లు చెల్లించాలని కూడా శ్రీలంక సుప్రీంకోర్టు ఆదేశించింది. ముగ్గురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ ఈ తీర్పుని 17, డిసెంబర్ 2019న వెలువ రించింది. రోజురోజుకీ ఎన్కౌంటర్లు పెరిగిపోతున్న మన దేశంలో కూడా ఒకటీ అరా ఇలాంటి తీర్పులు వస్తున్న ప్పటికీ ఎలాంటి గుణాత్మకమైన మార్పు కనిపించడం లేదు. ఏమైనా తీర్పుని మన నేర న్యాయ వ్యవస్థతో సంబంధం ఉన్న వ్యక్తులు చదవాల్సిందే. పోలీసులందరిలో ప్రవహించేది ఒకే రక్తమే కానీ, కథనాలు వేరన్న రోజు ఎప్పుడు వస్తుందో ఎదురుచూడాలి. వ్యాసకర్త : మంగారి రాజేందర్, గతంలో జిల్లా, సెషన్స్ జడ్జిగా పనిచేశారు మొబైల్ : 94404 83001 -
అయోధ్య తీర్పు : పాక్ స్పందనపై ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ : రామజన్మభూమి-బాబ్రీమసీద్ వివాద కేసుపై సుప్రీం కోర్టు తీర్పు పట్ల పాకిస్తాన్ స్పందనను భారత్ తీవ్రంగా ఖండించింది. పాక్ స్పందన అవాంఛనీయం, అసందర్భమని తోసిపుచ్చింది. భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుని విద్వేషపూరిత వాతావరణం వ్యాప్తిం చేసేందుకే పాకిస్తాన్ ఇలా వ్యవహరిస్తోందని దుయ్యబట్టింది. భారత్కు సంబంధించిన అంతర్గత వ్యవహారంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల పాక్ వ్యాఖ్యానించిన తీరు దురుద్దేశపూరితంగా ఉందని, అసందర్భంగా ఉందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కర్తార్పూర్ కారిడార్ ప్రారంభోత్సవం సందర్భంగా పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ మాట్లాడుతూ సంతోషకర సమయాన సున్నితత్వం లేని వైఖరి చూపడం పట్ల విచారం వెలిబుచ్చుతున్నట్టు పేర్కొన్నారు. కాగా అయోధ్యలో వివాదాస్పద భూమిని రామజన్మ న్యాస్కు అప్పగిస్తూ మసీదుకు ప్రత్యామ్నాయంగా ఐదెకరాల స్థలం ఇవ్వాలని ఆదేశిస్తూ సుప్రీం కోర్టు శనివారం చారిత్రక తీర్పును వెల్లడించిన సంగతి తెలిసిందే. -
అయోధ్య తీర్పు: ‘బీజేపీకి డోర్లు క్లోజ్’
సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి తాము అనుకూలమని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. అయోధ్యలో వివాదస్పద స్థలంపై సుప్రీంకోర్టు వెలువరించిన నేపథ్యంలో రాజకీయ నాయకులు, పెద్దలు సంయమనం పాటించాలని లౌకికవాద విలువలను కాపాడాలని కోరింది. ‘సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. మేము రామమందిర నిర్మాణానికి సానుకూలంగా ఉన్నాం. మందిర నిర్మాణానికి ఈ తీర్పు తలుపులు తెరవడమే కాదు.. అయోధ్య అంశాన్ని రాజకీయం చేసిన బీజేపీ, ఇతరులకు తలుపులు మూసేసింద’ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా వ్యాఖ్యానించారు. ‘అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోంది. లౌకిక విలువలకు కట్టుబడాలని అన్ని రాజకీయ పార్టీలు, అన్ని మతాల వారిని కోరుతున్నాం. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ శాంతి, సౌభ్రాతృత్వాలను కలిగివుండాలని ఆకాంక్షిస్తున్నట్టు’ సీడబ్ల్యూసీ ఒక ప్రకటన విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు వెలువరించినా అందరూ శాంతి సామరస్యాలతో ఉండాలని అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ విజ్ఞప్తి చేశారు. (చదవండి: అయోధ్య తీర్పు.. ఎల్కే అద్వానీదే ఘనత) -
అయోధ్య తీర్పు: వారిదే ఘనత
సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్య వివాదంలో సుప్రీంకోర్టు తీర్పును ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త, రామ జన్మభూమి రథయాత్రలో కీలక పాత్రధారి కేఎన్ గోవిందాచార్య స్వాగతించారు. ఈ కేసులో తీర్పు తమకు అనుకూలంగా రావడానికి విశ్వ హిందూ పరిషత్(వీహెచ్పీ) నేత అశోక్ సింఘాల్, ఎల్కే అద్వానీ చేసిన కృషే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. ‘సుప్రీంకోర్టు తుది తీర్పు చాలా సంతోషం కలిగించింది. ఇక మూడు నెలల్లో రామమందిరం నిర్మాణానికి ప్రణాళిక రూపొందించాల’ని ఆయన అన్నారు. ప్రజలంతా సంయమనంతో మెలగాలని, మత సామరస్యం పాటించాలని కోరారు. ఈ విజయానికి ప్రధాన కారణం ఎవరు అనుకుంటున్నారని ప్రశ్నించగా.. ‘ఆలయ నిర్మాణం కోసం లక్షలాది మంది త్యాగాలు చేశారు. చాలా మంది అనేక రకాలుగా రామ జన్మభూమి ఉద్యమంలో తమ పాత్ర పోషించారు. కీలక భూమిక మాత్రం అశోక్ సింఘాల్, ఎల్కే అద్వానీదే’ అని సమాధానం ఇచ్చారు. అయోధ్య వివాదంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు చరిత్రాత్మకమని హిందూ మహాసభ తరపు న్యాయవాది వరుణ్కుమార్ సిన్హా వ్యాఖ్యానించారు. భిన్నత్వంలో ఏకత్వం సందేశాన్ని ఇచ్చేలా తీర్పు ఉందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు బాలెన్స్డ్గా ఉందని, ఇది ప్రజల విజయమని రామ్ లల్లా తరపు న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ అన్నారు. (చదవండి: సుప్రీంతీర్పును గౌరవిస్తున్నాం.. కానీ) -
అయోధ్య తీర్పు: సున్నీ వక్ఫ్బోర్డు స్పందన
న్యూఢిల్లీ : అయోధ్యలోని రామజన్మభూమి- బాబ్రీ మసీదు కేసులో సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పును తాము గౌరవిస్తున్నామని సున్నీ వక్ఫ్ బోర్డు న్యాయవాది జఫర్యాబ్ జిలానీ అన్నారు. అయితే సుప్రీంకోర్టు తీర్పుతో తాము సంతృప్తి చెందలేదని.. ఈ తీర్పుపై చర్చించిన తర్వాతే తదుపరి కార్యాచరణకు సిద్ధవుతామని ఆయన పేర్కొన్నారు. మరోవైపు తీర్పు కాపీ పూర్తిగా చదివిన తర్వాతే రివ్యూ పిటిషన్ వేయాలో లేదో నిర్ణయించుకుంటామని ముస్లిం లా బోర్డు స్పష్టం చేసింది. ఏఎస్ఐ నివేదికలో ముస్లింలకు అనుకూలంగా ఉన్న అంశాలను కోర్టు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. కమిటీతో చర్చించిన తర్వాతే వారి నిర్ణయం మేరకు రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని వెల్లడించింది. కాగా దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన రామజన్మభూమి కేసులో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం శనివారం కీలక తీర్పు వెల్లడించింది. వివాదాస్పద స్ధలం తమదేనంటూ షియా బోర్డు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు... నిర్మోహి అఖాడా పిటిషన్ను సైతం తోసిపుచ్చింది. అదే విధంగా అయోధ్య చట్టం కింద మందిర నిర్మాణానికి మూడు నెలల్లోగా ట్రస్ట్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేయడంతో పాటుగా... అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి ముస్లింలకు(సున్నీ వక్ఫ్ బోర్డుకు) ప్రత్యామ్నాయంగా ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వివాదాస్పద స్థలాన్ని (2.77 ఎకరాలు) రామజన్మ న్యాస్కే అప్పగించాలని తీర్పు వెలువరించింది. (చదవండి: అయోధ్య వివాదం; కీలక తీర్పు) -
అయోధ్య వివాదం; కీలక తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ: అత్యంత సున్నితమైన అయోధ్యలోని రామ జన్మభూమి– బాబ్రీ మసీదు భూ యాజమాన్య వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం శనివారం కీలక తీర్పు వెలువరించింది. వివాదాస్పద కట్టడం ఉన్న స్థలం హిందువులదేనని స్పష్టం చేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు చెప్పింది. 2.77 ఎకరాల స్థలం హిందువులకే చెందుతుందని తేల్చిచెప్పేసింది. వివాదాస్పద స్థలానికి సంబంధించి 3 నెలల్లో కేంద్రం ట్రస్ట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. వివాదాస్పద స్థలాన్ని ట్రస్ట్ ఆధీనంలో ఉంచాలని, కేంద్రం ఏర్పాటు చేసే ట్రస్ట్లో నిర్మోహి అఖాడాకు ప్రాతినిథ్యం కల్పించాలని సూచించింది. ఆలయ నిర్మాణం, ట్రస్ట్ విధి విధానాలపై 3 నెలల్లోగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. మసీదు నిర్మాణానికి ముస్లింలకు అయోధ్యలో ప్రత్యామ్నాయ స్థలం ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది. మసీదు నిర్మాణానికి సున్నీ వక్ఫ్బోర్డుకు 5 ఎకరాల స్థలం కేంద్రం లేదా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వాలని ఆదేశించింది. రాజకీయాలు, చరిత్రలకు అతీతంగా న్యాయం నిలబడాలని సుప్రీంకోర్టు పేర్కొంది. తీర్పు పాఠాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ చదివారు. నిర్ణయానికి ముందు రెండు మతాలను విశ్వాసాలను పరిగణనలోకి తీసుకున్నట్టు చెప్పారు. పురావస్తు శాఖ నివేదికల ఆధారంగా తీర్పు వెలువరిస్తున్నట్టు పేర్కొన్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం వివాదాస్పద స్థలం ప్రభుత్వానికి చెందినదని, వివాదాస్పద స్థలంపై ఎవరూ యాజమాన్య హక్కు కోరలేదని స్పష్టం చేశారు. ప్రార్థనా మందిరాల చట్టం ప్రాథమిక విలువలు, మత సామరస్యాన్ని పరిరక్షిస్తుందని వెల్లడించారు. వివాదాస్పద స్థలంలో మందిరం ఉన్నట్టు పురావస్తు శాఖ నివేదికలు చెబుతున్నాయన్నారు. మసీదు నిర్మాణానికి ముందే ఆ స్థలంలో ఒక నిర్మాణం ఉందన్నారు. వివాదాస్పద స్థలంలో మసీదు లేదని, అక్కడ హిందూ నిర్మాణం ఉందని పురావస్తు శాఖ విభాగం చెబుతోందన్నారు. యాజమాన్య హక్కులనేవి నిర్దేశిత న్యాయసూత్రాల ఆధారంగా నిర్ణయిస్తామన్నారు. అయోధ్యను రామజన్మభూమిగా హిందువులు విశ్వసిస్తారని, మందిరాన్ని కూలగొట్టి మసీదు నిర్మించారని పురావస్తు శాఖ ఎక్కడా చెప్పలేదన్నారు. రాముడు అయోధ్యలో జన్మించాడన్నది నిర్వివాదాంశమన్నారు. మసీదు ఎవరు కట్టారో, ఎప్పుడు కట్టారో స్పష్టం కాలేదని హైకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రెండు మతాల వారు వివాదాస్పద స్థలంలో ప్రార్థనలు జరిపేవారని చెప్పారు. మొఘుళుల కాలం నుంచే హక్కు ఉన్నట్టు వక్ఫ్ బోర్డు నిరూపించలేకపోయిందన్నారు. (చదవండి: మందిర నిర్మాణానికి మార్గం సుగమం) -
అయోధ్య తీర్పు: మందిర నిర్మాణానికి లైన్క్లియర్
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమమైంది. అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి ముస్లింలకు ప్రత్యామ్నాయంగా ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అయోధ్య యాక్ట్ కింద మందిర నిర్మాణానికి మూడు నెలల్లోగా ట్రస్ట్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. వివాదాస్పద స్ధలాన్ని రామజన్మ న్యాస్కే అప్పగించింది. వివాదాస్పద అయోధ్య కేసులో సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు వెల్లడించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ తీర్పును చదివివినిపించారు. ఐదుగురు న్యాయమూర్తుల ఏకాభిప్రాయంతో ప్రధాన న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. వివాదాస్పద స్ధలం తమదేనంటూ షియా బోర్డు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. నిర్మోహి అఖాడా దాఖలు చేసిన పిటిషన్ను సైతం తోసిపుచ్చింది. నిర్మోహి అఖారాకు వారసత్వ హక్కులు క్లెయిమ్ చేసే హక్కు లేదని తేల్చిచెప్పింది. చరిత్ర, మతపరమైన, న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని తీర్పు వెలువరించినట్టు ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఖాళీ ప్రదేశంలో బాబ్రీ మసీదు నిర్మించలేదని పేర్కొన్నారు. మసీదు కింద భారీ నిర్మాణం ఉందని పురావస్తు శాఖ నివేదిక వెల్లడించిందని చెబుతూ బాబ్రీమసీదును కచ్చితంగా ఎప్పుడు నిర్మించారో ఆధారాలు లేవని అన్నారు.12 నుంచి 16వ శతాబ్ధాల మధ్య ఏం జరిగిందనడానికి ఆధారాలు లేవని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అయితే మసీదును ముస్లింలు ఎప్పుడు వదలివేయలేదని అన్నారు. బాబ్రీ మసీదు విధ్వంసం చట్ట విరుద్ధమని తెలిపింది. అయోధ్యను హిందువులు రామజన్మభూమిగా భావిస్తారు. వారి విశ్వాసాలను తప్పుపట్టలేమని తీర్పును చదవుతూ ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. అయితే అక్కడ దేవాలయం ఉందనేందుకు ఆధారాలు లేవని అన్నారు. నమ్మకం, విశ్వాసాల ఆధారంగా భూ యాజమాన్య హక్కులు నిర్ధారించలేమని అన్నారు. ‘మతపరమైన విశ్వాసాల్లో కోర్టు జోక్యం చేసుకోదు.. న్యాయసూత్రాల ఆధారంగానే భూమి యాజమాన్య హక్కులు నిర్ణయించాల’ని తీర్పును చదువుతూ ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. వివాదాస్పద భూమి రికార్డుల ప్రకారం ప్రభుత్వానిదేని పేర్కొన్నారు. పురావస్తు నివేదికలనూ మదింపు చేసి తీర్పును వెల్లడించామన్నారు. జస్టిస్ గగోయ్, జస్టిస్ బాబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీర్, జస్టిస్ డీవై చంద్రచూడ్లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పును వెలువరించింది. -
అయోధ్య కౌంట్డౌన్ : విద్యాసంస్ధల మూసివేత
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య వివాదంపై శనివారం సుప్రీం కోర్టు తీర్పు వెలువడనుండటంతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. మధ్యప్రదేశ్, యూపీ, జమ్ము కశ్మీర్, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలు మూసివేశారు. యూపీలో ముందుజాగ్రత్త చర్యగా శనివారం నుంచి సోమవారం వరకూ విద్యాసంస్థలను మూసివేసినట్టు అధికారులు ప్రకటించారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలోనూ ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మరోవైపు గోవా, యూపీ, జమ్ము కశ్మీర్ సహా పలు రాష్ట్రాల్లో 144 సెక్షన్ విధించారు. భోపాల్, బెంగళూర్లలో నిషేధాజ్ఞలు విధించారు. బెంగళూర్లో శనివారం ఉదయం ఏడు గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకూ 144 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ భాస్కర్ రావు పేర్కొన్నారు. మరోవైపు జమ్ము కశ్మీర్లో పరీక్షలు వాయిదా వేసిన అధికారులు శనివారం మద్యం విక్రయాలు ఉండవని డ్రైడేగా ప్రకటించారు. ఇక హైదరాబాద్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలను నియమించామని, హైదరాబాద్లో శాంతి భద్రతల పరిస్థితిని అదుపులో ఉంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టామని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ వెల్లడించారు. -
అయోధ్యలో నిశ్శబ్దం
అయోధ్య: అయోధ్య వివాదంపై త్వరలో సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో మరికొన్ని కీలక పరిణామాలు సంభవించాయి. రామాలయ నిర్మాణం కోసం 1990 నుంచి అయోధ్యలో రాతి శిల్పాలను చెక్కిస్తున్న విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) మొదటిసారిగా ఆ పనులను నిలిపివేసింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం అన్ని రాష్ట్రాలను కోరింది. ఫైజాబాద్ జిల్లాకు 40 కంపెనీల పారా మిలటరీ బలగాలను తరలించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ 28వ తేదీ వరకు అయోధ్యలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించింది. ఇలా ఉండగా, సుప్రీంకోర్టు తీర్పుపై అయోధ్య వాసులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలతో అంతా సవ్యంగానే జరిగిపోతుందని, 1992 నాటి పరిస్థితులు పునరావృతం అయ్యే అవకాశం ఉండదని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అయోధ్యలోని రామమందిర్ కార్యశాలలో ఆలయం కోసం 1990 నుంచి రాతి చెక్కడం పనులు సాగిస్తున్న వీహెచ్పీ మొట్టమొదటి సారిగా పనులను నిలిపివేసింది. బాబ్రీ మసీదు స్థానంలో రామాలయం నిర్మించాలని వీహెచ్పీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్రం, యూపీలో ప్రభుత్వాలు మారినా..1992లో బాబ్రీ మసీదు విధ్వంసం జరిగి, వీహెచ్పీ, ఆర్ఎస్ఎస్ తదితర హిందుత్వ సంస్థలపై 6 నెలలపాటు నిషేధం విధించినప్పుడు కూడా ఈ పనులు ఆగలేదు. తాజాగా, సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్న దృష్ట్యా తమ నాయకత్వం పనులు నిలిపివేయాలని నిర్ణయం తీసుకుందని వీహెచ్పీ ప్రతినిధి శరత్ శర్మ తెలిపారు. ప్రతిపాదిత రామాలయం మొదటి అంతస్తుకు సరిపడా 1.25 లక్షల ఘనపుటడుగుల రాతి చెక్కడం పనులు ఇప్పటి వరకు పూర్తయ్యాయని ఆయన అన్నారు. ముందు జాగ్రత్త చర్యలు సుప్రీంకోర్టు తీర్పును పురస్కరించుకుని సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను పెంచాలని, అవాంఛనీయ ఘటనలు జరక్కుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం కోరింది. అదేవిధంగా, యూపీ ప్రభుత్వం కూడా సుప్రీం తీర్పు అనంతరం ఉత్సవాలు జరుపుకోవడం, నిరసన తెలపడం వంటి వాటిపై నిషేధం విధించింది. డిసెంబర్ 28వ తేదీ వరకు అయోధ్యలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించింది. ఫైజాబాద్ జిల్లా నాలుగు భద్రతా జోన్లను ఏర్పాటు చేసిన కేంద్రం 40 కంపెనీల పారా మిలటరీ బలగాలను తరలించింది. సామాజిక మాధ్యమాల్లో రామ జన్మభూమి తీర్పునకు సంబంధించి వ్యాఖ్యలపై నిషేధం విధించింది. రైల్వే శాఖ కూడా రైల్వే భద్రతా దళం(ఆర్పీఎఫ్) సెలవులను రద్దు చేసింది. వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించింది. -
మధ్యవేలు చూపించి జైలుపాలయ్యాడు
ఢిల్లీ : ఎదుటివారిని అవహేళన చేస్తూ మధ్య వేలును చూపించటమనేది పాశ్చాత్య దేశాల్లో కనిపించేదే. బండ బూతే అయినప్పటికీ ఆ సైగను అక్కడి ప్రజలు అంతగా పట్టించుకోరు కూడా. కానీ, మన దేశంలో అలా చేయడం నేరమని తీర్పునిచ్చింది ఢిల్లీ కోర్టు. ఓ మహిళకు మధ్యవేలు చూపించి జైలు శిక్షకు గురయ్యాడు ఓ ఢిల్లీ వ్యక్తి. 2014లో నమోదైన ఈ కేసుపై పలు వాదనల తర్వాత ఢిల్లీ కోర్టు ఇటీవల తీర్పు వెలువడించింది. బాధిత మహిళ తనకు బావ వరసయ్యే వ్యక్తి మధ్య వేలు చూపించడమే కాకుండా అసభ్యకరంగా ముఖ కవలికలు చూపించి చెంపమీద కొట్టాడని 2014లో కేసు పెట్టారు. పోలీసులు నిందితునిపై సెక్షన్ 509, 323ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దీనిపై కోర్టు 2015 అక్టోబరు 8నాటికే తీర్పు వెలువరించింది. అయినప్పటికీ నిందితుడు తనపై మోపిన అభియోగం సరైంది కాదంటూ కోర్టులో పిటిషన్ వేశాడు. ఆమెతో ఆస్తి విభేదాలు ఉండడంతో ఇలాంటి నిందలు వేస్తుందని అతను ఆరోపించాడు. ఢిల్లీ కోర్టు నిందితుడి చర్యలను హెచ్చరిస్తూ.. మహిళ మర్యాదకు భంగం కలిగించాడని తీర్పునిచ్చింది. నిందితుడికి జరిమానాతో పాటు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. -
కోర్టు ధిక్కార కేసులో శిక్షల అమలు నిలిపివేత
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించి హైకోర్టు జారీచేసిన ఆదేశాలు అమలు చేయలేదన్న కేసుల్లో (రెండు వేర్వేరు) సింగిల్ జడ్జి నలుగురికి విధించిన జైలుశిక్ష అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీచేసింది. పునరావాసం, పునర్నిర్మాణం అమలు చేయాలని గతంలో సింగిల్ జడ్జి ఆదేశాల్ని అమలు చేయలేదని రైతుల కోర్టు ధిక్కార వ్యాజ్యాలను సింగిల్ జడ్జి ఆమోదిస్తూ నలుగురికి జైలు శిక్ష విధించారు. ఈ తీర్పులను సవాల్ చేస్తూ రెండు వేర్వేరు వ్యాజ్యాలను బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ల ధర్మాసనం విచారించింది. సింగిల్ జడ్జి తీర్పు అమలును నిలిపివేసిన ధర్మాసనం ప్రతివాదు లకు నోటీసులు జారీ చేసింది. ఒక కేసులో తొగుట ఎస్సై ఎస్.శ్రీనివాస్రెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టు రెండో డివిజన్ సూపరింటెండెంట్ ఇంజినీర్ టి.వేణులకు 2నెలలు జైలు, 2వేలు జరిమానా, మరో కేసులో కాళేశ్వరం ప్రాజెక్టు కనస్ట్రక్షన్ డివిజన్–7 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జి.బదరీనారాయణ, రాఘవ కనస్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్టు మేనేజర్ బి.శ్రీనివాస్రెడ్డిలకు 3 నెలలు జైలు శిక్ష, 3వేలు చొప్పున జరిమానా విధిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ఆ నలుగురు సవాల్ చేశారు. ధర్మాసనం విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. -
పాక్కు ఎదురుదెబ్బ
నావికా దళంలో పనిచేసి రిటైరై వ్యాపారం చేసుకుంటున్న కుల్భూషణ్ జాధవ్పై భారత గూఢ చారిగా కేసు బనాయించి మూడేళ్లుగా నిర్బంధించడమే కాదు... ఆయన నేరాలు రుజువయ్యా యంటూ ‘నిర్ధారించి’ మరణశిక్ష కూడా విధించిన పాకిస్తాన్ చర్యను అందరూ ఊహించినట్టే ది హేగ్లోని అంతర్జాతీయ న్యాయస్థానం తప్పుబట్టింది. ఆయన్ను కలవడానికి భారత దౌత్య అధికా రులను అనుమతించాల్సిందేనని తేల్చిచెప్పడంతోపాటు కుల్భూషణ్ మరణశిక్షను పునస్సమీక్షించ మని సూచించింది. 16మంది న్యాయమూర్తుల్లో చైనాకు చెందిన న్యాయమూర్తితోసహా 15మంది పాకిస్తాన్ చర్యను తప్పుబట్టడం అసాధారణం. నైతికంగా పాక్కు ఇది కోలుకోలేని దెబ్బ. ఈ తీర్పును గుర్తించి, గౌరవిస్తే అది పాకిస్తాన్కే మంచిది. కుల్భూషణ్కు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు లేవని 2016లో అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ తనంత తానే బయటపెట్టారు. కానీ ఆ తర్వాత ఆ ప్రకటనను వెనక్కి తీసుకున్నారు. పైగా కుల్ భూషణ్ ఉదంతాన్ని వెల్లడించడానికి పాకిస్తాన్ ఎంచుకున్న సమయం కూడా అనేక అనుమానాలకు తావిస్తుంది. పంజాబ్లోని పఠాన్కోట్లో ఉన్న వైమానిక దళ స్థావరంపై జరిగిన ఉగ్రదాడిపై ఇరు దేశాల ఉమ్మడి దర్యాప్తు ప్రారంభం కాబోతున్న సమయంలో కావాలని ఈ గూఢచర్యం ఉదంతాన్ని పాకిస్తాన్ తెర మీదికి తీసుకొచ్చింది. పరస్పరం శత్రుత్వం ఉన్న రెండు దేశాల్లోని పౌరులు అవతలి దేశం వెళ్లడానికి ప్రయత్నిం చినప్పుడు సహజంగానే వారిపై నిఘా ఉంటుంది. వారేం చేస్తున్నారో, వారి కార్యకలాపాల స్వభావం ఎటువంటిదోనన్న ఆరా ఉంటుంది. ఆ దేశంలో ప్రవేశించడానికి తగిన అనుమతులున్నా ఇవి తప్పవు. ఇలాంటివి ఏమీ లేకుండా పట్టుబడితే ఇక చెప్పనవసరం లేదు. ఆచూకీ కూడా దొరక్కుండా ఖైదు చేయడం లేదా ప్రాణం తీయడం చాలా సులభం. పాకిస్తాన్ జైళ్లలో గూఢచారుల ముద్ర పడి పలువురు భారతీయులు మగ్గుతున్నారని, అలాగే 1971 యుద్ధకాలంలో పట్టుబడిన పలువురు జవాన్లు అక్కడి జైళ్లలో ఉన్నారని మన దేశం ఆరోపించడం, దాన్ని పాకిస్తాన్ తోసి పుచ్చడం రివాజుగా సాగుతోంది. పైగా కుల్భూషణ్ ఉదంతంలో అనేక అనుమానాలున్నాయి. ఆయన్ను బలూచిస్తాన్లో గూఢచర్యానికి పాల్పడుతుండగా అరెస్టు చేశామని పాకిస్తాన్ చెబు తోంది. కానీ వ్యాపార పనుల నిమిత్తం ఇరాన్లో ఉండగా అక్కడి పాక్ ఏజెంట్లు కుల్భూషణ్ను అపహరించుకుపోయారన్నది మన దేశం ఆరోపణ. ఆయన కుటుంబసభ్యులు చెబుతున్న అంశా లను బట్టి చూసినా ఆయనను ముందే అపహరించిన సంగతి వెల్లడవుతుంది. అంతకు మూణ్ణెల్ల ముందే కుల్భూషణ్తో తమకు సంబంధాలు తెగిపోయాయని, ఆయన ఉన్నట్టుండి ఫోన్కు అందు బాటులో లేకుండా పోయారని కుటుంబసభ్యులు చెప్పారు. కుల్భూషణ్ ఉదంతంలో పాకిస్తాన్ చెబుతున్నది విశ్వసించడానికి మొదటినుంచీ దాని చేతలే అడ్డొస్తున్నాయి. ఈ విషయంలో ఆ దేశం ప్రవర్తన పూర్తి అనుమానాస్పదంగా ఉంది. ఎవరి కార్యకలాపాలపైన అయినా సందేహాలున్నప్పుడు అదుపులోనికి తీసుకోవడం, ప్రశ్నించడం సర్వ సాధారణం. కానీ వేరే జాతీయుణ్ణి అరెస్టు చేసినప్పుడు పాటించాల్సిన కనీస నిబంధనలు వియన్నా ఒడంబడికలో స్పష్టంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆ ఒడంబడికలోని 36(1)(సి) అధికరణ ప్రకారం వేరే దేశం నిర్బంధంలో ఉన్నవారిని కలిసి మాట్లాడటం, వారితో ఉత్తరప్రత్యుత్తరాలు జరపడం దౌత్య అధికారుల హక్కని స్పష్టంగా చెబుతోంది. వాటిని సక్రమంగా పాటించి ఉంటే పాకిస్తాన్ వాదనకు ఎంతో కొంత బలం ఉండేది. బలూచిస్తాన్లో భారత్ గూఢచర్యానికి పాల్పడుతున్నదని, అక్కడ విధ్వంసకర కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నదని ఎప్పటినుంచో ఆరోపిస్తున్న పాకిస్తాన్కు ఈ కేసు ఎంతో అక్కరకొచ్చేది. కానీ కుల్భూషణ్ ఉదంతంలో ఎన్ని కంతలున్నాయో దానికే బాగా తెలుసు. అందుకే అపహరించుకుపోయిన మూడునెలలకుగానీ ఆ సంగతిని బయటపెట్టలేదు. ఆ తర్వాతనైనా ఆయన్ను కలవడానికి భారత దౌత్య అధికారులను అనుమతించలేదు. పైగా తనపై వచ్చిన ఆరోపణలన్నిటినీ ఆయనే అంగీకరించాడంటూ ఒక వీడియో విడుదల చేసింది. నిర్బం ధంలో ఉంచి, ఎవరినీ కలవనీయకుండా కట్టడి చేసి, బెదిరించి భయపెట్టి తీసుకున్న ఈ ఒప్పుదల ప్రకటనకు గడ్డిపోచ విలువైనా ఉంటుందా? ఈ వీడియోలో ‘అనేకమంది మరణానికి దారితీసిన ఉగ్రవాద కార్యకలాపాలతో భారత్కు సంబంధం ఉన్నద’ని కుల్భూషణ్తో చెప్పించారు. కానీ నిర్దిష్టంగా ఒక్కటంటే ఒక్క ఉదంతం ప్రస్తావనైనా అందులో లేదు. పైగా సైనిక కోర్టు ఆయనపై రహస్య విచారణ నిర్వహించి మరణశిక్ష విధించిన తీరు కూడా హాస్యాస్పదం. న్యాయవాదిని నియమించుకోవడానికి, తనకు జరిగిందేమిటో వివరించి న్యాయం కోరడానికి ఆయనకు అవకాశ మీయకుండా నిర్వహించిన విచారణకు విశ్వసనీయత ఏముంటుంది? అసలు గూఢచారిగా పొరుగు దేశంలో కార్యకలాపాలు నడపడానికి వెళ్లే వ్యక్తి తన దేశానికి సంబంధించిన పాస్పోర్టును దగ్గర ఉంచుకుంటాడా? సాధారణంగా ఎవరినైనా వేరే దేశంలో గూఢచర్యం చేయడానికి పంపినప్పుడు గూఢచార సంస్థలు ఆ దేశం తాలూకు పాస్పోర్టును సమకూరుస్తాయి. లేదా మరో దేశం పాస్ పోర్టును సంపాదించి ఇస్తాయి. తాజా తీర్పు వల్ల కుల్భూషణ్కు విముక్తి లభిస్తుందని భావించడం కష్టమే. ఈ తీర్పు ఆసరాతో అంతర్జాతీయంగా పాకిస్తాన్పై మన దేశం మరింత ఒత్తిడి పెంచాలి. ఇలాంటి కేసులో సత్ఫలితాలు రావాలంటే రాజకీయ పరిష్కారమే మార్గం. ఇరు దేశాలమధ్యా జరిగే చర్చలే అందుకు దోహదప డతాయి. భారత్లో ఉగ్రవాద చర్యలను ప్రోత్సహిస్తూ ఇలా తప్పుడు ఆరోపణలతో ఎదురుదాడి చేయడం వల్ల వీసమెత్తు ప్రయోజనం ఉండదని పాకిస్తాన్ ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. కుల్భూషణ్ ఉదంతం వల్ల అంతిమంగా తన ప్రతిష్టే దెబ్బతిన్నదని అది తెలుసుకోవాలి. -
మరాఠాలకు రిజర్వేషన్లు సబబే
ముంబై: మరాఠా వర్గానికి ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని బాంబే హైకోర్టు సమర్థించింది. అయితే, రిజర్వేషన్లను 16 శాతం బదులు రాష్ట్ర వెనుకబడిన కులాల కమిషన్ సూచించిన విధంగా 12 నుంచి 13 శాతం మధ్యలో ఉండేలా చూడాలని సూచించింది. మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై జస్టిస్ రంజిత్ మోరే, జస్టిస్ భారతి డాంగ్రేలతో కూడిన ధర్మాసనం గురువారం తుది తీర్పు వెలువరించింది. కాగా, ఈ పిటిషన్లపై విచారణను న్యాయస్థానం ఏప్రిల్లోనే ముగించింది. ‘సాంఘికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను ప్రత్యేక తరగతిగా గుర్తించడం, వారికి రిజర్వేషన్లు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది. రాష్ట్రపతి ప్రకటించిన జాబితాలోని వారికే రిజర్వేషన్లు కల్పించాలన్న భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 342(ఎ)కు ఇది వర్తించదు. ఎందుకంటే, రాష్ట్ర బీసీ కమిషన్ వెల్లడించిన గణాంకాల ప్రకారం మరాఠాలు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్నారని రుజువైంది. అయితే, ప్రభుత్వం ఈ కోటాను 16 శాతం బదులు, బీసీ కమిషన్ సూచించిన ప్రకారం 12 నుంచి 13 శాతానికి తగ్గించాలి’ అని ధర్మాసనం పేర్కొంది. ‘రిజర్వేషన్ కోటా మొత్తం 50 శాతానికి మించరాదని గతంలో సుప్రీంకోర్టు పేర్కొంది. కానీ, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, గణాంకాలను అనుసరించి ఆ పరిమితిని దాటే వీలుంది’ అని ధర్మాసనం వివరించింది. అయితే, 16 శాతం రిజర్వేషన్ కోటా ప్రకారం ఇప్పటికే పీజీ వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు అనుమతులు ఇచ్చినట్లు తీర్పు వెలువడిన అనంతరం ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ ఏడాదికి 16 శాతం రిజర్వేషన్లనే కొనసాగించాలని కోరింది. దీనిపై ప్రత్యేకంగా మరో పిటిషన్ వేయాలని కోర్టు ప్రభుత్వానికి సూచించింది. మరాఠాలకు రిజర్వేషన్ల నేపథ్యం 2017 జూన్: రాష్ట్రంలో మరాఠా వర్గం సాంఘిక, ఆర్థిక, విద్యాపరమైన పరిస్థితుల అధ్యయనం కోసం మహారాష్ట్ర సర్కారు రాష్ట్ర వెనుకబడిన కులాల కమిషన్ను నియమించింది. 2018 జూలై: రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో మరాఠాలు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసన హింసాత్మక రూపం దాల్చింది. నవంబర్ 2018: బీసీ కమిషన్ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. నవంబర్ 2018: మరాఠాలను వెనుకబడిన వర్గంగా గుర్తిస్తూ రాష్ట్ర అసెంబ్లీ వారికి 16 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు ఆమోదించింది. బిల్లుకు ఆమోదం తెలుపుతూ గవర్నర్ సంతకం చేశారు. డిసెంబర్ 2018: మరాఠాలకు రిజర్వేషన్ల మొత్తం కోటా 50 శాతానికి మించరాదన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధమంటూ బాంబే హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. మార్చి 2019: జస్టిస్ రంజిత్ మోరే, జస్టిస్ భారతి డాంగ్రేల ధర్మాసనం ఫిబ్రవరిలో ప్రారంభించిన విచారణను మార్చితో ముగించి, తుదితీర్పును రిజర్వులో ఉంచింది. జూన్ 2019: మరాఠాలకు రిజర్వేషన్లను సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. బీసీ కమిషన్ సిఫారసుల మేరకు రిజర్వేషన్లను 12 నుంచి 13 శాతం మధ్యలో ఉండేలా తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరింది. -
సంచలన కేసులో రానున్న తీర్పు : భారీ భద్రత
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా హత్యాచారం కేసులో తుది తీర్పు నేడు (సోమవారం, జూన్ 10) వెలువడనుంది. పంజాబ్లోని పఠాన్కోట్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ కోర్టులో విచారణ ముగిసిన నేపథ్యంలో న్యాయమూర్తులు తీర్పును వెలువరించనున్నారు. దీంతో పఠాన్కోట్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. భారీగా పోలీసులను మోహరించారు. ఎలాంటి అంవాఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తగా గట్టి చర్యలు చేపట్టారు. కాగా జమ్ముకశ్మీర్లోని కథువాలో ఎనిమిదేళ్ల బాలికను అత్యంత దారుణంగా ఆలయంలోనే హత్యాచారం చేశారు. బాలికకు మత్తు పదార్థాలు ఇచ్చి, సామూహిక అత్యాచారం, హత్య చేసిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. అత్యంత పాశవికమైన ఈ ఘటన పట్ల నిరసనలు హోరెత్తాయి. అయితే ఈ కేసు విచారణకు జమ్మూకశ్మీర్లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో సుప్రీంకోర్టు పఠాన్కోట్ కోర్టుకు బదిలీ చేసింది. ఈ కేసులో ఎనిమిదిమంది నిందితులు ఉండగా..వారిలో ఏడుగురిపై ఛార్జ్షీట్ దాఖలైంది. నిందితులకు ఉరి శిక్ష విధించాలన్న డిమాండ్ కూడా ఊపందుకున్న సంగతి తెలిసిందే. Punjab: Security heightened outside Pathankot court ahead of verdict in Kathua rape-murder case pic.twitter.com/XaCdsSMnKd — ANI (@ANI) June 10, 2019 -
గ్యాంగ్ రేప్ కేసులో సంచలన తీర్పు
చత్తీస్గఢ్ : సామూహిక హత్యాచారం కేసులో పంజాబ్, హర్యానా హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో నేరస్థులుగా నిర్ధారించిన ఏడుగురికి మరణశిక్షను ఖరారు చేయడంతోపాటు వారికి భారీ జరిమానాను కూడా విధించింది. రూ.50లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఇందుకు నేరస్థుల ఆస్తులను విక్రయించాలంటూ ఆదేశించడం విశేషం. ఈ మేరకు రోహతక్ డిప్యూటీ కమిషనర్కు కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. జులై 4వ తేదీనాటికి నేరస్తుల ఆస్తులను గుర్తించి, విక్రయించాలని, అలాగే దీనికి సంబంధించిన సమాచారాన్ని కోర్టుకు అందించాలని కూడా స్పష్టం చేశారు. ఇందులో బాధితురాలి సోదరికి 25 లక్షల రూపాయలు, హర్యానా ప్రభుత్వానికి రూ.25 లక్షలు అందుతుందని తీర్పు నిచ్చింది. కాగా నేపాల్కు చెందిన మహిళపై అతిక్రూరంగా సామూహిక హత్యాచారానికి పాల్పడ్డారు. 2015, ఫిబ్రవరిలో రోహతక్లో ఈ ఉదంతం చోటు చేసుకుంది. మతి స్థిమితం లేని ఆమె , రోహతక్లోని సోదరి ఇంటికి వచ్చి కనిపించకుండా పోయింది. మూడు రోజుల అనంతరం దారుణ హింసకు గురైన స్థితిలో తీవ్ర గాయాలతో ఆమె మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. నిర్భయ తరహాలో గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారని తేల్చారు. ముఖ్యంగా ఆమె శరీర భాగాల్లో రాళ్లు, కర్రలను కనుగొన్నారు. ఈ ఉదంతంలో ఎనిమిది మందిపై కేసు నమోదు కాగా అదే ఏడాది డిసెంబరులో రోహతక్ సెషన్స్ జడ్జి అందరికీ మరణ శిక్ష విధించారు. వీరిలో ఒకరు మైనర్కూడా ఉన్నారు. తాజాగా ఈ తీర్పును సమర్ధించిన న్యాయమూర్తులు ఏబీ చౌదరి, సురేందర్ గుప్త ఆధ్వర్యంలోని పంజాబ్, హర్యానా హైకోర్టు బెంచ్ మైనర్ను మరణశిక్షనుంచి మినహాయించింది. -
డ్రంక్ అండ్ డ్రైవ్ : న్యూ ఇయర్ రోజు పట్టుబడినవారికి శిక్ష ఖరారు
సాక్షి, హైదరాబాద్ : న్యూ ఇయర్ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుపడినవారికి లోకల్ కోర్టు జైలు శిక్ష విధించింది. గత ఏడాది డిసెంబర్ 31న రాత్రి మద్యం తాగి వాహనాలు నడుపుతున్న పట్టుబడిన వారిని ఈనెల 3 నుంచి 25 వరకు జైలులో ఉంచాలని కోర్టు తీర్పును వెలువరించింది. జైలు శిక్షతో పాటు.. భారీ మొత్తంలో జరిమానాను విధించింది. సైబరాబాద్ లిమిట్స్లో పట్టుబడిన వారిలో 405 మందికి జైలు శిక్షతో పాటు రూ.2వేలు జరిమానాను విధిస్తూ తీర్పును వెలువరించింది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పట్టుబడిన వారికి రూ. 500, మద్యం సేవించిన వారికి వెహికిల్ ఇచ్చినందుకు రూ.5000, మైనర్ డ్రైవర్స్కి రూ.1000 చొప్పున జరినామా విధించింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 147, గచ్చిబౌలి-72, మియాపూర్-56, కూకట్పల్లి-79, బాలానగర్-51 మందికి జైలు శిక్ష విధిస్తూ ధర్మాసనం తీర్పును వెలువరించింది. శిక్షపడిన వారిలో ఇద్దరు మహిళలు ఉండటం గమనార్హం. -
ట్రాన్స్ట్రాయ్ ఇండియాకు హైకోర్టు షాక్
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ ఇండియాకు హైకోర్టు గట్టి షాక్నిచ్చింది. ఇచ్చిన రుణాలను రాబట్టుకునేందుకు ట్రాన్స్ట్రాయ్కి చెందిన ఆస్తులను ఆంధ్రా బ్యాంకు వేలం వేయడాన్ని సవాలు చేస్తూ ఆ కంపెనీ ఎండీ చెరుకూరి శ్రీధర్ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఆంధ్రాబ్యాంకు వేలం చర్యలను సమర్థించింది. తీసుకున్న రూ.584 కోట్ల రుణానికి ట్రాన్స్ట్రాయ్ హామీగా ఉంచిన ఆస్తులను సర్ఫేసీ చట్టంకింద వేలం వేసుకోవచ్చునని ఆంధ్రా బ్యాంకుకు స్పష్టం చేసింది. రుణాలను రాబట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతోనే ఆంధ్రాబ్యాంకు చివరకు సర్ఫేసీ చట్టం కింద చర్యలు ప్రారంభించిందని, అందువల్ల వాటిని తప్పుపట్టలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ట్రాన్స్ట్రాయ్ కంపెనీ కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ (సీఐఆర్పీ)కి జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్ ఆదేశాలు జారీ చేయడానికి ముందే ఆంధ్రా బ్యాంకు వేలం చర్యలను ప్రారంభించిందని తెలిపింది. అందువల్ల ఎన్సీఎల్టీ ఆదేశాల నేపథ్యంలో ట్రాన్స్ట్రాయ్ ఆస్తుల క్రయ విక్రయాలపై మారటోరియం ఉన్నప్పటికీ వేలం వేసుకునే హక్కు ఆంధ్రాబ్యాంకుకు ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ పి.కేశవరావులతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఎన్సీఎల్టీ జారీ చేసిన సీఐఆర్పీ ఆదేశాలు అమల్లో ఉండగా, తాము హామీగా ఉంచిన ఆస్తుల వేలానికి చర్యలు తీసుకోవడం చట్ట విరుద్ధమంటూ చెరుకూరి శ్రీధర్ మూడు వేర్వేరు వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి తీర్పు వెలువరించింది. ప్రత్యామ్నాయాలు చేసుకోవాల్సిందే... సీఐఆర్పీ అమల్లో ఉండగా ఆంధ్రా బ్యాంకు వేలం నిర్ణయం వల్ల మిగిలిన బ్యాంకులు నష్టపోతాయన్న ట్రాన్స్ట్రాయ్ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. 2017 డిసెంబర్ 31 నాటికి బకాయిలు చెల్లించలేకపోతే ట్రాన్స్ట్రాయ్ విషయంలో కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియకు వెళ్లాలంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇచ్చిన ఉత్తర్వులకు చట్టబద్ధత లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఒక చట్టం కింద ఇచ్చే ఉత్తర్వులు మరో చట్ట నిబంధనలను అతిక్రమించేలా ఉండరాదని తెలిపింది. రుణాలను రాబట్టుకునే దిశగా రుణదాతల ఉమ్మడి వేదిక (జేఎల్ఎఫ్) 2017 డిసెంబర్లో జరిపిన ప్రయత్నాలు, చర్చలు విఫలమయ్యాయంది. ఈ నేపథ్యంలో బ్యాంకులు రుణ బకాయిల వసూలుకోసం ఇతర ప్రత్యామ్నాయాలను అనుసరించడంలో ఎటువంటి తప్పు లేదంది. ఆంధ్రా బ్యాంకు సైతం సర్ఫేసీ చట్టం కింద అటువంటి ప్రత్యామ్నాయాలనే ఎంచుకుందని తెలిపింది. ఎన్సీఎల్టీ ఇచ్చిన సీఐఆర్పీ ఆదేశాలకు ముందే ఆంధ్రా బ్యాంకు వేలం ప్రక్రియను ప్రారంభించినందున ఆ బ్యాంకు చర్యల్లో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. 14 బ్యాంకులు.. రూ.2,687 కోట్ల నిరర్థక ఆస్తులు ఇదే సమయంలో ఆ కంపెనీ వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు, ఆర్బీఐ వాటిని నిరర్థక ఆస్తులుగా ప్రకటించడం గురించి కూడా ధర్మాసనం తన తీర్పులో ప్రస్తావించింది. సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల కోసం ట్రాన్స్ట్రాయ్ 14 బ్యాంకుల నుంచి భారీస్థాయిలో రుణాలు తీసుకుందని, 2014–16 సంవత్సరాల మధ్యలో రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో రిజర్వ్ బ్యాంక్ వాటిని నిరర్థక ఆస్తులుగా ప్రకటించిందని తెలిపింది. 14 బ్యాంకుల్లో ట్రాన్స్ట్రాయ్కు రూ.2687.13 కోట్ల నిరర్థక ఆస్తులున్నట్లు ఆర్బీఐ ప్రకటించినట్లు పేర్కొంది. కెనరా బ్యాంకు రూ.273.12 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.227.50 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.419.68 కోట్లు, యూకో బ్యాంకు రూ.60.64 కోట్లు, ఆంధ్రా బ్యాంకు రూ.293.61 కోట్లు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.232.63 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.172.79 కోట్లు, దేనా బ్యాంకు రూ.123.50 కోట్లు, అలహాబాద్ బ్యాంక్ రూ.246.23 కోట్లు, విజయ బ్యాంకు రూ.15 కోట్లు, కార్పొరేషన్ బ్యాంకు రూ.298.14 కోట్లు, సౌత్ ఇండియన్ బ్యాంకు రూ.80 కోట్లు, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.124.94 కోట్లు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రూ.119.95 కోట్లు. బ్యాంకుల నుంచి తీసుకున్న ఈ రుణాలకు ట్రాన్స్ట్రాయ్ ఇండియా పలు ఆస్తులను తాకట్టుపెట్టింది. -
‘రాఫేల్పై రాహుల్ ప్రచారం బూటకం’
సాక్షి, న్యూఢిల్లీ : రాఫేల్ ఒప్పందంపై ఇటీవలి సుప్రీం కోర్టు తీర్పుతో కాంగ్రెస్ రాద్ధాంతం తేటతెల్లమైందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ధ్వజమెత్తారు. భోఫోర్స్, రాఫేల్ ఒప్పందాలను ఒకటిగా చూపేందుకు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ విఫలయత్నం చేశారని ఆరోపించారు. భోఫోర్స్ మాదిరిగా రాఫేల్లో దళారీలు లేవు, ముడుపులు లేవంటూ ముఖ్యంగా ఖత్రోచి లేరని ఎద్దేవా చేశారు. రాఫేల్పై ఏకరువు పెట్టిన అసత్యాలన్నీ సుప్రీం కోర్టు తీర్పుతో పటాపంచలయ్యాయని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని తేలాయని జైట్లీ ట్వీట్ చేశారు. ఒప్పందంపై స్వార్ధ ప్రయోజనాల కోసం చెప్పిన అవాస్తవాలు కల్పితాలేనని వెల్లడైందన్నారు. రాఫేల్పై రాహుల్ నిస్పృహతో చేసిన ఆరోపణలు విఫలయత్నంగా మారాయని ఆరోపించారు. రాఫేల్ను యూపీఏ ప్రభుత్వంలోనే షార్ట్లిస్ట్ చేశారని చెప్పుకొచ్చారు. -
ఢిల్లీ అల్లర్ల కేసులో ఒకరికి మరణశిక్ష
న్యూఢిల్లీ: 1984లో సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో మొదటిసారిగా న్యాయస్థానం ఒకరికి మరణశిక్ష విధించింది. 34 ఏళ్ల క్రితం ఇద్దరు సిక్కు యువకుల మృతికి కారణమైన యశ్పాల్ సింగ్(55)కు మరణ శిక్షను, నరేశ్ షెరావత్(68)కు యావజ్జీవ కారాగారాన్ని విధిస్తూ అదనపుసెషన్స్ జడ్జి అజయ్ పాండే మంగళవారం తీర్పు వెలువరించారు. దోషులు ఉన్న తీహార్ జైలులోనే కట్టుదిట్టమైన భద్రత మధ్య జడ్జి మంగళవారం ఈ మేరకు తీర్పునిచ్చారు. ఇద్దరు యువకుల హత్య అత్యంత అరుదైందిగా పేర్కొన్న జడ్జి.. యశ్పాల్ సింగ్కు మరణశిక్ష విధించారు. నరేశ్ ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని జీవితకాల జైలు శిక్షతో సరిపెట్టారు. దీంతోపాటు దోషులిద్దరికీ చెరో రూ.35 లక్షల జరిమానా విధించారు. ఈ మొత్తాన్ని మృతుల కుటుంబాలకు అందజేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. మరణశిక్షకు సంబంధించిన తమ తీర్పు అసలు రికార్డులను ఢిల్లీ హైకోర్టుకు అందజేయాలని ఉత్తర్వులిచ్చారు. హైకోర్టు ధ్రువీకరించిన తర్వాత మాత్రమే మరణశిక్ష అమలు చేయాలనే నిబంధన ఉంది. సిట్ తన చార్జిషీటులో.. ‘ఒక మతానికి చెందిన వారే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ముందస్తు ప్రణాళిక ప్రకారం సంఘ విద్రోహ మూకలు కిరోసిన్, కర్రలు తీసుకుని కొందరి ఇళ్లపై దాడులు చేశారు. అంతర్జాతీయంగా ప్రభావం చూపిన మారణకాండ ఇది. మరణశిక్ష విధించదగ్గ నేరమిది’ అంటూ పేర్కొంది. 1984లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తన సిక్కు అంగరక్షకుల చేతిలో హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం రాజధాని ఢిల్లీతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే సిక్కులే లక్ష్యంగా దాడులు జరిగాయి. ఈ దాడుల్లో దాదాపు 3 వేల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలకు సంబంధించి 650 కేసులు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు ఆధారాలు లేవంటూ 267 కేసులను మూసివేశారు. మూసివేసిన కేసుల్లో 60 కేసుల విచారణ చేపట్టిన సిట్.. 52 కేసుల్లో ఆధారాలు లేవని పేర్కొంది. సరైన ఆధారాలున్న మిగతా 8 కేసులో ఐదింటికి సంబంధించి చార్జిషీటు దాఖలు చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత సజ్జన్కుమార్ నిందితుడిగా ఉన్న మిగతా కేసుల విచారణ మాత్రం పెండింగ్లో ఉంది. చార్జిషీటు దాఖలు చేసిన కేసుల్లో మరణ శిక్ష తీర్పు వెలువడిన మొట్టమొదటి కేసు ఇదే కావడం గమనార్హం. తీర్పును స్వాగతించిన సిక్కు నేతలు సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కోర్టు మరణశిక్ష విధించడంపై పలువురు సిక్కు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఏమన్నారంటే: హేయమైన నేరానికి ఒడిగట్టిన దోషులను ఎట్టకేలకు న్యాయస్థానం శిక్షించింది. ఇలాంటి మిగతా కేసుల్లో కూడా న్యాయస్థానాలు త్వరలో తీర్పు వెలువరిస్తాయని ఆశిస్తున్నా. అకాలీదళ్నేత మజీందర్ సింగ్ సిర్సా: 34 సంవత్సరాల తర్వాత వెలువడిన ఈ తీర్పు సంతృప్తికరంగా ఉంది. షెరావత్కు యావజ్జీవం విధించడాన్ని సవాల్ చేస్తూ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అతడికి కూడా ఉరి పడాల్సిందే. కాంగ్రెస్: న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేసింది. ఎటువంటి ఒత్తిడులకు గురికాకుండా, తీర్పు వెలువరించడం గర్వించదగ్గ అంశం. ఈ కేసులో ఘటనల క్రమమిదీ.. 1984 నవంబర్ 1: సిక్కు వ్యతిరేక అల్లర్ల సమయంలో సుమారు 300 మందితో కూడిన గుంపు దక్షిణ ఢిల్లీలోని మహిపాల్పూర్లో హర్దేవ్ సింగ్, అవ్తార్ సింగ్ అనే వారిని కొట్టి చంపింది. 1985 ఫిబ్రవరి 23: ఈ ఘటనకు సంబంధించి జైపాల్ సింగ్ అనే వ్యక్తిపై చార్జిషీట్ దాఖలైంది. 1985 మే: ఈ దాడులపై దర్యాప్తు చేసేందుకు జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ ఏర్పాటయింది. 1985 సెప్టెంబర్ 9: దీనిపై ఢిల్లీ పోలీసుల అల్లర్ల వ్యతిరేక విభాగం దర్యాప్తు చేపట్టింది. 1986 డిసెంబర్ 20: జైపాల్ సింగ్ను నిర్దోషిగా పేర్కొంది. ∙1994 ఫిబ్రవరి 9: హర్దేవ్ సింగ్ మృతిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎటువంటి ఆధారాలను సేకరించలేకపోయారు. అనుమానితులెవరినీ ప్రశ్నించకుండానే కేసు మూసివేశారు. ∙2015 ఫిబ్రవరి: అల్లర్లపై దర్యాప్తునకు ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. ∙2016 ఆగస్టు: సిక్కు వ్యతిరేక అల్లర్లపై ఆధారాలుంటే తెలియజేయాలని ప్రజలను కోరుతూ పంజాబ్, ఢిల్లీల్లోని ప్రముఖ వార్తా పత్రికల్లో సిట్ ప్రకటనలు ఇచ్చింది. 2017 జనవరి 31: హర్దేవ్ సింగ్, అవ్తార్సింగ్ హత్యా సంఘటనకు సంబంధించి 18 మంది సాక్షులను విచారించిన సిట్.. నరేశ్ షెరావత్, యశ్పాల్ సింగ్ అనే వారిని దోషులుగా పేర్కొంటూ న్యాయస్థానంలో చార్జిషీటు వేసింది. 2018 నవంబర్ 14: ఆ ఇద్దరూ దోషులేనని న్యాయస్థానం తీర్పునిచ్చింది. 2018 నవంబర్ 15: ఈ కేసులో తీర్పును నిలుపుదల చేసింది. పాటియాలా కోర్టు ఆవరణలోనే దోషులపై కొందరు వ్యక్తులు దాడికి యత్నించారు. నవంబర్ 20: యశ్పాల్కు మరణశిక్ష, షెరావత్కు జీవితకాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. -
1984 నాటి అల్లర్ల కేసులో కీలక తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య తర్వాత చెలరేగిన అల్లర్ల కేసులో ఢిల్లీ కోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. 1984 నాటి ఈ కేసులోని నిందితుల్లో ఒకరికి మరణ శిక్ష, మరొకరికి యావజ్జీవ శిక్షను విధించింది. ఈ కేసులో దోషులుగా తేలిన యశ్పాల్ అనే వ్యక్తికి ఉరిశిక్ష, నరేష్ అనే వ్యక్తికి జీవిత ఖైదు ఖరారు చేస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. కాగా 34 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఈ తీర్పు వెలువడింది. 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసు... మాజీ ప్రధాని ఇందిరా గాంధీని 1984లో ఆమె అంగరక్షకులైన సత్వంత్ సింగ్, బియాత్సింగ్లు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ఇందిరా గాంధీని హత్య చేసింది సిక్కు మతస్తులు కావడంతో సిక్కులకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో ఆందోళనలు చెలరేగాయి. ఈ క్రమంలో ఢిల్లీలో జరిగిన అల్లర్లలో ఇద్దరు సిక్కు యువకులు అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. కాగా ఈ కేసులో సరైన ఆధారాలు లభించలేదనే కారణంతో 1994లో ఢిల్లీ పోలీసులు ఈ కేసును మూసివేశారు. అయితే తమకు న్యాయం జరగాలంటూ సిక్కు నేతలు డిమాండ్ చేయడంతో ఈ కేసు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)చే విచారణ జరిపించారు. ఈ క్రమంలో ఇద్దరు సిక్కు యువకులు అత్యంత పాశవికంగా హత్య గావించబడ్డారని, ఇవి ప్రణాళిక ప్రకారం జరిగిన హత్యలేనని సిట్ నివేదిక సమర్పించింది. దీంతో ఈ కేసులో దోషులుగా తేలిన యశ్పాల్, నరేశ్లకు శిక్షలు ఖరారు చేస్తూ ఢిల్లీ పాటియాల కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. -
క్రిస్టియన్ మహిళ కేసులో పాక్ కోర్టు సంచలన తీర్పు
ఇస్లామాబాద్ : దైవ దూషణ చేసిన క్రిస్టియన్ మహిళపై పాకిస్తాన్ సుప్రీం కోర్టు కనికరం చూపింది. కింది కోర్టు విధించిన మరణశిక్షను రద్దు చేస్తూ చీఫ్ జస్టిస్ సాఖిబ్ నిసార్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. వివరాలు.. క్రిస్టియన్ మతానికి చెందిన అసియా బీబీ ఇస్లాం మతాన్ని దూషిస్తూ తరచూ ఇరుగుపొరుగు వారితో గొడవకు దిగేది. తమ మతంపై అసియా అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇస్లాంను దూషించిన అసియాకు బతికే అర్హత లేదనీ.. ఆమెకు కఠిన శిక్ష విధించాలని 2009లో కోర్టును ఆశ్రయించారు. అసియాకు ఉరిశిక్ష పవిత్ర ఇస్లాం మతాన్ని దూషించి ప్రజల మనోభావాల్ని దెబ్బతీశావంటూ లాహోర్ హైకోర్టు 2010లో అసియాకు మరణశిక్ష విధించింది. ఈ తీర్పుపై పాకిస్తాన్ వ్యాప్తంగా కొందరు ఆమెకు మద్దతుగా నిలవగా.. మరికొందరు ఆమెకు పాపం పండిందని ఆనందం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పుపై అసియా సుప్రీం కోర్టును ఆశ్రయించిగా.. నిందితురాలు గత ఎనిమిది సంవత్సరాలుగా ‘ఏకాంతవాస’శిక్షను అనుభవిస్తుండడంతో కోర్టు ఆమెకు విధించిన మరణశిక్షను రద్దు చేసింది. ఇదిలాఉండగా.. ఈ కేసుపై మూడు వారాల క్రితమే కోర్టు నిర్ణయం తీసుకుందనీ, అయితే నిరసనలను అదుపు చేసేందుకు తీర్పును రిజర్వులో ఉంచారని పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఆయన మరణంతో అలజడి.. అసియాకు ఉరిశిక్ష విధించిన లాహోర్ హైకోర్టు వ్యవహారాన్ని ఖండించి, ఆమెకు మద్దతుగా నిలిచిన పంజాబ్ గవర్నర్ సల్మాన్ తసీర్ 2011లో హత్యకు గురికావడంతో పాకిస్తాన్లో అలజడి రేగింది. ఈ నేపథ్యంలోనే అసియా కేసులో కోర్టు జాగ్రత్తలు చేపట్టింది. నిరసనలు చెలరేగకుండా పోలీసులకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఏదేమైనా ఇస్లాం నిరసనకారుల వల్ల అసియాకు ఇబ్బందులు తప్పక పోవచ్చుననీ, జైలు నుంచి విడుదలైన అనంతరం ఆమె రక్షణ ప్రమాదంలో పడొచ్చననే భయాలు నెలకొన్నాయయి. ఉగ్రవాదులు ఆమెపై దాడికి పాల్పడవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలాఉండగా.. అప్పటి ప్రధాని జియావుల్ హక్ 1980లో దైవ దూషణ నేరంగా పరిగణించే చట్టాలు తెచ్చారు. అయితే, వ్యక్తిగత కక్ష్యసాధింపు చర్యలకు ఈ చట్టాలు అవకాశం కల్పిస్తాయని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. -
మరింత ఉధృతమైన “సేవ్ శబరిమల” ఉద్యమం
-
రివ్యూ పిటిషన్ వెయ్యబోం: కేరళ
తిరువనంతపురం: అన్ని వయసుల మహిళలకు శబరిమల ఆలయ ప్రవేశానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయబోమని కేరళ సర్కారు స్పష్టం చేసింది. అక్టోబర్ 16న భక్తులందరికీ దర్శనాలకు అనుమతించనున్న నేపథ్యంలో మహిళా భక్తుల దర్శనం కోసం ఏర్పాట్లు చేయాలని ట్రావెన్కోర్ దేవస్థాన బోర్డు నిర్ణయించింది. సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తూ బుధవారం వందలాది మంది అయ్యప్ప భక్తులు (అందులో మహిళలూ ఉన్నారు) కేరళలోని జాతీయ రహదారులను నిర్భందించారు. -
భిన్నాభిప్రాయమే ప్రాణప్రదం
హక్కుల నేతలపై కేసులో సాక్ష్యం కరువైన సందర్భాలకు, కల్పిత ఉత్తరాలకు కొట్టొచ్చినట్టు కనిపించే ఉదాహరణ–మహారాష్ట్రతో సంబంధం లేని సుధా భరద్వాజ్కు మరాఠీ భాష వచ్చని భావించిన వేగులవాళ్లు మరాఠీలో ఆమె రాసిన ఒక లేఖ దొరికినట్టు అందమైన కట్టుకథ అల్లడం. అంతేగాదు, పోలీసు విచారణలో పాలుపంచుకున్న ఇద్దరు సాక్షులు కూడా పుణే మునిసిపల్ కార్పొరేషన్ ఉద్యోగులని తేలింది. అందుకే న్యాయ ప్రయోజనాల దృష్ట్యా, ముఖ్యంగా విచారణకు సంబంధించి తీవ్ర అనుమానాలు తలెత్తినప్పుడు.. ప్రత్యేక విచారణ బృందం లేదా ప్రత్యేక దర్యాప్తు సంస్థ ఉండాల్సిందేనని జస్టిస్ చంద్రచూడ్ తన భిన్నాభిప్రాయ ప్రకటనలో స్పష్టంచేశారు. ‘భీమా–కోరేగావ్ హింసాత్మక ఘటనలకు సంబంధించి ఆగస్ట్ 28న మహారాష్ట్ర ప్రభుత్వం జరిపిన పోలీసు దాడుల సందర్భంగా ఐదు గురు పౌరహక్కుల సామాజిక కార్యకర్తలను అరెస్టు చేసి పెట్టిన కేసు, కావాలని పెట్టిన కేసని తేలిన పక్షంలో ప్రత్యేక విచారణ బృందాన్ని (సిట్) సుప్రీంకోర్టు నియమించి విచారణ జరుపుతుంది.’ – సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా (17–9–18) ‘భీమా–కోరేగావ్ (మహారాష్ట్ర) కేసును విచారించాల్సింది మహారాష్ట్ర పోలీసులు కాదు, కేవలం ప్రత్యేక దర్యాప్తు సంస్థ అయిన ‘సిట్’ మాత్రమే. ఈ కేసులో మహారాష్ట్ర పోలీసులు నిష్పాక్షిక విచారణ జరిపారా అన్న విషయంలో మా దృష్టికి వచ్చిన పరిస్థితులు అనుమానా నికి దారితీస్తున్నాయి. కానీ, జడ్జీలతో కూడిన సుప్రీం బెంచ్ ప్రత్యేక సిట్తో కేసు దర్యాప్తు జరిపించడానికి ప్రధాన న్యాయమూర్తి సహా ఇద్దరు జడ్జీలు వ్యతిరేకించగా నేను మాత్రం మెజారిటీ తీర్పుతో ఏకీభవించ కుండా నా భిన్నాభిప్రాయం స్పష్టం చేయదలిచాను.’ – సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ డీవై చంద్రచూడ్ భిన్నాభిప్రాయ ప్రకటన మహారాష్ట్ర ప్రభుత్వం ఆ కేసులో అరెస్ట్ చేసిన ఐదుగురు పౌరహక్కుల కార్యకర్తలు సుధా భరద్వాజ్, వర్నన్ గాన్జాల్వెజ్, అరుణ్ ఫెరీరా, వరవరరావు, గౌతమ్ నవలఖా, మాజా దారూవాలా. ఈ కేసులో గమ్మత్తేమంటే అరెస్టయిన కార్యకర్తల్ని రెండు సార్లు గృహనిర్బంధం వరకే ఆదేశించిన సుప్రీంకోర్టు ఆఖరికి సిట్ విచారణకు నిరాకరించి, ట్రయల్ కోర్టుకు పోయి అడగాలని చెప్పడం! అదే సమయంలో సిట్ విచారణకు అనుమతించని మెజారిటీ తీర్పు సామాజిక కార్యకర్తలను క్రిమినల్స్గా భావించరాదని అస్పష్టంగానైనా చెప్పగలగడం! ఈ మెజా రిటీ తీర్పుతో అదే బెంచ్లోని మూడో జడ్జి డీవై చంద్రచూడ్ విభేదిస్తూ భిన్నాభిప్రాయాన్ని స్పష్టంగా ప్రకటించారు. ‘భిన్నాభిప్రాయం ప్రజా స్వామ్యానికి ప్రాణం’ అని ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా కూడా ప్రకటించారు. జస్టిస్ చంద్రచూడ్ తన భిన్నాభిప్రాయ ప్రకటనలో, ‘‘ఏవో ఊహాగానాల మీద ఆధారపడి పౌర స్వేచ్ఛను బలిచేయడానికి వీల్లేదు. సత్యాన్ని తారుమారు చేయడానికి పోలీసులు స్వేచ్ఛగా వ్యవ హరిస్తున్నారు. ఇందుకు సామాజిక కార్యకర్తల గౌరవ ప్రతిష్టలను అవమానిస్తున్నారు,’’ అని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా సమస్యను విచారించడానికి పోలీసులకున్న శక్తి అనుమానించదగినదని ప్రసిద్ధ చరిత్రకారులు, ఆర్థికవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు, మానవ హక్కుల కార్యకర్తలైన రొమీలా థాపర్, ప్రభాత్ పట్నాయక్, దేవకీ జైన్, సతీశ్ దేశ్పాండే తరఫున రిట్ పిటిషన్ దాఖలు చేసిన ప్రముఖ లాయర్ బృందా గ్రోవర్ ప్రకటించారు. రెండొందల ఏళ్ల క్రితం బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ రాజ్యవిస్తరణలో భాగంగా పుణే సమీపంలో యుద్ధానికి కారణమైంది. ఇక్కడ జరిగిన పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ భీమా–కోరేగావ్లో సభ నిర్వహించారు. ఈ సభ సుప్రీం రిటైర్డ్ జడ్జి పీబీ సావంత్, బొంబాయి హైకోర్టు మాజీ జడ్జి బీజీ కోల్సే పాటిల్ ఆధ్వర్యంలో జరిగిందన్న సంగతి మరచి పోరాదు. కోరేగావ్ ఘటనతో సంబంధం లేని ఇతర రాష్ట్రాలకు చెందిన ఐదుగురు పౌరహక్కుల నేతలను అరెసు ్టచేయడం ఎంత వరకు సబబని అనేక మంది లాయర్లు, మాజీ జడ్జీలు ప్రశ్నిస్తున్నారు. కట్టుకథల ప్రచారం! దేశ ప్రధానిని హత్య చేయడానికి పన్నిన కుట్ర ఫలితంగా ఈ అరెస్టులు జరిగినట్టు అల్లిన కట్టుకథలు పోలీసుల ద్వారానే వ్యాప్తికావడం దేశ ప్రజలు ఎంత మాత్రం సహించలేని పరిణామం. విచిత్రమేమంటే, అరెస్టయిన ఈ ఐదుగురు పౌరహక్కుల నాయకుల విషయమై విచారణ జరిగినట్టే ఇంత వరకూ తెలియకపోవడం. అంతేకాదు, ఓ వ్యక్తిని అరెస్టు చేస్తున్నప్పుడు ఒక స్వతంత్రుడైన వ్యక్తి సాక్ష్యం తప్పని సరి అని కూడా సీఆర్పీసీ 41–బీ సెక్షన్ స్పష్టం చేస్తోందని న్యాయనిపుణులు చెబు తున్నారు. సాక్ష్యం కరువైన సందర్భాలకు, కల్పిత ఉత్తరాలకు కొట్టొ చ్చినట్టు కనిపించే ఉదాహరణ–మహారాష్ట్రకు సంబంధం లేని సుధా భరద్వాజ్కు మరాఠీ భాష వచ్చని భావించిన వేగులవాళ్లు మరాఠీలో ఆమె రాసిన ఒక లేఖ దొరికినట్టు అందమైన కట్టుకథ అల్లడం. అంతే గాదు, పోలీసు విచారణలో పాలుపంచుకున్న ఇద్దరు సాక్షులు కూడా పుణే మునిసిపల్ కార్పొరేషన్ ఉద్యోగులని, వారు సామాజిక కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసు బృందంలో సభ్యులుగానే ప్రయాణం చేశారని కూడా తేలింది. అందుకే న్యాయ ప్రయోజనాల దృష్ట్యా, ముఖ్యంగా విచారణపై తీవ్ర అనుమానాలు తలెత్తినప్పుడు–సదరు న్యాయానికి వ్యతిరేకంగా రాజీపడకుండా ఉండాలంటే ప్రత్యేక విచారణ బృందం లేదా దర్యాప్తు సంస్థ ఉండాల్సిందేనని జస్టిస్ చంద్రచూడ్ తన భిన్నాభిప్రాయ ప్రకటనలో స్పష్టంచేశారు.పైగా, ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా(పిల్) కోర్టు ముందుకొచ్చిన ప్రస్తుత కేసు దాఖలు చేసిన పిటిషనర్లు అనామకులు కాదని గుర్తించాలని చంద్రచూడ్ పేర్కొ నాల్సివచ్చింది. ఏదో స్వలాభం ఆశించో లేదా రాజకీయ ప్రయోజనాల దృష్ట్యానో పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారన్న వాదన కూడా ఇక్కడ నిలవదని ఆయన చెప్పారు. పైగా, మానవహక్కుల్ని వ్యక్తి హుందాతనాన్ని దెబ్బతీయడమేనని, అందుకు చెల్లించే పరిహారం కూడా ఎందుకూ పనికిరాదనీ, ఆ లోటును పూడ్చలేదనీ జస్టిస్ చంద్రచూడ్ తన భిన్నాభిప్రాయంలో వివరించారు. అందుకే కూలంకషంగా ఈ కేసులో విచారణను కాదనకుండానే, ప్రత్యేక దర్యాప్తుæబృదం(సిట్) నియామ కానికి ఈ కేసు తగినదని జస్టిస్ చంద్రచూడ్ నిర్ధారించవలసి వచ్చింది. న్యాయవ్యవస్థ వెనుకంజ ఎందుకు? ఇక్కడో సత్యాన్ని దాచగూడదు. నేరమయ రాజకీయాల్ని నిరోధించ డానికి పార్లమెంటే ప్రత్యేక చట్టం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇంతటి బాధ్యతను కేంద్ర చట్టసభలకే సర్వోన్నత న్యాయస్థానం అప్ప గించాల్సిన పరిస్థితి వచ్చింది. 125 కోట్ల భారత ప్రజానీకానికి ప్రాతినిధ్యం వహించే పార్లమెంటు.. సుప్రీంకోర్టు చెప్పినట్టు ఈ విష యంలో తగిన చొరవ తీసుకుంటుందా? ప్రజాబాహుళ్యం ఆకాంక్షలకు అనుగుణంగా అవినీతి రహిత గణతంత్ర రాజ్యం మనుగడను భారత పార్లమెంటు తీర్చిదిద్దగలుగుతుందా? అనే ప్రశ్నలకు జవాబులు అవ సరం. వందలాది మంది పార్లమెంటు, అసెంబ్లీల సభ్యులు సివిల్, క్రిమి నల్ నేరాల్లో పాల్గొని శిక్షలు పడకుండా తప్పించుకుంటున్నారు. ఇంత వరకూ దేశ ప్రజలు పొరపాటుగానో గ్రహపాటుగానో ఆశలు పెట్టుకున్న ప్రజాస్వామిక వ్యవస్థలు కూడా క్రమంగా కునారిల్లిపోతున్నాయి. ఈ తరుణంలో దింపుడు కళ్లం ఆశగా వారికి మిగిలిన ఆఖరి వ్యవస్థ అయిన న్యాయ వ్యవస్థ కూడా ఏమీ చేయలేకపోతోంది. పాలకులను, శాసన వేది కలను నియంత్రించగల శక్తి ఉన్నా ఆచరణలో అది నిర్వీర్యమౌతూనే ఉందని ప్రజలు భావిస్తున్నారు. సెక్యులర్ రాజ్యాంగం కల్పించిన ఎన్నో అవకాశాలకు, రక్షణలకు విలువ లేకుండా చేస్తూ అన్ని రాజకీయపక్షాల నేతలూ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. చట్టాలకు స్వతంత్ర భాష్యం ద్వారా శాసన వేదికలకు దిశానిర్దేశం చేసే అవకాశం, అధికారం న్యాయ వ్యవస్థకు ఉన్నాయి. ఈ ఆంశంలో న్యాయ వ్యవస్థ క్రియాశీలకంగా వ్యవ హరించాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. చివరికి ఎన్నికల కమిషన్ సహా అన్ని రాజ్యాంగ సంస్థలను సకాలంలో రక్షించుకోవాలి. రాజ్యాం గం ఆశించిన విధంగా దేశ ఆర్థిక, సామాజిక రంగాల్లో దళిత, పేద, మధ్య తరగతి ప్రజాబాహుళ్యం ప్రయోజనాలు కాపాడలేకపోతే, వాటికి పరిపూర్ణ రక్షణ లేకపోతే రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ హెచ్చ రించినట్టు జరిగే ప్రమాదం ఉంది. ‘‘ఆర్థిక, సామాజిక జీవనంలో సమా నత్వం లేకుండా ఎన్నాళ్లు ఇలా ముందుకు ప్రయాణిస్తాం? దీర్ఘకాలం పాటు సమానత్వం లేకుండా ఇదే పరిస్థితి కొనసాగితే మన రాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో పడుతుంది. ఈ వైరుధ్యాన్ని వీలైనంత త్వరగా మనం తొలగించక పోతే–అసమానత్వం వల్ల బాధపడే జనం రాజ్యాంగ పరిషత్తు కష్టపడి నిర్మించిన రాజకీయ ప్రజాతంత్ర వ్యవస్థను కూల్చివేస్తారు,’’ అని 1949 నవంబర్ 25న రాజ్యాంగ సభలో చేసిన ప్రసంగం చివరిలో అంబేడ్కర్ హెచ్చరించారు. ఈ సామాజిక వైరుధ్యాలను గమనించి మనం మెలగాలి. గుణ పాఠాలు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రజల త్యాగాల నుంచి, అపారమైన అనుభవాల నుంచి, జీవిక రక్షణలో నిరంతర వేదన నుంచి, పోరాటాల నుంచీ వస్తాయి. గాంధీజీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగానైనా సామాజిక వైరుధ్యాలను తొలగించాలనే స్పృహ పెరగాలి. ప్రపంచం నలు మూలల నుంచీ వీచే మంచి గాలినే కాదు, భావనా స్రవంతిని కూడా నిత్యం ఆహ్వానించుకుందామన్న పూర్వ వైదిక సూక్తిని గుర్తు చేసుకుందాం. నిజమైన దేశ భక్తుడు అనుక్షణం తన దేశాన్ని రక్షించుకునేందుకు, పాలకుల తప్పిదాలను ఎండగట్టేందుకు సిద్ధంగా ఉండాలన్న సూక్తిని మరచిపోరాదు. అందుకే, గతంలో సామ్రాజ్యవాదానికి, పెట్టుబడిదారీ విస్తరణవాదానికి బలి అవుతూ వస్తున్న ప్రజల త్యాగాలను గుర్తు చేసుకున్న ప్రసిద్ధ అమెరికన్ రచయిత డాక్టర్ డేవిడ్ గ్రిఫిన్ భావి తరాలను, వర్తమాన తరాలను హెచ్చరిస్తూ, ‘‘గతానుభవాలూ, త్యాగాలూ చచ్చిపోలేదు– నిద్రపోతున్న వాళ్లు తప్ప,’’ అన్న మాటలు ఎప్పుడూ గుర్తుండిపోవాలి. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@ahoo.co.in -
4 రోజులు.. 8 తీర్పులు
-
పేదోడి పొట్టగొట్టిన ‘ఆధార్ తీర్పు’
సాక్షి, న్యూఢిల్లీ : ఆధార్ కార్డుల న్యాయబద్ధతపై బుధవారం వెలువరించిన తీర్పులో సుప్రీంకోర్టు ఓ కీలకమైన అంశాన్ని అంతగా పట్టించుకోలేదు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఆధార్కు లింకు పెట్టడం ఎంత మేరకు సమంజసమనే అంశాన్ని లోతుగా పరిశీలించినట్లు లేదు. ఏదో ఒక ధ్రువపత్రం కూడా లేనందున 0.232 శాతం మందికి మాత్రమే ఆధార్ కార్డులు దక్కలేదని, వీరికి కార్డులు లేవన్న కారణంగా కార్డులున్న 99.76 శాతం లబ్ధిదారుల ప్రయోజనాలను విస్మరించలేమంటూ ప్రభుత్వం చేసిన వాదనకు సుప్రీంకోర్టు బెంచీ బోల్తా పడింది. కేవలం 0.232 శాతం మందికే ఆధార్ కార్డులు లేవన్న ధ్రువీకరణకు కేంద్ర ప్రభుత్వం ఎలా వచ్చింది? మొత్తం దేశ జనాభా ఎంత? మొత్తం జారీ చేసిన ఆధార్ కార్డుల సంఖ్య ఎంత? అని సుప్రీం కోర్టు నిలదీసి ఉంటే అసలు లెక్కలు బయటకు వచ్చేవేమో! ఆధార్ కార్డుల గురించి ఎంత మందికి తెలుసు? ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాల్లో 85 శాతం మందికే ఆధార్ కార్డుల గురించి తెలుసని, వారిలో 41 శాతం మందికి వాటిని ఉచితంగానే ఇస్తారన్న విషయం తెలియదని ఓ స్వతంత్ర అధ్యయనంలో ఇటీవలే తేలింది. అంటే, 15 శాతం మందికి ఆధార్ కార్డుల గురించే తెలియదంటే వారి వద్ద అవి లేవన్న మాటే. ఇక 41 శాతం మందికి అవి ఉచితంగా ఇస్తారన్న విషయం తెలియదంటే వారిని ఇంటి వారో, బయటివారో మోసం చేసి ఆధార్ కార్డులకు డబ్బులు తీసుకొని ఉంటారు. ఆ మధ్య జార్ఖండ్లో వారం రోజులకుపైగా ఆహారం తీసుకోక పోవడం వల్ల సంతోషి కుమారి అనే 11 ఏళ్ల బాలిక మరణించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సష్టించిన విషయం తెలిసిందే. ఆ బాలిక తల్లికి ఆధార్ కార్డు లేదన్న కారణంగా అంతకుముందు రెండు నెలల నుంచి డీలర్ రేషన్ బియ్యం నిరాకరించడమే బాలిక మరణానికి దారితీసింది. ఈ నేపథ్యంలో జార్ఖండ్లో 20 శాతం మందికి ఆధార్ కార్డులు లేవని ఆ తర్వాత ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ప్రభుత్వం మాటలకు, లెక్కలకు పొంతన ఉందా? క్షేత్రస్థాయి లెక్కలను పట్టించుకోకుండా ప్రభుత్వం చేసిన వాదనను సుప్రీం కోర్టు నమ్మింది. ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఆధార్ను లింక్ చేయడం వల్ల ఏటా 90 వేల కోట్ల రూపాయలు ఆదా అవుతున్నాయని, నకిలీ రేషన్ కార్డులను, నకిలీ లబ్ధిదారులను అరికట్టడం వల్లనే ఇది సాధ్యమైందని కేంద్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోంది. ‘మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం’ కింద జాబ్ కార్డులు కలిగిన వారిలో 90 లక్షల మంది నకిలీ కార్డుదారులని 2017, ఏప్రిల్లో ప్రభుత్వం తొలగించింది. ఆ తర్వాత ఇదే విషయమై సంబంధిత శాఖను సమాచార హక్కు కింద వివరాలు కోరగా, రద్దయిన వాటిలో కేవలం 4 శాతం కార్డులే నకిలీవని తేలినట్లు చెప్పారు. ప్రభుత్వం లెక్కలకు, మాటలకు ఎంత తేడా ఉంటుందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ సహజ న్యాయసూత్రం వర్తించదా!? ఏదో ఒక ధ్రువపత్రం లేనికారణంగా ఆధార్ కార్డులు దక్కని వారి సంఖ్య కేవలం 0.232 శాతం మాత్రమేనని ప్రభుత్వం కోర్టులో వాదించింది. ఆ అంకే నిజమనుకున్నా 27.60 లక్షల మందికి ఆధార్ కార్డులు అందలేదు. వారంతా కచ్చితంగా పేదవాళ్లు, అట్టడుగు వర్గాల వారే అయ్యుంటారు. ఎందుకంటే ఎలాంటి గుర్తింపు కార్డులు వారికే ఉండవు కనుక. వెయ్యి మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదుగానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదనే న్యాయ సూత్రాన్ని సెలవిచ్చిన సుప్రీం కోర్టు, వెయ్యి మంది నకిలీ వ్యక్తులు లబ్ధి పొందినా పర్వాలేదుగానీ ఒక్క నిజమైన పేదవాడికి అన్యాయం జరగకూడదంటూ ఎందుకు తీర్పివ్వదో మరి! -
సెక్షన్ 377పై తీర్పు : ‘హెచ్ఐవీ కేసులు పెరుగుతాయి’
న్యూఢిల్లీ : స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సుప్రీం కోర్టు వెల్లడించిన తీర్పును బీజేపీ వివాదాస్పద నేత, ఎంపీ సుబ్రమణియన్ స్వామి తప్పు పట్టారు. దీని వల్ల హెచ్ఐవీ కేసులు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సెక్షన్ 377పై సుప్రీం కోర్టు తీర్పు నేపధ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వలింగ సంపర్కం గురించి ఈ రోజు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పే చివరిది కాదు. దీన్ని ఏడుగురు న్యాయమూర్తుల బెంచ్కి తీసుకెళ్లవచ్చని తెలిపారు. సెక్షన్ 377పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు సామాజిక దుష్ప్రవర్తనకు దారి తీయడమే కాక పలు లైంగిక వ్యాధుల సంక్రమణకు అవకాశం కల్పించినదిగా ఆయన అభిప్రాయపడ్డారు. దీని వల్ల హెచ్ఐవీ కేసులు పేరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాక స్వలింగ సంపర్కం అనేది ఒక జన్యుపరమైన రుగ్మతగా పేర్కొని.. దీన్ని ఒక ప్రత్యామ్నాయ లైంగిక ప్రవర్తనలా పరిగణించకూడదని తెలిపారు. స్వలింగ సంపర్కం గురించి సుమారు 157 ఏళ్లుగా సాగుతున్న వివాదానికి సుప్రీం కోర్టు నేటితో స్వస్తి పలికింది. స్వలింగ సంపర్కం నేరం కాదంటూ అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం బెంచ్ ఏకగ్రీవంగా తీర్పును వెలువరించడం విశేషం.