petrol and diesel prices hike
-
పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు.. బీజేపీకి సిద్ధరామయ్య కౌంటర్
బెంగళూరు: కర్ణాటకలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇంధన ధరలు పెరిగినప్పటికీ పొరుగు రాష్ట్రాల ధరల కంటే తక్కువగానే ఉందని సమర్ధించుకున్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్గా మారాయి.కాగా, సీఎం సిద్ధరామయ్య తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్పై మూడు రూపాయల సేల్స్ ట్యాక్స్ పెంచాం. అయినప్పటికీ పొరుగు రాష్ట్రాల్లో ఇంధన ధరల కంటే తక్కువే ఉంది. బీజేపీ నేతలు దీన్ని పెద్ద సమస్యగా చిత్రీకరిస్తున్నారు. స్థానిక బీజేపీ నేతలు మాట్లాడే ముందు కేంద్రం పెంచిన అదనపు సుంకాలపై కామెంట్స్ చేస్తే బాగుండేది.పలు సందర్భాల్లో రాజకీయ కారణాల దృష్ట్యా ప్రధాని మోదీ పెట్రోల్, డీజిల్పై అదనపు సుంకాన్ని పెంచారు. దాదాపు పది కంటే ఎక్కువ సార్లే పెంచారు. కేంద్రం అదనంగా సుంకాలు విధించినప్పుడు రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారు. మోదీని ఎందుకు ప్రశ్నించలేదు. కేంద్రం పన్నలు విధించిన కారణంగా మేము దాదాపు 1,87,00,000 కోట్లు పోగొట్టుకున్నాం. రాష్ట్రంలో అభివృద్ధి పనుల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం ట్యాక్స్ పెంచామని’ చెప్పుకొచ్చారు.#WATCH | Bengaluru: On fuel price hike, Karnataka CM Siddaramaiah says, "We have raised sale tax by Rs 3, both on petrol and diesel. Still, we are less than the rates that our neighbouring states have. The BJP people are making it an issue for political reasons. When Narendra… pic.twitter.com/oIbmbYGqLY— ANI (@ANI) June 17, 2024ఇదిలా ఉండగా.. ఎన్నికల ఫలితాలు వెలువడిని అనంతరం కర్ణాటకలో ఇంధన ధరలు పెరిగాయి. శనివారం పెట్రోల్, డీజిల్ ధరలపై అదనంగా మూడు రూపాయలు ట్యాక్స్ విధించారు. దీంతో, పెరిగిన ఇంధన ధరలు వెంటనే అమలులోకి వచ్చాయి. -
పెట్రోల్,డీజిల్ ధరల్ని పెంచిన కర్ణాటక.. ఎంతంటే?
బెంగళూరు : కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయానికి దోహదం చేసిన ఉచిత హామీలు ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రజలకు భారంగా మారుతున్నట్లు తెలుస్తోంది. ఉచిత హామీలతో ఖాళీ అవుతున్న ఖజానాను నింపుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం నిత్యవసర వస్తువల ధరల్ని పెంచుతున్నట్లు సమాచారం.ఇందులో భాగంగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచింది. పెట్రోల్పై రూ.3, డీజిల్పై రూ.3.20 పెంచుతూ నిర్ణయించింది. దీంతో కర్ణాటకలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.85చేరగా.. డీజిల్ ధర రూ.88.93కి చేరింది. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వచ్చాయి. -
అక్కడ పెట్రోలు రేట్లు ఐదు రెట్లు పెరగనున్నాయి!
పెట్రోల్ ధరలు రెండు రూపాయలు పెరిగితేనే ఆందోళనలు జరిగిన సంఘటనలు గతంలో కోకొల్లలు, అలాంటిది 500 శాతం పెరిగితే?.. అది సామాన్య ప్రజల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకీ ఇంత శాతం ధరలు ఏ దేశంలో పెరుగుతాయి, ఎప్పటి నుంచి అమలులోకి రానున్నాయనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. భారత్లో పెట్రోల్ ధరలు ఇప్పుడు రూ.100 నుంచి రూ.120 మధ్యలో ఉండటంతోనే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక పాకిస్తాన్, శ్రీలంక దేశాల్లో పెట్రోల్ ధరలు రూ.250 నుంచి రూ.350 వరకు ఉన్నాయి. ఇప్పుడు కరేబియన్ దేశం క్యూబా ఉన్న ధరలనే 500% పెంచుతూ ప్రకటించింది. ఒక వైపు కరోనా ప్రభావం, మరోవైపు అమెరికా తీవ్ర ఆంక్షల మధ్య ఆర్ధిక సంక్షోభంలో పడ్డ క్యూబా.. ద్రవ్యోల్బణ లోటును తగ్గించుకోవడానికి పెట్రోల్ ధరలను భారీగా పెంచాలని నిర్ణయించుకుంది. దీంతో 25 పెసోలుగా ఉన్న ఒక లీటరు పెట్రోల్ రేటు ఫిబ్రవరి 1 నుంచి 132 పెసోలకు పెరుగుతుంది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ 450 రూపాయల కంటే ఎక్కువన్నమాట. ఇదీ చదవండి: వాచ్మెన్కు ఇప్పుడే సారీ చెప్పు.. ఆకాశ్ను ఆదేశించిన ముకేశ్ అంబానీ - ఎందుకంటే? కేవలం పెట్రోల్ ధరలు మాత్రమే కాకుండా.. రాబోయే రోజుల్లో డీజిల్, ఇతర రకాల ఇంధనాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని, విద్యుత్, సహజవాయువుల ధరల పెరుగుదల త్వరలోనే జరుగుతుందని ఆర్థిక మంత్రి 'వ్లాదిమిర్ రెగ్యురో' (Vladimir Regueiro) వెల్లడించారు. కొత్త ధరలు అమలులోకి వచ్చిన తరువాత కేవలం అమెరికన్ డాలర్లతో మాత్రమే కొనుగోలు చేయాలనీ క్యూబా ప్రభుత్వం నిర్ణయించింది. ధరలు అందుబాటులోకి వచ్చిన తరువాత క్యూబా ప్రజలు పెద్ద ఎత్తున ఆర్థిక కష్టాలను చవి చూడాల్సి వస్తుందని స్పష్టంగా అర్థమవుతోంది. -
పాకిస్తాన్లో లీటర్ పెట్రోల్ రూ.330
ఇస్లామాబాద్: పాకిస్తాన్లోని ఆపద్ధర్మ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి పెంచింది. లీటర్ పెట్రోల్పై రూ.26.02, డీజిల్పై రూ.17.34 పెంచుతున్నట్లు శుక్రవారం అర్ధరాత్రి ప్రకటించింది. తాజా పెంపుతో లీటర్ పెట్రోల్, హైస్పీడ్ డీజిల్ ధర గతంలో ఎన్నడూ లేనంత స్థాయికి రూ.330కు చేరుకుంది. ద్రవ్యోల్బణం 27.4 శాతానికి చేరడంతో ఈ చర్య అనివార్యమయినట్లు ప్రభుత్వం చెబుతోంది. శనివారం అమెరికా డాలర్తో పోలిస్తే 296.41 పాకిస్తానీ రూపాయలకు చేరుకుంది. ఈ నెల ఒకటో తేదీన కూడా ఆపద్ధర్మ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై లీటర్కు రూ.14 చొప్పున పెంచింది. -
తీవ్ర ఆర్థిక సంక్షోభం.. ఆ దేశంలో పెట్రోల్ బంకులు బంద్
ఇస్లామాబాద్: పెట్రోల్ అమ్మకాలపై పాకిస్తాన్ ప్రభుత్వం మార్జిన్ పెంచని కారణంగా జులై 22 నుండి జులై 24 వరకు రెండు రోజులు దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకులకు బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది పాకిస్తాన్ పెట్రోల్ డీలర్ల సంఘం. పాకిస్తాన్ దేశం గత కొన్నాళ్ళుగా తీవ్ర ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒక్కసారిగా ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతో పాకిస్తాన్ కరెన్సీ విలువ దారుణంగా పడిపోయింది. దీంతో పాకిస్తాన్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. పాకిస్తాన్లో లీటరు పెట్రోల్ రూ.253 కాగా డీజిల్ ధర రూ. 253.50 గా ఉంది. అసలే ధరలు మండిపోతుంటే దాంట్లో మార్జిన్ పెంచాలని పట్టుబట్టింది పాకిస్తాన్ పెట్రోలియం డీలర్ల అసోషియేషన్. గత కొంతకాలంగా పాకిస్తాన్ పెట్రోలియం డీలర్ల అసోషియేషన్ వారు పాక్ ప్రభుత్వం పెట్రోల్ ధరలపై తాము కోరిన విధంగా 5%(రూ.12) మార్జిన్ ఇవ్వాలని కోరుతుండగా షెబాజ్ షరీఫ్ ప్రభుత్వం మాత్రం కేవలం 2.4%(రూ.6) మాత్రమే మార్జిన్ దక్కుతుందని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కారణంగా జులై 22, శనివారం నుండి జులై 24,సోమవారం వరకు నిరవధిక సమ్మె నిర్వహించ తలపెట్టింది డీలర్ల సంఘం. ఈ మేరకు శనివారం సాయంత్రం నుండే దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 10 వేల పెట్రోల్ బంకులను మూసివేస్తున్నట్లు ప్రకటించింది ఈ సందర్బంగా అంబులెన్స్, పాల వ్యాన్, పోలీసు వాహనాలు వంటి ఎమెర్జెన్సీ సేవలకు కూడా సర్వీసు నిలిపివేస్తున్నట్లు తెలిపారు సంఘం అధ్యక్షులు సైముల్లా ఖాన్. ఇది కూడా చదవండి: తుపాకి పేలడంతో భార్య మృతి.. అతనేం చేశాడంటే.. -
కొనడానికి లేదు.. తినడానికి లేదు
ఏమీ కొనేటట్టు లేదు. ఏమీ తినేటట్టు లేదు. కొనడానికి డబ్బుల్లేవు. డబ్బులున్నా కొనడానికి ఏమీ దొరకవు. పెట్రోల్ బంకుల దగ్గర రోజుల తరబడి క్యూ లైన్లు ఆఫీసుల్లేవు, పనుల్లేవు. చదువుల్లేవు. కాస్త గాలి ఆడేలా ఫ్యాన్ కింద కునుకు తీద్దామంటే కరెంట్ ఉండదు. ఏం చేయాలి? ఎలా బతకాలి? అందుకే కడుపు మండిన సగటు శ్రీలంక పౌరులు రోడ్డెక్కారు. అవినీతి అధ్యక్షుడు రాజీనామా చేయాలంటూ సమరభేరి మోగించారు. కడుపు నింపుకోవడానికి కావల్సినంత తిండి దొరకదు. అర్థాకలితో కంచం ముందు నుంచి లేవాలి. కాసేపు ఫ్యాన్ కింద కూర్చుద్దామంటే కరెంట్ ఉండదు. రోజుకి 13 గంటల విద్యుత్ కోతలు. బయటకు వెళ్లాలంటే పెట్రోల్ లేక వాహనం కదలదు. పాఠశాలలు, కార్యాలయాలు మూతబడ్డాయి. అటు ధరాభారం, ఇటు నిత్యావసరాల కొరతతో శ్రీలంక పౌరుల బతుకు భారంగా మారింది. ఏది కొనాలన్నా క్యూ లైన్లలో నిల్చోవాలి. కాళ్లు పడిపోయేలా నిల్చున్నా కావల్సినవి దొరుకుతాయన్న నమ్మకం లేదు. లీటర్ పెట్రోల్ రూ.450, కేజీ బియ్యం రూ.250, కేజీ కందిపప్పు రూ. 420, ఒక కొబ్బరికాయ రూ.110, కేజీ కేరట్ రూ.250, అయిదు కేజీల గ్యాస్ బండ ధర రూ.1150... ఇవీ శ్రీలంకలో ధరలు ... నిత్యావసరాల ధరలు ఆ స్థాయిలో ఉంటే ఎలా కొంటారు ? ఏం తింటారు ? ఇక పిల్లలకైతే పౌష్టికాహారం దొరకడం లేదు. పాల పౌడర్ దిగుమతులు గత కొన్ని నెలలుగా నిలిచిపోయాయి. బతుకు దుర్భరమైన పరిస్థితుల్లో ఒంటికేదైనా వచ్చినా ఆస్పత్రుల్లో అత్యవసర మందులకి కూడా కొరత నెలకొంది. వైద్యం కూడా అందరికీ అందని పరిస్థితి వచ్చేసింది. పెట్రోల్ ధరలు మండిపోతూ ఉండడంతో చాలా మంది తమ కండబలాన్ని నమ్ముకున్నారు. స్కూటర్లు, కార్లు అమ్మేసి సైకిళ్లు కొనుక్కుంటున్నారు. బంగారాన్ని, ఆభరణాల్ని కూడా అమ్మేస్తున్నారు. 2021లో 7 టన్నుల బంగారాన్ని అమ్మిన శ్రీలంక ప్రజలు ఈ ఏడాది 20శాతం అధికంగా అమ్మేయవచ్చునని అంచనాలున్నాయి. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునేంత వరకు కనీస అవసరాలు కూడా తీరకపోవడంతో ప్రజాగ్రహం అధ్యక్ష పీఠాన్ని వదలని గొటబాయ రాజపక్స మీదకు మళ్లింది.దేశంలో ఎన్నడూ లేని విధంగా అధ్యక్ష, ప్రధాని భవనాలను ముట్టడించారు. మొత్తంగా శ్రీలంక ఆర్థిక, మానవీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సంక్షోభం నుంచి ఎలా బయటపడాలి ? పర్యాటక రంగం మీద ప్రధానంగా ఆధారపడిన శ్రీలం కోవిడ్–19 విసిరిన పంజా కోలుకోలేని దెబ్బ తీసింది. 2019లో 19 లక్షల మంది లంకను సందర్శిస్తే, 2020లో వారి సంఖ్య ఏకంగా 5 లక్షలకు పడిపోయింది. దీంతో ప్రధానంగా పర్యాటకం మీద ఆధారపడ్డ ఆ దేశానికి దెబ్బ తగిలింది. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల నుంచి భారీగా ఆదాయం వచ్చే దేశంలో రైతులు అందరూ సేంద్రీయ ఎరువులు వాడి తీరాలన్న ప్రభుత్వ నిబంధనతో వ్యవసాయ దిగుబడులు భారీగా తగ్గిపోయాయి.. మరీ ముఖ్యంగా ధాన్యం, రబ్బర్, టీ, కొబ్బరి వంటి పంటల దిగుబడి దారుణంగా పడిపోయింది. దీనికి తోడు రాజపక్స కుటుంబం ఏళ్ల తరబడి చేస్తున్న అవినీతి, ప్రభుత్వ అరాచక విధానాలు దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశాయి. ఈ ఏడాది 700 కోట్ల డాలర్ల విదేశీ అప్పుల్ని శ్రీలంక ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. గత ఏడాది అక్టోబర్లో డాలర్ మారకం విలువ రూ.200 ఉంటే ఇప్పుడు ఏకంగా రూ.360కు చేరుకుంది. విదేశీ నిల్వలు తరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో దేశాన్ని గట్టెక్కించడానికి ప్రపంచ దేశాల సహకారంతో పాటు పెద్ద ఎత్తున ఆర్థిక సరళీకృత విధానాలు అమల్లోకి తేవాల్సి ఉందని ప్రపంచ బ్యాంకు చెబుతోంది. సాగులో ఉత్పాదకత పెంచడం, వ్యవసాయేతర రంగాల్లో ఉద్యోగ అవకాశాల కల్పన, సంస్కరణలు పకడ్బందీగా అమలు చేయడం, కార్మికులు రెట్టింపు శ్రమ చేయడం, ప్రజా సేవలు, విద్య అందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రణాళికను రూపొందించడం వంటివి చేయాలని ప్రపంచ బ్యాంకు సూచించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఒక్క రోజు బ్రేక్ ఇచ్చారు.. మళ్ళీ పెంచారు
-
తగ్గేదేలే అంటున్న పెట్రోల్, డీజిల్..
-
మరోసారి పెరిగిన ఇంధన ధరలు..! 3 రోజుల్లోనే రూ. 2 పైగా బాదుడు..! కొత్త ధరలు ఇవే..
Fuel Rates Today: రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా బ్యారెట్ క్రూడాయిల్ ధరలు 140 డాలర్లకు చేరుకుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఇంధన ధరలను స్థిరంగా ఉంచిన కేంద్రం..ఇప్పుడు ధరల పెంపుకు చమురు సంస్థలు సిద్ధమయ్యాయి. రెండు రోజుల పాటు వరుసగా పెంచిన చమురు సంస్థలు, ధరల పెంపుకు ఒక్కరోజు బ్రేక్ గ్యాప్ ఇచ్చి మరోసారి బాదుడు షురూ చేశాయి. దేశీయ చమురు కంపెనీలు తాజాగా లీటరు పెట్రోల్ 90 పైసలు, డీజిల్పై 87 పైసలు పెంచాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.97.81, డీజిల్ ధర రూ.89.07కు చేరాయి. ముంబైలో పెట్రోల్ రూ.112.51, డీజిల్ రూ.96.70గా ఉన్నాయి. చెన్నైలో 76 పైసల చొప్పున పెరగడంతో పెట్రోల్ రూ.103.67, డీజిల్ రూ.93.71, కోల్కతాలో పెట్రోల్ రూ.106.34 (84 పైసలు), డీజిల్ రూ.91.42 (80 పైసలు)కి చేరాయి. ఇక హైదరాబాద్లో లీటరు పెట్రోలుపై 90 పైసలు, డీజిల్పై 87 పైసల చొప్పున పెరిగాయి. దీంతో పెట్రోలు ధర రూ.110.91, డీజిల్ రూ.97.23కు చేరాయి. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 112.76, డీజిల్ ధర రూ. 98.74 గా ఉంది. దేశంలో గతేడాది నవంబర్ 4వ తేదీ తర్వాత మొదటిసారిగా మార్చి 22న పెట్రోల్, డీజిల్ ధరలు అధికమయ్యాయి. మార్చి 23న కూడా చమురు కంపెనీలు ధరలు పెంచాయి. తాజా పెంపుతో మూడు రోజుల్లోనే లీటరు పెట్రోల్, డీజిల్ ధరలు రూ.2.40 పైగా పెరిగాయి. చదవండి: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..! వచ్చే 6 రోజుల్లో 4 రోజులు బంద్..! -
వరుసగా రెండో రోజు పెరిగిన పెట్రోల్ ధరలు
-
వాహనదారులకు భారీ షాక్..మళ్లీ పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు!
దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముగిసిన తరువాత వాహనదారులపై పెట్రో బాదుడు షురూ అయ్యింది. చివరి సారిగా డీజిల్,పెట్రోల్ ధరలు గతేడాది నవంబర్ 4వరకు పెరిగాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల తరువాత ఇప్పుడు మళ్లీ పెట్రోల్ ధరల పెంపు ప్రారంభమైంది. దీంతో బుధవారం లీటర్ పెట్రోల్పై 90పైసలు, డీజిల్పై 84పైసలు పెరిగాయి. మరోవైపు ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు గరిష్టానికి చేరుకున్నాయి. అయితే రోజురోజుకు చమురు సంస్థలు నష్టాలు పెరుగుతుండడంతో పెట్రో ధరల పెంపు అనివార్యమైందని ఆర్ధిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధరూ.110గా ఉండగా డీజిల్ ధర రూ.96.36 పైసలుగా ఉంది. గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.112.08 ఉండగా డీజిల్ ధర రూ.98.10పైసలుగా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.99 ఉండగా డీజిల్ ధర రూ.97.90పైసలుగా ఉంది. న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.21 ఉండగా లీటర్ డీజిల్ ధర రూ.87.47పైసలుగా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.82పైసలు ఉండగా డీజిల్ ధర రూ.95.00పైసలుగా ఉంది. కోల్కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.51 ఉండగా డీజిల్ ధర రూ.90.62పైసలుగా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.16 ఉండగా డీజిల్ ధర రూ.92.19పైసలుగా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.101.42 ఉండగా డీజిల్ ధర రూ.85.80పైసలుగా ఉంది. -
చమరు ధరలపై అంతర్జాతీయ ఇంధన సంస్థ కీలక వ్యాఖ్యలు..!
గత కొద్ది రోజులుగా ఉక్రెయిన్పై రష్యా తన దాడులను కొనసాగిస్తోంది. అయితే, ఈ ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న దాడుల వల్ల అంతర్జాతీయంగా చమరు ధరలు భారీగా పెరుగుతున్నాయి. పెరుగుతున్న చమరు ధరల వల్ల అనేక దేశాల ఆర్ధిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఇలాంటి కఠిన సమయంలో అంతర్జాతీయ ఇంధన సంస్థ ఇంధన ధరలపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. పెరుగుతున్న ధరలను తాత్కాలికంగా తగ్గించుకోవడం కోసం 10 పాయింట్ల ప్రణాళికను సూచించింది. ప్రపంచ చమురు మార్కెట్'లో రష్యా మూడవ అతిపెద్ద ఉత్పత్తిదారుడిగా మాత్రమే కాకుండా అతిపెద్ద ఎగుమతిదారుగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల వల్ల ఇప్పుడు ఆ ప్రభావం అనేక దేశాల మీద అధికంగా ఉంది. ఆర్థిక నష్టాన్ని తగ్గించడానికి ఉన్న ఒక కీలక మార్గం చమురు డిమాండ్'ను తగ్గించడం అని అంతర్జాతీయ ఇంధన సంస్థ తెలిపింది. తాము సూచించిన 10 పాయింట్ల ప్రణాళిక వల్ల కొంత మేరకు ధరల పెరుగుదల నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది. అయితే, ఈ 10 పాయింట్ల ప్రణాళిక అమలకు అనేక దేశాల ప్రభుత్వ మద్దతు అవసరం అని పేర్కొంది. ఈ ప్రణాళిక అమలు అనేది ప్రతి దేశ ఇంధన మార్కెట్లు, రవాణా మౌలిక సదుపాయాలు, సామాజిక & రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాల మీద ఆధారపడుతుంది అని తెలిపింది. 10 పాయింట్ల ప్రణాళికలోని ముఖ్య అంశాలు: ప్రస్తుతం హైవేలపై ఉన్న వేగ పరిమితిని గంటకు కనీసం 10 కిలోమీటర్ల వేగం తగ్గించాలి. దీని వల్ల కార్లు వినియోగించే ఆయిల్ వినియోగం సుమారు 290 కేబీ/డీ ఆదా అవుతుంది, ట్రక్కులు వినియోగించే ఆయిల్ వినియోగం 140 కేబీ/డీ ఆదా అవుతుంది. కేబీ/డీ అంటే రోజుకు వెయ్యి బ్యారెల్స్ ఆయిల్ అని అర్ధం. వారానికి మూడు రోజులు ఇంటి నుంచి పని చేయడం వల్ల ఒక రోజు సుమారు 170 కేబీ/డీ ఆయిల్ వినియోగం ఆదా అవుతుంది. అంటే, మూడు రోజులు కలిపి సుమారు 500 కేబీ/డీ ఆదా కానుంది. ప్రతి ఆదివారం నగర రోడ్ల మీద కార్లను అనుమతి ఇవ్వకూడదు. దీనివల్ల ప్రతి ఆదివారం సుమారు 380 కేబీ/డీ ఆదా అవుతుంది; నెలకు ఒక ఆదివారం 1520 కేబీ/డీ ఆదా చేస్తుంది. ప్రజా రవాణాను, మైక్రోమొబిలిటీ, వాకింగ్, సైక్లింగ్ ప్రోత్సహించడం వల్ల సుమారు 330 కేబీ/డీ ఆదా చేస్తుంది. పెద్ద నగరాల్లో ఎక్కువగా ప్రత్యామ్నాయ ప్రైవేట్ కారు యాక్సెస్ పెంచడం వల్ల సుమారు 210 కేబీ/డీ ఇంధనం ఆదా అవుతుంది. కారు షేరింగ్ విధానాలను ప్రోత్సహించడం వల్ల సుమారు 470 కేబీ/డీ ఇంధనం ఆదా అవుతుంది. సరుకు రవాణా ట్రక్కుల కోసం సమర్థవంతమైన డ్రైవింగ్ & గూడ్స్ డెలివరీని ప్రోత్సహించడం వల్ల సుమారు 320 కేబీ/డీ ఇంధనం ఆదా అవుతుంది. సాధ్యమైనంత వరకు విమానాలకు బదులుగా హై స్పీడ్, నైట్ రైళ్లను వినియోగించడం వల్ల సుమారు 40 కేబీ/డీ ఇంధనం ఆదా అవుతుంది. ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్న చోట వ్యాపార విమాన ప్రయాణాన్ని చేపట్టక పోవడం వల్ల సుమారు 260 కేబీ/డీ ఇంధనం ఆదా అవుతుంది. ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలను ప్రోత్సహించడం వల్ల సుమారు 100 కేబీ/డీ ఇంధనం ఆదా అవుతుంది. (చదవండి: దేశంలో చౌక గృహాలకు తగ్గిన డిమాండ్..!) -
పెట్రోల్, డిజీల్ ధరలు రూ. 12 పెరిగే ఛాన్స్..! బంకులకు క్యూ కట్టిన జనాలు..!
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో క్రూడాయిన్ ధరలు సరికొత్త రికార్డులు నమోదుచేసింది. దీంతో అంతర్జాతీయంగా పెట్రోల్, డిజీల్ ధరలు గణనీయంగా పెరిగాయి. భారత్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ఇంధన ధరల పెంపుపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో పెట్రోల్, డిజీల్ ధరలు స్థిరంగానే కొనసాగాయి. కాగా ఎన్నికల ఫలితాలు వచ్చిన మరు క్షణమే ఇంధన ధరలు భారీగా పెరుగుతాయనే వార్తలు రావడంతో ప్రజలు తమ వాహనాల్లో ఫుల్ ట్యాంక్ చేసుకున్నారు. మార్చి నెల తొలి పదేహేను రోజుల్లో రికార్డు స్థాయిలో పెట్రోల్, డిజీల్ను ప్రజలు తమ వాహనాల్లో నింపుకున్నారు. కొత్త రికార్డులు..! ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంధన ధరల పెంపు ఉంటుందనే భయం ప్రజల్లో కన్పించింది. దీంతో మార్చి మొదటి రెండు వారాల్లో జనాలు భారీగా ఇంధనాన్నినిల్వ చేసుకున్నారు. బ్లూమ్బెర్గ్ లెక్కల ప్రకారం..మార్చి 1 నుంచి 15 మధ్యకాలంలో భారత్కు చెందిన మూడు అతిపెద్ద రిటైలర్ల డీజిల్ విక్రయాలు ఇదే కాలంతో పోలిస్తే 33 శాతం ఎక్కువగా 3.53 మిలియన్ టన్నులుగా ఉన్నాయని పేర్కొంది. ఇక పెట్రోల్ మార్చి 1 నుంచి 15 మధ్య కాలంలో 1.23 మిలియన్ టన్నులతో పెట్రోలు విక్రయాలు జరిగాయి. ఈ అమ్మకాలు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే దాదాపు 18 శాతం ఎక్కువ. 2019 కాలంతో పోలిస్తే 24.4 శాతం అధికం. ఎన్నికల నేపథ్యంలో ఇంధన ధరలు సుమారు 132 రోజుల పాటు స్థిరంగా ఉన్నాయి. ఇక ఎల్పీజీ గ్యాస్ అమ్మకాలు అమ్మకాలు 17 శాతం పెరిగాయి. రూ. 12 కు పెరిగే ఛాన్స్..! రష్యా ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో బ్యారెల్ క్రూడాయిల్ ధరలు సుమారు 80 డాలర్ల నుంచి 130 డాలర్లకు చేరకుంది.ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంధన రిటైలర్లు ధరలను సర్దుబాటు చేసే అవకాశం ఉన్నట్లు ఊహగానాలు వచ్చాయి. ఫలితాల తరువాత ఇంధన ధరలు ఏకంగా రూ. 12 పెరిగే ఛాన్స్ ఉందంటూ వార్తలు ఊపందుకున్నాయి. కానీ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కూడా పెట్రోల్, డిజీల్ రేట్లు మారలేదు.కాగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఎన్నికల ఆఫర్ త్వరలోనే ముగియనుంది వెంటనే మీ వాహనాల ట్యాంకులను ఫుల్ చేసుకోండి అంటూ ప్రజలకు హితవు పలికారు. నష్టాల్ని పూడ్చుకోవాల్సిందే పెట్రోల్, డిజీల్ అమ్మకాలు పెరగడానికి ఇంధన హోర్డింగ్ దోహదపడిందని హర్దీప్ సింగ్ పురి పార్లమెంట్లో తెలియజేశారు. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ప్రకారం, అంతర్జాతీయ ఇంధన ధరలు పెరిగిన తర్వాత నష్టాలను పూడ్చుకోవడానికి, అతిపెద్ద ఇంధన రిటైలర్ సంస్థలు భారీగా పెంచాల్సిన అవసరం ఉంది. ఇంధన ధరలు పెంపుకు రిటైలర్లు తగిన చర్యలు తీసుకుంటారని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ చెప్పారు. చదవండి: భారీ షాక్..! రూ. 17 వేలకు పైగా పెంచేసిన చమురు సంస్థలు..! టికెట్ ధరలకు రెక్కలే..! -
ఒకేరోజు డీజిల్పై రూ.75, పెట్రోల్పై రూ.50 పెంపు.. బతికేది ఎలా?
గత కొద్ది రోజులుగా ఉక్రెయిన్ - రష్యా మధ్య దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా చమరు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో, అనేక దేశాలు తమ దేశాలలో ఇంధన ధరలను అమాంతం పెంచేస్తున్నాయి. తాజాగా శ్రీలంకలోని చమురు విక్రయ సంస్థ లంక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఎల్ఐఓసీ) నేడు పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను భారీగా పెంచింది. ఎల్ఐఓసీ సంస్థ ఒక నెలలో ఇంధన ధరలను పెంచడం ఇది మూడవసారి. డీజిల్ రిటైల్ ధరను లీటరుకు రూ.75, పెట్రోల్పై లీటరుకు రూ.50 పెంచినట్లు ఎల్ఐఓసీ ప్రకటించింది. శ్రీలంక రూపాయి మారకం విలువ భారీగా పడిపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా సంస్థ పేర్కొంది. ఈ ధరల పెరుగుదలతో శ్రీలంకలో లీటరు పెట్రోల్ ధర రూ.254, డీజిల్ ధర రూ.214కు లభిస్తుంది. గత కొన్ని దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా ఆ దేశం ఆర్థిక సంక్షోభం చిక్కుకోవడంతో ఇంధన ధరలు మునుపెన్నడూ లేని విధంగా పెరిగాయి. శ్రీలంక రూపాయి ఏడు రోజుల వ్యవధిలో యుఎస్ డాలరుతో పోలిస్తే రూ.57 క్షీణించింది. ఆ ప్రభావం ఇప్పుడు నేరుగా చమురు, గ్యాసోలిన్ ఉత్పత్తుల మీద పడింది. దీంతో ఆ చమురు, గ్యాసోలిన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. "రష్యాను ఏకాకిని చేయడానికి, అమెరికాతో సహ ఇతర పాశ్చాత్య దేశాలు మాస్కో మీద అనేక ఆంక్షలు విధించడం వల్ల చమురు & గ్యాస్ ధరలు పెరుగుదలకు కారణం" అని ఎల్ఐఓసీ మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ గుప్తా తెలిపారు. శ్రీలంక ప్రభుత్వం నుంచి ఎల్ఐఓసీ ఎటువంటి సబ్సిడీని అందుకోదని.. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా దేశంలో ధరలు పెంచాల్సి వస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులలో చమురు, గ్యాస్ ధరలను పెంచడం తప్ప వేరే మార్గం లేదు అని మనోజ్ గుప్తా పేర్కొన్నారు. ధరలను భారీగా పెంచిన సంస్థకు నష్టాలు తప్పడం లేదు గుప్తా అన్నారు. ఎల్ఐఓసీకి ప్రధాన పోటీదారుడు సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ ఇప్పటివరకు ఎలాంటి ధరల పెంపును ప్రకటించకపోవడం విశేషం. (చదవండి: రైల్వే ప్రయాణీకులకు అదిరిపోయే శుభవార్త..!) -
పెట్రోల్ ధర రూ.12 అప్!
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరల సవరణను నిలిపివేయడంతో త్వరలో వీటి ధరలు భారీగా పెరగనున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నెల 16కల్లా పెట్రోల్ ధరను లీటర్కు రూ. 12కుపైగా పెంచితే ఇంధన రిటైల్ సంస్థలు లాభనష్టాలులేని స్థితి(బ్రేక్ఈవెన్)కి చేరుకుంటాయని బ్రోకరేజీ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తాజాగా అంచనా వేసింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ట్రాల ఎన్నికల కారణంగా నాలుగు నెలల నుంచీ ధరల సవరణ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఉక్రెయిన్పై రష్యా సైనిక దాడులకు దిగిన నేపథ్యంలో ముడిచమురు ధరలు మండుతున్నాయి. గురవారం ఒక దశలో అంతర్జాతీయ మార్కెట్లలో బ్యారల్ చమురు 120 డాలర్లను అధిగమించింది. ఇది తొమ్మిదేళ్ల గరిష్టంకాగా.. ప్రస్తుతం 110 డాలర్ల స్థాయికి దిగివచ్చింది. అయినప్పటికీ ఉత్పత్తి వ్యయం, రిటైల్ విక్రయ ధరల మధ్య వ్యత్యాసం భారీగా పెరిగింది. దేశీ ఎఫెక్ట్ విదేశీ మార్కెట్లలోని ముడిచమురు ధరలు దేశీయంగా ఇంధన రిటైల్ ధరలను ప్రభావితం చేస్తుంటాయి. ఇవే మనకు ప్రామాణికం కావడంతో ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. గత రెండు నెలలుగా వీటి ధరలు భారీగా పెరగడంతో లీటర్ పెట్రోల్పై రూ. 15.1 పెంచవలసిన అవసరమున్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఒక నివేదికలో అభిప్రాయపడింది. ఈ నెల 16కల్లా బ్రేక్ఈవెన్ సాధించాలంటే రూ. 12.1 పెంచవలసి ఉంటుందని తెలియజేసింది. తాజాగా ఇండియన్ క్రూడ్ బాస్కెట్ ధర బ్యారల్కు 117.39 డాలర్లకు చేరింది. పెట్రోలియం ప్రణాళిక, విశ్లేషణ యంత్రాంగం(పీపీఏసీ) వివరాల ప్రకారం 2012 తదుపరి ఇది అత్యధికంకాగా.. ధరల సవరణను నిలిపివేసిన గతేడాది నవంబర్లో 81.5 డాలర్లుగా నమోదైంది. అయితే అసెంబ్లీ ఎన్నికలు వచ్చే వారం ముగియనుండటంతో పెట్రోల్, డీజిల్ ధరల సవరణ తిరిగి ప్రారంభమయ్యే వీలున్నట్లు జేపీ మోర్గాన్ అంచనా వేసింది. నష్టాల మార్జిన్లు: గురువారాని(3)కల్లా ఆటో ఇంధన నికర మార్కెటింగ్ మార్జిన్ లీటర్కు మైనస్ రూ. 4.92గా నమోదవుతున్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ నివేదిక పేర్కొంది. ఈ బాటలో మార్చి 16కల్లా ఇది మైనస్ రూ. 10.1కు, ఏప్రిల్ 1కల్లా మైనస్ రూ. 12.6కు చేరగలదని అంచనా వేసింది. ఉక్రెయిన్ సరిహద్దులో రష్యా సైన్యాన్ని మొహరించడం ప్రారంభించిన గత నెల నుంచీ ముడిచమురు ధరలు ఊపందుకున్నట్లు తెలియజేసింది. దేశీ చమురు అవసరాల కోసం 85 శాతం దిగుమతులపైనే ఆధారపడటంతో అంతర్జాతీయ చమురు ధరలు ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంటాయి. నిజానికి పెట్రోల్, డీజిల్ ధరలను రోజువారీ సవరించవలసి ఉన్నప్పటికీ చమురు పీఎస్యూలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ఉత్తరాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కారణంగా వాయిదా వేస్తూ వచ్చాయి. లండన్ మార్కెట్లో ట్రేడయ్యే బ్రెంట్ చమురు బ్యారల్ 86.4 డాలర్ల వద్ద(అక్టోబర్ 26న) ఉన్నప్పుడు దేశీయంఆ పెట్రోల్ ధర లీటర్కు రూ. 110ను అధిగమించగా.. డీజిల్ రూ. 98.4ను తాకింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకావడం గమనార్హం! -
పెట్రోల్, డీజిల్ ధరలపై వార్ ఎఫెక్ట్.. భారీగా పెరిగిన ధరలు
కోలంబో: ఉక్రెయిన్-రష్యా సంక్షోభం క్రమంగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతోంది. యుద్దం ప్రారంభమైన రోజునే దీని ప్రభావం ముడి చమురు ఎగుమతులపై పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. ఈ క్రమంలో ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న శ్రీలంకకు రష్యా వార్ కూడా తీవ్ర సమస్యగా మారింది. రష్యా- ఉక్రెయిన్లో ఉద్రిక్తతల ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలపై పడింది. దీంతో శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. శ్రీలంకలోని చమురు సంస్థలు పెట్రోల్పై రూ. 20, డీజిల్ రూ. 15 లను ఒక్కసారిగా పెంచేశాయి. దీంతో అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 204కు చేరగా.. లీటర్ డీజిల్ ధర రూ. 139కి పెరిగింది. ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్ ధరలపై సామాన్యులపై మరింత భారం పడినట్టు అయ్యింది. ఇదిలా ఉండగా.. శ్రీలంక ప్రభుత్వ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో ఆ దేశంలో ఆహార, ఆర్థిక సంక్షోభం నెలకొంది. విదేశీ మారక నిల్వలను ఆదాచేసుకునే క్రమంలో దిగుమతులపై నిషేధం విధించింది. దీంతో నిత్యవసర వస్తువుల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. బ్లాక్ మార్కెట్లో బియ్యం, చక్కెర, ఉల్లిపాయలు సహా నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. వీటికి తోడు గతేడాది అక్టోబర్లో వంట గ్యాస్ ధర సిలిండర్ రూ. 2,657 కు చేరి రికార్డు సృష్టించింది. తాజాగా కరెంట్ కోతలు సైతం విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
బాబోయ్..మళ్లీ బండ బాదుడు!! రెట్టింపు కానున్న గ్యాస్ ధరలు!
రానున్న రోజుల్లో ఎల్పీజీ గ్యాస్ ధరలు మరింత పెరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పెట్రోలు, డీజిల్ ధరలు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ట స్థాయికి చేరుకోగా..త్వరలో పెరగనున్న వంటగ్యాస్ ధరలు సామాన్యుల పాలిట గుదిబండలా మారనున్నాయి. జాతీయ మీడియా కథనం ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్ నుండి వంట గ్యాస్ ధరలు భారీ ఎత్తున పెరగనున్నట్లు తెలుస్తోంది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లతో పాటు, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ), పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ), విద్యుత్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు జాతీయ మీడియా తన కథనాల్లో పేర్కొన్నాయి. సీఎన్జీ, విద్యుత్, ఇతర పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదల ప్రధాన కారణం పెరుగుతున్న రవాణా ఖర్చులు, నిర్వహణ ఖర్చులేనని తెలుస్తోంది. దీనికి తోడు రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం సామాన్యుల కష్టాలను మరింత పెంచుతుంది. పెరుగుతున్న గ్యాస్ ధరల ప్రభావం, కోవిడ్-19 మహమ్మారి నుండి పుంజుకుంటున్న దేశాల వృద్ధితో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన అవసరాల్ని తీర్చడంలో వైఫల్యం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం గ్యాస్, పెట్రోలియం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఏప్రిల్ నాటికి వంటగ్యాస్ ధరలను సవరిస్తే 2.9 డాలర్ల నుంచి 6 - 7 వరకు పెరిగే అవకాశం ఉండనుంది. చదవండి: మరో ప్రమాదం అంచున ఉక్రెయిన్, ఇది రష్యా పనేనా?! -
వాహనదారులకు షాకింగ్ న్యూస్..!
ఎన్నో అంచనాల మధ్య ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామణ్ బడ్జెట్-2022ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్ కొంతమందికి ఊరటను కల్పించిన మరికొందరికీ తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఇక ప్రతిపక్షాలు బడ్జెట్పై తీవ్ర విమర్శలను చేశాయి. బడ్జెట్లో పెట్రోల్, డిజీల్పై తీసుకున్న నిర్ణయం మరోసారి వాహనదారులకు షాక్ తగలనుంది. దీంతో పెట్రోల్, డిజీల్ ధరలు లీటర్కు రూ. 2 పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కారణం అదే..! పెంపు అప్పటి నుంచే..! ఇథనాల్ లేదా బయోడీజిల్ మిశ్రమం లేకుండా విక్రయించే పెట్రోలియం ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించాలనే ప్రతిపాదనను బడ్జెట్ 2022లో పొందుపరిచారు. దీంతో అన్బ్లెండెడ్ ఫ్యూయల్పై లీటరుకు రూ. 2 పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనతో చాలా ప్రాంతాల్లో 2022 అక్టోబర్ 1 నుంచి డీజిల్పై అదనపు బాదుడును కేంద్రం విధించనుంది. అయితే ఈశాన్య రాష్ట్రాలతో పాటుగా కొన్ని ప్రాంతాలలో పెట్రోలు ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఉద్గారాలను తగ్గించేందుకు..! మిక్స్డ్ పెట్రోల్, డీజిల్ను వాడడంతో తక్కువ స్థాయిలో ఉద్గారాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 2022-23 బడ్జెట్లో నాన్-బ్లెండెడ్ ఇంధనాలపై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 90 డాలర్లు దాటిన బ్యారెట్ క్రూడ్ ఆయిల్..! అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు రయ్మంటూ పెరిగిపోతున్నాయి. 2014 తరువాత బ్యారెల్ బ్రెంట్ ముడిచమురు ధర ఏకంగా 90 డాలర్లకు చేరుకుంది.ఏడేళ్ల గరిష్ట స్థాయికి బ్యారెల్ చమురు ధరల పెంపుకు పలు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులే కారణంగా ఉన్నాయి. ఐరోపా, మధ్యప్రాచ్యంలోని భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు చమురు మంటలకు ప్రధాన కారణంగా ఉన్నాయి. వీటితో పాటుగా డిమాండ్ కంటే చమురు సరఫరా తక్కువగా ఉంది. క్రూడ్ ఆయిల్ ధరలు 90 డాలర్లకు చేరిన భారత్లో ఇప్పటివరకు ఇంధన ధరల్లో మార్పు రాకపోవడం విశేషం. చదవండి: తలనొప్పిగా మారనున్న రష్యా-ఉక్రెయిన్ టెన్షన్..! ఇంధన ధరలు రయ్ అంటూ..! -
రాజకీయ ఇంధనం!
పెట్రోల్... డీజిల్... పాలకుల పుణ్యమా అని సెంచరీ దాటేసిన వీటి రిటైల్ రేట్లపై చర్చ ఇప్పుడప్పుడే ఆగేలా లేదు. అక్టోబర్ 30న వివిధ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలలో వీచిన ఎదురుగాలి ఫలితమో ఏమో బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం పెట్రో రేట్లను రవ్వంత తగ్గించాల్సి వచ్చింది. దీపావళి కానుకగా వచ్చిన ఆ ఊరడింపు ప్రకటనతో ఇప్పుడు రాష్ట్రాలూ తమ వంతు పన్నులను తగ్గించాలన్నది డిమాండ్ పైకొచ్చింది. అసెంబ్లీ ఎన్నికలు రానున్న పంజాబ్, ఉత్తరప్రదేశ్, గోవా సహా పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు సహజంగానే తమ వంతుగా వ్యాట్ను కొంత తగ్గించాయి. కానీ, ఇప్పటికే కేంద్రం నుంచి నిధుల విషయంలో ఇబ్బందులు పడుతున్నామని భావిస్తున్న ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు ఈ కరోనా వేళ అందుకు నిరాకరించాయి. కేంద్రమే మరింత తగ్గించాలన్నాయి. కేంద్రం ఇష్టానికి పెంచుకుంటూ పోయిన రేట్లు ఇప్పుడు రాజకీయ అవసరాల క్రీడగా మారడమే విచారకరం. ప్రాథమిక చమురు ధరకు కేంద్ర ఎక్సైజ్ సుంకం, డీలర్ కమిషన్, వ్యాట్ను కలిపితే వచ్చేది – పెట్రోల్ బంకుల్లో అమ్మే రిటైల్ ధర. అంతర్జాతీయ ముడి చమురు ధరలను బట్టి దేశీయంగా పెట్రోల్ రిటైల్ రేటు పెరగడం అర్థం చేసుకోవచ్చు. కానీ, అంతర్జాతీయ మార్పులతో సంబంధం లేకుండా, ఇక్కడ పాలకులు ఎప్పటికప్పుడు అధిక సుంకాలు విధించుకుంటూ పోవడం సరైనది కాదు. గత ఏడాది క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోయినా సరే కేంద్రం లీటరు పెట్రోలుపై రూ. 13, డీజిల్పై రూ. 16 వంతున ఎక్సైజ్ బాదుడు బాదింది. కరోనా ముందునాళ్ళతో పోలిస్తే, ఇప్పుడు పెట్రో రేట్లు కొండెక్కి కూర్చోవడానికి అలాంటి నిర్ణయాలే కారణం. అలా ధరలను కొండంత పెంచిన కేంద్రం ఏ ప్రయోజనాల కోసమైతేనేం ఇప్పుడు ఎక్సైజ్ సుంకాన్ని గోరంత తగ్గించింది. పెట్రోలుపై రూ. 5, డీజిల్పై రూ. 10 మేరకైనా కేంద్రం తగ్గింపునివ్వడం ఆహ్వానించ దగినదే. అయితే, దాని వల్ల లభించిన ఊరట స్వల్పమే. పెట్రోలియమ్ ప్లానింగ్ అండ్ ఎనాలసిస్ సెల్ డేటా ప్రకారం పెట్రోలియమ్ రంగంపై వివిధ రకాల పన్నుల ద్వారా కేంద్రానికి 2014–15లో రూ. 1.72 లక్షల కోట్లు వస్తే, ఇప్పుడది ఏకంగా రూ. 3.35 లక్షల కోట్లకు చేరింది. అందులో రాష్ట్రాలకు దక్కేది రూ. 19,475 కోట్లే. అంటే, 5.8 శాతమే. ఒకవైపున అంతర్జాతీయ సగటు క్రూడ్ ఆయిల్ ధరలు గణనీయంగా తగ్గినా సరే, సామాన్యుడు కొనే పెట్రోల్, డీజిల్ రేట్లు చుక్కలనంటాయి. 2019 మేలో లీటరు పెట్రోల్ రూ. 76.89, డీజిల్ రూ. 71.50 ఉండేవి. పాలకుల పుణ్యమా అని రెండున్నరేళ్ళలో ఈ ఏడాది నవంబర్ 1 నాటికి పెట్రోల్ రూ. 115.99, డిజీల్ రూ. 108.66కు సర్రున పెరిగాయి. ఇది కళ్ళెదుటి నిజం. గడచిన రెండేళ్ళలో పెట్రోలు, డీజిల్ రేట్లపై విధించే ఎక్సైజ్ సుంకం రూపురేఖలనే కేంద్ర సర్కారు మార్చేసింది. నిజానికి, ఇంధనంపై కేంద్రం వసూలు చేసే పన్నుల్లో 41 శాతం వాటాను రాష్ట్రాలకు పంచవలసి ఉంటుంది. కానీ, కేంద్రం తెలివిగా పెరిగిన పెట్రో ఆదాయం డివిజబుల్ పూల్లోకి రాకుండా, సెస్లు, సర్ఛార్జీల రూపంలోనే రూ. 2,87,500 కోట్లు వసూలు చేసింది. అలా వచ్చినదాన్ని రాష్ట్రాలకు ఇచ్చే పని లేకుండా, తన దగ్గరే ఉండిపోయేలా కేంద్రం ఎత్తు వేసింది. న్యాయబద్ధంగా తమకు రావాల్సిన వాటాకు కేంద్రం ఇలా గండి కొట్టడంతో, రాష్ట్రాలు గతంలో సాక్షాత్తూ 15వ ఆర్థిక సంఘానికి ఫిర్యాదు కూడా చేశాయి. యథేచ్ఛగా సెస్ పెంచిన కేంద్రం తీరా ఇప్పుడు రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలనే వాదనను స్వపక్షీయుల నోట అనిపిస్తోంది. అసలే కరోనా దెబ్బతో ఆదాయాలు పోయి, దేశవ్యాప్తంగా రాష్ట్రాలన్నీ కునారిల్లాయి. ఈ పరిస్థితుల్లో పెట్రోల్ రేట్లలోనూ రాష్ట్రాలే తగ్గింపు ఇవ్వాలని కోరితే, రాష్ట్రాలు మాత్రం ఎక్కడకు పోతాయి? ఏం చేస్తాయి? ఆ మాటకొస్తే ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్ను, కేంద్ర జీఎస్టీల వల్ల వచ్చే ఆదాయం కన్నా చమురుపై ఎక్సైజ్ సుంకంతో కేంద్రానికి వచ్చేది తక్కువ. కానీ, ప్రభుత్వం నడపడానికి ఈ చమురుపై వచ్చే ఆదాయమే అత్యంత కీలకమన్నట్టు కేంద్ర పాలకులు మాట్లాడడం ఎంతవరకు అర్థవంతం? ఏమైనా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా పన్నులను సమర్థించుకోవడం వల్ల అంతిమ భారం వినియోగదారుడి మీదే పడుతోంది. దేశంలో అమ్ముడయ్యే ప్రైవేట్ ప్యాసింజర్ వాహనాల్లో నూటికి 80కి పైగా ప్రారంభ స్థాయి ద్విచక్ర వాహనాలే. పెట్రో ధరలపై కేంద్రం అనుసరిస్తున్న ప్రస్తుత విధానాలతో ఏకంగా ఈ సామాన్యుల ఇంటి బడ్జెట్లే తలకిందులు అవుతున్నాయి. అంటే, అటు ఆర్థికవ్యవస్థ పరంగా కానీ, ఇటు ప్రజా సంక్షేమ రీత్యా కానీ పెట్రోల్పై కేంద్ర సర్కారు వారి పన్ను విధానం లోపాలపుట్టే. ఇకనైనా, పెట్రో రేట్ల వ్యవహారాన్ని రాజకీయ విన్యాసంగా మార్చకుండా, పాలకులు సరైన నిర్ణయం తీసుకోవాలి. రాబడిలో న్యాయమైన వాటాపై కేంద్రం, రాష్ట్రాలు ఒక అంగీకారానికి వచ్చి, పెట్రోల్పై అధిక పన్నులు తగ్గించాలి. సామాన్యులకు మేలు చేయాలి. పెట్రో రంగంపై బాదుడుతో ఆదాయాన్ని పెంచుకొనే ప్రయాస మానేసి, దశాబ్దకాలంగా పడిపోతున్న ప్రత్యక్ష పన్నుల ఆదాయాన్ని పెంచుకోవడంపై కేంద్రం దృష్టి పెట్టడం అత్యవసరం. మరోపక్క జీఎస్టీ మెరుగ్గా అమలయ్యేలా, మరింత ఆదాయం వచ్చేలా చూసుకోవాలి. ఇలాంటి అసలైన ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తేనే, ఈ పెట్రో మంటలు తగ్గుతాయి. అలా కాకుండా, తామే ధరలు పెంచేసి, ఆ పైన పదో, పరకో తగ్గించాం లెమ్మంటే అది అక్షరాలా పిర్ర గిల్లి జోల పాడడమే! -
పెట్రో మంటలు..! 10 నెలల్లో రూ.26కు పైగా పెరుగుదల
సాక్షి, హైదరాబాద్: పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడి జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. హైదరాబాద్లో నెల రోజుల్లో లీటర్కు రూ.8కి పైగా పెరుగుదల చోటు చేసుకుంది. ఈ విధంగా చమురు ధరలు పెరగడం అన్ని వర్గాల ప్రజలపై తీవ్ర ప్రభావం చూపి స్తోంది. వాహనదారులకు చుక్కలు కనబడుతుంటే.. నానాటికీ పెరుగుతున్న డీజిల్ ధరలు పరోక్షంగా నిత్యావసరా ల రేట్లు పెరిగేందుకు దోహదపడుతున్నా యి. సరుకు రవాణా చార్జీలు 10% నుంచి 15% వరకు పెరగడంతో నూనెలు, పప్పులు, కూరగాయల వంటి నిత్యావసరాలతో పాటు అన్నిరకాల వస్తువుల ధరలూ పెరిగిపోతున్నాయి. 15 రోజులకు బదులు రోజూ.. మే 2017 వరకు ప్రతి 15 రోజులకు పెట్రో ధరలను సవరించేవారు. అయితే కేంద్రం ప్రవేశపెట్టిన నూతన విధానం (అంతర్జాతీయ సర్దుబాట్లు పేరిట) నేపథ్యంలో ఆ ఏడాది జూన్ నుంచి ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు ధరలను సవరించడం మొదలుపెట్టారు. 2019 చివరి వరకు కొంత అటు ఇటుగా స్థిరంగా ఉన్న ఇంధన ధరలు 2020 నుంచి హెచ్చు తగ్గులకు లోనవడం ప్రారంభం అయ్యింది. ఇక 2021 జనవరి నుంచి మొత్తం మీద పెరుగుదలే కొనసాగింది. ఈ ఏడాది జనవరి 1న హైదరాబాద్లో రూ.87.06 గా ఉన్న లీటర్ పెట్రోల్ ధర నవంబర్1 వ తేదీ నాటికి రూ.114.12కు పెరిగింది. అదే సమయంలో లీటర్ డీజిల్ రూ. 80.60 నుంచి రూ.107.40కి చేరింది. అంటే రెండిటి ధరల్లో పది నెలల్లో రూ.26కు పైగా పెరుగుదల చోటు చేసుకుందన్నమాట. సెంచరీ దాటి దూసుకుపోతూ.. కరోనా కష్ట కాలంలో ఈ ఏడాది మొదటి రెండు నెలల్లోనే లీటర్ పెట్రోల్ పై రూ. 8.32 పైసలు, డీజిల్పై 9. 51 పైసలు పెరిగాయి. తర్వాత రెండు నెలలు లీటర్ పెట్రోల్పై 75 పైసలు, డీజిల్పై రూ.92 పైసలు మేరకు తగ్గాయి. ఆ తర్వాత వరసగా పెరుగుతూనే వచ్చాయి. జూన్లో లీటర్ పెట్రోల్ వంద రూపాయల మార్కును దాటగా... డీజిల్ అక్టోబర్ నెలలో సెంచరీ కొట్టింది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకు సగటు డీజిల్ వినియోగం 25 కోట్ల లీటర్ల మేర ఉంటోంది. ఈ లెక్కన నెలకు వినియోగదారులపై రూ. వందల కోట్ల భారం పడుతోంది. జనవరి నుంచి 10 నెలల్లో వేల కోట్ల భారం పడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. రూ.200కు చేరువలో వంట నూనెలు పెరుగుతున్న చమురు ధరలు నిత్యావసరాల ధరలపై పెను ప్రభావం చూపుతున్నాయి. పాలు, పెరుగు, బియ్యం, కూరగాయలు, పండ్లు, నూనెలు, పప్పుల ధరలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే వంట నూనెల ధరలు లీటర్కు రూ.200 మార్కుకు దగ్గరగా ఉన్నాయి. అనేక పప్పుల ధరలు కిలో రూ.150కి పైగానే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇక కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఉల్లిగడ్డ, టమాట, బెండకాయ, వంకాయ వంటి కూరగాయల ధరలు కిలోకు రూ. 60 నుంచి రూ. 80 వరకు పలుకుతున్నాయి. ప్రతి కిరాణ వస్తువు మీద కిలోకు రూ. 1 నుంచి రూ. 2 వరకు వరకు ధరలను పెంచినట్లు హైదరాబాద్ కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. అలాగే సరకు రవాణా చార్జీలను 10 శాతం నుంచి 15 శాతం వరకు పెంచారని, అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో నిత్యావసరాల ధరలు పెంచాల్సి వస్తోందని చెప్పారు. రవాణా చార్జీలు పెరగడంతో నిత్యావసరాలతో పాటు ఇతర అన్నిరకాల వస్తువుల ధరలూ పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. రవాణా శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1.40 కోట్ల వాహనాలు ఉండగా... అందులో సరుకు రవాణా వాహనాల సంఖ్య 3.73 లక్షలు. ఇక ఇతర రాష్ట్రాల నుంచి నిత్యావసరాలు, ఇతర సరుకులు, వస్తువులు, సామగ్రి తెచ్చే వేలసంఖ్యలో ఉంటాయి. ఈ నేపథ్యంలోనే పెరిగిన డీజిల్ ధరల ప్రభావం అన్ని రకాల సరుకులపై పడుతోంది వాహన ప్రయాణం భారం రాష్ట్రంలోని 1.40 కోట్ల వాహనాలలో మెజారిటీ వాటా ద్విచక్ర వాహనాలదే. టూ వీలర్ల ద్వారానే ప్రతిరోజు కోటి లీటర్లకు పైగా పెట్రోల్ వినియోగం అవుతోంది. జనవరి నుంచి ఇప్పటివరకు ఒక్క లీటర్పైనే రూ.26కు పైగా పెరిగిందంటే 11 నెలల కాలంలో ఎంత మేర భారం పడిందో అర్థం చేసుకోవచ్చు. పెరిగిన ధరలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు వాహనాలపై వెళ్లడానికే భయపడే పరిస్థితి నెలకొంది. జీఎస్టీనే పరిష్కారమైనా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులే పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా మారుతున్నాయి. పెట్రోలియం సంస్థలు ధరలను పెంచుతుండగా, ఆ మొత్తానికి అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులను సవరిస్తున్నాయి. కేంద్రం పెట్రోల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీ పేరిట ఏకంగా రూ.39.27 మేర పన్నుల భారం వేస్తుండగా, రాష్ట్రం వ్యాట్ రూపేణా మరో రూ.26.29 వసూలు చేస్తోంది. ఈ పన్నుల కారణంగానే ధరలు అమాంతంగా పెరుగుతున్నాయనే విమర్శలున్నాయి. ప్రస్తుతం రాష్ట్రానికి ఏడాదికి పెట్రోల్, డీజిల్లపై వ్యాట్ రూపేణా సుమారు రూ.8 వేల కోట్ల మేర ఆదాయం వస్తోంది. రెండు నెలలుగా భారీగా పెరుగుతున్న చమురు ధరలతో రాష్ట్ర ఆదాయం కూడా పెరిగింది. కొన్ని రాష్ట్రాలు తమ పన్నుల వాటాను తగ్గించుకున్నా, మన రాష్ట్రం మాత్రం పన్నులను తగ్గించలేదు. ఈ నేపథ్యంలో చమురు ధరలు దిగిరావాలంటే వాటిని జీఎస్టీ పరిధిలోకి తేవడమే పరిష్కారమని చెబుతున్నా... చమురు, మద్యంపై హక్కును వదులుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. 2021 జనవరి నుంచి ప్రతి నెల ఒకటో తేదీన హైదరాబాద్లో ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు (లీటర్కు) ఇలా.. –––––––––––––––– నెల పెట్రోల్ డీజిల్ –––––––––––––––––––––––– నవంబర్ 114.12 107.40 అక్టోబర్ 106.00 98.39 సెప్టెంబర్ 105.40 96.84 ఆగస్టు 105.83 97.96 జూలై 102.69 97.20 జూన్ 98,20 93.08 మే 93.99 88.05 ఏప్రిల్ 94.16 88.20 మార్చి 94.79 88.86 ఫిబ్రవరి 89.77 83.46 జనవరి 87.06 80.60 – రాష్ట్రంలో పెట్రోల్ వినియోగం నెలకు సగటున: 15 కోట్ల లీటర్లు – జనవరితో పోలిస్తే నవంబర్ నాటికి వినియోగదారులపై పడిన భారం సుమారుగా రూ.405.9 కోట్లు – సగటు డీజిల్ వినియోగం : 25 కోట్ల లీటర్లు – వినియోగదారులపై పడిన భారం రూ.676.5 కోట్లు అన్ని వర్గాలపై ప్రభావం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెరుగుతున్న చమురు ఉత్పత్తుల ధరలు అన్ని వర్గాల ప్రజలపై ప్రభావం చూపుతున్నాయి. డీజిల్ ధరలు ఎన్నడూ లేనంతగా పెరగడంతో సరుకు రవాణా చార్జీలు ఆకాశన్నంటాయి. దీంతో నిత్యావసర వస్తువులు ధరలన్నీ పెరిగాయి. – డి.పాపారావు, ఆర్థికరంగ నిపుణుడు -
ఇంధన ధరలు తగ్గేదే లే.! అక్కడ పెట్రోల్ రూ. 121 దాటేసింది..!
Petrol Diesel Prices Rise To New High On Oct 31: ఆకాశమే హద్దుగా ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఆయిల్ మార్కెట్ కంపెనీలు ఇంధన ధరలను మరోసారి పెంచాయి. దీంతో దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 36 పైసలు, డీజిల్పై 39 పైసలు మేర పెరిగింది. ఆదివారం (అక్టోబర్ 31, 2021) పెట్రోల్, డీజిల్పై పెంపుదల కనిపిస్తోంది. ►తాజా పెరుగుదలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.109.34పైసలు, లీటర్ డీజిల్ ధర రూ.98.07పైసలు వద్ద కొనసాగుతోంది. ►వాణిజ్య రాజధాని ముంబైలో లీటర్ ధర రూ.115.15పై., డీజిల్ రూ.106.23కు చేరింది. ►కోలకత్తాలో పెట్రోలో రూ.109.79పైసలు, డీజిల్ రూ.101.19పైసలకు చేరాయి. ►హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.113.72కి చేరింది. డీజిల్ రూ.106.98 వద్ద కొనసాగుతోంది. ►విజయవాడలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ.115.28 , రూ.107.94 గా ఉన్నాయి. ►చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.106.04, డీజిల్ రూ.102.25 గా ఉన్నాయి. ఆయా రాష్ట్రాలోని ట్యాక్స్ల ఆధారంగా ఇంధన ధరల్లో స్వల్ప మార్పులు ఉండనున్నాయి. దేశంలోని అంతర్గత ప్రాంతాల్లో ఇంధన ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మధ్యప్రదేశ్ సరిహద్దు జిల్లాలో, పెట్రోల్ ధరలు ఇప్పటికే రూ.121 మార్కును దాటేశాయి. -
తగ్గేదేలే...హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర ఎంతంటే..?
-
అయిదో రోజూ పెట్రో మంట
న్యూఢిల్లీ: దేశంలో పెట్రో ధరలు వరుసగా అయిదో రోజు కూడా పెరిగాయి. ఆదివారం లీటరుపై పెట్రోల్, డీజిల్ ధరలు 35 పైసల చొప్పున పెరిగినట్లు ప్రభుత్వం రంగ ఇంధన సంస్థలు ప్రకటించాయి. తాజా పెంపుతో, లీటరు పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.107.59కు, ముంబైలో రూ. 113.46కు చేరిందని తెలిపాయి. అదేవిధంగా లీటరు డీజిల్ ధర ముంబైలో రూ.104.38కి, ఢిల్లీలో రూ.96.32కు చేరింది. కాగా, పెట్రో ధరల పెంపుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తనదైన శైలిలో స్పందించారు. ఈ పెరుగుదలను ప్రభుత్వం పాల్పడుతున్న పన్ను దోపిడీగా ఆయన పేర్కొన్నారు. దేశంలో ఎక్కడైనా ఎన్నికలు జరిగితే కొంతయినా ఉపశమనం లభిస్తుందేమోనని వ్యాఖ్యానించారు. ప్రజలను ఇబ్బందుల పాలు చేయడంలో మోదీ ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు. దేశంలో తీవ్రస్థాయికి చేరిన నిరుద్యోగం, ప్రభుత్వ ఆస్తుల విక్రయాలు, పెట్రోల్ ధరల పెంపులో మోదీ ప్రభుత్వం రికార్డులు సాధించిందన్నారు. -
Petrol Diesel Prices: వరుసగా ఐదో రోజు కూడా బాదుడే...!
ఆకాశమే హద్దుగా ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వరుసగా ఐదో రోజు కూడా ఇంధన ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరుగడంతో..దేశ వ్యాప్తంగా మరోమారు పెట్రోలు, డిజీల్ ధరలు పెరిగాయి. చదవండి: అదరగొట్టిన టీవీఎస్ మోటార్స్..! వరుసగా ఐదవ రోజూ ఆదివారం (అక్టోబర్ 24, 2021) 35 పైసలు పెంపుదల పెట్రోల్, డీజిల్పై కనిపిస్తోంది. తాజా పెరుగుదలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.107.59పైసలు, లీటర్ డీజిల్ ధర రూ.96.32పైసలు వద్ద కొనసాగుతోంది. వాణిజ్య రాజధాని ముంబైలో లీటర్ ధర రూ.113.46పై., డీజిల్ రూ.104.38కు చేరింది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.111.91కి చేరింది. డీజిల్ రూ.105.08 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ.113.52, రూ.106.11 గా ఉన్నాయి. బెంగళూరులో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ.111.34, రూ.102.23 కు చేరింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.104.52, డీజిల్ రూ.100.59. ఆయా రాష్ట్రాలోని ట్యాక్స్ల ఆధారంగా ఇంధన ధరల్లో మార్పులు ఉండనున్నాయి. గతంలో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధరలూ 19 డాలర్లకు తగ్గడంతో ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధరలు సుమారు 85 డాలర్లకు చేరుకుంది. చదవండి: 12 గంటలపాటు నిలిచిపోనున్న ఆదాయపు పన్ను వెబ్సైట్! ఎప్పుడంటే.. -
ఉచిత వ్యాక్సినేషన్ వల్లనే పెట్రో మంట!
న్యూఢిల్లీ: దేశంలో కరోనాటీకా ఉచితంగా ఇస్తున్నందునే పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయని పెట్రోలియం, సహజవాయు శాఖా సహాయ మంత్రి రామేశ్వర్ తెలి వ్యాఖ్యానించారు. ఒక లీటర్ పెట్రోలు కన్నా ఒకలీటర్ హిమాలయన్ నీటి ధర అధికమన్నారు. పెట్రోల్ అంత ఖరీదేమీ కాదని, కేంద్ర, రాష్ట్రాలు పన్నులు విధించడం వల్ల ఖరీదైందని చెప్పారు. ప్రజలందరికీ కరోనా టీకా ఉచితంగా ఇస్తున్నారని, ఇందుకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. ప్రభుత్వాలు విధించే పన్నులతోనే టీకాలు కొంటున్నామన్నారు. 130 కోట్ల మందికి ఉచితంగా టీకాలివ్వాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని, ఒక్కో టీకా సుమారు రూ.1,200 అవుతుందని గుర్తు చేశారు. లీటరు పెట్రోలు ఖరీదు సుమారు రూ. 40 ఉండొచ్చని, దీనిపై వ్యాట్ తదితర పన్నులు వేస్తారని వివరించారు. ఒక లీటర్ హిమాలయన్ బాటిల్ ఖరీదు రూ.100 ఉంటోందని గుర్తు చేశారు. అంతేకాకుండా క్రూడాయిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్ను బట్టి మారుతుంటాయని తెలిపారు. చమురు ధరలను తమ శాఖ నిర్ణయించదని, అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశీయ ధరలు మారేలా గతంలో వాణిజ్య శాఖ నిర్ణయం తీసుకుం దని చెప్పారు. రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలని, కానీ విపక్షపాలిత రాష్ట్రాలు పన్ను తగ్గించకుండా తమపై నింద మోపాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఇటీవలే తమ శాఖ నిధులను ఆరోగ్య శాఖకు కోవిడ్ కోసం మరలించామన్నారు. -
ఆగని పెట్రో బాదుడు: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
దేశంలో పెట్రో బాదుడు కొనసాగుతుంది. బుధవారం దేశ వ్యాప్తంగా లీటర్ పెట్రోల్పై 31 పైసలు, డీజిల్పై 38 పైసలు పెరిగాయి. అదే సమయంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.15 పెంచడం సామాన్యులకు మోయలేని పెనుభారంగా మారింది. దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.08 ఉండగా డీజిల్ ధర రూ.99.75గా ఉంది. వైజాగ్లో పెట్రోల్ ధర రూ.107.95 ఉండగా లీటర్ డీజిల్ ధర రూ.100.1 ఉంది. ముంబైలో పెట్రోల్ ధర రూ. 108.93 ఉండగా లీటర్ డీజిల్ ధర రూ.99.14 ఉంది. కోల్కతాలో పెట్రోల్ ధర రూ.103.61 ఉండగా లీటర్ డీజిల్ ధర రూ.94.49 ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ.100.46 ఉండగా లీటర్ డీజిల్ రూ.95.90 ఉంది. -
ఇంధన ధరల పెంపుపై 9 నెలల్లో కేంద్రం చెప్పిన 9 కారణాలు..!
ఆకాశమే హద్దుగా ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి పెను భారంగా మారుతున్నాయి. కొన్ని రోజులపాటు నిలకడగా ఉన్న ఇంధన ధరలు వరుసగా మూడో రోజు శనివారం దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ క్రూడ్ ఆయిల్ ధరలు గణనీయంగా పెరగడంతో చమురు కంపెనీలు డీజిల్ ధరల్ని ఊహించని విధంగా పదిరోజుల వ్యవధిలో ఆరుసార్లు పెంచాయి. ఇంధన ధరలు పెరగడానికి కేంద్రం పలు కారణాలను చెప్తూ వస్తోంది. చదవండి: ఆనంద్ మహీంద్రా, రాకేశ్ జున్జున్వాలా..అతని తర్వాతే..! తొమ్మిది నెలల్లో కేంద్రం చెప్పిన కారణాలు ఇవే...! 1. ఈ పాపమంతా గత కాంగ్రెస్ ప్రభుత్వానిదే (2021 ఫిబ్రవరి 18) ప్రధానమంతి నరేంద్ర మోదీ ఇంధన ధరల పెంపుపై‘ గత ప్రభుత్వాలు ఇంధన దిగుమతులపై భారత్ ఆధారపడటాన్ని తగ్గించడంపై దృష్టి పెడితే, మధ్యతరగతి వారికి ఇంధన ధరలు అంత భారం ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. 2. ఇంధన ధరలు పెరుగుదల ‘ధర్మ సంకటమే’..: ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(2021 ఫిబ్రవరి 20) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇంధన ధరల పెరుగుదల' ధర్మసంకట్ ' పరిస్థితి అన్నారు. తుది ధర లేదా ఇంధన రిటైల్ ధర సహేతుకమైన స్థాయిలో ఉండేలా కేంద్రం, రాష్ట్రాలు ఒక మార్గాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు. 3. ధర్మేంద్ర ప్రధాన్ ఇంధన ధరల పెంపు వెనుక అంతర్జాతీయ మార్కెట్ల వాదన (2021 ఫిబ్రవరి 22) మాజీ కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, "అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా, రిటైల్ ఇంధన ధరలు పెరిగాయన్నారు. కోవిడ్-19 కారణంగా ముడిచమురు ఉత్పత్తి నెమ్మదించడంతో సరఫరా తగ్గిందన్నారు. 4. ఇంధన ధరలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నుపై వెనుకడుగు: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (2021 మార్చి 5) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పన్నులను తగ్గిస్తే ఇంధన ధరలు అదుపులోకి వస్తాయన్నారు. అప్పుడు సామాన్యులపై భారం తగ్గుతుందని మీడియా సమావేశంలో వెల్లడించారు. 5. సంక్షేమ పథకాలు, టీకాల కోసం ధరల పెంపు: మాజీ పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (జూన్ 14, 2021) అధిక ఇంధన ధరలు సాధారణ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాయని అంగీకరిస్తూ, మాజీ పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, "ఇంధన ధరలు వినియోగదారులను చిదిమేస్తున్నాయని నేను అంగీకరిస్తున్నాను. అయితే కోవిడ్ టీకాల కోసం ఒక ఏడాదిలో రూ. 35,000 కోట్లు ఖర్చు అవుతోంది.ఇటీవల, ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద పేదలకు ఉచిత ఆహార ధాన్యాలను అందించడానికి ప్రధాన మంత్రి లక్ష కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు ప్రకటించారు. 6.కాంగ్రెసే కారణం..!: ధర్మేంద్ర ప్రధాన్(2021 జూలై 3) అప్పటి కేంద్ర పెట్రోలియం , సహజవాయువు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవలి ఇంధన ధరల పెంపును కాంగ్రెస్ పాలనతో ముడిపెట్టారు. ఆర్థికవేత్తలను ఉటంకిస్తూనే...అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కోట్ల విలువైన చమురు బాండ్లను వదిలిపెట్టిందని, అందుకే ప్రస్తుత భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం వాటికి వడ్డీ , ప్రధాన ధరలను రెండింటినీ చెల్లిస్తోందని పేర్కొన్నారు. 7. మౌలిక సదుపాయాలను నిర్మించడం కోసం ఎక్సైజ్ డ్యూటీ పెంపు అనివార్యం: ఆర్థికమంత్రిత్వ శాఖ(2021 జూలై 20) రాజ్యసభలో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు ఆర్థికమంత్రిత్వ శాఖ సహయమంత్రి పకజ్ చౌదరీ సమాధానమిస్తూ...దేశంలో మౌలిక సదుపాయాలను నిర్మించడం కోసం ఇంధనంపై ఎక్సైజ్ డ్యూటీ పెంపు అనివార్యమైందని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పన్నులు పెంచాల్సి వస్తుందన్నారు. 8.పెట్రోల్, డీజిల్పై అధిక పన్నులను కేంద్రం సమర్థిస్తోంది: పెట్రోలియం , సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పురి(2021 జూలై 26) ప్రతిపక్షాలు లోక్ సభలో అడిగిన ప్రశ్నకు పెట్రోలియం, సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పురి సమాధానమిస్తూ.. పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని (పెట్రోలియం ఉత్పత్తులపై) వివిధ అభివృద్ధి పథకాలలో ఉపయోగించబడుతుందని, మహమ్మారి సమయంలో పేదలకు ఉపశమనం అందించడానికి ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన వంటి పథకాల కింద 80 కోట్ల మంది లబ్ధిదారులకు ఉచిత రేషన్ అందిస్తున్నామని తెలిపారు. 9. యూపీఎ ప్రభుత్వం చేసిన తప్పులకు మోదీ 2.0 చెల్లిస్తోంది: నిర్మలా సీతారామన్(2021 ఆగస్టు 16) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ.."గత యూపీఎ ప్రభుత్వం చేసిన ఆయిల్ బాండ్లకు పన్నులను చెల్లించే భారం లేకపోతే, పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకం తగ్గించే పరిస్థితి ఉండేదని అభిప్రాయపడ్డారు. చదవండి: అతి తక్కువ ధరలోనే..భారత మార్కెట్లలోకి అమెరికన్ బ్రాండ్ టీవీలు.. -
మరోసారి పెరిగిన పెట్రో ధరలు..ఎంతంటే?
శుక్రవారం రోజు దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. దేశీయ చమురు క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే సహజ వాయువు ధరను కేంద్రం భారీగా 62 శాతం పెంచింది. సహజ వాయువు ధరలు పెరగడంతో ఆ ప్రభావం చమురు ధరలపై పడింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు మూడు సంవత్సరాల గరిష్టస్థాయికి చేరుకోవడంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రో ధరల వ్యత్యాసంలో మార్పులు చోటు చేసుకున్నాయి. దేశంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు ► ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధరపై 25 పైసలు పెరిగి రూ.101.89కి చేరింది, డీజిల్ ధర లీటరుపై 30 పైసలు పెరిగి రూ.89.87 ఉంది ► ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.95 ఉండగా డీజిల్ ధర రూ. 97.84 ఉంది ► హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 26 పైసలు పెరిగి రూ.106కి చేరింది, లీటర్ డీజిల్ ధర 33 పైసలు పెరిగి రూ.99.08 ఉంది ► విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.1.06కి పెరిగి రూ.108.67కి చేరింది, లీటర్ డీజిల్ ధర రూ.1.06 పెరిగి రూ.100.39కు ఉంది ► వైజాగ్లో లీటర్ పెట్రోల్ ధరపై 0.82పైసలు పెరిగి రూ.107.51కు చేరింది. లీటర్ డీజిల్ ధర రూ.99.28 ఉంది. -
స్వల్పంగా పెరిగిన పెట్రో ధరలు
దేశంలో మరోసారి పెట్రో ధరలు స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ల కారణంగా చమురు ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు స్థిరంగా ఉన్నా డీజిల్ ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర స్థిరంగా రూ.105.27 ఉండగా..డీజిల్ ధర 26 పైసలు పెరిగి రూ.97.17కు చేరింది. వైజాగ్లో లీటర్ పెట్రోల్ ధర రూ.106.23 ఉండగా.. డీజిల్ ధర 25 పైసలు పెరిగి రూ.97.65కు చేరింది. గుంటూరులో పెట్రోల్ ధర లీటర్ రూ.107.5 వద్ద స్థిరంగా ఉండగా.. డీజిల్ లీటర్పై 25 పైసలు పెరిగి రూ.98.88 వద్దకు చేరింది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.27 ఉండగా లీటర్ డీజిల్ ధర 25 పైసలు పెరిగి రూ. 96.65కి చేరింది. కోల్కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.64గా ఉండగా డీజిల్ 23 పైసలు పెరిగి రూ. 92.14కు చేరింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.98.97 ఉండగా.. లీటర్ డీజిల్ 22 పైసలు పెరిగి రూ. 93.45కు చేరింది. -
తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంత తగ్గిందంటే..
పెరిగిన వంట గ్యాస్ ధరలు సామాన్యులకు గుదిబండగా మారిన తాజాగా స్వల్పంగా తగ్గిన చమురు ధరలు కాస్త ఊరటనిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా వారం రోజులుగా స్టేబుల్గా ఉన్న పెట్రోల్ ధర ఈరోజు 10 నుంచి 15 పైసలు వరకు తగ్గింది. డీజిల్ ధర సైతం 14 నుంచి 15పైసలు తగ్గింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెట్రో ధరలు ►ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ.101.34 ఉండగా డీజిల్ రూ.88.77గా ఉంది. ►ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39 ఉండగా డీజిల్ ధర రూ.96.33గా ఉంది ►కోల్ కతా లో పెట్రోల్ ధర రూ.101.72 ఉండగా డీజిల్ ధర రూ.91.84గా ఉంది. ►చెన్నైలో పెట్రోల్ ధర రూ.99.08 ఉండగా డీజిల్ ధర రూ.99.38 గా ఉంది. ►హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.40 ఉండగా, డీజిల్ రూ. 96.84 గా ఉంది. ►విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.69 గా ఉండగా, డీజిల్ ధర రూ. 98.61 గా ఉంది. ► విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.14 కాగా, డీజిల్ రూ. 98.06 గా నమోదైంది. -
స్వల్పంగా తగ్గిన పెట్రో ధరలు
వాహన దారులకు స్వల్ప ఊరట లభించింది. లీటరు పెట్రోలు, డీజిల్పై కేవలం15 పైసలు తగ్గిస్తున్నట్లు చమురు కంపెనీలు ప్రకటించాయి. దీంతో గడచిన 38 రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు రెండవసారి తగ్గినట్లైంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో పెట్రో ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.101.49 ఉండగా లీటర్ డీజిల్ రూ.88.92గా ఉంది హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.105.63ఉండగా డీజిల్ రూ.97.16గా ఉంది ముంబైలో పెట్రోల్ ధర రూ. 107.52 వద్ద ఉండగా డీజిల్ ధర రూ .96.48గా ఉంది ఇక మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు రూ.110 క్రాస్ చేశాయి. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, అమరావతి, తిరువనంతపురంలలో సెంచరీ దాటింది. దీంతో పెట్రోల్ ధర రూ.100 దాటిన నగరాల్లో ఢిల్లీ, కోల్కతా, భోపాల్, చెన్నై, జైపూర్, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, పాట్నా, తిరువనంతపురం, పాట్నా, భువనేశ్వర్ తదితర నగరాలు ఉన్నాయి. -
దేశంలో పెట్రో ధరలు పెరగకపోవడానికి కారణం అదేనా?!
దేశంలోని వాహనదారులకు పెట్రోధరలపై ఊరట కలిగింది.గత ఆదివారం నుంచి ఈ రోజు(శనివారం) వరకు చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.పార్లమెంట్ సమావేశాలు, ఒపెక్ (పెట్రోలియం ఉత్పత్తి చేసే దేశాల సమాఖ్య) సమావేశంలో కరోనా ఎఫెక్ట్తో తగ్గించిన పెట్రోలు నెల వారి ఉత్పత్తి సామార్థ్యాన్ని తిరిగి రోజుకు 400,000 బారెల్స్ పెంచాలని ఒపెక్ దేశాలు నిర్ణయించాయి. ఈ ప్రకటన తర్వాత ముడి ధరలు బాగా పడిపోయాయి. ఇక శనివారం రోజు పెట్రోల్ ధరల వివరాలు హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ .105. 83 ఉండగా డీజిల్ రూ .97.96గా ఉంది ముంబై లీటర్ పెట్రోల్ ధర రూ .107.83 ఉండగా డీజిల్ ధర రూ .97.45గా ఉంది ఢిల్లీలో పెట్రోల్ ధర రూ .101.84 ఉండగా డీజిల్ ధర రూ .89.87గా ఉంది చెన్నైలో పెట్రోల్ ధర రూ102.49 ఉండగా డీజిల్ రూ .94.39 గా ఉంది కోల్కతాలో పెట్రోల్ ధర రూ .102.08 ఉండగా డీజిల్ రూ .93.02 గా ఉంది బెంగళూరు లో పెట్రోల్ ధర రూ .105.25 ఉండగా డీజిల్ రూ .95.26గా ఉంది -
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ఎఫెక్ట్: చమురు ధరలు తగ్గనున్నాయా?!
సాక్షి,న్యూఢిల్లీ : దేశంలో చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మే 3 నుంచి నేటి మధ్య కాలంలో వరుసగా 4 రోజుల పాటు పెట్రో ధరలు పెరగకపోవడం గమనార్హం. అయితే అందుకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగడం ఓ కారణమేనని మార్కెట్ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రోజు పెట్రోల్ ధరల వివరాలు ముంబై లీటర్ పెట్రోల్ ధర రూ .107.83 ఉండగా డీజిల్ ధర రూ .97.45గా ఉంది ఢిల్లీలో పెట్రోల్ ధర రూ .101.84 ఉండగా డీజిల్ ధర రూ .89.87గా ఉంది చెన్నైలో పెట్రోల్ ధర రూ102.49 ఉండగా డీజిల్ రూ .94.39 గా ఉంది కోల్కతాలో పెట్రోల్ ధర రూ .102.08 ఉండగా డీజిల్ రూ .93.02 గా ఉంది హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ .105. 83 ఉండగా డీజిల్ రూ .97.96గా ఉంది బెంగళూరు లో పెట్రోల్ ధర రూ .105.25 ఉండగా డీజిల్ రూ .95.26గా ఉంది మరో వైపు త్వరలో చమురు ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జూలై 18 న జరిగిన ఒపెక్ (పెట్రోలియం ఉత్పత్తి చేసే దేశాల సమాఖ్య) సమావేశంలో పెట్రోలు ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించారు.కరోనా ఎఫెక్ట్తో తగ్గించిన పెట్రోలు నెల వారి ఉత్పత్తి సామార్థ్యాన్ని తిరిగి రోజుకు 400,000 బారెల్స్ పెంచాలని ఒపెక్ దేశాలు నిర్ణయించాయి. ఈ ప్రకటన తర్వాత ముడి ధరలు బాగా పడిపోయాయి. జులై 16న బ్యారెల్ ధర 73.59 డాలర్లు ఉండగా... జులై 19న ధర 68.62డాలర్లుగా ఉంది. ముడి చమురు ఉత్పత్తి పెరుగుతూ పోతే దేశీయంగా ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
Petrol Diesel Prices: వాహనదారులకు స్వల్ఫ ఊరట
న్యూఢిల్లీ: చమురు ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. అయితే వరుసగా పెరుగుతున్న పెట్రో ధరలకు ఇవాళ బ్రేక్ పడింది. ఈరోజు చమురు ధరల్లో ఎలాంటి పెరుగుదల లేదని చమురు కంపెనీలు ప్రకటించాయి. మంగళవారం ఉదయం భారత్ పెట్రోలియం, హెచ్పీ, ఇండియన్ ఆయిల్ లాంటి ప్రధాన పెట్రోల్ బంకుల్లో పెట్రో ధరల్లో ఎలాంటి పెరుగుదల కనిపించలేదు. ఇక మే 4 నుంచి మొదలైన ధరల పెంపు.. కొనసాగుతూ వస్తోంది. ఈ ఒక్క జులై నెలలోనే పెట్రోల్ ధర ఏడుసార్లు పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.15పై., డీజిల్ రూ.97.78పై.గా ఉంది. చెన్నైలో రూ.102.. రూ.92, ముంబైలో రూ.107, రూ.97, ఢిల్లీలో రూ.101, రూ.89, బెంగళూరులో రూ.104, రూ.98గా లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు ఉన్నాయి. అయితే ఒపెక్ దేశాల వైఖరితో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు రాబోయే రోజుల్లో పెరిగే అవకాశమే ఉందని నిపుణులు భావిస్తున్నారు. -
ఎడ్ల బండిపై నుంచి కిందపడ్డ దామోదర రాజనర్సింహ
సాక్షి, మెదక్: మెదక్ జిల్లా కేంద్రంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఎడ్ల బండిపై నుంచి ప్రసంగిస్తుండగా మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ జారీ కింద పడ్డారు. ఈ ఘటనలో ఆయన కాలికి స్వల్ప గాయం అయ్యింది. పెట్రో ధరల పెంపుపై తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. స్థానిక నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనల్లో పాల్గొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ ధర్నాచౌక్లో సైకిల్ ర్యాలీ, ఎడ్లబండితో నిరసన తెలిపారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, గీతా రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, ఫిరోజ్ ఖాన్తో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ నిరసనలు
సాక్షి, హైదరాబాద్: పెట్రో ధరల పెంపుపై తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. స్థానిక నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనల్లో పాల్గొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ ధర్నాచౌక్ లో సైకిల్ ర్యాలీ, ఎడ్లబండితో నిరసన తెలిపారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, గీతా రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, ఫిరోజ్ ఖాన్ తో పాటు పలువురిని పోలీసులు చేశారు. ఖమ్మం జిల్లా: పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎడ్లబండిపై కాంగ్రెస్ కార్యాలయం నుంచి ధర్నాచౌక్ వరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ర్యాలీ నిర్వహించారు. నల్గొండ జిల్లా: పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ శంకర్ నాయక్, మాజీ ఎమ్మెల్యే బాలూ నాయక్ పాల్గొన్నారు. ఎడ్లబండిని లాగి జగ్గారెడ్డి నిరసన తెలిపారు. -
డీజిల్పై స్వల్ఫ ఊరట.. మరింత పెరిగిన పెట్రోల్ ధర
Petrol Diesel Prices ముంబై: ఇంధన ధరల్లో స్వల్ఫ ఊరట. డీజిల్ ధర లీటర్కు 15 నుంచి 17 పైసలు తగ్గింది. అయితే పెట్రోల్ ధరల పెరుగుదల మాత్రం కొనసాగుతోంది. సోమవారం లీటర్కు 25 నుంచి 34 పైసల చొప్పున పెరిగింది. దీంతో రాష్ట్రాల్లో పెట్రోల్ ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.97.33పై.గా ఉన్న లీటర్ డీజిల్ ధర.. ప్రస్తుతం 97.19పై.కి చేరింది. ఇక పెట్రోల్ మాత్రం రూ.107.24పై. చేరుకుంది. దాదాపు రెండు నెలల తర్వాత డీజిల్ ధరలో తగ్గుదల చోటుచేసుకోవడం విశేషం. మే 4 నుంచి పెట్రోల్ ధరపై ఇది 39వ పెంపు. ఇప్పటికే రాష్రా్టలు కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి 16 చోట్ల పెట్రోల్ రేట్లు సెంచరీ దాటేశాయి. హైదరాబాద్లో లీటరు పెట్రోలు రూ. 105కి చేరుకోగా, లీటరు డీజిల్ స్వల్ఫంగా తగ్గి రూ.97.86పై. కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో.. పెంచుకుంటూ పోతున్నాయి చమురు కంపెనీలు. రాబోయే రోజుల్లో.. ఒపెక్ దేశాల వైఖరితో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. దీనికి తగ్గట్టే రాబోయే రోజుల్లో దేశీయంగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడం ఖాయంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏమైనా చర్యలు తీసుకుంటే తప్ప పెట్రోలు, డీజిల్ ధరలు ఇప్పట్లో తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. కానీ, సంక్షేమ పథకాలకు నిధులు కోసం నగదును సర్దుబాటు చేయాల్సి వస్తుండడంతో పెట్రో మంటలను అదుపు చేయలేకపోతున్నామని కేంద్ర పెట్రోలియం శాఖ ‘కొత్త’ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరణ ఇచ్చారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో నిధులు ఆదా చేయాల్సిన అవసరం ఉందని, అందుకే పెట్రో భారంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నట్లు చెప్పారాయన. -
Petrol Diesel Prices: మరోసారి పెరిగిన ధరలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా ఇంధన ఛార్జీలు సవరించాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత... మొదట్లో సగటున ప్రతీ పదిహేను రోజులకు ఓసారి పెట్రోలు ధర పెరిగేది. ఆ తర్వాత వారానికి పడిపోయింది. ఇప్పుడు దాదాపు రోజుకు ఒకసారి పెరుగుతూ వస్తోంది. తాజాగా మరోసారి చమురు ధరలు పెరిగాయి. గురువారం లీటర్ పెట్రోల్పై 36 పైసలు, డీజిల్పై 11 పైసలు పెంపు విధించాయి. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంచుమించు రోజు విడిచి రోజు పెట్రోలు ధరలు పెరుగుతూ వచ్చాయి. ఇక జులైలో అయితే ఒక్క రోజు గ్యాప్ ఇచ్చి దాదాపు ప్రతీ రోజు పెట్రోలు ధర పెరిగింది. దాదాపు అన్ని మెట్రో నగరాల్లో పెట్రోల్ లీటర్ వంద మార్క్ను దాటేసింది. ఈ నెలలో ఇది ఆరో పెంపు. పది రాష్రా్టలపై పెట్రో ఉత్పత్తుల పెంపు ప్రభావం పడింది. తాజా పెరుగుదలతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.104.50పై కాగా, డీజిల్ ధర రూ.97.68పై.గా ఉంది. ఇక అత్యధికంగా భోపాల్లో రూ.108గా ఉండగా, డీజిల్ ధర రూ.98గా ఉంది. ముంబైలో పెట్రోల్ రూ.106- డిజీల్ రూ.92గా ఉంది. -
పన్నుల వసూళ్లులో కేంద్రం పీహెచ్డీ: రాహుల్
న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్ ధరలు రోజు రోజుకూ పెరుగుతుండటంపై కేంద్ర ప్రభుత్వం పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పన్నుల వసూలులో పీహెచ్డీ చేసిందని మండిపడ్డారు. ఆయన ట్విటర్ వేదికగా కేంద్ర ప్రభుత్వ తీరు పై మండిపడ్డారు.ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్నుల ద్వారా కన్నా పెట్రోలు, డీజిల్ల నుంచి ఎక్కువ ఆదాయాన్ని ప్రభుత్వం పొందుతోందని చెప్తున్న ఓ పత్రిక కథనాన్ని జత చేస్తూ ఈ ట్వీట్ చేశారు. పెట్రోలు, డీజిల్ ధరలు ఒక రోజు నిలకడగా ఉన్నాయి. ఆ తర్వాత ఆదివారం మళ్ళీ పెరిగాయి. దేశంలోని చాలా నగరాల్లో లీటరు పెట్రోలు ధర రూ.100 దాటింది. మరికొన్ని నగరాల్లో ఈ ధర రూ.100కు చేరువలో ఉంది. భోపాల్లో అత్యధికంగా లీటరు పెట్రోలు ధర రూ. 105 గా వుంది. చదవండి:అత్యాచారం కేసు.. మాజీ మంత్రి అరెస్ట్ -
ధరల పెరుగుదలపై ఇంత నిరాసక్తతా?
గత నలభై ఏళ్లుగా రాజకీయాలను, ప్రభుత్వ విధానాలను గమనిస్తున్నవారందరికీ గుర్తుండిపోయే విషయాలు కొన్ని ఉన్నాయి. ఎప్పుడైనా ఇంధన ధరలు ఒక పావలా పెరిగినప్పుడు, బస్సు చార్జీలు కిలోమీటరుకు రెండు నయాపైసలు పెంచినపుడు, రైలు చార్జీలు ఐదుశాతం పెరిగినపుడు, నూనెల ధరలు అయిదు రూపాయలు పెరిగినపుడు దేశం మొత్తం గగ్గోలెత్తిపోయేది. విపక్షాలన్నీ కలసికట్టుగా దేశవ్యాప్త ఉద్యమాలు, ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించేవి. ఈ ధర్నాలు నిర్వహించడానికి కమ్యూనిస్టు పార్టీలు ముందంజలో నిలిచేవి. పెట్రోల్ ధరలు పెరగగానే రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొందరు దూరదర్శన్ వారు కెమెరాలతో చిత్రీకరిస్తుండగా కొంచెం దూరం సైకిల్ తొక్కుతూ అసెంబ్లీ భవనానికి వెళ్లేవారు. మరికొందరు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేవారు. మరికొందరైతే తమ ఇళ్లలో లాంతర్లు వెలిగించి నిరసన తెలిపేవారు. గ్యాస్ ధర పది రూపాయలు పెరిగితే రోడ్ల మీద కట్టెలతో వంటలు చేస్తూ నిరసనలు తెలిపేవారు. ఈ ఆందోళనల్లో ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొనేవారు. లాఠీ చార్జీలు జరిగినా, బాష్పవాయువు ప్రయోగించినా, బుల్లెట్లు కురిపించినా బెదిరేవారు కారు. విపక్ష నాయకులు ఆందోళనల్లో ముందుండి ఉద్యమాలను నడిపేవారు. పెంచిన ధరలు తగ్గించాల్సిందే అని ప్రతిపక్షాలు, నయాపైసా కూడా తగ్గించేది లేదని ప్రభుత్వాలు భీష్మించుకునేవి. ఎప్పుడో ఒకటోఅరో సందర్భాల్లో పెంచిన ధరలను ఒక్క శాతం తగ్గించేవి ప్రభుత్వాలు. అప్పటికే పదిశాతం ధరలు పెరిగాయనే వాస్తవాన్ని విస్మరించి తామేదో ఘనవిజ యాన్ని సాధించినట్లు, ప్రభుత్వం మెడలు వంచినట్లు విపక్షాలు సంబరపడిపోయేవి. ఇలాంటి గిమ్మిక్కులనే ఎద్దేవా చేస్తూ దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు ‘ఎమ్మెల్యే ఏడుకొండలు’ అనే సినిమాను నిర్మించారు. సినిమాలో ముఖ్యమంత్రి ఏ వస్తువు మీదైనా ధరలు పెంచాలంటే ముందుగా రూపాయి వస్తువును మూడు రూపాయలకు పెంచడం, దానిమీద ప్రతిపక్షాలు మండిపడి ఆందోళనలు చేస్తే ఒక రూపాయిని తగ్గించడం, దాంతో విపక్షాలు శాంతించి ఆందోళన విరమించడం జరిగేవి. రూపాయి వస్తువు రెండు రూపాయలు అయిందనే స్పృహ అటు ప్రజలకూ ఉండేది కాదు, విపక్షాలకూ ఉండేది కాదు. ఎపుడో నలభై ఏళ్ళక్రితం దాసరి నారాయణరావు తీసిన అలాంటి సంఘటనలు ఆ తరువాత నిజజీవితంలో కూడా కొన్ని సార్లు జరిగాయి. ఇంధనధరలను పెంచితే వెంటనే దేశవ్యాప్తంగా లారీ యజమానులు సమ్మెకు దిగేవారు. ఎక్కడి లారీలు అక్కడే స్తంభించిపోయేవి. రవాణా స్తంభించిపోవడంతో కూరగాయలు, పండ్లు చెడిపోవడం, రైతులకు కోట్లలో నష్టం వాటిల్లడం జరిగేవి. దాంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పోవడం, ఆ తరువాత లారీ యజమానుల సంఘం వారు ప్రభుత్వంతో చర్చలు జరపడం, అందులో వారికేవో కొన్ని హామీలు లభించడం, ఫలితంగా సమ్మెను విరమించడం షరా మామూలుగా సాగిపోతుండేది. కానీ జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోతుండేది. ఉల్లిపాయల ధర పెరగడంతో కేంద్ర ప్రభుత్వాలనే దించేసిన ఉదంతాలు ఉన్నాయి మనదేశంలో. గత కొద్దికాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు దినదినప్రవర్ధమానం అవుతున్నాయి. ప్రతిరోజూ ధరలు పెంచేస్తున్నారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఇంధనం ధరలు, గ్యాస్ ధరలు పది రూపాయలు పెంచగానే బీజేపీ పెద్దఎత్తున ఆందోళన చేసేది. బీజేపీ అగ్రనేతలు సిలిండర్లను రోడ్లమీద పెట్టి కట్టెలతో వంటలు చేసేవారు. నూనె ధరలు రెండు రూపాయలు పెరిగితే నీళ్లతో తిరగమోతలు పెడుతూ నిరసన తెలిపేవారు. మన్మోహన్ ప్రభుత్వం వంటగ్యాస్ ధరను పాతిక రూపాయలు పెంచినపుడు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ పెంచిన భారాన్ని తమ ప్రభుత్వం మోస్తుందని ప్రకటించి ప్రజలను శాంతిం పజేశారు. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఆ భారాన్ని ప్రజలే భరించాల్సి వచ్చింది. ఇక కమ్యూనిస్ట్ పార్టీలైతే ప్రతిరోజూ మన్మోహన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో ఒక చోట ఆందోళనలు చేస్తూనే ఉండేది. మన్మోహన్ ప్రభుత్వం దిగిపోయాక మోదీ సారథ్యంలో ఎన్డీయే ప్రభుత్వం గద్దె ఎక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తాము ప్రదర్శించిన ధర్నాలు, ఆందోళనలను వాటంగా విస్మరించి అనునిత్యం ధరలు పెంచడమే పరమావధిగా పెట్టుకుంది. ముఖ్యంగా గత రెండేళ్లుగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయిదారు నెలలక్రితం ఉన్న ధరలకు దాదాపు రెట్టింపు అయ్యాయి. పప్పు దినుసులు, నూనెలు, వంట గ్యాస్ ధరలు ఇష్టారాజ్యంగా పెరిగిపోతున్నాయి. ఇక పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరిగిపోతూ సామాన్యుల గుండెలను దడదడలాడిస్తున్నాయి. పెట్రోల్ ధర దాదాపు వందరూపాయలకు చేరువలో ఉన్నది. గత మూడు నెలల్లో వంట గ్యాస్ ధర రెండు వందల రూపాయల మేర పెరిగింది. నాలుగైదు నెలల క్రితం వరకూ నూట యాభై రూపాయల వరకూ సబ్సిడీ వినియోగదారుల ఖాతాల్లో జమ అయ్యేది. ఇప్పుడు అదికూడా పోయింది. ఒకప్పుడు ధరలు పెంచడం అంటే బడ్జెట్ సమావేశాల్లో మాత్రమే జరిగేది. ముందుగా కేబినెట్ మీటింగ్లో చర్చించి పార్లమెంట్లో ప్రవేశపెట్టి పెంచేవారు. ఇప్పుడు అలాంటి సంప్రదాయాలు లేవు. ప్రతిరోజూ పెంచేస్తున్నారు. అయినా ఆశ్చర్యం! ఎక్కడా ఆందోళనలు లేవు. సమ్మెలు లేవు. ధర్నాలు లేవు. కరెంట్ చార్జీలు పెంచినా, రవాణా చార్జీలు పెంచినా, ఇంటి పన్నులు పెంచినా, కూరగాయల ధరలు పెరిగినా, ఆరోగ్యకారక మందుల ధరలు పెంచినా, ఆస్తుల రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచినా కిమన్నాస్తి. ప్రజలు కానీ, పార్టీలు కానీ ఏమాత్రం స్పందించడం లేదు. గతంలో పెరిగిన ధరలపై చెలరేగిన ఆందోళనలు, ఉద్యమాల వాతావరణం ఇప్పుడు కనిపించలేదు. విద్యార్థులతో సహా అన్ని వర్గాలూ ధరల పెరుగుదలపై, ఇతర సమస్యలపై పూర్తిగా నిరాసక్తత ప్రదర్శిస్తున్నాయి. అందుకే ప్రభుత్వాలు తమ చిత్తం వచ్చినట్లు నిత్యావసర వస్తువుల ధరలు పెంచినా, ఇంధన ధరలు పెంచినా ఒకరోజు గుండెలు బాదుకుని మరునాడు ఎంత పెరుగుతుందా అని ఎదురు చూడటం తప్ప మరో గత్యం తరం కనిపించడం లేదు. ఇలపావులూరి మురళీ మోహనరావు వ్యాసకర్త సీనియర్ రాజకీయ విశ్లేషకులు -
ఇంధన ధరల పెంపుపై దాఖలైన పిటిషన్ కొట్టివేత
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కోర్టు జోక్యం చేసుకోవాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిఐఎల్)ను సుప్రీంకోర్టు మంగళవారం తోసిపుచ్చింది. అంతర్జాతీయ ముడి చమురు ధరలు తగ్గుతున్నా దేశీయంగా ఇంధన ధరల పెంపును వ్యతిరేకిస్తూ కేరళకు చెందిన న్యాయవాది షాజీ జె కోదన్కందత్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. అకారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నారని, ఈ విషయంలో అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని ధరలను నియంత్రించాలని పిటిషన్లో షాజి కోరారు. చమురు ధరలు తగ్గినా, కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోని చమురు మార్కెటింగ్ సంస్థలు రోజూ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నాయనీ, ఏప్రిల్ నుండి వరుసగా ధరలు పెరుగుతున్నాయని షాజీ పేర్కొన్నారు. ఈ పిటిషన్పై విచారణకు నిరాకరించిన జస్టిస్ రోహింటన్ ఫాలి నారిమన్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం షాజిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్థిక విధానానికి సంబంధించిన అంశంలో పిల్ వేయడాన్ని తప్పుబట్టిన సుప్రీం పిటిషన్ను కొనసాగించాలనుకుంటే పిటిషనర్కు భారీ జరిమానా విధిస్తామని జస్టిస్ రోహింటన్ నారిమన్ హెచ్చరించారు. దీంతో వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు పిటిషనర్ ప్రకటించారు. -
మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు
న్యూఢిల్లీ: పెట్రో ధర మండుతోంది. వరుసగా ఎనిమిదోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఆదివారం పెట్రోల్ ఏకంగా లీటరుకు 62 పైసలు, డీజిల్ లీటరుకు 64 పైసలు పెరిగింది. 2017లో రోజువారీ పెట్రోల్ ధరల కార్యక్రమాన్ని తీసుకొచ్చినప్పటి నుంచి ఒకే రోజులో పెరిగిన అధిక మొత్తం ఇదే. పెరిగిన ధరల ప్రకారం డిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 75.78 కాగా, డీజిల్ ధర 74.03గా ఉంది. ఎనిమిది రోజుల్లో లీటరు పెట్రోలుపై రూ. 4.52, డీజిల్పై రూ. 4.64 పెరిగింది. జీఎస్టీ పరిధిలోకి చేర్చండి: కాంగ్రెస్ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా ఎనిమిదో రోజు పెంచడం పట్ల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలను 2004 ఆగస్టు నాటి ధరల స్థాయికి వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ముడి చమురు ధరలు 2004 ధరల స్థాయిలోనే ఉన్నాయని గుర్తుచేశారు. పెట్రోల్, డీజిల్ను వస్తు సేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి తీసుకురావాలని అన్నారు. -
పెట్రోల్, డీజిల్పై ముందుంది మరింత బాదుడు
న్యూఢిల్లీ: కష్టకాలంలో కాసులు రాబట్టుకునే మార్గాలపై కేంద్ర సర్కారు దృష్టి పెట్టింది. పెట్రోల్, డీజిల్పై లీటర్కు రూ.8 వరకు ఎక్సైజ్ సుంకం పెంచుకునేందుకు వీలుగా సోమవారం చట్ట సవరణ చేసింది. ఆర్థిక బిల్లు, 2020లో ఈ మేరకు సవరణను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఈ సవరణకు, ఆర్థిక బిల్లు 2020కు లోక్సభ ఎటువంటి చర్చ లేకుండానే ఆమోదం తెలియజేసింది. దీంతో ప్రత్యేక పరిస్థితుల్లో పెట్రోల్పై ఎక్సైజ్ సుంకం లీటర్కు రూ.18 వరకు, డీజిల్పై రూ.12 వరకు కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం కింద పెంచుకోవడానికి వీలుంటుంది. సవరణ ముందు వరకు పెట్రోల్పై గరిష్టంగా రూ.10, డీజిల్పై రూ.4 వరకే ఎక్సైజ్ సుంకం విధించేందుకు కేంద్ర సర్కారుకు చట్ట పరంగా అవకాశం ఉండేది. కాగా, అంతర్జాతీయంగా చమురు ధరలు అత్యంత కనిష్టాలకు చేరడంతో.. ఆదాయ పెంపు చర్యల్లో భాగంగా డీజిల్, పెట్రోల్పై లీటర్కు రూ.3 చొప్పున కేంద్రం ఎక్సైజ్ సుంకం పెంచుతూ ఈ నెల 14న నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనివల్ల సర్కారుకు రూ.39,000 కోట్ల అదనపు ఆదాయం వార్షికంగా సమకూరనుంది. ఈ పెంపుతో చట్ట పరంగా ఎక్సైజ్ సుంకం గరిష్ట స్థాయిలకు చేరింది. అందుకే చట్టంలో సవరణలు తీసుకొచ్చింది. పార్లమెంట్ నిరవధిక వాయిదా దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పార్లమెంట్ ఉభయ సభలు సోమవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం బడ్జెట్ సమావేశాలు మరో 11 రోజులు మిగిలి ఉండగానే పార్లమెంట్ నిరవధికంగా వాయిదా పడింది. సభ్యులంతా సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని లోక్సభాపతి ఓం బిర్లా సూచించారు. కొంతమంది ఎంపీలు క్వారంటైన్లోకి వెళ్లిపోవడంతోపాటు కరోనా విస్తరిస్తున్నందున తృణమూల్ కాంగ్రెస్, శివసేన తదితర పార్టీలు పార్లమెంట్ సమావేశాలకు దూరంగా ఉండటంతో పార్లమెంట్ నిరవధిక వాయిదాకు నిర్ణయించారు. రాజ్యసభలో కేంద్ర పాలిత ప్రాంతాల బడ్జెట్పై చర్చ అనంతరం త్వరలో పదవీ విరమణ చేయనున్న 57 మంది సభ్యులకు చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ► రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ బిల్లు, జాతీయ ఫోరెన్సిక్ సైన్స్ వర్సిటీ బిల్లులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. ► స్వాతంత్య్ర సమరయోధులు భగత్సింగ్, సుఖ్దేవ్, రాజ్గురులకు పార్లమెంట్ ఘన నివాళులర్పించింది. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల దాడిలో మృతి చెందిన భద్రతా సిబ్బందికి కూడా నివాళులర్పించింది. ► జనతా కర్ఫ్యూ పాటించిన మార్చి 22వ తేదీ దేశానికి సూపర్ సండే అని రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు అభివర్ణించారు. -
ఏప్రిల్ నుంచి పెట్రో ధరల పెరుగుదల!
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఏప్రిల్ 1 తర్వాత పెట్రోలు, డీజిల్ ధరలు 50పైసల నుంచి 1 రూపాయి వరకు పెరిగే అవకాశముంది. ప్రస్తుతం వాహనాలకు బీఎస్ 4 ప్రమాణ ఇంధనం వాడుతుండగా.. ఏప్రిల్ 1 నుంచి మరింత మెరుగైన బీఎస్ 6 ప్రమాణ ఇంధనం వినియోగించాలని నిర్ణయించిన నేపథ్యంలో ధరల పెంపు అనివార్యమైంది. ‘బీఎస్ 6’ ఇంధనం కారణంగా వాహన కాలుష్యం తగ్గుతుందని భావిస్తున్నారు. బీఎస్ 6 గ్రేడ్ ఇంధన ఉత్పత్తిని ఇప్పటికే ప్రారంభించామని, వచ్చే నెలలో అన్ని డిపోలకు బీఎస్ 6 గ్రేడ్ ఇంధనం చేరుతుందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ సంజీవ్ సింగ్ తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి పూర్తిగా బీఎస్ 6 గ్రేడ్ ఇంధనమే వాహనాలకు అందుబాటులో ఉంటుందన్నారు. -
లీటర్ పెట్రోల్పై 15 పైసలు పెంపు
పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలపై పడింది. దీంతో సోమవారం దేశంలో పెట్రోల్ లీటర్పై 15 పైసలు, డీజిల్పై 17 పైసలు పెరిగింది. ఇక ఢిల్లీలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.76.69 ఉండగా.. డీజిల్ లీటర్కు రూ.68.68లకు చేరింది. కాగా 2018 నవంబర్ తర్వాత పెట్రోల్ ధర ఇదే అత్యధికం. పెట్రో ఉత్పత్తుల ధరలు పెరగడం వరుసగా ఇది ఐదోరోజు. -
పెట్రోలు, డీజిల్పై వ్యాట్ వాయింపు
లక్నో: దేశవ్యాప్తంగా పెట్రోలు ధరలు స్వల్పంగా వెనక్కి తగ్గగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాత్రం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పెట్రోల్, డీజిల్ వ్యాట్ను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పెట్రోల్పై వ్యాట్ను 26.80 శాతానికి, డీజిల్పై 17.48 శాతానికి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన తరువాత ఇంధన ధరలు పెరిగాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి ఈ సవరించిన ధరలు అమల్లోకి వచ్చాయి. ఒక లీటరు పెట్రోల్కు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 98 పైసలు పెరగ్గా, లీటరు డీజిల్కు రూ .2.35 పెరిగింది. దీంతో పెట్రోలు ధర లీటరు రూ. 73.66 గా ఉండగా, డీజిల్ ధర రూ. 65.28గా ఉంది. -
బడ్జెట్ ఎఫెక్ట్ : బంకుల్లో నో స్టాక్ బోర్డులు
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్ సామాన్యుడి చమురు వదిలించే పనిలో పడింది. త్వరలోనే దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నాయి. తాజా బడ్జెట్లో వెల్లడించిన దాని ప్రకారం సుంకాల పెంపు నేపథ్యంలో పెట్రోల్పై రూ.2.5, డీజిల్పై రూ.2.3 మేర పెరగనుంది. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం రూ.1తో పాటు, రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పన కోసం పెట్రోల్, డీజిల్పై సెస్ కింద మరో రూ.1 చొప్పున విధిస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రకటించారు. తాజా సుంకాలకు వ్యాట్ను అదనంగా జోడించినప్పుడు పెట్రోల్ రూ.2.5, డీజిల్ రూ.2.3 మేర పెరిగే అవకాశం ఉంది. ఈ సుంకాల వల్ల ప్రభుత్వ ఖజానాకు అదనంగా రూ.28 వేల కోట్ల ఆదాయం సమకూరనుంది. శుక్రవారం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.70.51గా ఉండగా, డీజిల్ ధర రూ.64.33గా ఉంది. ముంబైలో పెట్రోలధర రూ.76.15 కాగా డీజిల్ ధర 67.40గా ఉంది. అయితే పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు గురించి ఆర్థిక శాఖ మంత్రి ఆమోదం పొందకముందే ఆయిల్ కంపెనీలు చమురు ధరలు పెంచేశాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయనే ఉద్దేశంతో చాలా చోట్ల పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తూ.. వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. -
స్వల్పంగా పెరిగిన పెట్రోలు డీజిల్ ధరలు
సాక్షి,ముంబై: అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో దేశీయంగా కూడా ఇంధన ధరలు పుంజుకున్నాయి. బుధవారం 2 శాతం క్రూడ్ ధరలు పెరగడంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గురువారం (జూన్ 27) పెట్రోల్, డీజిల్ రిటైల్ధరలు పెరిగాయి. పెట్రోల్ లీటరుకు 7పైసలు, డీజిల్ ధర లీటరుకు 5-6 పైసలు పెరిగాయి. ఆయిల్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్సైట్ సమాచారం ప్రకారం ఢిల్లీలో పెట్రోల్ ధర బుధవారం రూ .70.05 వద్ద ఉండగా డీజిల్ ధర రూ .63.95గా ఉంది. అమరావతి : లీటరు పెట్రోలు రూ. 74. 31 డీజిల్ లీటరు రూ. 69.15 హైదరాబాద్ : లీటరు పెట్రోలు రూ. 74.52 డీజిల్ లీటరు రూ. 69.70 కోలకతా : లీటరు పెట్రోలు రూ. 72.38 డీజిల్ లీటరు రూ. 65.87 చెన్నై: లీటరు పెట్రోలు రూ. 72.84 డీజిల్ లీటరు రూ. 67.64 ముంబై : లీటరు పెట్రోలు రూ. 75.82 డీజిల్ లీటరు రూ. 67.05 మరోవైపు గురువారం అంతర్జాతీయ చమురు మార్కెట్లో, ముడి ధరలు తగ్గుముఖం పట్టాయి. రికార్డు లాభాలనుంచి వెనక్కి తగ్గాయి. జి20 శిఖరాగ్ర సమావేశం, ఒపెక్, ఇతర చమురు ఉత్పత్తిదారుల సమావేశంపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు( ఫ్యూచర్స్ )బ్యారెల్కు 0.3శాతం క్షీణించి 66.30 డాలర్లుగా ఉంది -
మళ్లీ పైకి చూస్తున్న పెట్రో ధరలు
సాక్షి, ముంబై : దేశీయంగా తగ్గినట్టే తగ్గి వినియోగదారులను మురిపించిన ఇంధన ధరలు క్రమంగా పైపైకి ఎగబాకుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల ప్రభావంతో జనవరి నుంచి మొదలుపెట్టి వరుసగా శుక్రవారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర 8 పైసలు, డీజిల్ ధర 19 పెరిగింది. దీంతో ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.70.55కి.. డీజిల్ ధర రూ.64.97కి పెరిగింది. ముంబై : పెట్రోలు ధర రూ.76.18, డీజిల్ రూ.68.02 చెన్నై: పెట్రోల్ రూ.73.23 డీజిల్ రూ.68.62 కోలకతా: పెట్రోల్ రూ.72.65, డీజిల్ రూ.66.74 హైదరాబాద్: పెట్రోల్ ధర రూ.74.84, డీజిల్ ధరరూ.70.63 విజయవాడ : పెట్రోల్ రూ.74.64 డీజిల్ రూ.70.05 బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 61.67 డాలర్ల వద్ద.. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్కు 52.87 డాలర్ల వద్ద ఉంది. ఈ నెలలో పెట్రోల్ ధర 9సార్లు, డీజిల్ ధర 10సార్లు పెరిగింది. దీంతో పైసా పైసా పెరుగతూ వస్తున్న ధరలు మళ్లీ పాత స్థితికి చేరుకుంటూ వుండటంతో వినియోగదారుల గుండెల్లో గుబులు మొదలైంది. -
పెట్రో మంట నుంచి కాస్త ఊరట
న్యూఢిల్లీ: రోజుకో రికార్డు చెరిపేస్తూ దూసుకెళ్తున్న ఇంధన ధరల నుంచి సామాన్యునికి కొంత ఊరట లభించింది. పెట్రోల్, డీజిల్ లీటరు ధరను కేంద్రం రూ.2.50 తగ్గించింది. ఇందులో రూ. 1.50 మేర ఎక్సైజ్ సుంకం రూపంలో కోత విధించగా, మరో రూపాయి తగ్గింపును చమురు కంపెనీలు సర్దుబాటుచేసుకోనున్నాయి. కేంద్రం నిర్ణయం వెలువడిన వెంటనే బీజేపీ పాలిత రాష్ట్రాలు గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, అస్సాం, త్రిపురలు రూ.2.50 మేర వ్యాట్ తగ్గించుకోవడంతో ఆ రాష్ట్రాల్లో మొత్తం తగ్గింపు రూ.5కు చేరింది. సవరించిన ధరలు గురువారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. తాజా నిర్ణయంతో కేంద్రం మిగిలిన ఆర్థిక సంవత్సరంలో రూ.10,500 కోట్లు, పూర్తి సంవత్సరంలో రూ.21,000 కోట్ల ఆదాయం కోల్పోనుంది. చమురు కంపెనీలు లీటరుకు రూ.1 చొప్పున భారం భరిస్తే సుమారు రూ.10,700 కోట్ల ఆదాయాన్ని నష్టపోతాయి. ఇందులో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) సగం, హెచ్పీసీఎల్, బీపీసీఎల్లు మిగతా సగాన్ని సమానంగా భరించనున్నాయి. ప్రభుత్వ నిర్ణయం కంటితుడుపు చర్యేనని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ విమర్శించింది. డీరెగ్యులేషన్పై ప్రభావం లేదు: జైట్లీ రాష్ట్రాలు కూడా స్థానిక పన్నులు తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విజ్ఞప్తి చేశారు. ఇంధన భారాన్ని పంచుకోవాలని చమురు కంపెనీలను కోరడం మళ్లీ ప్రభుత్వ నియంత్రణకు దారితీస్తుందన్న ఆందోళనలను ఆయన కొట్టిపారేశారు. కంపెనీలకు ధరలు నిర్ణయించుకునే స్వేచ్ఛ కొనసాగుతుందని స్పష్టం చేశారు. -
చమురు ధరల మంట
ఆదిలాబాద్టౌన్: పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. రూ.వంద వైపు వేగంగా పరుగులు తీస్తున్నాయి. నెలరోజుల క్రితం లీటరు పెట్రోల్ ధర రూ.84.50 ఉండగా, తాజాగా పెరిగిన ధరతో రూ.90కి చేరింది. ప్రతిరోజు ధర మారుతూనే ఉంది. రాత్రి 12 గంటల వరకు ఒక ధర ఉంటే, తెల్లారేసరికి బోర్డుపై మరో ధర దర్శనమిస్తోంది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యుల నడ్డీ విరుగుతోంది. చుక్కలనంటుతున్న నిత్యావసర సరుకుల ధరలతో వినియోగదారుల జేబులకు చిల్లు పడుతుండగా, పెరుగుతున్న ఈ ధరలు మరింత అదనపు భారంగా మారాయి. సామాన్య ప్రజలపై కూడా ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ధరల పెరుగుదలతో రవాణా రంగం కుదేలవుతోంది. ఆటోలు నడిపే డ్రైవర్లు, ట్రాక్టర్, ఇతర ప్రైవేట్ వాహన యజమానులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆరు నెలలకో, మూడు నెలలకోసారి పెట్రో ధరలు పెరిగేవని, ప్రస్తుతం ఈ ప్రభుత్వ హయాంలో రోజురోజుకు ధరలు పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోందని వాపోతున్నారు. రోజురోజుకు పైపైకి.. రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పెట్రోల్ లీటరుకు రూ.89.95 ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.82.59కి చేరింది. ఈ నెల 1న పెట్రోల్ లీటరు ధర రూ.84.98 ఉండగా, నెలరోజులు గడవక ముందే రూ.90కి చేరింది. గతంలో డీజిల్, పెట్రో ల్ ధరల మధ్య చాలా వ్యత్యాసం ఉండేది. కానీ ప్రస్తుతం ఐదారు రూపాయల తేడా మాత్రమే ఉండటం గమనార్హం. మహారాష్ట్రలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా ఉన్నాయి. మన రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ధరలు ధరలు భగ్గుమంటున్నాయి. దీంతో వాహనచోదకులతోపాటు సామాన్య జనాలు సైతం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇటీవల కాంగ్రెస్, వామపక్షాలు ఆందోళన నేపథ్యంలో లీటరు ధరలో కొంత పైసలు తగ్గించినా మళ్లీ రోజురోజుకు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. జిల్లాలో.. ఆదిలాబాద్ జిల్లాలో 25 వరకు పెట్రోల్బంక్లు ఉన్నాయి. రోజు 25వేల లీటర్ల పెట్రోల్ విక్రయాలు, 50వేల లీటర్ల వరకు డీజిల్ విక్రయాలు జరుగుతాయని పెట్రోల్బంక్ల యజమానులు పేర్కొంటున్నారు. రోజురోజుకు పెరుగుతున్న ధరలతో జిల్లా వాసులపై అదనపు భారం పడుతూనే ఉంది. ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు పెట్రోల్పై రూ.17 వరకు, లీటరు డీజిల్పై రూ.14 వరకు పెరిగినట్లు తెలుస్తోంది. దాదాపు ఏడు నెల్లోనే ఇంత ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తున్నాయి. రోజు 25 పైసల నుంచి 50పైసల వరకు పెరుగుతండడంతో ధర పెరిగిందని వినియోగదారులకు ధర పెరుగుతున్న విషయం తెలియడంలేదు. రానున్న రోజుల్లో పెట్రోల్ ధర రూ.100కు చేరుకునే అవకాశం లేకపోలేదని పలువురు పేర్కొంటున్నారు. పెరిగిన ధరలను వెంటనే తగ్గించి ఇబ్బందులను తొలగించాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు. ధరలు తగ్గించాలి బీజేపీ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చాక పెట్రోల్ ధరలు విపరీంగా పెరిగా యి. ఎన్నికల ముందు పెరిగిన పెట్రోల్ ధరలను తగ్గిస్తామని ప్రధానమంత్రి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక విస్మరించారు. రోజురోజుకు పెరుగుతున్న డీజిల్ ధరలతో ఆటో నడిపించి కుటుంబాన్ని పో షించడం భారంగా మారుతోంది. వాహనదారులు, సామాన్య ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. – ఇమ్రాన్, ఆటోడ్రైవర్, ఆదిలాబాద్ రోజూ పెంచుడే.. రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలతో ఇబ్బందులు పడుతున్నాం. మోటార్సైకిల్ నడపాలంటే భయమేస్తోంది. ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.90కి చేరింది. మరో నెలరోజుల్లో రూ.100కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పెరిగిన ధరలతో నిత్యావసర సరుకుల ధరలు మరింతగా పెరుగుతున్నాయి. వెంటనే ధరలను నియంత్రించాలి. – రిజ్వాన్, వాహనదారుడు,ఆదిలాబాద్ -
షాకింగ్ : మెట్రో నగరాల్లో పెట్రో సెగలు
సాక్షి, న్యూఢిల్లీ : ముడిచమురు ధరల భారంతో పెట్రో సెగలు కొనసాగుతున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సోమవారం లీటర్ పెట్రోల్ ధర రూ 90.08కి పెరగ్గా, డీజిల్ లీటర్కు రూ 78.58కి చేరింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ 82.72కు పెరగ్గా, డీజిల్ ధర లీటర్కు రూ 74.02కు ఎగిసింది. ఇక హైదరాబాద్లో పెట్రోల్ లీటర్ రూ 87.58కి పెరిగింది. ముడిచమురు ధరలు బ్యారెల్కు 77 డాలర్లకు పెరగడంతో పాటు పెట్రో ఉత్పత్తులపై పన్నుల భారంతో పెట్రో ధరలు పరుగులు పెడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో పెట్రో ధరలు రికార్డు స్ధాయిలకు చేరడంతో ప్రభుత్వం ఇంధన భారాలు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. పెట్రో ఉత్పత్తులపై పన్నులను భారీగా తగ్గించాలని వినియోగదారులు కోరుతున్నారు. -
బంద్ ప్రశాంతం
సాక్షి, వరంగల్ రూరల్: అడ్డూఅదుపు లేకుండా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ విపక్షాలు భగ్గుమన్నాయి. జిల్లావ్యాప్తంగా నిరసన ర్యాలీలతో హోరెత్తించారు. పెరుగుతున్న చమురు ధరలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ సోమవారం భారత్ బంద్కు పిలుపునిచ్చింది. బంద్లో భాగంగా జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్తో పా టు టీడీపీ,సీపీఎం,సీపీఐ, ఇతర ప్రజాసంఘాలు పాల్గొన్నాయి. తెల్లవారుజాము నుంచే విపక్ష పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు రోడ్లపైకి చేరుకున్నారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలను నడవకుండా అడ్డుకున్నారు. నర్సంపేట, పరకాల ఆర్టీసీ బస్టాండ్, డిపోల ఎదుట బస్సులు బయటికి రాకుండా నిరసన వ్యక్తం చేశారు. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకరావాలని డిమాండ్ చేశారు. మండలాల్లో కాంగ్రెస్, టీడీపీ, వామపక్ష పార్టీలకు చెందిన నాయకులు రాస్తారోకోలు, బైక్ ర్యాలీలు నిర్వహించారు. బంద్ సక్సెస్.. జిల్లాలో బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రాలతోపాటు మండల కేంద్రాల్లో కూడా వ్యాపార వాణిజ్య సంస్థలు తెరుచుకోలేదు. హోటళ్లు, సినిమాహాళ్లు ముసివేశారు. ఉదయం పూట ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. ప్రైవేటు వాహనాలు నడవలేదు. బంద్ కారణంగా ఉదయం విధులకు వెళ్లే ఉద్యోగులు, గమ్యస్థానాలకు వెళ్లే సామాన్య ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కొన్ని ప్రైవేటు వాహనాల యజమానులు అమాంతం ఛార్జీలను పెంచి ప్రయాణికులను తరలించారు. -
ఎక్కడి కక్కడే..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీతోపాటు వామపక్షాల ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన బంద్ జిల్లాలో విజయవంతమైంది. కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, టీడీపీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఖమ్మం డిపో ఎదుట తెల్లవారుజామున బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు. అనంతరం బస్టాండ్ వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు ఆందోళనకారులకు సర్దిచెప్పి బస్సులను పంపించే ప్రయత్నం చేశారు. ఆందోళనకారులు ఎంతకూ పోలీసుల మాట వినకపోవడంతో కొన్ని బస్సులను డిపోలో.. మరికొన్నింటిని బస్టాండ్లో నిలిపారు. కాంగ్రెస్తోపాటు సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ పార్టీల నేతలు ఉదయం 9 గంటలకు బస్టాండ్ ప్రాంతానికి చేరుకుని ఆందోళనలు నిర్వహించారు. వామపక్షాల ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ యాత్ర నిర్వహించి.. బస్టాండ్ ఎదుట దహనం చేశారు. పలువురు కార్యకర్తలు మోదీ చిత్రపటాన్ని ప్రదర్శిస్తూ దహనం చేశారు. కాగా.. డిపో ఎదుట బయటకు వచ్చిన బస్సును అడ్డుకుని డిపోలోకి పంపించాలని నినాదాలు చేశారు. జిల్లావ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలు, వ్యాపార వర్గాలు, పెట్రోల్ బంక్ల యజమానులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. సినిమా హాళ్లు, బ్యాంకులు, బంగారం, బట్టలు, కిరాణా దుకాణాలను ఆందోళనకారులు బంద్ చేయించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోని వ్యాపారులు బంద్కు మద్దతునివ్వడంతో మార్కెట్లో వ్యాపార లావాదేవీలు నిలిచిపోయాయి. శాసన మండలి ఉప నాయకుడు, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి పెరిగిన ధరలకు నిరసనగా జరుగుతున్న బంద్లో భాగంగా ఎడ్ల బండిపై నగరంలో ప్రదర్శన నిర్వహించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అనుచర గణంతో బస్టాండ్ ప్రాంతానికి చేరుకోగా.. కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి తన క్యాంపు కార్యాలయం నుంచి ట్రాక్టర్ నడుపుతూ రాగా.. కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రేణుకా చౌదరి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక పాలన సాగిస్తూ.. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆరోపించారు. కేసీఆర్ కథ సినిమా ట్రైలర్లా ఉందని, దీనిని చూసిన వారంతా బాగుంటుందని సినిమాకు వెళ్తే అక్కడ శూన్యమని.. అదే స్థాయిలో కేసీఆర్ పరిపాలన ఉందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని అనేక సార్లు డిమాండ్ చేసినా.. అధికార దాహంతో మోదీతో కలిసి ధరలు తగ్గించడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఎమ్మెల్సీ పొం గులేటి సుధాకర్రెడ్డి మాట్లాడుతూ క్రూడాయిల్ ధరలు తగ్గినా.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకపోవడం దారుణమన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఇరు ప్రభుత్వాలు సైతం హామీల అమలులో ఘోరంగా విఫలమయ్యాయన్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు తగ్గినా.. మోదీ సర్కార్ మాత్రం ధరలు పెంచుతూ పోతోందన్నారు. దీనివల్ల సామాన్యుడిపై మోయలేని భారం పడుతోందని, ధరలు తగ్గించకపోతే ప్రభుత్వాలకు తగిన విధంగా గుణపాఠం చెప్పాల్సి వస్తోందని హెచ్చరించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇంధన ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నాయన్నారు. రోజువారీ ధరల మార్పును తీసుకొచ్చి.. ప్రజల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ వారికి లాభాలను చేకూర్చేందుకు దేశంలో సామాన్య ప్రజలపై భారాన్ని మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తేవాలని డిమాండ్ చేశారు. బంద్లో వివిధ పార్టీల నాయకులు పోట్ల నాగేశ్వరరావు, మానుకొండ రాధాకిషోర్, దిరిశాల భద్రయ్య, మద్ది వీరారెడ్డి, రాపర్తి శరత్, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఫజల్, రాయల నాగేశ్వరరావు, మేళం శ్రీనివాసయాదవ్, రామిశెట్టి మనోహర్నాయుడు, కట్ల రంగారావు, నాగండ్ల దీపక్చౌదరి, బాలగంగాధర్ తిలక్, టీడీపీ జిల్లా కార్యదర్శి తోటకూరి శివయ్య, నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, జి.రామయ్య, ఆవుల అశోక్, పోటు ప్రసాద్, జానీమియా, తాటి వెంకటేశ్వర్లు, ఎర్రా శ్రీకాంత్, మాచర్ల భారతి, కల్యాణం వెంకటేశ్వర్లు, సింహాద్రి యాదవ్, గోపాల్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పాక్షికంగా తిరిగిన బస్సులు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బస్సులు పాక్షికంగా తిరిగాయి. కొన్ని ప్రాంతాల్లో బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. ఆందోళనకారులు ఉదయం సమయంలో డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. మధ్యాహ్నం నుంచి బస్సులు బయటకు వచ్చాయి. మధిర, ఖమ్మం తదితర డిపోల ఎదుట ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 634 బస్సులు ఉండగా.. వాటిలో 190 బస్సులు రద్దు చేశారు. 444 బస్సులు తిరిగినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. బంద్ కారణంగా ఉమ్మడి జిల్లాలో ఆర్టీసీకి రూ.30లక్షల వరకు నష్టం వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో ప్రజలు ప్రయాణాలు చేసేందుకు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఖమ్మం వచ్చిన ఒకటి, రెండు బస్సులను కాల్వొడ్డు వద్ద అడ్డుకోవడంతో ప్రయాణికులు అక్కడి నుంచి తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు రెండు, మూడు కిలోమీటర్లు నడిచివెళ్లారు. ఆస్పత్రులకు వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లావ్యాప్తంగా బంద్.. ఖమ్మం నియోజకవర్గంతోపాటు సత్తుపల్లి, మధిర, వైరా, పాలేరు నియోజకవర్గాల్లో బంద్ ప్రభావం కనిపించింది. కాంగ్రెస్తోపాటు సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ, టీడీపీ, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. దుకాణాలను బంద్ చేయించారు. సినిమా హాళ్లు మూసివేశారు. చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో ఖమ్మం–బోనకల్ ప్రధాన రహదారిపై బైఠాయించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ముదిగొండలో ఖమ్మం–కోదాడ ప్రధాన రహదారిపై ముదిగొండ సెంటర్లో రెండు గంటలపాటు బంద్ నిర్వహించారు. ఏన్కూరు ప్రధాన సెంటర్ నుంచి సాయిబాబా మందిరం వరకు ద్విచక్ర వాహనాలపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాన సెంటర్లో రాస్తారోకో చేశారు. సుమారు గంటసేపు రాస్తారోకో చేయడంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అనంతరం జీపునకు తాడుకట్టి లాగి నిరసన తెలియజేశారు. ఎర్రుపాలెంలో కాంగ్రెస్, టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సీపీఎం ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి తహసీల్ వరకు ఆటోకు తాడుకట్టి లాక్కుంటూ వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. -
కొనసాగుతున్న పెట్రో మంట
న్యూఢిల్లీ: పెట్రో ఉత్పత్తుల ధరలు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. విపక్షాలు భారత్ బంద్ నిర్వహించినప్పటికీ ధరల పెరుగుదల ఆగలేదు. డాలర్తో రూపాయి మారకం విలువ పడిపోవడంతో దిగుమతుల ధర పెరిగింది. దీంతో సోమవారం పెట్రోల్ ధర లీటర్కు 23 పైసలు, డీజిల్ 22 పైసలు పెరిగింది. తాజా మార్పులతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.80.73కు చేరగా.. డీజిల్ ధర రూ.72.83గా ఉంది. కాగా, ప్రస్తుతానికి ధరలను నియంత్రించే అవకాశం లేదని కేంద్రం స్పష్టం చేయడంతో వినియోగదారులపై మరింత భారం తప్పేట్లు లేదు. -
పెట్రో సెగ.. దేశవ్యాప్తంగా నిరసనలు,ర్యాలూలు
-
నేడు భారత్ బంద్
-
‘పెట్రో’ ధరలకు మళ్లీ రెక్కలు
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ఇప్పటికే అల్లాడుతున్న సామాన్య ప్రజలకు ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు మరోసారి షాకిచ్చాయి. ఆదివారం లీటర్ పెట్రోల్పై 12 పైసలు, డీజిల్పై 10 పైసలు పెంచాయి. దీంతో దేశరాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ.80.50కు చేరగా, డీజిల్ రూ.72.61కు చేరి ఆల్టైం రికార్డును సృష్టించాయి. ఆగస్టు 15 నుంచి ఇప్పటివరకూ లీటర్ పెట్రోల్పై రూ.3.42, డీజిల్పై రూ.3.84ను ఆయిల్ కంపెనీలు పెంచాయి. ప్రస్తుతం ఆయిల్ రిఫైనరీల వద్ద లీటర్ పెట్రోల్ రూ.40.50, డీజిల్ రూ.43గా ఉంటోంది. కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న ఎక్సైజ్ సుంకాలతో పాటు ఆయా రాష్ట్రాలు విధిస్తున్న వ్యాట్ను తగ్గించకపోవడంతో తాజాగా చమురు ధరలు చుక్కల్ని తాకుతున్నాయి. ప్రస్తుతం కేంద్రం లీటర్ పెట్రోల్పై రూ.19.48, డీజిల్పై రూ.15.33 ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తోంది. ఇక మహారాష్ట్రలోని ముంబైలో పెట్రోల్పై అత్యధికంగా 39.12 శాతం వ్యాట్ విధిస్తుండగా, తెలంగాణలో డీజిల్పై అత్యధికంగా 26 శాతం వ్యాట్ విధిస్తున్నారు. 2014–15లో రూ.99,184 కోట్లుగా ఉన్న కేంద్ర ఎక్సైజ్ రాబడి..2017–18 నాటికి రూ.2,29,019 కోట్లకు ఎగబాకింది. రాష్ట్రాల వ్యాట్ 2014–15లో రూ.1,37,157 కోట్ల నుంచి 2017–18 నాటికి రూ.1,84,091 కోట్లకు పెరిగింది. రాజస్తాన్లో పెట్రోల్, డీజిల్ ధరల నుంచి ఉపశమనం కల్పించేందుకు 4 శాతం వ్యాట్ను తగ్గిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం వసుంధరా రాజే తెలిపారు. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు రూ.2.4 మేర తగ్గుతాయన్నారు. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరల్ని తగ్గించేందుకు అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నట్లు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తెలిపారు. -
రికార్డు స్థాయికి పెట్రో మంట
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రో ఉత్పత్తుల ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. రాజధాని ఢిల్లీలో తొలిసారిగా పెట్రోల్ ధర రూ. 80 మార్కును దాటింది. డాలర్తో రూపాయి మారకవిలువ తగ్గడంతో దిగుమతుల ధరలు పెరిగినందువల్లే ఈ స్థాయిలో రేట్లు పెరిగిపోయాయి. శనివారం ఒక్కరోజే పెట్రోల్ ధర 39 పైసలు, డీజిల్ ధర 44 పైసలు పెరిగింది. తాజా పెంపుతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ.80.38కి, డీజిల్ రూ.72.51కి చేరింది. అటు ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.87.77 కాగా, డీజిల్ రూ. 76.98కు పెరిగింది. మిగిలిన మెట్రో నగరాలు, రాష్ట్రాల రాజధానులతో పోలిస్తే ఢిల్లీలో ధరలు తక్కువగా, ముంబైలో అత్యధికంగా ఉన్నాయి. కాగా, పెరుగుతున్న పెట్రోల్ ధరలను నిరసిస్తూ సోమవారం (సెప్టెంబర్ 10న) విపక్షాలు భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. కేంద్ర, రాష్ట్రాల పన్నుల కారణంగానే పెట్రో ఉత్పత్తుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెట్రోల్ ధరలను తగ్గించే విషయంపై కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. మరో రెండు నెలల్లో 4 రాష్ట్రాలకు ఎన్నికల నేపథ్యంలో ప్రజావ్యతిరేకత రాకుండా వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. -
మళ్లీ పెట్రో ధరల షాక్
న్యూఢిల్లీ: రూపాయి మారకపు విలువ పడిపోవడంతో డీజిల్, పెట్రోల్ ధరలు మరోమారు పెరిగాయి. సోమవారం డీజిల్ ధర లీటరుకు 14 పైసలు, పెట్రోల్ లీటరుకు 13 పైసలు పెరిగినట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. దీంతో ఢిల్లీలో లీటరు డీజిల్ ధర రూ.69.46 రికార్డు స్థాయి గరిష్టానికి చేరుకుంది. ముంబైలో డీజిల్ ధర రూ.73.74కు చేరింది. ఆగస్టు 16న రూపాయి విలువ పడిపోయినప్పటి నుంచి ఇంధనం ధరలు పెరుగుతున్నాయి. గత నాలుగేళ్లలో పెట్రో ఉత్పత్తులపై పన్నుల ద్వారా కేంద్రానికి వస్తున్న సొమ్ము రూ.99,184 కోట్ల నుంచి రూ.2,29,019 కోట్లకు పెరిగింది. రాష్ట్రాల్లో వ్యాట్ రూ.1,37,157 కోట్ల నుంచి రూ.1,84,091 కోట్లకు పెరిగింది. -
మోదీకి తొమ్మిది పైసల చెక్కును పంపిన సామాన్యుడు
సిరిసిల్లటౌన్ : పెట్రో ధరల అమలులో కేంద్ర సర్కారు తల.. తోక లేకుండా వ్యçవహరించండంపై సామాన్యుల్లో అసహనం వ్యక్తం అవుతోంది. రూపాయల్లో పెంచుతూ.. పైసల్లో తగ్గిస్తే..ప్రజలకు ఒనగూరేదేమి లేదంటూ ఓ సామాన్యుడు తనదైన శైలిలో నిరసన వ్యక్తం చేశాడు. నిన్న తగ్గించిన 0.09 పైసలను చెక్కు రూపంలో పీఎం సహాయనిధికి విరాళంగా ఇస్తూ.. వ్యంగ్యాస్త్రాన్ని సంధించాడు. సిరిసిల్ల అర్బన్ మండలం చంద్రంపేటకు చెందిన వీరగోని చందు సోమవారం తన బైక్లో సిరిసిల్లలోని భారత్ పెట్రోలియంకు చెందిన బంక్ కే. శ్రీనివాస్ అండ్ కంపెనీలో పెట్రోల్ పోయించుకున్నాడు. దీనికిగాను బంక్నుంచి రశీదు తీసుకోగా.. అతడికి 0.09 తగ్గించి, రూ.82.87 పైసలకు లీటర్గా రశీదు ఇచ్చారు. చందు తన జేబునుంచి రూ.100 నోటు బంక్లో ఇవ్వగా రూ. 13 రూపాయలు మాత్రమే చెల్లించారు. మిగతా చిల్లర ఇవ్వాలని కోరగా..0.87 పైసలు ఇస్తే రూ.1 ఇస్తామని బంక్ సిబ్బంది ఎదురు ప్రశ్నించారని చందు పేర్కొన్నాడు. ప్రభుత్వం తగ్గించిన 0.09 పైసలతో పాటు అదనంగా 13పైసలు కూడా బంక్ సిబ్బంది ఇవ్వకపోవడంపై ఆయన అసంతృప్తి చెందాడు. కేంద్ర సర్కారు తీరుపై నిరసన తెలుపుతూ..0.09 పైసలను చెక్కు రూపలో ప్రధాన మంత్రి సహాయ నిధికి విరాళంగా పంపించాలంటూ కలెక్టర్కు అందించాడు. -
పెట్రో ధరల పెంపుపై సర్వత్రా నిరసన
నిజామాబాద్ సిటీ : పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్రభారం పడుతోందని డీసీసీ అధ్యక్షుడు తాహెర్ అన్నారు. శుక్రవారం యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పంచరెడ్డి ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని కోరుతూ ఆటోను తాడుతో లాగుతూ వినూత్న నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ చమురు సంస్థలు ఇష్టానుసారంగా ధరలు పెంచటంతో వాహనదారులపై తీవ్ర భారం పడుతోందన్నారు. యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చరణ్ మాట్లాడుతూ యూపీఏ హయంలో 140 డాలర్లుకు లభించే బ్యారల్ సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఉండేవని, ప్రస్తుతం 80 డాలర్లకే బ్యారల్ ఉన్న ఆల్ టైం ధరలు ఉన్నాయన్నారు. పెరిగిన ధరలతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాల నడ్డి విరిగి బతుకు భారంగా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ కేత్ జిల్లా అధ్యక్షుడు ముప్పా గంగారెడ్డి, యూత్ నాయకులు నాగరాజు, కిషోర్, రాథోడ్, బిన్ని, ఆకుల మహేందర్, మధుకర్, విజయ్, నరేందర్, దత్తాద్రి, చింటు, అదర్స్, మున్నా, ఏఎల్ రమేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. వర్నిలో ఆటోలను లాగుతూ.. వర్ని(బాన్సువాడ): రోజురోజుకూ పెరుగుతున్న పెట్రో, డీజిల్ ధరలను తగ్గించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తూ శుక్రవారం మండల కేంద్రంలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆటోకు తాడు కట్టి నిరసన వ్యక్తం చేశారు. వర్ని క్రాసింగ్ నుంచి తహసీల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ హరిబాబుకు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందచేశారు. ఈ సందర్భంగా వర్నిబ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కర్లం సాయరెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రో డీజిల్ ధరలను నియంత్రించడంలో నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రంజ్యానాయక్, డీసీసీ ప్రధాన కార్యదర్శి గంగా ప్రసాద్, ఎస్ఎన్పురం టౌన్ అధ్యక్షుడు ప్రశాంత్ పటేల్, విండో మాజీ డై రక్టర్ సురేష్ బాబా, మండల నాయకులు మో స్రా లక్ష్మణ్, గైని గోపి, మల్లికార్జునప్పా, నాగేశ్వర్రావ్, సలీం, ఖాసీం, ఆటో యూనియన్ నాయకు లు ఫెరోజ్, ఆజాం తదితరులు పాల్గొన్నారు. ట్రాలీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో.. వర్ని మండల కేంద్రంలో సుభాష్ చంద్రబోస్ ట్రాలీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం పెట్రో ధరల పెంపుపై ఆటో కార్మికుల నిరసన తెలిపారు. ప్రతి రోజు ధరలు పెరగడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్ కార్యాలయానికి తహసీల్దార్ హరిబాబుకు వినతిపత్రం అందచేశారు. కార్యక్రమంలో ట్రాలీ ఆటో యూనియన్ సంఘం అధ్యక్షుడు కె శ్రీనివాస్, ఉపాద్యాక్షుడు మారుతి, మాణిక్యం, బాబుమియా, సాయిలు, కృష్ణ, వసంత్ తదితరులు పాల్గొన్నారు. -
‘పెట్రో’ పరిష్కారంపై చర్చిస్తున్నాం
భువనేశ్వర్/ముంబై: పెట్రో ధరలు పెరగడంపై సత్వరమే ఓ పరిష్కారాన్ని కనుగొనేందుకు యత్నిస్తున్నట్లు పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. పెట్రో బాదుడు నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించే విషయమై ప్రభుత్వం విస్తృతంగా చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు. గురువారం ఆయన భువనేశ్వర్లో మాట్లాడారు. ‘పెట్రోల్, డీజిల్ ధరల్ని తగ్గించేందుకు వీటిని వస్తుసేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి తీసుకురావాలని పెట్రోలియం శాఖ యోచిస్తోంది. జీఎస్టీ పరిధిలోకి తెచ్చేలోపు ఈ సమస్యకు వెంటనే ఓ పరిష్కారం కనుగొనడంపై కేంద్రం చర్చిస్తోంది. పెట్రో ఉత్పత్తుల ధరల నియంత్రణలో కేంద్రంతో పాటు రాష్ట్రాల పాత్ర ఉంది’ అని అన్నారు. పెట్రో సమస్యపై స్వల్పకాలిక, దీర్ఘకాలిక పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇరాన్, వెనిజువెలా దేశాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితుల వల్లే అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా పెరిగాయన్నారు. ప్రజలపై పెట్రోబాదుడుకు నిరసనగా ప్రతిపక్షాలు గురువారం దేశవ్యాప్తంగా పలుచోట్ల నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. పెట్రోల్, డీజిల్పై విధిస్తున్న వ్యాట్, అమ్మకపు పన్నుల్ని రాష్ట్రాలు తగ్గించాలని నీతిఆయోగ్ సూచించింది. ఆర్థికలోటును కట్టడిచేయడం, ముడిచమురు ధరల ప్రభావాన్ని ఎదుర్కోవడం వంటి కీలక బాధ్యతలు కేంద్రంపై ఉన్నందున ఎక్సైజ్ సుంకాలు తగ్గించడం వీలుకాదని స్పష్టంచేసింది. -
పెట్రో మంట పరిష్కారానికి కృషి
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పదో రోజూ పెరగడంపై న్యాయ, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ స్పందించారు. అంతర్జాతీయంగా అస్థిరత, ముడిచమురు ధరల్లో మార్పులు వంటి సమస్యలకు ప్రజలు ప్రభావితం కాకుండా శాశ్వత పరిష్కారాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. బుధవారం నాడిక్కడ ప్రధాని నేతృత్వంలో కేబినెట్ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పెట్రో ఉత్పత్తులపై కేంద్రం రూ.25 వరకూ తగ్గించవచ్చని మాజీ ఆర్థికమంత్రి చిదంబరం చేసిన ట్వీట్లపై వ్యాఖ్యలు చేయబోనని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారం కోల్పోయినప్పటి నుంచి చిదంబరం ట్విటర్లో చురుగ్గా మారారని ఎద్దేవా చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మొబైల్ కనెక్టివిటీ అమలు ప్రతిపాదనను క్యాబినెట్ ఆమోదించిందన్నారు. మొబైల్ కనెక్టివిటీ రెండో విడతలో భాగంగా 10 రాష్ట్రాల్లోని 96 జిల్లాల్లో రూ.7,330 కోట్లతో 4,072 టవర్లను 2జీ, 4జీ నెట్వర్క్తో అనుసంధానిస్తామన్నారు. ప్రాజెక్టులో భాగంగా ఏపీలో 8 జిల్లాల్లో 429, తెలంగాణలో 14 జిల్లాల్లో 118 టవర్ లోకేషన్లు గుర్తించామన్నారు. దేశంలో తొలిæ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని మణిపూర్లో ఏర్పాటు చేసేందుకు త్వరలో ఆర్డినెన్స్ తెస్తామన్నారు. -
త్వరలోనే పెట్రోల్ @100.. తగ్గించడానికి అదొక్కటే మార్గం!
సాక్షి, హైదరాబాద్ : రోజురోజుకు అమాంతం పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు ప్రజలను బెంబెలెత్తిస్తున్నాయి. గడిచిన పదిరోజుల్లో పెట్రోల్ ధర క్రమంగా పెరిగింది కానీ, తగ్గింది లేదు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో లీటరు పెట్రోల్ 81. 47 రూపాయలకు లభిస్తుండగా.. లీటరు డీజిల్ 74.04 రూపాయలకు లభిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఏదిఏమైనా పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరగడంతో సామ్యానుడిపై భారం మరింత పడుతోంది. మధ్యతరగతి వేతన జీవులు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల భారాన్ని తట్టుకోవడానికి తమ రోజువారీ నిత్యావసరాల్లో కోత పెట్టుకోవాల్సి పరిస్థితి నెలకొంది. మొత్తానికి దేశమంతటా పెట్రోల్, డీజిల్ ధరలపై సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే ధరలు పెరుగుతూపోతే త్వరలోనే లీటరు పెట్రోల్ ధర రూ. 100లను దాటుతుందని, అప్పుడు మధ్యతరగతి ప్రజలు మరింతగా ఇబ్బంది పడాల్సి వస్తుందని అంటున్నారు. వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని పెట్రో ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చమురు సంస్థలతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలంటే రాష్ట్ర స్థాయిలో వ్యాట్ తదితర పన్నులు, కేంద్రం పన్నులు, సుంకాలు తగ్గించడమే ఒక్కటే మార్గమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘పెట్రో ధరలు నేరుగా ముడి చమురు ధరలతో ముడిపడి ఉన్నాయి. ఓపీఈసీ దేశాలు ముడిచమురు సరఫరాను నిలిపివేశాయి. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ధరలు తగ్గించాలని చెప్పడానికి లేదు. కానీ కేంద్ర, రాష్ట్రాల స్థాయిలో విధిస్తున్న వివిధ పన్నులు, సుంకాలు తగ్గించడం ద్వారా పెరుగుతున్న పెట్రోల్ ధరల నుంచి సామాన్యులకు ఊరట కల్పించవచ్చు. ధరలు తగ్గించడానికి అదొక్కటే మార్గం’ అని పెట్రోల్ పంప్ డీలర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు అజయ్ భన్సల్ తెలిపారు. -
ఎన్నికలు ముగిశాయి.. చార్జీలు పెరిగాయి
న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గత 19 రోజులుగా నిలిచిపోయిన పెట్రోల్, డీజిల్ ధరలు సోమ వారం మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 17 పైసలు, డీజిల్పై 21 పైసలు పెంచుతూ ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో దేశరాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ.74.80కు, డీజిల్ ధర రూ.66.14కు చేరుకుంది. దీంతో డీజిల్ ధర గత 56 నెలల గరిష్టానికి చేరుకున్నట్లైంది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఓఎంసీలు పెట్రోల్, డీజిల్ ధరల్ని ప్రతిరోజూ సవరిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, కర్ణాటక ఎన్నికల కారణంగానే పెట్రోల్, డీజిల్ ధరల రోజువారీ సవరణను నిలిపివేశారా అన్న ప్రశ్నకు ఓఎంసీలు జవాబు దాటవేశాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల్లో పెరుగుదలతో పాటు డాలర్తో పోల్చుకుంటే రూపాయి బలహీనపడటంతో గత 19 రోజుల్లో రూ.500 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వరంగ ఆయిల్ సంస్థలు వెల్లడించాయి. ధరల పెంపుపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పంది స్తూ.. ‘కర్ణాటకలో ఎన్నికలు పూర్తికాగానే చము రు ధరలు నాలుగేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. ఎంతమంది వీలైతే అంతమంది ప్రజల్ని, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మోసం చేయడమే మోదీనామిక్స్ కీలకసూత్రం’ అని అన్నారు. -
పెట్రోల్,డీజిల్ భారీ ధరలు; తగ్గాలంటే దారిదే!
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు నాలుగేళ్ల గరిష్టానికి చేరడం, యావత్ దక్షిణాసియాలోనే పెట్రో ఉత్పత్తులపై అధిక పన్నులు వసూలు చేస్తోన్న దేశంగా భారత్ వెలిగిపోతుండటం తెలిసిందే. దేశరాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ.73.73 కాగా, లీటర్ డీజిల్ ధర రూ.64.58. అదే మన తెలుగురాష్ట్రాల్లోనైతే ఈ వసూళ్లు తారాస్థాయిలో జరుగుతోంది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 78 పైమాటే, ఇక విశాఖపట్నంలోనైతే రూ. 79 దాటింది. నెల్లూరు, చిత్తూరు లాంటి జిల్లాల్లోనైతే ఏకంగా లీటర్ పెట్రోలును రూ.80కి అమ్ముతున్నారు. ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోన్న ధరలపై కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ స్పందించారు. ఒక్కటే దారి: సోమవారం పార్లమెంట్ వాయిదా అనంతరం మంత్రి ప్రధాన్ మీడియాతో మాట్లాడుతూ ధరల తగ్గుదలకు ఓ సూచన చేశారు. ‘‘ఇప్పటికే జీఎస్టీ కౌన్సిల్ను పలుమార్లు అభ్యర్థించాను.. పెట్రో ఉత్పత్తులను కూడా జీఎస్టీ పరిధిలోకి తెస్తే, అవి వినియోగదారుడికి అందుబాటు దరల్లో లభించడం ఖాయం’’ అని స్పష్టం చేశారు. ఇంకా.. ‘‘పెట్రోలియం ఉత్పత్తులనేవి అంతర్జాతీయ వస్తువులన్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా చోటుచేసుకునే ఒడిదుడుకులు దేశీయంగా ప్రభావం చూపుతున్నాయి. వినియోగదారుల పరంగా భారత్ సున్నితమైన దేశం. ధరల తగ్గింపునకు మా వంతు ప్రయత్నాలను చేస్తున్నాం..’’ అని మంత్రి అన్నారు. దేశంలో అన్నిరకాల ఉత్పత్తులకు భిన్నంగా పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురాకపోవడం రాజకీయంగా విమర్శలకు దారితీసిన విషయం విదితమే. ఏదైనా ఉత్పత్తిపై జీఎస్టీ విధింపునకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షుడిగా, అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉండే జీఎస్టీ కౌన్సిల్దే తుది నిర్ణయమన్న సంగతి తెలిసిందే. గతంలో కేంద్ర ప్రభుత్వం చేతులో ఉన్న ధరల నియంత్రణ అధికారాన్ని ఆయిల్ కంపెనీలకు కట్టబెట్టిన తర్వాత.. ఆ సంస్థలు 15 రోజులకు ఒకసారి పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షించేవి. గతేడాది జూన్ నుంచి రోజువారీగా ధరలను సమీక్షించడం ప్రారంభమైంది. అప్పటి నుంచి రోజుకింత చొప్పున పెరుగూ తాజాగా నాలుగేళ్ల గరిష్టస్థాయికి పెట్రోల్, డీజిల్ ధరలు చేరాయి. -
ఆల్టైం రికార్డుకు చేరిన పెట్రోల్, డీజిల్ ధరలు
-
పెట్రో షాక్లతో విలవిల...
న్యూఢిల్లీః పెట్రోల్ ధరలను రోజువారీ సవరణ పేరుతో కొద్దికొద్దిగా పెంచుతున్న చమురు సంస్థలు జులై నుంచి ఇప్పటివరకూ పెంచిన మొత్తం చూస్తే షాక్ తినాల్సిందే. జులై నుంచి పెట్రోల్ ధరలు లీటర్కు రూ 6 పెరగ్గా, డీజిల్ ధరలు లీటర్కు రూ 3.67 పైసల మేర భారమయ్యాయి. పెట్రోల్ ధరలు మూడేళ్ల గరిష్టస్థాయిలో పెరగ్గా, డీజిల్ ధరలు నాలుగు నెలల గరిష్టస్ధాయిలో పెరిగాయి. ప్రతినెలా 1, 16 తేదీల్లో ధరలను సవరిస్తున్న విధానానికి స్వస్తి పలికిన ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు జూన్ నుంచి రోజూ ధరలను మార్చే విధానాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పద్ధతిని అనుసరించడం ప్రారంభమైన తొలి పక్షం రోజుల్లో స్వల్పంగా తగ్గిన పెట్రోల్ ధరలు ఇక అప్పటినుంచి పెరుగుతూనే ఉన్నాయి.గతంలో పెట్రో ధరలు ఒకేసారిగా పెంచడంతో కస్టమర్లకు దీనిపై అవగాహన ఉండేదని, ఇప్పుడు రోజుకు పైసా, పదిహేను పైసల చొప్పున పెంచుతుంటే పెద్దగా గుర్తించడం లేదని ఓ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు.