జమ్మూలో ఉగ్రదాడి: ముగ్గురు జవాన్లు మృతి
జమ్మూకశ్మీర్: రాష్ట్రంలోని షోపియన్ వద్ద గురువారం తెల్లవారుజామున ఉగ్రవాదుల కాల్పులకు తెగబడ్డారు. నియంత్రణ రేఖ వద్ద పెట్రోలింగ్ చేస్తున్న ఆర్మీ జవాన్లపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పలు ప్రారంభించారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు అమరులు కాగా.. స్ధానిక మహిళ ఒకరు మృతి చెందారు. మరో ఐదుగురు జవానులు గాయాలపాలయ్యారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.