Crude Oil Prices
-
దేశ, విదేశీ గణాంకాలకు ప్రాధాన్యం
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్ను ఈ వారం ప్రధానంగా దేశ, విదేశీ గణాంకాలు నిర్దేశించే అవకాశముంది. వీటికితోడు ముడిచమురు ధరలు, ప్రపంచ ప్రధాన కరెన్సీలతో డాలరు మారకం వంటి అంశాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. గత కొద్ది రోజులుగా దేశీ స్టాక్స్లో అమ్మకాలకే మొగ్గు చూపుతున్న విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) ఇటీవల కొనుగోళ్ల యూటర్న్ తీసుకున్న విషయం విదితమే. దీంతో విదేశీ పెట్టుబడులతోపాటు.. రాజకీయ భౌగోళిక అంశాలూ సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు స్టాక్ నిపుణులు తెలియజేశారు. ఎఫ్ఐఐల పెట్టుబడుల కారణంగా లార్జ్క్యాప్ బ్యాంకింగ్ షేర్లు జోరు చూపుతున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ వ్యూహకర్త వీకే విజయ్కుమార్ తెలియజేశారు. కొన్ని ఎంపిక చేసిన షేర్లలో పెట్టుబడుల ప్రభావం కనిపిస్తున్నట్లు పేర్కొన్నారు. గత రెండు నెలలుగా భారీ అమ్మకాలు చేపట్టిన ఎఫ్ఐఐలు ఈ నెలలో నికర పెట్టుబడిదారులుగా నిలుస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.గత వారమిలా..శుక్రవారం(6)తో ముగిసిన గత వారం దేశీ సాŠట్క్ ఇండెక్సులు పలు ఆటుపోట్ల మధ్య తిరిగి జోరందుకున్నాయి. సెన్సెక్స్ నికరంగా 1,906 పాయింట్లు(2.4 శాతం) జంప్చేసి 81,709 వద్ద ముగిసింది. నిఫ్టీ 547 పాయింట్లు(2.3 శాతం) ఎగసి 24,678 వద్ద స్థిరపడింది. గత వారం మార్కెట్ విలువరీత్యా టాప్–10 కంపెనీలలో ఆరు కంపెనీల మార్కెట్ విలువ రూ. 2 లక్షల కోట్లమేర బలపడింది. టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ. 62,575 కోట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలువ రూ. 45,338 కోట్లు, ఇన్ఫోసిస్ రూ. 26,886 కోట్లు, ఎస్బీఐ రూ. 22,312 కోట్లు చొప్పున ఎగసింది. అయితే ఎయిర్టెల్ విలువ రూ. 16,720 కోట్లు, ఐటీసీ విలువ రూ. 7,256 కోట్లు క్షీణించింది.ఆర్థిక గణాంకాలుదేశీయంగా అక్టోబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి సూచీ వివరాలు గురువారం(12న) వెల్లడికానున్నాయి. సెపె్టంబర్లో పారిశ్రామికోత్పత్తి వార్షికంగా 3.1 శాతం పుంజుకుంది. ఆర్థికవేత్తల 2.5 శాతం అంచనాలను అధిగమించింది. ఇదేవిధంగా నవంబర్ నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు సైతం 12న వెలువడనున్నాయి. అక్టోబర్లో సీపీఐ వార్షిక రేటు 6.21 శాతంగా నమోదైంది. ఐఐపీ, సీపీఐ గణాంకాలు ఆర్థిక వ్యవస్థ పురోగతికి సంకేతాలని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ సీనియర్ వైస్ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలియజేశారు. ఎఫ్ఐఐలు పెట్టుబడులకు ఆసక్తి చూపడం ట్రేడర్లను ప్రభావితం చేసే వీలున్నట్లు వివరించారు. యుద్ధ భయాలురష్యా– ఉక్రెయిన్ యుద్ధ భయాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు కలిగించే వీలున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ సీనియర్ టెక్నికల్ విశ్లేషకులు ప్రవేష్ గౌర్ పేర్కొన్నారు. మరోపక్క తాజాగా ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ బలహీనపడటానికితోడు ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ వెనకడుగు వేయడం భారత్వంటి వర్ధమాన మార్కెట్లకు సానుకూలంగా పరిణమిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. నవంబర్ నెలకు యూఎస్ వ్యవసాయేతర ఉపాధి గణాంకాలు అంచనాలు(2 లక్షలు) మించుతూ 2.2 లక్షలకు చేరింది. నిరుద్యోగిత 4.2 శాతంగా నమోదైంది. అక్టోబర్లో తుఫాను సహా బోయింగ్లో ఉద్యోగుల సమ్మె కారణంగా ఉపాధి గణాంకాలు పడిపోయిన విషయం విదితమే. ఇవేకాకుండా పలు ఇతర విదేశీ గణాంకాలు సైతం ఈ వారం విడుదలకానున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా తెలియజేశారు. చైనా ద్రవ్యోల్బణం నేడు(9న), వాణిజ్య గణాంకాలు 10న విడుదలకానుండగా.. 11న యూఎస్ కీలక ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడికానున్నాయి. ఇవి ఈ నెలలో కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ చేపట్టనున్న పాలసీ సమీక్షపై ప్రభావం చూపే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 71 డాలర్ల ఎగువకు చేరగా.. న్యూయార్క్ మార్కెట్లో పసిడి ఔన్స్ 2,670 డాలర్లను తాకింది. డాలరు ఇండెక్స్ 106 వద్ద కదులుతోంది. -
అలా అయితేనే పెట్రోల్, డీజిల్ రేట్ల తగ్గింపు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మూడేళ్ల కనిష్టానికి పడిపోవడంతో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై అంచనాలు పెరిగిపోయాయి. ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రేట్లను తగ్గించొచ్చన్న అంచనాల నేపథ్యంలో దీనిపై పెట్రోలియం శాఖ సెక్రటరీ పంకజ్ జైన్ స్పష్టతనిచ్చారు.ముడి చమురు ధర కనిష్ట స్థాయి వద్ద స్థిరంగా కొనసాగితేనే పెట్రోల్, డీజిల్ రేట్ల సవరణకు అవకాశం ఉంటుందన్నారు. బ్రెంట్ చమురు బ్యారెల్ ధర మంగళవారం 70డాలర్ల దిగువకు పడిపోవడం గమనార్హం. 2021 డిసెంబర్ తర్వాత ఇంత కనిష్టానికి రావడం ఇదే మొదటిసారి. గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో చమురు సరఫరాపై హరీకేన్ ఫ్రాన్సిన్ ప్రభావం చూపించడంతో చమురు ధర గురువారం మళ్లీ 71 డాలర్లకు ఎగిసింది. ఈ ఏడాది కీలకమైన సార్వత్రిక ఎన్నికల ముందు పెట్రోల్, డీజిల్ ధరలను స్వల్పంగా తగ్గించడం తెలిసిందే. అంతకుముందు రెండేళ్లుగా ధరల్లో ఎలాంటి సవరణ చేయలేదు. ఢిల్లీలో ఓ కార్యక్రమం సందర్భంగా మీడియా ప్రతినిధులతో పంకజ్ జైన్ ఈ అంశంపై మాట్లాడారు. అంతర్జాతీయ చమురు ధరలు కనిష్టాల వద్ద స్థిరపడితే అప్పుడు ఆయిల్ కంపెనీలు ధరల తగ్గింపుపై తగిన నిర్ణయం తీసుకుంటాయని స్పష్టం చేశారు. మరోవైపు చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై మెరుగైన లాభాలు ఆర్జిస్తున్నాయని.. రేట్లపై నిర్ణయానికి ముందు మరికొంత కాలం పాటు ఇదే విధానం కొనసాగాలని కోరుకుంటున్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇప్పుడే రేట్లను తగ్గిస్తే.. మళ్లీ అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిపోతే నష్టపోవాల్సి వస్తుందన్న అభిప్రాయంతో ఆయిల్ కంపెనీలు కొంత కాలం పాటు వేచి చూసే ధోరణిని అనుసరించాలనుకుంటున్నట్టు చెప్పాయి. మహారాష్ట్ర ఎన్నికల ముందు? ప్రభుత్వరంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్పీసీఎల్) మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు రేట్లను తగ్గించొచ్చని బ్రోకరేజ్ సంస్థ ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ ఓ నివేదికలో తెలిపింది. ‘‘రాష్ట్రాల ఎన్నికల ముందు పెట్రోలియం రేట్లను తగ్గిస్తారన్న అంచనాలు ఉన్నాయి. మేము కూడా దీన్ని తోసిపుచ్చడం లేదు. జమ్మూ కశ్మీర్, హర్యానాకు సంబంధించి ఎన్నికల ప్రవర్తనా నియమావళి మరో నెల రోజుల పాటు అమల్లో ఉంటుంది. దీంతో దీపావళి లేదా మహారాష్ట్ర ఎన్నికల ప్రవర్తా నియమావళి అమల్లోకి రావడానికి ముందు రేట్లను తగ్గించొచ్చు. లీటర్ పెట్రోల్, డీజిల్పై రూ.2 వరకు తగ్గించొచ్చు. వచ్చే నెల రోజుల పాటు ఆయిల్ కంపెనీలు అసాధారణ మార్కెటింగ్ మార్జిన్లను సంపాదిస్తాయి. ఎల్పీజీపై నష్టాలను కూడా భర్తీ చేసుకోగలుగుతాయి. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో మార్కెటింగ్ మార్జిన్ లీటర్ పెట్రోల్/డీజిల్పై రూ.4.7/3.8 గా ఉంటే, జూలై–సెప్టెంబర్ కాలంలో మార్కెటింగ్ మార్జిన్లు లీటర్ పెట్రోల్/డీజిల్పై రూ.9.7/8గా ఉండొచ్చు’’అని ఎమ్కే గ్లోబల్ వివరించింది. దేశ చమురు అవసరాల్లో 85 % దిగుమతులపైనే ఆధారపడడం తెలిసిందే. -
40 శాతం పెరిగిన క్రూడ్ దిగుమతులు.. అయినా భారత్కు మేలే!
ప్రపంచంలో యూఎస్, చైనా తర్వాత మూడో అతిపెద్ద చమురు వినియోగ దేశంగా ఉన్న భారత్ జులైలో రష్యా నుంచి 2.8 బిలియన్ డాలర్ల(రూ.23.5 వేలకోట్లు) క్రూడాయిల్ను దిగుమతి చేసుకుంది. చైనా తర్వాత రష్యా నుంచి అధికంగా చమురు దిగుమతి చేసుకున్న దేశాల్లో ఇండియా రెండో స్థానంలో నిలిచింది.ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్-రష్యాల మధ్య నెలకొన్న భౌగోళిక అనిశ్చితుల వల్ల యూరప్ దేశాలు రష్యా క్రూడ్ దిగుమతిపై ఆంక్షలు విధించాయి. దాంతో రష్యా చమురు ధరను తగ్గించడంతోపాటు రూపాయిలో ట్రేడ్ చేసుకునేందుకు వీలుకల్పించింది. ఇతర దేశాల నుంచి పోలిస్తే రష్యా చమురు దిగుమతి భారత్కు కలిసివచ్చింది. చైనా కూడా రష్యా చమురు వాడకాన్ని పెంచింది. ఈ పరిణామాల వల్ల ప్రస్తుతం భారత్కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా రష్యా ఉద్భవించింది. ఉక్రెయిన్తో యుద్ధానికి ముందు భారత్కు చమురు దిగుమతిలో రష్యా వాటా 1 శాతం కంటే తక్కువే ఉండేది. క్రమంగా అది పెరుగుతూ దాదాపు 40 శాతం వాటాకు చేరింది.ఇదీ చదవండి: ఖనిజాల వెలికితీతకు ప్రోత్సాహకాలురష్యా క్రూడ్ ఎగుమతుల్లో 47 శాతం చైనా కొనుగోలు చేయగా, భారత్ (37 శాతం), యురోపియన్ యూనియన్ (7 శాతం), టర్కీ (6 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (సీఆర్ఈఏ) ఒక నివేదికలో తెలిపింది. చమురుతోపాటు బొగ్గును కూడా అధికంగానే రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు సీఆర్ఈఏ తెలిపింది. చైనా సైతం రష్యా బొగ్గును భారీగానే వాడుతోంది. డిసెంబర్ 5, 2022 నుంచి జులై 2024 చివరి వరకు రష్యా మొత్తం బొగ్గు ఎగుమతుల్లో 45 శాతం చైనా కొనుగోలు చేసింది. ఆ తర్వాత భారతదేశం (18 శాతం), టర్కీ (10 శాతం), దక్షిణ కొరియా (10 శాతం), తైవాన్ (5 శాతం) కొనుగోలు చేశాయి. -
ప్రపంచ పరిణామాలు కీలకం
ముంబై: ట్రేడింగ్ నాలుగు రోజులే జరిగే ఈ వారం మార్కెట్లో స్థిరీకరణ (కన్సాలిడేషన్) అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. దేశీయంగా ట్రేడింగ్ను ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడంతో ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు దిశానిర్దేశం చేస్తాయంటున్నారు. వీటితో పాటు స్థూల ఆరి్థక గణాంకాలు, రుతు పవనాల కదలికల వార్తలు, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలు, యూఎస్ బాండ్ ఈల్డ్స్ అంశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. వచ్చే వారం రోజుల్లో 3 కంపెనీలు ఐపీఓకు రానున్నాయి. ఇందులో డీ డెవలప్మెంట్ ఇంజనీర్స్, ఆమ్కే ఫిన్ ట్రేడ్ పబ్లిక్ ఇష్యూలు జూలై 19న, స్టాన్లీ లైఫ్స్టైల్స్ ఐపీఓ జూలై 20న ప్రారంభం కానున్నాయి. బక్రీద్ సందర్భంగా నేడు (సోమవారం) ఎక్సే్చంజీలకు సెలవు. ‘‘వివిధ మంత్రిత్వ శాఖలు ప్రకటిస్తున్న ‘అధికారం చేపట్టిన తొలి 100 రోజుల ప్రణాళిక’లను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. గరిష్ట స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటుచేసుకుంటే సాంకేతికంగా నిఫ్టీకి 22,800–23,100 శ్రేణిలో కీలక మద్దతు లభించే వీలుంది. కొనుగోళ్లు జరిగి 23,600 స్థాయిని చేధించగలిగే 24,000 మైలురాయిని అందుకోవచ్చు’’ అని రిలిగేర్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. కేంద్రంలోని కొత్త ప్రభుత్వం మూలధన వ్యయాలకు ప్రాధాన్యత కొనసాగిస్తుందనే ఆశలతో గతవారం అభివృద్ధి ఆధారిత రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. సెన్సెక్స్ 300 పాయింట్లు పెరిగి 77,145 వద్ద సరికొత్త రికార్డు నెలకొల్పంది. నిఫ్టీ 175 పాయింట్లు బలపడి 23,490 వద్ద జీవితకాల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. కాగా ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ప్రపంచ పరిణామాలు బ్రిటన్, కెనడా, ఆ్రస్టేలియా, బ్రెజిల్, నార్వేల కేంద్ర బ్యాంకులు ఈ వారంలో ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలు వెల్లడించనున్నాయి. దాదాపు అన్ని దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్ల కోతకే మొగ్గు చూపొచ్చనేది ఆరి్థకవేత్తల అంచనా. యూరోజోన్ మే ద్రవ్యోల్బణం డేటా మంగళవారం, బ్యాంక్ ఆఫ్ జపాన్ ద్రవ్య సమావేశ నిర్ణయాల వివరాలు (మినిట్స్) బుధవారం, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ద్రవ్య పరపతి సమావేశం గురువారం, అమెరికా జూన్ ప్రథమార్థపు సేవా, తయారీ రంగ గణాంకాలు శుక్రవారం వెల్లడి కానున్నాయి.గతవారంలో రూ.11,730 కోట్ల పెట్టుబడులు ఎన్నికల ఫలితాల వెల్లడి వరకు ఆచూతూచి వ్యవహరించిన విదేశీ ఇన్వెస్టర్లు తరువాత దేశీయ మార్కెట్లోకి బలమైన పునరాగమనం చేశారు. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం, రానున్న బడ్జెట్లో ప్రోత్సాహకాలు, రాయితీలు లభిస్తాయనే ఆశలతో భారత మార్కెట్లో క్రమంగా పెట్టుబడులు పెంచుకుంటున్నారు. గత వారం (జులై 14తో ముగిసిన వారం)లో విదేశీ ఇన్వెస్టర్లు భారతీయ ఈక్విటీల్లో రూ.11,730 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఇదే సమయంలో నికర అమ్మకాలు (జూన్ 1– 14 వరకు) రూ.3,064 కోట్లుగా ఉన్నాయి. మరోవైపు ఈ నెలలో (జూన్ 14 వరకు) ఎఫ్పీఐలు డెట్ మార్కెట్ లో రూ.5,700 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. ‘‘దేశంలో సంకీర్ణ కూటమి ఉన్నప్పటికీ, వరుసగా మూడోసారి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడం విధాన సంస్కరణలు, ఆరి్థక వృద్ధి కొనసాగింపుపై అంచనాలను పెంచింది’’ అని మారి్నంగ్స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ మేనేజర్ రీసెర్చ్ హిమాన్షు శ్రీవాస్తవ అన్నారు. ఇక మేలో ఎఫ్పీఐలు ఈక్విటీల నుండి రూ. 25,586 కోట్లను ఉపసంహరించుకున్నారు, ఏప్రిల్లో రూ. 8,700 కోట్లకు పైగా ఉపసంహరించుకున్నారు. అదే మార్చిలో రూ.35,098 కోట్లు, ఫిబ్రవరిలో రూ.1,539 కోట్లు నికర పెట్టుబడి పెట్టారు. -
తగ్గిన చమురు ధరలు.. ఒపెక్ప్లస్ కూటమి ప్రభావం
ముడిచమురు ఉత్పత్తిలో కోతలను వాయిదావేసేలా ఎనిమిది ఒపెక్ ప్లస్ దేశాలు ప్రణాళికలు సూచించాయి. దాంతో బ్రెంట్, వెస్ట్టెక్సాస్ ఇంటర్మీడియట్(డబ్ల్యూటీఐ) ఫ్యూచర్ ఇండెక్స్లపై ప్రభావం పడింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పడిపోయాయి.బ్రెంట్ ఫ్యూచర్స్ 24 పాయింట్లు లేదా 0.3% తగ్గి బ్యారెల్ చమురు ధర 80.87 అమెరికన్ డాలర్లకు చేరుకుంది. జులై నెల డెలివరీ కోసం యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూటీఐ) క్రూడ్ ఫ్యూచర్స్ 19 పాయింట్లు లేదా 0.25% పడిపోయి 76.80 అమెరికన్ డాలర్లకు చేరింది. (బ్రెంట్ ఫ్యూచర్లు, డబ్ల్యూటీఐ ద్వారా ప్రపంచమార్కెట్లో క్రూడాయిల్ ఇండెక్స్లో ట్రేడింగ్ చేయవచ్చు)పెట్రోలియం ఎగుమతి చేసే అజర్బైజాన్, బెహ్రెయిన్, బ్రూనై, మలేషియా, రష్యా, ఒమన్, సౌత్సుడాన్..వంటి దేశాల కూటమి ఒపెక్ ప్లస్ సమావేశం ఆదివారం నిర్వహించారు. 2025 వరకు ఉత్పత్తి కోతలను పొడిగించేందుకు కొన్ని దేశాలు నిరాకరించాయి. దాంతో సోమవారం క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గాయి.ప్రస్తుతం ఒపెక్ప్లస్ దేశాలు రోజుకు 58.6 లక్షల బ్యారెల్స్ (బీపీడీ) చమురు ఉత్పత్తిని తగ్గించాయి. ఇది ప్రపంచ డిమాండ్లో 5.7%గా ఉంది. ఎనిమిది సభ్యదేశాలు గతంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం..2024 చివరి నాటికి 36.6 లక్షల బ్యారెల్స్, జూన్ 2024 చివరి నాటికి 22 లక్షల బ్యారెల్స్ చమురు ఉత్పత్తిపై స్వచ్ఛంద కోతలు విధించాయి. వాటిపై నిర్ణయం తీసుకునేలా ఇటీవల సమావేశం జరిగింది. ఇందులో 2025 చివరి వరకు 3.66 మిలియన్ బీపీడీ కోతలను పొడిగించడానికి కూటమి అంగీకరించింది. 22 లక్షల బీపీడీ కోతలను 2024 సెప్టెంబర్ చివరి వరకు మూడు నెలల పాటు పొడిగించింది.అయితే ఎనిమిది ఒపెక్ + దేశాలు అక్టోబర్ 2024 నుంచి సెప్టెంబరు 2025 వరకు 22 లక్షల బీపీడీ చమురు కోతలను క్రమంగా ఉపసంహరించుకునే ప్రణాళికలను సూచించాయి. సెప్టెంబర్ 2024 వరకు కోతలను పొడిగించనప్పటికీ భవిష్యత్తులో చమురు కోతలుండవని భావించి సోమవారం ధరలు పతనమయ్యాయి. -
అధిక స్థాయిలోనే పెట్రోలు, డీజిల్ రేట్లు..
ముడి చమురు ధరలు రెండేళ్లుగా నిలకడగా ఉన్నా అధిక స్థాయిలోనే పెట్రోలు, డీజిల్ రేట్లు.. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల లాభాలు మాత్రం 4 రెట్లు పెరిగాయి!పశ్చిమాసియాలో అడపాదడపా ఉద్రిక్తతలు పెరిగి, వెంటనే చల్లబడుతున్నాయి. ప్రపంచ ఆర్థికవ్యవస్థను ఇప్పటికీ గట్టిగానే నడిపిస్తున్న ముడి చమురు ధరలు ఈ కారణంగా గత రెండేళ్లుగా పెద్ద మార్పులకు గురికాకుండా నిలకడగా ఉన్నాయి. ఫలితంగా దేశంలో శిలాజ ఇంధన మార్కెట్లో మూడొంతులకు పైగా వాటా కలిగి ఉన్న ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (ఓఎమ్సీలు) లాభాలు మాత్రం 2023–2024 ఆర్థిక సంవత్సరంలో నాలుగు రెట్లు పెరిగాయని వార్తలొస్తున్నాయి.ఓఎమ్సీలకు లాభాలొస్తే వాటిలో అత్యధిక వాటాలున్న కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో కోట్లాది రూపాయలు అందుతాయనే విషయం చెప్పాల్సిన పనిలేదు. ఇతర సరకులు, సేవల ధరలు పెరుగుతున్న ఇలాంటి సమయంలోనైనా దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలనే ఆలోచన ఈ ప్రభుత్వరంగ కంపెనీలకు రావడం లేదు. అంతర్జాతీయ క్రూడాయిల్ మార్కెట్లో ధరలు బాగా పైకి ఎగబాగినప్పుడు ఇండియాలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలను వెంటనే పెంచేసే ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం వంటి ఓఎమ్సీలు దేశంలో పెట్రో ఉత్పత్తుల వినియోగదారులకు అవకాశం వచ్చినప్పుడైనా మేలు చేసే నిర్ణయాలు తీసుకోవచ్చు.ప్రపంచంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా, ధరలను శాసించే పశ్చిమాసియా ప్రాంతానికి చెందిన ఒపెక్ దేశాలు జూన్ 1న సమావేశమై ఈ విషయాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటాయని తెలుస్తోంది. దేశం లోపల అత్యధిక మొత్తాల్లో చమురు నిక్షేపాలు ఉన్నా కొన్ని దశాబ్దాలుగా వాటిని వెలికితీయకుండా పశ్చిమాసియా దేశాల నుంచి సరఫరాలపై అమెరికా ఆధారపడేది. అయితే, ఇటీవల ముడి చమురును భారీ స్థాయిలో వెలికితీసి వాడుకుంటోంది అమెరికా. దానికి తోడు కొవిడ్–19 మహమ్మారి సృష్టించిన ఆర్థిక సంక్షోభం నుంచి ఏకైక అగ్రరాజ్యం ఇంకా పూర్తిగా కోలుకోకపోవడం, ద్రవ్యోల్బణం సాధారణ స్థాయికి చేరుకోకపోవడం, నిరుద్యోగం మామూలు స్థాయికి ఇంకా పడిపోకపోవడంతో ముడి చమురుకు డిమాండ్ రెండేళ్ల క్రితంలా లేదు.దీనికి తోడు మరో ప్రపంచ ఆర్థికశక్తి చైనా వేగం తగ్గడం కూడా శిలాజ ఇంథనాల వాడకం తగ్గిపోవడానికి మరో పెద్ద కారణం. దాదాపు 45 నెలలుగా క్రూడాయిల్ టోకు ధరలు నిలకడగా ఉన్నా భారతదేశంలో పెట్రో ఉత్పత్తుల వినియోగదారులకు ఆ నిష్పత్తిలో ప్రయోజనం అందించకపోవడం సబబు కాదనే అభిప్రాయం ఆర్థిక నిపుణుల్లో వెల్లడవుతోంది.- విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ, రాజ్యసభ సభ్యులు -
ఎన్నికలపర్వం ముగిస్తే భారం తప్పదా.?
అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. బ్యారెల్ చమురు ధర 90 యూఎస్ డాలర్లకు చేరింది. కానీ భారత్లో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. ఎన్నికలవేళ వీటిలో మార్పులు చేస్తే ఓటర్లలో కొంత వ్యతిరేకత వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దాంతో గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలు పెరుగుతున్నా వాటిని ప్రజలకు పాస్ఆన్ చేయడంలో కేంద్రం వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తుంది. దేశ ఇంధన అవసరాలు దాదాపు 80 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం భారత్పై భారీగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఆందోళనలు గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలను పెంచేలో దోహదం చేస్తున్నట్లు అభిప్రాయపడుతున్నారు. ఇరు దేశాల మధ్య వ్యవహారం మరింత ముదిరితే పరిస్థితులు చేదాటిపోయి దేశీయంగా ఇంధన ధరలు పెరగడం ఖాయమని చెబుతున్నారు. అసలేం జరిగిందంటే.. ఈ నెల మొదటివారంలో సిరియాలోని ఇరాన్ కాన్సులేట్పై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ విషయాన్ని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) కూడా ధ్రువీకరించింది. దీంతో ఇజ్రాయెల్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటూ 300లకుపైగా డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ ప్రతీకార దాడికి దిగింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. 2023 అక్టోబర్ తర్వాత ఈ స్థాయిలో చమురు ధరలు పెరగడం ఇదే తొలిసారి. ఈ దేశాల మధ్య వివాధం మరింత ముదిరితే పరిస్థితులు ప్రమాదకరంగా మారుతాయని మార్కెట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఇరాన్పై ప్రతీకార దాడుల్లో తాము పాల్గొనబోమని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుకు స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య యుద్ధ భయాలు నెలకొన్న నేపథ్యంలో ఒమన్, ఇరాన్ల మధ్య ఉన్న హార్ముజ్ జలసంధి కీలకంగా మారనుంది. ప్రపంచ ముడి చమురు సరఫరాలో సుమారు 20 శాతం ఈ మార్గం గుండానే జరుగుతుందని అంచనా. ఇప్పటికే ఇజ్రాయెల్తో సంబంధాలున్న ఓ వాణిజ్య నౌకను ఈ జలసంధిలో ఇరాన్ అడ్డుకుంది. ఇది ఇంతటితో ఆగకపోతే కష్టమే. ఒపెక్ సభ్యదేశాలైన సౌదీ అరేబియా, ఇరాన్, యూఏఈ, కువైట్, ఇరాక్ల నుంచి ఈ జలసంధి ద్వారానే పెద్ద ఎత్తున చమురు రవాణా జరుగుతుంది. ఇరాన్ ఈ జలసంధిగుండా ప్రయాణించే చమురు నౌకలను నిలిపేస్తే భారత్కు కష్టాలు తప్పవు. ఇదీ చదవండి: 5,500 మందితో హైదరాబాద్లో భారీ ఎక్స్పో.. ఎప్పుడంటే.. ఎన్నికల వేళ ఆచితూచి.. యుద్ధ భయాలు ఇలాగే కొనసాగితే భారత్లో సార్వత్రిక ఎన్నికల అనంతరం పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెరుగడం ఖాయమని తెలుస్తుంది. ఎంపీ ఎలక్షన్లతోపాటు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న తరుణంలో క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల పర్వం ముగిసిన తర్వాత వీటి ధరలు పెరుగుతాయనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. -
రష్యా వద్దు.. సౌదీయే ముద్దు.. పరిస్థితులు తారుమారు?
ఉక్రెయిన్తో యుద్ధానికి దిగిన రష్యాపై అమెరికా సహా సంపన్న దేశాలు ఆంక్షలు విధించాయి. ఆదాయం పెంచుకోవడానికి తన మిత్ర దేశాలకు రష్యా రాయితీపై ముడి చమురు సరఫరా చేసింది. దీన్ని భారత్ అనుకూలంగా మార్చుకుని రష్యా నుంచి ముడి చమురు దిగుమతి పెంచుకుంది. అయితే క్రమంగా యుద్ధ భయాలు తొలగిపోతుండడంతో రష్యా నుంచి ఇండియాకు దిగుమతి అవుతున్న క్రూడాయిల్ ఖరీదుగా మారుతోంది. ఉక్రెయిన్ వార్ మొదలైనప్పటి నుంచి రష్యన్ క్రూడ్ను చాలా తక్కువ రేటుకు ఇండియన్ కంపెనీలు కొంటున్నాయి. తాజాగా ఈ క్రూడ్పై ఇస్తున్న డిస్కౌంట్ను రష్యా తగ్గించింది. ప్రస్తుతం బ్యారెల్పై 3-4 డాలర్ల వరకు మాత్రమే డిస్కౌంట్ ఇస్తోంది. కానీ, రవాణా ఛార్జీలను మాత్రం తగ్గించలేదని, సాధారణం కంటే ఇంకా ఎక్కువగానే ఉన్నాయని క్రూడ్ విక్రయిస్తున్న కంపెనీలు చెబుతున్నాయి. పశ్చిమ దేశాలు రష్యన్ క్రూడ్పై బ్యారెల్కు 60 డాలర్ల ప్రైస్ లిమిట్ను విధించిన విషయం తెలిసిందే. ఈ ధర కంటే కొద్దిగా తక్కువకు ఇండియన్ కంపెనీలు క్రూడాయిల్ కొంటున్నాయి. అదే ఆయిల్ను డెలివరీ చేస్తున్న రష్యన్ కంపెనీలు బ్యారెల్కు 11 నుంచి 19 డాలర్ల వరకు రవాణా ఛార్జీని వసూలు చేస్తున్నాయని సమాచారం. దాంతో రష్యా నుంచి వరుసగా క్రూడాయిల్ దిగుమతులు తగ్గుతున్నాయి. అందుకు ప్రత్యామ్నాయంగా గత నెలలో సౌదీ అరేబియా నుంచి ముడి చమురు దిగుమతులు పెరిగాయి. రష్యా నుంచి ముడి చమురు దిగుమతి 22 శాతం నుంచి 16 శాతానికి తగ్గితే, సౌదీ అరేబియా నుంచి నాలుగు శాతం పెరిగింది. చెల్లింపుల సమస్య తలెత్తడంతో రష్యా నుంచి గత నెలలో క్రూడాయిల్ కొనుగోళ్లు 11 నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. రష్యాలోని సొకోల్ తదితర ప్రాంతాల నుంచి ఐదు క్రూడాయిల్ చమురు రవాణా నౌకలు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లాయని తెలుస్తుంది. భారత్లో టాప్ రిఫైనరీ సంస్థగా ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మాత్రమే సొకోల్తోపాటు రష్యాలోని రోస్ నెఫ్ట్ ప్రాంతం నుంచి చమురు కొనుగోళ్లకు వార్షిక ఒప్పందం కుదుర్చుకుంది. చెల్లింపు సమస్యను తగ్గించుకోవడానికి గత నెలలో సౌదీ అరేబియా సహా మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి చమురు కొనుగోలు ప్రారంభించిందని ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది. ఇదీ చదవండి: రూ.10 వేలకోట్లు అప్పు చేసిన ‘రిచ్డాడ్ పూర్డాడ్’ పుస్తక రచయిత.. చమురు దిగుమతి చేసుకున్నందుకు రష్యాకు రుబెల్స్, రూపీల్లో చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ చెల్లింపులకు చాలా విలువ ఉంటుంది. దాంతో కంపెనీలు కొంత ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. దాంతో పాటు చమురుపై ఇస్తున్న డిస్కౌంట్ను తగ్గిస్తూ, రవాణా ఛార్జీలు తగ్గించకపోవడంతో ఈ పరిస్థితులు ఏర్పడినట్లు నిపుణులు చెబుతున్నారు. -
‘రష్యా నుంచి చమురు దిగుమతి చేయకపోతే..’ కేంద్రం కీలక వ్యాఖ్యలు
ఉక్రెయిన్పై సైనిక చర్యకు దిగిన రష్యా ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికి పశ్చిమ దేశాలు ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగించిన విషయం తెలిసిందే. దాంతో చమురు ధరపై పరిమితిని విధించాయి. మరోవైపు రష్యా ముడి చమురును తక్కువ ధరకే విక్రయించడానికి సిద్ధమైంది. డిస్కౌంట్ ధరలో చమురు దొరుకుతుండడంతో భారత్ రష్యా నుంచి తన దిగుమతులను గణనీయంగా పెంచుకుంది. ఎప్పుడూలేని విధంగా రికార్డు స్థాయిలో చమురును ఆ దేశం నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఒకప్పుడు మన దేశ చమురు దిగుమతిలో ఒక్క శాతం వాటా కూడా లేని రష్యా.. ఇప్పుడు భారత్కు అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా అవతరించింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగాయని, చౌకగా దొరికిన రష్యన్ ఆయిల్ను కొనుగోలు చేయకపోయి ఉంటే భారత్లో ద్రవ్యోల్బణం భారీగా పెరిగేదని పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మినిస్ట్రీ ఓ నివేదికలో పేర్కొంది. ‘ఇండియన్ రిఫైనర్లు రష్యన్ ఆయిల్ను కొనుగోలు చేయకపోయి ఉంటే దేశంలో ఆయిల్ కొరత ఏర్పడేది. రోజుకి 19 లక్షల బ్యారెల్స్ అవసరం అవుతున్నాయి. రష్యా కాకుండా ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తే ఆయిల్ రేటు బ్యారెల్కు అదనంగా 30–40 డాలర్ల మేరకు భారం పడేది’ అని వెల్లడించింది. అంతర్జాతీయంగా రోజుకి 10 కోట్ల బ్యారెళ్ల క్రూడాయిల్ అవసరం అవుతుందని కొన్ని నివేదికలు అంచనా వేస్తున్నాయి. ఇదీ చదవండి: 2.24 లక్షల మందిని ఇంటికి పంపిన కంపెనీలు ఒకవేళ ‘ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్’ (ఒపెక్) రోజుకి ఒకటి లేదా రెండు మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ ఉత్పత్తి తగ్గిస్తే, ధరలు 10 శాతం నుంచి 20 శాతం మేర పెరిగే అవకాశం ఉంది. దాంతో ఆయిల్ ధర బ్యారెల్కు 125–130 డాలర్లకు చేరుకుంటుంది. ఇండియాలో రోజుకి అవసరమయ్యే 19.5 లక్షల బ్యారెల్స్ను సిద్ధం చేయకపోతే అదనంగా మరింత ధర పెరిగే ప్రమాదం ఉందని పెట్రోలియం మినిస్ట్రీ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ వాడకంలో ఇండియా మూడో స్థానంలో ఉందని, అందులో 85 శాతం క్రూడ్ అవసరాలను దిగుమతుల తీర్చుకుంటున్నట్లు అధికారులు చెప్పారు. దేశంలోని రిఫైనింగ్ కెపాసిటీ రోజుకి 50 లక్షల బ్యారెల్స్గా ఉందని తెలిపారు. -
క్రూడ్ఆయిల్తో ఇవి తయారీ..
అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల వల్ల క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతోంది. కొన్నిసార్లు స్వల్పంగా తగ్గినా మరికొన్ని పరిస్థితుల వల్ల తిరిగి ధరలు పెంచుతున్నారు. దేశంలో వినియోగించే క్రూడ్లో అధికభాగం విదేశాల నుంచి దిగుమతి చేసుకునేదే. అయితే దేశీయంగా ఈ కింది రాష్ట్రాల్లో అధికంగా క్రూడ్ఆయిల్ ఉత్పత్తి అవుతోంది. రాజస్థాన్-7667 మిలియన్ మెట్రిక్ టన్నులు (ఎంఎంటీ) గుజరాత్-4626 ఎంఎంటీ అసోం-4309 ఎంఎంటీ తమిళనాడు-395 ఎంఎంటీ ఆంధ్రప్రదేశ్-296 ఎంఎంటీ అరుణాచల్ప్రదేశ్-43 మిలియన్ మెట్రిక్ టన్నులు క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి అవుతోంది. మొత్తం ఆన్షోర్(భూ అంతరాల్లో నుంచి వెలికితీసే ఆయిల్) ఉత్పత్తిలో 17336 ఎంఎంటీ, పబ్లిక్ సెక్టార్ యూనిట్లతో ప్రైవేట్ కంపెనీలు జాయింట్ వెంచర్గా ఏర్పాటై 9367 ఎంఎంటీ క్రూడ్ ఆయిల్ను వెలికి తీస్తున్నాయి. పూర్తి ప్రైవేట్ కంపెనీలు 7969 ఎంఎంటీల క్రూడ్ ఆయిల్ను బయటికి తీస్తున్నాయి. పబ్లిక్ సెక్టార్ యూనిట్లతో జాయింట్ వెంచర్ ద్వారా ఆఫ్షోర్(సముద్రం అడుగు నుంచి వెలికితేసే ఆయిల్) ప్రొడక్షన్లో భాగంగా 14,969 ఎంఎంటీలు, ప్రైవేట్ జాయింట్ వెంచర్ ద్వారా 1,899 ఎంఎంటీ క్రూడ్ ఆయిల్ వెలికితీస్తున్నారు. ఇదీ చదవండి: టెక్ కంపెనీల్లో కొత్త ఉద్యోగాలు వారికే.. అయితే క్రూడ్ఆయిల్ ఎన్నో రంగాల్లోని ఉత్పత్తులకు ముడిసరుకుగా ఉపయోగపడుతోంది. ఆయా రంగాల్లో క్రూడ్ ఆయిల్ వినియోగించి తయారుచేస్తున్న ఉత్పత్తులు ఈ కింది విధంగా ఉన్నాయి. ఫ్యుయెల్: గ్యాసోలిన్, డీజిల్, జెట్ ఫ్యుయెల్, పెట్రోల్. ప్లాస్టిక్: బాటిళ్లు, కంటైనర్లు, టాయ్స్. కాస్మాటిక్స్: లోషన్లు, ఫెర్ఫ్యూమ్, డీయోడరెంట్లు. మెడిసిన్లు: ఆస్పరిన్, యంటీసెప్టిక్స్, సిరంజీలు. ఎలక్ట్రానిక్స్: ఇన్సులేటర్లు, కంపోనెంట్లు. వస్త్రరంగం: పాలీస్టర్, నైలాన్, ఆక్రిలిక్. గృహోపకరణాలు: డిటర్జెంట్లు, క్యాండిళ్లు. రియల్టీ: ఆస్పాల్ట్, పైపులు, స్విచ్లు. వ్యవసాయం: కృత్రిమ ఎరువులు, ఫెస్టిసైడ్స్. ల్యూబ్రికెంట్లు: మోటార్ ఆయిల్, గ్రిజ్ -
పెట్రోలియం క్రూడ్పై విండ్ఫాల్ పన్ను పెంపు
దేశీయంగా ఉత్పత్తయ్యే పెట్రోలియం ముడి చమురుపై విండ్ఫాల్ ట్యాక్స్ను కేంద్రం పెంచింది. డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యుయెల్(ఏటీఎఫ్)పై విండ్ఫాల్ ట్యాక్స్ను తగ్గించింది. అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. బుధవారం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం పెట్రోలియం క్రూడ్పై విండ్ఫాల్ పన్నును టన్నుకు రూ.9,050 నుంచి రూ.9,800కి పెంచింది. ఈ ధరలు నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఏవియేషన్ టర్బైన్ ఫ్యుయెల్(ఏటీఎఫ్)పై లీటరుపై రూ.1గా ఉన్న విండ్ఫాల్ ట్యాక్స్ను తొలగించినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ప్రభుత్వం డీజిల్పై విండ్ఫాల్ ట్యాక్స్ని లీటర్కు రూ.4 నుంచి రూ.2కు తగ్గించింది. అయితే కేంద్రం అక్టోబర్ 18న పెట్రోలియం క్రూడ్పై విండ్ఫాల్ పన్నును టన్నుకు రూ.12,100 నుంచి రూ.9,050కి తగ్గించింది. గత ఏడాది జూలైలో ముడి చమురు ఉత్పత్తిదారులపై విండ్ఫాల్ పన్ను విధించింది. గ్యాసోలిన్, డీజిల్, విమానయాన ఇంధనాల ఎగుమతులపై పన్నును పొడిగించింది. -
Israel-Hamas war: ఒకేరోజు చమురుధరల్లో భారీ క్షీణత
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాన్ని నియంత్రించేందుకు మిడిల్ఈస్ట్ దేశాలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో సోమవారం చమురు ధరలు 2% పైగా పడిపోయాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 2.33 అమెరికన్ డాలర్లు లేదా 2.5% తగ్గి బ్యారెల్ ధర 89.83 యూఎస్ డాలర్ల వద్ద స్థిరపడింది. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఫ్యూచర్స్ 2.59 డాలర్లు లేదా 2.9% తగ్గి బ్యారెల్ 85.49 యూఎస్ డాలర్లకు చేరింది. ఇజ్రాయెల్పై హమాస్ దాడి వల్ల చమురు సరఫరాపై తక్షణమే ఎలాంటి ప్రభావం ఉండకపోవచ్చునని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రాంతీయంగా తరచూ అనేక అనిశ్చితులు ఎదుర్కొనే ఇజ్రాయెల్.. రోజుకి మూడు లక్షల బ్యారెల్ సామర్థ్యం ఉన్న రెండు చమురు శుద్ధి కేంద్రాలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో చమురు ఉత్పత్తి, శుద్ధి, సరఫరాపై తక్షణం ఎలాంటి ప్రభావం ఉండకపోవచ్చునని అంచనా! అయితే, ఉద్రిక్తతలు మరింత ముదిరి, సంక్షోభం సుదీర్ఘంగా కొనసాగితే మాత్రం ముప్పు తప్పదని నిపుణులు అంటున్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాన్ని నియంత్రించేందుకు మిడిల్ఈస్ట్ దేశాలు చేస్తున్న ఫలిస్తే మాత్రం క్రూడ్ ధర మరింత తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. ఫ్రాన్స్, నెదర్లాండ్స్ ప్రతినిధులు ఈ వారం ఇజ్రాయెల్ను సందర్శించనున్నారు. ఇదిలా ఉండగా..పరిస్థితులను బట్టి చమురు ఉత్పత్తిని సర్దుబాటు చేస్తామని ప్రధాన చమురు ఉత్పత్తి దేశాలైన బహ్రైన్, ఇరాక్, కువైట్, ఒమన్, యూఏఈ, సౌదీ అరేబియా హామీ ఇచ్చాయి. దానివల్ల ప్రపంచ ఆయిల్ మార్కెట్లో చమురు ధరలు స్థిరంగా ఉండవచ్చనే వాదనలు ఉన్నాయి. -
లాభాలు ఒకరోజుకే పరిమితం
ముంబై: దేశీయ స్టాక్ సూచీల లాభాలు ఒక్కరోజుకే పరిమితమయ్యాయి. బలహీన జాతీయ అంతర్జాతీయ సంకేతాలతో బుధవారం సెన్సెక్స్, నిఫ్టీలు ఒకశాతం మేర నష్టపోయాయి. మార్జిన్ల క్షీణత ఆందోళనలతో బ్యాంకింగ్, ఫైనాన్స్ కంపెనీల షేర్లలో పెద్ద ఎత్తున అమ్మకాలు నెలకొన్నాయి. అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ద్వయం, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 3–1% క్షీణించి సూచీల పతనాన్ని శాసించాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరల అనూహ్య పెరుగుదల, అమెరికా వడ్డీ రేట్ల పెంపు అంచనాల భయాలు, పశి్చమాసియా దేశాల్లోని యుద్ధ పరిస్థితుల పరిణామాలు ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా బుధవారం సెన్సెక్స్ 551 పాయింట్లు నష్టపోయి 66 వేల స్థాయి దిగువన 65,877 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 140 పాయింట్లు నష్టపోయి 19,671 వద్ద నిలిచింది. ఉదయం స్వల్పలాభాలతో మొదలైన సూచీలు వెంటనే నష్టాల్లోకి మళ్లాయి. ఫార్మా, ఆటో షేర్లు మినహా అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో సూచీలు ఏ దశలో కోలుకోలేదు. ట్రేడింగ్లో సెన్సెక్స్ 586 పాయింట్లు క్షీణించి 65,842 వద్ద, నిఫ్టీ 151 పాయింట్లు పతనమై 19,660 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.85%, 0.32% చొప్పున నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,832 కోట్ల ఈక్విటీ షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1,470 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియా, యూరప్ మార్కెట్లు అరశాతం నుంచి ఒకశాతం నష్టపోయాయి. కాగా అమెరికా మార్కెట్లు అరశాతానికి పైగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ‘‘బలహీన అంతర్జాతీయ సంకేతాలు, పశ్చిమాసియా దేశాల్లోని అనిశ్చిత పరిణామాలు దేశీయ మార్కెట్లో లాభాల స్వీకరణకు పురిగొల్పాయి. క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో ఉద్రికత్తలు మరింత ఎక్కువయ్యాయి. ఫెడ్ చైర్మన్ ప్రసంగానికి ముందు ఎఫ్ఐఐలు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు పాల్పడ్డారు. దేశీయ ఐటీ, ఫైనాన్స్ రంగ కంపెనీల క్యూ2 ఆర్థిక ఫలితాలు మెప్పించకపోవడం ఇన్వెస్టర్లను మరింత నిరాశపరిచింది’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జెసానీ తెలిపారు. ► సెప్టెంబర్ క్వార్టర్లో నికరలాభం 28% క్షీణించడంతో బీఎస్ఈలో బజాజ్ ఫైనాన్స్ షేరు 3% నష్టపోయి రూ.7,871 వద్ద స్థిరపడింది. ఫలితంగా కంపెనీ ఒక్కరోజులో రూ.13,345 కోట్ల మార్కెట్ విలువను కోల్పోయింది. ► యాజమాన్యం ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు ఆదాయ వృద్ధి అంచనాలు తగ్గించడంతో ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్ షేరు 6% క్షీణించి రూ.4,354 వద్ద స్థిరపడింది. ► జెన్సార్ టెక్నాలజీ క్యూ2 ఆర్థిక ఫలితాలు నిరాశపరడంతో కంపెనీ 6% నష్టపోయి రూ. 517 వద్ద స్థిరపడింది. ► సెన్సెక్స్ సూచీలోని 30 షేర్లకు గానూ టాటా మోటార్స్ 2%, సన్ ఫార్మా 1.50%, మారుతీ 0.50% షేర్లు మాత్రమే లాభపడ్డాయి. సూచీ ఒకశాతం పతనంతో ఇన్వెస్టర్లకు ఒక్కరోజులో రూ.2.42 లక్షల కోట్ల నష్టంవాటిల్లింది. బీఎస్ఈలో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.321.40 లక్షల కోట్లకు దిగివచి్చంది. -
Tax On Crude Oil: ముడిచమురుపై విండ్ఫాల్ పన్ను తగ్గింపు
దేశంలో ఉత్పత్తి చేసే ముడిచమురుపై అదనపు ప్రత్యేక ఎక్సైజ్ సుంకాన్ని (ఎస్ఏఈడీ లేదా విండ్ఫాల్) టన్నుకు రూ.9050కు తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబరు 18 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయి. ఇంతకు ముందు సెప్టెంబరు 29న ముడిచమురుపై విండ్ఫాల్ పన్ను టన్నుకు రూ.12200గా ఉంది. గతంతో పోలిస్తే రూ.3050కు తగ్గింది. డీజిల్ ఎగుమతులపై లీటర్కు రూ.5గా ఉన్న విండ్ఫాల్ సుంకాన్ని రూ.4 చేశారు. లీటర్ విమాన ఇంధనంపై సుంకాన్ని రూ.3.5 నుంచి రూ.1కు తగ్గించారు. పెట్రోల్పై సున్నా సుంకం కొనసాగుతుంది. డీజిల్ అమ్మకంపై లీటర్కు రూ.5.5 నుంచి రూ.5కి, విమాన ఇంధనంపై లీటర్కు రూ.3.5 నుంచి రూ.2.5కు పన్ను తగ్గించినట్లు ప్రభుత్వం తెలిపింది. సవరించిన పన్నులు సెప్టెంబర్ 30 నుంచి అమల్లోకి వస్తాయి. రష్యా ఉక్రెయిన్ దాడి నేపథ్యంలో భారత కంపెనీలు రష్యా నుంచి తక్కువ ధరకు ముడి చమురు దిగుమతి చేసుకున్నాయి. దాంతో దేశీయంగా చమురు ఉత్పత్తి చేస్తున్న కంపెనీలపై జులై 1, 2022 నుంచి వాటి చమురు అమ్మకాలపై కేంద్రం మొదటగా విండ్ఫాల్ పన్నులను విధించింది. -
పుతిన్తో పెట్టుకుంటే అంతే!.. ఆ దేశాలకు చమురు ఎగుమతులు బంద్
మాస్కో: ఉక్రెయిన్పై సైనిక చర్య పేరుతో భీకర దాడులు చేస్తున్న రష్యాను కట్టడి చేసేందుకు పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. రష్యాకు ప్రధాన వనరుగా ఉన్న చమురు ఉత్పత్తులపై ప్రైస్క్యాప్ విధించి ఇరుకున పెట్టే ప్రయత్నం చేశాయి. అయితే, తాజాగా ఆయా దేశాలకు గట్టి షాక్ ఇచ్చారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. పశ్చిమ దేశాల ప్రైస్ క్యాప్కు కౌంటర్ ఇవ్వాలని సుదీర్ఘ కాలంగా భావిస్తున్న పుతిన్ తాజాగా ఆ దిశగా అడుగు వేశారు. ప్రైస్ క్యాప్ విధించిన దేశాలకు చమురు, చమురు ఉత్పత్తులను ఎగుమతి చేయకూడదనే ఆదేశాలపై సంతకం చేశారు. ఈ నిర్ణయం వచ్చే ఏడాది జులై వరకు అమలులో ఉండనుంది. ఐరోపా సమాఖ్యలోని ఏడు పెద్ద దేశాలు, ఆస్ట్రేలియాలు రష్యా సముద్రం నుంచి ఉత్పత్తి చేస్తున్న ఆయిల్పై ప్రైస్ క్యాప్ను బ్యారెల్కు 60 డాలర్లుగా నిర్ణయించాయి. దానిని డిసెంబర్ 5 నుంచి అమలులోకి తీసుకొచ్చాయి. ఈ నిర్ణయానికి తాజాగా కౌంటర్ ఇచ్చింది క్రెమ్లిన్. చమురు ఎగుమతులను నిలిపివేస్తూ తీసుకొచ్చిన ఆదేశాలు 2023 ఫిబ్రవరి 1 నుంచి జులై 1 2023 వరకు అమలులో ఉంటాయని తెలిపింది. ప్రస్తుతం ముడి చమురు ఎగుమతులపై నిషేదం ఫిబ్రవరి 1 నుంచే అమలులోకి వస్తుండగా.. చమురు ఉత్పత్తులపై బ్యాన్ ఎప్పటి నుంచి ఉంటుందనే విషయాన్ని రష్యా ప్రభుత్వం వెల్లడించలేదు. మరోవైపు.. ఈ ఆదేశాల్లో ప్రత్యేక క్లాజ్ను ఏర్పాటు చేసింది రష్యా ప్రభుత్వం. ప్రత్యేకమైన సందర్భంలో ఈ బ్యాన్ను అధ్యక్షుడు పుతిన్ ఎత్తివేసే అవకాశం కల్పించింది. ఇదీ చదవండి: అమెరికాలోని ఎంబసీ ఆస్తులను అమ్మకానికి పెట్టిన పాకిస్థాన్ -
ఈ వారమూ మరింత ముందుకే !
ముంబై: స్టాక్ సూచీలు ఈ వారంలోనూ పరిమిత శ్రేణిలో కదలాడుతూ.., ముందుకే కదిలే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. కీలక స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ పరిణామాలకు అనుగుణంగా ట్రేడింగ్ ఉండొచ్చంటున్నారు. వీటితో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలర్ ఇండెక్స్, యూఎస్ బాండ్ ఈల్డ్స్, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదలికల అంశాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. ‘‘మార్కెట్ అప్సైడ్ మూమెంట్ను ప్రోత్సహించే సానుకూలాంశాలు పరిమితంగా ఉన్నందున్న స్టాక్ సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతూ పరిమిత శ్రేణిలో కదలాడొచ్చు. ఫెడ్ ఛైర్మన్ పావెల్ ప్రసంగం, కీలకమైన స్థూల ఆర్థిక గణాంకాలు ట్రేడింగ్ను ప్రభావితం చేయోచ్చు. నిఫ్టీ 18,500 స్థాయిని నిలుపుకోలిగితే 18,700 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని ఛేదిస్తే 19,000 వద్ద మరో కీలక నిరోధం ఉంది. రికార్డు స్థాయిల వద్ద లాభాల స్వీకరణ జరిగితే డౌన్ట్రెండ్లో 18,100 తక్షణ మద్దతు లభించవచ్చు’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ అన్మోల్ దాస్ తెలిపారు. క్రూడాయిల్ ధరలు, డాలర్ ఇండెక్స్ పతనంతో పాటు దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి కొనుగోళ్లు చేపట్టడంతో బెంచ్మార్క్ సూచీలు జీవితకాల గరిష్ట స్థాయిల వద్ద ట్రేడవుతున్నాయి. ఆటో, బ్యాంక్స్, టెక్నాలజీ, మౌలిక రంగ, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో గత వారం మొత్తంగా సెన్సెక్స్ 631 పాయింట్లు, నిఫ్టీ 205 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. స్థూల ఆర్థిక గణాంకాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసిక జీడీపీ డేటా బుధవారం(నవంబర్ 30న) విడుదల అవుతుంది. డిమాండ్ పెరగడంతో పాటు ఆర్థిక కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకోవడంతో ఈ క్యూ2లో వృద్ధి ఆరుశాతానికి పైగా నమోదుకావచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. అదేరోజున అక్టోబర్ ద్రవ్య లోటు, మౌలిక రంగ గణాంకాలు విడుదల కానున్నాయి. మరుసటి రోజు(గురువారం) నవంబర్ తయారీ రంగ పీఎంఐ డేటా, వాహన విక్రయ గణాంకాలు విడుదల అవుతాయి. అలాగే శుక్రవారం ఆర్బీఐ నవంబర్ 25 తేదీతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా, ఇదే నెల 18వ తేదీతో ముగిసిన డిపాజిట్– బ్యాంక్ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. దేశీయ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. ప్రపంచ పరిణామాలు ఫెడ్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ బుధవారం రాత్రి బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూషన్లో జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమంలో ప్రసగించనున్నారు. కీలక వడ్డీరేట్ల పెంపుదల క్రమంగా నెమ్మదించవచ్చని ఫెడ్ మినిట్స్లో వెల్లడైన తర్వాత మార్కెట్ వర్గాలు పావెల్ వ్యాఖ్యలను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. అమెరికా నిరుద్యోగ డేటా గురువారం వెల్లడి అవుతుంది. అదే రోజున ప్రాంతీయ ఆర్థిక కార్యకలాపాల స్థితిగతులను తెలియజేసే ‘‘బీజ్ బుక్’’ను ఫెడ్ రిజర్వ్ విడుదల చేయనుంది. చైనాలో కరోనా కేసులు, లాక్డౌన్ విధింపు వార్తలు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేయవచ్చు. రష్యా చమురు నిషేధం తొలగింపుపై పాశ్చత్య దేశాల చర్యలతో క్రూడాయిల్ ధరలు అనూహ్యంగా పతనమయ్యాయి. గతవారంలో బ్రెంట్ క్రూడాయిల్ ధర పదినెలల కనిష్టానికి చేరుకుంది. డాలర్ ఇండెక్స్ 106 స్థాయికి దిగివచ్చింది. బుల్లిష్గా ఎఫ్ఐఐల వైఖరి భారత ఈక్విటీలను కొనేందుకు విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నవంబర్లో ఇప్పటి వరకు (25 తేదీనాటికి) దేశీయ మార్కెట్లో రూ.31,630 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ‘‘కీలక వడ్డీరేట్లపై ఫెడ్ రిజర్వ్ దూకుడు వైఖరిని తగ్గించుకోవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. స్థూల ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందని తాజా గణాంకాల ద్వారా వెల్లడైంది. దీంతో ఎఫ్ఐఐలు మన ఈక్విటీల్లో మళ్లీ భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ముఖ్యంగా ఫైనాన్స్, ఐటీ, ఆటో, క్యాపిటల్ గూడ్స్ షేర్ల పట్ల అధిక బుల్లిష్ వైఖరిని కనబరుస్తున్నారు. అయితే భౌగోళిక ఉద్రిక్తతలు తెరపైకి వస్తున్న తరుణంలో రానున్న రోజుల్లో విదేశీ ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించవచ్చు’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ అభిప్రాయపడ్డారు. ఈ వారంలో రెండు ఐపీవోలు ఈ వారంలో ధర్మజ్ క్రాప్, యూనిపార్ట్స్ ఇండియా కంపెనీలు ఐపీఓ ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. ఆగ్రో కెమికల్ ధర్మజ్ క్రాప్ సంస్థ ఇష్యూ భాగంగా రూ.216 కోట్ల విలువైన తాజా షేర్లను, ప్రమోటర్ల ద్వారా రూ. 35.15 కోట్ల విలువైన షేర్లను జారీ చేయనుంది. తద్వారా మొత్తం రూ. 251 కోట్లను సమీకరించనుంది. ఇందుకు ధర శ్రేణి రూ.216 – 327గా నిర్ణయించింది. ఈ పబ్లిక్ ఇష్యూ 28న మొదలై 30న ముగిస్తుంది. ఇంజనీరింగ్ సిస్టమ్స్ కంపెనీ యూనిపార్ట్స్ ఇండియా ఐపీఓ నవంబర్ 30న ప్రారంభమై డిసెంబర్ 2న ముగుస్తుంది. మొత్తం 1.4 కోట్ల షేర్లను విక్రయించి రూ.836 కోట్లను కంపెనీ సేకరిస్తుంది. ఐపీఓ ధర శ్రేణి రూ.548–577గా ఉంది. -
ఓఎన్జీసీ లాభంలో క్షీణత
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఓఎన్జీసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–2) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 30 శాతం క్షీణించి రూ. 12,826 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 18,348 కోట్లు ఆర్జించింది. అనూహ్య(విండ్ఫాల్) లాభాల పై ప్రభుత్వం పన్ను విధింపు ప్రభావం చూపింది. మొత్తం ఆదాయం మాత్రం 57%పైగా జంప్చేసి రూ.38,321 కోట్లకు చేరింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 6.75 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. కంపెనీలో ప్రభుత్వానికి దాదాపు 59 శాతం వాటా ఉంది. విక్రయ ధరలు అప్ ఉత్పత్తి చేసిన ప్రతీ బ్యారల్ చమురుకు స్థూలంగా 95.49 డాలర్లు లభించినట్లు ఓఎన్జీసీ పేర్కొంది. గత క్యూ2లో ఇది 69.36 డాలర్లు మాత్రమే. రష్యా– ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ముడిచమురు ధరలు భారీగా ఎగసిన విషయం విదితమే. అయితే ప్రభుత్వం పెరిగిన ధరలపై జూలై 1 నుంచీ కొత్తగా విండ్ఫాల్ పన్ను విధించింది. ప్రస్తుత సమీక్షా కాలంలో రూ. 6,400 కోట్లమేర ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని చెల్లించినట్లు కంపెనీ ఫైనాన్స్ డైరెక్టర్ పోమిలా జస్పాల్ పేర్కొన్నారు. వెరసి ప్రతీ బ్యారల్కు 75–76 డాలర్లు లభించినట్లు తెలియజేశారు. ఇక నేచురల్ గ్యాస్పై ఒక్కో ఎంబీటీయూకి 6.1 డాలర్లు లభించగా.. గత క్యూ2లో కేవలం 1.79 డాలర్లు పొందింది. ఈ కాలంలో చమురు ఉత్పత్తి 5.47 మిలియన్ టన్నుల నుంచి 5.36 ఎంటీకి తగ్గింది. గ్యాస్ ఉత్పత్తి సైతం 5.46 బిలియన్ ఘనపు మీటర్ల నుంచి 5.35 బీసీఎంకు మందగించింది. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో కేజీ బేసిన్లో ఆరు డిస్కవరీలకు తెరతీసింది. ఫలితాల నేపథ్యంలో ఓఎన్జీసీ షేరు ఎన్ఎస్ఈలో 2.3 శాతం బలపడి రూ. 142 వద్ద ముగిసింది. -
సామాన్యులకు శుభవార్త.. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
వాహనదారులకు శుభవార్త. దేశంలో చాలా రోజుల తర్వాత ఇంధన ధరలు తగ్గాయి. లీటర్ పెట్రోల్, డీజిల్పై 40 పైసలు తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. మంగళవారం ఉదయం నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. న్యూఢిల్లీలో సోమవారం పెట్రోల్ ధర రూ.96.72గా ఉండగా, ముంబైలో రూ.106.31గా ఉంది. కోల్కతాలో రూ.106.03, చెన్నైలో రూ.102.63, హైదరాబాద్లో రూ.109.66గా ఉంది. మంగళవారం నుంచి ఈ ధరలపై 40 పైసలు త్గగింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గి చాలా రోజులుగా స్థరంగా కొనసాగుతుండటంతో చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తున్నాయి. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడాయిల్ బ్యారెల్ ధర 95 డాలర్లకు దిగువన ఉంది. ఆరు నెలల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం ఇదే తొలిసారి. ఈ ఏడాదిలో చివరిసారిగా ఏప్రిల్ 7 ఇంధన ధరలను తగ్గించారు. అలాగే ఆర్థికవ్యవస్థ పుంజుకోవడంతో అక్టోబర్ తొలి అర్ధభాగంలో ఇంధన విక్రయాలు భారీగా పెరిగి కరోనా ముందు స్థితికి చేరుకున్నాయి. పండుగ సీజన్లో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు భారీ వృద్ధి నమోదు చేశాయి. దీంతో ధరలు తగ్గించాలని చమురు సంస్థలు నిర్ణయించాయి. ప్రస్తుతం లీటర్పై 40 పైసలే తగ్గించినప్పటికీ.. రానున్న రోజుల్లో రూ.2వరకు తగ్గే అవకాశమున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఎయిర్టెల్ బంపరాఫర్: ఒకే రీచార్జ్తో బోలెడు బెనిఫిట్స్, తెలిస్తే వావ్ అనాల్సిందే! -
క్రూడ్ మళ్లీ 100 డాలర్లకు..!
న్యూఢిల్లీ: చమురు ధరలు మళ్లీ బ్యారెల్కు 100 డాలర్లను దాటిపోతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చమురు ఎగుమతి దేశాల సమాఖ్య (ఒపెక్) రోజువారీ 2 మిలియన్ బ్యారెళ్ల మేర చమురు ఉత్పత్తిని (అంతర్జాతీయ సరఫరాలో 2 శాతం) తగ్గించాలని తీసుకున్న నిర్ణయం ఇందుకు దారితీస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బ్రెంట్ బ్యారెల్ ధర 92 డాలర్ల స్థాయిలో ట్రేడ్ అవుతోంది. ఒపెక్ తాజా నిర్ణయం నవంబర్ నుంచి అమల్లోకి రానుంది. దీంతో అప్పటికి ధరలు పెరిగిపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒపెక్ నిర్ణయం మేరకు ఉత్పత్తిలో కోత 2023 డిసెంబర్ వరకు అమల్లో ఉండనుంది. ‘‘చమురు ధరల విషయంలో సానుకూల అంచనాలతో ఉన్నాం. శీతాకాలంలో గ్యాస్ నుంచి చమురుకు మళ్లడం కూడా ధరల పెరుగుదలకు కారణమవుతుంది. ఓఈసీడీ వ్యూహాత్మక చమురు నిల్వల విడుదల ముగింపు, చమురు ఉత్పత్తికి కోత విధించడానికి అదనంగా, రష్యా చమురు దిగుమతులపై యూరప్ విధించిన నిషేధం డిసెంబర్ 5 నుంచి అమల్లోకి రానుంది. దీంతో చమురు మార్కెట్ మరింత కఠినంగా మారనుంది’’అని యూబీఎస్కు చెందిన విశ్లేషకులు స్టానోవో, గోర్డాన్ అంచనా వ్యక్తం చేశారు. సాధారణంగా ఒపెక్ భేటీ ఆరు నెలలకు ఓసారి జరుగుతుంటుంది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా అవసరమైతే అసాధారణ సమావేశాన్ని నిర్వహించే అవకాశం కూడా లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు. విపరిణామాలు.. మరోవైపు బ్రెంట్ క్రూడ్ ధర ఇటీవలి 82 డాలర్ల కనిష్ట స్థాయి నుంచి 12 శాతం ఇప్పటికే పెరగడం గమనార్హం. ‘‘రోజువారీగా 2 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తికి కోత విధించాలన్న ఒపెక్ నిర్ణయం పలు ప్రతికూలతలకు దారితీస్తుంది. కొన్ని సభ్య దేశాలు ఈ లక్ష్యాలను చేరుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. అధిక ద్రవ్యోల్బణం కారణంగా జీవన వ్యయం పెరిగిపోయి ఇబ్బంది పడుతున్న వినియోగదారుడికి ఉపశమనం కల్పించాలన్న లక్ష్యంతో యూఎస్ ఉంది. మరి ఒపెక్ నిర్ణయం అమలైతే ఈ లక్ష్యానికి విఘాతం కలుగుతుంది’’అని క్విల్టర్ చెవియొట్ ఈక్విటీ రీసెర్చ్ అనలిస్ట్ జామీ మడాక్ వివరించారు. ఓపెక్ సభ్య దేశం రష్యా అయితే మరింత తక్కువ ఉత్పత్తి చేస్తున్నట్టు కొందరు అనలిస్టులు చెబుతున్నారు. 8 లక్షల బ్యారెళ్ల మేర నికర సరఫరా మార్కెట్లో తగ్గుతుందని ఎస్అండ్పీ గ్లోబల్ కమోడిటీస్ డైరెక్టర్ పాల్ హికిన్ అంచనా వేశారు. ఒపెక్ నిర్ణయం వచ్చే కొన్ని నెలలకు క్రూడ్కు బేస్ ధరను నిర్ణయించినట్టు చెప్పారు. ‘‘2020 మే నెలలో క్రూడ్ ధరలు మైనస్కు పడిపోయిన సమయంలో ఒపెక్ చమురు ఉత్పత్తికి భారీ కోత విధించింది. ఆ తర్వాత పెద్ద ఎత్తున ఉత్పత్తికి కోత పెట్టాలని ఒపెక్ నిర్ణయించడం మళ్లీ ఇదే. ఇప్పుడు బ్రెండ్ బ్యారెల్ కనీసం 90 డాలర్ల కంటే తగ్గకుండా ఉండాలని (బేస్) ఒపెక్ ప్లస్ దేశాలు భావిస్తుండొచ్చు. ఆయిల్ మార్కెట్ కొత కాలంగా బేరిష్ ట్రెండ్లో ఉన్నాయి. అమెరికా వ్యూహత్మక చమురు నిల్వల విడుదల అక్టోబర్తో ముగిసిపోతుంది. చైనా లాక్డౌన్లు, మొత్తం మీద డిమాండ్పై ప్రభావం చూపిస్తాయి. అలాగే, రష్యాపై ఆంక్షలు కూడా చమురు ధరలను నిర్ణయిస్తుంది’’అని పాల్ హికిన్ అంచనా వేశారు. -
ఇంధన సంక్షోభం: ప్రత్యామ్నాయాలు, ప్రయోజనాలు
భూమిలోని క్రూడ్ ఆయిల్ నిల్వలు అయిపోతే ఏం చేయాలి? అందుకే ప్రత్యామ్నాయ ఇంధనం కోసం అన్ని దేశాలు అన్వేషిస్తున్నాయి. కొన్ని దశాబ్దాలుగా కొద్ది కొద్దిగా వాడుతున్న ఇథనాల్ వినియోగం పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి? అసలు ఇథనాల్ దేని నుంచి తయారవుతుంది? దాని వల్ల మేలు జరుగుతుందా? సమాజానికి నష్టమా? • సకల చరాచర జగత్తు ఇంధనం మీదే ఆధారపడి నడుస్తోంది.. • భూమిలో లభిస్తున్న క్రూడ్ ఆయిల్ అయిపోతే..? • మానవాళి మనుగడే ప్రశ్నార్థకం కాదా? • ఈ ప్రశ్నలనుంచి ఉద్భవించిందే ప్రత్యామ్నాయ ఇంధనం.. •పెట్రోలియంకు బదులుగా తయారు చేసుకుంటున్నదే ఇథనాల్.. చెరకు నుంచి పంచదార, బెల్లం తయారు చేసుకుంటాం. చెరకు పిప్పి నుంచి ఆల్కహాల్, మొలాసిస్ తయారవుతాయని కూడా మనకు తెలుసు. బియ్యం దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాన ఆహారం. మొక్కజొన్నలు కాల్చుకుని వేడి వేడిగా తింటాం. సినిమా థియేటర్లలో పాప్కార్న్ పేరుతో వందల రూపాయలు ఖర్చుపెడతాం. కాని ఇప్పుడు చెప్పుకున్న ఈ మూడు పదార్థాల నుంచి ఇంధనం తయారవుతుందంటే నమ్మగలమా? నమ్మాల్సిందే.. 2013 నుంచే మన దేశంలో కూడా చెరకు, బియ్యం, మొక్కజొన్నల నుంచి తయారవుతున్న జీవ ఇంధనాన్ని పెట్రోల్లో కొద్ది కొద్దిగా కలుపుతున్నారు. మనకు ఆ విషయం తెలియదు. ప్రపంచమంతా ఇప్పుడు జీవ ఇంధనం దిశగా అడుగులు వేస్తోంది. విదేశీ మారకద్రవ్యం ఆదా చేసుకోవడం, పర్యావరణాన్ని కాపాడుకోవడం, వేగంగా అంతరించిపోతున్న ముడిచమురు నిల్వల్ని మరికొంత కాలం అదనంగా లభించేలా చూసుకోవడం వంటి లక్ష్యాలతో ప్రపంచమంతా జీవ ఇంధనం తయారీ దిశగా అడుగులు వేస్తోంది. భూమి మీద కొన్ని దేశాల్లోనే క్రూడ్ ఆయిల్ లభిస్తుంది. వాటి నుంచే మిగిలిన ప్రపంచమంతా దిగుమతి చేసుకుంటోంది. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న అమెరికా...అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశం అంటే నమ్మగలమా? అమెరికా తర్వాత రష్యాలోనే అధిక చమురు నిల్వలున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో వాడుతున్న పెట్రోల్, డీజిల్లో 82 శాతం ఆయిల్ రిచ్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మనదేశంలో ఉత్పత్తి అవుతున్నది కేవలం 18 శాతం మాత్రమే. మనం వాడే గ్యాస్లో 45 శాతం దిగుమతి చేసుకుంటున్నాం. 202122 ఆర్థిక సంవత్సరంలో భారత్ ముడి చమురు, గ్యాస్ కోసం 119 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టింది. ఈ మొత్తాన్ని మన రూపాయల్లో లెక్కిస్తే 95,166 కోట్ల రూపాయలు అవుతుంది. ఆధునిక సమాజంలో ఇంధనం లేకపోతే మనిషి మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. అందుకే కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి భూమి తనలో దాచుకున్న ముడి చమురును ఎడా పెడా తోడేస్తున్నాం. జనాభా పెరుగుతూ, అవసరాలు పెరిగే కొద్దీ సరికొత్త టెక్నాలజీతో చమురు తీసే వేగం కూడా పెరుగుతోంది. ఇలా భూమిలోని చమురును తోడేస్తూ ఉంటే 2052 నాటికి ముడి చమురు పూర్తిగా అంతరించిపోతుందనే అంచనాలు వేస్తున్నారు. అలాగే 2060 నాటికి సహజ వాయువు కూడా అదృశ్యమైపోతుంది. 2090 నాటికి బొగ్గు గనుల్లో బొగ్గు కూడా అయిపోతుంది. ఇవన్నీ అయిపోతే మనిషి మనుగడ ఏంకావాలి? అందుకే నాలుగైదు దశాబ్దాల నుంచే ప్రత్యామ్నాయ ఇంధనం గురించి అన్వేషణ మొదలైంది. ఇప్పటికే గాలినుంచి, సూర్యుడి శక్తి నుంచి విద్యుత్ను తయారు చేస్తున్నాం. 50 ఏళ్ళకు పూర్వమే జీవ ఇంధనం వాడకం కూడా మొల్లగా మొదలైంది. జీవ ఇంధనం అంటే మొక్కల నుంచి తయారు చేసుకోవడమే. అన్ని రకాల మొక్కలూ ఇందుకు ఉపయోగపడవు. మనం ఆహారానికి ఉపయోగించే చెరకు, మొక్కజొన్న, బియ్యం, బంగాళాదుంపలు, ఇతర నిరుపయోగమైన ఆహార పదార్థాల నుంచి ఇథనాల్ అనే చమురును తయారు చేసే టెక్నాలజీ ఇటీవల కాలంలో బాగా అభివృద్ధి చెందింది. ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇథనాల్. ఇథనాల్కు అనుగుణంగా వాహనాలను సిద్ధం చేయాలని కేంద్ర ప్రభుత్వం కంపెనీలను ఆదేశించింది. పెట్రోల్కు ప్రత్యామ్నాయంగా ముందుకు వచ్చిన ఇథనాల్ ఉత్పత్తికి వాడే ముడి సరుకు ఏంటి? దాని వల్ల మానవాళికి ఏమైనా నష్టం జరుగుతుందా? పర్యావరణానికి మేలు జరుగుతుందా? భూమిలోని చమురు అయిపోతుండటం ఒక కారణం కాగా...చమురు నిల్వలు లేని దేశాలు వాటిని దిగుమతి చేసుకోవడానికి చెల్లించే విదేశీ మారకద్రవ్యం బిల్లులు ఏటేటా పెరిగిపోతుండటం కూడా ప్రత్యామ్నాయ ఇంధనం అన్వేషణకు కారణమైంది. అదే సమయంలో ప్రస్తుతం మనం వాడే పెట్రోల్, డీజిల్ వల్ల పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోంది. కర్బన పదార్ధాల వల్ల భూమి, పర్యావరణం వేడెక్కి రుతువులు గతి తప్పుతున్నాయి. జీవ ఇంధనం వల్ల పర్యావరణానికి ఎలాంటి ప్రమాదమూ ఉండదు. ఇలా అనేక కారణాలతో ప్రపంచమంతా ఇథనాల్ని ప్రత్యామ్నాయ ఇంధనంగా తయారు చేసుకుంటోంది. చమురు నిల్వల్లో అగ్రభాగాన ఉన్న అమెరికానే ఇథనాల్ ఉత్పత్తిలో కూడా ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో ఉంది. ప్రపంచంలో అన్ని దేశాల కంటే ముందుగా చెరకు నుంచి ఇథనాల్ తయారు చేసే టెక్నాలజీ కనిపెట్టిన బ్రెజిల్ ఇప్పుడు రెండోస్థానంలో ఉంది. చెరకు ఉత్పత్తిలో ప్రపంచంలో నెంబర్ వన్గా ఉన్న బ్రెజిల్ చాలా తక్కువ ఖర్చుతో ఇథనాల్ తయారు చేసుకుంటోంది. -ఈవీ బాలాజీ, సాక్షి -
100 డాలర్ల దిగువకు చముర ధర..పెట్రో ధరలు ఎందుకు తగ్గడం లేదు!
భారత్లో క్రూడాయిల్ ధర బ్యారల్ 100డాలర్లకు దిగువకు చేరాయి. ఏప్రిల్ తర్వాత తొలిసారి బ్యారల్ ధర తగ్గడంతో వాహన దారులు ఫ్యూయల్ ధరలు తగ్గుతాయని ఊహించారు. కానీ వాటి ధరలు అలాగే కొనసాగుతాయని, ఇప్పట్లో పెరిగే అవకాశాలు లేవని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేశీయంగా ఏప్రిల్ 25న బ్యారెల్ క్రూడాయిల్ ధర 99.17 డాలర్లు ఉండగా..ఆ తర్వాత వాటి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తూ వచ్చాయి. అయితే జులై 14న అదే క్రూడాయిల్ ధర బ్యారెల్ 99.76 డాలర్లు చేరింది. అంతర్జాతీయంగా మాంద్యం, డిమాండ్ - సప్లై వంటి భయాల కారణంగా ధర 5.5శాతం తగ్గింది. మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య సౌదీ అరేబియా ముందస్తు ఉత్పత్తిని పెంచుతుందనే ఆశతో బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడాయిల్ 100డాలర్ల కంటే ఎక్కువ పెరిగింది. కానీ యూఏఈ మాత్రం క్రూడాయిల్ ఉత్పత్తిని తగ్గించింది. అయితే ఈ తరుణంలో పెట్రోల్,డీజిల్ తగ్గిపోతాయనుకున్న వాహన దారులకు భంగపాటు ఎదురైంది. చమురు కంపెనీలు నష్టాల్ని పూడ్చుకునే ప్రయత్నం చేస్తున్నాయే తప్పా.. వాటిని వాహనదారులపై బదాలయించే ప్రయత్నం చేయడం లేదని తెలుస్తోంది. నష్టాల నుంచి గట్టెక్కుతున్నారు. క్రూడాయిల్ రేట్లు తగ్గడం వల్ల దేశీయ చమురు కంపెనీలకు ఊరట లభించినట్టయింది. గతంలో క్రూడాయిల్ బ్యారెల్ ధర 120 నుంచి 123 డాలర్ల వరకు వెళ్లిన నేపథ్యంలో.. కొనుగోలు చేయడానికి భారీ ఎత్తున ఖర్చు పెట్టాల్సి వచ్చేది. మే నెలలో కేంద్రం పెట్రోల్పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.8, డీజిల్పై లీటరుకు రూ.6 తగ్గించడంతో చమురు కంపెనీలకు మరింత భారం పెరిగింది. ఎక్సైజ్ సుంకం తగ్గింపు, బ్యారల్ ధర పెరుగు ధరలతో చమురు కంపెనీలు క్రూడాయిల్పై భారీగా ఖర్చు చేశాయి. ఇప్పుడు ఆ నష్టాల్ని పూడ్చుకునేందుకు తక్కువకే ధరకే క్రూడాయిల్ బ్యారెల్ను కొనుగోలు చేస్తున్నాయి. పెట్రో ధరల్ని అలాగే కొనసాగిస్తున్నాయి. -
క్రూడ్ ఎఫెక్ట్: 54 వేల ఎగువకు సెన్సెక్స్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు గురువారం లాభాలతో ముగిసాయి. అంతర్జాతీయ మార్కెట్లు, గ్లోబల్ ముడి చమురు ధరలు దిగి వస్తున్న క్రమంలో సూచీలు అప్ ట్రెండ్లోకి వచ్చాయి. సెన్సెక్స్ 54వేల పాయింట్ల ఎగువకు చేరగా, నిఫ్టీ 16 వేల స్థాయిని సునాయాసంగా అధిగమించింది. సెన్సెక్స్ 427 పాయింట్లు ఎగిసి 54178 వద్ద, నిఫ్టీ 143 పాయింట్లు లాభపడి 16132 వద్ద ముగిసాయి. ఆటో, ఐటీ, బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్ళ ధోరణి కనిపించింది. టైటన్, ఎల్ అండ్టీ, యూపీఎల్, హిందాల్కో, బీపీసీఎల్, టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ, కెనరా బ్యాంకు, జూబ్లియంట్ ఫార్మా ఇండస్ ఇండ్, బీవోబీ టాప్ గెయినర్స్గా నిలిచాయి. మరోవైపు సిప్లా, భారతి ఎయిర్టెల్ నెస్లే, బజాజ్ ఫైనాన్స్, డా.రెడ్డీస్ నష్ట పోయాయి. మరోవైపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రభుత్వ రంగ బ్యాంక్ అధినేతలతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అటు చమురు బ్యారెల్కు 100 డాలర్లకు పతనమైంది. చమురు ధరలు వరుసగా మూడో రోజు కూడా నేల చూపులు చూస్తుండటంతో దేశీయ కరెన్సీ రూపాయికి బలవ చ్చింది. 16 పైసల లాబంతో 79.17 వద్ద ఉంది. -
మార్కెట్లో ఒడిదుడుకులే..?
ముంబై: స్టాక్ మార్కెట్లో ఈ వారమూ ఒడిదుడుకుల ట్రేడింగ్కు అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచ పరిణామాలు, క్రూడాయిల్ ధరలు, విదేశీ ఇన్వెస్టర్ల తీరుతెన్నులు సూచీల గమనాన్ని నిర్ధేశిస్తాయన్నారు. ఇక దేశీయ పరిణామాలను పరిశీలిస్తే.., ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ ముగింపు(గురువారం) తేదీ ఉంది. అదే రోజున జూన్ ద్రవ్యలోటు, మే మాసపు పారిశ్రామికోత్పత్తి డేటా, మరుసటి రోజున(జూలై 1న) ఆటో కంపెనీల జూన్ విక్రయ గణాంకాలు విడుదల కానున్నాయి. ఈ పరిణామాల దృష్ట్యా ట్రేడర్లు అప్రమత్తత వహించే అవకాశం ఉంది. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి, వర్షపాత నమోదు, కోవిడ్ కేసులు అంశాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. కమోడిటీ ధరలు తగ్గడంతో పాటు అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూలతలు కలిసిరావడంతో గతవారంలో సూచీలు కనిష్ట స్థాయి నుంచి రెండున్నర శాతం రికవరీ అయ్యాయి. ముఖ్యంగా ఆటో, బ్యాంకింగ్, ఆర్థిక, ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఫార్మా షేర్లలో షార్ట్ కవరింగ్ జరగడంతో సెన్సెక్స్ 1,368 పాయింట్లు, నిఫ్టీ 406 చొప్పున లాభపడ్డాయి. ‘‘సాంకేతికంగా నిఫ్టీ 15,700 స్థాయి వద్ద కీలక నిరోధాన్ని ఎదుర్కోంటుంది. ఈ స్థాయిని చేధించగలిగితే 15,900–16,250 శ్రేణిలో మరో కీలక నిరోధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ట్రెండ్ బేర్స్కు అనుకూలంగా మారితే దిగువస్థాయిలో 15,350 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తుంది’’ స్వస్తిక్ ఇన్వెస్ట్మార్ట్ హెడ్ రీసెర్చ్ సంతోష్ మీనా తెలిపారు. మార్కెట్ను ప్రభావితం చేసే అంశాలు ► క్రూడాయిల్ కదలికలు ఇటీవల గరిష్టాలకు(127.65 డాలర్లు) చేరిన క్రూడాయిల్ ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. భారత్లో అధికంగా వినియోగించే బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్ బ్యారెల్ ధర శుక్రవారం నాటికి 113.12 డాలర్లగా ఉంది. ‘‘ప్రస్తుతానికి క్రూడ్ ధరలు ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. ప్రతికూలతలు సద్దుమణిగితే రానున్న రోజుల్లో చమురు ధరలు తిరిగి పెరొగొచ్చు’’ అని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. క్రూడ్ ధర పుంజుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు కార్పొరేట్ కంపెనీ మార్జిన్లపైనా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ► విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు విదేశీ ఇన్వెస్టర్లు ఎడతెరిపి లేకుండా దేశీయ ఈక్విటీలను అమ్మేస్తుండటం సెంటిమెంట్పై మరింత ఒత్తిడిని పెంచుతోంది. ఈ జూన్లో రూ.46,000 కోట్లు, ఈ ఏడాది మొత్తంగా ఇప్పటికి(జూన్ 24వ తేదీ నాటికి) వరకు రూ.2.13 లక్షల కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. డాలర్ మారకంలో రూపాయి క్షీణత, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం, ఆర్బీఐ, ఫెడ్ రిజర్వ్లు కఠినతర ద్రవ్య విధాన అమలు తదితర అంశాలు ఎఫ్ఐఐల విక్రయాలకు కారమణని యస్ సెక్యూరిటీస్ ఇస్టిట్యూషనల్ ఈక్విటీస్ రీసెర్చ్ హెడ్ హితేశ్ జైన్ తెలిపారు. గురువారం ఎఫ్ అండ్ ఓ ముగింపు ఈ గురువారం(జూన్ 30న) నిఫ్టీ సూచీకి చెందిన జూన్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చు. ► శుక్రవారం ఆటో విక్రయ గణాంకాలు దేశీయ ఆటో కంపెనీలు శుక్రవారం జూన్ నెల వాహన విక్రయాలు గణాంకాలను వెల్లడించనున్నాయి. ఆటో డేటా విడుదల నేపథ్యంలో టాటా మోటార్స్, అశోక్ లేలాండ్, మారుతీ సుజుకీ, టీవీఎస్ మోటార్స్, హీరోమోటోకార్ప్, బజాజ్ ఆటో, ఎంఅండ్ఎం, ఎస్కార్ట్స్ షేర్లు అధిక పరిమాణంలో ట్రేడయ్యే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు దిగిరావడంతో గత వారం నిఫ్టీ ఆటో ఇండెక్స్ ఏకంగా ఏడు శాతం ర్యాలీ చేసింది. వార్షిక ప్రాతిపదికన ‘‘లో బేస్ ఎఫెక్ట్’’తో మెరుగైన గణాంకాలు నమోదు కావచ్చు. ► అంతర్జాతీయ స్థూల ఆర్థిక గణాంకాలు అమెరికా మే నెల గృహ అమ్మక గణాంకాలు వెల్లడి కానున్నాయి. ఎల్లుండి యూఎస్ తొలి త్రైమాసిక జీడీపీ యూరోపియన్ యూనియన్ జూన్ పారిశ్రామిక, సేవా రంగ గణాంకాలు(జూన్ 29న) విడుదల అవుతాయి. అదే రోజున జపాన్ రిటైల్ విక్రయాలు వెల్లడి అవుతాయి. ఆ మరుసటి రోజున(జూన్ 30)న అమెరికా నిరుద్యోగ గణాంకాల డేటా వెల్లడి అవుతుంది. ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను తెలియజేసే ఈ గణాంకాల ప్రకటనకు ముందుకు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే అవకాశం ఉంది. -
రుతు పవనాలు, విదేశీ ట్రెండ్స్ కీలకం
ముంబై: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్ల గమనాన్ని ప్రధానంగా అంతర్జాతీయ పరిస్థితులు నిర్దేశించనున్నట్లు పలువురు నిపుణులు భావిస్తున్నారు. దేశీయంగా మార్కెట్లను ప్రభావితం చేయగల అంశాలు కొరవడటం దీనికి కారణమని తెలియజేశారు. అయితే మరోపక్క రుతు పవనాల కదలికలు, విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ముడిచమురు ధరలు వంటి అంశాలకు సైతం ప్రాధాన్యత ఉన్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా డాలరుతో మారకంలో రూపాయి విలువ సైతం సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఆర్బీఐ పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశపు మినిట్స్ను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. వడ్డీ రేట్ల పెంపు ధరలు అదుపు చేసేందుకు పలు కేంద్ర బ్యాంకులు కఠిన ద్రవ్య విధానాల అమలుకు మొగ్గుచూపాయి. ఫలితంగా గత వారంలో సెన్సెక్స్ 2,943 పాయింట్లు, నిఫ్టీ 908 పాయింట్లు చొప్పున క్షీణించాయి. గడిచిన రెండేళ్లలో ఒకవారంలో సూచీలు ఈ స్థాయిలో పతనాన్ని చవిచూడటం ఇదే తొలిసారి. ‘‘గడిచిన వారంలో సూచీలు ఐదున్నర శాతానికి పైగా క్షీణించడంతో షార్ట్కవరింగ్కు వీలున్నప్పటికీ ట్రెండ్ బలహీనంగా ఉంది. ఆర్థిక మందగమన భయాలతో ఈక్విటీ మార్కెట్లు మరింత ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. ట్రేడర్లు లాంగ్ పొజిషన్లకు దూరంగా ఉండటం మంచిది. నిఫ్టీ 15,360 స్థాయిని నిలుపుకోగలిగితే తప్ప మార్కెట్ దిద్దుబా టు ఆగదు. అమ్మకాలు కొనసాగితే నిఫ్టీకి 15,183 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు, ఆ తర్వాత 14,900 వద్ద మద్దతు లభించొచ్చు’’ శామ్కో సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ యష్ షా తెలిపారు. విదేశీ గణాంకాలు 1–5 ఏళ్ల కాలానికి రుణాల ప్రామాణిక రేటును చైనా ఈ నెల 20న ప్రకటించనుంది. కోవిడ్–19 షాక్ తదుపరి ఆర్థిక వ్యవస్థ బలోపేతానికే అధిక ప్రాధాన్యమివ్వనున్నట్లు బ్యాంక్ ఆఫ్ జపాన్ పే ర్కొంది. దీంతో వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇటీవల ఆర్బీఐ, యూఎస్ ఫెడ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, స్విస్ నేషనల్ బ్యాంక్ తదితరాలు వడ్డీ రేట్ల పెంపుతోపాటు కఠిన పరపతి విధానాలకు మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. దీంతో బాండ్ల ఈల్డ్స్ బలపడుతుండటంతో పెట్టుబడులు స్టాక్స్ నుంచి రుణ సెక్యూరిటీలవైపుమళ్లుతున్నట్లు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. రుతు పవనాలు ప్రభావం ఈ ఏడాది వర్షాలు సాధారణంగానే కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనా వేశారు. అయితే నైరుతి రుతు పవనాలు ప్రవేశించినా, వాటి విస్తరణ ఆశించిన విధంగా లేకపోవడం ప్రతికూల ప్రభావం చూపుతోంది. సకాలంలో వర్షాలు కురవకపోతే ద్రవ్యోల్బణ ధీర్ఘకాలం కొనసాగడంతో పాటు పెట్టుబడులు మందగించవచ్చని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతూనే ఉంది. ఈ జూన్లో ఇప్పటి వరకు రూ.31,430 కోట్లు ఉపసంహరించుకున్నారు. దీంతో 2022 ఆరంభం నుంచి మొత్తంగా రూ.1.98 లక్షల కోట్లు భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి తరలిపోయాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం పెరుగుదల, కేంద్ర బ్యాంకులు ద్రవ్య విధానాన్ని కఠినతరం చేయడం వంటి అంశాలే ఎఫ్పీఐల అమ్మకాలకు ప్రధాన కారణమని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. -
మార్కెట్లో ద్రవ్యోల్బణం దడ
ముంబై: అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ద్రవ్యోల్బణ భయాలు మరోసారి మార్కెట్ వర్గాలను హడలెత్తించాయి. ఎగబాకిన ద్రవ్యోల్బణం కేంద్ర బ్యాంకుల కఠినతర ద్రవ్యపాలసీ విధానానికి, ఆర్థిక అస్థిరతకు దారి తీయోచ్చనే ఆందోళనలతో ఇన్వెస్టర్లు వారాంతపు రోజున ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెగబడ్డారు. ట్రేడింగ్ ఆద్యంతం అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో శుక్రవారం సెన్సెక్స్ 1,017 పాయింట్లు నష్టపోయి 54,303 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 276 పాయింట్లు క్షీణించి 16,201 వద్ద నిలిచింది. స్టాక్ సూచీలు రెండు శాతం పతనంతో స్టాక్ మార్కెట్లో రూ.3.11 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ. 2,52 లక్షల కోట్లకు దిగివచ్చింది. బ్యాంకింగ్, ఆర్థిక, మెటల్, ఐటీ, ఆయిల్అండ్గ్యాస్ వంటి అధిక వెయిటేజీ రంగాల షేర్లు డీలా పడటంతో సూచీలు ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. సెన్సెక్స్ సూచీలో 30 షేర్లలో ఎనిమిది మాత్రమే లాభాలతో గట్టెక్కాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్లు దాదాపు రెండుశాతం చొప్పున క్షీణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,974 కోట్ల షేర్లను అమ్మేయగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.2,831 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియాలో జపాన్, హాంగ్కాంగ్, కొరియా మార్కెట్లు రెండున్నర శాతం నష్టపోయాయి. ఈసారికి వడ్డీరేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ.., రానున్న రోజుల్లో పెంపు తప్పదనే ఈసీబీ వ్యాఖ్యలతో యూరప్ మార్కెట్లు రెండున్నర శాతం నష్టపోయాయి. యూఎస్ స్టాక్ ఫ్యూచర్లు 2% నష్టాల్లో ట్రేడయ్యాయి. ఈ వారంలో సెన్సెక్స్ 1,466 పాయింట్లు, నిఫ్టీ 383 పాయింట్లు చొప్పున పెరిగాయి. నష్టాలు ఎందుకంటే..! ఫెడ్ రిజర్వ్ ద్రవ్యపాలసీని నిర్ణయించే అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాల వెల్లడి(శుక్రవారం)కి ముందు అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడయ్యాయి. ఈ పరిణామం దేశీయ మార్కెట్లపైనా ప్రతికూల ప్రభావం చూపించింది. ఇటీవల దేశంలో కరోనా కేసులు తిరిగి పెరుగుతుండటం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడాయిల్ ధర(121.28డాలర్లకు) మూడు నెలల గరిష్టానికి చేరుకుంది. అధిక వెయిటేజీ షేర్లు రిలయన్స్, హెచ్డీఎఫ్సీ ద్వయం, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్ షేర్లు రెండు నుంచి నాలుగుశాతం క్షీణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు వరుస విక్రయాలు, ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ జీవితకాల కనిష్టానికి చేరుకోవడం తదితర అంశాలూ మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీశాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► నష్టాల మార్కెట్లోనూ బజాజ్ ఆటో షేరు రాణించింది. రెండు శాతం లాభంతో రూ.3,965 వద్ద స్థిరపడింది. వచ్చేవారంలో జరిగే బోర్డు సమావేశంలో కంపెనీ బైబ్యాక్ అంశాన్ని పరిగణలోకి తీసుకోవచ్చనే వార్తలు షేరు ర్యాలీకి కారణమైంది. ► హిందాల్కో, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పేయింట్స్, శ్రీ సిమెంట్ షేర్లు ఈ వారంలో ఐదుశాతం నష్టాన్ని చవిచూశాయి. ► మెడ్ప్లస్ షేరు మూడుశాతం నష్టపోయి రూ.753 వద్ద స్థిరపడింది. -
రూపాయి... పతనాల రికార్డు
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ ‘కనిష్ట పతన రికార్డులు’ కొనసాగుతున్నాయి. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో శుక్రవారం రూపాయి విలువ 19 పైసలు నష్టపోయి 77.93కు పతనమైంది. క్రూడ్ ఆయిల్ ధరల తీవ్రత, దేశం నుంచి విదేశీ నిధులు భారీగా వెనక్కు మళ్లడం, ఈక్విటీ మార్కెట్ల పతనం, అంతర్జాతీయంగా డాలర్ బలోపేత ధోరణి రూపాయి బలహీనతలకు ప్రధాన కారణాలు. రూపాయి గురువారం ముగింపు 77.74. ఇంట్రాడేలో జీవితకాల కనిష్ట స్థాయి 77.81ని చూసింది. అయితే శుక్రవారం ట్రేడింగ్లో 77.81 వద్దే ప్రారంభమైంది. 77.79 స్థాయిని దాటి ఏ దశలోనూ బలపడలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో రూపాయి 80 వరకూ బలహీనపడే అవకాశం ఉందన్న అంచనాలున్నాయి. ఇక ఈ వార్త రాస్తున్న రాత్రి 11 గంటల సమయంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ బలహీనంగా 77.90 వద్ద ట్రేడవుతోంది. ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదకన లెక్కించే డాలర్ ఇండెక్స్ పటిష్టంగా 104.20 వద్ద ట్రేడవుతోంది. ఇక బ్రెంట్, నైమెక్స్ క్రూడ్ బేరల్కు 120 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. ఇదిలావుండగా, జూన్ 3తో ముగిసిన వారంలో దేశ ఫారెక్స్ నిల్వల పరిస్థితి 601.057 బిలియన్ డాలర్లుగా ఉంది. అంతక్రితం వారంతో పోల్చితే 306 మిలియన్ డాలర్లు తగ్గాయి. -
ఎకానమీకి ‘రూపాయి’ కష్టాలు.. సామాన్యులకు భారం..
ఒకవైపు మండిపోతున్న ముడి చమురు ధరలు, మరోవైపు తరలిపోతున్న విదేశీ పెట్టుబడుల.. వెరసి మన రూపాయికి పెద్ద కష్టమే తెచ్చిపెట్టాయి. ప్రధానమైన ఈ రెండింటితో పాటు ఇతరత్రా కారణాలతో దేశీ కరెన్సీ నిత్యం క్షీణిస్తోంది. కొత్త రికార్డు స్థాయిలకు పతనమవుతోంది. తాజాగా అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ గురువారం ఆల్–టైమ్ కనిష్ట స్థాయి 77.81కి పతనమైంది. చివరికి కొంత కోలుకుని అంతక్రితం రోజుతో పోలిస్తే 6 పైసల నష్టంతో 77.74 వద్ద క్లోజయ్యింది. ఇది ఇక్కడితో ఆగేలా లేదు. క్రూడాయిల్ రేట్లు బ్యారెల్కు 125 డాలర్ల పైన స్థిరపడితే మార్కెట్లు మరింత అతలాకుతలం కానున్నాయి. దీంతో దేశీ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోవడం తీవ్రమైతే.. రూపాయిపై ఒత్తిడి ఇంకా పెరిగిపోతుందని ఎల్కేపీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేది తదితర విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మనకేంటి.. 2017 మేలో 64 రూపాయలు ఇస్తే ఒక అమెరికన్ డాలర్ లభించేది. కానీ ప్రస్తుతం అదే డాలర్కు 77 రూపాయలు పైగా ఇవ్వాల్సి వస్తోంది. అంటే గడిచిన అయిదేళ్లలో మన కరెన్సీ విలువ ఏకంగా రూ. 13 పైగా పడిపోయింది. డాలర్ రూపాయి పతనమైతే మనకేమిటి, పెరిగితే మనకేమిటి అనుకోవడానికి లేదు. ఎందుకంటే మన రోజువారీ కొనుగోళ్లన్నీ దీని విలువతోనే ముడిపడి ఉన్నాయి. రూపాయి కాస్త తగ్గితే ఎగుమతులపరంగా ప్రయోజనకరమే అయినా దిగుమతులు మొదలుకుని పెట్టుబడుల పోర్ట్ఫోలియో, ద్రవ్యోల్బణం, ఈఎంఐలు, విదేశీ విద్యలాంటి అనేకానేక అంశాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. మన ఇంధన అవసరాల్లో 85 శాతం క్రూడాయిల్ను దిగుమతి చేసుకోవాల్సి ఉంటోంది. దీనికి డాలర్ల మారకంలో చెల్లించాలి. రూపాయి విలువ పడిపోయిందంటే మరిన్ని ఎక్కువ డాలర్లు ఇచ్చి క్రూడాయిల్ తదితర ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఫలితంగా ఆయా ఉత్పత్తుల రేట్లు దేశీయంగా మరింత పెరుగుతాయి. దేశీయంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఇప్పటికే ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 7.79 శాతం స్థాయికి ఎగిసింది. దీంతో ధరలను కట్టడి చేసేందుకు రంగంలోకి దిగిన రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను అయిదు వారాల వ్యవధిలో దాదాపు 1 శాతం (0.90 శాతం) మేర పెంచింది. దీనికి తగ్గట్లుగా బ్యాంకులు కూడా రుణాలపై వడ్డీ రేట్లను పెంచేయడం ప్రారంభించాయి. ఫలితంగా గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీలు, నెలవారీ వాయిదాల భారం మరింత పెరుగుతోంది. పెట్టుబడులపై ప్రభావం.. ఇక దేశీ కరెన్సీ క్షీణతతో విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుంటాయి. వారు తమ పెట్టుబడులను డాలర్ల రూపంలోనే వెనక్కి తీసుకునే అవకాశం ఉంది కాబట్టి రూపాయికి డిమాండ్ మరింత పడిపోయి, కరెన్సీ ఇంకా క్షీణించే అవకాశం ఉంది. ఇక విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెగబడటంతో దేశీ ఈక్విటీ మార్కెట్లు కూడా క్షీణిస్తాయి. ఫలితంగా మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన దేశీ ఇన్వెస్టర్ల పోర్ట్ఫోలియోపైనా ప్రతికూల ప్రభావం పడుతుంది. భారీ స్థాయి క్రూడాయిల్ రేట్లు, ద్రవ్యోల్బణం, విదేశాల్లో సెంట్రల్ బ్యాంకులు కఠినతర విధానాలు అమలు చేస్తుండటం, మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు తదితర అంశాల కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగించే అవకాశాలే కనిపిస్తున్నాయని మార్కెట్ వర్గాల అంచనా. విదేశీ చదువు .. ప్రయాణాలు భారం.. విదేశాల్లో విద్య కోసం, విదేశీ ప్రయాణాల కోసం ప్లానింగ్ చేసుకునే వారిపైనా రూపాయి పతన ప్రభావం పడుతుంది. అయిదేళ్ల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం సుమారు 21 శాతం పైగా ఎక్కువ డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఉదాహరణకు కొన్నాళ్ల క్రితం విదేశీ విద్య కోసం రూ. 20 లక్షలు ఖర్చయితే ఇప్పుడు రూ. 24 లక్షలపైగా ఖర్చవుతుంది. ఇదే కాదు, విదేశీ ప్రయాణాలు కూడా భారం అవుతాయి. దేశీ కరెన్సీ మారకం విలువ పడిపోవడం వల్ల ఇతర దేశాల కరెన్సీలను కొనుగోలు చేసేందుకు మరిన్ని ఎక్కువ రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. దీంతో విదేశీ యాత్రల కోసం మరింత ఎక్కువ వెచ్చించాల్సి వస్తుంది. రూపాయి పతనం, పెరగడం ఎందుకు.. అంతర్జాతీయంగా కరెన్సీ లావాదేవీలకు సంబంధించి ప్రస్తుతం అమెరికా డాలర్, యూరోపియన్ యూనియన్కు చెందిన యూరో ప్రామాణికంగా ఉంటున్నాయి. అంతర్జాతీయంగా బ్యాంకుల దగ్గర ఉన్న విదేశీ కరెన్సీల్లో డాలర్ వాటా 64 శాతంగాను, యూరోల వాటా 20 శాతంగాను ఉంది. అమెరికాలో వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు బడా ఇన్వెస్టర్లు అధిక రాబడుల కోసం భారీ స్థాయిలో భారత్ వంటి మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ప్రస్తుతం అమెరికాలోను ద్రవ్యోల్బణం పెరిగిపోయి, వడ్డీ రేట్లు పెంచుతుండటంతో ఇన్వెస్టర్లు మన మార్కెట్లలోని పెట్టుబడులను వెనక్కి తీసేసుకుంటున్నారు. దీంతో పరిమిత స్థాయిలో లభించే డాలర్లకు డిమాండ్ పెరిగి, మన కరెన్సీ విలువ తగ్గుతోంది. ఇక ప్రత్యేకంగా భారత్ విషయానికొస్తే ఎగుమతులతో పోలిస్తే దిగుమతులే ఎక్కువగా ఉంటున్నాయి. క్రూడాయిల్, బంగారం, ఎలక్ట్రానిక్స్ వంటివి ఈ లిస్టులో ఉంటున్నాయి. వీటికి డాలర్లలో చెల్లించాల్సి ఉంటోంది. ఎగుమతుల కన్నా దిగుమతులు ఎక్కువ ఉండటం వల్ల డాలర్లకు డిమాండ్ పెరిగి, మన కరెన్సీ విలువ క్రమంగా కరుగుతూ వస్తోంది. ఇటీవల ఉక్రెయిన్పై రష్యా యుద్ధ పరిణామాలతో క్రూడాయిల్ సహా పలు ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయి. దానికి తగ్గట్లుగానే వాటిని భారత్ సహా దిగుమతి చేసుకునే దేశాల్లో రేట్లు మండిపోతున్నాయి. -
రికార్డ్ స్థాయికి చమురు: పేలనున్న పెట్రో బాంబు?
సాక్షి, న్యూఢిల్లీ: ఉక్రెయిన్- రష్యా యుద్ధం, రష్యాపై ఆంక్షల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు రికార్డు స్థాయికి చేరాయి. ముఖ్యంగా రష్యా నుంచి దిగుమతి చేసుకునే క్రూడాయిల్ను మూడొంతుల మేర నియంత్రించడానికి యూరోపియన్ యూనియన్ దేశాలు అంగీకారం తెలిపాయి. ఫలితంగా రష్యా ముడి చమురు దిగుమతి మరింత కఠినతరం కానుంది. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే క్రూడాయిల్ బ్యారెల్ ధర 124 డాలర్లకు చేరడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో బ్యారెల్ రేటు పెరగడం ఇదే తొలిసారి. రష్యాపై ఆరో ప్యాకేజీ కింద ఆంక్షలు, నిషేధాజ్ఞలు తీవ్రం కావడంతో ఈ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్పై పడింది. క్రూడాయిల్ ధర ఒక్కసారిగా బ్యారెల్కు 124 డాలర్లకు చేరడానికి దారి తీసిందీ పరిస్థితి. బ్రెంట్, యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ధరల్లో కూడా ఇదే ధోరణి నెలకొంది. ఇక్కడ బ్యారెల్ ధర 60 శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ఈ ధరల ఒత్తిడి దేశీయ ధరలపై పడే అవకాశం లేకపోలేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఇంధన సంక్షోభం దేశీయ ఇంధన రంగం కూడా ప్రభావితం కానుంది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో, దేశీయ ముడి చమురు ఉత్పత్తిదారులు, రిఫైనర్ల కార్యకలాపాల ఆదాయాలు వార్షిక ప్రాతిపదికన 30.5 శాతం, త్రైమాసికంలో 7.40 శాతం పెరిగాయి. అలాగే నిఫ్టీ 50లో 5 శాతానికి పైగా పతనంతో పోలిస్తే 2022లో బిఎస్ఇ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ 7.5 శాతం లాభపడింది. అలాగే ఇండియాలోని రెండు చమురు ఉత్పత్తిదారులు ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాల మార్చి త్రైమాసికంలో నికర లాభం వరుసగా 21 శాతం, 207 శాతం జంప్ చేయడం విశేషం. ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్ వార్ మొదలైనపుడు ముడి చమురు ధరలు బ్యారెల్ 100 డాలర్లకు అటూ ఇటూ కద లాడింది. మధ్యలో కాస్త శాంతించినప్పటికీ రష్యన్ చమురు ఎగుమతులపై యూరోపియన్ యూనియన్ తాజా ఆంక్షలతో మళ్లీ బ్యారెల్ 124 డాలర్ల మార్కుకు ఎగిసింది. దీంతో పెట్రోలు ధరలు మరింత పుంజుకోనున్నా యనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల కేంద్రం పన్నులను తగ్గించిన్పటికీ అంతర్జాతీయ ప్రభావంతో దేశీయంగా మళ్లీ పెట్రో వాత తప్పదనే భయాందోళనలు నెలకొన్నాయి. దీనికి తోడు చమురు ధరలు బ్యారెల్ 110 డాలర్లకు చేరడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ద్రవ్యోల్బణం కంటే పెద్ద ముప్పే అంటూ కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇటీవల దావోస్లో వ్యాఖ్యలును గుర్తు చేసుకుంటున్నారు. -
క్రూడాయిల్ ధరలు అదే స్థాయిలో ఉంటే జీడీపీపై ప్రభావం..
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగంలో మూలధన వ్యయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం నుంచి (2022అక్టోబర్–2023 మార్చి) మెరుగుపడతాయన్న ఆశాభావాన్ని ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్ మంగళవారం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. కార్పొరేట్ పన్ను తగ్గింపుతో సహా అనేక చర్యలు తీసుకున్నప్పటికీ, ప్రైవేట్ రంగం నుండి పెట్టుబడులు గత పలు సంవత్సరాలుగా ఊపందుకోని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) నిర్వహించిన ఒక కార్యక్రమంలో అనంత నాగేశ్వరన్ చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) బ్యాంకింగ్ రుణం పుంజుకోవడం ప్రారంభమైంది. అందువల్ల, బహుశా రెండవ త్రైమాసికం చివరి నాటికి లేదా సంవత్సరం రెండవ అర్ధభాగంలో ప్రైవేట్ రంగం మూలధన వ్యయం భారీగా పెరుగుతాయని నేను భావిస్తున్నాను. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో 2022–23 ఆర్థిక సంవత్సరానికి క్యాపెక్స్ (మూలధన వ్యయం)ను 35.4 శాతం పెంచారు. దీనితో ఈ విలువ రూ. 7.5 లక్షల కోట్లకు పెరిగింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో క్యాపెక్స్ రూ. 5.5 లక్షల కోట్లు. ఇది పెట్టుబడుల పురోగతికి దారితీసే అంశం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సర్వే ప్రకారం పరిశ్రమ సామర్థ్య వినియోగం 68% నుంచి 74 శాతానికి పెరిగింది. పలు రంగాల్లోని తొలి దిగ్గజ నాలుగు సంస్థలు ఇప్పటికే 80 శాతానికి పైగా సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. దీర్ఘకాలిక ఆకాంక్షలు, స్థూల ఆర్థిక స్థిరత్వం, వివేకవంతమైన బడ్జెట్, పారదర్శకత, మూలధన వ్యయంపై దృష్టి వంటి పలు అంశాలు ఎకానమీని తగిన బాటలో సమతౌల్యతతో నడుపుతూ వృద్ధికి దోహదపడతాయి. పేదలకు ఉపశమనం కలిగించేందుకు, ప్రభుత్వం ఉచిత ఆహార కార్యక్రమాన్ని మరో ఆరు నెలలు పొడిగించింది. దీని వల్ల ఖజానా నుంచి దాదాపు రూ. 80,000 కోట్లు (జీడీపీలో 0.65 శాతం) వ్యయం అవుతుంది. పేద ప్రజలకు ఉచిత ఆహార ధాన్యాలను అందించే ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (పీఎంజీకేఏవై)వల్ల భారత్లో పేదరికం తీవ్రత తగ్గిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) సంస్థ ఇటీవలే విశ్లేషించింది. ఈ పథకం వల్ల కోవిడ్–19 మహమ్మారిని ఎదుర్కొన్న 2020 సమయంలో భారత్లో తీవ్ర పేదరికం 0.8 శాతం వద్ద కనిష్ట స్థాయిలో కొనసాగిందని ఒక వర్కింగ్ పేపర్లో పేర్కొంది. మార్చి 2020లో ప్రారంభించిన ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నెలకు 5 కిలోల ఆహారధాన్యాలను ఉచితంగా అందిస్తోంది. సాధారణ కోటా కంటే ఎక్కువగా అదనపు ఉచిత ధాన్యాన్ని జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద అందించడం జరుగుతోంది. కిలోగ్రాముకు రూ. 2 నుంచి రూ.3 వరకూ అధిక సబ్సిడీ రేటుతో ఈ ప్రయోజనాన్ని పేదలకు కేంద్రం అందిస్తోంది. 2022 సెప్టెంబర్ వరకూ ఈ పథకాన్ని పొడిగించింది. ప్రైవేట్ రంగంలో బ్యాలెన్స్ షీట్ పటిష్టంగా ఉంది. భౌగోళిక రాజకీయ ఉద్రికత్తలు, ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు వంటి ప్రతికూలాంశాలను ఇది భర్తీ చేస్తుంది. 2022–23 ద్వితీయార్థంలోకి వెళుతున్నప్పుడు, మనకు మంచి ఫలితాలు కనిపిస్తాయి. 2003–2012 మధ్య కాలంలో మనం సాధించిన అధిక వృద్ధిని మరింత స్థిరమైన రూపంలో మళ్లీ చూడగలుగుతామన్న విశ్వాసం ఉంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ తన ద్రవ్య విధానాన్ని కఠిన తరం చేయడం ప్రస్తుతం ప్రధాన సవాళ్లు. మొండిబకాయిల సమస్య పరిష్కారం దిశలో చర్యలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం ప్రస్తుతం దృష్టి సారించాల్సిన అంశాలు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా పన్ను వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. 2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి వరకు పన్నుల రూపంలో ఖజానాకు రూ.27.07 లక్షల కోట్లు (అంచనాలు రూ. 22.11 లక్షల కోట్లు) వచ్చి చేరాయి. బడ్జెట్ అంచనాలను మించి ఇవి నమోదు కావడం విశేషం. ఇదే ధోరణి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కూడా కొనసాగుతుందని భావిస్తున్నాం. చమురు ధరలు దీర్ఘకాలం పాటు బ్యారల్కు 100 డాలర్ల పైనుంటే, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంకెలపై దీని ప్రభావం పడే వీలుందని సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు. ఈ అంచనాలను తగ్గించాల్సి రావచ్చని కూడా సూచించారు. ఎకనమిక్ సర్వే ప్రకారం, 2022–23లో ఆర్థికాభివృద్ధి 8 నుంచి 8.5 శ్రేణిలో ఉండవచ్చని(ఇంతక్రితం అంచనా 9.2 శాతం) ఆయన అన్నారు. క్రూడ్ ఆయిల్ ధరల తీవ్రత, రష్యా–ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో సరఫరాల కొరతల వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు క్రితం 7.8 శాతం అంచనాలను గత వారం ఆర్బీఐ పాలసీ సమావేశాలు 7.2 శాతానికి కుదించిన సంగతి తెలిసిందే. -
ఒక్క రోజు బ్రేక్ ఇచ్చారు.. మళ్ళీ పెంచారు
-
భారత్కు భారీ తగ్గింపుతో ముడిచమురును ఆఫర్ చేసిన రష్యా
ఉక్రెయిన్-రష్యా యుద్దం నేపథ్యంలో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు గణనీయంగా పెరిగిన విషయం తెలిసిందే. ఒకానొక సమయంలో బ్యారెల్ క్రూడాయిల్ ధరలు 140 డాలర్లకు చేరుకుంది. ఇక ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యను ప్రారంభించినప్పటీ నుంచి అమెరికాతో సహా పలు యూరోపియన్ దేశాలు కూడా ఆంక్షలను విధించాయి. దీంతో రష్యాలో ముడిచమురు నిల్వలు భారీగా పెరుకుపోయాయి. ఈ నేపథ్యంలో రష్యా భారత్కు భారీ తగ్గింపుతో ముడిచమురును ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో... బ్యారెల్ క్రూడాయిల్పై భారత్కు ఏకంగా 35 డాలర్ల తగ్గింపును రష్యా ఆఫర్ చేసిందని బ్లూమ్బర్డ్ నివేదించింది. అంతేకాకుండా రష్యాకు చెందిన అత్యంత విలువైన యూరల్స్ గ్రేడ్ క్రూడాయిల్ అందించినట్లు తెలిపింది. క్రూడాయిల్ను దిగుమతి చేసుకునేందుకుగాను భారత్ను రష్యా ప్రోత్సహించింది. ఈ ఏడాది 15 మిలియన్ బ్యారెల్స్తో ఒప్పందం కుదుర్చుకోవాలని రష్యా కోరినట్లు బ్లూంబర్గ్ పేర్కొంది. చదవండి: హల్చల్ చేస్తోన్న టాటా మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ కారు..! లాంచ్ ఎప్పుడంటే..? -
షాకింగ్:రాకెట్లా పెట్రోల్,డిజీల్ ధరలు..రూ.15 నుంచి రూ.20కి పెరిగే ఛాన్స్!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా ఎప్పటికప్పుడు ధరలను పెంచనందుకు ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలైన హెచ్పీసీఎల్, ఐవోసీ, బీపీసీఎల్ ఏకంగా 2.25 బిలియన్ డాలర్ల (రూ.16,875 కోట్లు) ఆదాయాన్ని నష్టపోయాయి. ఈ మూడు సంస్థల ఎబిట్డాలో ఇది 20 శాతానికి సమానం. ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు నాలుగు నెలల పాటు పెట్రోల్, డీజిల్ ధరలను ఆయిల్ కంపెనీలు సవరించకుండా ఒకే ధరను కొనసాగించడం తెలిసిందే. 137 రోజుల పాటు ధరలను సవరించలేదు. బ్యారెల్ క్రూడ్ 82 డాలర్ల వద్ద చివరిగా ధరలను సవరించగా.. 120 డాలర్లకు పెరిగిపోయినా కానీ, అవే రేట్లను కొనసాగించాయి. నిత్యం రూ.525 కోట్ల నష్టం.. ‘‘ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు బ్యారెల్ చమురుపై 25 డాలర్ల ఆదాయాన్ని, పెట్రోల్, డీజిల్ విక్రయంపై 24 డాలర్ల నష్టాన్ని చూస్తున్నాయి. ఒకవేళ చమురు ధరలు బ్యారెల్కు సగటున 111 డాలర్ల వద్ద కొనసాగితే, పెరిగిన ధరల మేరకు విక్రయ రేట్లను సవరించకపోతే.. ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ రోజువారీగా పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై 65–70 మిలియన్ డాలర్లు (రూ.525 కోట్లు) నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని మూడిస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ తెలిపింది. మూడున్నర నెలల విరామం తర్వాత మార్చి 22 నుంచి ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను రోజువారీగా సవరించాన్ని ప్రారంభించడం తెలిసిందే. మరింత పెంచాల్సిందే..! ‘‘ముడి చమురు బ్యారెల్ ధర 110–120 డాలర్ల మధ్య కొనసాగితే ఆయిల్ కంపెనీలు లీటర్ డీజిల్పై రూ.13.10–24.90 మేర.. లీటర్ పెట్రోల్పై 10.60–22.30 చొప్పున ధరలను పెంచాల్సి వస్తుంది’’ అని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ తెలిపింది. క్రిసిల్ రీసెర్చ్ విశ్లేషణ ప్రకారం చూసినా.. ముడి చమురు బ్యారెల్ 100 డాలర్ల వద్ద సగటున ఉంటే పెట్రోల్, డీజిల్కు లీటర్పై రూ.9–12 మేర, 110–120 డాలర్ల మధ్య ఉంటే రూ.15–20 మధ్య పెంచాల్సి వస్తుంది. ఇండియన్ ఆయిల్ (ఐవోసీ) ఒక్కటే 1–1.1 బిలియన్ డాలర్ల మేర ఆదాయాన్ని నష్టపోగా, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ 55–560 మిలియన్ డాలర్ల మేర 2021 నవంబర్ – 2022 డిసెంబర్ మధ్యకాలంలో నష్టాన్ని చవిచూసినట్టు మూడిస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ అంచనా. ‘‘ఆదాయంలో ఈ మేరకు నష్టం స్వల్పకాల రుణ భారాన్ని పెంచుతుంది. చమురు ధరలు గరిష్ట స్థాయిల్లో ఉన్నంత వరకు మూలధన నిధుల నుంచి సర్దుబాటు చేసుకోవాల్సి వస్తుంది. కొంత కాలానాకి చమురు ధరలు దిగివస్తే అప్పుడు ఆయిల్ కంపెనీలు కొంత మేర నష్టాలను సర్దుబాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది’’ అని మూడిస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ తన నివేదికలో తెలిపింది. -
రష్యన్ చమురు కంపెనీలు భారత్ కు భారీ బంపర్ ఆఫర్..!!
-
అబ్బే..అలాంటిదేం లేదు! రష్యా వార్నింగ్తో మాట మార్చిన అమెరికా?
ఉక్రెయిన్పై రష్యా దాడికి దిగడంతో చమురు ధరలు మండిపోతున్నాయి. ఈ మంటను చల్లార్చేందుకు అమెరికా ఆచితూచీ వ్యవహరిస్తోంది. సున్నితమైన అంశం కావడంతో రిస్క్ తీసుకునేందుకు వెనుకాడుతోంది. తాజాగా రష్యా దిగుమతుల విషయంలోనూ స్వరం తగ్గించి మాట్లాడుతోంది అమెరికా. పది రోజులు గడిచినా ఉక్రెయిన్పై దాడుల విషయంలో రష్యా వెనక్కి తగ్గడం లేదు. దీంతో అమెరికాతో పాటు యూరప్లో ఉన్న దాని మిత్రదేశాలు రష్యాను మరింత ఒత్తిడిలోకి నెట్టేందుకు రష్యా నుంచి ముడి చమురు, దిగుమతిని నిషేధించాలని చర్చించాయి. ఈ సమావేశానికి సంబంధించిన వార్తలు బయటకి పొక్కడంతో ఒక్కసారిగా బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 140 డాలర్లను టచ్ చేసింది. మరోవైపు రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్ నోవాక్ మాట్లాడుతూ.. యుద్ధ అనంతర పరిణామాలకు తాము సిద్ధంగా ఉన్నామని చెబుతూ.. రష్యా నుంచి చమురు, ఆయిల్ దిగుమతి చేసుకోకూడదని యూరప్ దేశాలు భావిస్తే .. దాని వల్ల వారికే నష్టమంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు బ్యారెల్ చమురు ధర 300 డాలర్లకు పెరగొచ్చంటూ బాంబు పేల్చారు. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం రష్యాకు మరో ప్రత్యామ్నాయ చమురు ఉత్పత్తి దేశం ఏదీ కనుచూపు మేరలో కనిపించకపోవడంతో అమెరికా దాని మిత్రదేశాలు పునరాలోచనలో పడ్డాయి. లిబియా, వెనుజువెలా, ఇరాన్లలో ఇప్పటికిప్పుడు ఉత్పత్తి పెరిగే అవకాశం లేకపోవడంతో రష్యా దిగుమతుల విషయంలో అమెరికా దూకుడు తగ్గించింది. తాజగా వైట్హౌజ్ మీడియా ప్రతినిధి జేన్సాక్ మాట్లాడుతూ... రష్యా నుంచి ఆయిల్, గ్యాస్ దిగుమతులపై నిషేధం విధించే విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. అయితే నిషేధం అంశంపై మిత్రపక్ష దేశాలతో చర్చలు జరిగిందని తెలిపింది. రష్యా దాడులను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని చెబుతూనే చమురు దిగుమతులపై కఠిన వైఖరి తీసుకోవడానికి అమెరికా మీనమేషాలు లెక్కపెడుతోంది. చదవండి: రష్యా బెదిరింపులు.. పెట్రోల్ రేట్లు ఊహించనంత పెరుగుతాయ్! -
పెట్రోల్ రేట్లు ఊహించనంత పెరుగుతాయ్! మీ వాళ్లకి ముందే చెప్పండి
ఉక్రెయిన్ దాడిని నిరసిస్తూ ప్రపంచ దేశాలు చెబుతున్న హిత వ్యాఖ్యలను రష్యా బేఖాతర్ చేస్తోంది. అంతేకాదు మా మీద ఆంక్షలు పెట్టుకుంటూ పోతే మీకే నష్టమంటూ దబాయిస్తోంది. తాము అన్నింటికీ సిద్ధపడే ఉన్నమని.. ఆంక్షల వల్ల తలెత్తే పరిమాణాలకు మీరు సిద్ధంగా ఉన్నారా అంటూ యూరప్ దేశాలను ప్రశ్నిస్తోంది. ప్రపంచ ఆయిల్ సరఫరాలో రష్యాది 10 శాతం వాటాగా ఉంది. ఇక యూరప్ గ్యాస్ అవసరాల్లో 40 శాతం రష్యా నుంచే సరఫరా అవుతోంది. అయితే ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో అమెరికాతో పాటు దాని మిత్రపక్ష దేశాలు, యూరోపియన్ యూనియన్ దేశాలు వరుసగా ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా మరో అడుగు ముందుకు వేసి రష్యా నుంచి చమురు, గ్యాస్ దిగుమతులు ఆపేస్తామనే వరకు హెచ్చరికలు వెళ్లాయి. రష్యా నుంచి చమురు, గ్యాస్ను దిగుమతి చేసుకోకూడదని యూరప్ దేశాలు భావిస్తే నిక్షేపంగా ఆ పని చేయవచ్చంటూ తమకేమీ అభ్యంతరం లేదని చెబుతున్నాడు రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్ నోవాక్. రష్యా దిగుమతులు వద్దని మీరు భావిస్తే బ్యారెల్ ముడి చమురు ధర పెరుగుదలకు అంతే ఉండదు. ఒక్క బ్యారెల్ ధర 300 డాలర్లకు చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటూ యూరప్ దేశాలను భయపెట్టే ప్రయత్నం చేశారు. యుద్ధం వల్ల తలెత్తే పరిస్థితులను ఎదుర్కొనేందుకు తమ దేశం సిద్ధంగా ఉందని. కానీ రష్యాపై విధించే ఆంక్షల కారణంగా వచ్చే పరిణామలు ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉండండి అంటూ చెప్పుకొచ్చారు నోవాక్. పెరిగే పెట్రోలు, డీజిల్ ధరలపై ఇప్పుడే మీ దేశ ప్రజలకు, వినియోగదారులకు చెప్పండి అంటూ సూచిస్తున్నారు నోవాక్. యూరోపియన్ యూనియన్ ఆంక్షలకు భయపడేది లేదంటూ పశ్చిమ దేశాలకు వార్నింగ్ ఇచ్చారాయన. గత మూడు నెలలుగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ఉక్రెయిన్ ఉద్రిక్తలకు ముందు బ్యారెట్ క్రూడ్ ఆయిల్ ధర 70 డాలర్ల నుంచి 80 డాలర్ల మధ్య ట్రేడయ్యింది. ఇక యుద్దం మొదలై ఊపందుకున్న తర్వాత బ్యారెల్ ధర ఏకంగా 140 డాలర్లకు కూడా టచ్ చేసింది. ఈ నేపథ్యంలో బ్యారెల్ ధర ఏకంగా 300 డాలర్లకు చేరుకోవచ్చంటూ రష్యా ఉప ప్రధాని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చదవండి: Russia Ukraine War Impact: ఇటు రష్యా అటు నాటో.. ఇబ్బంది పడుతున్న ప్రపంచ దేశాలు -
ఇటు రష్యా అటు నాటో.. చుక్కలు చూపిస్తోన్న ముడి చమురు ధరలు
-
చుక్కలు చూపిస్తోన్న ముడి చమురు ధరలు.. చిక్కుల్లో ప్రపంచ దేశాలు
ప్రపంచ దేశాలను ముడి చమురు ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. ఉక్రెయిన్ విషయంలో ఇటు నాటో అటు రష్యా పంతానికి పోతుండటం మిగిలిన దేశాలకు చిక్కులు తెస్తోంది. రష్యా బాంబుల మోతలు అమెరికా ఆర్థిక ఆంక్షల వాతలు వెరసి ముడి చమురు ధర రెండో గరిష్ట స్థాయిని అందుకుంది. నాటోలో చేరేందుకు ఉక్రెయిన్ ప్రయత్నిస్తుందంటూ రష్యా చేపట్టిన దండయాత్ర పది రోజులు దాటినా అనుకున్న ఫలితాలు సాధించలేదు. ఓవైపు ఉక్రెయిన్లో ఒక్కో నగరానికి కీలక స్థావరాలను రష్యా స్వాధీనం చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే రష్యా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు నాటోతో పాటు ఈయూ దేశాలు ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నాయి. ఇలా రెండు వైపులా ఒత్తిడి పెరిగిపోవడంతో చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దిగుమతి చేసుకోం? ప్రపంచ ఆయిల్ మార్కెట్లలో గల్ఫ్ తీరంలో ఉన్న ఒపెక్ దేశాల తర్వాత వెనుజువెలా, రష్యాలదే అగ్రస్థానం. రష్యా ఒక్కటే ప్రపంచ ఆయిల్ ఉత్పత్తిలో 10 శాతం వాటాను కలిగి ఉంది. నిన్నా మొన్నా వరకు ఆర్థిక ఆంక్షలు తప్ప ఆయిల్పై నాటో, ఈయూ దేశాలు ఆంక్షలు విధించలేదు. యుద్ధం జరుగుతున్నా రష్యా ఆయిల్ దిగుమతిపై ఎటువంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదు. కానీ నో ఫ్లైజోన్ విషయంలో నాటో దేశాలు లక్ష్యంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్కీ చేస్తోన్న విమర్శలు ఆ దేశాల అధినేతలను చుట్టుముడుతున్నాయి. ఫలితంగా రష్యా నుంచి ఆయిల్ దిగుమతిపై ఆంక్షలు విధిస్తారనే పుకార్లు షికారు చేస్తున్నాయి. అమెరికాకే ఇబ్బంది పెట్రోలు దిగుమతిలో అమెరికా ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో ఉంది. గతంలో అణ్వాయుధాల తయారీ నెపంతో ఇరాన్పై ఆంక్షలు విధించింది అమెరికా. తాజాగా రష్యాపై కూడా ఆయిల్ ఆంక్షలు అమలు చేయనుంది. ఇదే జరిగితే అతి పెద్ద ఆయిల్ వినియోగదారైన అమెరికా కేవలం ఒపెక్ దేశాలపైనే ఆధారపడాల్సి వస్తుంది. దీంతో ఉన్న పళంగా డిమాండ్ పెరిగిపోనుంది. ముడి బిగుస్తోంది పెరుగుతున్న డిమాండ్కు తగ్గట్టుగా అధికంగా ఆయిల్ను ఉత్పత్తి చేసేందుకు ఒపెక్ దేశాలు సుముఖంగా లేవు. దీనికి తోడు మరో ఆయిల్ ఉత్పత్తి దేశమైన లిబియాలోనూ పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. ఆయిల్ ఉత్పత్తి పెంచొద్దంటూ సాయుధ దళాల నుంచి బెదిరింపులు రావడంతో అక్కడ రెండు చోట్ల ముడి చమురు వెలికి తీత ఆగిపోయింది. మండుతున్న ధర డిమాండ్కు తగ్గస్థాయిలో చమురు లభ్యత తగ్గిపోవడంతో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర ఆదివారం 139 డాలర్లకు చేరుకుంది. 2008లో వచ్చిన ఆర్థిక సంక్షోభం కారణంగా బ్యారెల్ ధర 143 డాలర్లుగా పలికింది. ఆ తర్వాత ఇదే అత్యధికం. సోమవారం బ్యారెల్ ధర కొంత తగ్గి 129 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది. కానీ యుద్ధం తెచ్చిన ఉద్రిక్తతలు అలాగే ఉండటం కలవరం కలిగిస్తోంది. శాంతి నెలకొనని పక్షంలో ఏ క్షణమైనా మరోసారి ఆయిల్ ధరలు ఆకాశం తాకడం గ్యారెంటీ అనే భయం నెలకొంది. చిక్కులు వెరసి ఉక్రెయిన్ను కేంద్రంగా చేసుకుని రష్యా, అమెరికా నేతృత్వంలోని నాటో దేశాలు మొదలు పెట్టిన ఆధిపత్య పోరు సెగ ప్రపంచ దేశాలను తాకుతోంది. కరోనా సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే గట్టెక్కుత్ను దేశాలకు చమురు ధరల పెరుగుదల వణికిస్తోంది. ఇదే ట్రెండ్ కొనసాగితే ద్రవ్యోల్బణం తప్పని దుస్థితి ఎదురుకానుంది. చదవండి: ఉక్రెయిన్ - రష్యా వార్ ఎఫెక్ట్.. లబోదిబోమంటున్న బిలియనీర్స్! -
ప్రధాని మోదీ కీలక భేటీ.. భయపెడుతున్న చమురు ధరలు!
సాక్షి, న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ వార్పై ప్రపంచ దేశాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు దేశాల మధ్య యుద్ధం అన్ని దేశాల ఆర్థిక పరిస్థితులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో పెరుగుతున్న ముడి చమురు ధరలపై ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా అధికారులతో పలుమార్లు భేటీ అయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. రష్యా- ఉక్రెయిన్ యుద్దం వేళ గురువారం క్వాడ్ దేశాధినేతలు వర్చువల్ విధానంలో భేటీ కానున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా సమావేశమై కీలక చర్చలు జరుపనున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఇండో- పసిఫిక్ ప్రాంతంలోని పరిణామాలపై కీలక చర్చలు జరిగే అవకావం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఎనిమిది రోజులుగా ఉక్రెయిన్పై రష్యా బలగాలు దాడులు చేస్తున్న నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు రష్యా వార్ ప్రభావం ముడి చమురు ధరలపై పడింది. గురువారం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 117 డాలర్లకు చేరుకుంది. వారం రోజుల్లో ముడి చమురు ధరలు దాదాపు 20 శాతానికిపైగా పెరిగాయి. పెరుగుతున్న ముడి చమురు ధరల ప్రభావం భారత్పై కూడా పడే అవకాశం లేకపోలేదు. అంతర్జాతీయంగా బ్యారెల్ ధర 80 డాలర్ల లోపు ఉన్న సమయంలోనే భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు గరిష్టానికి చేరుకున్నాయి. ఈ సంక్షోభం కారణంగా ఇప్పటికే శ్రీలంకలో లీటర్ పెట్రోల్ ధర రూ. 204కు చేరుకున్న విషయం తెలిసిందే. -
భగ్గుమంటున్న క్రూడ్ ఆయిల్.. పెరిగిన బల్క్ డీజిల్ ధరలు.. ఛార్జీల పెంపు
న్యూఢిల్లీ: ఉక్రెయిన్పై ఏ క్షణమైనా రష్యా మరింత భీకర దాడులు జరపవచ్చన్న విశ్లేషణల నేపథ్యంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సేంజీలో క్రూడ్ ఆయిల్, బంగారం ధరలు మంగళవారం ఒక్కసారిగా భగ్గుమన్నాయి. జెట్ స్పీడ్తో బ్రెంట్ క్రూడ్ బ్యారల్ ధర క్రితం ముగింపుతో పోల్చితే 10 డాలర్లలకు పైగా పెరిగి (10 శాతం పైగా అప్) 111.70 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక నైమెక్స్ క్రూడ్ కూడా ఇదే స్థాయిలో ఎగసింది. ఇప్పటి వరకూ క్రూడ్ గరిష్ట స్థాయి 147 డాలర్లు. ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో 2008 జూలైలో క్రూడ్ ఈ స్థాయిని చూసింది. అదే బాటలో బంగారం ఇక బంగారం ఔన్స్ (31.1 గ్రాములు) ధర 36 డాలర్లు పెరిగి, 1,938 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డాలర్ ఇండెక్స్ ఒకశాతం లాభంతో 97.50 వద్ద ట్రేడవుతుండగా, డాలర్తో రూపాయి విలువ భారీ నష్టంతో 76కు చేరువలో ఉంది. ప్రపంచ మార్కెట్లు క్రాష్ ఉక్రెయిన్ నగరాలపై రష్యా భీకర దాడులతో విరుచుకుపడుతున్న నేపథ్యంలో మంగళవారం ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలాయి. యూరప్లో బ్రిటన్ మార్కెట్ రెండు శాతం క్షీణించింది. జర్మనీ, ఫ్రాన్స్ స్టాక్ సూచీలు నాలుగు శాతం నష్టపోయాయి. అమెరికా నాస్డాక్ ఇండెక్స్ ఒకశాతం, యూఎస్ 500 సూచీ రెండు శాతం నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఉక్రెయిన్పై దండయాత్రకు దిగిన రష్యాను కట్టడి చేసేందుకు రష్యా బ్యాంకులకు అమెరికా, దాని మిత్ర దేశాలు స్విఫ్ట్ సేవలను నిలిపివేశాయి. ఫలితంగా ఆ దేశ కరెన్సీ రూబెల్ మరోసారి తాజాగా కనిష్టానికి పతనమైంది. బల్క్ డీజిల్ ధరల పెంపు నవంబరు మొదటి వారం నుంచి రిటైల్ పెట్రోలు, డీజిల్ ధరలు పెంపు నుంచి సామాన్యులకు ఊరట లభిస్తోంది. కానీ ఉక్రెయిన్ ఉద్రికత్తత మొదలైనప్పటి నుంచి క్రూడ్ అయిల్ ధరలు పెరుగుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం, ఆయిల్ కంపెనీలు రిటైల్ చమురు ధరల పెంపును వాయిదా వేస్తున్నాయి. కానీ ఈ లోటును భర్తీ చేసుకునేందుకు బల్క్ డీజిల్ ధరలను భారీగా పెంచాయి. రిటైల్ కంటే ఎక్కువ 2022 ఫిబ్రవరి వరకు కూడా రిటైల్ డీజిల్తో పోల్చితే బల్క్ డీజిల్ ధర లీటరుకు కనీసం రూ. 4 తక్కువకే లభించేంది. అందువల్లే ఆర్టీసీ వంటి కార్పోరేట్ సంస్థల తరహాలో అనేక కంపెనీలు, అపార్ట్మెంట్ సొసైటీలు భారీగా బల్క్ డీజిల్ని కొనుగోలు చేసేవి. ఆయిల్ కంపెనీలు సైతం ముందుస్తు ఆర్డర్లపై బల్క్ డీజిల్ను ట్యాంకర్ల ద్వారా హోం డెలివరీ చేసేవి. కానీ గత కొన్ని వారాలుగా బల్క్ డీజిల్ ధరలను ఇష్టారీతిన పెంచుతూ పోతున్నారు. ఫలితంగా లీటరు రిటైల్ డీజిల్ కంటే బల్క్ డీజిల్ ధరనే ఎక్కువ అయ్యే స్థాయికి చేరుకుంది. మారిపోతున్నారు ప్రస్తుతం హైదరాబాద్లో రిటైల్ డీజిల్ లీటరు ధర రూ.94.62లు ఉండగా బల్క్ డీజిల్ 103.70కి చేరుకుంది. అంటే రిటైల్ ధర కంటే బల్క్ ధరనే ఒక లీటరకు రూ.9 ఎక్కువగా ఉంది. దీంతో బల్క్ డీజిల్ కొనాలంటే కార్పోరేట్ సంస్థలు బడా వినియోగదారులు వెనకడుగు వేస్తున్నారు. శ్రమతో కూడిన వ్యవహారమైనా రిటైల్ బంకుల దగ్గరే డీజిల్ పోయించుకుంటున్నారు. ఇప్పటికే ఆర్టీసీ బల్క్ డీజిల్కి స్వస్తి పలికి రిటైల్ బంకుల దగ్గర డీజిల్ పోయించుకుంటోంది. రైల్వే సైతం ఇదే బాట పట్టింది. ఒక్క తెలంగాణనే పరిశీలిస్తే ప్రతీ నెల 67,800 లీటర్ల బల్క్ డీజిల్ అమ్ముడవుతోంది. ఇందులో ఒక్క హైదరాబాద్ నగరం వాటానే 40,680 లీటర్లుగా ఉంది. కానీ ప్రస్తుతం పెరిగిన ధరలతో ఈ డిమాండ్ మొత్తం హుష్ కాకి అయ్యే పరిస్థితి నెలకొంది. బల్క్ డీజిల్ కస్టమర్లు రిటైల్ బంకులకు మళ్లడంతో అక్కడ రద్దీ పెరిగిపోతోంది. ధరల పెంపు బల్క్డీజిల్ ధరల పెంపు ఆర్టీసీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో ధరల పెంపు అంశాన్ని తెలంగాణ ఆర్టీసీ పరిశీలిస్తోంది. యుద్ధం తీవ్రత పెరగడం రష్యాలపై ఆంక్షలు పెరగడంతో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. దీనికి తగ్గట్టు దేశీయంగా రేపోమాపో ధరల సవరణ గ్యారెంటీ అనే అభిప్రాయం నెలకొంది. దీంతో నష్టాలను తగ్గించుకునేందుకు ముందుగానే పెంపు దిశగా ఆలోచన చేస్తోంది ఆర్టీసీ. ప్రస్తుత అంచనాల ప్రకారం కిలోమీటరుకు సగటున 40 పైసల వంతున ఛార్జీలు పెంచే అవకాశం ఉంది. వంటగ్యాస్ కూడా రష్యా చేపట్టిన దండయాత్ర ఎఫెక్ట్తో గ్యాస్ , పామాయిల్ ధరలు కూడా పెరిగే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను 105 రూపాయలు పెంచాయి ఆయిల్ సంస్థలు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత 14.2 కేజీల వంట గ్యాస్సిలిండర్ ధర 50 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే సన్ఫ్లవర్, పామాయిల్ వంటనూనె ధరలు లీటరకు సగటున 20 రూపాయలు పెరిగాయి. చదవండి: Russia: ఆర్థిక ఆంక్షలు.. ప్రభావితమయ్యే రష్యన్ కుబేరులు -
ముడి చమురు మంటలు!
న్యూఢిల్లీ: ఉక్రెయిన్పై రష్యా దాడులు.. ముడి చమురు మంటలకు ఆజ్యం పోశాయి. క్రూడాయిల్ ధరలు ఎకాయెకిన ఏడేళ్ల గరిష్ట స్థాయికి ఎగిశాయి. బ్యారెల్ రేటు 104 డాలర్లపైకి చేరింది. 2014 ఆగస్టు 14 తర్వాత ఈ స్థాయికి చేరడం ఇదే ప్రథమం. ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే క్రూడాయిల్ రేటు 150 డాలర్లకు కూడా వెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయని అంచనాలు నెలకొన్నాయి. రెండేళ్ల క్రితం.. 2020 ఏప్రిల్–డిసెంబర్ మధ్య ముడిచమురు రేటు బ్యారెల్కు 39.3 డాలర్లుగా ఉండేది. మరోవైపు, రష్యా నుంచి భారత్కు పెద్దగా క్రూడాయిల్ సరఫరాలు లేకపోవడం వల్ల ఈ వివాదం మరింతగా ముదిరినా మనకు సరఫరా పరంగా పెద్ద సమస్యలు ఉండబోవని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా రేట్లు భారీగా ఎగిసినా దేశీయంగా ప్రభుత్వ రంగ ఇంధన రిటైల్ సంస్థలు .. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలను కట్టడి చేస్తుండటంతో ప్రస్తుతానికైతే వినియోగదారులపై పెద్దగా ప్రతికూల ప్రభావం ఉండకపోవచ్చని ఆయన వివరించారు. కానీ, ఇదే పరిస్థితి కొనసాగితే ఏదో ఒక దశలో రేట్లు పెరగక తప్పదని పేర్కొన్నారు. ‘రష్యా–ఉక్రెయిన్ ఉద్రిక్తతల కారణంగా సరఫరా వ్యవస్థలేమీ దెబ్బతినలేదు. మనకు సరఫరా చేసే దేశాలపై ప్రభావమేమీ లేదు. ఉద్రిక్తతలు మరింత ఉధృతమైనా ఈ విషయంలో పెద్దగా మార్పేమీ ఉండదు. అయితే, ప్రస్తుతానికి రిటైల్ ధరలను అదుపులోనే ఉంచినప్పటికీ.. అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు పెరిగితే ఏదో ఒక దశలో వాటిని పెంచక తప్పకపోవచ్చు‘ అని అధికారి వివరించారు. ధరల మోత భయాలు... సరఫరాపరమైన సమస్యలు లేకపోయినప్పటికీ.. రష్యా–ఉక్రెయిన్ ఉద్రిక్త పరిణామాలతో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర పెరిగిపోతే ఆ ప్రభావం దేశీయంగా గట్టిగానే కనిపించనుంది. చమురు రిటైల్ రేట్లు పెరిగి .. తత్ఫలితంగా మిగతా ఉత్పత్తుల ధరలు ఆకాశాన్ని అంటుతాయనే భయాలు పెరుగుతున్నాయి. దేశీయంగా ఇంధనాల ధరలు .. అంతర్జాతీయ ఆయిల్ రేట్లకు అనుగుణంగా ప్రతి రోజూ మారుతుంటాయి. ఈ మధ్య కాలంలో అంతర్జాతీయంగా ధర పెరుగుతున్నా.. వివిధ కారణాల రీత్యా రికార్డు స్థాయిలో దేశీయంగా దాదాపు 113 రోజులుగా దేశీయంగా మాత్రం రిటైల్ రేట్లు మారలేదు. బ్యారెల్ 82–83 డాలర్ల రేటు స్థాయిలోనే కొనసాగుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ .. ధరలను అదుపులో ఉంచుతున్నాయి. వచ్చే నెల ఎన్నికలు ముగిసిపోతే చాలు ఇక రేట్లకు రెక్కలొస్తాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతంలో 2018 మే నెలలో కూడా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇంధన రిటైల్ సంస్థలు అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేటు బ్యారెల్కు 5 డాలర్ల పైగా పెరిగినా.. 19 రోజుల పాటు పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచలేదు. ఎన్నికలు అలా ముగిశాయో లేదో ప్రతిరోజూ పెంచుకుంటూ పోయాయి. 16 రోజుల వ్యవధిలో పెట్రోల్ రేటు లీటరుకు రూ. 3.8, డీజిల్ రేటు రూ. 3.38 మేర పెరిగిపోయింది. 2020లో పెట్రోల్పై లీటరుకు రూ. 10, డీజిల్పై రూ. 13 చొప్పున ఎక్సైజ్ డ్యూటీని పెంచడంతో ఇంధనాల రేట్లు పెరిగిపోయాయి. ప్రజా వ్యతిరేకత భయంతో మధ్యలో ఒకసారి సుంకాన్ని కొంత తగ్గించినప్పటికీ దేశీయంగా రేటు మాత్రం భారీ స్థాయిలోనే కొనసాగుతోంది. మనకు క్రూడ్ ఎక్కడి నుంచి వస్తుందంటే.. చమురును అత్యధికంగా వినియోగించే దేశాల్లో భారత్.. ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. దేశీయంగా క్రూడాయిల్ లభ్యత నామమాత్రమే కావడం వల్ల ఏకంగా 85 శాతం ముడి చమురు అవసరాల కోసం దిగుమతులపైనే ఆధారపడాల్సి ఉంటోంది. దిగుమతి చేసుకున్న ముడిచమురును పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ఉత్పత్తుల కింద మారుస్తారు. భారత్ దిగుమతి చేసుకునే ఆయిల్లో 63.1 శాతం భాగం సౌదీ అరేబియా, ఇరాక్, ఇతర మధ్య ప్రాచ్య దేశాల నుంచి వస్తోంది. ఆ తర్వాత ఆఫ్రికా వాటా 14 శాతం, మరో 13.2 శాతం వాటా ఉత్తర అమెరికా నుంచి ఉంటోంది. భారత్ కొనుగోలు చేసే ఇండియన్ బాస్కెట్ క్రూడాయిల్ రేటు నవంబర్లో 80.64 డాలర్లుగా ఉండగా, డిసెంబర్లో 73.30 డాలర్లకు తగ్గింది. జనవరిలో 84.87 డాలర్లకు, అటుపైన ఫిబ్రవరి 16 నాటికి 94.68 డాలర్లకు ఎగిసింది. రష్యా నుంచి చమురు దిగుమతులు నామమాత్రమే.. యూరప్లో సహజ వాయువు ఉత్పత్తిలో రష్యాకు మూడో వంతు వాటా ఉంటుంది. అంతర్జాతీయంగా ఆయిల్ ఉత్పత్తిలో దాదాపు 12 శాతం వాటా ఉంటుంది. ప్రపంచ ఇంధన రంగంలో రష్యా ముఖ్య పాత్ర వహిస్తున్నప్పటికీ .. సంక్లిష్టమైన క్రూడాయిల్ రకం, వ్యయాలు తదితర కారణాల రీత్యా ఆ దేశం నుంచి భారత్కు చమురు దిగుమతులు నామమాత్రంగానే ఉంటున్నాయి. భారత్ దిగుమతి చేసుకునే చమురులో రష్యా ఆయిల్ పరిమాణం కేవలం ఒక్క శాతం స్థాయిలో ఉంటుంది. 2021లో ఇది 43,400 బ్యారెళ్లుగా ఉంది. అలాగే, గతేడాది రష్యా నుంచి భారత్ 1.8 మిలియన్ టన్నుల బొగ్గు కొనుగోలు చేసింది. ఇది మొత్తం బొగ్గు దిగుమతుల్లో 1.3 శాతం మాత్రమే. ఇవి కాకుండా ఏడాదికి 2.5 మిలియన్ టన్నుల ధ్రువీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ)ని భారత్ దిగుమతి చేసుకుంటోంది. ఏయే ఉత్పత్తుల ధరలు పెరగవచ్చంటే .. టోకు ధరల సూచీలో క్రూడాయిల్ సంబంధిత ఉత్పత్తుల వాటా తొమ్మిది శాతం పైగా ఉంటుంది. చమురు రేట్లు 10 శాతం మేర పెరిగితే టోకు ద్రవ్యోల్బణం 0.9 శాతం మేర పెరగవచ్చని అంచనా. ఇంధనాల రేట్లు పెరగడం వల్ల రవాణా వ్యయాలు పెరుగుతాయి. ఫలితంగా కూరగాయలు మొదలుకుని తయారీ ఉత్పత్తుల వరకూ అన్నింటి ధరలూ పెరుగుతాయి. క్రూడ్ సంబంధిత ముడిపదార్థాలు వాడే పెయింట్లు, టైర్లు, ఇంజినీరింగ్ ప్లాస్టిక్స్, ప్యాకేజింగ్, కేబుల్స్ మొదలైన వాటి ధరలూ ఎగుస్తాయి. విద్యుదుత్పత్తి వ్యయాలు పెరుగుతాయి. మొత్తం మీద చమురు రేట్ల పెరుగుదల, రష్యా–ఉక్రెయిన్ ఉద్రిక్తతల వల్ల వంట నూనెలు, కిరోసిన్, ఎల్పీజీ, విద్యుత్, గోధుమలు, లోహ ఉత్పత్తుల రేట్లు పెరుగుతాయని పరిశ్రమ వర్గాల అంచనా. ముడిచమురు కోసం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడటం వల్ల క్రూడాయిల్ రేట్లు పెరిగితే దిగుమతుల బిల్లు, వాణిజ్య లోటు, ద్రవ్య లోటు మొదలైనవి కూడా పెరుగుతాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో 85.54 బిలియన్ డాలర్ల విలువ చేసే క్రూడాయిల్ను భారత్ దిగుమతి చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల వ్యవధితో పోలిస్తే ఇది ఏకంగా 121 శాతం అధికం. ప్రస్తుతం ఇంధన రిటైల్ రేట్లు ఇలా దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్సయిజ్ సుంకాలు, వ్యాట్ రేటును తగ్గించిన తర్వాత ప్రస్తుతం అక్కడ పెట్రోల్ రేటు లీటరుకు రూ. 95.41గా, డీజిల్ ధర రూ. 86.67గా ఉంది. 2021 అక్టోబర్ 26 నాటి క్రూడాయిల్ ధర 86.40 (బ్యారెల్కు) స్థాయికి ఇది అనుసంధానమై ఉంది. ముడిచమురు రేటు డిసెంబర్లో 68.87 డాలర్లకు పడిపోయినా ఆ తర్వాత నుంచి క్రమంగా పెరగడం మొదలైంది. ఫిబ్రవరిలోనే 12 శాతం పెరిగిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే ఇప్పటికే ఇంధనాల రేటులో లీటరుకు రూ. 10 పైగా వ్యత్యాసం ఉందని, ఎన్నికల తర్వాత ధరల పెంపుతో ద్రవ్యోల్బణం భారీగా ఎగుస్తుందని పరిశ్రమవర్గాలు తెలిపాయి. మొత్తం మీద చూస్తే గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్, డీజిల్ రేట్లు 18–20 శాతం మేర పెరగవచ్చని అంచనాలు ఉన్నాయి. -
భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
-
సామాన్యుడికి మళ్లీ షాక్ !.. కారణాలు ఇవే
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థపై ధరల పెరుగుదల భారం తగ్గుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ భరోసా ఇచ్చారు. ద్రవ్యోల్బణం కట్టడి–ఎకానమీ పురోగతి లక్ష్యంగా సెంట్రల్ బ్యాంక్ పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. అంతక్రితం ఆర్బీఐ బోర్డును ఉద్దేశించి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగించారు. బడ్జెట్ లక్ష్యాలను వివరించారు. వార్షిక బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత ఆర్బీఐ బోరŠుడ్డను ఉద్దేశించి ఆర్థికమంత్రి ప్రసంగించడం సాంప్రదాయకంగా వస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు జనవరి నెలకు సంబంధించి సోమవారం వెలువడిన రిటైల్, టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జనవరిలో 6.01 శాతం కాగా టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం రెండంకెలపైన 12.96 శాతంగా (2021 ఇదే నెలతో పోల్చి ధరల స్పీడ్) నమోదయ్యింది. రిటైల్ ద్రవ్యోల్బణం 6–2 శ్రేణిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. ఈ స్థాయిని దాటి జనవరి గణాంకాలు నమోదుకావడం గమనార్హం. మా అంచనాలు బలమైనవే.. కానీ: శక్తికాంతదాస్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సెంట్రల్ బ్యాంక్ బోర్డ్ను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం గవర్నర్ శక్తికాంతదాస్ మీడియాతో మాట్లాడుతూ, ద్రవ్యోల్బణం దిగువముఖంగా పయనిస్తోందని అన్నారు. తమ అంచనాలు ‘‘బలమైనవే’’, కానీ ప్రపంచ ముడిచమురు ధరల కదలికతో ముడిపడి ఉన్న ప్రతికూలతలు, సంబంధిత సమస్యలపై ఇవి ఆధారపడి ఉన్నాయని అన్నారు. ముడి చమురు ధరల హెచ్చుతగ్గుల ప్రాతిపదికన, ద్రవ్యోల్బణానికి సంబంధించి ఆర్బీఐ ఒక నిర్దిష్ట శ్రేణిని ఇప్పటి వరకూ పరిగణనలోకి తీసుకుంటుందని అన్నారు. అయితే ఈ అంచనాలు అన్నీ చివరకు క్రూడ్ ధరలు, సంబంధిత ప్రతికూల అంశాలపై ఆధారపడి ఉంటాయని వివరించారు. ‘‘మా ద్రవ్యోల్బణం అంచనాలు చాలా పటిష్టంగా ఉన్నాయని నేను ఇప్పటికీ చెబుతాను. మేము దానికి కట్టుబడి ఉన్నాము. పూర్తిగా ఊహించనిది ఏదైనా జరిగితే పరిస్థితి భిన్నంగా ఉంటుందని మీకూ తెలుసు. ఇది ఎవ్వరూ ముందుగా ఊహించిలేని ఆకస్మిక స్థితి. ప్రస్తుతం ప్రతికూలాంశం ముడిచమురు ధరలే అని మీకు తెలుసు’’ అని గవర్నర్ తెలిపారు. ధరల స్థిరత్వం అంటే ప్రాథమికంగా ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని కొనసాగించడమేనని పేర్కొన్నారు. దీనికి కట్టుబడి ఉండాలన్నదే తమ సంకల్పని పేర్కొన్నారు. వృద్ధి లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ద్రవ్యోల్బణం పట్ల తన నిబద్ధత ఎలా ఉండాలన్నది రిజర్వ్ బ్యాంక్కు పూర్తిగా తెలుసునని దాస్ ఉద్ఘాటించారు. లోబేస్ ఎఫెక్ట్ ‘‘ద్రవ్యోల్బణం ధోరణిని పరిశీలిస్తే, 2020 అక్టోబర్ నుంచి 2021 అక్టోబర్ వరకూ ఈ రేటు దిగువముఖంగానే పయనించింది. అయితే మూడవ త్రైమాసికంలో (అక్టోబర్, నవంబర్, డిసెంబర్) ఇది తీవ్రంగా కనబడుతోంది. దీనికి లోబేస్ ఎఫెక్ట్ కారణం. రానున్న నెలల్లో కూడా ఈ లోబేస్ ఎఫెక్ట్ గణాంకాలపై విభిన్న రీతుల్లో కనబడుతుంది‘‘ అని గవర్నర్ వివరించారు. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. కాగా, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 2021–22లో 9.2 శాతం ఉంటే, 2022–23లో ఈ రేటు 7.8 శాతానికి తగ్గుతుందని ఆర్బీఐ ఇటీవలి పాలసీ సమావేశం అంచనావేసింది. వచ్చే నెలలో గ్రీన్ బాండ్లు సావరిన్ గ్రీన్ బాండ్స్ జారీపై వచ్చే నెల్లో ఒక నిర్ణయం తీసుకుంటామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. రూ.11.6 లక్షల కోట్లు మార్కెట్ రుణ సమీకరణలో భాగంగా కేంద్రం మొట్టమొదటిసారి 2022–23 వార్షిక బడ్జెట్లో ‘సావరిన్ గ్రీన్ బాండ్ల’ జారీ ప్రతిపాదన చేసింది. ఈ బాండ్ల ద్వారా సమీకరించే నిధులను పర్యావరణ సానుకూల ప్రభుత్వ మౌలిక ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు వినియోగించుకోవాలన్నది కేంద్రం లక్ష్యంమని బడ్జెట్ పేర్కొంది. ఏడు నెలల గరిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఆర్బీఐ రెపో రేటు నిర్ణయానికి (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4 శాతం. దాదాపు 18 నెలల నుంచి ఇది ఇదే స్థాయిలో కొనసాగుతోంది) ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ (సీపీఐ) ద్రవ్యోల్బణం జనవరిలో ఏకంగా 6.01 శాతంగా (2021 ఇదే నెల ధరలతో పోల్చి) నమోదయ్యింది. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 2–6 శాతం శ్రేణి ఎగువ పరిమితికన్నా ఇది ఎక్కువ కావడం ఆందోళన కలిగిస్తున్న అంశం. గడచిన ఏడు నెలల్లో ఈ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం (2021 జూన్లో 6.26 శాతం) నమోదుకావడం ఇదే తొలిసారి. 2021 జనవరిలో 4.06 శాతం. రిటైల్ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో సగటున 5.3 శాతంగా కొనసాగుతుందని, 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 4.5 శాతానికి దిగివస్తుందని ఆర్బీఐ ఈ నెల మొదట్లో జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా అంచనావేసింది. ఈ నేపథ్యంలో వృద్ధి రికవరీ, పటిష్టత లక్షంగా అవసరమైనంతకాలం ‘సరళతర’ విధానాన్నే అనుసరించడం ఉత్తమమని ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలోని పరపతి విధాన కమిటీ మెజారిటీ (6:5) అభిప్రాయపడింది. ధరల స్పీడ్ ఇలా... - తాజా సమీక్షా నెల్లో ఒక్క ఫుడ్ బాస్కెట్ చూస్తే ద్రవ్యోల్బణం 5.43 శాతం. 2021 డిసెంబర్లో ఈ రేటు 4.05 శాతం. - కూరగాయల ధరలు 2021 డిసెంబర్లో అసలు పెరక్కపోగా 2.99 శాతం క్షీణించాయి. అయితే 2022 జనవరిలో ఏకంగా 5.19 శాతం పెరిగాయి. - ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ ధరల పెరుగుదల తీవ్రంగా 18.7 శాతంగా ఉంది. - తృణ ధాన్యాలు, ఉత్పత్తుల ధరల పెరుగుదల డిసెంబర్లో 2.62 శాతం ఉంటే, జనవరిలో 3.39 శాతానికి ఎగశాయి. - మాంసం చేపలు ధరలు ఇదే కాలంలో 4.58 శాతం నుంచి 5.47 శాతానికి చేరాయి. - ఇంధనం–లైట్ విభాగంలో ద్రవ్యోల్బణం డిసెంబర్లో 10.95 శాతం ఉంటే, జనవరిలో 9.32 శాతానికి తగ్గింది. - దుస్తులు, పాదరక్షలు, రవాణా, కమ్యూనికేషన్లసహా వివిధ ఇతర విభాగాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 9 శాతంపైన నమోదయ్యింది. - కాగా, డిసెంబర్ 2021 ద్రవ్యోల్బణాన్ని కూడా 5.59 శాతం నుంచి ఎగువముఖంగా 5.66 శాతంగా గణాంకాల కార్యాలయం సవరించింది. టోకు ధరలు.. రెండంకెలపైనే.. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2021 డిసెంబర్లో 13.56 శాతం ఉంటే, 2022 జనవరిలో 12.96 శాతానికి తగ్గింది (2021 జనవరి నెల టోకు ధరలతో పోల్చి). టోకు ద్రవ్యోల్బణం రెండంకెల పైన కొనసాగుతుండడం ఒక ఆందోళనకరమైన అంశంకాగా, ఆహార ఉత్పత్తుల ధరలు తీవ్ర స్థాయిలోనే కొనసాగుతుండడం గమనించదగిన మరో ప్రతికూల అంశం. గడచిన పది నెలల నుంచీ అంటే 2021 ఏప్రిల్ నుంచి టోకు ద్రవ్యోల్బణం రెండంకెలపైనే కొనసాగుతోంది. 2021 జనవరిలో ఈ రేటు 2.51 శాతం. అప్పటిలో బేస్ తాజా ధరలు తీవ్ర స్థాయిలో కనబడ్డానికి కారణమని గణాంకాలు సూచిస్తున్నాయి. కొన్ని కీలక విభాగాలు చూస్తే.. - ఫుడ్ ఆర్టికల్స్ విభాగంలో ధరలు 2021 డిసెంబర్లో 9.56 శాతం పెరిగితే, 2022 జనవరిలో (సమీక్షా నెల) 10.33 శాతానికి ఎగశాయి. ఇందులో ఒక్క కూరగాయలను ధరల స్పీడ్ భారగా 31.56 శాతం నుంచి 38.45 శాతానికి చేరింది. - ఫుడ్ ఆర్టికల్స్లో పప్పు దినుసులు, తృణ ధాన్యాలు, ధాన్యం నెలవారీగా పెరిగాయి. గుడ్లు, మాసం, చేపల ధరలు 9.85 శాతం ఎగశాయి. ఆలూ, ఉల్లి ధరలు మాత్రం 14.45 శాతం, 15.98 శాతం చొప్పున క్షీణించాయి. - మినరల్ ఆయిల్స్, క్రూడ్ పెట్రోలియం, నేచురల్ గ్యాస్, బేసిక్ మెటల్స్, రసాయనాలు, రసాయన ఉత్పత్తులు ధరలు పెరిగాయి. - మొత్తం టోకు ధరల సూచీలో దాదాపు 60 శాతం వాటా కలిగిన తయారీ రంగానికి సంబంధించి ధరల స్పీడ్ 10.62 శాతం (2021 డిసెంబర్) నుంచి 9.42 శాతానికి తగ్గింది. - ఇంధనం, విద్యుత్ బాస్కెట్లో ధరల స్పీడ్ డిసెంబర్లో 32.30 శాతం ఉంటే, సమీక్షా నెల జనవరిలో 32.27 శాతానికి స్వల్పంగా తగ్గింది. -
దూసుకెళ్తున్న క్రూడ్ ఆయిల్ ధరలు, ఆందోళనలో భారత్!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు ఏడేళ్లలో మొదటిసారి బేరల్కు 93 డాలర్లు చేరడం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. బాధ్యతాయుత, సహేతుక ధరను భారత్ కోరుకుంటున్నట్లు రాజ్యసభలో ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో పెట్రోలియం, సహజ వాయువుల శాఖ సహాయమంత్రి రామేశ్వర్ తెలి పేర్కొన్నారు. ఈ కమోడిటీ విషయంలో తీవ్ర ఒడిదుడుకులను నిరోధించాలని తాము చమురు ఉత్పత్తి దేశాలను కోరుతున్నట్లు తెలిపారు. దేశం తన చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతులపై ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. దేశీయ పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ చమురు రేట్లకు అనుగుణంగా ఉంటాయి. దీనికితోడు దేశంలో పన్నుల భారం తీవ్రంగా ఉండడం ద్రవ్యోల్బణంపై ఒత్తిడులను పెంచుతోంది. ‘‘ముడిచమురు ధరల అస్థిరతపై భారతదేశం తన తీవ్ర ఆందోళనలను ఒపెక్ (పెట్రోలియం ఎగుమతి దేశాల సంఘం), ఇతర అంతర్జాతీయ వేదికల చీఫ్ల దృష్టికి ద్వైపాక్షింగా తీసుకువెళుతోంది’’ అని తెలిపారు. మరో ప్రశ్నకు చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి సమాధానం చెబుతూ, 2021 డిసెంబర్ 1వ తేదీన బేరల్కు అంతర్జాతీయంగా 71.32 డాలర్లు ఉంటే, జనవరి 31వ తేదీ నాటికి 18.09 డాలర్లు పెరిగి 89.41 డాలర్లకు చేరిందని తెలిపారు. -
నాలుగు రోజుల్లో రూపాయికి తొలి లాభం
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ వరుస నాలుగురోజుల ట్రేడింగ్ సెషన్లలో తొలిసారి లాభపడింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 14పైసలు లాభపడి 74.44 వద్ద ముగిసింది. అయితే ఈ లాభం ధోరణి తాత్కాలికమేనని రూపాయి భారీగా బలపడిపోయే పరిస్థితి లేదన్నది నిపుణుల అభిప్రాయం. క్రూడ్ ఆయిల్ ధరలు, ఈక్విటీల బలహీనత, ద్రవ్యోల్బణం, కొత్త వేరియంట్ ఒమిక్రాన్, అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్ల నిర్ణయాల వంటి సవాళ్లు రూపాయికి ప్రతికూలమని ట్రేడర్లు అభిప్రాయపడుతున్నారు. రూపాయి మంగళవారం ముగింపు 74.58. బుధవారం ఉదయం ట్రేడింగ్లో 74.70 కనిష్ట స్థాయి వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 74.32 గరిష్ట స్థాయిని చూసింది. ఈ వార్త రాస్తున్న మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ నష్టాల్లో 74.36 వద్ద ట్రేడవుతుండగా, ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదకన లెక్కించే డాలర్ ఇండెక్స్ స్థిరంగా 95.52 వద్ద ట్రేడవుతోంది. రూపాయికి ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). -
పరిమిత శ్రేణిలో ట్రేడింగ్!
ముంబై: ఈ ఏడాది చివరి వారం స్టాక్ సూచీలు పరిమిత శ్రేణిలో కదలాడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేసే పరిణామాలేవీ లేకపోవడంతో పాటు ఆయా దేశాల స్టాక్ మార్కెట్లు పనిచేయకపోవడం ఇందుకు కారణాలుగా చెబుతున్నారు. అయితే ఒమిక్రాన్ వేరియంట్ కేసుల పెరుగుదల, డిసెంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు అంశాలతో అప్రమత్తత చోటు చేసుకోవచ్చని చెబుతున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులపై ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదలికలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించనున్నాయి. ‘‘రక్షణాత్మక రంగాలైన ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఫార్మా షేర్లు రాణించడంతో గత వారంలో సాంకేతికంగా నిఫ్టీ 17,000 స్థాయిని నిలుపుకుంది. మార్కెట్ కరెక్షన్ కొనసాగితే దిగువ స్థాయిలో 16,700 వద్ద తక్షణ మద్దతు ఉంది. ఈ స్థాయిని కోల్పోతే 16,650 వద్ద మద్దతు లభించవచ్చు. ఒకవేళ దిగువ స్థాయిలో కొనుగోళ్ల మద్దతు లభిస్తే 17,150–17,200 శ్రేణిని పరీక్షించవచ్చు’’ అని స్వస్తిక్ ఇన్వెస్ట్మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. గతవారం సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనైనా.., రక్షణాత్మక రంగాలకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్ 113 పాయింట్లు, నిఫ్టీ 18 పాయింట్లు స్వల్ప లాభంతో గట్టెక్కాయి. ఒమిక్రాన్ వ్యాప్తి ప్రభావం ఒమిక్రాన్ వేరియంట్ కట్టడికి ప్రభుత్వాలు విధిస్తున్న ఆంక్షలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. దేశంలో శనివారం నాటికి 150 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్తో సహా రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూలను అమలు చేస్తున్నాయి. వైరస్ కట్టడికి అనేక పలు దేశాల ప్రభుత్వాలు ప్రయాణాలపై ఆంక్షలను, కర్ఫ్యూలను విధిస్తుండటం వల్ల ఆర్థిక రివకరీకి ప్రతికూలం కావచ్చనే భయాలు వెంటాడుతున్నాయి. కేసుల సంఖ్య మరింత పెరగవచ్చనే ఆందోళనలతో ట్రేడర్లు తమ పొజిషన్లను పరిమితం చేసుకుంటున్నారు. గురువారం ఎఫ్అండ్ఓ ముగింపు ఈ గురువారం(ఈ నెల 30న) నిఫ్టీ సూచీకి చెందిన డిసెంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తన పొజిషన్లను స్క్వేయర్ ఆఫ్కు ఆసక్తి చూపుతుండటంతో స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు దేశీయ మార్కెట్లో మూడు నెలల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగుతున్నాయి. ఈ డిసెంబర్లో ఇప్పటి వరకు రూ.17,825 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఏడాది ముగింపు వారంలో అమ్మకాల తీవ్రత తక్కువగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మార్కెట్లో అస్థితరత తగ్గితే ఎఫ్ఐఐల విక్రయాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందంటున్నారు. సూక్ష్మ ఆర్థిక గణాంకాలు నవంబర్ నెల ద్రవ్యలోటు, మౌలిక రంగ ఉత్పత్తి గణాంకాలతో పాటు సెప్టెంబర్ క్వార్టర్కు సంబంధించిన కరెంట్ అకౌంట్ లెక్కలు శుక్రవారం విడుదల కానున్నాయి. అదేరోజున డిసెంబర్ 17తో ముగిసిన వారం డిపాజిట్, బ్యాంక్ రుణ వృద్ధి, డిసెంబర్ 24తో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వలను గణాంకాలను ఆర్బీఐ విడుదల చేయనుంది. మూడు లిస్టింగ్లు ఇటీవల ప్రాథమిక మార్కెట్ నుంచి నిధులు సమీకరించిన మూడు కంపెనీల షేర్లు ఈ వారంలో లిస్ట్ కానున్నాయి. హెచ్పీ అడెసివ్స్ షేర్లు సోమవారం(27న).., సుప్రియ లైఫ్సైన్సెన్స్ షేర్లు మంగళవారం(28న), సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ షేర్లు ఏడాది చివరిరోజున(డిసెంబర్ 31న) లిస్ట్కానున్నాయి. ఈ అంశమూ ట్రేడింగ్ను ప్రభావితం చేయవచ్చు. -
ముడి చమురు మహా యుద్ధం!
చమురు విపణి చరిత్రలో తొలిసారిగా ఒక పక్క అమెరికా, చైనా, జపాన్, భారత్, దక్షిణా కొరియా, బ్రిటన్లు. మరోపక్క సౌదీ అరేబియా సారథ్యంలోని ‘పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య’ (ఒపెక్) ప్లస్. ఒకవైపు ప్రపంచమంతటా పెరుగుతూ, మూడేళ్ళ అత్యధికానికి చేరిన ముడి చమురు ధరలకు పగ్గం వేయడానికి ఉత్పత్తి, సరఫరాలు పెంచాలంటున్న అమెరికా తదితర ఆసియా దేశాలు. మరోవైపు పెడచెవిన పెడుతున్న ఒపెక్ ప్లస్ సభ్యులు. అందుకే, 50 మిలియన్ బ్యారళ్ళ ఆయిల్ అమెరికా, 5 మిలియన్ బ్యారళ్ళు భారత్ తమ అత్యవసర నిల్వల నుంచి విడుదల చేస్తామంటూ ప్రకటించడం కీలక పరిణామం. కొన్ని ఆసియా దేశాలు కలిసొస్తున్నాయి. ధరలు తగ్గి, ద్రవ్యోల్బణం అదుపు కావడం కోసమే ఇలా రిజర్వుల నుంచి ఆయిల్ను విడుదల చేస్తు్తన్నట్టు దేశాల మాట. కానీ, ఈ నిర్ణయంతో ఆశించినట్టు చమురు ధరలు తగ్గుతాయా అన్నది ప్రశ్న. పైగా, ఒపెక్ ప్లస్ దేశాల వ్యతిరేక కూటమి అన్నట్టుగా మారిన ఈ చమురు వినియోగ దేశాల చర్యకు ‘ఒపెక్’ ప్లస్ నుంచి ప్రతిచర్య తప్పకపోవచ్చు. వ్యూహ ప్రతివ్యూహాల మధ్య అక్షరాలా ఇది ముడి చమురు యుద్ధమే! దీనికి దారి తీసిన పరిస్థితులు అనేకం. కరోనా తారస్థాయికి చేరినవేళ చమురు సరఫరాలను ‘ఒపెక్’ ప్లస్ దేశాలు తగ్గించాయి. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో, చమురు డిమాండ్ పెరిగింది. ఆయిల్ ధరలేమో ఈ ఏడాది 50 శాతానికి పైగా పెరిగాయి. ద్రవ్యోల్బణం భారమైంది. ఈ పరిస్థితుల్లో ఉత్పత్తి పెంచి, త్వరితగతిన మునుపటి స్థాయికి సరఫరాలు తీసుకురమ్మని ఒపెక్ ప్లస్ను వివిధ దేశాలు కోరాయి. అయినా లాభం లేకపోయింది. దాంతో, కలసికట్టుగా చమురు ధరకు చెక్ చెప్పడానికి అమెరికా అభ్యర్థనతో ఇతర దేశాలూ కదిలాయి. మునుపెన్నడూ లేనంత అత్యధికంగా అమెరికా విడుదల చేస్తున్న నిల్వలు ఈ డిసెంబర్ మధ్య నుంచి చివరిలోగా మార్కెట్లోకి రానున్నాయి. దీని వల్ల అంతర్జాతీయ ఆయిల్ మార్కెట్ నిలకడగా మారుతుందన్నది ఆశ. నిజానికి, చమురు సంక్షోభం తలెత్తిన 1973–74లో స్వతంత్ర సంస్థ ‘ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ’ (ఐఈఏ) ఏర్పాటైంది. 30 సభ్యదేశాల ఈ సంస్థ అప్పటి నుంచి ఆర్థిక సంపన్న దేశాల పక్షాన ప్రపంచవ్యాప్త ముడిచమురు సరఫరాలను పర్యవేక్షిస్తోంది. ఈ ఏజెన్సీ ఏర్పాటయ్యాక ఇప్పటిలా కొన్ని దేశాలు కలిసి ఓ సమన్వయంతో అత్యవసర నిల్వల నుంచి ఆయిల్ విడుదల గతంలో మూడేసార్లు జరిగింది. అవి – 1991లో గల్ఫ్ యుద్ధం, 2005లో కత్రినా – రీటా తుపాన్లతో మెక్సికో గల్ఫ్లో చమురు వసతులు దెబ్బతిన్న సందర్భం, 2011లో లిబియాలో యుద్ధంతో చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడిన సమయం! ఇప్పుడిది నాలుగోసారి. క్రిస్మస్ సెలవులు దగ్గర పడుతున్న అమెరికాలో ఇంధనం సగటున గ్యాలన్ 3.41 డాలర్లు పలుకుతోంది. 2014 నుంచి ఇదే అత్యధికం. గ్యాసోలిన్ రేటూ గత ఏడాది కన్నా 1.29 డాలర్లు పెరిగింది. అనేక సవాళ్ళతో ప్రతిష్ఠ దెబ్బతిన్న బైడెన్కు.. ఈ ప్రయాణాల సీజన్లో సగటు అమెరికన్ల కోసం నిల్వల విడుదల తప్పలేదు. ప్రపంచ చమురు వినియోగంలో అమెరికా, చైనాల తర్వాత మూడో స్థానం భారత్దే. తర్వాతి స్థానాలు జపాన్, దక్షిణ కొరియాలవి. ప్రపంచవ్యాప్తంగా రోజుకు 99 మిలియన్ బ్యారళ్ళ చమురు సరఫరా అవుతుంది. వీటన్నిటి అత్యవసర నిల్వలు కలిపినా, 15 రోజుల ప్రపంచ సరఫరాకే సరి. వీటిలో అత్యధికంగా 714 మిలియన్ బ్యారళ్ళ అత్యవసర నిల్వలున్నవి అమెరికా వద్దే! 39 మిలియన్ బ్యారళ్ళ నిల్వలు మన దగ్గరున్నాయి. ఇంధన ధరలు తగ్గేందుకు నిల్వలను విడుదల చేయాలని మునుపెన్నడూ లేని రీతిలో అమెరికా గత వారం అభ్యర్థించింది. ఆ ప్రతిపాదనను భారత్ మొదట ప్రశ్నించింది. చివరకు రోజువారీ దేశీయ వినియోగానికి సమానమైన మొత్తంలో 5 మిలియన్ బ్యారళ్ళ నిల్వల విడుదలకు సై అంది. ప్రతీకాత్మకమే అయినా, ఈ చర్య వల్ల మనకు లాభం కన్నా నష్టమనే వాదనా ఉంది. ఇక ప్రపంచంలో అతి పెద్ద చమురు దిగుమతిదారు చైనా. తమ దేశంలో ఆయిల్ ధరకు కళ్ళెం వేయడానికి ఈ ఏడాది ఇప్పటికే చాలాసార్లు నిల్వలు విడుదల చేసింది. వివరాలు వెల్లడించనప్పటికీ, తాజా కలసికట్టు ప్రయత్నానికీ బాసటగా నిలుస్తానంటోంది. 1100 బిలియన్ బ్యారళ్ళ నిల్వలున్న ఒపెక్ ప్లస్కు, మరెన్నో లక్షల బ్యారళ్ళ మిగులు ఉత్పత్తి సామర్థ్యం ఉంది. అయినా సరే, డిమాండ్కు తగ్గట్టు ఉత్పత్తి పెంచడం లేదు. యూరప్లోని తాజా లాక్డౌన్లు సహా అనిశ్చిత పరిస్థితులను సాకుగా చూపుతోంది. ఉత్పత్తిని తగ్గించి, ధరలు పెరిగేలా చేస్తోందనే అనుమానానికీ తావిచ్చింది. ఇక తప్పక... ‘ప్రపంచ చమురు విపణి వేదికపై మీరే కాదు.. మేమూ ఉన్నామ’న్నట్టు ఒపెక్ ప్లస్కు కొన్ని దేశాలు పరోక్షంగా సవాలు విసిరినట్టయింది. డిసెంబర్ 2న సమావేశమయ్యే ఒపెక్ ప్లస్ దీనికెలా స్పందిస్తుందో, పరిణామాలెలా ఉంటాయో చూడాలి. ఇప్పటికైతే నిల్వల విడుదల ప్రకటన ప్రభావం లేదు. బుధవారం ఆయిల్ ధరలు వారంలోకెల్లా గరిష్ఠానికి చేరాయి. ఒకవేళ రేపు ధరలు తగ్గినా, అదీ తాత్కాలికమే. సరఫరాల్లో సమస్యలు తలెత్తితే తట్టుకోవడానికని పెట్టుకున్న నిల్వలతో అధిక ధరలను నియంత్రించాలనుకోవడం చురకత్తితో పెనుయుద్ధం చేయాలనుకోవడమే! తాజా చమురు పోరుతో అమెరికా, సౌదీ అరేబియా సంబంధాలూ మరింత దెబ్బతినవచ్చు. కానీ ఇప్పటికీ భయపెడుతున్న కరోనా నుంచి కొన్ని దేశాలు, ఆర్థిక మందగమనం నుంచి మిగతా దేశాలు బయటపడడమే ప్రస్తుతం కీలకం! ఒపెక్ చేతిలో ఆటబొమ్మ కాకూడదంటే, సౌరశక్తి లాంటి తరగని ఇంధన వనరుల వైపు మళ్ళడమే ఎప్పటికైనా శరణ్యం!! -
చమురు ధరలకు భారత్ చెక్!
న్యూఢిల్లీ: కొద్ది నెలలుగా మండుతున్న ముడిచమురు ధరలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇందుకు వీలుగా అత్యవసర వినియోగానికి పక్కనపెట్టే చమురు నిల్వల నుంచి 5 మిలియన్ బ్యారళ్లను విడుదల చేయనున్నట్లు తాజాగా వెల్లడించింది. తద్వారా యూఎస్, చైనా, జపాన్ బాటలో నడవనుంది. దేశ చరిత్రలోనే తొలిసారి కేంద్ర ప్రభుత్వం 3.8 కోట్ల బ్యారళ్ల(5.33 మిలియన్ టన్నులు) ముడిచమురును నిల్వ చేసింది. ఇందుకు తూర్పు, పశ్చిమ తీరప్రాంతాలలో ఏర్పాటు చేసిన భూగర్భ బిలాలను వినియోగించుకుంది. వీటి నుంచి తాజాగా నిర్ణయించిన 5 మిలియన్ బ్యారళ్ల చమురును విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దేశీయంగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణంలో 1.33 మిలియన్ టన్నులు, కర్ణాటకలోని మంగళూరులో 1.5 మిలియన్ టన్నులు, పాడూర్లో 2.5 మిలియన్ టన్నులు చొప్పున చమురు స్టోరేజీలున్నాయి. కాగా.. దేశీయంగా రోజుకి 4.8 మిలియన్ బ్యారళ్ల చమురును వినియోగిస్తుండటం గమనార్హం! అమెరికా రెడీ ప్రపంచ ఇంధన ధరలు తగ్గేందుకు వీలుగా నిల్వల నుంచి చమురును విడుదల చేయవలసిందిగా గతంలో ఎన్నడూ ఎరుగని రీతిలో గత వారం యూఎస్ ప్రభుత్వం అభ్యర్థించింది. ఇందుకు ప్రపంచంలోనే చమురును అత్యధికంగా వినియోగించే దేశాలు చైనా, ఇండియా, జపాన్ తదితరాలనుద్ధేశించి కలసికట్టుగా వ్యవహరించాలంటూ సూచించింది. చమురు ఉత్పత్తిని పెంచమంటూ పలుమార్లు చేసిన అభ్యర్థనలను పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య(ఒపెక్), తదితర దేశాలు తిరస్కరించిన నేపథ్యంలో యూఎస్ వినియోగ దేశాలకు చమురు విడుదలకు సూచించింది. ఇందుకు మార్గదర్శకత్వాన్ని వహిస్తూ 50 మిలియన్ బ్యారళ్లను విడుదల చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఈ బాటలో వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వుల నుంచి 5 మిలియన్ బ్యారళ్ల విడుదలకు భారత్ సైతం నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. ఇతర ప్రధాన వినియోగ దేశాలతో చర్చల ద్వారా భారత్ ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నట్లు వివరించాయి. చమురు వినియోగంలో భారత్ ప్రపంచంలోనే మూడో పెద్ద దేశంగా నిలుస్తున్న నేపథ్యంలో తాజా నిర్ణయానికి ప్రాధాన్యత ఏర్పడింది. అమెరికా 72.7 కోట్ల బ్యారళ్ల చమురును నిల్వ చేయగా.. జపాన్ 17.5 కోట్ల బ్యారళ్ల చమురును రిజర్వులో ఉంచుతోంది. సహేతుకంగా లిక్విడ్ హైడ్రోకార్బన్ల ధరలు సహేతుకంగా, బాధ్యతాయుతంగా ఉండాలని బలంగా విశ్వసిస్తున్నట్లు ప్రభుత్వం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. మార్కెట్ శక్తులు ధరలను నిర్ణయించవలసి ఉన్నట్లు అభిప్రాయపడింది. చమురు ఉత్పాదక దేశాలు డిమాండ్ కంటే తక్కువగా సరఫరాలను కృత్రిమంగా సర్దుబాటు చేయడంపై పలుమార్లు ఆందోళనలు వ్యక్తం చేసింది. ఇది ధరల పెంపునకు దారితీస్తున్నట్లు పేర్కొంది. అయితే చమురు విడుదల తేదీని వెల్లడించనప్పటికీ రానున్న 7–10 రోజుల్లోగా నిర్ణయానికి వీలున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. వ్యూహాత్మక రిజర్వుల నుంచి పైపులైన్లు కలిగిన మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్(ఎంఆర్పీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్ప్ లిమిటెడ్(హెచ్పీసీఎల్)కు చమురును విక్రయించనున్నట్లు పేర్కొన్నాయి. అమెరికా ప్రకటన... వాషింగ్టన్: దేశ వ్యూహాత్మక రిజర్వుల నుంచి 5 కోట్ల బ్యారళ్ల చమురు విడుదలకు యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా నిర్ణయించినట్లు వైట్హౌస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. తద్వారా అమెరికన్ల ఇంధన వ్యయాలను తగ్గించనున్నట్లు తెలియజేసింది. ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలు కలిగిన ఇండియా, జపాన్, చైనా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, యూకేలతో సంప్రదింపుల తదుపరి బైడెన్ తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లు పేర్కొంది. కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం బయటపడుతున్న సమయంలో తగినంత చమురు సరఫరాలు లేకపోవడంతో ఈ సమస్య పరిష్కారానికి ఇతర దేశాలతో బైడెన్ చర్చలు నిర్వహిస్తున్నట్లు వివరించింది. ఈ అంశంపై కొద్ది వారాలుగా ఇతర దేశాలతో నిర్వహిస్తున్న చర్చలు వెల్లడవుతున్న నేపథ్యంలో ధరలు 10% దిగివచ్చినట్లు ఈ సందర్భంగా తెలియజేసింది. ఇటీవల గ్యాస్ ధరలు గ్యాలన్కు 3.4 డాలర్లను తాకినట్లు పేర్కొంది. ఇది ఏడాదిక్రితం ధరలతో పోలిస్తే 50% అధికమని తెలియజేసింది. ధరలు దిగివస్తాయ్.. ప్రపంచంలోనే చమురును అత్యధికంగా వినియోగించే దేశాలు యూఎస్, చైనా, భారత్ తదితరాలు చేతులు కలపడంతో పెట్రోల్, డీజిల్ ధరలు దిగివచ్చే అవకాశమున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలు, సరఫరాల్లో కోతలకు వ్యతిరేకంగా యూఎస్, భారత్ అత్యవసర నిల్వల నుంచి చమురును దేశ వ్యవస్థలలోకి విడుదల చేయనుండటంతో ధరలకు కొంతమేర చెక్ పడే వీలున్నట్లు తెలియజేశాయి. చమురు సరఫరాలు పెరిగితే.. దిగుమతులను తగ్గించుకోవలసి ఉంటుంది. దీంతో ముడిచమురుకు తాత్కాలికంగా డిమాండ్ తగ్గనుంది. వెరసి ధరలపై ప్రతికూల ప్రభావం పడనున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. మరోవైపు కోవిడ్–19 పరిస్థితుల నుంచి బయటపడుతున్న నేపథ్యంలో తగినంత చమురు సరఫరాలు లేకపోవడం పలు దేశాలలో అసంతృప్తికి కారణమవుతున్నట్లు యూఎస్ ప్రభుత్వం తాజాగా వ్యాఖ్యానించింది. డిమాండుకు తగిన రీతిలో సరఫరాలను పెంచమంటూ చమురు ఉత్పత్తి, ఎగుమతి(ఒపెక్) దేశాలను అభ్యర్థించినప్పటికీ పట్టించుకోకపోవడంతో ఇంధన వినియోగ ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాలు ఏకంకావడంతో ధరలు బలహీనపడే అవకాశమున్నట్లు పలువురు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. -
బుల్ బౌన్స్బ్యాక్
ముంబై: మూడు రోజులుగా అమ్మకాల ఒత్తిడితో తడబడిన బుల్ శుక్రవారం లాభాల బాటలో దూసుకెళ్లింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లలోని సానుకూలతలను ఆసరాగా చేసుకొని ఇన్వెస్టర్లు ద్రవ్యోల్బణ భయాలను విస్మరించి కొనుగోళ్లు చేపట్టారు. ఇటీవల మార్కెట్ పతనంతో కనిష్టాలకు దిగివచ్చిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ముఖ్యంగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్సుల్లో షార్ట్ కవరింగ్ చోటుచేసుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు దిగిరావడం, ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల రికవరీ అంశాలు కలిసొచ్చాయి. ఇండెక్సుల్లో అధిక వెయిటేజీ షేర్లైన ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్లు మూడు శాతం మేర రాణించి సూచీల రికవరీకి తోడ్పడ్డాయి. ఫలితంగా సెన్సెక్స్, నిఫ్టీలు అంతుకు ముందు కోల్పోయిన కీలకమైన 60వేలు, 18వేల స్థాయిని తిరిగి అందుకున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంక్స్, మీడియా షేర్లు మాత్రమే స్వల్ప నష్టాలను చవిచూశాయి. మిగతా అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల పర్వం కొనసాగడంతో సెన్సెక్స్ 767 పాయింట్లు పెరిగి 60,687 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 229 పాయింట్లు లాభపడి 18,103 వద్ద నిలిచింది. ఈ ముగింపు స్థాయిలు సూచీలకు రెండు వారాల గరిష్టం కావడం విశేషం. సెన్సెక్స్ సూచీలోని 30 షేర్లకు గానూ ఐదు షేర్లు మాత్రమే నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.511 కోట్ల షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు రూ.851 కోట్ల షేర్లను కొన్నారు. సూచీల భారీ ర్యాలీతో ఇన్వెస్టర్లు రూ.2.77 లక్షల కోట్ల సంపదను సొంతం చేసుకున్నారు. ఈ వారం మొత్తంగా సెన్సెక్స్ 619 పాయింట్లు, నిఫ్టీ 186 పాయింట్లు లాభపడ్డాయి. నిరాశపరిచిన ఫినో పేమెంట్స్ బ్యాంక్... లాభాల మార్కెట్లోనూ ఫినో పేమెంట్స్ బ్యాంక్ లిస్టింగ్ నిరాశపరిచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర రూ.577 కాగా.., రూ.548 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్లో 11 శాతం వరకూ పతనమై రూ.534 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివరికి ఐదున్నర శాతం నష్టంతో రూ.545 వద్ద ముగిసింది. బీఎస్ఈ ఎక్సే్చంజ్లో 6.24 లక్షల షేర్లు చేతులు మారాయి. మార్కెట్ విలువ రూ.4,537 కోట్ల వద్ద స్థిరపడింది. మార్కెట్లో మరిన్ని సంగతులు... ► విదేశీ పెట్టుబడులకు ప్రామాణికంగా భావించే ఎంఎస్సీఐ ఇండెక్స్లో చోటు దక్కించుకోవడంతో జొమాటో షేరు ఇంట్రాడేలో పది శాతం పెరిగి రూ.155 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది. చివరికి రూ.153 వద్ద ముగిసింది. ► విమాన ప్రయాణికుల రద్దీ అక్టోబర్లో పెరగడం ఇండిగో షేరుకు కలిసొచ్చింది. బీఎస్ఈ లో ఏడు శాతం లాభంతో రూ.2305 వద్ద స్థిరపడింది. ఏకంగా 929.57 కోట్ల షేర్లు చేతులు మారినట్లు ఎక్సే్చంజీ గణాంకాలు తెలిపాయి. ► నైకా షేరుకు డిమాండ్ తగ్గడం లేదు. ఇంట్రాడేలో తొమ్మిది శాతం పెరిగి రూ.2410 వద్ద ఆల్ టైం హైని నమోదుచేసింది. చివరికి ఆరుశాతం లాభంతో రూ.2359 వద్ద స్థిరపడింది. -
ప్రపంచ రికవరీకి చమురు మంట
న్యూఢిల్లీ: ముడి చమురు ధరల తీవ్రతపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇది ప్రపంచ ఎకానమీ రికవరీపై ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు వినియోగ దేశమేకాకుండా, దిగుమతుల విషయంలోనూ ఇదే స్థానాన్ని ఆక్రమిస్తోంది. అంతర్జాతీయంగా క్రూడ్ బేరల్ ధర ఏడేళ్ల గరిష్ట స్థాయిలో 80 డాలర్లపైన స్థిరంగా కదలాడుతుండడం, దేశీయంగా పెట్రో ధరలు మండిపోతుండడం, దీనితో ద్రవ్యోల్బణం భయాల వంటి అంశాల నేపథ్యంలో సీఈఆర్ఏవీక్ నిర్వహించిన ఇండియా ఎనర్జీ ఫోరమ్లో భారత్ చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► కోవిడ్–19 వల్ల తీవ్రంగా దెబ్బతిన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. క్రూడ్ ధరల తీవ్రతతో అసలే అంతంతమాత్రంగా ఉన్న రికవరీకి తీవ్ర విఘాతం కలిగే అవకాశం ఉంది. ► క్రూడ్ ధరల ఒడిదుడుకుల పరిస్థితిని అధిగమించాల్సి ఉంది. ఇందుకు దీర్ఘకాలిక సరఫరా కాంట్రాక్టులు అవసరం. స్థిర ధరల వ్యవస్థకు ఇది దోహదపడుతుంది. ► చమురు డిమాండ్, ఒపెక్ (పెట్రోలియం ఎగుమతి దేశాల సంఘం) వంటి ఉత్పత్తిదారుల సరఫరాలకు మధ్య పొంతన లేదు. ఉత్పత్తిని భారీగా పెంచాల్సిన అవసరం ఉంది. ► క్రూడ్ ధరల పెరుగుదల వల్ల వర్థమాన దేశాలకే కాకుండా, పారిశ్రామిక దిగ్గజ దేశాలకూ కష్టాలు తప్పవు. ప్రపంచ ఆరి్థక వ్యవస్థ స్థిరంగా వృద్ధి బాటన పయనించేలా చూడ్డం అందరి బాధ్యత. ఇతర దేశాల మంత్రులతో సమావేశాల సందర్భంగా నేను ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాను. ► 2020 జూన్లో 8.8 బిలియన్ డాలర్లు ఉన్న భారత్ చమురు దిగమతుల బిల్లు, 2021లో సగటున 24 బిలియన్ డాలర్లకు పెరిగింది. కాంట్రాక్ట్ విధానం మారాలి: తరుణ్ కపూర్ ఇదే సమావేశంలో పెట్రోలియం వ్యవహారాల కార్యదర్శి తరుణ్ కపూర్ మాట్లాడుతూ, సౌదీ అరేబియా, ఇరాక్ వంటి ఒపెక్ దేశాల నుండి చమురు కొనుగోలు చేయడానికి భారతదేశం వంటి దిగుమతి చేసుకునే దేశాలు ప్రస్తుతం ‘వన్–టర్మ్ కాంట్రాక్ట్’ను కుదుర్చుకున్నాయని చెప్పారు. ఈ తరహా ఒప్పందాలు సరఫరాలకు సంబంధించి పరిమాణం స్థిరత్వాన్ని మాత్రమే అందిస్తాయని తెలిపారు. డెలివరీ సమయంలో అంతర్జాతీయ మార్కెట్ను అనుసరించి ధరల విధానం ఉంటోందన్నారు. ఈ సమస్య తొలగాలంటే ఒక బెంచ్మార్క్గా ధరలకు అనుసంధానమయ్యే దీర్ఘకాలిక కాంట్రాక్ట్ అవసరమని సూచించారు. భారత్ తన మొత్తం క్రూడ్ అవసరాల్లో 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. గ్యాస్ విషయంలో ఇది 55 శాతంగా ఉంది. భారత్లో చమురు డిమాండ్ కూడా అధికంగా ఉంది. భారత్ ఎకానమీ రికవరీకి దెబ్బతగిలితే, అది చమురు ఉత్పత్తిదారులకూ నష్ట మేనని భారత్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
ఆర్థిక రికవరీకి చమురు రేట్ల ముప్పు
న్యూఢిల్లీ: భారీగా పెరిగిపోతున్న ముడి చమురు రేట్లు .. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రికవరీని దెబ్బతీసే ప్రమాదముందని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. చమురు ధరలు సహేతుక స్థాయిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సౌదీ అరేబియాతో పాటు చమురు ఎగుమతి దేశాల సమాఖ్య ఒపెక్ను కోరింది. ‘ఉత్పత్తిదారులు, వినియోగదారుల ప్రయోజనాల మధ్య సమతూకం పాటించే విధంగా చమురు రేట్లు ఉండాలి. ప్రస్తుతం సరఫరా కన్నా డిమాండ్ అధికంగా ఉండటంతో రేట్లు భారీ స్థాయిలో కొనసాగుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రపంచ దేశాలు ప్రత్యామ్నాయ ఇంధనాలకు మరింత వేగంగా మళ్లే అవకాశం ఉంది. కాబట్టి అధిక ధరలనేవి ఉత్పత్తి దేశాలకు కూడా ప్రతికూలంగానే పరిణమించగలవని ఒపెక్ కూటమికి భారత్ తెలియజేసింది‘ అని ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. ఇటీవలే సౌదీ అరేబియా, కువైట్, ఖతర్, రష్యా తదితర దేశాలతో సమావేశాల సందర్భంగా క్రూడాయిల్ రేట్ల పెరుగుదలపై చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆయన వివరించారు. చమురు ధరలను స్థిరంగా కొనసాగించాల్సిన అవసరం ఉందని, లేకపోతే ఇప్పటిదాకా ప్రపంచ దేశాలు సాధించిన రికవరీ దెబ్బతినే అవకాశం ఉందని ఆయా దేశాలకు మంత్రి స్పష్టం చేసినట్లు అధికారి తెలిపారు. బ్యారెల్ ధర 65–70 డాలర్ల స్థాయి పైగా ఉండటం వల్ల దిగుమతి దేశాలకు సమస్యాత్మకంగా ఉంటోందని ఆయన పేర్కొన్నారు. చమురుకు డిమాండ్ గణనీయంగా పెరుగుతున్న ఏకైక దేశమైన భారత్ పక్కకు తప్పుకుంటే .. ఉత్పత్తి దేశాలకు కూడా సమస్యేనని అధికారి పేర్కొన్నారు. ధర మాత్రమే కాకుండా సరఫరా కాంట్రాక్టులు, చెల్లింపుల్లోనూ వెసులుబాట్లు కావాలని భారత్ కోరుకుంటున్నట్లు ఆయన వివరించారు. ముడిచమురు అవసరాల్లో దాదాపు 85 శాతం భాగాన్ని భారత్ దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది. అలాగే 55 శాతం గ్యాస్ను దిగుమతి చేసుకుంటోంది. -
ప్రపంచదేశాల నెత్తిమీద భారీ పిడుగువేసిన రష్యా అధ్యక్షుడు..!
ఇంధన ధరల పెరుగుదల పలు దేశాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఇంధన ధరల పెరుగుదలతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆయా దేశాల్లో ఆకాశాన్ని తాకుతున్నాయి. భారత్ లాంటి దేశాల్లో ఇంధన ధరలు సామాన్యుడి నడ్డిని విరుస్తున్నాయి. ఇప్పటికే భారత్లో పెట్రోల్ సెంచరీ దాటి పెరుగుతూనే ఉంది. కరోనా రాకతో ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ డిమాండ్ తగ్గిపోయింది. కరోనా తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టడంతో ప్రపంచవ్యాప్తంగా ముడిచమురుకు తీవ్రమైన డిమాండ్ ఏర్పడింది. గత కొద్ది రోజుల నుంచి అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో పలు దేశాల్లో ఇంధన ధరలు భారీగా పెరుగుతున్నాయి. చదవండి: చంద్రుడిపై రొమాన్స్.. రూ.158 కోట్లు నష్టం! బ్యారెల్ ధరలు 100 డాలర్లకు..! ఇంధన ధరల పెరుగుదలతో సతమతమౌతున్న ప్రపంచదేశాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పిడుగు లాంటి వ్యాఖ్యలను చేశాడు.అంతర్జాతీయ మార్కెట్లలో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధరలు 100 డాలర్లకు కచ్చితంగా చేరుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం డబ్యూటీఐ ప్రకారం బ్యారెల్ ముడిచమురు ధర 80 నుంచి 83 డాలర్ల వద్ద కొనసాగుతుంది. రష్యా, ఒపెక్ దేశాలతో ముడిచమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో నిలకడగా ఉంచేందుకు ప్రయత్నాలను చేస్తామని పుతిన్ అన్నారు. పెరుగుతున్న ముడిచమురు ధరలకు ప్రత్యామ్నాయంగా యూరప్ దేశాలకు నేచురల్గ్యాస్ను అందించడానికి రష్యా సిద్దంగా ఉందని పేర్కొనడం గమనార్హం. చదవండి: గోల్డ్ లోన్ తీసుకునే వారికి గుడ్న్యూస్...! -
పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం ఆలస్యం చమురు కంపెనీలు ఆ భారాన్ని ప్రజలపై నేరుగా మోపాయి. మంగళవారం లీటరు పెట్రోలుపై 29 పైసలు, లీటరు డీజిల్పై 32 పైసల వంతున ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్లో లీటరు పెట్రోలు ధర రూ.106.73లకు చేరుకోగా లీటరు డీజిల్ ధర రూ. 99.33గా నమోదు అయ్యింది. ఇకపై బాదుడే నవంబరు వరకు ముడి చమురు ఉత్పత్తిని పరితంగానే చేయాలని ఒపెక్ దేశాలు నిర్ణయించాయి. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ అయిల్కి డిమాండ్ పెరిగిపోయింది. దీంతో నవంబరు వరకు ముడి చమురు ధరలు తగ్గే అవకాశం లేదు. దీంతో మరో రెండు నెలల వరకు ప్రలజకు పెట్రో వడ్డన చేయనుంది ప్రభుత్వం. వెనువెంటనే జులై చివరి వారం నుంచి ఆగస్టు, సెప్టెంబరు వరకు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గాయి. బ్రెండ్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 75 డాలర్ల నుంచి 56 డాలర్ల వరకు పడిపోయింది. ఆ సమయంలో ధరల స్థిరీకరణ పేరుతో పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించేందుకు చమురు కంపెనీలు ఆసక్తి చూపించలేదు. కంటి తుడుపు చర్యగా కేవలం రూపాయికి అటుఇటుగా పెట్రోలు, డీజిల్ రేట్లు తగ్గించారు. కానీ గత వారం రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధర పెరగడం ఆలస్యం ఆ భారాన్ని వెంటనే సామాన్యులపై మోపింది ప్రభుత్వం. చదవండి : పెట్రోల్ బాదుడు.. తగ్గేదేలేదు! -
పెట్రోల్ బాదుడు.. తగ్గేదేలేదు!
ఫ్రాంక్ఫర్ట్: నవంబరు వరకు పెట్రో బాదుడు తప్పేలా లేదు. చమురు ఉత్పత్తిపై ఒపెక్ దేశాలతో పాటు వాటి మిత్ర కూటమి తీసుకున్న నిర్ణయాలే ఇందుకు కారణం. ఫలితంగా గత వారం రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. సోమవారమయితే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఏడేళ్ల గరిష్టానికి చేరాయి. ఒపెక్ నిర్ణయాలు కోవిడ్ మహమ్మారి సమయంలో తగ్గిన ఉత్పత్తిని పునరుద్ధరించే క్రమంగా నెమ్మదిగా ఉండాలని ఒపెక్ దేశాలు నిర్ణయించాయి. దీని ప్రకారం నవంబర్లో రోజుకు 400,000 బారెళ్ల మేర మాత్రమే ఉత్పిత్తిని పెంచాలని ఒపెక్, ఈ కూటమి మిత్ర దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఇప్పుడప్పుడే చమురు ఉత్పత్తి పెరిగే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు వినియోగదారుల నుంచి డిమాండ్ పెరిగింది. ఐనప్పటికీ గ్లోబల్ మార్కెట్లలోకి భారీ సరఫరాలను పెంచరాదని ఒపెక్ కూటమి నిర్ణయించింది. ఫలితంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్వీట్ క్రూడ్ బేరల్ ధర 3 శాతంపైగా లాభంతో 78 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుండగా, బ్రెంట్ క్రూడ్ ధర దాదాపు 3 శాతం లాభంతో 82 డాలర్ల సమీపంలో ట్రేడవుతోంది. చదవండి :పెట్రోల్ సెంచరీ..మరీ ఈవీ ఛార్జింగ్ కాస్ట్ ఎంతో తెలుసా ? -
పెరుగుతున్న చమురు ధరలతో, తినడం మానేస్తున్నారు
ముంబై: పెరిగిపోతున్న ముడి చమురు ధరల భారం ప్రజల ఆలోచనా ధోరణిని మార్చేస్తోంది. విచక్షణారహిత వినియోగం కిందకు రాని, నిత్యావసరాలైన కిరాణ (గ్రోసరీ), జంక్ ఫుండ్ సంబంధ ఆహారం, యుటిలిటీ (విద్యుత్తు, టెలికం) తదితర ఖర్చులను తగ్గించుకుంటున్నారని ఎస్బీఐ ఆర్థిక వేత్తలు ఓ నివేదిక రూపంలో వెల్లడించారు. చమురు ధరల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం పన్నులను తగ్గించాలని సూచించారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ రూ.100కు పైనే పలుకుతుండగా.. డీజిల్ సైతం రూ.100కు చేరువలో ఉంది. విక్రయ ధరలో రూ.40కు పైనే పన్నుల రూపంలో కేంద్రం, రాష్ట్రాలకు వెళుతోంది. వాస్తవానికి గతేడాది కరోనా వైరస్ భయంతో చమురు ధరలు పాతాళానికి పడిపోయాయి. ఆ సమయంలో అదనపు ఆదాయం కోసం కేంద్ర సర్కారు ఎక్సైజ్ సుంకాలను పెంచుకుంది. తిరిగి చమురు ధరలు గరిష్టాలకు చేరినా కానీ, ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించే ఆలోచన చేయకపోవడం గమనార్హం. ఇది వినియోగదారులపై ధరల భారాన్ని మోపుతోంది. వెంటనే పన్నులు తగ్గించాలి.. ‘‘వినియోగదారులు ఇంధనంపై ఎక్కువగా ఖర్చు పెడుతుంటారు. ఎస్బీఐ కార్డులపై ఖర్చులను విశ్లేషించగా.. పెరిగిన చమురు భారాన్ని సర్దుబాటు చేసుకునేందుకు జంక్ఫుడ్పై ఖర్చులను వారు గణనీయంగా తగ్గించుకున్నారు. అంతేకాదు గ్రోసరీ, యుటిలిటీ కోసం చేసే ఖర్చు కూడా తగ్గిపోయింది’’ అని ఎస్బీఐ ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్యకాంతి ఘోష్ తెలిపారు. చమురుపై అధిక వ్యయాలు ద్రవ్యోల్బణంపైనా ప్రభావం చూపిస్తాయని హెచ్చరించారు. చమురు ధరలు 10 శాతం పెరిగితే ద్రవ్యోల్బణంపై అర శాతం ప్రభావం పడుతుందన్నారు. కనుక వెంటనే పన్నులను తగ్గించి క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణం స్వల్పం గా తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నా, ఇప్పటికీ గరిష్ట స్థాయిల్లోనే ఉందని.. దీనికితోడు ఆర్థిక పొదుపులు తగ్గడం సవాలేననని ఈ నివేదిక తెలిపింది. -
చమురు ధరలు: ప్రత్యామ్నాయాలపై భారత్ చూపు!
న్యూఢిల్లీ: ముడి చమురు ధరలు ‘భరించగలిగే స్థాయిలో’ ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని ఒపెక్ను (పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య– ఓపీఈసీ) భారత్ డిమాండ్ చేసింది. అంతర్జాతీయ ధోరణికి అనుగుణంగా దేశీయంగా రిటైల్ ఇంధన ధరలు రికార్డు గరిష్టాలకు చేరిన నేపథ్యంలో గురువారం భారత్ ఈ కీలక పిలుపునిచ్చింది. చమురు ధరలను ‘తగిన సమంజసమైన శ్రేణిలో’ ఉండేలా తక్షణ చర్యలు అవసరమని సూచించింది. ప్రత్యేకించి ఉత్పత్తి కోతల విధానానికి ముగింపు పలకాలని స్పష్టం చేసింది. సౌదీ అరేబియాసహా పలు ఒపెక్ దేశాలు భారత్ ప్రధాన చమురు వనరుగా ఉన్న సంగతి తెలిసిందే. ఒపెక్ సెక్రటరీ జనరల్తో చర్చలు ఒపెక్ సెక్రటరీ జనరల్ మహమ్మద్ సనౌసి బర్కిం దోతో భారత్ పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చమురు ధరల విషయమై వర్చువల్గా చర్చలు జరిపారు. 2019 ఏప్రిల్ తరువాత మొదటిసారి అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు బేరల్కు 75 డాలర్లపైకి ఎగసిన సంగతి తెలిసిందే. దీనికితోడు దేశీయంగా సుంకాలతో భారత్లోని పలు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ధర దాదాపు రూ.100 స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో తగిన స్థాయిలో అంతర్జాతీయంగా ధర ఉండాలని భారత్ కోరినట్లు ఒక ప్రకటనలో ఒపెక్ తెలిపింది. అనంతరం చమురు మంత్రిత్వశాఖ కూడా ఒక ప్రకటన చేస్తూ, ‘‘క్రూడ్ ఆయిల్ ధరల తీవ్రతపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది వినియోగదారులు అలాగే ఎకానమీ రికవరీపై చూపుతున్న ప్రభావాన్ని చర్చించారు. భారత్లో తీవ్ర ద్రవ్యోల్బణానికి పరిస్థితులు దారితీస్తున్నాయని వివరించారు’’ అని పేర్కొంది. ఇరు వర్గాల ప్రకటనల ప్రకారం, చమురు మార్కెట్ పరిణామాలు చర్చల్లో చోటుచేసుకున్నాయి. ఆయిల్ డిమాండ్ రికవరీ, ఎకానమీ వృద్ధిపై ప్రభావం, ఇంధన సవాళ్లను అధిగమంచడం వంటి అంశాలు వీటిలో ఉన్నాయి. చదవండి: అదిరిపోయే ఫీచర్స్, త్వరలో మెక్రోసాఫ్ట్ విండోస్ 11 విడుదల ప్రధాన్ కృతజ్ఞతలు.. భారత్లో మహమ్మారి రెండవ వేవ్ సమయంలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్సహా పలు ఒపెక్ సభ్య దేశాలు చేసిన సహాయం పట్ల ప్రధాన్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఒపెక్ సెక్రటేరియట్ నిరంతర సంప్రతింపుల కార్యక్రమంలో భాగంగా తాజా వీడియోకాన్ఫరెన్స్ జరి గింది. ప్రపంచ ఎకానమీ 5.5 శాతం పురోగమిస్తుందని, 2021లో రోజూవారీ ఆయిల్ డిమాండ్ 6 మిలియన్ బేరళ్లకుపైగా పెరుగుతుందని జూన్లో ఒపెక్ నెలవారీ ఆయిల్ మార్కెట్ నివేదిక పేర్కొంది. ప్రత్యామ్నాయాలపై భారత్ చూపు! సరఫరాల కోతలకు ముగింపు పలకాలని భారత్ పలు నెలలుగా విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ, ఒపెక్ దాని అనుబంధ దేశాలు (ఒపెక్ ప్లస్) పట్టించుకోవడం లేదు. దీనితో ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు దిగుమతి దేశంగా భారత్ తన చమురు అవసరాలకు ప్రత్యామ్నాయ దేశాలపై దృష్టి సారిస్తోంది. ఆయా పరిస్థితుల నేపథ్యంలో భారత్ చమురు దిగుమతుల్లో ఒపెక్ వాటా మేలో 60 శాతానికి పడిపోయింది. ఏప్రిల్లో ఇది ఏకంగా 74 శాతంగా ఉండడం గమనార్హం. నిజానికి చమురు ధరల విషయంలో ఈ ఏడాది మార్చిలో భారత్–ఒపెక్ల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డిమాండ్ మరింతగా మెరుగుపడే దాకా చమురు ఉత్పత్తిపై నియంత్రణలు కొనసాగించాలని చమురు ఎగుమతి దేశాల కూటమి ఒపెక్, దాని అనుబంధ దేశాలు నిర్ణయించిన నేపథ్యంలో ముడి చమురు రేట్లు గణనీయంగా పెరగాయి. ఈ నేపథ్యంలో చమురు రేట్లను స్థిరంగా ఉంచుతామన్న హామీకి కట్టుబడి ఉండాలని, ఇందుకు సంబంధించి ఉత్పత్తి, సరఫరాలపై నియంత్రణలను సడలించాలని భారత్ అప్పట్లో విజ్ఞప్తి చేసింది. ఈ విజ్ఞప్తిని ఒపెక్, దాని అనుబంధ దేశాలు తోసిపుచ్చాయి. పైగా ఒపెక్ సమావేశం అనంతరం మార్చి 4వ తేదీన సౌదీ అరేబియా భారత్కు ఒక ఉచిత సలహా ఇస్తూ, కావాలంటే గతంలో చౌకగా కొనుక్కున్న చమురును ఉపయోగించుకోవాలంటూ సూచించింది. 2020 ఏప్రిల్–మే మధ్యన భారత్ 16.71 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురును కొనుగోలు చేసింది. వైజాగ్తో పాటు మంగళూరు, పాదూరు (కర్ణాట క)లోని వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వ్లలో నిల్వ చేసుకుంది. అప్పట్లో బ్యారెల్ క్రూడాయిల్ సగటున 19 డాలర్ల రేటుకే లభించింది. ఒపెక్ చేసిన ప్రకటనపై అప్పట్లో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీవ్రంగా స్పందించారు. చమురు రేట్లు ఎగియడం .. ఆర్థిక రికవరీ, డిమాండ్ను దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. 2020లో కరోనా వైరస్పరమైన కారణాలతో డిమాండ్ పడిపోయి, ఉత్పత్తి తగ్గించుకోవాలని ఒపెక్ కూటమి నిర్ణయించుకున్నప్పుడు తాము కూడా మద్దతునిచ్చామని ఆయన పేర్కొన్నారు. మార్కెట్ పరిస్థితులు మెరుగుపడ్డ తర్వాత ఉత్పత్తి పెంచుతామంటూ ఒపెక్ అప్పట్లో హామీ ఇచ్చిందని .. కానీ ఇప్పుడు డిమాండ్ పెరుగుతున్నా ఉత్పత్తి మాత్రం సాధారణ స్థితికి రావడం లేదని ప్రధాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. డిమాండ్, సరఫరా మధ్య వ్యత్యాసం పెరిగిపోతే రేట్లు పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. క్రూడ్ ఆయిల్ను ఏ దేశం తక్కువ ధరకు సరఫరా చేస్తుందో ఆ దేశం నుంచే భారత్ కొనుగోలు చేస్తుందని కూడా ప్రధాన్ స్పష్టం చేయడం గమనార్హం. ఉత్పత్తి, సరఫరాల విషయంలో నియంత్రణలు లేకుండా చూస్తూ, తక్కువ ధరకు చమురు సరఫరా చేయాలన్న భారత్ విజ్ఞప్తి పట్ల సౌదీ అరేబియా సమాధానం ‘దౌత్యధోరణి’ కాని రీతిలో ఉందని మంత్రి పేర్కొన్నారు. భారత్ చమురు వినియోగంపై సౌదీ ఇంధన శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దుల్లాజిజ్ బిన్ సల్మాన్ చేసిన ప్రకటనను ‘‘సన్నిహితమైన స్నేహితుని’’ నుంచి ‘‘దౌత్యరీతిలేని సమాధానం’’ అని ప్రధాన్ అభివర్ణించారు. ఇలాంటి వైఖరిని భారత్ అసలు అంగీకరించబోదని అన్నారు. భారత్ వ్యూహాత్మక చమురు నిల్వలను ఎలా ఎప్పుడు వినియోగించుకోవాలన్నది భారత్ నిర్ణయమని పేర్కొన్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో సౌదీ అరేబియాకన్నా, అమెరికాకే భారత్ ప్రాధాన్యత ఇస్తోందా? అన్న అంశంపై ప్రధాన్ సమాధానం ఇస్తూ, ‘‘మేము ఎవరికి దగ్గర అవుతున్నామన్న అంశం ఇక్కడ ప్రధానం కాదు. భారత్ ప్రయోజనాల పరిరక్షణ ఎలా అన్నదే ఇక్కడ ముఖ్యం. మాది బహిరంగ, స్వేచ్ఛాయుత మార్కెట్. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా చమురు దిగుమతిచేసుకునే అవకాశం మా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, ప్రైవేటు రంగం చమురు దిగ్గజ సంస్థలకు ఉంది. తక్కువ ధరకు చమురు లభ్యత మాకు ముఖ్యం. అది అమెరికానా లేక ఇరాక్, యూఏఈ, సౌదీ అరేబియానా అన్నది ప్రధానం కాదు.’’ అని అన్నారు. భారత్లో రిఫైనర్స్ ఇప్పటికే తమ చమురు అవసరాలకు పశ్చిమ ఆసియావైపుకాకుండా తక్కువ ధరకు లభించే ఇతర దేశాల వైపూ దృష్టి పెడుతుండడం కీలకాంశం. -
తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
సాక్షి,ముంబై: నాలుగు రోజుల విరామం తరువాత మళ్లీ పెట్రోలు ధరలు స్వల్పంగా క్షీణించాయి. గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ధరలు దిగి రావడంతో పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం (మార్చి 30) స్వల్పంగా తగ్గాయి. పెట్రోల్ , డీజిల్ ధరలను తగ్గిస్తూచమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయించాయి. పెట్రోలుపై లీటరుకు 22 పైసలు , డీజిల్పై లీటరుకు 23 పైసలు చొప్పున తగ్గించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర ప్రస్తుతం లీటరుకు 90.56 రూపాయలుగా ఉంది. డీజిల్ లీటరుకు 80.87 రూపాయలకు చేరింది. వివిధ మెట్రో నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు ముంబైలో పెట్రోల్ ధర రూ. 96.98, డీజిల్ ధర 87.96 కోల్కతాలో పెట్రోల్ రూ. 90.77 డీజిల్ ధర రూ 83.75 (సోమవారం ధర కంటే 23 పైసలు) చెన్నైలో పెట్రోల్ ధర రూ. 92.58(19 పైసలు తగ్గింది) డీజిల్ ధర రూ. 85.88 22 పైసలు తగ్గింది హైదరాబాద్ పెట్రోలు ధర రూ. 94.16, డీజిల్ రూ. 88.20 అమరావతి పెట్రోలు ధర రూ. 96.77, డీజిల్ ధర రూ. 90.28 -
వాహనదారులకు ఊరట : దిగొచ్చిన పెట్రోలు ధర
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవలి కాలం దాకా వాహనదారులకు చుక్కలు చూపించిన ఇంధన ధరలు దిగి వచ్చాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పడిపోవడంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ఊరటనిస్తున్నాయి. వరుసగా 24 రోజులు స్థిరంగా ఉన్న పెట్రోలు ధర నేడు (మార్చి 24 బుధవారం) లీటరుకు18 పైసలు,డీజిల్పై 17 పైసలు చొప్పున తగ్గాయి. ఫిబ్రవరి 27 న పెట్రోలు ధర దేశ రాజధానిలో 91.17 వద్ద ఆల్ టైమ్ హైని తాకిన సంగతి తెలిసిందే. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సమాచారం ప్రకారం ఢిల్లీలో పెట్రోల్ ధర.91.17 నుండి. 90.99 కు , డీజిల్ 17 పైసలు తగ్గి లీటరుకు. 81.47 నుండి. 81.30కు చేరింది. వివిధ నగరాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి ముంబైలో పెట్రోలు ధర రూ. 97.40 డీజిల్ ధర 88.42 చెన్నైలో పెట్రోలు ధర 92.95 డీజిల్ ధర86.29 కోల్కతాలో పెట్రోలు ధర 91.18 డీజిల్ ధర 84.18 హైదరాబాద్లో పెట్రోల్ ధర రూ.94.61 , డీజిల్ ధర రూ.88.67 అమరావతిలో పెట్రోల్ ధర రూ.97.14 , డీజిల్ ధర రూ.90.67 కాగా ముడి చమురు ధరలు దాదాపు రెండు వారాల నుంచి సుమారు 10 శాతం తగ్గాయి. అయితే బుధవారం మాత్రం పైకి చూస్తున్నాయి. బ్రెంట్ ముడి ఫ్యూచర్స్ 27 సెంట్లు లేదా 0.4 శాతం పెరిగి, బ్యారెల్ 61.06 డాలర్లకు చేరుకుంది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యుటిఐ) ముడి ఫ్యూచర్స్ 19 సెంట్లు లేదా 0.3 శాతం పెరిగి బ్యారెల్కు 57.95 డాలర్లకు చేరుకుంది. -
కేంద్ర ప్రభుత్వానికి ఇం‘ధనం’
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు ఆల్టైం గరిష్ట స్థాయి నుంచి భారీగా దిగివచ్చినా దేశీయంగా ఇంధనాల రేట్లు మాత్రం రికార్డు గరిష్ట స్థాయిలో తిరుగాడుతున్నాయి. వీటిపై ప్రభుత్వం పన్నుల మోత మోగిస్తుండటమే ఇందుకు కారణం. గడిచిన ఆరేళ్లలో ఇలా పెట్రోల్, డీజిల్పై పన్నుల వసూళ్లు 300% పెరిగాయి. మోదీ సర్కార్ ఏర్పాటైన తొలి ఏడాది 2014–15లో ఎక్సైజ్ డ్యూటీ రూపంలో పెట్రోల్పై రూ. 29,279 కోట్లు, డీజిల్పై రూ. 42,881 కోట్లు కేంద్రం వసూలు చేసింది. వీటికి సహజ వాయువును కూడా కలిపితే 2014–15లో వీటిపై ఎక్సైజ్ రూపంలో రూ. 74,158 కోట్లు ప్రభుత్వానికి చేరాయి. ఈ వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 10 నెలల్లో ఏకంగా రూ. 2.95 లక్షల కోట్లకు చేరాయి. కేవలం పెట్రోల్, డీజిల్పై పన్నుల వసూళ్లు రూ. 2.94 లక్షల కోట్లకు పెరిగాయి. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ లోక్సభకు తెలిపారు. ప్రభుత్వానికి వచ్చే మొత్తం ఆదాయంలో.. పెట్రోల్, డీజిల్, సహజ వాయువుపై విధించే ట్యాక్సుల వసూళ్ల రూపంలో వచ్చేది 2014–15లో 5.4%గా ఉండగా ఈ ఆర్థిక సంవత్సరం 12.2%కి పెరిగిందని ఆయన వివరించారు. పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ 2014లో లీటరుకు రూ. 9.48గా ఉండగా అదిప్పుడు రూ. 32.90కి పెరిగింది. డీజిల్పై రూ. 3.56 నుంచి రూ. 31.80కి చేరింది. -
చమురు సరఫరాలో సౌదీని మించిన అమెరికా!
న్యూఢిల్లీ: మనదేశ ఇంధన అవసరాలకు సరిపడా ముడి చమురు సరఫరా చేస్తున్న దేశాల్లో ఇప్పటి వరకు సౌదీ అరేబియా రెండో స్థానంలో కొనసాగేది. కానీ ప్రస్తుతం సౌదీ అరేబియా ఆ స్థానాన్ని కోల్పోనున్నది. సౌదీ అరేబియా స్థానాన్ని అమెరికా భర్తీ చేయనున్నది. సౌదీ అరేబియా సారధ్యంలోని ఒపెక్ ప్లస్ దేశాల కూటమి ముడి చమురు ఉత్పత్తిని తగ్గించడంతో భారత్, అమెరికా నుంచి ఎక్కువ మొత్తంలో ముడి చమురును కొనుగోలు చేస్తున్నది. దీనితో భారత్కు అత్యధికంగా చమురు ఎగుమతి చేస్తున్న రెండో దేశంగా అమెరికా అవతరించింది. గత నెలలో ఈ స్థానంలో ఉన్న సౌదీ అరేబియాను ఇప్పుడు అగ్రరాజ్యం అధిగమించింది. అమెరికాలో ముడి చమురు డిమాండ్ పడిపోవడంతో పాటు తక్కువ ధరకు లభించడంతో భారత్ ఎక్కువ మొత్తంలో చమురును కొనుగోలుచేస్తున్నది. మరోపక్క చమురు ఉత్పత్తి దేశాలు(ఒపెక్ ప్లస్) రోజుకి ఒక మిలియన్ బ్యారెళ్ల ఉత్పత్తిని తగ్గించాలని దేశాలు నిర్ణయించాయి. ప్రస్తుతం అమెరికానే ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుగా ఉంది. అమెరికా నుంచి భారతదేశం దిగుమతులు 48 శాతం పెరిగి గత నెలలో ఫిబ్రవరిలో 545,300 బ్యారెల్స్(బిపిడి)కు చేరుకున్నాయి. గత నెల భారతదేశం మొత్తం దిగుమతుల్లో అమెరికా వాటా 14 శాతం ఉంది. దీనికి విరుద్ధంగా, ఫిబ్రవరిలో సౌదీ అరేబియా నుంచి దిగుమతులు 42 శాతం తగ్గి రోజుకి 4,45,200 బ్యారెళ్ల చమురు దశాబ్ద కనిష్టానికి పడిపోయాయి. 2006 జనవరి తర్వాత భారత్కు చమురు ఎగుమతి చేస్తున్న జాబితాలో మొదటిసారిగా 4వ స్థానానికి పడిపోయింది. భారత్కు చమురు ఎగుమతి చేస్తున్న అతిపెద్ద దేశంగా ఇరాక్ కొనసాగుతోంది. మొత్తంగా చూస్తే ఆ దేశం నుంచి భారత్కు చమురు ఉత్పత్తి 23 శాతం పడిపోయి ఐదు నెలల కనిష్ఠానికి చేరింది. చదవండి: కరోనా కాలంలో ఎగుమతుల జోరు -
తొలుత జూమ్.. తుదకు ఫ్లాట్
ముంబై: రెండు రోజుల నష్టాలకు చెక్ పెడుతూ దేశీ స్టాక్ మార్కెట్లు తొలుత హుషారుగా ప్రారంభమయ్యాయి. అయితే విదేశీ మార్కెట్ల ప్రభావంతో చివర్లో అమ్మకాలు తలెత్తడంతో స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 36 పాయింట్లు బలపడి 50,441 వద్ద నిలవగా.. నిఫ్టీ 18 పాయింట్లు పుంజుకుని 14,956 వద్ద స్థిరపడింది. రోజంతా స్వల్ప ఒడిదొడుకుల మధ్య మార్కెట్లు కదిలాయి. తొలి గంటలో సెన్సెక్స్ 667 పాయింట్లు జంప్చేసి 50,986ను తాకింది. తదుపరి ఆసియా మార్కెట్లు, యూఎస్ ఫ్యూచర్స్ బలహీనపడటంతో వెనకడుగు వేసింది. చివరి అర్ధగంటలో నష్టాలలోకి సైతం ప్రవేశించింది. 50,318 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 15,111–14,920 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరలు మండుతుండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. కాగా.. 1.9 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీకి యూఎస్ సెనేట్ ఆమోదముద్ర వేయడంతో తొలుత సెంటిమెంటుకు జోష్వచ్చినట్లు నిపుణులు తెలియజేశారు. ఎఫ్ఎంసీజీ డీలా ఎన్ఎస్ఈలో పీఎస్యూ బ్యాంక్స్, మీడియా, మెటల్, ఐటీ, ఫార్మా రంగాలు 1.6–0.4 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే రియల్టీ 1 శాతం, ఎఫ్ఎంసీజీ 0.5 శాతం చొప్పున నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో యూపీఎల్, గెయిల్, ఎల్అండ్టీ, ఓఎన్జీసీ, ఎస్బీఐ లైఫ్, హెచ్సీఎల్ టెక్, ఐవోసీ, యాక్సిస్, ఎన్టీపీసీ, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ లైఫ్, కోల్ ఇండియా, ఇన్ఫోసిస్ 7–1.5 శాతం మధ్య ఎగిశాయి. ఈ బాటలో పవర్గ్రిడ్, బీపీసీఎల్, ఎంఅండ్ఎం, టెక్ మహీంద్రా, ఆర్ఐఎల్, సిప్లా సైతం 1.2–0.5 శాతం మధ్య బలపడ్డాయి. అయితే ఇండస్ఇండ్, శ్రీ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్, బజాజ్ ఆటో, ఎయిర్టెల్, హెచ్యూఎల్, బజాజ్ ఫిన్, టైటన్, హెచ్డీఎఫ్సీ, టాటా మోటార్స్, బ్రిటానియా, విప్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.2–0.5 శాతం మధ్య క్షీణించాయి. ఎఫ్అండ్వో ఇలా... డెరివేటివ్ విభాగంలో పీఎఫ్సీ, ఐఆర్సీటీసీ, గ్లెన్మార్క్, ఎన్ఎండీసీ, నాల్కో, భెల్, టొరంట్ పవర్, సెయిల్, ఎల్అండ్టీ టెక్నాలజీ, జీ, కమిన్స్ ఇండియా 4.6–3 శాతం మధ్య జంప్చేశాయి. అయితే మరోపక్క అపోలో టైర్, టీవీఎస్ మోటార్, ముత్తూట్ ఫైనాన్స్, బెర్జర్ పెయింట్స్, పిడిలైట్, జూబిలెంట్ ఫుడ్, ఇండిగో, పేజ్, ఎంఫసిస్, బాటా 3.2–1.8 శాతం మధ్య నష్టపోయాయి. ఎన్ఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 0.3–0.5 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఎఫ్పీఐల అమ్మకాలు నగదు విభాగంలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 1,494 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) దాదాపు రూ. 484 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి. వారాంతాన సైతం ఎఫ్పీఐలు రూ. 2,014 కోట్ల అమ్మకాలు చేపట్టడం గమనార్హం! -
కంపెనీలకు చమురు సెగ
కోవిడ్–19 సృష్టించిన విలయం నుంచి నెమ్మదిగా బయటపడుతున్న ప్రపంచ దేశాలు ఆర్థిక రికవరీ బాటలో సాగుతున్నాయి. దీంతో ఇటీవల బాండ్ల ఈల్డ్స్, డాలరు ఇండెక్స్ పుంజుకుంటోంది. మరోవైపు ముడిచమురు ధరలు సైతం బలపడుతున్నాయి. ఫలితంగా చమురు ఉత్పత్తి దేశాలు, కంపెనీలు లాభపడనుండగా.. దేశీయంగా పలు రంగాలపై ప్రతికూల ప్రభావం పడనుంది. వెరసి వచ్చే ఆర్థిక సంవత్సరం (2021–22)లో పలు రంగాల కంపెనీల మార్జిన్లపై ఒత్తిడి పడవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం.. ముంబై: కొద్ది రోజులుగా ముడిచమురు ధరలు మండుతున్నాయి. తాజాగా విదేశీ మార్కెట్లో 14 నెలల గరిష్టానికి చేరాయి. న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ చమురు, లండన్ మార్కెట్లో బ్రెంట్ బ్యారల్ ధరలు పెరగడంతో ఇండియన్ క్రూడ్ బాస్కెట్ ధరలు సైతం వేడిని పుట్టించనున్నాయి. నైమెక్స్ బ్యారల్ దాదాపు 66 డాలర్లకు చేరగా.. బ్రెంట్ 69 డాలర్లను అధిగమించింది. దీంతో దేశీయంగా పలు రంగాలపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రతికూల ప్రభావం పడనుంది. అయితే చమురును ఉత్పత్తి చేయగల అప్స్ట్రీమ్ కంపెనీలు ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా, కెయిర్న్, ఆర్ఐఎల్ లబ్ధి పొందే వీలుంది. అంతర్జాతీయ మార్కెట్ల ధరల ఆధారంగా ముడిచమురును విక్రయించేందుకు వీలుండటమే దీనికి కారణంకాగా.. చమురు శుద్ధి(రిఫైనింగ్) కంపెనీల మార్జిన్లపై ఒత్తిడి పడనుంది. ఇదేవిధంగా ముడిచమురు నుంచి లభించే పలు డెరివేటివ్స్ ధరలు పెరగడంతో పెయింట్లు, ప్లాస్టిక్, ప్యాకేజింగ్ మెటీరియల్స్, కెమికల్స్ తదితర రంగాల లాభదాయకతను దెబ్బతీసే వీలుంది. చమురు జోరు ప్రపంచ ఆర్థిక రికవరీ, ఉత్పత్తిలో కోతల ఎత్తివేత తదితర అంచనాలతో ఈ ఏడాది రెండు నెలల్లోనే బ్రెంట్ చమురు 30 శాతం జంప్చేసింది. అయితే గత మూడేళ్లుగా స్తబ్దుగా ఉన్న చమురు ధరలతో దేశీయంగా లబ్ధి పొందుతూ వచ్చిన పలు రంగాలు దీంతో మార్జిన్ల సవాళ్లను ఎదుర్కొనే అవకాశముంది. చమురు డెరివేటివ్స్ను పెయింట్స్, టైర్ల తయారీలో కీలక ముడిసరుకుగా వినియోగించే సంగతి తెలిసిందే. పెయింట్స్, టైర్ల తయారీ ముడివ్యయాలలో 40–60 శాతం వాటాను ఇవి ఆక్రమిస్తుంటాయి. ఈ బాటలో ఎఫ్ఎంసీజీ, కెమికల్స్, సిమెంట్ తదితర రంగాలలోనూ చమురు డెరివేటివ్స్ కీలకపాత్ర పోషిస్తుంటాయి. చమురు ధరలు మండితే.. ఏటీఎఫ్ ధరలకు రెక్కలొస్తాయని విశ్లేషకులు పేర్కొన్నారు. ఫలితంగా విమానయాన రంగంపై భారీగా భారం పడుతుంది. వెరసి ఎయిర్లైన్స్ కంపెనీలకు ఆర్థిక సవాళ్లు ఎదురయ్యే వీలున్నట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. -
చమురు భగభగ.. భారత్కు సౌదీ ఉచిత సలహా
లండన్: డిమాండ్ మరింతగా మెరుగుపడే దాకా చమురు ఉత్పత్తిపై నియంత్రణలు కొనసాగించాలని చమురు ఎగుమతి దేశాల కూటమి ఒపెక్, దాని అనుబంధ దేశాలు భావిస్తున్న నేపథ్యంలో ముడి చమురు రేట్లు గణనీయంగా పెరుగుతున్నా యి. గురువారం 4% ఎగిసిన ధరలు శుక్రవారం మరో రెండు శాతం పైగా పెరిగాయి. 14 నెలల గరిష్ట స్థాయిని తాకాయి. ఫ్యూచర్స్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ రేటు బ్యారెల్కు 2.3 శాతం దాకా పెరిగి 68.26 డాలర్లకు చేరింది. అటు నైమెక్స్ క్రూడాయిల్ ధర దాదాపు 2% పైగా పెరిగి 66.23 డాలర్ల స్థాయిని తాకింది. ఒపెక్, దాని అనుబంధ దేశాలు ఏప్రిల్లోనూ ఉత్పత్తి గణనీయంగా పెంచరాదని నిర్ణయించుకున్నాయి. రష్యా, కజకిస్తాన్లకు స్వల్ప మినహాయింపునివ్వడం తప్ప మిగతా దేశాలన్నీ కూడా ఉత్పత్తిపై నియంత్రణ కొనసాగించాలని తీర్మానించుకున్నాయి. ఒపెక్ దేశాలు కనీసం రోజుకు 15 లక్షల బ్యారెళ్ల మేర (బీపీడీ) ఉత్పత్తి పెంచుతాయని మార్కెట్ వర్గాలు భావించినప్పటికీ.. దానికి విరుద్ధంగా 1.5 లక్షల బీపీడీకి మాత్రమే ఒపెక్, అనుబంధ దేశాలు నిర్ణయించడం మార్కెట్ వర్గాలను నిరాశపర్చిందని యూబీఎస్ అనలిస్ట్ జియోవాని స్టానొవో పేర్కొన్నారు. జనవరి 2020: క్రూడ్ గరిష్ట రేటు 65.65 డాలర్లు ఏప్రిల్ 2020: క్రూడ్ కనిష్ట రేటు మైనస్ 40.32 డాలర్లు మార్చి 5 2021: క్రూడ్ గరిష్ట రేటు 66.23 డాలర్లు అంచనాల్లో సవరణలు.. ఒపెక్, అనుబంధ దేశాలు సరఫరాపై నియంత్రణలు కొనసాగించనున్న నేపథ్యంలో విశ్లేషకులు... ముడిచమురు ధరల అంచనాలను కూడా సవరించడం ప్రారంభించారు. రెండో త్రైమాసికంలో బ్రెంట్ క్రూడ్ రేటు మరో 5 డాలర్లు పెరిగి 75 డాలర్లకు (బ్యారెల్కు) చేరవచ్చని, మూడో త్రైమాసికానికి 80 డాలర్లకు చేరొచ్చని గోల్డ్మన్ శాక్స్ అంచనా వేసింది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో బ్రెంట్ రేటు 75 డాలర్లకు (బ్యారెల్కు), నైమెక్స్ క్రూడ్ 72 డాలర్లకు (బ్యారెల్కు) చేరొచ్చని యూబీఎస్ అంచనాలను సవరించింది. భారత్కు సౌదీ ఉచిత సలహా.. చమురు రేట్లను స్థిరంగా ఉంచుతామన్న హామీకి కట్టుబడి ఉండాలని, ఉత్పత్తిపై నియంత్రణలను సడలించాలని భారత్ చేసిన విజ్ఞప్తిని ఒపెక్, దాని అనుబంధ దేశాలు తోసిపుచ్చాయి. కావాలంటే గతంలో చౌకగా కొనుక్కున్న చమురును ఉపయోగించుకోవాలంటూ సౌదీ అరేబియా ఉచిత సలహా ఇచ్చింది. ఒపెక్, అనుబంధ దేశాల నిర్ణయంపై జరిగిన విలేకరుల సమావేశంలో సౌదీ అరేబియా ఇంధన శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దుల్అజీజ్ బిన్ సల్మాన్.. భారత్ విజ్ఞప్తిపై స్పందించారు. ‘భారత్ విషయానికొస్తే గతేడాది ఏప్రిల్, మే, జూన్లో చౌకగా కొనుగోలు చేసిన చమురును ప్రస్తుతం ఉపయోగించుకోవాలని మా మిత్ర దేశాన్ని కోరుతున్నాము‘ అని ఆయన వ్యాఖ్యానించారు. 2020 ఏప్రిల్-మే మధ్యన భారత్ 16.71 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురును కొనుగోలు చేసింది. వైజాగ్తో పాటు మంగళూరు, పాదూరు (కర్ణాటక)లోని వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వ్లలో నిల్వ చేసుకుంది. అప్పట్లో బ్యారెల్ క్రూడాయిల్ సగటున 19 డాలర్ల రేటుకే లభించింది. కేంద్రచమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవలే చమురు రేట్లు ఎగియడం .. ఆర్థిక రికవరీ, డిమాండ్ను దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్ పరిస్థితులు మెరుగుపడ్డ తర్వాత ఉత్పత్తి పెంచుతామంటూ ఒపెక్ అప్పట్లో హామీ ఇచ్చిందని.. కానీ ఇప్పుడు డిమాండ్ పెరుగుతున్నా ఉత్పత్తి సాధారణ స్థితికి రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రికార్డు స్థాయిలో పెట్రో రేట్లు.. గతేడాది ఏప్రిల్–డిసెంబర్ మధ్యలో భారత్ దిగుమతి చేసుకునే ముడిచమురు సగటు రేటు బ్యారెల్కు 50 డాలర్ల కన్నా తక్కువే ఉన్నప్పటికీ దేశీయంగా రిటైల్ రేట్లు గరిష్ట స్థాయిలోనే కొనసాగాయి. పెట్రోల్, డీజిల్ రేట్లపై ఎక్సైజ్ డ్యూటీని ప్రభుత్వం పెంచుకుంటూ వస్తుండటం కూడా ఇందుకు కారణం. ప్రస్తుతం ఢిల్లీలోని రేట్ల ప్రకారం పెట్రోల్ ధరలో మూడో వంతు ఎక్సైజ్ డ్యూటీ ఉంటుండగా, డీజిల్ ధరలో 40% దాకా ఉంటోంది. దీనికి రాష్ట్రాల పన్నులూ తోడవడం రేట్లకు మరింతగా ఆజ్యం పోస్తోంది. రాజస్తాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ధర ఇప్పటికే రూ. 100 దాటేసింది. అంతర్జాతీయంగా క్రూడ్ రేట్లు ఇంకా పెరిగితే దేశీయంగా ఇంధనాల రిటైల్ రేట్లు మరింతగా ఎగిసే అవకాశం ఉంది. క్రూడ్ సెగకు కరిగిన రూపాయి 19 పైసల పతనంతో 73 దిగువకు ముంబై: అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదల, దేశీయ మార్కెట్ల తాజా బలహీన దోరణి ఎఫెక్ట్ రూపాయిపై పడింది. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో శుక్రవారం డాలర్ మారకంలో రూపాయి విలువ 19 పైసలు బలహీనపడి 73.02కు బలహీనపడింది. ఫెడ్ ఫండ్ రేటు (ప్రస్తుతం 0.00–0.25 శాతం శ్రేణి) మరింత తగ్గబోదని అమెరికా సెంట్రల్ బ్యాంక్- ఫెడ్ చైర్మన్ పావెల్ సంకేతాలు ఇచ్చారన్న విశ్లేషణలు, దీనితో ఇక ఈజీ మనీకి ముగింపు పలికినట్లేనన్న అంచనాలు, వ్యాక్సినేషన్ నేపథ్యంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధి సంకేతాల నేపథ్యంలో డాలర్ ఇండెక్స్ మూడు నెలల గరిష్టానికి (91.94) చేరింది. -
సెంచరీ కొట్టిన పెట్రోల్ ధరలు!
సాక్షి, ముంబై: పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు వరుసగా ఆరో రోజు కూడా కొనసాగుతోంది. ఈ ధరలతో సామాన్య ప్రజల జోబులకు చిల్లు పడుతున్నాయి. పెట్రోల్ ధరలు రోజు రోజూ పెరగడంతో నిత్యావసర ధరలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. గత మంగళవారం నుంచి పరుగు తీస్తున్న ధరలు ఆదివారం కూడా అదే స్థాయిలో పెరిగాయి. వివిధ నగరాల్లో పెట్రోల్ పై 25 నుంచి 50 పైసలు, డీజిల్పై 30 పైసల నుంచి రూ.50 పైసల మేర పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయించాయి. దీంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. మహారాష్ట్రలోని పర్భని జిల్లాలో మాత్రం అప్పుడే పెట్రోల్ ధర సెంచరీ కొట్టేసింది. ఎక్స్ట్రా ప్రీమియం పెట్రోల్ ధర రూ.100 దాటినట్లు పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ సభ్యుడు ఒకరు తెలిపారు. సాధారణ పెట్రోల్ ధర రూ. 97.38గా ఉంది. అదే ముంబైలో పెట్రోల్ పై 28 పైసలు పెరగడంతో రూ.95.21కు చేరుకుంది. హైదరాబాద్ లో పెట్రోల్ పై 30 పైసలు, డీజిల్ పై 34 పైసలు పెరిగి లీటర్ పెట్రోల్ ధర రూ.92.26, డీజిల్ ధర రూ.86.23 చేరుకున్నాయి. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులు ఆధారంగా మారుతూ ఉంటాయి. చదవండి: ప్రపంచంలో చవకైన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం -
ధరల మంట- పెట్రోల్ @ఆల్టైమ్ హై
న్యూఢిల్లీ, సాక్షి: దాదాపు నెల రోజుల తదుపరి బుధవారం పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు తాజాగా మరోసారి బలపడ్డాయి. విదేశీ మార్కెట్లలో ముడిచమురు ధరలు మండుతుండటంతో ఇంధన రంగ పీఎస్యూలు ధరలను వరుసగా రెండో రోజు పెంచాయి. లీటర్ పెట్రోల్పై తాజాగా 23 పైసలు, డీజిల్పై 26 పైసలు చొప్పున పెంచాయి. బుధవారం సైతం లీటర్ పెట్రోల్ ధరను 26 పైసలు, డీజిల్ ధరను 25 పైసలు చొప్పున పెంచాయి. దీంతో ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 84.20ను తాకింది. డీజిల్ రూ. 74.38కు చేరింది. ఇంతక్రితం 2018 అక్టోబర్లో పెట్రోల్ ధర గరిష్టంగా రూ. 84కు ఎగసింది. ఇది ఆల్టైమ్ గరిష్టం కాగా.. ప్రస్తుతం ఈ స్థాయిని ధరలు అధిగమించడం గమనార్హం. ఇక డీజిల్ ధరలైతే 2018 అక్టోబర్ 4న లీటర్కు రూ. 75.45 వరకూ ఎగసింది. కాగా.. 2020 మే నెల నుంచి చూస్తే.. పెట్రోల్ ధరలు లీటర్కు రూ. 14.51 పుంజుకోగా.. డీజిల్ ధర రూ. 12.09 ఎగసింది. ఇదే విధంగా దేశంలోని ఇతర ప్రాంతాలలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నట్లు పెట్రోలియం వర్గాలు ప్రస్తావించాయి. (కొత్త కారు కొనాలా? 10 నెలలు ఆగాల్సిందే!) ముంబైలో మరింత దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో ఇంధన ధరల సంగతి చూస్తే.. ముంబైలో తాజాగా లీటర్ పెట్రోల్ రూ. 90.83ను తాకగా.. డీజిల్ రూ. 81.07కు చేరింది. చెన్పైలో పెట్రోల్ రూ. 86.96కు, డీజిల్ రూ. 79.72కు చేరాయి. కోల్కతాలో పెట్రోల్ రూ. 85.68 వద్ద, డీజిల్ రూ. 77.97 వద్ద విక్రయమవుతోంది. (మళ్లీ మండుతున్న చమురు ధరలు) విదేశీ ఎఫెక్ట్ విదేశీ మార్కెట్లో గత రెండు రోజుల్లో దాదాపు 6 శాతం జంప్చేసిన ముడిచమురు ధరలు మరోసారి బలపడ్డాయి. ప్రస్తుతం న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ బ్యారల్ 0.85 శాతం పుంజుకుని 51 డాలర్లను అధిగమించింది. ప్రపంచంలో అత్యధికంగా వినియోగించే బ్రెంట్ చమురు సైతం బ్యారల్ 0.7 శాతం ఎగసి 54.67 డాలర్లకు చేరింది. వెరసి 2020 ఫిబ్రవరి 24 తదుపరి చమురు ధరలు గరిష్టాలను తాకాయి. దీంతో దేశీయంగానూ పెట్రోల్, డీజిల్ ఉత్పత్తుల ధరలు మరింత పెరిగే వీలున్నట్లు ఇంధన రంగ నిపుణులు తెలియజేశారు. ఏం జరిగిందంటే? కోవిడ్-19 సెకండ్ వేవ్ సంక్షోభం నేపథ్యంలోనూ ఇతర ఒపెక్ దేశాలు యథావిధిగా ఉత్పత్తిని కొనసాగించేందుకు నిర్ణయించడంతో సౌదీ స్వచ్చందంగా రోజుకి 10 లక్షల బ్యారళ్లమేర ఉత్పత్తిలో కోత పెట్టేందుకు ముందుకువచ్చింది. ప్రపంచంలోనే అత్యధికంగా చమురును ఎగుమతి చేసే సౌదీ అరేబియా.. ఫిబ్రవరి, మార్చినెలల్లో కోతలను అమలు చేయనున్నట్లు ప్రకటించింది. అయితే వచ్చే రెండు నెలల్లో రష్యా, కజకిస్తాన్ సంయుక్తంగా రోజుకి 75,000 బ్యారళ్ల చొప్పున చమురు ఉత్పత్తిని పెంచేందుకు ఒపెక్ తదితర దేశాల మధ్య అంగీకారం కుదిరినట్లు ఇంధన వర్గాలు పేర్కొన్నాయి. నిజానికి రోజుకి 5 లక్షల బ్యారళ్లవరకూ ఉత్పత్తిని పెంచేందుకు రష్యాతదితర ఒపెక్ దేశాలు ప్రతిపాదించినట్లు తెలియజేశాయి. కాగా.. మరోవైపు జనవరి 1తో ముగిసిన వారానికల్లా చమురు నిల్వలు 1.7 మిలియన్ బ్యారళ్లమేర తగ్గి 491 మిలియన్ బ్యారళ్లకు చేరినట్లు యూఎస్ ఇంధన శాఖ వెల్లడించింది. ఈ అంశాల నేపథ్యంలో చమురు ధరలు బలపడినట్లు ఇంధన రంగ నిపుణులు తెలియజేశారు. -
మళ్లీ మండుతున్న చమురు ధరలు
న్యూఢిల్లీ, సాక్షి: విదేశీ మార్కెట్లలో మళ్లీ ముడిచమురు ధరలు మండుతున్నాయి. మంగళవారం దాదాపు 5 శాతం జంప్చేసిన ధరలు మరోసారి బలపడ్డాయి. ప్రస్తుతం న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ బ్యారల్ 0.2 శాతం పుంజుకుని 50 డాలర్లను అధిగమించింది. ప్రపంచంలో అత్యధికంగా వినియోగించే బ్రెంట్ చమురు సైతం బ్యారల్ 0.6 శాతం ఎగసి 53.94 డాలర్లకు చేరింది. వెరసి 2020 ఫిబ్రవరి 24 తదుపరి చమురు ధరలు గరిష్టాలను తాకాయి. దీంతో దేశీయంగానూ పెట్రోల్, డీజిల్ ఉత్పత్తుల ధరలు పెరిగే వీలున్నట్లు ఇంధన రంగ నిపుణులు తెలియజేశారు. (రూ. 51,500- రూ. 70,600 దాటేశాయ్) ఏం జరిగిందంటే? అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలకు మద్దతుగా ఒపెక్సహా రష్యావరకూ మూడేళ్లుగా ఉత్పత్తిలో కోతలను అమలు చేస్తున్నాయి. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు, ప్రపంచ ఆర్థిక మందగమనం, కోవిడ్-19 సంక్షోభం వంటి పరిస్థితుల కారణంగా చమురుకు డిమాండ్ తగ్గుతూ వస్తోంది. దీంతో ఉత్పత్తిని నియంత్రించడం ద్వారా ధరలకు నిలకడను తీసుకువచ్చేందుకు చమురు ఉత్పత్తి, ఎగుమతుల దేశాలు ప్రయత్రిస్తున్నాయి. ఈ బాటలో 2017 జనవరి నుంచి చమురు ఉత్పత్తిలో కోతలను అమలు చేస్తున్నాయి. అయితే తాజాగా రెండు రోజులపాటు నిర్వహించిన వర్చువల్ సమావేశంలో సౌదీ అరేబియా అదనపు కోతలకు సిద్ధమని తెలియజేసింది. (రియల్టీ రంగానికి స్టీల్ షాక్) రోజుకి 10 లక్షల బ్యారళ్లు కోవిడ్-19 సెకండ్ వేవ్ సంక్షోభం నేపథ్యంలోనూ ఇతర ఒపెక్ దేశాలు యథావిధిగా ఉత్పత్తిని కొనసాగించేందుకు నిర్ణయించడంతో సౌదీ స్వచ్చందంగా రోజుకి 10 లక్షల బ్యారళ్లమేర ఉత్పత్తిలో కోత పెట్టేందుకు ముందుకువచ్చింది. ప్రపంచంలోనే అత్యధికంగా చమురును ఎగుమతి చేసే సౌదీ అరేబియా.. ఫిబ్రవరి, మార్చినెలల్లో కోతలను అమలు చేయనున్నట్లు ప్రకటించింది. అయితే వచ్చే రెండు నెలల్లో రష్యా, కజకిస్తాన్ సంయుక్తంగా రోజుకి 75,000 బ్యారళ్ల చొప్పున చమురు ఉత్పత్తిని పెంచేందుకు ఒపెక్ తదితర దేశాల మధ్య అంగీకారం కుదిరినట్లు ఇంధన వర్గాలు పేర్కొన్నాయి. నిజానికి రోజుకి 5 లక్షల బ్యారళ్లవరకూ ఉత్పత్తిని పెంచేందుకు రష్యాతదితర ఒపెక్ దేశాలు ప్రతిపాదించినట్లు తెలియజేశాయి. కాగా.. మరోవైపు జనవరి 1తో ముగిసిన వారానికల్లా చమురు నిల్వలు 1.7 మిలియన్ బ్యారళ్లమేర తగ్గి 491 మిలియన్ బ్యారళ్లకు చేరినట్లు యూఎస్ ఇంధన శాఖ వెల్లడించింది. ఈ అంశాల నేపథ్యంలో చమురు ధరలు బలపడినట్లు ఇంధన రంగ నిపుణులు తెలియజేశారు. -
రివైండ్ 2020: ఢామ్.. జూమ్
2020... వస్తూవస్తూనే ‘కరోనా’ సునామీతో ప్రపంచానికి ‘మాస్క్‘ పడింది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రజల జీవితాలతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా చెల్లాచెదురైంది. వివిధ దేశాల ఎకానమీలు మైనస్లలోకి జారిపోయి చరిత్రలో ఎన్నడూచూడని పతనాన్ని చవిచూశాయి. భారత్ జీడీపీ ఏకంగా 23.9 శాతం (క్యూ1లో) క్షీణించింది. కరోనా కల్లోలంతో స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పాతాళానికి పడిపోయినప్పటికీ.. మళ్లీ అంతేవేగంగా కోలుకొని, ఆకాశమే హద్దుగా దూసుకుపోయాయి. సెన్సెక్స్ మార్చిలో 25,638 పాయింట్ల కనిష్టానికి కుప్పకూలి... కొద్ది నెలల్లోనే కొత్త రికార్డులను బద్దలు కొట్టింది. మరోపక్క, ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో బంగారం భగ్గుమంది. భారత్లో తులం ధర రూ.55 వేల పైకి ఎగబాకింది. ముడి చమురు ధర చరిత్రలో తొలిసారిగా మైనస్లోకి జారిపోయింది. ఇక కరోనాతో దేశీయంగా పర్యాటకం, విమానయానం తదితర రంగాలు తీవ్రంగా దెబ్బతిని, భారీగా ఉద్యోగాల కోతకు దారితీసింది. అసలే మొండిబాకీలతో నెట్టుకొస్తున్న బ్యాంకింగ్ రంగం పరిస్థితి పెనంమీంచి పొయ్యిలో పడినట్లయింది. పీఎంసీ, లక్ష్మీ విలాస్ బ్యాంకులు కుప్పకూలాయి. లాక్డౌన్ల కారణంగా వాహన రంగంలో ఎన్నడూలేని విధంగా సున్నా అమ్మకాలు నమోదయ్యాయి. మోదీ సర్కారు ‘ఆత్మనిర్భర్’ రూపంలో దాదాపు రూ. 29 లక్షల కోట్లకు పైగా ప్యాకేజీని ప్రకటించి ఎకానమీకి దన్నుగా నిలిచింది. ఆర్బీఐ కూడా వడ్డీరేట్లను అట్టడుగుకు దించేసింది. ఇంత కల్లోలంలోనూ ముకేశ్ అంబానీ నిధుల స్వారీ చేశారు. ఫేస్బుక్, గూగుల్, ఇంటెల్ ఇలా ఒకటేమిటి ప్రపంచాన్ని శాసిస్తున్న అనేక దిగ్గజ కంపెనీలన్నీ రిలయన్స్ జియో, రిటైల్లలో కోట్లాది డాలర్లు కుమ్మరించేందుకు క్యూ కట్టడం విశేషం. కరోనా పుణ్యమా అని సామాన్యుల నుంచి కార్పొరేట్ల దాకా అంతా డిజిటల్ బాట పట్టారు. వర్చువల్, ఆన్లైన్ అనేవి జీవితంలో భాగమైపోయాయి. ఇలా ఒక రోలర్ కోస్టర్ రైడ్లా సాగిన ఈ ‘కరోనా’నామ సంవత్సరంలో వ్యాపార రంగంలో చోటు చేసుకున్న పరిణామాలపై ‘సాక్షి బిజినెస్’ రివైండ్ ఇది... మార్కెట్ ఉద్దీపనల అండ! ఈ ఏడాది భారత స్టాక్ మార్కెట్ ప్రయాణం కరోనా విసిరిన సవాళ్లను అధిగమించి కొత్త శిఖరాల అధిరోహణ లక్ష్యంగా సాగింది. ఏడాది ప్రారంభంలో ఆర్థిక మందగమనం, కోవిడ్ భయాలతో సెన్సెక్స్, నిఫ్టీలు మార్చి 24న రెండేళ్ల కనిష్టానికి పతనమయ్యాయి. ద్వితీయార్థంలో ఉద్దీపనల అండ, ఆర్థిక వ్యవస్థ రికవరీ, కోవిడ్–19 వ్యాక్సిన్ ఆశలు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సహకారం అందడంతో రికార్డుల ర్యాలీ చేస్తున్నాయి. మరోవైపు కోవిడ్–19 వైరస్.... స్ట్రెయిన్ వైరస్గా రూపాంతరం చెంది ప్రపంచదేశాలను భయపెడుతుండటం ఈక్విటీ మార్కెట్లకు ఆందోళనను కలిగిస్తోంది. ఈ ఏడాది మొత్తం మీద సెన్సెక్స్ 6492 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 1814 పాయింట్లను ఆర్జించింది. లాక్డౌన్ విధింపు ప్రకటనతో మార్చి 23న సెన్సెక్స్, నిఫ్టీలు తమ జీవితకాలంలోనే అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. ట్రేడింగ్ ప్రారంభంలో ఇరు సూచీలు 10 శాతం పతనమవడంతో సర్క్యూట్ నిబంధల ప్రకారం ట్రేడింగ్ను 45 నిమిషాలు నిలిపేశారు. తర్వాత ట్రేడింగ్ ప్రారంభమైనా అమ్మకాలు ఆగకపోవడంతో సెన్సెక్స్ 3,935 పాయింట్లు, నిఫ్టీ 1,135 పాయింట్ల నష్టంతో ముగిశాయి. ఇక ఏప్రిల్ 7న సూచీలు ఒక్కరోజులో రికార్డు లాభాల్ని ఆర్జించాయి. ఈ ఒక్కరోజే సెన్సెక్స్ 2,476 పాయింట్లు, నిఫ్టీ 1,135 పాయింట్లను ఆర్జించాయి. సూచీ ఏడాది కనిష్టస్థాయి ఏడాది గరిష్టస్థాయి సెన్సెక్స్ 25,638 (మార్చి 24న) 47,807(డిసెంబర్ 30) నిఫ్టీ 7511 (మార్చి 24న) 13,997(డిసెంబర్ 30) ఎకానమీ మాంద్యం కోరలు... భారత ఆర్థిక వ్యవస్థను కరోనా వైరస్ గట్టి దెబ్బ కొట్టడంతో దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యం కోరల్లోకి వెళ్లింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ఏకంగా మైనస్ 23.9 శాతానికి పడిపోయింది. అయితే లాక్డౌన్ ఆంక్షలు సడలింపుసహా ఎకానమీ కోలుకునేందుకు కేంద్రం, ఆర్బీఐలు తీసుకున్న ఉద్దీపన చర్యలతో రెండో త్రైమాసికానికి వ్యవస్థ కాస్త రికవరీని సాధించింది. క్షీణత మైనస్ 7.5 శాతానికి పరిమితమైంది. కేంద్రం అండ ఆత్మ నిర్భర్ అభియాన్ కరోనా కుదేలైన ఆర్థిక వ్యవస్థ, పరిశ్రమలకు భరోసానిస్తూ కేంద్రం ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పథకం ద్వారా అభయమిచ్చింది. కోవిడ్ సంక్షోభం నాటి నుంచి ఈ ఏడాదిలో కేంద్రం, ఆర్బీఐలు సంయుక్తంగా మొత్తం రూ.29.87 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపనలను ప్రకటించాయి. జీడీపీలో 10 శాతం ఉంటుందని అంచనా. ల్యాండ్, లేబర్æ, లిక్విడిటీ, లా వీటిపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు కేంద్రం చెప్పుకొచ్చింది. ముఖ్యంగా సూక్ష్మ, స్థూల, మధ్య తరగతి పరిశ్రమకు ఎలాంటి షరతులు లేకుండా రుణాలు మంజూరు చేయడంలాంటి ఎన్నో బృహత్కర కార్యక్రమాలు ఇందులో ఉన్నాయి. బ్యాంకింగ్ కుదుపులు యస్ బ్యాంక్, లక్ష్మీవిలాస్ బ్యాంకు, పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంక్(పీఎంసీ) ఉదంతాలతో ఈ ఏడాది భారత బ్యాంకింగ్ రంగం భారీగా కుదుపులకు లోనైంది. లక్ష్మీవిలాస్ బ్యాంకు ఆర్థిక పరిస్థితి బాగుండకపోవడంతో సింగపూర్కు చెందిన డీబీఎస్ బ్యాంకులో విలీనమైంది. హెచ్డీఐఎల్కు రుణాలను జారీ చేయడంలో అక్రమాలకు తెరతీయడంతో మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంక్ ఆర్బీఐ చేతుల్లోకి వెళ్లిపోయింది. అలాగే నిరర్థక ఆస్తులు పెరిగిపోయి నష్టాల ఊబిలో కూరుకుపోయిన యస్ బ్యాంక్ను రక్షించేందుకు ఆర్బీఐ ఆ బ్యాంక్లోని 49 శాతం షేర్లను ‘ఎస్బీఐ’ చేత కొనుగోలు చేయించింది. ఇక బ్యాంకింగ్లో మొండి బకాయిల తీవ్రత కొనసాగుతోంది. ఆర్బీఐ పాలసీ భరోసా కరోనాతో కష్టాలపాలైన ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు ఈ ఏడాదిలో ఆర్బీఐ ద్రవ్యపాలసీ కమిటీ వడ్డీరేట్లను గణనీయంగా తగ్గించింది. రెపోరేటును 115 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.15 శాతం నుంచి 4 శాతానికి పరిమితం చేసింది. అలాగే రివర్స్ రెపోరేటు 155 పాయింట్లను తగ్గించి 4.9 శాతం నుంచి 3.35 శాతానికి తీసుకొచ్చింది. ప్రతి ద్రవ్యపాలసీ సమీక్షలో సులభతరమైన విధానానికి కట్టుబడి ఉంటామని, ద్రవ్యోల్బణం దిగివస్తే, వడ్డీరేట్లపై మరింత కోత విధించేందుకు వెనకాడబోమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వ్యాఖ్యలు ఆర్థిక వ్యవస్థ రికవరీకి దన్నుగా నిలుస్తున్నాయి. విమానయానం కుదేలు కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా కేంద్రం విధించిన లాక్డౌన్తో దేశీయ విమానయాన రంగం పూర్తిగా డీలాపడింది. వైరస్ వ్యాప్తి నియంత్రణకు కేంద్రం మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమానాలను నిలిపివేసింది. మార్చి 25 నుంచి దేశీయ విమానాలపై ఆంక్షలను విధించింది. సర్వీసులన్నీ ఒక్కసారి స్తంభించిపోవడంతో విమానయాన కంపెనీలకు పైసా ఆదాయం లేకుండా పోయింది. పైపెచ్చు ఆకస్మిక నిర్ణయంతో విమానయాన సంస్థలు ప్రయాణికులు బుక్ చేసుకున్న ముందస్తు టికెట్ల సొమ్మును తిరిగి చెల్లించాల్సి వచ్చింది. దీంతో దేశీయ విమాన కంపెనీలు దివాలా దిశగా ప్రయాణించాయి. అన్లాక్ ప్రక్రియలో భాగంగా దేశీయ విమాన సర్వీసుల పునరుద్ధరణకు మే 25న అనుమతులు లభించాయి. అలాగే జూలై నుంచి ఆయా దేశాలతో పరస్పర ఒప్పందంతో కొన్ని దేశాలకు విమానాలు నడుస్తున్నాయి. అయితే విమానయాన కంపెనీలకు అధిక ఆదాయాలను ఇచ్చే అంతర్జాతీయ సర్వీసులపైన ఆంక్షల పర్వం కొనసాగుతోంది. కోవిడ్–19 వ్యాక్సిన్ రాకతో అన్ని సర్వీసులు పునరుద్ధరణ జరిగి విమానయాన రంగం తిరిగి గాడిలో పడుతుందని విశ్లేషకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆటోమొబైల్ కరోనా బ్రేకులు ఈ 2020 ఏడాదిలో ఆటో మొబైల్ పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. చరిత్రలోనే తొలిసారి ఒక నెల ఆటో అమ్మకాలు సున్నాగా నమోదయ్యాయి. దేశవ్యాప్త లాక్డౌన్తో ఉత్పత్తి పూర్తిగా స్తంభించడం, విక్రయాలకు బ్రేక్పడటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే ఉద్దీపన ప్యాకేజీలో ఆటో పరిశ్రమకు పెద్దపీట వేయడం, భారత్లో ఉత్పాదక సామర్థ్యాలను, ఎగుమతులను పెంచే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన అనుసంధాన ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకంలో ఎక్కువగా దెబ్బతిన్న ఆటోమొబైల్ పరిశ్రమకు గరిష్టంగా రూ.57,042 కోట్ల ప్రోత్సాహకాలు లభించనుండటంతో చివరి రెండు క్వార్టర్ల నుంచి ఆటోపరిశ్రమ వీ–ఆకారపు రికవరీని సాధిస్తోంది. రికవరీ స్పీడ్పై ఈ రంగం ఆధారపడి ఉంది. ఫోన్లు స్మార్ట్...స్మార్ట్ స్మార్ట్ఫోన్ల కంపెనీలకు ఈ 2020 ఏడాది కలిసొచ్చింది. ఏడాది ప్రథమార్ధంలో స్మార్ట్ఫోన్ల అమ్మకాలు ఆశించినస్థాయిలో నమోదుకాలేదు. అయితే చివరి రెండు క్వార్టర్ల నుంచి విక్రయాలు ఊపందుకున్నాయి. ఈ ఏడాదిలో మొత్తం స్మార్ట్ఫోన్ అమ్మకాలు 15 కోట్లను దాటినట్లు గణాంకాలు చెబుతున్నాయి. సరిహద్దు వివాదాలు, కరోనా వైరస్ సృష్టికి కారణమైందనే వాదనల నేపథ్యంలో చైనా ఫోన్లపై బ్యాన్ నినాదంతో దేశంలో మొదటిసారి చైనా ఫోన్ల అమ్మకాలు రెండోస్థానానికి దిగివచ్చాయి. దీంతో దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ కంపెనీ అమ్మకాల్లో ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. రిలయన్స్ అప్పు లేదు కరోనాతో ఎకానమీ కకావికలమైన తరుణంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రం ఈ ఏడాదిలో వరుస పెట్టుబడులతో కలకలలాడింది. గూగుల్, ఫేస్బుక్, సిల్వర్లేక్ వంటి దిగ్గజ కంపెనీలకు జియో ప్లాట్ఫామ్లో 33 శాతం వాటాను విక్రయించి రూ.1.52 లక్షల కోట్లను చేకూర్చుకుంది. అలాగే రైట్స్ ఇష్యూ చేపట్టి అదనంగా రూ.53 వేల కోట్లను సమీకరించింది. తన మరో అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్నూ 10 శాతం వాటాను విక్రయించి రూ.47 వేల కోట్లను సమకూర్చుకుంది. వాటా విక్రయాలు, ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులతో ఆర్ఐఎల్ రుణ రహిత కంపెనీగా అవతరించింది. కంపెనీలోకి వెల్లువలా పెట్టుబడులు రావడంతో కంపెనీ షేరు సైతం ఈ 2020లో 35 శాతం ర్యాలీ చేసింది. ఈ ఏడాదిలో సెప్టెంబర్ 16న రూ.2,369 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. రూపాయి ఒడిదుడుకులు భారత ఈక్విటీల్లోకి విదేశీ పెట్టుబడులు రికార్డు స్థాయిలో వెల్లువెత్తినా ఈ ఏడాది డాలర్ మారకంలో రూపాయి బలపడలేకపోయింది. స్టాక్ మార్కెట్ పతనం వేళలో ఆర్బీఐ స్పాట్ మార్కెట్ నుంచి అధిక మొత్తంలో డాలర్లను కొనుగోలు చేయడంతో రూపాయి విలువ బలహీనపడిందని అంచనా. అలాగే కరోనాతో ఆర్థిక కార్యకలాపాలు స్తంభించడం కూడా రూపాయిపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఈ ఏడాది డాలర్ మారకంలో రూపాయి విలువ గరిష్ట స్థాయి 70.73 గానూ, కనిష్ట స్థాయి 76.92 గానూ నమోదైంది. వెరసి ఈ ఏడాదిలో రూపాయి విలువ 6 రూపాయల రేంజ్లో కదలాడింది. క్రూడాయిల్ మైనస్లోకి ఈ ఏడాది క్రూడాయిల్ ధరలు ఏకంగా మైనస్ల్లోకి వెళ్లిన సంఘటన జరిగింది. ఏడాది ఆరంభంలో అంతర్జాతీయ ఆర్థిక మాంద్యంతో క్రూడాయిల్కు డిమాండ్ అంతంతగానే ఉంది. మరోవైపు చమురు ధరలపై ఆధిపత్యం కోసం సౌదీ– రష్యా దేశాలు ఒప్పంద పరిమితికి మించి క్రూడాయిల్ ఉత్పత్తి చేయడంతో నిల్వలు భారీగా పెరిగాయి. ఈ తరుణంలో కరోనా ప్రేరేపిత లాక్డౌన్ విధింపు క్రూడాయిల్ ధరలపై విరుచుకుపడింది. ఫలితంగా ఏప్రిల్ 21న నైమెక్స్ లైట్ స్వీట్ క్రూడ్ మే నెల ఫ్యూచర్ కాంట్రాక్ట్ బ్యారెల్ ధర తొలిసారి మైనస్లోకి వెళ్లిపోయింది. ఒక దశలో మైనస్ 40.32 డాలర్లకు చేరుకుంది. చివరికి 208 డాలర్లు నష్టపోయి మైనస్ 37.63 డాలర్ల వద్ద ముగిసింది. బంగారం @ రూ. 56,190 కరోనా వైరస్తో స్టాక్ మార్కెట్లు కుదేలవడం ఈ ఏడాది పసిడి ర్యాలీకి కలిసొచ్చింది. కోవిడ్–19 సంక్షోభ వేళ ఇన్వెస్టర్లు రక్షణాత్మక సాధనమైన బంగారంలో పెట్టుబడులకు మొగ్గుచూపారు. అలాగే ఆర్థికంగా చిన్నాభిన్నమైన వ్యవస్థను సరిదిద్దేందుకు పలు దేశాల కేంద్ర బ్యాంకులు సులభతర వడ్డీరేట్ల విధానానికి తెరతీయడం కూడా బంగారం ర్యాలీకి కలిసొచ్చింది. ప్రపంచమార్కెట్లో ఆగస్ట్ 7న ఔన్స్ పసిడి ధర అత్యధికంగా 2,089 డాలర్ల స్థాయిని అందుకుంది. ఇదే ఆగస్ట్ 8న దేశీయ ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.56,190 చేరుకుంది. మొత్తంగా పసిడి ధరలు ఏడాదిలో 20 శాతం పెరిగాయి. అయితే కోవిడ్ వ్యాక్సిన్ రాక, ఆర్థిక వ్యవస్థ పురోగతి నేపథ్యంలో బంగారం ధరలు ఏడాది ముగింపు సమయానికి కొంత దిగివచ్చాయి. వచ్చే ఏడాదిలో పసిడి నుంచి పెద్ద ర్యాలీ ఆశించకపోవడం మంచిదని బులియన్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
పెట్రోల్, డీజిల్ ధరలకు 11వ సారి రెక్కలు
న్యూఢిల్లీ, సాక్షి: రెండు రోజుల నిలకడ తదుపరి పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 17 పైసలు బలపడి రూ. 82.66కు చేరింది. డీజిల్ ధర సైతం లీటర్కు 19 పైసలు అధికమై రూ. 72.84ను తాకింది. ఇదేవిధంగా దేశంలోని ఇతర ప్రాంతాలలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు పన్నులు తదితరాల ఆధారంగా పెంపునకు లోనుకానున్నాయి. కాగా.. 48 రోజుల తదుపరి ఈ నెల 20న దేశీయంగా పెట్రోల్ ధరలకు రెక్కలొచ్చిన విషయం విదితమే. తదుపరి తాజా పెంపుతో కలిపి ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ 11సార్లు ధరలను పెంచడం గమనార్హం! దీంతో 11 రోజుల్లో పెట్రోల్ ధర లీటర్కు సగటున సుమారు రూ. 1.20 వరకూ పెరిగినట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇక డీజిల్ ధర అయితే మరింత అధికంగా లీటర్ రూ. 1.80 వరకూ ఎగసినట్లు తెలియజేశారు. చమురు జోరు ఫైజర్ వ్యాక్సిన్కు యూకే ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో విదేశీ మార్కెట్లో బుధవారం ముడి చమురు ధరలు దాదాపు 2 శాతం ఎగసాయి. ఈ బాటలో తాజాగా మరోసారి నామమాత్రంగా బలపడ్డాయి. ప్రస్తుతం న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ చమురు బ్యారల్ 45.30 డాలర్లకు చేరగా.. లండన్ మార్కెట్లో బ్రెంట్ బ్యారల్ 48.30 డాలర్లను తాకింది. వెరసి మార్చి తదుపరి చమురు ధరలు మరోసారి గరిష్టాలను తాకాయి. ఫలితంగా ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ వస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. విదేశీ మార్కెట్లలో ముడిచమురు ధరల ఆధారంగా దేశీయంగా పెట్రో ఉత్పత్తుల ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సవరిస్తుంటాయి. రెండు వారాల సగటు ధరలు, రూపాయి మారకం తదితర అంశాలు ఇందుకు పరిగణిస్తుంటాయి. డాలరుతో మారకంలో రూపాయి విలువ, దేశీయంగా పన్నులు తదితర పలు అంశాలు ఇండియన్ క్రూడ్ బాస్కెట్ ధరలను ప్రభావితం చేసే సంగతి తెలిసిందే. -
మళ్లీ చమురు ధరల సెగ
న్యూయార్క్: సెకండ్ వేవ్లో భాగంగా కోవిడ్-19 అమెరికా, యూరోపియన్ దేశాలను వణికిస్తుండటంతో పతన బాటలో సాగిన ముడిచమురు ధరలు మళ్లీ వేడి పుట్టిస్తున్నాయి. తాజాగా లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 44 డాలర్లను దాటేయగా.. న్యూయార్క్ మార్కెట్లోనూ నైమెక్స్ చమురు 42 డాలర్లకు చేరువైంది. ప్రస్తుతం నైమెక్స్ బ్యారల్ 1.3 శాతం బలపడి 41.90 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక బ్రెంట్ బ్యారల్ 1.2 శాతం ఎగసి 44.13 డాలర్లకు చేరింది. జో బైడెన్ అమెరికా ప్రెసిడెంట్ పదవిని చేపట్టనుండటం, వ్యాక్సిన్పై అంచనాలు వంటి అంశాల నేపథ్యంలో ముందురోజు సైతం చమురు ధరలు దాదాపు 3 శాతం చొప్పున జంప్చేశాయి. బ్రెంట్ 1.2 డాలర్లు పెరిగి 43.61 డాలర్ల వద్ద నిలవగా.. నైమెక్స్ బ్యారల్ 1 డాలరు పుంజుకుని 41.36 డాలర్ల వద్ద స్థిరపడింది. కారణాలివీ నవంబర్ 6తో ముగిసిన వారంలో ఇంధన నిల్వలు 5.147 మిలియన్ బ్యారళ్లకు చేరినట్లు అమెరికన్ పెట్రోలియం ఇన్స్టిట్యూట్ మంగళవారం వెల్లడించింది. ఇవి ఇంధన నిపుణులు వేసిన అంచనాల కంటే తక్కువకావడం గమనార్హం! దీనికితోడు తాజాగా అమెరికన్ ఫార్మా దిగ్గజం ఫైజర్ ఇంక్ కోవిడ్-19 కట్టడికి రూపొందించిన వ్యాక్సిన్ 90 శాతంపైగా విజయవంతమైనట్లు పేర్కొంది. దీంతో ఆర్థిక వ్యవస్థలు రికవరీ బాట పట్టడం ద్వారా తిరిగి చమురుకు డిమాండ్ పుంజుకోనుందన్న అంచనాలు బలపడుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కోవిడ్-19తో ఆర్థిక వ్యవస్థలు మందగిస్తుండటంతో చమురుకు డిమాండ్ క్షీణిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో 2021 జనవరి తదుపరి కూడా చమురు ఉత్పత్తిలో కోతలను కొనసాగించాలని ఒపెక్, రష్యా తదితర దేశాలు యోచిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. కొంతకాలంగా రష్యాసహా ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తిలో రోజుకి 7.7 మిలియన్ బ్యారళ్లమేర కోతలను అమలు చేస్తున్న విషయం విదితమే. ఈ సానుకూల వార్తలు చమురు ధరలకు జోష్నిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. -
లాక్డౌన్ల షాక్- జారుతున్న చమురు
సెకండ్ వేవ్లో భాగంగా అమెరికాసహా పలు యూరోపియన్ దేశాలను కోవిడ్-19 వణికిస్తుండటంతో ముడిచమురు ధరలు పతనమవుతున్నాయి. ఫలితంగా అక్టోబర్లో నైమెక్స్ చమురు ధరలు నికరంగా 11 శాతం పతనంకాగా.. బ్రెంట్ బ్యారల్ ధరలు సైతం 10 శాతం వెనకడుగు వేశాయి. ఈ బాటలో మరోసారి చమురు ఫ్యూచర్స్లో అమ్మకాలు వెల్తువెత్తుతున్నాయి. వివరాలు చూద్దాం.. 3.5 శాతం డౌన్ గత వారం భారీగా వెనకడుగు వేసిన ముడిచమురు ధరలు మళ్లీ పతన బాట పట్టాయి. ప్రస్తుతం న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ చమురు బ్యారల్ 3.7 శాతం నష్టంతో 34.48 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక లండన్ మార్కెట్లో బ్రెంట్ బ్యారల్ 3.25 శాతం క్షీణించి 36.72 డాలర్ల వద్ద కదులుతోంది. వెరసి ఐదు నెలల కనిష్టాలకు చేరాయి. కారణాలివీ కొద్ది రోజులుగా అమెరికాలో ఉన్నట్టుండి కోవిడ్-19 కేసులు పెరుగుతూ వచ్చాయి. ఇటీవల రికార్డ్ స్థాయిలో రోజుకి లక్ష కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు సెకండ్ వేవ్లో భాగంగా ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ తదితర యూరోపియన్ దేశాలలోనూ కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. దీంతో బ్రిటన్ తదితర దేశాలు పూర్తిస్థాయి లాక్డవున్లతోపాటు.. కఠిన ఆంక్షలను సైతం విధిస్తున్నాయి. దీంతో ఇటీవల ఏర్పడిన ఆర్థిక రివకరీ అంచనాలకు షాక్ తగిలింది. తిరిగి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంబారిన పడే అవకాశమున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ట్రేడర్లలో భయాలు వ్యాపించినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కోతలు కొనసాగవచ్చు చమురు ధరలకు బలాన్నిచ్చే బాటలో ఇప్పటికే రష్యాసహా ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తిలో కోతలను అమలు చేస్తున్న విషయంవిదితమే. కొంతకాలంగా ప్రపంచ చమురు ఉత్పత్తిలో రోజుకి 7.7 మిలియన్ బ్యారళ్లమేర కోతలను అమలు చేస్తున్నాయి. ఒప్పందం ప్రకారం ఉత్పత్తిలో కోతలు 2021 జనవరి వరకూ అమల్లో ఉంటాయి. ఇటీవల జనవరి నుంచి రోజుకి 2 మిలియన్ బ్యారళ్లమేర ఉత్పత్తిని పెంచేందుకు రష్యా, ఒపెక్ దేశాలు ప్రణాళికలు వేశాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే జనవరి తదుపరి కోతలను ఎత్తివేసే అవకాశంలేదని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ఆర్థిక మందగమన పరిస్థితుల కారణంగా చమురుకు డిమాండ్ క్షీణిస్తున్నదని, దీంతో కోతలను మరికొంతకాలంపాటు కొనసాగేందుకు నిర్ణయించే వీలున్నదని అభిప్రాయపడ్డాయి. చమురు ఉత్పత్తి, కోతల అంశాలపై చర్చించేందుకు ఈ నెల 30, డిసెంబర్ 1న ఒపెక్ దేశాలు సమావేశం కానున్నాయి. -
ముడిచమురుకూ కోవిడ్-19 సెగ
సెకండ్ వేవ్లో భాగంగా అమెరికాసహా పలు యూరోపియన్ దేశాలను కోవిడ్-19 వణికిస్తుండటంతో ముడిచమురు ధరలు పతనమవుతున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ కట్టడికి బ్రిటన్ లాక్డవున్ను ప్రకటించగా.. ఫ్రాన్స్, జర్మనీ సైతం కఠిన ఆంక్షలను విధించాయి. దీంతో ఇటీవల కొంతమేర రికవరీ బాట పట్టినట్లు కనిపిస్తున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరోసారి కుదేలయ్యే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా ముడిచమురు ఫ్యూచర్స్లో ట్రేడర్లు భారీ అమ్మకాలకు తెరతీసినట్లు తెలియజేశారు. వెరసి బుధవారం 5 శాతం పతనమైన బ్రెంట్, నైమెక్స్ చమురు ధరలు గురువారం తిరిగి అదే స్థాయిలో డీలాపడ్డాయి. దీంతో ఒక దశలో నైమెక్స్ బ్యారల్ 5.3 శాతం పతనమై 35.11 డాలర్లకు చేరింది. ఇది నాలుగు నెలల కనిష్టంకాగా.. బ్రెంట్ బ్యారల్ సైతం 5 శాతం క్షీణించి 36.89 డాలర్లను తాకింది. బ్రెంట్ ధరలైతే ఈ ఏడాది మే నెలలో మాత్రమే 37 డాలర్ల దిగువకు చేరినట్లు నిపుణులు పేర్కొన్నారు. వెరసి చమురు ధరలు మే, జూన్ స్థాయికి చేరాయి. ప్రస్తుతం ఓకే ప్రస్తుతం న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ చమురు బ్యారల్ 0.75 శాతం పుంజుకుని 36.43 డాలర్లకు చేరింది. ఈ బాటలో లండన్ మార్కెట్లో బ్రెంట్ బ్యారల్ సైతం 0.8 శాతం బలపడి 37.95 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. కారణాలివీ అక్టోబర్ 23తో ముగిసిన వారంలో ఇంధన నిల్వలు అంచనాలను మించుతూ 4.57 మిలియన్ బ్యారళ్లకు చేరినట్లు అమెరికన్ పెట్రోలియం ఇన్స్టిట్యూట్ పేర్కొంది. దీనికితోడు కోవిడ్-19 కారణంగా పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు మాంద్యం కోరల్లో చిక్కుకోవడంతో ఇటీవల కొంతకాలంగా చమురుకు డిమాండ్ క్షీణిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. గత వారం అమెరికా, రష్యా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ తదితర దేశాలలోనూ ఉన్నట్టుండి కోవిడ్-19 కేసులు పెరగడంతో సెంటిమెంటుకు షాక్ తగిలినట్లు విశ్లేషకులు తెలియజేశారు. కోతలు కొనసాగవచ్చు చమురు ధరలకు బలాన్నిచ్చే బాటలో ఇప్పటికే రష్యాసహా ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తిలో కోతలను అమలు చేస్తున్న విషయంవిదితమే. కొంతకాలంగా ప్రపంచ చమురు ఉత్పత్తిలో రోజుకి 7.7 మిలియన్ బ్యారళ్లమేర కోతలను అమలు చేస్తున్నాయి. ఒప్పందం ప్రకారం ఉత్పత్తిలో కోతలు 2021 జనవరి వరకూ అమల్లో ఉంటాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే జనవరి తదుపరి కోతలను ఎత్తివేసే అవకాశంలేదని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ఆర్థిక మందగమనం కారణంగా చమురుకు డిమాండ్ క్షీణిస్తున్నదని, దీంతో కోతలను మరికొంతకాలంపాటు కొనసాగేందుకు నిర్ణయించే వీలున్నదని అభిప్రాయపడ్డాయి. -
మార్కెట్ మళ్లీ లాభాల బాట...
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ మళ్లీ లాభాల పట్టాలెక్కింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ షేర్లకు భారీగా కొనుగోళ్ల మద్దతు లభించడంతో పాటు అంతర్జాతీయ సంకేతాలు కలిసిరావడం ఇందుకు కారణమైంది. సెన్సెక్స్ 449 పాయింట్లు పెరిగి.. తిరిగి 40 వేల పైన 40,432 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 111 పాయింట్లను ఆర్జించి 11,873 వద్ద ముగిసింది. ఈ ఏడాది చివరికల్లా కోవిడ్–19 వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చనే అంచనాలు ఇన్వెస్టర్లకు ఉత్సాహానిచ్చాయి. పడిపోయిన క్రూడాయిల్ ధరలు కూడా మన మార్కెట్కు కలిసొచ్చాయి. చిన్న, మధ్య తరహా షేర్ల కౌంటర్లలో కొనుగోళ్ల సందడి కనిపించింది. మరోవైపు అటో, ఐటీ, ఫార్మా రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఎఫ్ఐఐలు రూ.1656.78 కోట్ల షేర్లను కొనుగోలు చేయగా, డీఐఐలు రూ.1621.73 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ముఖ్యంగా అధిక వెయిటేజీ కలిగిన బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ షేర్లకు డిమాండ్ నెలకొనడం సూచీలకు కలిసొచ్చింది. పీఎస్యూ షేర్లకు బైబ్యాక్ బూస్టింగ్... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కోల్ ఇండియా, ఎన్టీపీసీ, ఎన్ఎమ్డీసీ, ఇంజనీరింగ్స్ ఇండియాతో సహా మొత్తం 8 కంపెనీలను బైబ్యాక్ ప్రక్రియను చేపట్టాల్సిందిగా కేంద్రం కోరినట్లు వచ్చిన వార్తలతో ఇంట్రాడేలో పీఎస్యూ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. గెయిల్ 4 శాతానికి పైగా లాభపడింది. కోల్ ఇండియా, ఎన్టీపీసీ షేర్లు 3 నుంచి 2 శాతంతో స్థిరపడ్డాయి. బీఎస్ఈలో పీఎస్యూ ఇండెక్స్ 2.50 శాతం లాభంతో ముగిసింది. ఎగసి‘పడిన’ హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేరు... మెరుగైన క్యూ2 ఫలితాల ప్రకటనతో భారీ లాభంతో మొదలైన హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేరు మార్కెట్ ముగిసేసరికి 0.35% స్వల్ప లాభంతో రూ.1203.55 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు... చైనా సెప్టెంబర్ క్వార్టర్ ఆర్థిక వృద్ధి గణాంకాలు అంచనాలకు మించి నమోదయ్యాయి. కరోనా పతనం నుంచి వేగంగా రికవరీని సాధిస్తూ ఈ త్రైమాసికపు ఆర్థిక వృద్ధి 4.9%గా నమోదైంది. ఫలితంగా సోమవారం ఆసియా మార్కెట్లు 1.5% పైగా లాభంతో ముగిశాయి. అయితే చిత్రంగా చైనా మార్కెట్ అరశాతం నష్టపోయింది. -
మూడు నెలల గరిష్టానికి చమురు
బుధవారం చమురు ధరలు మూడు నెలల గరిష్టానికి చేరాయి. కోవిడ్ మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం నెమ్మదిగా కోలుకుంటుండడం, ప్రధాన ఆయిల్ ఉత్పత్తి దారులు ప్రొడక్షన్లో కోతవిధిస్తారని ఇన్వెస్టర్లు భావిస్తుండడంతో చమురు ధరలు మూడు నెలల గరిష్ట స్థాయికి పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ 1 శాతం పెరిగి 39.79 డాలర్ల ట్రేడ్ అవుతోంది.మార్చి 6 తరువాత ఇది గరిష్టం కాగా, నిన్న(మంగళవారం) 3.3శాతం పెరిగింది.అమెరికా టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్(డబ్ల్యూటీఐ) కూడా 1 శాతం పెరిగి 37.14 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. మార్చి6 తరువాత గరిష్టస్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి. కాగా డబ్ల్యూటీఐ మంగళవారం 4 శాతం పెరిగింది. వైరస్ పుట్టిన చైనాలో పరిశ్రమలు తిరిగి తెరుచుకోవడంతో బెంచ్మార్క్లు ఏప్రిల్ కనిష్టాలనుంచి పుంజుకుని రెండు వారాలుగా ర్యాలీ చేస్తున్నాయి. ఇతర ఆర్థిక వ్యవస్థలు సైతం నెమ్మదిగా ప్రారంభమతున్నాయి .దీంతో ఆయిల్కు డిమాండ్ పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్సోపోర్టింగ్ కంట్రీస్(ఒపెక్), రష్యాలు ప్రపంచ ఉత్పత్తిలో 10 శాతానికి సమానమై రోజుకి 9.7 మిలియన్ల బ్యారెల్ ఉత్పత్తి కోతను జూలై, ఆగస్టు వరకు పొడిగించవచ్చని తెలుస్తోంది. క్రూడ్ ఉత్పత్తిలో కోతలపై ఒపెక్తో పాటు వివిధ దేశాలు గురువారం ఆన్లైన్ సమావేశాన్ని నిర్వహించనున్నాయి. ప్రస్తుతం ఉత్పత్తి కోతలు మే నుంచి జూన్ వరకు కొనసాగే అవకాశం ఉంది. జూలై నుంచి డిసెంబర్ మధ్యలో కోతలను 7.7 మిలియన్ల బీపీడి తగ్గించవచ్చని భావిస్తున్నారు. కానీ సౌదీ అరేబియా మాత్రం మరికొంత ఎక్కువ కాలం కోత విధించాలని భావిస్తోంది. -
నాలుగోరోజూ చమురు జోరు!
మంగళవారం కూడా అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరిగాయి. ఉత్పత్తిదారులు చమురు ఉత్పత్తిలో మరిన్ని కోతలు విధించే ఛాన్సులున్నాయన్న వార్తలు, కరోనా కారక లాక్డౌన్ క్రమంగా దేశాలు ఎత్తివేయడంతో అంతర్జాతీయంగా డిమాండ్ ఊపందుకుకోవడం.. చమురు ధరలపై పాజిటివ్ ప్రభావం చూపాయి. దీంతో బ్రెంట్ క్రూడ్ ధర దాదాపు 2.4 శాతం లాభంతో 35.66 డాలర్ల వద్ద ఓపెనైంది. డబ్యు్లటీఐ క్రూడ్ దాదాపు 4 శాతం లాభపడింది. జూన్ కాంట్రాక్టులు ఈ మంగళవారం ఎక్స్పైరీ కానున్నాయి. గత నెల్లో జరిగినట్లు ఈ దఫా కూడా నెగిటివ్ జోన్లోకి ఫ్యూచర్లు జారతాయని కొందరు భయపడినా, అవి నిజం కాలేదు. ఒపెక్, రష్యాలు చమరు ఉత్పత్తిని తగ్గించేందుకు అంగీకరించిన సంకేతాలు వెలువడ్డాయి. ఈ దేశాలన్నీ తమ చమురు ఎగుమతులను మే మొదటి భాగంలో తగ్గించుకున్నాయి. తాజా కోతలతో క్రమంగా చమురుకు డిమాండ్ మరింత పెరగవచ్చన్న అంచనాలున్నాయి. దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పాజిటివ్గా మారిందని ఆయిల్ నిపుణులు విశ్లేషించారు. మరోవైపు యూఎస్ఉత్పత్తి కూడా తగ్గుతూ వస్తోంది. జూన్నాటికి యూఎస్ఉత్పత్తి 2018 కనిష్ఠాలకు వస్తుందని అంచనాలున్నాయి. దీంతో చమురు ధరలకు అప్మూవ్ చూపాయి. -
క్రూడ్ క్రాష్
-
మరింత పతనం, 8950 దిగువకు నిఫ్టీ
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి. ఆరంభ భారీ పతనంనుంచి ఏమాత్రం కోలుకోని సూచీలు మిడ్ సెషన్ నుంచి మరింత దిగజారాయి. అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్ 1264 పాయింట్లకు పైగా కుప్ప కూలగా, నిఫ్టీ 347 పాయింట్లు పతనమై 8911 వద్ద కొనసాగుతోంది. తద్వారా నిఫ్టీ 8950 స్థాయిని కూడా కోల్పోయింది. దాదాపు అన్ని రంగాల షేర్లు భారీ నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. కరోనా , లాక్ డౌన్ సంక్షోభాలతో అంతర్జాతీయముడి చమురు రికార్డు పతనాన్ని నమోదు చేయడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంటు దెబ్బతింది. దీనికి తోడు వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా ప్రకటనతో ఐటీ సెక్టార్లో తీవ్ర ఒత్తిడి నెలకొంది. కోవిడ్-19 సంక్షోభంతో అమెరికాలోకి వలసలను తాత్కాలికంగా నిలిపివేయాలని భావిస్తుండటంతో దాదాపు అన్ని ఐటీరంగ షేర్లు నష్టపోతున్నాయి. బ్యాంకింగ్ షేర్లు, మార్కెట్ హెవీ వెయిట్ షేర్లన్నీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. (సంక్షోభం : బాటిల్ కోక్ కంటే..చౌక) చదవండి : ఆల్ టైం కనిష్టానికి రూపాయి కరోనా : నడిచి..నడిచి..ఇంటికి చేరబోతుండగా -
సంక్షోభం : బాటిల్ కోక్ కంటే..చౌక
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికా ముడి చమురు ధరల రికార్డు పతనంపై నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కరోనా వైరస్ లాంటి మహమ్మారిని, చమురు ధరల్లో ఇంతటి పతనాన్ని తన జీవితం కాలంలో చూడాల్సి వస్తుందని ఊహించలేదని ట్వీట్ చేశారు. అంతేకాదు ఇపుడు కోక్ బాటిల్ కంటే.. చమురు చౌక అయి పోయిందని వ్యాఖ్యానించారు. (ముడి చమురు ధర రికార్డు పతనం) కాగా అమెరికా డబ్ల్యుటీఐ ముడి చమురు సోమవారం మైనస్ లోకి పడిపోయిన సంగతి తెలిసిందే. కరోనావైరస్ సంక్షోభం, లాక్డౌన్ సమయంలో భారీగా క్షీణించిన డిమాండ్, పేరుకు పోయిన చమురు నిల్వలతో ఉత్తర అమెరికా చమురు ఉత్పత్తిదారులు చమురు నిల్వ చేయడానికి స్థలం లేకుండా పోయింది. దీంతో అధిక మొత్తంలో చమురు తీసుకోవటానికి కొనుగోలుదారులకు చెల్లించవలసి వచ్చింది. ప్రస్తుతం కాస్త తెప్పరిల్లిన ముడి చమురు ప్రస్తుతం బ్యారెల్కు 1.450 డాలర్ల ధర వద్ద వుంది. (క్రూడ్ క్రాష్..) చదవండి : ఆల్ టైం కనిష్టానికి రూపాయి కరోనా : నడిచి..నడిచి..ఇంటికి చేరబోతుండగా History! Oil now cheaper than a bottle of coke ! Never imagined this crash & #Coronavirus would both happen in my lifetime. #OilPrices pic.twitter.com/XG1uUU6Tz9 — Amitabh Kant (@amitabhk87) April 20, 2020 -
ముడి చమురు ధర రికార్డు పతనం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కల్లోలంతో ముడి చమురు ధరలు పాతాళానికి పడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ నేపథ్యంలో ముడిచమురు నిల్వలు పేరుకుపోతున్నాయి. ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుతున్న అంచనాల నేపథ్యంలో అమెరికా మార్కెట్లో ముడి చమురు ధరలు తొలిసారిగా ప్రపంచ చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయిలో మైనస్లోకి వెళ్లిపోయాయి. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర ఏకంగా మైనస్ 38 శాతం కుప్పకూలింది. ఇలా జరగడం చరిత్రలో ఇదే మొదటిసారి. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఈ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కోలుకుని 1.10 డాలర్ల వద్ద ఉంది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూటీఐ) చమురు ధర (మే ఫ్యూచర్స్) గత శుక్రవారం ఒక్క బ్యారెల్కు 18.27 డాలర్ల వద్ద ముగిసింది. సోమవారం ఒక దశలో 220 శాతం (40 డాలర్లకు) పైగా నష్టంతో మైనస్ 28 డాలర్లకు పడిపోయింది. న్యూయార్క్ మర్కంటైల్ ఎక్స్చేంజ్లో డబ్ల్యూటీఐ చమురు 1983 ఏప్రిల్ నుంచి ట్రేడవడం మొదలైంది. అప్పటి నుంచి చూస్తే, ఇదే అత్యధిక కనిష్ట ధర. కాగా జూన్ డబ్ల్యూటీఐ కాంట్రాక్ట్ ఫ్యూచర్స్ మాత్రం 22.25 బ్యారెల్ వద్ద ట్రేడ్ అవుతోంది. మే, జూన్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ల ధరల తేడా (స్ప్రెడ్) భారీగా (40 డాలర్లకు మించి) ఉండటం విశేషం. రెండు వరుస నెలల ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ల ధరల తేడా ఈ రేంజ్లో ఉండటం చరిత్రలో ఇదే మొదటిసారి. మే డబ్ల్యూటీఐ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్లు నేడు(మంగళవారం) ఎక్స్పైర్ అవుతాయి. ఇక బ్రెంట్ క్రూడ్ 6 శాతం(1.76 డాలర్లు) క్షీణించి 26.32 డాలర్లకు చేరింది. (ఆయిల్ దెబ్బ, మార్కెట్ల పతనం) కాగా ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్, లాక్డౌన్ నేపథ్యంలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోయింది. దీంతో డిమాండ్ భారీగా క్షీణించి, నిల్వలు పేరుకు పోతూ వచ్చాయి. దీనికితోడు సౌదీ అరేబియా , రష్యా మధ్య ధరల యుద్ధం కారణంగా ఈ సంక్షోభం మరింత తీవ్రమైంది. ఈ నెల ప్రారంభంలో రోజుకు దాదాపు 10 మిలియన్ బారెల్స్ ఉత్పత్తిని తగ్గించే ఒప్పందం కుదుర్చుకోవడంతో కాస్త ఈ వివాదం సద్దుమణిగాయి. అయితే లాక్డౌన్పరిస్థితులు కొనసాగుతున్న తరుణంలో డిమాండ్ ఏ మాత్రం పుంజుకోక, చమురు సంస్థలు మిగులు సరఫరాను నిల్వ చేయడానికి ట్యాంకర్లను అద్దెకు తీసుకుంటున్న పరిస్థితి. -
25 శాతంపైగా పెరిగిన క్రూడ్
క్రూడ్ ఆయిల్ బ్యారల్ ధర గురువారం 25 శాతం పైగా పెరిగింది. రష్యా–సౌదీ అరేబియా మధ్య నెలకొన్న ‘ప్రైస్వార్’ ఉపశమించే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నట్లు వచ్చిన వార్తలు దీనికి నేపథ్యం. రష్యా, సౌదీలు 10 మిలియన్ బ్యారల్స్ నుంచి 15 మిలియన్ బ్యారల్స్ వరకూ చమురు ఉత్పత్తి కోత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ట్రంప్ అంచనావేస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఒకేరోజు క్రూడ్ ఆయిల్ ఈ స్థాయిలో పెరగడం ఒక రికార్డు. ఈ వార్తరాసే 10 గంటల సమయంలో బ్రెంట్ క్రూడ్ బ్యారల్ ధర 23% లాభంతో 30.42 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో 35.99 డాలర్ల స్థాయినీ చూసింది. ఇక లైట్స్వీట్ నైమెక్స్ క్రూడ్ ధర 25 శాతం (4.5 డాలర్లు) లాభంతో 25 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా ఒక దశలో 27.30 డాలర్ల స్థాయినీ తాకింది. 40 డాలర్లకు పైగా పెరిగిన పసిడి... ఇకమరోవైపు పసిడి ఔన్స్ (31.1 గ్రా) ధర కూడా న్యూయార్క్ ప్యూచర్స్ మార్కెట్లో ఈ వార్తరాసే సమయానికి 44 డాలర్లు పెరిగి 1,635 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒకదశలో 1,637 డాలర్లను కూడా చూసింది. కరోనా ప్రభావం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలపై కొనసాగుతుందన్న అంచనాలు పసిడి పెరుగుదలకు నేపథ్యం. లాభాల్లో అమెరికా‘ఈక్విటీ’లు మరోవైపు అమెరికా స్టాక్ మార్కెట్లు ఈ వార్తరాసే 10 గంటల సమయంలో కొంత లాభాల్లో ఉండడం గమనార్హం. అయితే ఇది కేవలం షార్ట్ సెల్లింగ్ ప్రభావమని కొందరు విశ్లేషిస్తున్నారు. మార్కెట్లు బులిష్ ధోరణిలోకి వెళ్లే అవకాశం ఇప్పుడు కనబడ్డంలేదన్నది వారి అభిప్రాయం. -
చమురు ధరల పతనం భారత్కు వరం
న్యూఢిల్లీ: చమురు ధరల పతనం భారత ఆర్థిక వ్యవస్థకు ఎన్నో విధాలుగా కలిసొస్తుందని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్, బ్యాంకు ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ అభిప్రాయం వ్యక్తం చేశాయి. దేశ చమురు అవసరాల్లో 84 శాతం మేర దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో.. చమురు దిగుమతుల బిల్లు తగ్గడంతో కరెంటు ఖాతా లోటు (క్యాడ్), ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు తగ్గుముఖం పడతాయని, దీంతో అధిక జీడీపీ వృద్ధి రేటు సాధ్యపడుతుందని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ అంచనా వేసింది. ధరల స్థిరత్వానికి వీలుగా ఉత్పత్తికి కోత విధించే విషయంలో రష్యా, సౌదీ అరేబియా మధ్య విభేదాలు తలెత్తడంతో.. సౌదీ అరేబియా ఏకపక్షంగా ధరలను తగ్గించడం ఫలితంగా బ్యారెల్ చమురు 30 డాలర్లకు పడిపోయిన విషయం గమనార్హం. ఇక అదే సమయంలో ఓపెక్ దేశాలకు, రష్యా తదితర నాన్ ఓపెక్ దేశాల మధ్య ఉత్పత్తి కోతకు సంబంధించిన అంగీకార గడువు మార్చిలో గడువు తీరిపోనుంది. దీంతో రోజువారీ ఉత్పత్తి 10 మిలియన్ బ్యారెళ్లకు చేరుతుందని అనలిస్టులు భావిస్తున్నారు. ముఖ్యంగా కరోనా వైరస్ ప్రభావంతో ప్రనపంచవ్యాప్తంగా చమురుకు డిమాండ్ తగ్గుతుండడం కూడా ధరలపై ప్రభావం చూపిస్తోంది. ‘‘చమురు ధర బ్యారెల్పై ప్రతీ 10 డాలర్ల పతనంతో 15 బిలియన్ డాలర్లు ఆదా అవుతుంది. ఇది జీడీపీలో క్యాడ్ 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గేలా చేస్తుంది’’ అని కోటక్ తన నివేదికలో పేర్కొంది. దేశం నుంచి జరిగే ఎగుమతుల విలువ కంటే దిగుమతుల విలువ ఎక్కువగా ఉండడాన్ని క్యాడ్గా పేర్కొంటారు. ఈ రంగాలకు మేలు చమురు ధరలు తగ్గడం ఆటోమొబైల్స్, విమానయానం, రంగుల పరిశ్రమ, కన్జ్యూమర్ కంపెనీలు, సిటీ గ్యాస్ పంపిణీ సంస్థలు, చమురు విక్రయ సంస్థలకు కలసిసొస్తుందని కోటక్ తెలిపింది. కానీ, చమురు బ్యారెల్కు 35 డాలర్లకు దిగువన ఉంటే ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాకు నికర నష్టాలు ఎదురవుతాయని అంచనా వేసింది. క్యాడ్ 0.7 శాతానికి తగ్గుతుంది చమురు ధరల పతనంతో 2020–21 ఆర్థిక సంవత్సరంలో కరెంటు ఖాతా లోటు 25 బేసిస్ పాయింట్లు తగ్గి జీడీపీలో 0.7 శాతానికి పరిమితం అవుతుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ అంచనా వేసింది. కరోనా వైరస్ జనవరిలో వెలుగు చూసిన తర్వాత నుంచి చమురు ధరలు 45 శాతం వరకు క్షీణించాయి. 2020–21 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 0.20 శాతం తగ్గించి 5.4 శాతానికి సవరించింది. ప్రపంచ వృద్ధి రేటు అంచనాలకు 0.60 శాతం కోత పెట్టి తాజాగా 2.2 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. ఒకవేళ అంతర్జాతీయ మాంద్యం ఏర్పడితే ప్రపంచ వృద్ధి రేటు 1.4 శాతానికి, భారత జీడీపీ వృద్ధి రేటు 4.4 శాతానికి తగ్గొచ్చని బ్యాంకు ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ అభిప్రాయపడింది. -
పతనం తెచ్చిన సదవకాశం
ప్రపంచమంతటా విస్తరిస్తున్న కరోనా వైరస్తో ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలవుతున్న తరుణంలో పులి మీద పుట్రలా ముడి చమురు ధరలు ఒక్కసారిగా పతనం కావడంతో స్టాక్ మార్కెట్లన్నీ కకావికలయ్యాయి. మహా మహా చమురు కంపెనీల షేర్ల ధరలు 15 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి. రూపాయి విలువ 17 నెలల కనిష్ట స్థానానికి క్షీణించింది. చమురు ఉత్పత్తిలో రెండు, మూడు స్థానాల్లోవున్న సౌదీ అరేబియా, రష్యాల వైరం పతాక స్థాయికి చేరుకోవడం, కరోనా విస్తృతి ప్రభావంతో చమురు వినియోగం తగ్గడం వంటి కారణాల పర్యవసానంగా ఈ పరిస్థితి ఏర్పడింది. 1991 గల్ఫ్ యుద్ధం తర్వాత ఈ స్థాయిలో ఒకేసారి చమురు ధరలు పతనం కావడం ఇదే మొదటి సారి. స్టాక్ మార్కెట్ల స్పందన మాటెలావున్నా, ప్రపంచ దేశాల కరెన్సీలు పల్టీలు కొట్టినా ఈ చమురు ధరల పతనం మనతో సహా పలు దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఎంతోకొంత మేలుతో పాటు సమస్యల్ని కూడా తెస్తుంది. మేలు చేకూర్చే అవకాశాల్ని వినియోగించుకోవడం, సమస్యల్ని అధిగమించడం ఇప్పుడు పెద్ద సవాలు. అయితే చమురు ధరలు ఇదే స్థాయిలో ఎన్నాళ్లుంటాయన్నది ప్రశ్నార్థకమే. అంతర్జాతీయ మార్కెట్ ధరలకనుగుణంగా పెట్రో ధరలు తగ్గిస్తే సామాన్యులపై పడిన భారం కాస్తంత ఉపశమిస్తుంది. విదేశీ మారకద్రవ్య నిల్వల లోటు భర్తీకి అవకాశం ఏర్పడుతుంది. ద్రవ్య లోటును తగ్గించుకోవచ్చు. ఆరేళ్లక్రితం షేల్ ఆయిల్తో చమురు రంగంలోకి దిగిన అమెరికా స్వల్పకాలంలోనే అగ్రజుడిగా ఎదిగి ప్రపంచ చమురు మార్కెట్నే శాసించే స్థాయికి చేరుకుంది. తమ భూభాగంలో భూమికి ఆరువేల అడుగుల లోతున నాపరాయి రాతిపొరల్లో చమురు నిల్వలు అపారంగా విస్తరించివున్నా యని, దీన్నంతటినీ రాగల 50 ఏళ్లపాటు అవిచ్ఛిన్నంగా వినియోగించుకుని ఇంధన రంగంలో ఏకచ్ఛత్రాధిపత్యం నెలకొల్పవచ్చునని అమెరికా వేసిన అంచనాలో లోపమేమీ లేదు. రోజుకు 0.4 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తితో ప్రారంభించి ఇప్పుడు 40 లక్షల బ్యారెళ్ల చమురును ఉత్పత్తి చేసే దిగ్గజంగా మారింది. అప్పటివరకూ అది తన అవసరాల కోసం సౌదీ అరేబియా, రష్యాల వద్ద చమురు కొనేది. అంతక్రితం చమురు దిగుమతులపై ఆధారపడిన దేశం ఒక్కసారిగా ఎదగడమే కాదు... ఆ రంగంలో పాతుకుపోయి ఇష్టారాజ్యం కొనసాగిస్తున్న తమను సవాలు చేయడంపై ఆగ్ర హించి ఒక్కటైన దేశాలు పరస్పర విభేదాల్లో కూరుకుపోవడం తాజా సమస్యకు మూలం. తమకు ప్రధాన ప్రత్యర్థిగా మారిన అమెరికాను అదుపు చేయడమెలా అన్న అంశంలో ఇప్పుడు రష్యా, సౌదీలు వాదులాడుకుంటున్నాయి. అమెరికా కట్టడికి 15 దేశాలు సభ్యులుగా వున్న చమురు ఎగుమతి దేశాల సంస్థ(ఒపెక్)తో చేతులు కలుపుతానని, ఆ సంస్థ నిర్ణయాలకు అనుగుణంగా వ్యవహరిస్తానని మూడేళ్లక్రితం రష్యా హామీ ఇచ్చింది. అలాగని ఒపెక్లో దానికి సభ్యత్వం లేదు. కానీ గత వారం వియన్నాలో జరిగిన ఒపెక్ దేశాల సమావేశంలో సభ్య దేశాలన్నీ రోజుకు పది లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి తగ్గించుకోవాలని సౌదీ అరేబియా చేసిన ప్రతిపాదన దానికి రుచించలేదు. చమురును దిగుమతి చేసుకునే చైనా, దక్షిణ కొరియాలు కరోనా బారిన పడి ఇంధన వినియోగంలో వెనకబడ్డాయి గనుక ఇది అవసరమన్నది సౌదీ అభిప్రాయం. ఆ చర్య అమెరికాకు లబ్ధి చేకూరు స్తుందన్న భావనతో రష్యా దీన్ని అంగీకరించలేదు. తాము ఉత్పత్తిలో కోత పెడితే అమెరికా చమురు సంస్థలకు పట్టపగ్గాలుండవని, అవి మార్కెట్లను మరింతగా ఆక్రమించుకుంటాయని రష్యా వాదన. దాంతో రష్యాకు గుణపాఠం చెప్పి, దానిపై ఒత్తిడి పెంచడం కోసం సౌదీ ఒక్కసారిగా చమురు ఎగుమతి ధరను తగ్గించింది. అదే సమయంలో ఉత్పత్తిని పెంచింది. సౌదీ, రష్యాలు రెండూ రాజీ కొచ్చి చర్చిస్తే తప్ప ఇప్పుడేర్పడిన సంక్షోభం ఉపశమించదని, బ్యారెల్ చమురు ధర 20 డాలర్లకు పతనమైతే అది అందరికీ చేటు కలిగిస్తుందని ఒపెక్ దేశాలు ఆందోళన పడుతున్నాయి. అవి ఏకాభిప్రాయానికి రావడం, యధాపూర్వ స్థితి ఏర్పడటం ఎన్నాళ్లకు సాధ్యమో ఎవరూ చెప్పలే కున్నారు. చమురు ఉత్థానపతనాలు ప్రపంచ రాజకీయాలను శాసించడం ఎప్పుడూ ఉన్నదే. కానీ ఏ నిర్ణయం ఎటు దారితీస్తుందో, ఎవరికి దెబ్బ తగులుతుందో అంచనా వేయడం అంత సులభమేమీ కాదు. గతంలో అమెరికా షేల్ ఆయిల్ ఉత్పత్తిదారుల ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికి చమురు ధరలను సౌదీ తగ్గించినప్పుడు అమెరికాకు కలిగిన నష్టం పెద్దగా లేదు సరిగదా సౌదీ ఆర్థిక వ్యవస్థే సమస్యల్లో చిక్కుకుంది. దాంతో అది తన వైఖరిని మార్చుకుంది. చమురు దిగుమతిపైనే ప్రధానంగా ఆధారపడే మనలాంటి దేశాలకు తాజాగా పతనమైన చమురు ధరల వల్ల ప్రయోజనమే వుంటుంది. అదే సమయంలో సమస్యలూ వుంటాయి. ఇందులో అనుకూలాంశమేమంటే...విదేశీ మారకద్రవ్య నిల్వల లోటును గణనీయంగా తగ్గించుకోవడానికి, ద్రవ్యోలబ్ణాన్ని కట్టడి చేయడానికి ఇంతకు మించిన మంచి అవకాశం ఏ దేశానికీ రాదు. అందువల్ల ఆదా అయ్యే సొమ్ముతో అనేక కీలకమైన పథకాలకు ఆర్థిక సాయం అందించడానికి అవకాశం ఏర్పడుతుంది. కానీ చమురు ధర ఎక్కువ కాలం బ్యారెల్కు 40 డాలర్ల లోపు స్థిరంగావుంటే అది ఆర్థిక మాంద్యానికి దారితీస్తుందని, మార్కె ట్లకు అది శుభసూచకం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్థిక మాంద్యం ఏర్పడితే అది ఎఫ్డీఐలపై ప్రభావం చూపడమే కాదు... ఇక్కడినుంచి పెట్టుబడులు తరలిపోయే ప్రమాదం కూడా ఏర్పడుతుందంటున్నారు. ఏదేమైనా పడిపోయిన చమురు ధరల వల్ల కలిగే ప్రయోజనాన్ని పౌరు లకు బదిలీ చేయడం అవసరం. సాధారణంగా ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడల్లా పెట్రో ఉత్ప త్తులపై పన్నులు పెంచి, నామమాత్రంగా ధర తగ్గించడం ప్రభుత్వాలకు అలవాటైంది. ఈసారి ఆ విధానాన్ని అమలు చేయరని ఆశించాలి. -
చమురు ‘బేజార్’
సింగపూర్: ముడి చమురు ఉత్పత్తి తగ్గించుకునే విషయంలో ఒపెక్ కూటమి, రష్యా మధ్య డీల్ కుదరకపోవడంతో సౌదీ అరేబియా ధరల పోరుకు తెర తీసింది. భారీగా రేట్లు తగ్గించేసింది. 20 ఏళ్ల కనిష్ట స్థాయికి కోత పెట్టింది. దీంతో సోమవారం చమురు ధరలు ఏకంగా 30 శాతం దాకా పతనమయ్యాయి. ఒక దశలో ప్రామాణిక బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 31 డాలర్ల స్థాయికి పడిపోయి, తర్వాత కాస్త కోలుకుంది. 1991 గల్ఫ్ యుద్ధ సమయం తర్వాత చమురు రేట్లు ఇంత భారీగా పతనం కావడం ఇదే తొలిసారి. అటు సహజ వాయువు రేట్లు కూడా క్షీణించాయి. ఎందుకిలా.. కరోనా వైరస్ కారణంగా ముడిచమురుకు డిమాండ్ తగ్గి.. మార్కెట్లో క్రూడ్ నిల్వలు పెరిగిపోయాయి. ఫలితంగా రేట్లు పడిపోవచ్చన్న భయాలతో సౌదీ అరేబియా సారథ్యంలో పెట్రోలియం ఎగుమతి దేశాల కూటమి (ఒపెక్).. చమురు ఉత్పత్తిని మరింతగా తగ్గించాలని గత వారం జరిగిన సమావేశాల్లో ప్రతిపాదించింది. అయితే, తాము ఉత్పత్తి తగ్గించిన పక్షంలో అమెరికా చమురు ఉత్పత్తి సంస్థలు మార్కెట్లో దూసుకుపోయే రిస్కులు ఉన్నాయనే ఉద్దేశంతో.. ఈ ప్రతిపాదనను రష్యా విభేదించింది. చమురు ఉత్పత్తిలో సౌదీ, రష్యా.. ఒకటి, రెండో స్థానాల్లో ఉన్నాయి. తాజా పరిణామంతో తన మార్కెట్ వాటాను కాపాడుకునే దిశగా.. అదే సమయంలో రష్యాపై ఒత్తిడిని పెంచే దిశగా సౌదీ అరేబియా పావులు కదిపింది. చమురు ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న సౌదీ అరేబియా .. క్రూడాయిల్ రేట్లను తగ్గించడంతో పాటు ఉత్పత్తినీ పెంచనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్లో కాంట్రాక్టుకు సంబంధించిన రేట్లను బ్యారెల్కు 6 నుంచి 8 డాలర్ల దాకా తగ్గించేసింది. ఇది మార్కెట్లో కలకలం రేపడంతో క్రూడాయిల్ రేట్లు భారీగా పతనమయ్యాయి. చమురు ధరలు దాదాపు దశాబ్దపు కనిష్ట స్థాయి 26 డాలర్లకు దగ్గర్లో ఉండటం మార్కెట్ వర్గాలను కలవరపెడుతోంది. త్వరలోనే ఈ స్థాయిని కూడా తాకవచ్చని ఆంచనాలు ఉన్నాయి. 20 డాలర్లకూ పతనావకాశం.. ఒకవేళ ఇరు పక్షాలు ఒక అంగీకారానికి రాకపోతే చమురు రేట్లు బ్యారెల్కు ఏకంగా 20 డాలర్ల స్థాయికి కూడా పతనమయ్యే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు. రష్యాను చర్చలకు రప్పించే ప్రయత్నాల్లో భాగంగానే సౌదీ అరేబియా ఈ వ్యూహాలు అమలు చేస్తుండవచ్చని వారు పేర్కొన్నారు. ఒకవేళ రేట్లు గానీ భారీగా పతనమైతే .. చమురు ఆదాయాలపై ఆధారపడిన దేశాలు దెబ్బతినడంతో పాటు క్రూడాయిల్ అన్వేషణ ప్రాజెక్టులపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు. -
పెట్రోల్, డీజిల్పై కరోనా ఎఫెక్ట్
సాక్షి, హైదరాబాద్ : చమురు ధరలపై కరోనా వైరస్ ప్రభావం చూపింది. చమురుకు డిమాండ్ ఎక్కువగా ఉండే చైనాలో కరోనా వైరస్ విస్తరించడంతో చమురు వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడింది. అంతర్జాతీయ మార్కెట్లో గత పక్షం రోజులుగా చమురు ధరలు మరింత పడిపోయాయి. వరుసగా క్షీణత నమోదవుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు గత మూడు మాసాలుగా పైసాపైసా తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో పెట్రోల్ ధర లీటర్కు రూ.75.04 ఉండగా, డీజిల్ ధర లీటర్కు రూ.68.88 ఉంది. గత మూడు నెలల నుంచే... జనవరిలో పెట్రోల్ ధర రూ.80.80 ఉండగా, ఆ మాసంలో రూ.2.05 తగ్గింది. ఫిబ్రవరిలో రూ.77.77 పైసలు ఉండగా, ఇదే నెలలో రూ.1.17 తగ్గింది. మార్చి 1న రూ.76.23 ఉండగా, ప్రస్తుతం రూ.75.04కు చేరింది. ఇక డిజిల్ ధరను పరిశీలిస్తే జనవరిలో రూ. 75.42 ఉండగా, అదే నెలలో రూ.1.89 తగ్గింది. ఇక ఫిబ్రవరిలో రూ.72.16 ఉన్న ధర...రూ.70.27కు పడిపోయింది. మార్చి1న రూ.70.01 ఉన్న ధర.... ప్రస్తుతం రూ.68.88కి చేరింది. మరో పక్షం రోజులు సైతం పైసాపైసా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఏప్రిల్ ఒకటి నుంచి మాత్రం ధరల మోత మోగే అవకాశం లేకపోలేదు. ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానున్న బీఎస్–6 ఉద్గానా నిబంధనలే ఈ ధరల పెరుగుదలకు కారణం. -
42,000 పాయింట్లను తాకిన సెన్సెక్స్
సెన్సెక్స్ తొలిసారిగా 42,000 పాయింట్లపైకి ఎగబాకింది. గురువారం ఇంట్రాడేలో సెన్సెక్స్ జీవిత కాల గరిష్ట స్థాయి, 42,059 పాయింట్లపైకి ఎగబాకినప్పటికీ, ఆ లాభాలను నిలుపుకోలేకపోయింది. పెరుగుతున్న బ్యాంక్ల మొండి బకాయిల భారం, ఆర్థిక గణాంకాలపై ఆందోళనతో ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. దీంతో స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాలతో సరిపెట్టుకుంది. డాలర్తో రూపాయి మారకం విలువ బలహీనపడటం, ముడి చమురు ధరలు అర శాతం మేర పెరగడం ప్రతికూల ప్రభావం చూపించాయి. చివరకు బీఎస్ఈ సెన్సెక్స్ 60 పాయింట్ల లాభంతో 41,933 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 12 పాయింట్ల లాభంతో 12,355 పాయింట్ల వద్ద ముగిశాయి. నిఫ్టీ లోహ సూచీ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. 247 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్... అమెరికా– చైనా మధ్య తొలి దశ వాణిజ్య ఒప్పం దం బుధవారం కుదిరింది. దీంతో గురువారం ట్రేడింగ్ ఆరంభంలోనే సెన్సెక్స్, నిఫ్టీలు జీవిత కాల గరిష్ట స్థాయిలకు ఎగబాకాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 42,059 పాయింట్లు, నిఫ్టీ 12,389 పాయింట్ల వద్ద జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ వీక్లీ ఆప్షన్ల ముగింపు రోజు కావడంతో సెన్సెక్స్, నిఫ్టీలు ఒడిదుడుకులకు గురయ్యాయి. అమ్మకాలు జోరుగా జరగడంతో రెండు సూచీలు నష్టాల్లోకి జారిపోయాయి. చివర్లో నష్టాలు రికవరీ అయి స్వల్ప లాభాలతో ముగిశాయి. ఒక దశలో 187 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ మరో దశలో 60 పాయింట్ల మేర నష్టపోయింది. మొత్తం మీద రోజంతా 247 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఆసియా, యూరప్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. ► నెస్లే ఇండియా 3 శాతం లాభంతో రూ.15,347 వద్ద ముగిసింది. సెన్సెక్స్లో బాగా లాభపడిన షేర్ ఇదే. ఈ క్యూ3లో ఆర్థిక ఫలితాలు బాగా ఉండగలవనే అంచనాలతో ఈ షేర్ జోరుగా పెరిగింది. ఇంట్రాడేలో ఆల్టైమ్ హై, రూ.15,399ను తాకింది. ► సెన్సెక్స్, నిఫ్టీలతో పాటు పలు షేర్లు ఇంట్రాడేలో ఆల్టైమ్ హైలను తాకాయి. అపోలో హాస్పిటల్స్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బెర్జర్ పెయింట్స్, సిటీ యూనియన్ బ్యాంక్, డాబర్ ఇండియా, దివీస్ ల్యాబ్స్, డాక్టర్ లాల్ పాథ్ల్యాబ్స్, ఇంద్రప్రస్థ గ్యాస్, ఇప్కా ల్యాబ్స్, జేకే సిమెంట్స్, జుబిలంట్ ఫుడ్వర్క్స్, మణప్పురం ఫైనాన్స్, ఫీనిక్స్ మిల్స్, పాలీక్యాబ్ ఇండియా, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ ఏడాది సెన్సెక్స్ లాభం 9 శాతం ! ఈ ఏడాది సెన్సెక్స్ 9 శాతం మేర లాభపడగలదని ఫ్రాన్స్ బ్రోకరేజ్ సంస్థ బీఎన్పీ పారిబా అంచనా వేస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ కల్లా సెన్సెక్స్ 44,500 పాయింట్లకు ఎగబాకుతుందని పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ మందగమనం, వినియోగం అంతంతమాత్రంగానే ఉండటం, లిక్విడిటీ... తదితర సమస్యలున్నప్పటికీ, స్టాక్ మార్కెట్ పెరగగలదని వివరించింది. ప్రత్యామ్నాయ మదుపు అవకాశాలు అందుబాటులో లేకపోవడంతో దేశీయ పొదుపులు స్టాక్ మార్కెట్లోకి వస్తాయని తెలిపింది. కాగా స్టాక్ మార్కెట్ అంటే ఆర్థిక వ్యవస్థ కాదని, అగ్రస్థాయి 50 కంపెనీలకు సంబంధించిందని ఈ సంస్థ ఇండియా హెడ్ అభిరామ్ ఈలేశ్వరపు వ్యాఖ్యానించారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ప్రభుత్వం బడ్జెట్లో తీసుకోనున్న చర్యలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్లను తగ్గించకపోవడం... ఇవన్నీ మార్కెట్కు రిస్క్ అంశాలని ఆయన భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం 7 శాతానికి మించి పెరిగిపోవడంతో మరో ఆరు నెలల వరకూ ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గించకపోవచ్చని ఈ సంస్థ అంచనా వేస్తోంది. సూచీల ఇంట్రాడే శిఖర స్థాయిలు సెన్సెక్స్ 42,059 నిఫ్టీ 12,389 36 సెషన్లలో 1,000 పాయింట్లు సెన్సెక్స్ 41,000 పాయింట్ల నుంచి 42,000 పాయింట్లకు చేరడానికి 36 ట్రేడింగ్ సెషన్లు పట్టింది.ఈ కాలంలో టాటా స్టీల్ 18 శాతం, ఇన్ఫోసిస్ 11 శాతం, టీసీఎస్ 10 శాతం, భారతీ ఎయిర్టెల్ 8 శాతం చొప్పున లాభపడ్డాయి. బాటా ఇండియా, పీటీసీ ఇండియా, డీసీబీ బ్యాంక్, చంబల్ ఫెర్టిలైజర్స్, ట్రైడెంట్, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్, బెర్జర్ పెయింట్స్, ఒబెరాయ్ రియల్టీ, టాటా గ్లోబల్ బేవరేజేస్ తదితర షేర్లు 10–100 శాతం రేంజ్లో పెరిగాయి. ఈ 36 ట్రేడింగ్ సెషన్లలో ఇన్వెస్టర్ల సంపద రూ.6 లక్షల కోట్ల మేర పెరిగింది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటం, వృద్ధి జోరు పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండటం, బడ్జెట్లో మరిన్ని తాయిలాలు ఇవ్వనున్నదన్న అంచనాలు ఈ లాభాలకు కారణాలని నిపుణులంటున్నారు. -
లీటర్ పెట్రోల్పై 15 పైసలు పెంపు
పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలపై పడింది. దీంతో సోమవారం దేశంలో పెట్రోల్ లీటర్పై 15 పైసలు, డీజిల్పై 17 పైసలు పెరిగింది. ఇక ఢిల్లీలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.76.69 ఉండగా.. డీజిల్ లీటర్కు రూ.68.68లకు చేరింది. కాగా 2018 నవంబర్ తర్వాత పెట్రోల్ ధర ఇదే అత్యధికం. పెట్రో ఉత్పత్తుల ధరలు పెరగడం వరుసగా ఇది ఐదోరోజు. -
మార్కెట్కు చమురు నష్టాలు
ముడి చమురు ధరలు భగ్గుమనడంతో శుక్రవారం మన మార్కెట్ నష్టపోయింది. అమెరికా డ్రోన్ దాడిలో ఇరాన్ కమాండర్ ఖాసీమ్ సులేమాని మరణించడం, దీనికి తగిన ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించడంతో ముడి చమురు ధరలు పెరిగి ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి. ప్రపంచ మార్కెట్లతో పాటే మన మార్కెట్ కూడా నష్టపోయింది. డాలర్తో రూపాయి మారకం విలువ 37 పైసలు పతనమై 71.75కు చేరడం ప్రతికూల ప్రభావం చూపించింది.దీంతో కొత్త ఏడాది వరుస రెండు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. ఇంట్రాడేలో 278 పాయింట్ల మేర పతనమైన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 162 పాయింట్లు పతనమై 41,465 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 56 పాయింట్ల నష్టంతో 12,227 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక వారం పరంగా చూస్తే, మార్కెట్ నష్టపోయింది. సెన్సెక్స్ 111 పాయింట్లు, నిఫ్టీ 19 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. చివర్లో ఒకింత రికవరీ అమెరికా డ్రోన్ దాడిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ఖాసీమ్ మరణించడం, దీనికి ప్రతి దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింతగా పెరగనున్నాయి. ఈ దాడి నేపథ్యంలో సురక్షిత సాధనాలైన పుత్తడి, జపాన్ కరెన్సీ యెన్ల్లోకి రిస్క్ అధికంగా ఉన్న ఈక్విటీల నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయి. ఈ దాడి కారణంగా ముడి చమురు ధరలు 4.4 శాతం మేర పెరిగాయి. మధ్యాసియాలో ఉద్రిక్తతలు చెలరేగుతుండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని, మార్కెట్ రికార్డ్ల స్థాయిల్లో ఉండటంతో లాభాల స్వీకరణకు మొగ్గు చూపే అవకాశాలున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ చెప్పారు. డాలర్ బలపడటంతో ఐటీ షేర్లు ఎగిశాయని పేర్కొన్నారు. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియగా, యూరప్ మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ లాభాల్లో మొదలైనప్పటికీ, వెంటనే నష్టాల్లోకి జారిపోయింది. రోజంతా నష్టాలు కొనసాగాయి. ట్రేడింగ్ చివర్లో కొంత రికవరీ చోటు చేసుకోవడంతో నష్టాలు తగ్గాయి. ►రూపాయి పతనం కారణంగా ఐటీ, ఫార్మా షేర్లు లాభపడ్డాయి. ►ముడి చమురు ధరలు పెరగడంతో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లు పతనమయ్యాయి. హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీ షేర్లు 0.04–2.1 శాతం రేంజ్లో నష్టపోయాయి. ముడి చమురును ముడి పదార్థంగా వినియోగిస్తున్న పెయింట్స్, విమానయాన కంపెనీల షేర్లు కూడా నష్టపోయాయి. ►ఏషియన్ పెయింట్స్ షేర్ 2.1 శాతం నష్టంతో రూ.1,752 వద్ద ముగిసింది. పెయింట్ల తయారీలో ముడి పదార్థంగా ముడి చమురు ఉత్పత్తులను వినియోగిస్తారు. -
కెవ్వు.. క్రూడ్!
ముడి చమురు ధరలు పెరగడం దేశ ద్రవ్య స్థితిగతులను మరింత అస్తవ్యస్తం చేయగలదన్న భయాలతో మంగళవారం స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది. స్టాక్ సూచీలు వరుసగా రెండో రోజూ నష్టపోయాయి. సెన్సెక్స్ కీలకమైన 36,500 పాయింట్లు, నిఫ్టీ 10,850 పాయింట్ల దిగువకు పడిపోయాయి. సౌదీ అరేబియా ఆయిల్ ప్లాంట్లపై గత శనివారం డ్రోన్ దాడుల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు పతనం కావడం, డాలర్తో రూపాయి మారకం విలువ 18 పైసలు పతనమై 71.78కు చేరడం, విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు మళ్లీ అమ్మకాలు ఆరంభించడం ప్రతికూల ప్రభావం చూపించాయి. అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. ఇంట్రాడేలో 704 పాయింట్ల వరకూ పతనమైన సెన్సెక్స్ చివరకు 642 పాయింట్ల నష్టంతో 36,481 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 186 పాయింట్లు పతనమై 10,818 పాయింట్ల వద్దకు చేరింది. గత రెండు రోజుల్లో సెన్సెక్స్ 904 పాయింట్లు, నిఫ్టీ 258 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. ఒడిదుడుకులు కొనసాగుతాయ్... ముడి చమురు ధరలు ఎగబాకడం, రూపాయి బలహీనపడటంతో సమీప భవిష్యత్తులో ఆరి్థక పరిస్థితి కోలుకునే సూచనలు లేవన్న భయాందోళనతో అమ్మకాలు వెల్లువెత్తాయని జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ చెప్పారు. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ప్యాకేజీ ఎలాంటి ప్రభావం చూపించలేకపోయిందని పేర్కొన్నారు. వడ్డీరేట్ల విషయమై అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ నేడు (బుధవారం) ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నదో అన్న అప్రమత్తత నెలకొన్నదని చెప్పారు.. ఫెడరల్ రిజర్వ్ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించే అవకాశాలున్నాయని తెలిపారు. ప్రస్తుత స్థితిగతులను బట్టి చూస్తే, సమీప భవిష్యత్తులో మార్కెట్లో ఒడిదుడుకులు చోటు చేసుకోగలవని రెలిగేర్ బ్రోకింగ్ విశ్లేషకులు అజిత్ మిశ్రా అంచనా వేస్తున్నారు. ►31 సెన్సెక్స్ షేర్లలో కేవలం మూడు షేర్లు... హిందుస్తాన్ యూనిలివర్, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్లు మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 28 షేర్లు నష్టపోయాయి. ►చమురు ధరలు పెరిగితే వాహన విక్రయాలు మరింతగా తగ్గగలవన్న ఆందోళనతో వాహన షేర్లు పడిపోయాయి. హీరో మోటొకార్ప్ 6 శాతం నష్టంతో రూ. 2,570 వద్ద ముగిసింది. సెన్సెక్స్లో అధికంగా నష్టపోయిన షేర్ ఇదే. నిఫ్టీ వాహన సూచీలోని 15 షేర్లూ నష్టాల్లోనే ముగిశాయి. ►క్రూడ్ పెరిగితే ద్రవ్యోల్బణం ఎగుస్తుందనే అంచనాలతో బ్యాంక్ షేర్లు పతనమయ్యాయి. ►ఎమ్ఎమ్టీసీ, ఎస్టీసీ కంపెనీలను మూసివేయడం కానీ, వేరే కంపెనీల్లో విలీన చేయడం కానీ ఏదో ఒకటి చేస్తామని ప్రభుత్వం వెల్లడించడంతో ఈ షేర్లు 20 శాతం వరకూ నష్టపోయాయి. ఎమ్ఎమ్టీసీ 17 శాతం నష్టపోయి రూ. 21 వద్ద ఎస్టీసీ 20 శాతం పతనమై రూ. 107 వద్ద ముగిశాయి. ఆల్టైమ్ హైకి ఇండియామార్ట్ ఇంటర్మెష్ స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయినప్పటికీ, ఇండియామార్ట్ ఇంటర్మెష్ షేర్ జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,725ను తాకింది. చివరకు 2.4 శాతం లాభంతో రూ.1,693 వద్ద ముగిసింది. ఈ షేర్తో పాటు వినతి ఆర్గానిక్స్, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ కూడా ఇంట్రాడేలో ఆల్టైమ్ హైలను తాకాయి. పతనానికి ప్రధాన కారణాలు... చమురు భయాలు... సౌదీ అరేబియా ఆయిల్ ప్లాంట్లపై డ్రోన్ దాడులు, దీనికి ప్రతిగా అమెరికా, సౌదీ అరేబియాలు ప్రతిదాడులకు సిద్ధమని ప్రకటించడం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను మరింత ప్రజ్వరిల్లేలా చేస్తున్నాయి. ఈ ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు పెరిగితే, ఇప్పటికే మందగమనంతో కుదేలైన మన ఆరి్థక వ్యవస్థపై మరింతగా ప్రభావం పడుతుందనే ఆందోళనతో స్టాక్ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. రూపాయి పతనం ఇటీవల వరకూ బలపడుతూ వస్తున్న రూపాయి చమురు ధరలు ఎగియడంతో పతనమవుతూ వస్తోంది. మంగళవారం డాలర్తో రూపాయి మారకం విలువ 18 పైసలు పతనమై 71.78కు చేరడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను మరింత దెబ్బతీసింది. రూపాయి విలువ సోమవారం కూడా 68 పైసలు పడిపోయిన సంగతి తెలిసిందే మళ్లీ మొదలైన విదేశీ అమ్మకాలు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు మళ్లీ మన స్టాక్ మార్కెట్లో అమ్మకాలు మొదలు పెట్టారు. సోమవారం రూ.751 కోట్లు, మంగళవారం రూ.808 కోట్ల మేర నికర అమ్మకాలు జరిపారు. ఫెడ్ సమావేశం.. మార్కెట్లో అప్రమత్తత వడ్డీరేట్లకు సంబంధించి అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం నేడు(బుధవారం) వెలువడనున్నది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఫెడ్... 25 బేసిస్ పాయింట్ల మేర(పావు శాతం) రేట్లను తగ్గించగలదన్న అంచనాలు ఉన్నాయి. ఇలా తగ్గిస్తే, ఫెడ్ ఈ ఏడాది రెండు సార్లు రేట్లు తగ్గించినట్లవుతుంది. అయినా ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించారు. ప్రతికూలంగా అంతర్జాతీయ సంకేతాలు చైనాలో పారిశ్రామిక వృద్ధి పదిహేడేళ్ల కనిష్టానికి పడిపోయింది. మరోవైపు ముడి చమురు ధరలు ఒకింత చల్లారినా, పశి్చమాసియాలో ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతాయనే భయాలు నెలకొన్నాయి. ఇలాంటి ప్రతికూల అంతర్జాతీయ సంకేతాల కారణంగా ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియగా, యూరప్ మార్కెట్లు బలహీనంగా ఆరంభమై. మిశ్రమంగా ముగిశాయి. ఆర్బీఐ గవర్నర్ వ్యాఖ్యలు... చమురు ధరలు పెరిగితే కరెంట్ అకౌంట్ లోటు, ద్రవ్యలోటులు మరింత అధ్వానమవుతాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వ్యాఖ్యానించడం నష్టాలకు మరింత చమురు పోసింది. మన దేశం 80 శాతానికి పైగా చమురును దిగుమతు చేసుకుంటోందని, చమురు ధరలు పెరిగితే ఆ ప్రభావం మన ఆర్థిక స్థితిగతులపై తీవ్రంగానే ఉండగలదని పలువురు విశ్లేషకులు పేర్కొన్నారు. డెత్ క్రాస్లో నిఫ్టీ సోమవారం రోజు నిప్టీ డైలీ చార్టుల్లో డెత్ క్రాస్ ఏర్పడిందని టెక్నికల్ ఎనలిస్ట్లు పేర్కొన్నారు. స్వల్పకాలిక మూవింగ్ యావరేజ్ (సాధారణంగా 50 రోజుల మూవింగ్ యావరేజ్), దీర్ఘకాలిక మూవింగ్ యావరేజ్ (సాధారణంగా 200 రోజుల మూవింగ్ యావరేజ్) కన్నా దిగువకు పడిపోవడాన్ని డెత్ క్రాస్గా వ్యవహరిస్తారు. నిఫ్టీ సూచీ బలహీనతకు ఈ డెత్క్రాస్ ఒక సంకేతమని, స్వల్పకాలికంగా మరింత పతనం ఉండొచ్చని ఇది సూచిస్తోందని టెక్నికల్ ఎనలిస్ట్లు అంటున్నారు. నిఫ్టీ తదుపరి మద్దతు 10,600–10,740 పాయింట్లని, నిరోధం 10,970–11,000 పాయింట్లని వారంటున్నారు. రెండు రోజుల్లో రూ.2.72 లక్షల కోట్లు ఆవిరి స్టాక్ మార్కెట్ భారీ నష్టాల కారణంగా గత రెండు రోజుల్లో రూ.2.72 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ (విలువ) రూ.2,72,594 కోట్లు దిగజారి రూ.1,39,70,356 కోట్లకు పడిపోయింది. ఒక్క మంగళవారమే రూ.2.38 లక్షల కోట్ల సంపద క్షీణించింది. చమురు మంటతో భారత్కు అనర్థమే..! ‘మాంద్యం’ తరహా పరిస్థితికి దారితీస్తుందని నోమురా హెచ్చరిక న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా చమురు ధరల తీవ్రత భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల ఆరి్థక వ్యసస్థలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపడం ఖాయమని జపాన్ ఫైనాన్షియల్ సేవల దిగ్గజ సంస్థ నోమురా విశ్లేషించింది. బలహీన వినియోగ డిమాండ్, అధిక చమురు ధరలు భారత్ వంటి ఆరి్థక వ్యవస్థలో మాంద్యం తరహా పరిస్థితి (స్టాగ్ఫ్లేషన్)కి దారితీస్తాయని పేర్కొంది. తన మొత్తంచమురు అవసరాల్లో 70 శాతానికిపైగా దిగుమతులపై భారత్ ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. ‘క్రూడ్ ధర ఒక్కో బ్యారల్కు 10 డాలర్లు పెరిగితే.. స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటును 0.2 శాతం మేర తగ్గిస్తుంది. కరెంట్ అకౌంట్ లోటు (దేశంలోకి వచీ్చ–పోయే విదేశీ మారక నిధుల మధ్య నికర వ్యత్యాసం) 0.4 శాతం మేర (జీడీపీ)లో పెరుగుతుంది. ద్రవ్యలోటు 0.1 శాతం పెరుగుతుంది. వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 30 బేసిస్ పాయింట్ల మేర (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) పెరుగుతుంది. ఇక అధిక క్రూడ్ ధర వల్ల డాలర్ మారకంలో రూపాయి విలువ బలహీనపడుతుంది. ప్రతి 5 పైసలు బలహీనత విషయంలో ద్రవ్యోల్బణం 20 బేసిస్ పాయింట్లు పెరుగుతుంది’ అని నోమురా విశ్లేషించింది. స్టాగ్ఫ్లేషన్ అంటే... ఒకవైపు ఆరి్థక వ్యవస్థ వృద్ధి మందగమనం.. మరోపక్క తీవ్ర ధరల పెరుగుదలను ఎదుర్కొనాల్సి వస్తుంది. వ్యవస్థలో డిమాండ్ పూర్తిగా నిలిచిపోతుంది. నిరుద్యోగిత భారీగా పెరుగుతుంది. -
టాయిలెట్ పేపర్గా కరెన్సీ!
సాక్షి, బిజినెస్ డెస్క్: గతేడాది రూపాయికి కొనుక్కున్న వస్తువు ఈ ఏడాది ఏకంగా 10 లక్షల రూపాయలకు కొనుక్కోవాల్సి వస్తే? అదీ కాదు.. కాసేపటి క్రితం 5 రూపాయలకు కొన్న బిస్కెట్ ప్యాకెట్ని 10 నిమిషాల తర్వాత 10 రూపాయలకి.. ఆ తర్వాత మరో 10 నిమిషాలకు ఇరవై, ముప్ఫై, నలభై రూపాయలకు కొనుక్కోవాల్సి వస్తే.. ప్రస్తుతం ఆర్థిక, సామాజిక, రాజకీయ సంక్షోభాలతో అస్తవ్యస్తమైన వెనెజులా దేశంలో అచ్చం ఇలాంటి పరిస్థితే ఉంది. కరెన్సీ విలువ పడిపోవడం, ఆహారం మొదలైన నిత్యావసరాల కొరత నెలకొనడం, దానికి తగ్గట్లుగా రేట్లు పెరిగిపోవడం దీనికి కారణం. దీంతో ఒక దశలో టాయ్లెట్ పేపర్ను కొనుక్కోవడం బదులు కరెన్సీ నోట్లనే టాయ్లెట్ పేపర్గా వాడుకుంటున్నారంటే పరిస్థితులు ఎంతగా దిగజారాయో అర్థం చేసుకోవచ్చు. ఎందుకిలా అంటే.. క్రూడాయిల్ ధరలు పడిపోవడంతో ఆ దేశ కరెన్సీ బొలివర్కూ డిమాండ్ విపరీతంగా పడిపోయింది. విదేశాల నుంచి చేసుకునే దిగుమతుల భారం పెరిగి, దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం కావడంతో ప్రభుత్వం మరింత ఎక్కువగా కరెన్సీని ముద్రించింది. దీంతో అందరి చేతుల్లో డబ్బు ఉన్నా, నిత్యావసరాల సరఫరా పరిమితంగా ఉండటంతో వాటి రేట్లు పెరిగిపోయాయి. చివరికి ఇదో ఇదో విషవలయంలా తయారైంది. ఇది గాక, దాచుకున్న డబ్బును వెనెజులన్లు అమెరికన్ డాలర్లలోకి మార్చుకోవడం మొదలెట్టారు. దీంతో డాలర్లకు డిమాండ్ పెరిగి.. వెనెజులా బొలివర్ మారకం రేటు మరింతగా పడిపోయింది. ప్రభుత్వం నియంత్రణ విధించడంతో బ్లాక్ మార్కెట్ జోరందుకుంది. అధికారిక మారకం రేటుకు.. బ్లాక్మార్కెట్ రేటుకూ భారీ వ్యత్యాసాలు వచ్చేయడంతో వెనెజులా కరెన్సీ విలువ మరీ పాతాళానికి పడిపోయింది. ఆహారం దగ్గర్నుంచి ప్రతీ దానికి కొరత నెలకొనడంతో సుమారు 30 లక్షల మంది వెనెజులన్లు (జనాభాలో దాదాపు పది శాతం) దేశం విడిచి వెళ్లిపోయారు. కిలో టమాటా... 30,000పైమాటే.. లీటరు పాలు... దాదాపు.. 50,000 ► 10 లక్షల శాతం: ఈ ఏడాది ఆఖరుకు వెనెజులాలో ద్రవ్యోల్బణం చేరబోయే స్థాయి (ఐఎంఎఫ్ అంచనా). ► ప్రభుత్వం పాత కరెన్సీ బొలివర్ ఫుర్టె స్థానంలో బొలివర్ సోబ్రానో కరెన్సీని ప్రవేశపెట్టింది. ఒక సోబ్రానో.. లక్ష ఫుర్టెలకు సమానం. ► ప్రస్తుతం 1 వెనెజులా బొలివర్ సొబ్రానో .. భారత కరెన్సీలో సుమారు రూ. 6.88కి సమానం. ► కిలో టమాటా దాదాపు 4,411 బొలివర్లు.. అంటే రూ.30,387 అన్నమాట. లీటరు పాలప్యాకెట్ ధర సుమారు 7,029 బొలివర్లు (రూ.48,400). -
కొనసాగుతున్న పెట్రో పరుగు
సాక్షి, న్యూఢిల్లీ : దేశీయ ఇంధన ధరలు వరుసగా మూడోరోజు కూడా పుంజుకున్నాయి. కేంద్రంలో మరోసారి నరేంద్ర మోదీ సర్కార్ కొలువ దీరనున్న నేపథ్యంలో దేశీయ స్టాక్మార్కెట్లు భారీ లాభాలను నమోదు చేస్తున్నాయి. మరోవైపు ఇంధన ధరలు కూడా పెరుగుతూ వినియోగదారులకు భయపెడుతున్నాయి. శనివారం (మే 25) పెట్రోలు ధర 14 నుంచి 15 పైసలు పెరగ్గా.. డీజిల్ ధర 12 నుంచి 13 పైసల మేర పెరిగింది. దేశ రాజధాని నగరం ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబై సహా పలు మెట్రో నగరాల్లో పెట్రో,డీజిల్ ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 1.46 శాతం పెరుగుదలతో 67.47 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్కు 1.24 శాతం పెరిగి 58.63 డాలర్ల వద్ద కొనసాగుతోంది. దేశంలోని పలు నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు న్యూఢిల్లీ : పెట్రోలు రూ.71.53, డీజిల్ ధర రూ.66.57 ముంబై : పెట్రోలు రూ.77.14 , డీజిల్ ధర రూ.69.75 చెన్నై: పెట్రోలు రూ.74.25, డీజిల్ ధర రూ. 70.37 కోలకతా : పెట్రోలు రూ.73.60, డీజిల్ ధర రూ.68.33 హైదరాబాద్ : పెట్రోలు రూ.75.86, డీజిల్ రూ. 72.80 అమరావతి : పెట్రోలు రూ.75.86, డీజిల్ ధర రూ.71.75 విజయవాడ: పెట్రోలు రూ.75.27 డీజిల్ రూ.71.42 వద్ద కొనసాగుతోంది. కాగా సార్వత్రిక ఎన్నికలు ముగిసిన మే 19 నుంచి శనివారం (మే 25) వరకు.. అంటే వారం రోజుల వ్యవధిలో పెట్రోలు ధర 50 పైసలు, డీజిల్ ధర 60 పైసల మేర పెరిగింది. దీంతో పెట్రో భారం మరింత పెరుగుతుందనే ఆందోళన వాహనదారుల్లో నెలకొంది -
పెరుగుతున్న పెట్రోలు ధరలు
సాక్షి,ముంబై: పెట్రోల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. నేడు ( 25) పెట్రోలు పై 16 పైసలు, డీజిల్పై 17 పైసలు చొప్పున ధరలు పెరిగాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు అదే బాటలో పయనిస్తున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు వారం రోజుల్లో 5 శాతం పెరుగుదలనునమోదు చేయగా, గత శుక్రవారం చమురు ధరలు మూడు నెలల గరిష్ట స్థాయికి చేరాయి. మరోవైపు యూఎస్-చైనా ట్రేడ్ డీల్తో పాటు డాలర్తో రూపాయి మారకం విలువ స్వల్పంగా పుంజుకోవడం లాంటివి పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి కారణాలుగా ఎనలిస్టులు చెబుతున్నారు. హైదరాబాద్ : లీటర్ పెట్రోల్ ధర రూ.75.95 డీజిల్ ధర రూ.72.63 అమరావతి : లీటర్ పెట్రోల్ ధర రూ.75. 71,డీజిల్ ధర రూ. 71.99 ఢిల్లీ : లీటర్ పెట్రోల్ ధర రూ.71.57,డీజిల్ ధర రూ.66.80 ముంబై : లీటర్ పెట్రోల్ ధర 77.20m డీజిల్ ధర69.80. చెన్నై: లీటర్ పెట్రోల్ ధర రూ.74.32 డీజిల్ ధరరూ.70.59. కోల్కతా : లీటర్ పెట్రోల్ ధర రూ.73.67, డీజిల్ ధరరూ.68.59. -
పెరుగుతున్న పెట్రో ధరలు
సాక్షి, ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో దేశంలో పెట్రోలు ధరలు వరుసగా మూడో రోజు పెరిగాయి. శనివారం పెట్రోల్ ధర లీటరుకు 14 పైసలు, డీజిల్ ధర 13 పైసలు పెరిగింది. తాజా పెరుగుదలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.70.60లుగా ఉండగా, డీజిల్ ధర రూ.65.86లుగా ఉన్నాయి. అయితే చెన్నైలో లీటరు పెట్రోలుధర రూ. 73.28 వద్ద గరిష్ట రేటు పలుకుతోంది. అటు డీజిల్ ధర రూ.69.57గా ఉంది. ముంబై : పెట్రోల్ ధర రూ.76.23, డీజిల్ ధర రూ.68.97 హైదరాబాద్ : పెట్రోల్ ధర రూ.74.90 వద్ద.. డీజిల్ ధర రూ.71.60 అమరావతి : పెట్రోల్ ధర రూ.74.70, డీజిల్ ధర రూ.70.99 కోల్కతా: పెట్రోలు ధర రూ.72.71 పెట్రోలు ధర రూ.67.64 -
69.50–72 శ్రేణిలో రూపాయి స్థిరీకరణ!
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ 69.50 – 72 శ్రేణిలో స్థిరీకరణ జరుగుతున్నట్లు కనపడుతోంది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ గురువారం 36 పైసలు నష్టపోయి, 71.16 వద్ద ముగిసింది. గురువారం 70.90 వద్ద ప్రారంభమైన రూపాయి, ఒకదశలో 71.18 స్థాయికి పడింది. బుధవారం రూపాయి ముగింపు 70.80. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరల పటిష్టత, ప్రధాన కరెన్సీలపై డాలర్ బలపేత ధోరణి, దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి వెనక్కు వెళుతున్న నిధులు రూపాయి బలహీనతకు తక్షణ కారణం. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్ ధరలు అంతర్జాతీయంగా ఇటీవలి గరిష్ట స్థాయిల నుంచి అనూహ్యంగా 30 డాలర్ల వరకూ పడిపోతూ వచ్చిన నేపథ్యంలో...రూపాయి క్రమంగా కోలుకుని 69.40 స్థాయిని చూసింది. అయితే మళ్లీ క్రూడ్ ధర తాజా కనిష్ట స్థాయిల నుంచి 10 డాలర్లకుపైగా పెరగడంతో రూపాయి జారుడుబల్లమీదకు ఎక్కింది. ఈక్విటీ మార్కెట్ల నష్టాలూ ఇందుకు తోడవుతున్నాయి. ఆయా పరిస్థితుల్లో రూపాయి ప్రస్తుతం స్థిరీకరణ బాటలో ఉందని భావిస్తున్నట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ క్యాపిటల్ మార్కెట్స్ స్ట్రేటజీ హెడ్ వీకే శర్మ విశ్లేషించారు. -
మళ్లీ పైకి చూస్తున్న పెట్రో ధరలు
సాక్షి, ముంబై : దేశీయంగా తగ్గినట్టే తగ్గి వినియోగదారులను మురిపించిన ఇంధన ధరలు క్రమంగా పైపైకి ఎగబాకుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల ప్రభావంతో జనవరి నుంచి మొదలుపెట్టి వరుసగా శుక్రవారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర 8 పైసలు, డీజిల్ ధర 19 పెరిగింది. దీంతో ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.70.55కి.. డీజిల్ ధర రూ.64.97కి పెరిగింది. ముంబై : పెట్రోలు ధర రూ.76.18, డీజిల్ రూ.68.02 చెన్నై: పెట్రోల్ రూ.73.23 డీజిల్ రూ.68.62 కోలకతా: పెట్రోల్ రూ.72.65, డీజిల్ రూ.66.74 హైదరాబాద్: పెట్రోల్ ధర రూ.74.84, డీజిల్ ధరరూ.70.63 విజయవాడ : పెట్రోల్ రూ.74.64 డీజిల్ రూ.70.05 బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 61.67 డాలర్ల వద్ద.. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్కు 52.87 డాలర్ల వద్ద ఉంది. ఈ నెలలో పెట్రోల్ ధర 9సార్లు, డీజిల్ ధర 10సార్లు పెరిగింది. దీంతో పైసా పైసా పెరుగతూ వస్తున్న ధరలు మళ్లీ పాత స్థితికి చేరుకుంటూ వుండటంతో వినియోగదారుల గుండెల్లో గుబులు మొదలైంది. -
రూపాయికి చమురు భయం
ముంబై: క్రూడ్ ధరల పెరుగుదల భయానికి రూపాయి పతనమయ్యింది. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో మంగళవారం ఒకేరోజు 53 పైసలు పతనమై 70.21 వద్ద ముగిసింది. సోమవారం రూపాయి ముగింపు 69.68. ట్రేడింగ్ మొదట్లోనే రూపాయి బలహీనంగా 69.83 వద్ద ప్రారంభమైంది. ఒకదశలో 70.23ను కూడా తాకింది.ముఖ్యాంశాలు చూస్తే... ►క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే, భారత్ ప్రధానంగా దిగుమతి చేసుకునే క్రూడ్ బిల్లు దేశానికి అదనపు భారం అవుతుంది. ఇది దేశ కరెంట్ అకౌంట్ లోటుపై (క్యాడ్– దేశానికి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) ప్రతికూల ప్రభావం చూపుతుంది. ►ఆయా అంశాల నేపథ్యంలో దిగుమతిదారుల నుంచి అమెరికా కరెన్సీకి డిమాండ్ రావడం రూపాయి సెంటిమెంట్ను బలహీనపరిచింది. యన్ (జపాన్), పౌండ్ (బ్రిటన్), యూరో (యూరప్) కరెన్సీలపై అమెరికా డాలర్ బలోపేతం కావడం కూడా రూపాయి పతనానికి కారణమయ్యింది. ►రెండు రోజుల ట్రేడింగ్ వరుల లాభాల తర్వాత రూపాయి బలహీనత ఇదే తొలిసారి. గడచిన రెండు రోజుల్లో రూపాయి 52 పైసలు బలపడింది. ► అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్ ధరలు అంతర్జాతీయంగా అనూహ్యంగా 30 డాలర్ల వరకూ పడిపోతూ వచ్చిన నేపథ్యంలో... క్రమంగా కోలుకుంది. ఈ వార్త రాసే సమయం రాత్రి 9 గంటలకు అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో రూపాయి విలువ 70.16 వద్ద ట్రేడవుతుండగా, డాలర్ ఇండెక్స్ 95.55 వద్ద ట్రేడవుతోంది. ► ఇక ఇదే సమయానికి భారత్ ప్రధానంగా దిగుమతి చేసుకునే బ్రెంట్ క్రూడ్ ధర బేరల్కు 58.50 వద్ద ట్రేడవుతుండగా (డిసెంబర్ చివరి వారంలో 52 వారాల కనిష్ట స్థాయి 49.93 డాలర్లు). ఇక నైమెక్స్ క్రూడ్ ధర రెండు వారాల క్రితం 42.36కాగా, ఈ వార్తరాసే సమయానికి 49.50 వద్ద ట్రేడవుతోంది. -
భారీగా పతనమైన చమురు ధర
అంతర్జాతీయంగా చమురు ధరలు మరింత కిందికి దిగి వస్తున్నాయి. అమెరికా మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 6.50శాతం క్షీణించి 50.47 డాలర్ల వద్ద ముగిసింది. దీంతో ఏడాది కనిష్టానికి చేరాయి. వారంలో రోజుల్లోనే ఏకంగా 11శాతం క్షీణించగా, ఈ త్రైమాసికంలో 40శాతానికి పైగా దిగివచ్చింది. ఆర్థికవృద్ధి మందగమన భయాలతో పాటు క్రూడ్ ఉత్పత్తి పెరుగుదలతో క్రూడాయిల్ పతనమైందని ఎనలిస్టులు చెపుతున్నారు. మరోవైపు ఒపెక్ దేశాలు ఇంధన ఉత్పత్తిలో కోత విధింపుపై సందేహాలు తలెత్తడం కూడా క్రూడాయిల్ ధరలపై ప్రభావాన్ని చూపుతున్నాయి. భారీగా క్షీణిస్తున్న క్రూడాయిల్ ధరలను అదుపులో తెచ్చేందుకు రష్యా నేతృత్వంలోని ఒపెక్ దేశాలు జనవరి నుంచి రోజుకు 1.2 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తి కోతకు అంగీకరించిన సంగతి తెలిసిందే. ప్రపంచదేశాల సూక్ష్మఆర్థిక వ్యవస్థ గణాంకాలుఆశించిన స్థాయిలో నమోదుకాకపోవడం, తగ్గుతున్నక్రూడ్ ఆయిల్ డిమాండ్, ఈనెలలోఈక్విటీ మార్కెట్లు 9.5శాతం క్షీణతతోపాటు, యూరోజోన్ రుణ సంక్షోభం ఇప్పటికీ కొనసాగుతూనే ఉండడం తదితర అంశాలన్నీల క్రూడాయిల్ ధరలపై ఒత్తిడిని పెంచుతున్నాయని విశ్లేషకులంటున్నారు. -
వారెవ్వా..రుపీ..అయిదేళ్లలో ఇదే బెస్ట్
సాక్షి,ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి దూసుకుపోయింది. డాలరు మారకంలో సోమవారం నాటి ముగింపు 71.56 తో పోలిస్తే నేడు భారీగా లాభపడింది. ఆరంభంనుంచి జోష్గా ఉన్న రూపాయి సోమవారం 34పైసలు పుంజుకున్న రూపాయి వరుసగా రెండో రోజు మరింత జోరుగా సాగింది. మంగళవారం 112 పైసలు ఎగిసి 70.44 వద్ద ముగిసింది. ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, భారత కరెంట్ అకౌంట్ లోటు విస్తరణ నేపథ్యంలో రూపాయి బలపడిందని ట్రేడర్లు భావిస్తున్నారు. అయిదేళ్ల తరువాత రూపాయి ఈ స్థాయిలో లాభపడటం ఇదే మొదటిసారని పేర్కొన్నారు. సెప్టెంబరు 19, 2013న డాలరు మారకంలో 161 పైసలు లాభపడింది. అంతర్జాతీయ బెంచ్మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 2.26 శాతం క్షీణించి 58.26 డాలర్ల వద్ద 14 నెలల కనిష్టాన్ని తాకింది. అటు ఇతర విదేశీ కరెన్సీలతో డాలర్ బలపడింది. మార్కెట్లో లిక్విడిటీ ఆందోళలు తగ్గడం, ఈక్విటీ మార్కెట్లో బుల్లిష్ ధోరణి కూడా రూపాయికి మద్దతు ఇచ్చిందని ఫారెక్స్ డీలర్లు చెప్పారు. వెరసి భారతీయ కరెన్సీ కళకళలాడింది. మరోవైపు దేశీయ స్టాక్మార్కెట్లు వరుసగా ఆరవరోజు కూడా లాభాల్లో ముగిసిన సంగతి తెలిసిందే. -
ప్యాసింజర్ వాహన అమ్మకాలు డౌన్
న్యూఢిల్లీ: ప్యాసింజర్ వాహన విక్రయాలు ఈ ఏడాది నవంబర్లో నెమ్మదించాయి. సియామ్ గణాంకాల ప్రకారం.. ఈ నెలలో మొత్తం వాహన అమ్మకాలు 2,66,000 యూనిట్లుగా ఉండగా, గతేడాది ఇదేనెలలో 2,75,440 యూనిట్లుగా నమోద య్యాయి. ఏడాది ప్రాతిపదికన 3.43 శాతం తగ్గుదల చోటుచేసింది. జూలై తరువాత ఆగస్టులో మాత్రమే 1.55% అమ్మకాలు పెరుగగా.. ఆ తరువాత నుంచి మళ్లీ వరుసగా తగ్గుదలను నమోదుచేస్తూ వచ్చాయి. ఈ కాలంలో వడ్డీ రేట్ల పెరుగుదల, ముడి చమురు ధరలు పెరగడం వంటి అంశాలు ప్రధాన కారణాలుగా ఉన్నాయని డైరెక్టర్ జనరల్ మాథుర్ వ్యాఖ్యానించారు. అయితే, క్రూడ్ ధరలు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో అమ్మకాలు పుంజుకోవచ్చని భావిస్తున్నట్లు చెప్పారు. పీవీ అమ్మకాల్లో నెమ్మది ఉన్నప్పటికీ.. మొత్తం వాహన అమ్మకాల్లో మాత్రం పెరుగుదల నమోదైనట్లు తెలిపారు. అన్ని విభాగాల వాహన అమ్మకాలు 5.03 శాతం వృద్ధి చెంది 20,38,015 యూనిట్లుగా ఉండగా, గతేడాది ఇదేనెలలో 19,40,462 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇక ఏప్రిల్–నవంబర్ కాలంలో కూడా పీవీ అమ్మకాలు 5 శాతం తగ్గగా.. వాణిజ్య వాహనాలు 31 శాతం, త్రిచక్ర వాహనాలు 21 శాతం, ద్విచక్ర వాహనాలు 10 శాతం వృద్ధి చెందాయి. మొత్తం వృద్ధి 11 శాతంగా ఉంది. నవంబర్ పీవీ అమ్మకాల గణాంకాలను కంపెనీల వారీగా పరిశీలిస్తే.. మహీంద్ర అండ్ మహీంద్రా 1.26 శాతం వృద్దితో 16,191 యూనిట్లను విక్రయించింది. టాటా మోటార్స్ 3.26 క్షీణతతో 18,226 యూనిట్లను విక్రయించింది. తగ్గిన కార్లు.. పెరిగిన బైక్లు గతనెలలో మొత్తం కార్ల అమ్మకాలు 1,79,783 యూనిట్లు కాగా, అంతకుముందు ఇదే ఏడాదిలో 1,81,435 యూనిట్ల విక్రయాలు జరిగాయి. మరోవైపు ద్విచక్ర వాహనాలు 7.15 శాతం పెరిగి 16,45,791 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతక్రితం 15,36,015 యూనిట్లుగా ఉన్నాయి. హీరో మోటోకార్ప్ 4.98 శాతం వృద్ధితో 5,36,193 యూనిట్లను విక్రయించింది. బజాజ్ ఆటో 4.98 శాతం వృద్ధితో 2,05,259 యూనిట్లను విక్రయించింది. హోండా మోటార్ సైకిల్స్ అమ్మకాలు 14.97 శాతం తగ్గి 1,27,896 యూనిట్లుగా ఉన్నాయి. స్కూటర్ల విభాగంలో మొత్తం 5,21,542 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. -
మార్కెట్లకు ఎన్నికల ఫలితాల దిశానిర్దేశం
న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, క్రూడాయిల్ రేట్లతో పాటు అంతర్జాతీయ పరిణామాలు ఈ వారం దేశీ మార్కెట్లకు దిశా నిర్దేశం చేయనున్నాయి. రాజకీయ పరిణామాలతో స్టాక్ మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ వివరాలు వెల్లడైన నేపథ్యంలో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ, స్టాక్ ఎక్సే్చంజీలు నిఘా చర్యలను మరింత పటిష్టంగా అమలు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ‘మంగళవారం వెల్లడయ్యే రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, దేశీ.. అంతర్జాతీయ స్థూల ఆ ర్థిక గణాంకాల వెల్లడి, క్రూడాయిల్ రేట్ల కదలికలు తదితర అంశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించడం మంచిది. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల కోణంలో చూస్తే అయిదు రాష్ట్రాల ఫలితాలు చాలా కీలకంగా ఉండనున్నాయి’ అని ఈక్విటీ99 సీనియర్ రీసెర్చ్ అనలిస్టు రాహుల్ శర్మ తెలిపారు. ‘ఒపెక్ సదస్సు, హువావే గ్లోబల్ సీఎఫ్వో అరెస్టు వంటి పరిణామాలు ఇన్వెస్టర్లను ఆందోళనలో పడవేశాయి. వీటితో పాటు అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. స్వల్పకాలికంగా మార్కెట్లలో హెచ్చుతగ్గులకు ఆజ్యం పోయనున్నాయి’ అని ఎపిక్ రీసెర్చ్ సంస్థ సీఈవో ముస్తఫా నదీమ్ చెప్పారు. ‘అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాల వెల్లువ, క్రూడాయిల్ ధరలు మళ్లీ పెరుగుతుండటం వంటి అంశాలతో ఈ వారం దేశీ సూచీలు ఒత్తిళ్లకు లోనయ్యే అవకాశం ఉంది. ఇక రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కూడా హెచ్చుతగ్గులకు దారితీయొచ్చు. సూచీలు ఇంట్రా డేలో 1% పైగా అటూ ఇటూ సాధారణంగానే తిరిగేసే అవకాశం ఉంది’ అని ఎడెల్వీజ్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ చీఫ్ మార్కెట్ స్ట్రాటెజిస్ట్ సాహిల్ కపూర్ తెలిపారు. టెక్నికల్గా చూస్తే భారీ కరెక్షన్కు లోనైన నిఫ్టీ మళ్లీ బౌన్స్ బ్యాక్ అవడంతో బుల్స్ తిరిగొచ్చేందుకు ఆస్కారముందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసాని చెప్పారు. నిఫ్టీ గానీ 10,775 పాయింట్ల నిరోధాన్ని దాటితే మరింత పెరగొచ్చని, 10,588 పాయింట్ల వద్ద మద్దతు ఉండగలదని పేర్కొన్నారు. సెన్సెక్స్ గతవారం 521 పాయింట్లు క్షీణించి 35,673 వద్ద, నిఫ్టీ 183 పాయింట్ల నష్టంతో 10,694 వద్ద క్లోజయ్యాయి. రూపాయిపైనా ఒత్తిడి .. గతవారం ఆఖర్లో సమావేశమైన చమురు ఉత్పత్తి దేశాల కూటమి ఒపెక్ .. ముడిచమురు ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో బ్రెట్ క్రూడ్ రేటు శుక్రవారం ఒక్కసారిగా 2 శాతం పైగా పెరిగింది. మరోవైపు, చైనా టెలికం దిగ్గజం హువావే గ్లోబల్ సీఎఫ్వో మింగ్ వాంఝూను కెనడాలో అరెస్టు చేయడం అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీ మార్కెట్నూ కుదిపేసింది. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరో విడత వడ్డీ రేట్ల పెంచడంపై ఈ నెలలో నిర్ణయం తీసుకోనుండటం కూడా ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించేందుకు కారణం కానుంది. వడ్డీ రేట్లు పెంపుతో భారత్ వంటి వర్ధమాన మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిణామాలతో అంతర్జాతీయ ఫండ్స్ రిస్కు తీసుకోవడానికి ఇష్టపడకపోవచ్చని, ఫలితంగా అమ్మకాలు వెల్లువెత్తవచ్చని అనలిస్టులు పేర్కొన్నారు. 70.50–72.50 మధ్య రూపాయి .. ఈ వారంలో డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 70.50–72.50 మధ్య తిరుగాడే అవకాశాలు ఉన్నాయని కొటక్ సెక్యూరిటీస్ డిప్యుటీ వైస్ ప్రెసిడెంట్ (కరెన్సీ, వడ్డీ రేట్ల విభాగం) అనింద్య బెనర్జీ తెలిపారు. ‘అమెరికా డాలర్ను ట్రేడర్లు భారీగా షార్ట్ చేశారు. కీలకమైన రాజస్థాన్, మధ్యప్రదేశ్లో బీజేపీ అధికారంలోకి రాకపోవొచ్చని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం సెషన్లో షార్ట్ కవరింగ్ జరిగి రూపాయితో పోలిస్తే డాలర్ ర్యాలీ చేసే అవకాశాలు ఉన్నాయి’ అని ఆమె తెలిపారు. ‘వచ్చేవారం ఎన్నికల ఫలితాలే కీలకంగా ఉంటాయి. ఒకవేళ మధ్యప్రదేశ్లో మళ్లీ బీజేపీనే వచ్చి.. ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో ఏ ఒక్కదాన్లోనైనా గెలుపొందిన పక్షంలో రూపాయి ర్యాలీ చేయొచ్చు. అలా కాకుండా బీజేపీ ఓడిపోతే.. రూపాయికి ప్రతికూలంగా కాగలదు‘ అని అనింద్య వివరించారు. ఇవి కాకుండా ఈ వారం వెల్లడయ్యే స్థూల ఆర్థిక గణాంకాలూ కీలకం కానున్నాయి. 12న పారిశ్రామికోత్పత్తి, వినియోగదారుల ఆధారిత ద్రవ్యోల్బణం (సీపీఐ) గణాంకాలు, డిసెంబర్ 14న టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం, ఎగుమతుల గణంకాలు విడుదల కానున్నాయి. 5 రోజుల్లో రూ. 400 కోట్లు దేశీ మార్కెట్ల నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకున్న ఎఫ్పీఐలు న్యూఢిల్లీ: చైనా టెలికం పరికరాల సంస్థ హువావే సీఎఫ్వో అరెస్టుతో అంతర్జాతీయ మార్కెట్లు బలహీనపడిన నేపథ్యంలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) గత 5 సెషన్స్లో ఏకంగా రూ. 400 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం డిసెంబర్ 3–7 మధ్య వ్యవధిలో ఎఫ్పీఐలు ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ. 383 కోట్లు ఉపసంహరించారు. అదే సమయంలో డెట్ మార్కెట్లలో రూ. 2,744 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. డిసెంబర్ 6న ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తాయని, ఎఫ్పీఐలు ఒక్క రోజులోనే రూ. 361 కోట్ల విక్రయాలు జరిపారని మార్నింగ్స్టార్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఇండియా సీనియర్ అనలిస్ట్ మేనేజర్ హిమాంశు శ్రీవాస్తవ తెలిపారు. హువావే సీఎఫ్వో మెంగ్ వాంఝూ అరెస్ట్ కావడంతో అంతర్జాతీయ మార్కెట్లు భారీగా క్షీణించడం ఇందుకు కారణమైందన్నారు. -
భారీగా తగ్గిన పెట్రోలు, డీజిలు ధర
సాక్షి,న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టడంతో దేశీయంగా కూడా పెట్రోల్, డీజిలు ధరలు కూడా తగ్గుతున్నాయి. దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధర లీటరుకు 40-44 పైసలు తగ్గిస్తున్నట్టు దేశీయ ఆయిల్ కంపెనీలు శుక్రవారం ప్రకటించాయి. దీంతో ఢిల్లీ, కోలకతా, ముంబై, చెన్నై, హైదరాబాద్, విజయవాడ సహా ఇతర నగరాల్లో పెట్రోలు, డీజిలు ధరలు మరింత దిగి వచ్చాయి. ముఖ్యంగా అక్టోబరులో నింగిని తాకిన పెట్రోలు ధర ఇప్పటివరకూ రూ.8 లు దిగి వచ్చింది. ముఖ్యంగా ఈ నవంబరు నెలలో లీటరు పెట్రోలు ధరరూ.4లు , డీజిలు ధర రూ.3.10 మేర తగ్గింది. హైదరాబాద్ : పెట్రోలు ధర లీటరుకు రూ. 80.12 డీజిలు ధర రూ. 76.77. విజయవాడ : పెట్రోలు ధర లీటరుకు రూ. 79.39, డీజిలు ధర రూ. 75.64. న్యూఢిల్లీ: పెట్రోలు ధర రూ. 75.57, డీజిలు ధర్ రూ. 70.56. ముంబై: పెట్రోలు ధర లీటరుకు రూ. 81.10, డీజిలు ధర రూ. 73.91. కోలకతా: పెట్రోలు ధర లీటరుకు రూ. 77.53, డీజిలు ధర రూ. 72.41. చెన్నై: పెట్రోలు ధర లీటరుకు రూ. 78.46, డీజిలు ధర రూ. 74.55. మరోవైపు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి కూడా భారీగా బలపడింది. నిన్న(గురువారం) దాదాపు మూడు నెలల తరువాత రూ.71నుంచి పైకి ఎగబాకింది. -
రెండు నెలల గరిష్టానికి రూపాయి
సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి బుధవారం మరింత బలపడింది. డాలరుమారకంలో 81 పైసలు పుంజుకుని 72 వద్ద 8 వారాల గరిష్టానికి చేరింది. మంగళవారం 22పైసలు లాభపడి రూపాయి ఈ రోజు మరింత పాజిటివ్గా ట్రేడింగ్ను ఆరంభించింది. సెప్టెంబరు 21 తరువాత మళ్లీ 72 స్థాయికి రూపాయి బలపడింది. ప్రస్తుతం 72.09 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ముఖ్యంగా అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో డాలరుకు డిమాండ్ తగ్గిందని ట్రేడర్లు తెలిపారు. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 65 డాలర్ల వద్ద కొనసాగుతోంది. -
పెట్రో ధరలు: మరో శుభవార్త!
సాక్షి, ముంబై: పెట్రో షాక్నుంచి ఇపుడిపుడే తేరుకుంటున్న వాహనదారులకు మరో శుభవార్త. గత నెలలో పెట్రోలు, డీజిల్ ధరల తగ్గింపు ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలో వచ్చే 15 రోజుల్లో ఇంధన ధరలు లీటరుకు మరో 5 రూపాయలకు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్ నుంచి చమురు కొనుగోలుపై పరిమితులపై భారత్, చైనా, జపాన్ సహా 8 దేశాల నుంచి మినహాయింపు ఇచ్చిన నేపథ్యంలో ధరలు మరింత దిగి వస్తాయని భావిస్తున్నారు. ఈ ఉపశమనం తాత్కాలికమే అయినప్పటికీ ఈ మేరకు సానుకూల ప్రభావం ఉండనుందని భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రపంచంలో ముడి చమురు వినియోగంలో మూడవ అతిపెద్ద వినియోగదారు భారత్కు చాలా ప్రయోజనం ఉంటుందని అంచనా. అయితే ఇరాన్పై అమెరికా ఆంక్షలు కొనసాగుతాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బ్యారెల్కు 68 డాలర్లు రావచ్చని కూడా కేడీయా కమోడిటీ మేనేజింగ్ డైరెక్టర్ అజరు కేడియా పేర్కొన్నారు. అలాగే డాలరు మారకంలో రూపాయి విలువ రూ. 72.50 పైకి రాగలిగితే దేశంలో పెట్రోల్ ధర 5 రూపాయల మేర తగ్గవచ్చని కేడియా చెప్పారు. దీంతోపాటు ఒక రూపాయి డిస్కౌంట్ను ఉపసంహరించుకోవాలని, చమురు మార్కెటింగ్ కంపెనీలను (హెచ్పీసీఎల్, బిపిసిఎల్, ఐఒసి) అడగవచ్చని.. ఇదే జరిగితే పెట్రో ధరలనుంచి భారీ ఉపశమనం లభిస్తుందని ఆయన విశ్లేషించారు. కాగా రికార్డు స్థాయిధరలో వాహన దారులకు చుక్కలు చూపించిన పెట్రో ధరలు క్రమంగా నేలకు దిగి వస్తున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు దిగిరావడంతో దేశంలో 18 రోజుల వ్యవధిలో పెట్రోల్ ధర లీటరుకు రూ.4.05 మేర క్షీణించిన సంగతి తెలిసిందే. -
తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు
సాక్షి, న్యూఢిల్లీ: దీపావళి రోజు యథాతథంగా కొనసాగిన ఇంధన ధరలు నేడు( గురువారం, నవంబరు 8) తగ్గుముఖం పట్టాయి. పెట్రోలుపై లీటరుకు సగటున 21పైసలు, డీజిల్ పై 18పైసలు ధర తగ్గింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర లీటరు రూ. 78.21కు చేరుకోగా, డీజిల్ ధర లీటరు రూ. 72.89కు చేరింది. హైదరాబాద్: లీటర్ పెట్రోల్ ధర 32 పైసలు తగ్గి రూ. 82. 93, డీజిల్ 22 పైసలు తగ్గి లీటరు రూ. 79.31 కు చేరింది. విజయవాడ: లీటర్ పెట్రోల్ 82.11, డీజిల్ ధర రూ. 78.08 ముంబై: లీటర్ పెట్రోల్ ధర రూ.83.72, డీజిల్ ధర రూ.76.38గా ఉంది. చెన్నై: లీటర్ పెట్రోల్ రూ. 81.24, డీజిల్ ధర రూ.77.05 కోలకతా: లీటర్ పెట్రోల్ రూ. 80.13, డీజిల్ ధర రూ.74.75 అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు క్రమంగా దిగి వస్తున్న తరుణంలో దేశీయంగా కూడా పెట్రోలు , డీజిల్ ధరలు వాహన దారులకు మరింత ఊరట కల్పించనున్నాయని ఎనలిస్టులు భావిస్తున్నారు. -
తగ్గిన పెట్రోలు ధర : ఢిల్లీలో రూ.80 దిగువకు
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా చమురు ధరలు క్షీణిస్తుండటంతో దేశీయంగా వాహనదారులకు పెట్రో ధరలు భారీ ఊరటనిస్తున్నాయి. క్రమంగా తగ్గుముఖం పడుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు శనివారం (నవంబరు 3) కూడా దేశీయంగా తగ్గాయి. పెట్రోల్ పై 19పైసలు, డీజిల్పై 12పైసలు ధర తగ్గింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 80రూపాయల దిగువకు చేరింది. తాజా తగ్గింపుతో లీటర్ పెట్రోలు ధర రూ.78.99 వద్ద ఉంది. డీజిల్ ధర 11 పైసలు తగ్గి రూ.73.53 కి చేరింది. అలాగే వాణిజ్య రాజధాని ముంబైలో 19 పైసలు తగ్గిన పెట్రోలు ధర రూ.84.49 కి చేరగా.. డీజిల్ ధర 12 పైసలు తగ్గి రూ.77.06 కి చేరింది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ 21 పైసలు తగ్గి రూ.83.75లుపలుకుతుండగా, డీజిల్ ధర 12 పైసలు తగ్గి రూ.80 కి చేరింది. విజయవాడలో పెట్రోల్ ధర రూ.82.94 ఉండగా, డీజిల్ ధర రూ.78.75 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర మరింత తగ్గి 72.83 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. కోల్కతా : పెట్రోలు ధర లీటరు.రూ. 80.89. డీజిల్ ధర రూ. 75.39 చెన్నై: పెట్రోలు ధర లీటరు.రూ. 82.06.డీజిల్ ధర రూ. 77.73 బెంగళూరు : పెట్రోలు ధర లీటరు. 79.63. డీజిల్ ధర రూ. 73.93 -
రూ.1.79 లక్షల కోట్ల సంపద హుష్కాకి
ముంబై : ఆయిల్ ధరలు భారీగా పెరగడం, రూపాయి విలువ అంతకంతకు క్షీణించడం నేడు స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. సెన్సెక్స్ 550 పాయింట్ల క్రాష్ అయి, మూడు నెలల కనిష్ట స్థాయిలకు పడిపోయింది. చివరి గంట ట్రేడింగ్లో నెలకొన్న అమ్మకాల ఒత్తిడి మార్కెట్లను కుప్పకూల్చింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద భారీగా హరించుకుపోయింది. బీఎస్ఈలో లిస్ట్ అయిన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ నేడు ఒక్కరోజే ఏకంగా రూ.1.79 లక్షల కోట్లు తుడిచి పెట్టుకుపోయింది. దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.145.43 లక్షల కోట్ల నుంచి రూ.143.64 లక్షల కోట్లకు పడిపోయింది. ఆగస్టు 31 నుంచి ఇప్పటి వరకు బీఎస్ఈ మార్కెట్ క్యాప్ మొత్తంగా రూ.15.74 లక్షల కోట్లు క్షీణించింది. క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరగడంతో, నేటి ట్రేడింగ్లో రూపాయి విలువ భారీగా క్రాష్ అయి, మొట్టమొదటిసారి 73 మార్కు దిగువకు పడిపోయింది. 73.42 వద్ద చరిత్రాత్మక కనిష్ట స్థాయిలను నమోదు చేసింది. అమెరికన్ కరెన్సీకి దిగుమతిదారుల నుంచి మంచి డిమాండ్ నెలకొనడం కూడా రూపాయిని దెబ్బకొట్టింది. మరోవైపు బ్రెంట్ క్రూడాయిల్ ధర ఒక్కో బ్యారల్కు 85 డాలర్లను మించిపోవడం కూడా ప్రతికూల ప్రభావం చూపింది. బ్రెంట్ క్రూడాయిల్ ధరలు ఈ విధంగా పడిపోవడం 2014 తర్వాత ఇదే మొదటిసారి. ఏప్రిల్ నుంచి బ్రెంట్ క్రూడాయిల్ ధరలు 20 శాతానికి పైగా ఎగిశాయి. రూపాయి విలువ మరింత ఒత్తిడిని ఎదుర్కొంటుందని విశ్లేషకులు చెప్పారు. రూపాయి విలువలో స్థిరత్వం తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ, అవి ఏవీ మార్కెట్లను సానుకూలంగా నడిపించలేకపోయాయి. అటు నిఫ్టీలో కూడా మెజార్టీ స్టాక్స్ నష్టాలే పాలయ్యాయి. మహింద్రా అండ్ మహింద్రా 7.03 శాతం, ఐషర్ మోటార్స్ 6.79 శాతం, భారతీ ఇన్ఫ్రాటెల్ 6.45 శాతం, టీసీఎస్ 4.38 శాతం, యాక్సిస్ బ్యాంక్ 3.62 శాతం డౌనయ్యాయి. కోర్ సెక్టార్ డేటా కూడా నేడు మార్కెట్పై ప్రభావం చూపింది. ఎనిమిది మౌలిక సదుపాయాల రంగాల వృద్ధి ఆగస్టు నెలలో 4.2 శాతానికి పడిపోయింది. ఇదే జూలై నెలలో 7.3 శాతంగా ఉంది. -
ఆల్-టైమ్ గరిష్టంలో పెట్రోల్ ధరలు
న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు పరుగులు పెడుతున్నాయి. పెరగడమే తప్ప, ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. వాహనదారులకు చుక్కలు చూపిస్తూ రికార్డులు సృష్టిస్తున్నాయి. నేడు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు దేశవ్యాప్తంగా పెరిగాయి. న్యూఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 15 పైసలు పెరిగి, రూ.82.06గా నమోదైంది. ముంబైలో కూడా 15 పైసలు పెరిగి, ఆల్-టైమ్ గరిష్టంలో రూ.89.44 మార్కును టచ్ చేసింది. పెట్రోల్కు తగ్గ రీతిలో డీజిల్ ధరలు కూడా సామాన్యులకు వాత పెడుతున్నాయి. ఢిల్లీలో లీటరు డీజిల్ ధర 6 పైసలు పెరిగి రూ.73.78గా నమోదైంది. అలాగే ముంబైలో రూ.78.33గా ఉంది. రాజధానుల పరంగా పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా ఉంది కోల్కతాలోనే. ఈ నగరంలో లీటరు పెట్రోల్ను రూ.83.91 వద్ద, లీటరు డీజిల్ను రూ.75.53 వద్ద విక్రయిస్తున్నారు. చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ.85.31కి, డీజిల్ ధర రూ.78 కు పెరిగింది. హైదరాబాద్లో లీటరు పెట్రోల్ ధర రూ.86.85గా, లీటరు డీజిల్ ధర రూ.80.19గా నమోదైంది. జనవరి 1 నుంచి ఢిల్లీలో పెట్రోల్ ధర 15.4 శాతం పెరిగింది. అంటే రూ.69.97 నుంచి ప్రస్తుతం రూ.82.06కు చేరుకున్నాయి. డీజిల్ ధర కూడా 22 శాతం ఎగిసింది. ఇంతలా పెట్రోల్, డీజిల్ సామాన్యులను గడగడలాడిస్తుంటే, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇంధనపై విధిస్తున్న ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడం లేదు. ఆగస్టు నుంచి అయితే ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప అసలు తగ్గడం లేదు. క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటం, డాలర్ మారకంలో రూపాయి విలువ క్షీణించడం ఈ ధరల పెరుగదలకు మరింత తోడ్పడుతోంది. -
బంకు.. చూస్తే జంకు
సాక్షి,హైదరాబాద్: పెట్రోలు బంకు అంటేనే జనం జంకాల్సిన పరిస్థితి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో పెట్రో, డీజిల్ ధర పైసా పైసా పెరుగుతూ చుక్కలు చూపిస్తోంది. రోజువారీ ధరల సవరణ అనంతరం తెలుగు రాష్ట్రాల్లో డీజిల్ ధరలు దేశంలోనే రికార్డు సృష్టిస్తుండగా పెట్రోల్ ధరలో మాత్రం ముంబై తర్వాత రెండో స్ధానంలో ఆల్టైం రికార్డుగా మారింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరుగుదల, డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణించడం మధ్య వరుసగా గత పన్నెండు రోజుల్లో ఇంధన ధరలు పైకి ఎగబాకుతున్నాయి. ధరల సవరణ విషయంలో మధ్యలో ఒక రోజు విరామం ఇచ్చిన చమురు మార్కెటింగ్ సంస్ధలు మళ్లీ విజృంభించాయి. దీంతో ఇప్పటికే ఆల్టైమ్ హై రికార్డు వద్ద కదలాడుతున్న ధరలు మరింత పెరిగాయి. చమురు సంస్థలు ప్రజలకు నొప్పి తెలియకుండా రోజువారీ ధరల సవరణలతో సైలెంట్గా బాదేస్తున్నాయి. ఒకప్పుడు ప్రతి 15 రోజులకోసారి పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షించిన చమురు సంస్థలు.. కిందటేడాది ఆ విధానానికి స్వస్తి పలికాయి. మార్కెట్ ధరలకు అనుగుణంగా ఏ రోజుకు ఆ రోజు ధరలను నిర్ణయిస్తున్నాయి. పన్నుల మోతనే.. పెట్రో ధరల దూకుడుకు పన్నుల మోతే కారణంగా కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ (విలువ ఆధారిత పన్ను) విధిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ కింద పెట్రోల్పై రూ. 21.48 లు, డీజిల్పై రూ.17.33 వసూలు చేస్తోంది. ఆ తర్వాత మొత్తం ధరపై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ పన్ను మోత మోగిస్తోంది. తెలుగు రాష్ట్రాలు పెట్రోల్ ఉత్పత్తుల అమ్మకాలపై వ్యాట్ పన్నుల విధింపులో దేశంలోనే రెండో స్థానంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్పై 31శాతం వ్యాట్ విధిస్తున్నప్పటికీ ప్రతి లీటర్పై రూ.4 అదనపు వ్యాట్ వసూలు చేస్తుండటంతో 38.82 శాతానికి చేరింది. డీజిల్పై 22.25 శాతం పన్ను, ప్రతి లీటర్పై రూ.4 అదనపు వ్యాట్ వసూలు చేస్తుండటంతో 30.71 శాతానికి చేరింది. తెలంగాణలో పెట్రోల్పై 35.20 శాతం, డీజిల్ 27 శాతం వ్యాట్ వసూలు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిపి సగటున పెట్రోల్పై 57 శాతం. డీజిల్పై 44 శాతం పన్నుల భారం పడుతోంది. క్రూడాయిల్ దూకుడు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర ఎగబాగుతోంది. మార్కెట్లో ఇండియన్ క్రూడ్ బాస్కెట్ ధర రూ.4,872లకు చేరింది. ఒక బాస్కెట్ (బ్యారెల్)లో 159 లీటర్లు చమురు ఉంటుంది. ఈ లెక్కన లీటర్ చమురు ధర రూ.30.64. క్రూడాయిల్ రీఫైనింగ్, రవాణా ఖర్చులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల మోతతో చమురు ధరలు రికార్డు సృష్టిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో దాదాపు సగానికిపైగా పన్నుల భారం వినియోగదారుల మీద పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు గతంలో తగ్గినా పెట్రో ధరలు మాత్రం తగ్గలేదు. తాజాగా పెరుగుతున్న క్రూడాయిల్ ధరలకు తోడు పెట్రోల్, డీజిల్ ధరల రోజువారీ సవరణ మరింత ఆందోళనకరంగా తయారైంది. -
పెట్రోల్ ధరలు : నీతి ఆయోగ్ నిర్లక్ష్య వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. ఎన్నడూ లేనంతగా గరిష్ట స్థాయిలను చేరుకుంటున్నాయి. గ్లోబల్గా క్రూడాయిల్ ధరలు పెరగడంతో, పెట్రో మంట వినియోగదారులకు వాత పెడుతోంది. పెట్రోల్, డీజిల్ సెగ ఇప్పుడు అన్ని వాటిపై చూపుతుంది. స్కూల్ వ్యాన్ ఫీజులు పెరిగిపోయాయి. అటు స్టాక్ మార్కెట్లకు దీని సెగ తగిలి, కుప్పకూలుతున్నాయి. రూపాయి అయితే ఏకంగా పాతాళంలోకి పడిపోయింది. అయితే ఇంత మేర ప్రభావం చూపుతున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై నీతి ఆయోగ్ వైస్-చైర్మన్ రాజీవ్ కుమార్ నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలు చేశారు. రోజూ, వారం మారే ఆయిల్ ధరలపై ప్రభుత్వం స్పందించాల్సినవసరం లేదంటూ వ్యాఖ్యానించారు. గ్లోబల్ ఆయిల్ ధరలు రోజువారీగా, వారంవారీగా, పిరియాడిక్గా మారుతూనే ఉంటాయని, కమోడిటీ ధరలను గమనించాలని, కానీ వీటిపై ప్రభుత్వం స్పందించాల్సినవసరం లేదని అన్నారు. ‘జూన్లో ధరలు పెరిగాయి. జూలైలో తగ్గిపోయాయి. అవునా కాదా? ఇదే పరిస్థితి మరోసారి జరుగుతుంది’ అంటూ కుమార్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరగడంతో, దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్కై రాకెట్లా పెరిగిపోయాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంపై సీనియర్ కాంగ్రెస్ నేత పీ చిదంబరం, ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పన్నులు ఎక్కువగా ఉండటం వల్లే ఈ ధరలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని అన్నారు. పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి, పన్నులను తగ్గించాలని డిమాండ్ చేశారు. కానీ పెట్రోల్, డీజిల్పై పన్ను రేట్లను తగ్గించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని తెలుస్తోంది. గురువారం ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.79.31గా రికార్డు స్థాయిలో నమోదైంది. డీజిల్ కూడా ఆల్-టైమ్ గరిష్టంలో రూ.71.34గా ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యులకు వాత పెడుతున్న, ప్రభుత్వం స్పందించకపోవడం చర్చనీయాంశమైంది. మరోవైపు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ప్రభుత్వం స్పందించాల్సినవసరం లేదనడం గమనార్హం. -
చివరి గంట.. రికవరీ బాట
ముంబై : పాతాళంలోకి జారిపోతున్న రూపాయి, క్రూడ్ ఆయిల్ ధరల షాక్, స్టాక్ మార్కెట్లను విపరీతంగా దెబ్బకొట్టింది. నేటి ఇంట్రాడేలో మార్కెట్లు భారీ మొత్తంలో నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా పడిపోయింది. నిఫ్టీ 100 పాయింట్లకు పైగా దిగజారింది. కానీ చివరి గంట ట్రేడింగ్ మాత్రం మార్కెట్లకు బాగా సాయపడింది. అప్పటి వరకు కొనసాగిన భారీ నష్టాలను చివరి గంట ట్రేడింగ్లో కొంత మేర తగ్గాయి. సెన్సెక్స్ 250 పాయింట్లు రికవరీ అవగా.. నిఫ్టీ 70 పాయింట్ల నష్టాలను తగ్గించుకుంది. అయినప్పటికీ, మార్కెట్లు నష్టాల్లోనే ముగియడం గమనార్హం. ట్రేడింగ్ ముగింపు సమయానికి సెన్సెక్స్ 140 పాయింట్లు పడిపోయి 38,018 వద్ద, నిఫ్టీ 43 పాయింట్లు క్షీణించి 11,476 వద్ద స్థిరపడ్డాయి. ఆటోమొబైల్ కంపెనీలు ర్యాలీ జరపడంతో మార్కెట్లు చివరిలో రికవరీ అయ్యాయి. ఆగస్ట్ నెల జేఎల్ఆర్ విక్రయాలు మంచి వృద్ధిని కనబర్చడంతో, టాటా మోటార్స్ షేరు దూసుకెళ్లింది. మెటల్స్ కూడా రికవరీ అయ్యాయి. ఫార్మాస్యూటికల్స్ ఉదయం, మధ్యాహ్నం ట్రేడింగ్లో లాభాలార్జించిన రంగంగా ఉంది. నిఫ్టీ ఫార్మా, మెటల్ ఇండెక్స్లు ఒక శాతం మేర లాభపడ్డాయి. మరోవైపు రూపాయి విలువ అంతకంతకు కిందకు దిగజారుతూనే ఉంది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతుండటంతో, రూపాయి పాతాళంలోకి పడిపోతుంది. దీంతో వాణిజ్య లోటు ఏర్పడి, కరెంట్ అకౌంట్ లోటు పెరుగుతుందని ఐడీబీఐ క్యాపిటల్ రీసెర్చ్ హెడ్ ఏకే ప్రభాకర్ చెప్పారు. ప్రస్తుతం డాలర్ మారకంలో రూపాయి విలువ 26 పైసలు నష్టపోయి 71.83 వద్ద కనిష్ట స్థాయిల్లో నమోదైంది. -
రూపీ, క్రూడ్ ఆయిల్ పడగొట్టాయ్
ముంబై : రూపాయి క్షీణత, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం దేశీయ స్టాక్ మార్కెట్లను దెబ్బకొట్టింది. రోజంతా అస్థిరంగా ట్రేడైన స్టాక్ మార్కెట్లు, చివరిలో నష్టాలతో సరిపెట్టుకున్నాయి. చివరి గంట ట్రేడింగ్లో మరోసారి అమ్మకాల తాకిడి తగిలింది. మార్కెట్ ముగింపులో సెన్సెక్స్ 155 పాయింట్లు నష్టపోయి 38,157.92 వద్ద, నిఫ్టీ 62 పాయింట్లు నష్టపోయి 11,520 వద్ద క్లోజయ్యాయి. నేటి ట్రేడింగ్లో టాప్ గెయినర్లుగా ఇన్ఫోసిస్, టెక్ మహింద్రా, టీసీఎస్, హెచ్సీఎల్, టెక్ మహింద్రా టాప్ గెయినర్లుగా నిలువగా... ఏసియన్ పేయింట్స్, ఎస్బీఐ, గ్రాసిమ్, ఇండియాబుల్స్ హౌజింగ్ టాప్ లూజర్లుగా నష్టాలు గడించాయి. డాలర్తో రూపాయి మారకం విలువ కూడా భారీగా క్రాష్ అయింది. నేటి ట్రేడింగ్లో అత్యంత కనిష్ట స్థాయిల వద్ద డాలర్కు 71.42 వద్ద సరికొత్త కనిష్ట స్థాయిని నమోదు చేసింది. మరోవైపు పెట్రోల్ ధరలు రికార్డు స్థాయిల్లో ఎగిసిపడుతున్నాయి. ముంబైలో లీటరు పెట్రోల్ ధర 16 పైసలు పెరిగి, రూ.86.72గా నమోదైంది. ఇతర నగరాల్లో కూడా ఇదే మాదిరి పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. వీటి ప్రభావం ఇటు స్టాక్ మార్కెట్లపై చూపింది. -
షాకింగ్ : ఆల్ టైం హైలో పెట్రోల్ ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం వరుసగా 15వ రోజు కూడా భగ్గుమన్నాయి. హైదరాబాద్లో పెట్రోల్ లీటర్కు రూ 84.09కు చేరగా, ముంబైలో అత్యధికంగా పెట్రోల్ లీటర్కు రూ 86.72 పలికింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్కు రూ 79.31కు చేరింది. ఇక డీజిల్ ధరలూ రికార్డు స్ధాయికి చేరాయి. దేశ ఆర్థిక, వాణిజ్య రాజధాని ముంబైలో డీజిల్ లీటర్కు రూ 75.74కు పెరిగింది. అమెరికన్ డాలర్తో రూపాయి అత్యంత కనిష్టస్ధాయికి పడిపోయిన క్రమంలో ఆగస్ట్ 16 నుంచి ఇంధన ధరలు భగ్గుమంటూనే ఉన్నాయి. దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదలకు ముడిచమురు ధరలు భారమవడం, రూపాయి బలహీనం వంటి అంతర్జాతీయ అంశాలే కారణమని పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెబుతున్నారు. ముడిచమురు ఉత్పాదన పడిపోవడం కూడా ధరల పెంపునకు కారణమని చెప్పుకొచ్చారు. పెట్రో ధరల పెంపు తాత్కాలికమేనని త్వరలోనే పరిస్థితి కుదుటపడుతుందని మంత్రి పేర్కొన్నారు. -
షాకింగ్ : ఆగని పెట్రో సెగలు
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్ ధరల పెరుగుదలకు బ్రేక్ పడటం లేదు. ఇంధన ధరలు వరుసగా సోమవారం మూడోరోజూ భారమయ్యాయి. పెట్రోల్ లీటర్కు 30 పైసలుకు పైగా పెరగ్గా, పలు మెట్రో నగరాల్లో డీజిల్ ధరలు లీటర్కు 40 పైసలు పైగా పెరిగాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ సోమవారం రూ 84.10 పైసలకు చేరింది. ఇక ముంబయిలో రెండు రోజుల కిందట రూ 83.76 పలికిన లీటర్ పెట్రోల్ ప్రస్తుతం రూ 86.56కు ఎగబాకింది. ఇక చెన్నైలో రూ 82.24, కోల్కతాలో రూ 82,.02, ఢిల్లీలో రూ 78.84గా నమోదైంది. మరోవైపు డీజిల్ ధరలూ భారమయ్యాయి. ముంబయి, చెన్నై, ఢిల్లీల్లో డీజిల్ లీటర్కు వరుసగా రూ 75.54, రూ 75.19, రూ 71.15కు పెరిగింది. ఇక కోల్కతాలో డీజిల్ లీటర్ ధర రూ 74కు చేరింది. ముడిచమురు ధరలు పెరుగుతుండటంతో పాటు డాలర్తో రూపాయి విలువ క్షీణిస్తుండటంతో పెట్రో ఉత్పత్తుల ధరలు మరింత పెరుగుతాయని చమురు మార్కెటింగ్ కంపెనీలు పేర్కొన్నాయి. కాగా అమెరికా ఏకపక్ష విధానాలతోనే అంతర్జాతీయ మార్కెట్లలో ఇంధన ధరలు అసాధారణంగా పెరుగుతున్నాయని కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆందోళన వ్యక్తం చేశారు. -
షాకింగ్ : పెట్రో బాంబు పేల్చిన కేంద్ర మంత్రి
సాక్షి, న్యూఢిల్లీ : రోజురోజుకూ భగ్గుమంటున్న పెట్రో ఉత్పత్తుల ధరలపై కేంద్ర మంత్రి బాంబు పేల్చారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల పెరుగుదల, డాలర్తో రూపాయి మారకపు విలువ క్షీణిస్తుండటంతో ఇంధన ధరల పెంపు కొనసాగుతుందని కేంద్ర పెట్రోలియం, సహజవాయు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. పెట్రో ఉత్పత్తుల ధరల పెంపునకు అంతర్జాతీయ అంశాలే కారణమని పేర్కొన్నారు. మరోవైపు శనివారం రికార్డు గరిష్టస్ధాయిలకు చేరిన పెట్రోల్, డీజిల్ ధరలు ఆదివారం సైతం మరింత భారమయ్యాయి. ఇక హైదరాబాద్లో ఆదివారం పెట్రోల్ లీటర్కు 17 పైసలు భారమై రూ 83.59కు పెరిగింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ రూ 86.09కు చేరగా, డీజిల్ లీటర్కు రూ 74.76 పలికింది. అమెరికన్ డాలర్తో రూపాయి రూ. 71కి పడిపోవడంతో ఆగస్ట్ 16 నుంచి ఇంధన ధరల పెరుగుదల కొనసాగుతోంది. -
ప్రపంచ పరిణామాలే కీలకం!
అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడి చమురు ధరలు ఈ వారం మార్కెట్పై ప్రభావం చూపుతాయని నిపుణులంటున్నారు. వీటితో పాటు ఈ ఏడాది ఏప్రిల్–జూన్ క్వార్టర్ జీడీపీ గణాంకాలు, రూపాయి కదలికలు కూడా కీలకమేనని వారంటున్నారు. మరోవైపు ఆగస్టు సిరీస్ ఫ్యూచర్స్ అండ్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ఈ గురువారం (ఈ నెల 30) ముగియనుండటంతో స్టాక్ సూచీలు ఒడిదుడుకులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. శుక్రవారం జీడీపీ గణాంకాలు... ఈ నెల 31న(శుక్రవారం) ఈ ఏడాది జూన్ క్వార్టర్(క్యూ2) స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) గణాంకాలు వెల్లడవుతాయి. ఈ క్యూ1లో 7.7 శాతం వృద్ధి నమోదైంది. ఈ క్యూ2లో 7.6 శాతం వృద్ది నమోదు కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఇదే రోజు జూలై నెలకు సంబంధించిన వాణిజ్య లోటు గణాంకాలు వస్తాయి. మౌలిక రంగ ఉత్పత్తి గణాంకాలు కూడా అదే రోజు వెలువడతాయి. ఈ నెల 24తో ముగిసిన వారానికి సంబంధించిన విదేశీ మారక ద్రవ్య నిల్వలు, ఈ నెల 17తో ముగిసిన వారానికి సంబంధించిన బ్యాంక్ డిపాజిట్లు, రుణాల వృద్ధి గణాంకాలు కూడా శుక్రవారం రోజే వస్తాయి. కాగా అమెరికా–చైనాల మధ్య వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతలు మరింతగా ముదిరాయి. ఇరు దేశాలు 1,600 కోట్ల డాలర్ల విలువైన వస్తువులపై 25 శాతం చొప్పున సుంకాలు విధించాయి. వాణిజ్య ఉద్రిక్తతల నివారణ కోసం ఉద్దేశించిన చర్చలు ఎలాంటి పురోగతి లేకుండానే ముగిశాయి. జీడీపీ గణాంకాలు కీలకం... సమీప భవిష్యత్తులో జీడీపీ గణాంకాలు మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని ఈక్విటీ 99 సీనియర్ రీసెర్చ్ ఎనలిస్ట్ రాహుల్ శర్మ పేర్కొన్నారు. ఎఫ్ అండ్ ఓ ముగింపు నేపథ్యంలో ట్రేడర్లు తమ పొజిషన్లను రోల్ఓవర్ చేస్తారని, దీంతో మార్కెట్లో ఒడిదుడుకులు తప్పవని వివరించారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయని ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తఫా నదీమ్ పేర్కొన్నారు. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య యుద్ధం, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను బలహీనపరుస్తోందని రెలిగేర్ బ్రోకింగ్ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ చెప్పారు. తనను తొలగిస్తే(అభిశంసన) మార్కెట్ భారీగా పతనమవుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడం వల్ల కూడా సెంటిమెంట్ దెబ్బతింటోందని వివరించారు. మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ నిజంగా అభిశంసనకు గురైతే, ప్రపంచ మార్కెట్లు భారీగా పతనమవుతాయని ఈక్విటీ 99 ఎనలిస్ట్ శర్మ అంచనా వేస్తున్నారు. మళ్లీ విదేశీ నిధుల వరద విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ప్రవాహం ఈ నెలలో కొనసాగుతోంది. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐ)ఈ నెలలో ఇప్పటివరకూ మన క్యాపిటల్ మార్కెట్లో రూ.6,700 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం విదేశీ ఇన్వెస్టర్లు మన స్టాక్ మార్కెట్లో రూ.2,048 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.4,662 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేశారు. స్థూల ఆర్థికాంశాలు మెరుగుపడటం, కంపెనీల ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడం దీనికి ప్రధాన కారణాలు. కాగా గత నెలలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు మన క్యాపిటల్ మార్కెట్లో రూ.2,300 కోట్ల మేర మాత్రమే ఉన్నాయి. -
వేతనాలు పెంచకపోగా.. కోతపెట్టిన ఎయిర్లైన్స్
ముంబై : ఇటీవల కాలంలో కంపెనీలు వేతనాలు పెంచకపోగా.. ఉద్యోగులకే ఎసరు పెడుతున్నాయి. వ్యయాలను తగ్గించుకునేందుకు ఉద్యోగులపై వేటు వేయడమో లేదా వేతనాల్లో కోత పెట్టడమో చేస్తున్నాయి. తాజాగా దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ కూడా ఇదే బాటలో నడిచింది. తమ ఉద్యోగుల వేతనాల్లో 25 శాతం వరకు కోత పెట్టింది. 25 శాతం వరకు తగ్గింపు వేతనాన్ని తీసుకోవాలని ఉద్యోగులను జెట్ ఎయిర్వేస్ ఆదేశించినట్టు తెలిసింది. జెట్ ఎయిర్వేస్ ప్రస్తుతం ఒత్తిడిలో కొనసాగుతోందని... క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగడం, రూపాయి విలువ క్షీణించడం వంటి కారణాలతో జెట్ ఎయిర్వేస్కు ఖర్చులు పెరిగిపోయాయని ఎకానమిక్ టైమ్స్ రిపోర్టు చేసింది. వీటిని రికవరీ చేసుకునేందుకు జెట్ ఎయిర్వేస్ ఉద్యోగుల వేతనాల్లో కోత పెట్టింది. ఆగస్టు నుంచి ఈ తగ్గింపు వేతనాలను జెట్ ఎయిర్వేస్ అమలు చేస్తుందని ఎకానమిక్ టైమ్స్ రిపోర్టు చేసింది. ఉద్యోగులు ఎవరైతే వార్షికంగా 12 లక్షల రూపాయల వేతనాన్ని ఆర్జిస్తున్నారో, వారి వేతనాల్లో 5 శాతం కోత పడనుంది. అంతేకాక కోటికి పైగా వేతనాన్ని ఆర్జించే వారి వేతనాల్లో 25 శాతం తగ్గించేస్తోంది. అయితే ఈ వేతన కోత ఎంత కాలం పాటు కొనసాగనుందో ఇంకా తెలియరాలేదు. అయితే ప్రస్తుతం కోత పెట్టిన ఈ మొత్తాన్ని తర్వాత రీఫండ్ చేస్తారో లేదో కూడా క్లారిటీ లేదు. వేతనాల తగ్గింపుపై జెట్ ఎయిర్వేస్ టాప్ మేనేజ్మెంట్, తమ స్టాఫ్తో సమావేశం ఏర్పాటు చేసింది. పైలెట్ల వేతనాలు కూడా 17 శాతం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. జెట్ ఎయిర్వేస్ వార్షిక వేతన బిల్లు రూ.3000 కోట్ల మేర ఉంటుంది. వేతనాల తగ్గింపుతో జెట్ ఎయిర్వేస్కు రూ.500 కోట్లు ఆదా కానుంది. కాగ, గత నెలలోనే జెట్ ఎయిర్వేస్, అదనంగా 75 సింగిల్-ఐసిల్ 737 మ్యాక్స్ ఎయిర్క్రాఫ్ట్లను కొనుగోలు చేసేందుకు ఎయిర్క్రాఫ్ట్ తయారీ దిగ్గజం బోయింగ్తో ఒప్పందం కుదుర్చుకుంది. వీటి విలువ రూ.60,244 కోట్ల వరకు ఉంటుంది. -
మోదీ సర్కార్కు చమురు షాక్
సాక్షి, న్యూఢిల్లీ : భారత్ వృద్ధికి అధిక ముడిచమురు ధరలు ప్రధాన అవరోధమని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ పేర్కొంది. మూడీస్ ఇటీవల నిర్వహించిన మార్కెట్ పోల్స్లో 175 మంది ఇన్వెస్టర్లను పలుకరించగా వారంతా భారత వృద్ధి రేటుకు అధిక చమురు ధరలు ప్రధాన సవాల్గా చెప్పుకొచ్చారు. ద్రవ్య లోటును 3.3 శాతానికి కుదించే క్రమంలోనూ పలు రిస్క్లు పొంచిఉన్నాయని మూడీస్, ఐసీఆర్ఏ సింగపూర్, ముంబయిల్లో నిర్వహించిన సర్వేలో ఇన్వెస్టర్లు స్పష్టం చేశారు. మూలధన సమస్యలతో సతమతమవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రభుత్వం సమకూర్చే మూలధన ప్యాకేజ్ ఏమాత్రం సరిపోదని వారు పెదవివిరిచారు. ఇన్వెస్టర్ల అభిప్రాయాల తరహాలోనే అధిక చమురు ధరలు వృద్ధి రేటుకు ప్రధాన సవాల్గా తాము కూడా పరిగణిస్తున్నామని మూడీస్ పేర్కొంది. భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురు ధరలు ఏప్రిల్లో బ్యారెల్కు 66 డాలర్లు ఉండగా, ప్రస్తుతం అవి బ్యారెల్కు 75 డాలర్లకు చేరుకున్న సంగతి తెలిసిందే. -
ఆల్టైమ్ కనిష్ఠ స్థాయికి రూపాయి
-
మొట్టమొదటిసారి భారీగా కుప్పకూలిన రూపాయి
ముంబై : దేశీయ కరెన్సీ రూపాయి భారీగా పతనమైంది. మొట్టమొదటిసారి డాలర్కు మారకంలో 69 మార్కును చేధించిన రూపాయి ఆల్-టైమ్ కనిష్ట స్థాయిలకు పడిపోయింది. బుధవారం ట్రేడింగ్ ముగింపులోనే భారీగా పతనమైన రూపాయి, నేడు ట్రేడింగ్ ప్రారంభంలో మరింత క్షీణించింది. ప్రస్తుతం 79 పైసల మేర క్షీణించి 69.04గా ట్రేడవుతోంది. బుధవారం కూడా 37 పైసల మేర పడిపోయి 19 నెలల కనిష్టంలో 68.61 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరుగుతాయని సంకేతాలు, ఈ రేట్ల పెరుగుదలతో కరెంటు ఖాతా లోటు మరింత పెరుగుతుందని, ద్రవ్యోల్బణమూ ఎగుస్తుందని ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొనడం రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. అటు అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భయాలు సైతం కరెన్సీ ట్రేడర్స్ను కలవరపరుస్తున్నాయి. ఇక ఎమర్జింగ్ మార్కెట్ కరెన్సీలు కూడా బలహీనంగా ట్రేడవుతుండటం రూపాయిని మరింత దిగజారుస్తోంది. రూపాయి విలువ 68.80-68.85 స్థాయిల వద్ద ఆర్బీఐ జోక్యం చేసుకోవాల్సి ఉందని, కానీ 68.86 మార్కు కంటే భారీగా రూపాయి పతనమైందని.. ఇక వచ్చే సెషన్లలో కచ్చితంగా రూపాయి భారీగా క్షీణిస్తుందని ఆనంద్ రతి కమోడిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ రుషబ్ మారు అన్నారు. వెంటనే 70 నుంచి 70.50 స్థాయిలకు పడిపోయే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. భారత్ వాణిజ్య లోటు దేశమని, ఎమర్జింగ్ మార్కెట్లలో క్యాపిటల్ ఫ్లోస్ తగ్గితే, రూపాయి విలువ క్షీణించడం సాధారణమని హెచ్ఎస్బీసీ ఇండియా గ్లోబల్ మార్కెట్స్, ఫిక్స్డ్ ఇన్కమ్ అధినేత, ఎండీ మనీష్ వాద్వాన్ తెలిపారు. మరోవైపు ఆయిల్ ధరలు కూడా పైపైకి ఎగుస్తున్నాయన్నారు. -
చమురు ధరలపై వైఎస్సార్సీపీ మండిపాటు
సాక్షి, శ్రీకాకుళం: చమురు ధరల పెరుగుదలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల రూపంలో ప్రజల జేబులు కొడుతున్నాయని ఆ పార్టీ నేత తమ్మినేని సీతారాం ఆరోపించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. చమురు ధరల పెరుగుదల వలన కొనుగోలు శక్తి తగ్గిపోతుందన్నారు. రెపోరేటుపై ప్రభావం చూపితే బ్యాంకింగ్ రంగం కుదేలైపోతుందని తెలిపారు. వెంటనే చమురు ధరలు తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. వైద్య వ్యవస్థ నిర్వీర్యం మరో వైపు రాష్ట్రంలో మెడికల్ అండ్ హెల్త్ పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. శ్రీకాకులం ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతోనే చిన్నారి జ్యోతిక మృతి చెందిందని వెల్లడించారు. బాధ్యులైన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలన్నారు. గుంటూరు ఆస్పత్రిలో జరిగిన ఘటనలపై చర్యలు తీసుకుని ఉంటే.. మళ్లీ చిన్నారి మృతి ఘటన పునరావృతం అయ్యేది కాదన్నారు. పాముకాటుకు వైద్యం అందించ లేకుంటే మంత్రులు రాజీనామా చేసి వెళ్లిపోవాలన్నారు. చంద్రబాబు పాలనలో వైద్య వ్యవస్థ నిర్వీర్యమై పోయిందన్నారు. -
వెంటనే చమురు ధరలు తగ్గించాలి
-
పెట్రో ధరల బాధ్యత కేంద్రానిదే -యనమల
సాక్షి, అమరావతి: అడ్డూ అదుపులేకుండా పెరిగిపోతున్న చమురు ధరలపై ఆంధ్రప్రదేశ్ ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఆయన తప్పుబట్టారు. అంతర్జాతీయంగా చమురు ధరల హెచ్చు తగ్గుల సందర్భంగా కేంద్రం తీరుపై ఆయన నిరసన వ్యక్తం చేశారు. పెరిగినపుడు పెంచడమే తప్ప, ధరలు తగ్గినపుడు దేశీయంగా ఎందుకు తగ్గించడం లేదని మండిపడ్డారు. పెరుగుతున్న ధరల ప్రభావం మధ్య తరగతి ప్రజలపై తీవ్రంగా పడుతోందన్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడల్లా దేశంలో కేంద్రప్రభుత్వం కూడా ధరలు పెంచటం వల్ల ప్రజలపై తీవ్రమైన భారం పడుతుందని యనమల వ్యాఖ్యానించారు. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజల మీద ఎక్కువ భారం పడుతోందన్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో ధర తగ్గినప్పుడు కేంద ప్రభుత్వం తగ్గించడంలేదనీ, పెరిగినపుడు మాత్రం సదరు రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచాలని ఆదేశాలు జారీ చేస్తుందన్నారు. అలాగే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలంటూ రాష్ట్రాలను కేంద్రం ఆదేశించడం సరైనది పద్దతి కాదని యనమల పేర్కొన్నారు. మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధర పెరిగినపుడు ప్రజలు మీద భారం పడకుండా చేసే భాద్యత కేంద్ర ప్రభుత్వమే వహించాలన్నారు. తద్వారా ప్రజల మీద భారం తగ్గించాలని ఆయన కోరారు. -
రూపాయి..మరింత దిగువకు
సాక్షి,ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి సోమవారం ఉదయం నష్టాలతో మొదలయ్యింది. డాలర్తో రూపాయి మారకంలో మరింత పతనమైన రూపాయి 12 పైసలు నష్టపోయి 68.12 వద్ద ప్రారంభమయ్యింది. శుక్రవారం ముగింపు (30 పైసలు నష్టం) 68తో పోల్చితే 0.14 శాతం నష్టంతో తాజాగా 16 నెలల కనిష్ట స్థాయికి చేరింది. ముడిచమురు ధర ఆల్ టైం హైకి చేరడంతోపాటు, అమెరికా చైనాల మధ్య ట్రేడ్వార్ సమసిపోయిన నేపథ్యంలో అమెరికా డాలరు విలువ ఒక్కసారిగా పుంజుకుంది. దీంతో రూపాయి మారకం విలువ మరింత బలహీనపడిందని ఫారెక్స్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. చైనా, అమెరికా రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య ఒత్తిళ్లను సులభతరం చేయాలని నిర్ణయించామని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్టీవెన్ మ్యుచిన్ పేర్కొనడంతో దిగుమతిదారులు, బ్యాంకుల నుంచి డాలర్కు డిమాండ్ పెరిగింది. అటు ముడి చమురు ధర 80 డాలర్లకు చేరుకోవడం తదితర ప్రతికూల అంశాల కారణంగా రూపాయి విలువ 68 స్థాయికి పడిపోయిందని ఎనలిస్టులు విశ్లేషించారు. 10 ఏళ్ల ప్రభుత్వ బాండ్ ఈల్డ్ శుక్రవారం ముగింపు 7.833 శాతం కాగా, సోమవారం ఉదయం 7.895 వద్ద మొదలయ్యింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రూపాయి మారకం విలువ ఏకంగా 6.2 శాతం పతనమయ్యింది. -
నాలుగో రోజూ కుప్పకూలిన స్టాక్మార్కెట్లు
ముంబై : కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటుపై నెలకొన్న వాడివేడి రాజకీయాలు, ముడి చమురు ధరలు మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వరుసగా నాలుగో రోజు మార్కెట్లు పతనమయ్యాయి. మరోవైపు రూపాయి క్షీణత కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను తీవ్రంగా దెబ్బతీస్తోంది. వీటన్నింటి ప్రభావంతో నేడు(శుక్రవారం) సెన్సెక్స్ 301 పాయింట్ల మేర కుప్పకూలింది. 301 పాయింట్ల దిగజారిన సెన్సెక్స్ చివరికి 34,848 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 86 పాయింట్ల నష్టంలో 10,600కు దిగువన 10,596 వద్ద స్థిరపడింది. నేటి ట్రేడింగ్లో ఎల్ అండ్ టీ, మారుతీ, ఐసీఐసీఐ బ్యాంకు, సిప్లా, గ్రాసిమ్లు టాప్ లూజర్లుగా నష్టాలు గడించాయి. అటు బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్యూఎల్, ఐటీసీ, కొటక్ మహింద్రా బ్యాంకులు టాప్ గెయినర్లుగా నిలిచాయి. నిఫ్టీ మిడ్క్యాప్ ఇండెక్స్ సైతం 250 పాయింట్లు కిందకి పడిపోయింది. అమర రాజా బ్యాటరీస్, ఎస్ఆర్ఎఫ్, అవెన్యూ సూపర్మార్ట్స్, నాల్కో, గ్రాఫైట్ ఇండియా, జెట్ ఎయిర్వేస్, ఎస్కార్ట్స్, జ్యోతి ల్యాబ్స్లు దాదాపు 13 శాతం వరకు క్షీణించాయి. ఇప్పటికే మండుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు వచ్చే నెలల్లో మరింత పెరుగనున్నాయని గోల్డ్మ్యాన్ శాచ్స్ రిపోర్టు వెల్లడించడంతో, మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుల దేశీయ కరెంట్ అకౌంట్ లోటుకు ప్రమాదకరమని ఈ గ్లోబల్ ఫైనాన్సియల్ సర్వీసు దిగ్గజం వెల్లడించింది. మరోవైపు కర్ణాటక రాజకీయ పరిస్థితులు వాడివేడిగా మారుతున్నాయి. శనివారం ఫ్లోర్ టెస్ట్ ఖాయం కావడంతో మార్కెట్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రారంభం నుంచి నష్టాలు పాలవుతూ వచ్చిన మార్కెట్లు మధ్యాహ్నం ట్రేడింగ్కు వచ్చేసరికి ఆ నష్టాలను మరింత పెంచుకున్నాయి. మరోవైపు డాలర్తో రూపాయి మారకం విలువ కూడా భారీగా క్రాష్ అయింది. 34 పైసలు బలహీనపడి 68.04 వద్ద నమోదైంది. -
క్రూడ్ ఆయిల్ ధరలు కుప్పకూల్చాయి
ముంబై : క్రూడ్ ఆయిల్ ధరలు మార్కెట్ల కొంపముంచాయి. అంతర్జాతీయంగా ఈ ధరలు భారీ ఎత్తున్న పెరగడంతో పాటు దేశీయంగా కర్ణాటక రాజకీయ పరిస్థితులు ప్రతికూలంగా ఉండటంతో, దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 238 పాయింట్ల మేర కిందకి పడిపోయి 35,149 వద్ద క్లోజైంది. అటు నిఫ్టీ సైతం 58 పాయింట్ల నష్టంలో 10,682 వద్ద స్థిరపడింది. బ్యాంకులు, ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో నెలకొన్న అమ్మకాల ఒత్తిడి కూడా మార్కెట్లకు మైనస్ అయింది. చివరి గంట ట్రేడింగ్లో మార్కెట్లు మరింత కిందకి పడిపోయాయి. హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంకు, హిందాల్కో ఇండస్ట్రీస్, యూపీఎల్, ఐటీసీలు 2 శాతం నుంచి 3 శాతం వరకు క్షీణించాయి. మరోవైపు కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ, ప్రభుత్వం ఏర్పాటుపై బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశించడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది. బలనిరూపణ చేసుకునేంత మెజార్జీ బీజేపీ వద్ద లేకపోవడం మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది. అటు క్రూడ్ ఆయిల్ ధరలు 2014 నవంబర్ నాటి గరిష్ట స్థాయిల్లో బ్యారల్ 80 డాలర్లను దాటేసింది. అమెరికాలో ఇంధన నిల్వలు తగ్గడంతో చమురు ధరలు మరింత పెరిగినట్టు విశ్లేషకులు చెప్పారు. చమురు సరఫరాలకు కీలకమైన ఇరాన్తో మూడేళ్ల క్రితం కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని అమెరికా రద్దు చేసుకోవడంతో చమురు ధరలకు రెక్కలొచ్చాయని తెలిపారు. ఒపెక్ దేశాల ఉత్పత్తి కోత కారణంగా కూడా చమురు ధరలు భగ్గుమంటున్నాయి. -
మండుతున్న చమురు
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు మరింత ఎగిశాయి. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 0.15 శాతం బలపడి 79.39 డాలర్లకు చేరింది. న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ సైతం 0.3 శాతం పెరిగి 71.72 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఫలితంగా చమురు ధరలు 2014 నవంబర్నాటి స్థాయిలను తాకాయి. అమెరికాలో ఇంధన నిల్వలు తగ్గడంతో చమురు ధరలు మరింత బలపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. గత వారం అమెరికాలో చమురు నిల్వలు 1.4 మిలియన్ బ్యారళ్లమేర క్షీణించినట్లు ఆ దేశ ఇంధన శాఖ తాజాగా వెల్లడించింది. ఈ బాటలో గ్యాసోలిన్ స్టాక్పైల్స్ సైతం 3.79 మిలియన్లు తగ్గిందని తెలిపింది. మధ్యప్రాచ్యంలో చమురు సరఫరాలకు కీలకమైన ఇరాన్తో మూడేళ్ల క్రితం కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని అమెరికా రద్దు చేసుకోవడంతో చమురు ధరలకు రెక్కలొచ్చాయని విశ్లేషకులు భావిస్తున్నాయి. అణు ఒప్పందం రద్దుతోపాటు ఇరాన్పై అమెరికా ఆంక్షలు విధించడంతో చమురు ధరలు మండుతున్నాయి. వెనిజులా చమురు సరఫరాలు సైతం తగ్గడం దీనికి మరోకారణంగా మార్కెట్ వర్గాల అంచనా. ఇప్పటికే ఒపెక్ దేశాల ఉత్పత్తి కోత కారణంగా చమురు సరఫరా తగ్గుముఖం పట్టడంతో ధరలు భగ్గుమంటున్నాయి. అటు దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా మూడురోజులుగా వరుస పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. వరుసగా పెట్రోల్ , డీజిల్ ధరలు ఇప్పటికే కొత్త గరిష్టాలను తాకుతున్న సంగతి తెలిసిందే. -
మూడు రోజుల నుంచి భగ్గుమంటున్న పెట్రోల్
న్యూఢిల్లీ : కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో 19 రోజుల పాటు స్తబ్దుగా ఏ మాత్రం మారకుండా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు, ఎన్నికల అనంతరం భగ్గుమంటున్నాయి. వరుసగా మూడు రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో స్కై రాకెట్లా దూసుకుపోతున్నాయి. బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.75 మార్కును క్రాస్ చేసింది. ఢిల్లీలో నేడు లీటరు పెట్రోల్ ధర రూ.75.10గా నమోదైంది. 2013 సెప్టెంబర్ నుంచి ఇదే గరిష్ట స్థాయి. ఇతర మెట్రోపాలిటన్ నగరాలు కోల్కతా, ముంబై, చెన్నైల్లో కూడా పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. కోల్కతాలో లీటరు పెట్రోల్ ధర రూ.77.79గా, ముంబైలో రూ.82.94గా, చెన్నైలో రూ.77.93గా, హైదరాబాద్లో రూ.79.55గా నమోదైనట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్సైట్ డేటాలో వెల్లడైంది. ఢిల్లీ, ముంబైలో ఈ ధరలు 14 పైసలు పెరగగా.. చెన్నై, కోల్కతాలో 16 పైసలు పెరిగాయి. మరోవైపు డీజిల్ ధరలు కూడా సరికొత్త గరిష్ట స్థాయిలను తాకుతూ.. వాహనదారుల జేబుకు చిల్లులు పెడుతున్నాయి. లీటరు డీజిల్ ధర ఢిల్లీలో రూ.66.57గా, కోల్కతాలో రూ.69.11గా, ముంబైలో రూ.70.88గా, చెన్నైలో రూ.70.25గా, బెంగళూరులో రూ.67.71గా, హైదరాబాద్లో రూ.72.36గా నమోదవుతోంది. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలు పెంచకుండా స్తబ్ధుగా ఉంచాయి. దీంతో అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు దాదాపు రూ.500 కోట్ల మేర నష్టం వచ్చినట్టు అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నష్టాన్ని పూరించుకోవడానికి ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రికార్డు స్థాయిలో ఈ ధరలను పెంచుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు కూడా భారీగా ఎగుస్తున్నాయి. దాంతో పాటు డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ కూడా క్షీణిస్తోంది. ఈ ప్రభావం కూడా పెట్రోల్, డీజిల్ ధరలపై పడుతోంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారల్కు ప్రస్తుతం 78 డాలర్లు ఉంది. -
కనిష్ట స్థాయిలకు పడిపోయిన రూపాయి
ముంబై : రూపాయి విలువ మార్కెట్లో భారీగా పడిపోతోంది. డాలర్తో పోలిస్తే దేశీయ రూపాయి విలువ నేడు(సోమవారం) 67 మార్కును అధిగమించి, 67.13 వద్ద ట్రేడువుతోంది. ఇది 2017 ఫిబ్రవరి నాటి అత్యంత కనిష్ట స్థాయి. అమెరికా డాలర్ విలువ బలపడుతుండటం, అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం రూపాయి విలువను దెబ్బతీస్తున్నాయని ఫారెక్స్ అడ్వయిజరీ సంస్థ ఐఎఫ్ఏ గ్లోబల్ తెలిపింది. శుక్రవారం రోజు కూడా రూపాయి విలువ 66.86గా నమోదైంది. మరోవైపు డాలర్ విలువ డిసెంబర్ నాటి గరిష్ట స్థాయిలను బద్దలు కొడుతోంది. ఆరు మేజకర్ కరెన్సీలతో పోలిస్తే డాలర్ విలువ, డాలర్ ఇండెక్స్లో 92.609కు పెరిగింది. అంతేకాక అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు మూడేళ్లలో అత్యంత గరిష్ట స్థాయిలను తాకుతున్నాయి. గ్లోబల్గా సరఫరా చాలా కఠినతరంగా ఉండటంతో ఈ పరిస్థితి నెలకొంది. అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న భౌగోళిక రాజకీయ ఆందోళనలతో ఆయిల్ ధరలు బ్యారల్కు 75 డాలర్ల పైగా నమోదవుతున్నాయి. దీంతో రూపాయి విలువ పడిపోతోంది. మరోవైపు దేశీయంగా కర్నాటక ఎన్నికల ప్రభావం కూడా రూపాయిపై పడుతోంది. శనివారం రోజు ఎన్నికలు జరిగి, వచ్చే మంగళవారం ఫలితాలు వెలువడనున్నాయి. ప్రస్తుతం రూపాయి విలువ డాలర్తో పోలిస్తే 66.73 నుంచి 67.10 మధ్యలో ట్రేడవనుందని ఫారెక్స్ అడ్వయిజరీ సంస్థ తెలిపింది. ప్రారంభ ట్రేడింగ్లో రూపాయి విలువ 67.085 వద్ద నమోదైంది. ప్రస్తుతం 67.13 వద్ద ట్రేడవుతోంది. -
స్కై రాకెట్ల దూసుకుపోతున్న పెట్రోల్, డీజిల్
ముంబై : పెట్రోల్ ధరలు స్కై రాకెట్లలాగా దూసుకుపోతున్నాయి. శుక్రవారం రోజే 55నెలల గరిష్టాన్ని నమోదు చేసిన పెట్రోల్ ధరలు, శనివారం మరింత పెరిగాయి. ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలు పెట్రోల్ ధరలను ఏకంగా 13 పైసలను, డీజిల్ ధరలను 15 పైసలు చొప్పున పెంచాయి. దీంతో న్యూఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.74.21 వద్ద గరిష్ట స్థాయిలను తాకింది. డీజిల్ సైతం ఆల్-టైమ్ హైలో రూ.65.46గా నమోదైంది. ఈ స్థాయిలో ధరలు పెరగడం 2013 సెప్టెంబర్ నుంచి ఇదే తొలిసారి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మండుతుండటంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల దూకుడు కొనసాగుతున్నట్టు ఇండస్ట్రి వర్గాలు చెప్పాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్సైట్ ప్రకారం శనివారం పెట్రోల్ ధరలు న్యూఢిల్లీలో రూ.74.21గా, కోల్కత్తాలో రూ.76.91గా, ముంబైలో రూ.82.06గా, చెన్నైలో రూ.76.99గా ఉన్నాయి. అదేవిధంగా డీజిల్ ధరలు ఢిల్లీలో రూ.65.46గా, కోల్కత్తాలో రూ.68.16గా, ముంబైలో రూ.69.7గా, చెన్నైలో రూ.69.06గా నమోదయ్యాయి. గ్లోబల్ సరఫరాలో కొనసాగుతున్న అనిశ్చితి నేపథ్యంలో 2014 చివరి నాటి నుంచి చమురు ధరలు పెరుగుతూ వచ్చి ప్రస్తుతం అత్యధిక స్థాయిలకు చేరుకుంటున్నాయి. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు గరిష్ట స్థాయిలను చేరుకుంటున్నప్పటికీ, ప్రభుత్వం మాత్రం ఎక్సైజ్ డ్యూటీ కోతలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. 2017 అక్టోబర్లో మాత్రం ఒక్కసారి మాత్రమే ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. -
షాకింగ్ : భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్, డిజిల్ ధరలు ఆల్ టైమ్ హైకి చేరాయి. పెట్రోల్ ధర ఆదివారం నాలుగేళ్ల గరిష్ట స్ధాయిలో దేశరాజధానిలో లీటర్కు రూ 73.73కు చేరగా, డీజిల్ అత్యంత గరిష్టస్ధాయిలో లీటర్కు రూ 64.58కి ఎగబాకింది. పెట్రో ఉత్పత్తుల ధరలు మండిపోతుండటంతో వీటిపై ఎక్సైజ్ పన్నులను భారీగా తగ్గించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఇంధన ధరలను రోజువారీ సవరిస్తున్న చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను ఆదివారం లీటర్కు 18 పైసల చొప్పున పెంచడంతో ఇవి అత్యంత గరిష్టస్ధాయిలకు చేరి సామాన్యుడి జేబుకు చిల్లుపెడుతున్నాయి. అంతర్జాతీయ ముడిచమురు ధరల పెంపును అధిగమించేందుకు పెట్రోల్, డీజిల్పై ఎక్సయిజ్ సుంకాన్ని గణనీయంగా తగ్గించాలని చమురు మంత్రిత్వ శాఖ కోరుతున్నా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఈ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోలేదు. పెట్రోల్, డీజిల్లపై అత్యధిక పన్నుల కారణంగా దక్షిణాసియా దేశాల్లో భారత్లోనే పెట్రో ఉత్పత్తుల రిటైల్ ధరలు ప్రజలకు భారంగా మారాయి. -
కొనసాగుతున్న పెట్రో షాక్
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా ఆరోరోజూ భారమయ్యాయి. అంతర్జాతీయ ముడిచమురు ధరలు పెరగడం, అధిక డిమాండ్ కారణంగా పెట్రో ధరలు మండుతున్నాయి. మెట్రో నగరాల్లో లీటర్ పెట్రోల్ సగటున రూ 80కి చేరువవుతుండటంతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. మరోవైపు డీజిల్ ధరలు సైతం రూ 67కు ఎగబాకాయి. ఈ ఏడాది జనవరి 24న పెట్రోల్ ధరలు మూడేళ్ల గరిష్టస్ధాయిని తాకినప్పటి నుంచీ ధరల షాక్ కొనసాగుతూనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడం, ఒపెక్ దేశాల్లో చమురు ఉత్పత్తులపై నియంత్రణలతో ఇంధన ధరలకు రెక్కలొచ్చాయి. ఇక రూపాయి మారకం, పెట్రో ఉత్పత్తులపై సుంకాలతో దేశీయ వినియోగదారులు పెట్రో ధరలపై ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది. పెట్రో ఉత్పత్తులపై పన్ను భారం తగ్గించాలని కేంద్రాన్ని కోరుతుంటే రాష్ట్రాలు పెట్రోల్పై వ్యాట్, ఇతర పన్నులను తగ్గించాలని కేంద్రం కోరుతోంది. -
నేడు, రేపు ఎక్కడి లారీలక్కడే
-
నేడు, రేపు ఎక్కడి లారీలక్కడే
సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ, రోజువారీ చమురు ధరల సవరణ విధానంపై సరుకు రవాణా సంఘాలు భగ్గుమంటున్నాయి. దీన్ని ముందునుంచీ వ్యతిరేకిస్తున్న సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. దీనికి తెలంగాణ లారీ యజమానుల సంఘం మద్దతు పలికింది. సోమ, మంగళవారాల్లో ఒక్క లారీ కూడా రోడ్డెక్కకుండా చూస్తామని ప్రకటించింది. ఈ రెండు రోజుల్లో సరుకుల తరలింపు ఉండదని సంఘం అధ్యక్ష, కార్యదర్శులు భాస్కర్రెడ్డి, దుర్గాప్రసాద్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఆలిండియా మోటార్ ట్రాన్స్ పోర్టు కాంగ్రెస్, ఆలిండియా మోటార్ ట్రాన్స్పోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, సౌత్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్టు అసోసియేషన్ల నిర్ణయం మేరకు తాము బంద్కు పిలుపిచ్చామని వారు తెలిపారు. -
రెమిటెన్స్ లు తగ్గుతాయ్
ప్రపంచ బ్యాంక్ అంచనా వాషింగ్టన్: భారత్కు వచ్చే రెమిటెన్స్లు ఈ ఏడాది తగ్గుతాయని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. తక్కువ ముడిచమురు ధరలు సహా ఇండియాకు ఎక్కడి నుంచైతే రెమిటెన్స్ అధికంగా వస్తున్నాయో ఆయా ప్రాంతాల్లోని బలహీనమైన ఆర్థిక వృద్ధే రెమిటెన్స్ల తగ్గుదలకు ప్రధాన కారణంగా నిలుస్తుందని పేర్కొంది. ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం.. ⇔ ఈ ఏడాది భారత్కు వచ్చే రెమిటెన్స్లు 5 శాతం క్షీణతతో 65.5 బిలియన్ డాలర్లకు పరిమితం అవుతాయి. ⇔ రెమిటెన్స్లు స్వల్పంగా తగ్గినప్పటికీ ప్రపంచంలో రెమిటెన్స్లు స్వీకరణలో భారత్ టాప్లోనే కొనసాగుతుంది. ⇔ ఇండియా తర్వాతి స్థానంలో 65.2 బిలియన్ డాలర్ల రెమిటెన్స్ల స్వీకరణతో చైనా రెండో స్థానంలో ఉంటుంది. ⇔ 20.3 బిలియన్ డాలర్ల రెమిటెన్స్ల స్వీకరణతో పాకిస్తాన్ ఐదో స్థానంలో నిలువొచ్చు. ⇔ బంగ్లాదేశ్కు వచ్చే రెమిటెన్స్ల్లోనూ 3.5 శాతం క్షీణత నమోదు కావొచ్చు. ⇔ పాకిస్తాన్, శ్రీలంక దేశాలకు వచ్చే రెమిటెన్స్లు వరుసగా 5.1 శాతం, 1.6 శాతం మేర పెరగొచ్చు. -
20 నెలల కనిష్టానికి సెన్సెక్స్
267 పాయింట్ల నష్టంతో 24,188కు డౌన్ క్రూడ్, రిలయన్స్ ఎఫెక్ట్ ఈ వారం స్టాక్ మార్కెట్ బలహీనంగా ప్రారంభమైంది. ఎగుమతులు భారీగా క్షీణించడం, ముడి చమురు ధరలు కొత్త కనిష్ట స్థాయిలకు చేరడం, క్యూ3 ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండ డంతో సోమవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 267 పాయింట్లు నష్టపోయి 24,188 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 87 పాయింటు నష్టపోయి 7,351 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్కు ఇది 20 నెలల కనిష్ట స్థాయి. రూపాయి క్షీణత, చైనా ఆర్థిక పరిస్థితిపై ఆందోళన, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగుతుండడం వంటి అంశాలు ప్రతికూల ప్రభావం చూపాయి. రిలయన్స్ 5 శాతం డౌన్ నేడు (మంగళవారం) ఆర్థిక ఫలితాలు వెల్లడించనున్న నేపధ్యంలో ఈ నెల 4 నుంచి 8% ఎగసిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఈ షేర్ 5.14 శాతం నష్టపోయి రూ.1,018 వద్ద ముగిసింది. సెన్సెక్స్ షేర్లలో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ఈ ఒక్కరోజే కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.17,779 కోట్లు హరించుకుపోయింది. చమురు దిగుమతుల భారీగా పతనం కావడంతో నైజీరియా కరెన్సీ బలహీనపడింది. దీంతో ఈ ఆదేశంలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న బజాజ్ ఆటో 3.6శాతం నష్టపోయింది . జీవీఆర్ ఇన్ఫ్రా ఐపీఓకు సెబీ అనుమతి నిర్మాణ రంగ కంపెనీ జీవీఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. ఈ ఐపీఓ ద్వారా కనీసం రూ.400 కోట్లు సమీకరించాలని చెన్నైకి చెందిన జీవీఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ యోచిస్తోంది. ఈ ఐపీఓ ద్వారా రూ.400 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నది. -
స్టాక్స్ వ్యూ
స్పైస్జెట్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఆనంద్ రాఠి సెక్యూరిటీస్ ప్రస్తుత ధర: రూ.74 టార్గెట్ ధర: రూ.150 ఎందుకంటే: దాదాపు దివాళా స్థితిలో ఉన్న ఈ కంపెనీ పగ్గాలను గత ఏడాది జనవరిలో ఈ కంపెనీ మాజీ ప్రమోటర్ అజయ్ సింగ్ చేపట్టారు. కంపెనీ పునరుజ్జీవింపజేయడానికి కొత్త యాజమాన్యం పలు చర్యలు తీసుకుంది. సామర్థ్యాన్ని, ఆదాయాన్ని పెంచడం, విమాన సర్వీసుల హేతుబద్ధీకరణ, విమానాలను సమర్థవంతంగా వినియోగించుకోవడం, కీలక మార్కెట్లలో విమాన సర్వీసుల పెంపు, వ్యయాల తగ్గింపు తదితర అంశాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. పెరుగుతున్న డిమాండ్కనుగుణంగా విమానాల సంఖ్యను పెంచింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గుతుండడం విమానయాన రంగాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తగిన శ్రద్ధ చూపడం, వేతనాల పెరుగుదల, ఫస్ట్క్లాస్ రైల్వే చార్జీలతో పోల్చితే విమాన చార్జీలు ఒకింత చౌకగా ఉండడం వంటి అంశాల కారణంగా మొత్తం విమానయాన రంగమే టర్న్అరౌండ్ కానున్నదని భావిస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 32గా ఉన్న ఉన్న విమానాల సంఖ్య మరో రెండేళ్లలో 52కు పెంచుకోనున్నది. ప్రతి నెలా 90 శాతం లోడ్ ఫ్యాక్టర్ను సాధిస్తోంది. మొత్తం విమాన యాన సంస్థ వ్యయాల్లో 40 శాతంగా ఉంటే ఇంధన వ్యయాలు 40 శాతం తగ్గడంతో కంపెనీ మొత్తం ఆదాయంలో 46 శాతంగా ఉన్న ఇంధన వ్యయాలు 33 శాతానికి తగ్గాయి. గత ఏడాది జనవరిలో 9 శాతంగా ఉన్న ఈ కంపెనీ మార్కెట్ షేర్ అదే ఏడాది నవంబర్లో 13 శాతానికి ఎగసింది. 2018 మార్చి కల్లా 18 శాతానికి పెరగగలదని అంచనా. వీటన్నింటి ఫలితంగా రెండేళ్లలో ఆదాయం 17 శాతం, ఇబిటా 41 శాతం, నికర లాభం 62 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా వేస్తున్నాం. ఇండస్ఇంద్ బ్యాంక్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రస్తుత ధర: రూ.921 టార్గెట్ ధర: రూ.1,125 ఎందుకంటే: ముంబై కేంద్రంగా కమర్షియల్, ట్రాన్సాక్షనల్, ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ సేవలనందిస్తోంది.1994 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న మిడ్ సైజ్ ప్రైవేట్ రంగ బ్యాంక్ ఇది. గత ఏడాది సెప్టెంబర్ 30 నాటికి 854 బ్రాంచీలు, 1,578 ఏటీఎంలతో ఖాతాదారులకు సేవలందిస్తోంది. లండన్, దుబాయ్, అబూదాబిల్లో ప్రాతినిధ్య కార్యాలయాలున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. నికర లాభం 30 శాతం వృద్ధి చెంది రూ.580 కోట్లకు పెరిగింది. రుణ వృద్ధి 29 శాతంగా ఉంది. రిటైల్ రంగ రుణాలు 27 శాతం, క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 7 శాతం వృద్ధిని సాధించాయి. వాణిజ్య వాహన రుణాలు 31 శాతం పెరిగాయి. నికర వడ్డీ మార్జిన్లు 3 బేసిస్ పాయింట్లు పెరిగి 3.91 శాతానికి చేరాయి. కీలకమైన ఫీజు ఆదాయం 30 శాతం పెరిగింది. కార్పిరేట్ రుణ వసూళ్లు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, రుణ నాణ్యత స్థిరంగా ఉంది. మొండి బకాయిలు 1 శాతానికి దిగువనే ఉన్నాయి. మార్జిన్ల అధికంగా ఉండే రిటైల్ రంగ రుణాలపై దృష్టిసారిస్తోంది. ఫలితంగా నికర వడ్డీ మార్జిన్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నాం. ఆదాయ, నికర లాభాల వృద్ధి పటిష్టంగా ఉండడం, రుణ నాణ్యత నిలకడగా ఉండడం బ్యాంక్కు కలసివచ్చే అంశాలు. ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా రూ.1,125కు చేరుతుందనే అంచనాలతో ప్రస్తుత ధర వద్ద కొనుగోలు చేయవచ్చని రికమెండ్ చేస్తున్నాం. 2017 నాటికి బ్రాంచీల సంఖ్యను 1,200కు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. టీసీఎస్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఏంజెల్ బ్రోకింగ్ ప్రస్తుత ధర: రూ.2,264 టార్గెట్ ధర: రూ.2,854 ఎందుకంటే: టాటా గ్రూప్కు చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) కంపెనీ భారత మల్టీ నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీ. ముంబై కేంద్రంగా ఐటీ, కన్సల్టింగ్, బిజినెస్ సొల్యూషన్స్ అందిస్తోంది. 46కు పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. భారత్లో ఇదే టాప్ ఐటీ కంపెనీ. ఈ కంపెనీ క్యూ3 ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ఆదాయం అంచనాలను అందుకోలేకపోయినా, ఇబిటా, నికర లాభాలు అంచనాలను మించాయి. అంతర్జాతీయ వ్యాపారం క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 1 శాతం పెరిగింది. ఇబిటా మార్జిన్ 27 శాతం పెరిగింది. నికర లాభం క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 0.9 శాతం వృద్ధితో రూ.6,110 కోట్లకు పెరిగింది. ఉద్యోగుల వినియోగం 85 శాతంగా ఉంది. ఐటీ సేవల్లో ఆట్రీషన్(ఉద్యోగుల వలస) 15%గా ఉంది. అధిక ఆదాయం వచ్చే ఇద్దరు క్లయింట్లు కలుపుకొని మొత్తం 9 మంది కొత్త క్లయింట్లు ఈ క్యూ3లో లభించినట్లు కంపెనీ పేర్కొంది.ఐటీ బడ్జెట్/వ్యయాలపై తమ క్లయింట్ల నుంచి ఎలాంటి ప్రతికూల లేదా తగ్గింపు సంకేతాలు అందలేదని కంపెనీ చెబుతోంది. రెండేళ్లలో కంపెనీ ఆదాయం డాలర్ టర్మ్ల్లో 10 శాతం, రూపాయి టర్మ్ల్లో 14 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందుతుందని అంచనా. 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.98గా ఉన్న షేర్ వారీ ఆర్జన (ఈపీఎస్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.138కు పెరుగుతుందని భావిస్తున్నాం. కీలకమైన అమెరికా, యూరప్ల్లో మరిన్ని డీల్స్ సాధిస్తామని కంపెనీ ఆశావహంగాఉంది. ఇబిటా మార్జిన్లు 26-28 శాతం రేంజ్లో ఉంటాయని ధీమాగా ఉంది. రెండేళ్లలో కంపెనీ ఇబిటా 15 శాతం, నికర లాభం 13 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా వేస్తున్నాం. -
పన్నెండో నెలా.. ఎగుమతులు డీలా
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా మందగమనం, క్రూడాయిల్ ధరల పతనం తదితర పరిణామాల నేపథ్యంలో వరుసగా పన్నెండో నెలా ఎగుమతులు క్షీణించాయి. నవంబర్లో పావు వంతు పడిపోయి 20.01 బిలియన్ డాలర్లకు తగ్గాయి. గతేడాది నవంబర్లో 26.48 బిలియన్ డాలర్ల ఎగుమతుల విలువతో ప్రస్తుతం 24.43 శాతం తగ్గినట్లయింది. మరోవైపు, దిగుమతులు మరింతగా తగ్గాయి. గతేడాది నవంబర్లో దిగుమతుల విలువ 42.72 బిలియన్ డాలర్లు కాగా తాజాగా గత నెలలో ఇవి 30 శాతం క్షీణించి 29.79 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. దీంతో వాణిజ్య లోటు 16.23 బిలియన్ డాలర్ల నుంచి 9.78 బిలియన్ డాలర్లకు తగ్గింది. కేంద్ర వాణిజ్య శాఖ ఈ మేరకు మంగళవారం గణాంకాలు విడుదల చేసింది. వీటి ప్రకారం ఏప్రిల్-నవంబర్ మధ్య కాలంలో వాణిజ్య లోటు 102.50 బిలియన్ డాలర్ల నుంచి 87.54 బిలియన్ డాలర్లకు తగ్గింది. మరోవైపు, అంతర్జాతీయంగా మందగమనంతో రేట్ల తగ్గుదల వల్ల ఎగుమతులు విలువపరంగానే తగ్గాయి తప్ప పరిమాణం ప్రకారం కాదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్సభలో తెలిపారు. తగ్గిన పసిడి దిగుమతులు.. అంతర్జాతీయంగా రేట్లు తగ్గడంతో విలువ పరంగా పసిడి దిగుమతులు 36 శాతం మేర క్షీణించాయి. నవంబర్లో దిగుమతి చేసుకున్న బంగారం విలువ 3.53 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గతేడాది నవంబర్లో భారత్ 5.57 బిలియన్ డాలర్ల పసిడిని దిగుమతి చేసుకుంది. అటు వెండి దిగుమతులు 55 శాతం క్షీణించి 285.01 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. -
ఎగుమతులు 8వ నెలా డీలా!
♦ 10 శాతం క్షీణత నమోదు ♦ దిగుమతులూ తగ్గాయ్ ♦ వాణిజ్యలోటు 13 బిలియన్ డాలర్లు న్యూఢిల్లీ : ఎగుమతులు వరుసగా ఎనిమిది నెల జూలైలోనూ క్షీణించాయి. 2014 జూలై విలువతో పోల్చితే 2015 జూలైలో ఎగుమతుల విలువలో అసలు వృద్ధిలేకపోగా- 10.3 శాతం క్షీణించింది. విలువ 23 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. అంతర్జాతీయ మందగమనం, క్రూడ్ ఆయిల్ ధరల పతనం వల్ల... ఆ ఎగుమతుల విలువ పెద్దగా లేకపోవడం వంటి కారణాలు దిగుమతుల తిరోగమనానికి కారణం. మొత్తం దేశ ఎగుమతుల్లో పెట్రోలియం ప్రొడక్టుల వాటా దాదాపు 18 శాతం. వాణిజ్య మంత్రిత్వశాఖ శుక్రవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. దిగుమతులూ అంతే... దేశానికి దిగుమతులు కూడా 10 శాతం తగ్గాయి. విలువ 36 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. చమురు దిగుమతులు బిల్లు తగ్గడం దీనికి ప్రధాన కారణం. దీనితో ఎగుమతి-దిగుమతుల వ్యత్యాసానికి సంబంధించి వాణిజ్యలోటు 13 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. కాగా చమురు దిగుమతుల విలువ 34.91 శాతం తగ్గి, 9.48 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. మొత్తం దిగుమతుల్లో ఈ విభాగం వాటా 31 శాతం. చమురు యేతర దిగుమతుల విలువ 3.8 శాతం పెరిగి 26.46 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. విభాగాల వారీగా: పెట్రోలియం ప్రొడక్టులు (-43 శాతం), తోలు, తోలు ఉత్పత్తులు (-10 శాతం), సముద్ర ఉత్పత్తులు (-18 శాతం), రసాయనాల (-6 శాతం) ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా క్షీణించాయి. పసిడి దిగుమతులు 62 శాతం అప్ పసిడి దిగుమతులు జూలైలో 62 శాతం ఎగశాయి. జూలైలో ఈ విలువ దాదాపు 3 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. -
హెచ్పీసీఎల్ రికార్డ్..
న్యూఢిల్లీ: హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్పీసీఎల్) నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో 58 శాతం వృద్ధి చెందింది. రిఫైనింగ్ మార్జిన్లు అధికంగా ఉండడమే దీనికి కారణమని హెచ్పీసీఎల్ పేర్కొంది. ఈ మొత్తం రూ.2,162 కోట్లకు పెరిగిందని హెచ్పీసీఎల్ సీఎండీ నిషి వాసుదేవ చెప్పారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.2,733 కోట్ల నికర లాభం ఆర్జించామని, కంపెనీ 40 ఏళ్ల చరిత్రలో ఇదే అత్యధిక లాభమని తెలిపారు. 2013-14 తో పోల్చితే 58 శాతం వృద్ధి సాధించామని పేర్కొన్నారు. ముడి చమురు ధరలు బాగా తగ్గడం వల్ల ఈ స్థాయి లాభాలు వచ్చాయని వివరించారు. ఒక్కో షేర్కు రూ.24.5 డివిడెండ్ను ఇవ్వనున్నామని చెప్పారు. -
రూ. 30కే లీటర్ పెట్రోల్!
పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించాలని యూత్ కాంగ్రెస్ డిమాండ్ కోలారులో వినూత్నంగా నిరసన తెలిపిన వైనం కోలారు : అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినా దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించకపోవడంపై యూత్ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ. 30కే లీటర్ పెట్రోల్ చొప్పున మంగళవారం విక్రయాలు సాగించి కోలారులో నిరసన వ్యక్తం చేసింది. కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆందోళన కారులు మాట్లాడుతూ... పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించక పోతే రాష్ర్ట వ్యాప్తంగా ఆందోళనను తీవ్రం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు షాహిద్ షహజాద్, అజంపాషా, ప్రతాప్, మంజునాథ్, వెంకటస్వామి, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా, రూ. 30కే లీటర్ పెట్రోల్ ఇస్తున్నట్లు తెలుసుకున్న వాహనదారులు ఆందోళన శిబిరం వద్ద బారులు తీరారు. అయితే నిరసన తెలిపేందుకు 30 లీటర్ల పెట్రోల్ను మాత్రమే తీసుకురావడంతో వాహనదారుల్లో నిరాశ వ్యక్తమైంది. -
పామాయిల్ రైతు నెత్తిన ‘క్రూడ్’ పిడుగు!
అంతర్జాతీయంగా తగ్గుతున్న క్రూడాయిల్ ధరలు పామాయిల్ రైతుల పాలిట పిడుగులయ్యాయి. తగ్గిన క్రూడాయిల్ ధరలతో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గి హర్షం వ్యక్తమవుతున్న తరుణంలో పామాయిల్ రైతులు మాత్రం గొల్లుమంటున్నారు. పామాయిల్ దిగుమతి కోసం భారీగా విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చిస్తున్న ప్రభుత్వం పామాయిల్ రైతుకు వెన్నుదన్నుగా నిలిచేందుకు సిద్ధంకాకపోతుండడం విషాదకరం. - పుట్టా సోమన్న చౌదరి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు(క్రూడాయిల్) బ్యారల్ ధర తాజాగా 62 డాలర్లకు పడిపోవడంతో పామాయిల్ ముడి నూనె ధరపైన కూడా తీవ్రప్రభావం పడింది. ఈ కారణంగా స్థానికంగా టన్ను పామాయిల్ గెలల ధర కూడా భారీగా పతనమవుతుండడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. సుమారు నెల క్రితం రూ. 8,400 ఉన్న ధర తొలుత రూ. 6,400 కు, ప్రస్తుతం రూ. 5,650కు పడిపోయింది. ధర వేగంగా తగ్గిపోతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తుండడంతో తెలుగు రాష్ట్రాల్లో పామాయిల్ రైతులు ఈ పంట కొనసాగింపుపై పునరాలోచనలో పడ్డారు. పామాయిల్ తోటల పెంపకం మొదటి నుంచీ ఒడిదుడుకులతోనే సాగుతోంది. ఉద్యానవన పంటల్లో రాజుగా పేరుపొందిన పామాయిల్ తోటల పెంపకం అంతర్జాతీయ ముడి చమురు ధరలతో ముడిపడి ఉండటం ఒక ప్రధాన సమస్యగా మారింది. ఈ కారణంగా ముడిచమురు ధరలతోపాటు తరచూ ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటూ రైతులను గందరగోళపరుస్తున్నాయి. ధరలు బాగా తగ్గినప్పుడు కనీస మద్దతు ధరను అమలుపర్చకపోవటం వల్ల రైతులు నష్టాలపాలవుతున్నారు. తెలుగు రైతులు భేష్ ఆహార ధాన్యాల విషయంలో స్వయం సమృద్ధి సాధించిన మన దేశం నూనె గింజల సాగు విషయంలో చతికిలపడి.. ఏటా రూ. 40 వేల కోట్ల విలువైన పామాయిల్ను దిగుమతి చేసుకుంటున్నది. 2012-13లో 70 లక్షల టన్నుల పామాయిల్ దిగుమతైంది. ఇతర వంట నూనెల కంటే పామాయిల్ ధర తక్కువ. అందువల్లే మన దేశంలో వాడే వంట నూనెల్లో మూడొంతుల వాటా పామాయిల్దే. ప్రపంచంలో ఉత్పత్తయ్యే పామాయిల్లో 40 శాతాన్ని మనమే వాడుతున్నాం. ఏటా వేల కోట్ల రూపాయల పామాయిల్ను దిగుమతి చేసుకోక తప్పటం లేదు. నూనెగింజల సాగులో స్వయం సమృద్ధి సాధించడమే ఈ సమస్యకు పరిష్కారం. అయితే, భారత ప్రభుత్వం అరకొర ప్రోత్సాహం వల్ల అవసరమైనంతగా సాగు విస్తరించడం లేదు. గత ఇరవయ్యేళ్లలో 6 లక్షల ఎకరాల్లో మాత్రమే పామాయిల్ తోటల విస్తీర్ణం పెరిగింది. అయితే, 60 వేలకు పైగా తెలుగు రైతులు మాత్రం తెగువను ప్రదర్శించి పామాయిల్ సాగు చేపట్టారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో 4 లక్షల 50 వేల ఎకరాల్లో పామాయిల్ సాగులోకి వచ్చింది. ఇతర 5 రాష్ట్రాల్లో కలిపి చూసినా లక్షా 50 వేల ఎకరాలకు మించదు. పామాయిల్ సాగు విస్తీర్ణంలో పశ్చిమ, తూర్పు గోదావరి, ఖమ్మం జిల్లాలు దేశంలోనే మొదటి 3 స్థానాలు పొందాయి. కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో కూడా పామాయిల్ తోటలున్నాయి. సంక్షోభాల చరిత్ర.. పామాయిల్ రైతులు గతంలో మూడుసార్లు తీవ్రస్థాయి సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. ఆగ్రహించిన రైతులు అప్పట్లోనే 30 వేల ఎకరాల్లో పామాయిల్ తోటలను నరికివేశారు. టన్ను గెలలకు కనీసం రూ. 5,800 ధర ఉండేలా చూస్తామని అప్పట్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హామీ ఇవ్వడంతో తిరిగి పామాయిల్ సాగు కొనసాగింది. 2012 మార్చిలో ధర రూ. 5,100కు దిగజారినప్పుడు తోటల నరికివేతకు రైతులు సిద్ధపడ్డారు. అప్పటి కిరణ్కుమార్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ చర్యల వల్ల టన్నుకు రూ. 7,516 వరకు రైతులకు గిట్టుబాటైంది. క్రమంగా రికార్డు స్థాయిలో రూ. 8,500కు పెరిగి ప్రస్తుతం రూ. 5,650కి దిగజారింది. ప్రోత్సాహ లోపమే సమస్య మొక్కలు నాటిన 4 ఏళ్లకు గాని ఫలసాయం చేతికి అందదు. ఈ కారణంగా చిన్న రైతులు ఆసక్తి చూపడం లేదు. కూలీల కొరత వల్ల పెద్ద రైతులు మాత్రమే మొగ్గుచూపుతున్నారు. సాగు విస్తీర్ణం పెంచాలంటే హెక్టారుకు ప్రస్తుతం ఇస్తున్న రూ. 30 వేలతోపాటు అదనంగా రూ. 20 వేల ప్రత్యేక నగదు ప్రోత్సాహాన్నివ్వాలన్నది రైతుల డిమాండ్. ఏటా రూ. 10,800 కోట్ల చొప్పున ఆరేళ్లపాటు కేటాయిస్తే 20 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగును విస్తరింపజేసి, విదేశీ మారకద్రవ్యాన్ని 60% వరకు ఆదా చేసుకోవచ్చని జాతీయ వ్యవసాయ ధరల నిర్ధారణ కమిషన్ (సీఏసీసీ) కేంద్రానికి సూచించినా స్పందన కరువైంది. వంట నూనెల కొరత దేశాన్ని పీడిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పామాయిల్ సాగునుఅవసరమైనంతగా ప్రోత్సహించడం లేదు. ముడిచమురు ధర ఎంత పతనమైనా పామాయిల్ గెలల ధర కనీస మద్దతు ధరకన్నా తగ్గకుండా ఉండేలా ప్రభుత్వం భరోసా ఇవ్వాలన్నది రైతుల ఆకాంక్ష. కాకినాడ ఎంపీ తోట నరసింహం ఈ విషయాన్ని ఇటీవల పార్లమెంటులో ప్రస్తావించారు. ఏది ఏమైనా వంట నూనెల కొరత సమస్యకు పామాయిల్ సాగు విస్తీర్ణాన్ని పెంచుకోవడమే సరైన పరిష్కారమని ప్రభుత్వం గుర్తించాలి. (వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు. మొబైల్: 94403 39682) -
10 శాతం వృద్ధి సాధ్యమే: దీపక్ పరేఖ్
ముంబై: దేశం 10 శాతం వృద్ధి రేటును సాధించడానికి తగిన పరిస్థితులు ఉన్నాయని హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హెచ్డీఎఫ్సీ) చైర్మన్ దీపక్ పరేఖ్ పేర్కొన్నారు. స్థూల ఆర్థిక పరిస్థితులు, ఫండమెంటల్స్ ఇందుకు అనుకూలంగానే ఉన్నాయని అన్నారు. అయితే ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఎంత సమయం పడుతుందన్న విషయాన్ని తాను చెప్పలేనని పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన ఐఎస్బీ కేపిటల్ మార్కెట్ల సదస్సులో పరేఖ్ మాట్లాడుతూ, స్టాక్ మార్కెట్ల ర్యాలీ, చమురు ధరల పతనం, స్థిరమైన, మెజారిటీ ప్రభుత్వం ఇవన్నీ భారత ఆర్థిక వ్యవస్థకు పూర్తి సానుకూలమైనవని వివరించారు. అయితే వీటికితోడు న్యాయ, ఎన్నికలు, పోలీస్, కార్మిక, భూ సంస్కరణలతోపాటు ఫైనాన్షియల్ రంగంలోనూ సంస్కరణలు అవసరమని అన్నారు. అయితే ఇప్పటికిప్పుడు 6.5 నుంచి 7% వృద్ధి సాధనకు మరింత కష్టపడాల్సిన అవసరం ఉందన్నారు. -
డీజిల్పై నియంత్రణ ఎత్తివేత
లీటర్కు రూ. 3.37 తగ్గిన ధర శనివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి.. ఇకపై అంతర్జాతీయ ధరలకు తగ్గట్టు ధర సహజవాయువు ధర 46 శాతం పెంపు కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా తగ్గడం, చమురు కంపెనీలు లాభాల బాటలోకి ప్రవేశించడంతో డీజిల్ ధరలపై నియంత్రణను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఎత్తేసింది. దీంతో అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా లీటర్ డీజిల్పై రూ. 3.37 పైసలు ధర తగ్గింది. కొత్త ధర శనివారం అర్థరాత్రి నుంచి అమలులోకి వచ్చింది. ఈ మేరకు శనివారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. కేబినెట్ భేటీ అనంతరం ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ విలేకరులతో మాట్లాడుతూ.. డీజిల్ ధరలపై నియంత్రణను ఎత్తేయాలని మంత్రివర్గ భేటీలో నిర్ణయించినట్టు చెప్పారు. దీనివల్ల సామాన్యులపై ఎటువంటి భారం పడబోదన్నారు. డీజిల్ ధరలపై నియంత్రణను ఎత్తేయడంతో వచ్చే నెల నుంచి అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా డీజిల్ ధరలు ఉండబోతున్నాయి. సవరించిన ధరల ప్రకారం ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ. 58.97 నుంచి రూ. 55.60కి తగ్గింది. హైదరాబాద్లో రూ. 64.27 నుంచి రూ. 60.60కు, వరంగల్లో రూ. 63.90 నుంచి రూ. 60.24 కు తగ్గింది. ఐదేళ్లలో ఇదే తొలిసారి.. ఐదేళ్ల కాలంలో డీజిల్ ధరలను తగ్గించడం ఇదే తొలిసారి. ఆఖరిసారిగా 2009 జనవరి 29న డీజిల్ ధరను రూ. 2 మేరకు ప్రభుత్వం తగ్గించింది. ఈ ఏడాది సెప్టెంబర్1న చివరిసారిగా డీజిల్ ధరను 50 పైసల చొప్పున పెంచారు. 2013 జనవరి నుంచి ఇప్పటి వరకూ 19 సార్లు డీజిల్ ధరలను ప్రభుత్వం పెంచింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా పడిపోవడంతో పాటు రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తికావడంతో డీజిల్ ధరలపై నియంత్రణను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర సుమారు 25 శాతం తగ్గి బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 83 డాలర్లకు పరిమితమైంది. ఇప్పట్లో ఇది వంద డాలర్లను దాటే అవకాశం లేదని పరిశ్రమ వర్గాల అంచనా. 2010లో అప్పటి యూపీఏ ప్రభుత్వం పెట్రోల్ ధరలపై నియంత్రణను ఎత్తివేసింది. గత ఏడాది జనవరిలో ప్రతినెలా 50 పైసల చొప్పున డీజిల్ ధరను పెంచాలని నిర్ణయించింది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడంతో ఆగస్టు నుంచి ఇప్పటి వరకూ ఐదు సార్లు పెట్రోల్ ధరలు తగ్గాయి. దీంతో రెండు నెలల్లోనే పెట్రోల్ ధర రూ. 7 మేరకు తగ్గింది. డీజిల్ విషయానికి వస్తే సెప్టెంబర్ రెండో వారం నాటికే కంపెనీలు నష్టాల నుంచి గట్టెక్కాయి. లీటర్కు రూ. 3.56 చొప్పున డీజిల్పై లాభాలను ఆర్జిస్తున్నాయి. తాజాగా డీజిల్ ధరలపై నియంత్రణను ఎత్తివేయడంతో ఇకపై ప్రభుత్వం లేదా ప్రభుత్వ చమురు సంస్థలు డీజిల్పై ఎలాంటి సబ్సిడీని అందించవు. డీజిల్ ధరల నుంచి చమురు కంపెనీలకు ఉపశమనం లభించినా కిరోసిన్, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై మాత్రం నష్టాలు కొనసాగుతున్నాయి. లీటర్ కిరోసిన్పై రూ. 31.22, 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్పై రూ. 404.64 చొప్పున కంపెనీలు నష్టపోతునున్నాయి. పెరిగిన సహజవాయువు ధర...మరోవైపు సహజవాయువు ధరను 46 శాతం పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతం 4.2 డాలర్లుగా ఉన్న సహజవాయువు ధర నవంబర్ 1 నుంచి 6.17 డాలర్లకు చేరనుంది. ఈ గ్యాస్ ధరను రెట్టింపు చేయాలన్న రంగరాజన్ కమిటీ సిఫార్సుకు అప్పటి యూపీఏ ప్రభుత్వం ఆమోదించినా ఎన్డీఏ ప్రభుత్వం పక్కన పెట్టి, కొత్త ఫార్ములా కింద ధర నిర్ణయించింది. ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీ, ముఖేష్ అంబాని నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్)ఉత్పత్తి చేసే గ్యాస్ ధరను ఆరు నెలలకు ఒకసారి ప్రభుత్వం సమీక్షించనుంది. దీనిపై తదుపరి సమీక్ష వచ్చే ఏడాది ఏప్రిల్ 1న చేపడుతుంది. సహజవాయువు ధరను పెంచడంతో సీఎన్జీ ధర కేజీకి రూ. 4.25 చొప్పున, పైప్లైన్ ద్వారా సరఫరా అయ్యే వంట గ్యాస్ ధర రూ. 2.60 చొప్పున పెరగనుంది. కాగా గ్యాస్ ఆధారిత విద్యుత్, ఆహార పదార్థాల ధరలు పెరగనున్నాయి. కేజీ డీ6లోని ధీరుబాయ్ అంబానీ 1, 3 గ్యాస్ ఫీల్డ్స్లో ఉత్పత్తి తక్కువగా ఉన్నందున ఆర్ఐఎల్ కొత్త గ్యాస్ ధరను పొందలేదు. ఆర్ఐఎల్ కస్టమర్లు కొత్త ధరను చెల్లించినా.. ఆర్ఐఎల్కు 4.2 డాలర్లు మాత్రమే చెల్లిస్తారు. మిగిలిన మొత్తాన్ని గెయిల్ నేతృత్వంలోని గ్యాస్ పూల్ ఖాతాలో జమ చేస్తారు. నిబంధనల మేరకు గ్యాస్ను ఉత్పత్తి చేసిన తర్వాత మాత్రమే ఆర్ఐఎల్ కొత్త ధరను పొందగలుగుతుంది.మరోవైపు ఢిల్లీలోని ప్రభుత్వ భవనాలను స్మారక చిహ్నాలుగా మార్చరాదని కేంద్రం నిర్ణయించింది. ఆర్ఎల్డీ చీఫ్ అజిత్సింగ్ తన తండ్రి, మాజీ ప్రధాని చరణ్సింగ్ నివసించిన బంగళాను స్మారక చిహ్నంగా మార్చాలని ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. మహాత్మా గాంధీ జయంతి, వ ర్ధంతి వేడుకలను ఇకపై కేంద్రమే నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. మళ్లీ నగదు బదిలీ.. యూపీఏ హయాంలో అమలు చేసిన వంట గ్యాస్కు నగదు బదిలీని తిరిగి అమలు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. నవంబర్ 10 నుంచి వచ్చే ఏడాది జనవరి 1 వరకూ దేశంలోని 54 జిల్లాల్లో వంట గ్యాస్కు నగదు బదిలీని అమలు చేయనున్నట్టు ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ చెప్పారు. పాత పథకంలో ఉన్న లోపాలను సవరించి తొలి దశలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు గోవా, హిమాచల్ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో దీనిని అమలు చేయనున్నారు. ఆధార్కార్డు లేకపోయినా బ్యాంకు ఖాతాలు ఉన్న వారందరికీ నేరుగా నగదు బదిలీ చేస్తామని జైట్లీ చెప్పారు. ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా లేని వారికి మాత్రం కొంత కాలం పాటు పాత పద్ధతిలోనే గ్యాస్ సరఫరా చేస్తామని చెప్పారు. వంట గ్యాస్ సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వమే నిర్ణయిస్తుందన్నారు. జనధన యోజన పథకం కింద ఇప్పటి వరకూ 6.02 కోట్ల బ్యాంకు ఖాతాలు ప్రారంభించినట్టు చెప్పారు. -
రూ. 3.56 వరకూ తగ్గనున్న డీజిల్ ధర
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఏకంగా నాలుగేళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడంతో.. దేశంలో డీజిల్ ధరలు భారీగా తగ్గనున్నాయి. ఈ నేపథ్యంలో డీజిల్పై చమురు సంస్థలకు నష్టాలు వచ్చే పరిస్థితి పోయి.. రెండు మూడు నెలలుగా లాభాలు రావడం ప్రారంభమైంది. ప్రస్తుత ధరల ప్రకారం చమురు సంస్థలకు ఒక్కో లీటర్ డీజిల్పై దాదాపు రూ. 3.56 వరకూ లాభం వస్తోంది. ఈ విషయాన్ని చమురు సంస్థలు అధికారికంగా ప్రకటించాయి కూడా. ఈ నెల తొలివారంలో ఒక్కో లీటర్పై రూ. 1.90 పైసల వరకూ లాభం రాగా... కొద్ది రోజుల్లోనే అది రెట్టింపు కావడం గమనార్హం. అయితే మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల కారణంగా కోడ్ అమల్లో ఉండడంతో... డీజిల్ ధరలను తగ్గించలేదు. ఆదివారం ఈ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అనంతరం డీజిల్ ధరల తగ్గింపును ప్రకటించనున్నారు. -
భారత్కు క్రూడ్ ధరల సెగ..
పెట్రోలియం రేట్ల కుదుపులతో ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి అరవింద్ మాయారామ్ వ్యాఖ్యలు న్యూఢిల్లీ: ఇరాక్లో అంతర్యుద్ధ ప్రభావంతో క్రూడ్ ధరలు ఎగబాకుతుండటంపై ఆర్థిక శాఖ కార్యదర్శి అరవింద్ మాయారామ్ ఆందోళన వ్యక్తం చేశారు. పెట్రోలియం ధరల తీవ్ర హెచ్చుతగ్గుల కారణంగా దేశీ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడికి దారితీస్తోందన్నారు. ముఖ్యంగా మందగమనం నుంచి ఇప్పుడిప్పుడే కొంత ఉపశమనం దిశగా అడుగులేస్తున్న వర్ధమాన ఆర్థిక వ్యవస్థలకు ఇది ప్రతికూలాంశమేనని ఆయన పేర్కొన్నారు. మెల్బోర్న్లో జరిగిన జీ-20 దేశాలకు సంబంధించిన ఒక సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ పరిస్థితులతో వర్ధమాన దేశాల ఆర్థిక ప్రగతికి మద్దతు తగ్గిపోతుండగా.. సవాళ్లు మాత్రం అంతకంతకూ ఎగబాకుతున్నాయని అభిప్రాయపడ్డారు. వృద్ధికి చేయూతనిచ్చేలా విధానాలు... భారత్లో అధికారంలోకి వచ్చిన కొత్త సర్కారు... వృద్ధికి చేయూతనిచ్చే ఆర్థిక విధానాలను కొనసాగించనుందని జీ-20 సమావేశంలో మాయారామ్ పేర్కొన్నారు. దేశాన్ని మళ్లీ అధిక వృద్ధి బాటలోకి తీసుకురావడం.. దీన్ని స్థిరంగా కొనసాగించే విధంగా సంస్కరణల ప్రక్రియను మరింత బలోపేతం చేయనున్నట్లు ఆయన చెప్పారు. వచ్చే నెలలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెట్లో సంస్కరణ చర్యలు ఉంటాయన్నారు. అధిక ద్రవ్యోల్బణం ముఖ్యంగా ఆహార ధరలు ఎగబాకుతుండటం... అధిక ద్రవ్యలోటు, సబ్సిడీల బిల్లు వంటి ప్రతికూలతల నేపథ్యంలో బడ్జెట్లో ఎలాంటి చర్యలు ఉంటాయన్న ఉత్కంఠ నెలకొంది. కాగా, ఆర్థిక వ్యవస్థను మందగమనం నుంచి గట్టెక్కించాలంటే కొన్ని కఠిన చర్యలు తప్పవంటూ స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్న కొద్ది రోజులకే రైల్వే ప్రయాణికుల, సరుకు రవాణా చార్జీలను ప్రభుత్వం భారీగా పెంచేసిన సంగతి తెలిసిందే. వరుసగా రెండు ఆర్థిక సంవత్సరాలు(2012-14) దేశ ఆర్థిక వృద్ధిరేటు 5 శాతం దిగువనే కొనసాగడం ఆందోళన కలిగిస్తున్న అంశం. -
రూ.2 తగ్గనున్న పెట్రోల్?
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గిపోవడంతో దేశంలో పెట్రోల్ రేటు తగ్గే అవకాశం కనిపిస్తోంది. రూ.1.50-2 మేరకు పెట్రోల్ ధర తగ్గవచ్చని తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు ఒకట్రెండు రోజుల్లో ప్రకటన చేయవచ్చని సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి. ‘అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు క్రమంగా పడిపోతుండటంతోపాటు డాలర్తో రూపాయి మారకం విలువ కూడా స్థిరంగా కొనసాగుతోంది. పెట్రోల్ ధరలు తగ్గుతాయడానికిది సంకేతమ’ని ఆయిల్ కంపెనీ అధికారి ఒకరు చెప్పారు. -
అమెరికాలో సంక్షోభం: పడిపోయిన క్రూడాయిల్ ధర
వాషింగ్టన్/ముంబై: అమెరికాలో తలెత్తిన అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ప్రభావం ఆయిల్ మార్కెట్పై పడింది. బ్యారెల్ క్రూడాయిల్ ధర 101 డాలర్లకు పడిపోయింది. అమెరికాలో ఆర్థిక సంక్షోభం ఫలితంగా ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ మూసేయాలని వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆదేశించిన విషయం తెలిసిందే. బడ్జెట్ బిల్లు సెనేట్లో ఆమోదం పొందకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. కాంగ్రెస్ సమయానికి స్పందించి, అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా రేపటికి సంతకం చేస్తారో లేదో ఇంకా తెలియదని, అందువల్ల ప్రస్తుతానికి ప్రభుత్వ కార్యాయాలయన్నింటినీ మూసివేయాలని వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ డైరెక్టర్ సిల్వియా బర్వెల్ ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ వీలైనంత త్వరగా స్పందించి, తాత్కాలికంగానైనా ఓ బడ్జెట్ను ఆమోదించాలని, అప్పుడు మిగిలిన ఆర్థిక సంవత్సరానికి కావల్సిన బడ్జెట్ను కొంత సమయం తీసుకున్న తర్వాత ఆమోదించుకోవచ్చని, దానివల్ల ప్రభుత్వ సేవలన్నింటినీ త్వరగా పునరుద్ధరించే అవకాశం ఉంటుందని లేనిపక్షంలో తీవ్ర ప్రభావం కలిగే ప్రమాదముందని బర్వెల్ అన్నారు. గడిచిన 17 సంవత్సరాల్లో అమెరికా ప్రభుత్వానికి ఈ పరిస్థితి రావడం ఇదే మొట్టమొదటిసారి. చిట్టచివరిసారిగా 1996లో క్లింటన్ ప్రభుత్వానికి, రిపబ్లికన్ల ఆధిపత్యం ఉన్న కాంగ్రెస్కు మధ్య విభేదాలు తలెత్తినప్పుడు కూడా బడ్జెట్ ఆమోదం పొందలేదు. ఇదిలా ఉండగా, రిపబ్లికన్లు మరీ తీవ్రవాదుల్లా వ్యవహరించి సొంత అమెరికన్లనే బందీలుగా చేశారని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నిప్పులుగక్కారు. ప్రభుత్వాన్ని బెదిరించడానికి బడ్జెట్ను అడ్డుకోవడం దారుణమని మండిపడ్డారు. చిట్టచివరి నిమిషంలో కూడా తాము రాజీ పడేందుకు ప్రయత్నించినా, వాళ్లు మాత్రం వినిపించుకోలేదని చెప్పారు. ఆరోగ్య బీమా సంస్కరణల బిల్లు మీద సంతకం పెట్టకుండా ఒబామాను అడ్డుకోవాలని రిపబ్లికన్లు గట్టి పట్టుదలతో ఉన్నారు. అందువల్లే వాళ్లు బడ్జెట్ బిల్లును సైతం ఆమోదించకుండా అడ్డుపడ్డారు. దీని ఫలితంగా ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ మూసివేయాలని ఆదేశాలు జారీ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఎలాగోలా రిపబ్లికన్లకు - ఒబామా సర్కారుకు మధ్య ఒప్పందం కుదరని పక్షంలో ఈనెల రెండో వారానికల్లా అమెరికా పూర్తిగా దివాలా తీసే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వం పనిచేయాలంటే కాంగ్రెస్ సహకరించాలని, బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లించాలంటే బడ్జెట్ ఉండాలని ఒబామా అన్నారు. ఇందుకోసం ఆయన ప్రత్యేకంగా రిపబ్లికన్ హౌస్ స్పీకర్ జాన్ బోనర్ తదితర నాయకులతో వేరువేరుగా ఫోన్లో మాట్లాడారు. అయినా ఫలితం లేదు. ఈ ప్రభావం ఆయిల్ మార్కెట్పై పడి క్రూడ్ ఆయిల్ ధర పడిపోయింది. బంగారం ధరలపై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉంది. ఇక ముందు ముందు ఈ ప్రభావం వల్ల ఎటువంటి పరిణామాలు తలెత్తుతాయో వేచి చూడాలి. -
ఏం చేసినా లాభం లేదు...: డీబీఎస్
ముంబై: ప్రభుత్వం తాజాగా చేపడుతున్న విధాన చర్యల వల్ల రూపాయి విలువ పుంజుకోవడం అసాధ్యమని, అయితే పతనం స్పీడ్కు కొంత అడ్డుకట్టపడొచ్చని సింగపూర్కు చెందిన ప్రముఖ బ్యాంక్ డీబీఎస్ పేర్కొంది. బుధవారం ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్ ప్రారంభానికి ముందే బ్యాంక్ ఒక నోట్ను విడుదల చేసింది. ఇందులో రూపాయి 75కు కూడా పడిపోతుందని డీబీఎస్ పేర్కొనడం గమనార్హం. గడచిన కొద్దిరోజులుగా కొనసాగుతున్న పతనం మరింత తీవ్రతరం అవుతుందనికూడా చెప్పింది. కరెన్సీ విలువ క్షీణతకు అడ్డుకట్టవేయడం కోసం చేసే ఏ ప్రయత్నమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో నిష్ఫలమేనని కూడా తేల్చిచెప్పింది.