
పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలపై పడింది. దీంతో సోమవారం దేశంలో పెట్రోల్ లీటర్పై 15 పైసలు, డీజిల్పై 17 పైసలు పెరిగింది. ఇక ఢిల్లీలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.76.69 ఉండగా.. డీజిల్ లీటర్కు రూ.68.68లకు చేరింది. కాగా 2018 నవంబర్ తర్వాత పెట్రోల్ ధర ఇదే అత్యధికం. పెట్రో ఉత్పత్తుల ధరలు పెరగడం వరుసగా ఇది ఐదోరోజు.