Terror attack
-
పార్లమెంట్పై ఉగ్రదాడి ఘటన..
న్యూఢిల్లీ: 2001 డిసెంబర్ 13వ తేదీన పార్లమెంట్పై జరిగిన ఉగ్రదాడిని ఎదుర్కొని ప్రాణ త్యాగం చేసిన భద్రతా సిబ్బందికి లోక్సభ శుక్రవారం ఘనంగా నివాళులర్పించింది. సభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే అమరుల గౌరవార్థం సభ్యులంతా లేచి నిలబడి కొద్దిసేపు మౌనం పాటించారు. అనంతరం పాత పార్లమెంట్ సంవిధాన్ సదన్ వెలుపల జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అమరులకు పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ధన్ఖడ్, ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. సీఐఎస్ఎఫ్ జవాన్లు అమరులకు సెల్యూట్ చేశారు. అనంతరం మౌనం పాటించారు. బాధిత కుటుంబాల సభ్యులతో నేతలు మాట్లాడారు. కాగా, అప్పటి ఘటనలో పార్లమెంట్ భద్రతా విభాగం, ఢిల్లీ పోలీసులు, సీఆర్పీఎఫ్లకు చెందిన 8 మంది సిబ్బందితోపాటు సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ శాఖకు చెందిన ఓ ఉద్యోగి నేలకొరిగారు. పార్లమెంట్లోకి ప్రవేశించి మారణ హోమం సృష్టించేందుకు తెగబడిన పాకిస్తాన్కు చెందిన మొత్తం ఐదుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు.సర్వదా రుణపడి ఉంటాం: రాష్ట్రపతి ముర్ము 2001లో ఉగ్ర మూకల దాడి నుంచి పార్లమెంట్ను రక్షించే క్రమంలో ప్రాణత్యాగం చేసిన వారికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఘనంగా నివాళులర్పించారు. అమరులకు సర్వదా రుణపడి ఉంటామని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. ఉగ్రమూకలను జాతి యావత్తూ కలిసి కట్టుగా ఎదుర్కొందని, ఉగ్రవాదంపై పోరుకు దేశం కట్టుబడి ఉంటుందని ఆమె ‘ఎక్స్’లో తెలిపారు. -
ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోవాలి: శరద్ పవార్
ముంబై: బుద్గామ్ ఉగ్రదాడిపై దర్యాప్తు జరపాలన్న నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలను కేంద్రం సీరియస్గా తీసుకోవాలని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ పేర్కొన్నారు. ఉగ్రవాద సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం, హోంమంత్రిత్వశాఖ ప్రయత్నించాలని కోరారు. ఫరూక్ అబ్దుల్లా జమ్ముకశ్మీర్లో అత్యున్నత వ్యక్తి అని,ఆయన తన జీవితాన్ని కశ్మీర్ ప్రజలకు సేవ చేశారని తెలిపారు. ఆయన నిజాయితీపై తనకు ఎలాంటి సందేహం లేదని, అలాంటి వ్యక్తి చేసిన ప్రకటనను కేంద్రం, ప్రత్యేకంగా హోంమంత్రిత్వశాఖ సీరియస్గా పరిగణించాలని సూచించారు. ఉగ్రవాద సమస్యను పరిష్కరించేందుకు ముందడుగు వేయాలన్నారు.కాగా శనివారం ఉదయం ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ.. బుద్గామ్ ఉగ్రదాడిపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. జమ్ముకశ్మీర్లో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నవారే దీనికి పాల్పడి ఉంటారనే అనుమానం కలుగుతోందని తెలిపారు. అంతేగాక ఉగ్రవాదులను చంపకుండా, ప్రాణాలతో పట్టుకోవాలని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులను సజీవంగా బంధించి విచారిస్తే.. వారి వెనక ఉన్న వారు ఎవరో తెలుసుకోవచ్చని చెప్పారు. ఉగ్రమూకల వ్యూహాలు తెలుస్తాయని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. బుద్గాం జిల్లాలోని మగామ్ ప్రాంతంలోని మజామాలో శుక్రవారం ఉగ్రవాదులు ఇద్దరు స్థానికేతరులపై కాల్పులు జరిపారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటన తర్వాత దాడికి పాల్పడిన వారిని పట్టుకునేందుకు భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. మరోవైపు నేడు అనంత్నాగ్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయని అధికారులు తెలిపారు. శ్రీనగర్లోని ఖన్యార్ ప్రాంతంలో ఇలాంటి ఎన్కౌంటర్ జరిగిన కొన్ని గంటల తర్వాత ఇది జరిగింది. -
జమ్ముకశ్మీర్లో ఉగ్రదాడి.. ఇద్దరు జవాన్లతో సహా నలుగురి మృతి
జమ్ముకశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బారాముల్లాలో ఆర్మీ వాహనంపై గురువారం ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు ప్రాణాలు విడిచినట్లు అధికారులు వెల్లడించారు. వీరితోపాటు ఇద్దరు కూలీలు మరణించగా, మరో ముగ్గురు ఆర్మీ సిబ్బంది గాయపడినట్లు తెలిపారు. మరణించారని వర్గాలు తెలిపాయి.బారాముల్లాలోని బుటాపత్రి నాగిన్ ప్రాంతంలో సామాగ్రి తీసుకెళ్తున్న మిలటరీ ట్రక్కుపై గురువారం సాయంత్రం ఉగ్రవాదులు తొలుత దాడులు జరిపినట్లు ఆర్మీ అధికారులు ఎక్స్లో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన వలస కార్మికుడిపై కాల్పులు జరపడంతో.. దీంతో ఉగ్రవాదులు, 18వ రాష్ట్రీయ రైఫిల్స్కు చెందినసైనికుల మధ్య కాల్పులు జరిగినట్లు తెలిపారు. గాయపడిన వ్యక్తిని ప్రీతమ్ సింగ్గా గుర్తించారు. సంఘటనా ప్రాంతాన్ని భారత బలగాలు ఆధీనంలో తీసుకొని టెర్రరిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.కాగా గత 72 గంటల్లో కేంద్రపాలిత ప్రాంతంలో ఆర్మీ వాహనంపై దాడి జరగడం ఇది రెండోది. మూడు రోజుల క్రితం టన్నెల్ నిర్మిస్తున్న నిర్మాణ కార్మికుల హౌసింగ్ క్యాంపుపై ఉగ్రవాదులు దాడి చేయడంతో ఆరుగురు కార్మికులు, ఒక వైద్యుడు మరణించారు - మరణించిన వారిని కశ్మీర్లోని నయీద్గామ్లోని బుద్గామ్కు చెందిన డాక్టర్ షానవాజ్, పంజాబ్లోని గురుదాస్పూర్కు చెందిన గుర్మీత్ సింగ్, బీహార్కు చెందిన మహ్మద్ హనీఫ్, ఫహీమ్ నాసిర్, కలీమ్లుగా గుర్తించారు.ఈ దాడిని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఖండించారు. ‘ఉత్తర కాశ్మీర్లోని బూటా పత్రి ప్రాంతంలో ఆర్మీ వాహనాలపై దాడి జరగడం, ప్రాణ నష్టం కలగడం దురదృష్టకరం.కశ్మీర్లో ఇటీవల జరుగుతున్న వరుస దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. దీనిని నేను ఖండిస్తున్నాను. ఈ దుశ్చర్యలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని అబ్దుల్లా తన పోస్ట్లో పేర్కొన్నారు. -
టర్కీలో ఉగ్రదాడి.. భారీగా మృతులు..!
అంకారా: టర్కీ రాజధాని అంకారా శివార్లలోని ఓ ఏరోస్పేస్ సంస్థపై ఉగ్రవాదులు బుధవారం(అక్టోబర్ 23) దాడి చేశారు. ఈ దాడిలో పలువురు మృతి చెందడంతో పాటు కొందరు గాయపడ్డట్టు టర్కీ అంతర్గత వ్యవహారాల మంత్రి అలీ తెలిపారు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్)లో ఆయన ఒక ట్వీట్ చేశారు. Türk Havacılık ve Uzay Sanayii AŞ. (TUSAŞ) Ankara Kahramankazan tesislerine yönelik terör saldırısı gerçekleştirilmiştir.Saldırı sonrası maalesef şehit ve yaralılarımız bulunmaktadır.Şehitlerimize Allah’tan rahmet; yaralılarımıza acil şifalar diliyorum.Gelişmelerden kamuoyu…— Ali Yerlikaya (@AliYerlikaya) October 23, 2024 రాజధాని అంకారా శివారులో ఈ ఘటన జరిగింది. ఉగ్రవాదులు తొలుత బాంబులతో దాడి చేసి తర్వాత కాల్పులు జరిపినట్లు తెలిసింది. ఏరోస్పేస్ సంస్థ సెక్యూరిటీ సిబ్బంది షిఫ్ట్ మారే సమయంలో దుండగులు ట్యాక్సీలో ప్రవేశించి తొలుత బాంబు వేసి తర్వాత తుపాకులతో కాల్చారు. దాడి చేసిన ఉగ్రవాదుల్లో ఒక మహిళ కూడా ఉన్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: అగ్ర నేతలపై ఇజ్రాయెల్ టార్గెట్.. హమాస్ కీలక నిర్ణయం -
జమ్మూ కశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం
జమ్మూ కశ్మీర్లో బుధవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. ఉదంపూర్, కథువా జిల్లాల్లోని అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల సంచారానికి సంబంధించి సమాచారం అందుకున్నఆర్మీ ప్రత్యేక బలగాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు అక్కడికి చేరుకొని సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.భారీ వర్షాలు, క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు ఉన్నా ఉగ్రవాదులను ఏరివేయడంలో భద్రతా బలగాలు విజయం సాధించాయి. కథువా జిల్లాల్లో చేపట్టిన ఆపరేషన్లో ముగ్గురు టెర్రరిస్టులను అంతమొందించారు. హతమైన ఉగ్రవాదుల నుంచి ఎం4 రైఫిల్, ఏకే రైఫిల్, పిస్టల్ సహా పలు ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ప్రస్తుతం సంఘటనా స్థలంలో భారీగా బలగాలను మోహరించారు. ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. -
పాక్లో బీఎల్ఏ స్వైరవిహారం
కరాచీ: పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో మిలిటెంట్ గ్రూప్ బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) రెచ్చిపోయింది. ఆది, సోమ వారాల్లో బీఎల్ఏ సాయుధులు పోలీస్ స్టేషన్లు, రైలు మార్గాలు, వాహనాలపై దాడులు జరిపి 50 మందిని చంపేశారు. అనంతరం సైన్యం చేపట్టిన ఏరివేతలో 12 మంది మిలిటెంట్లు హతమయ్యారు. బీఎల్ఏ సభ్యులు ఆదివారం రాత్రి బలోచిస్తాన్లోని ముసాఖెల్ జిల్లాలోని హైవేను దిగ్బంధించారు. అటుగా వచ్చిన బస్సులు, ట్రక్కులను అడ్డగించి, ప్రయాణికులతోపాటు డ్రైవర్లను కిందికి దించివేశారు. ‘గుర్తింపు కార్డులు పరిశీలించాక పంజాబ్, ఖైబర్ పంఖ్తున్వా ప్రావిన్స్లకు చెందిన 23 మందిని తుపాకులతో కాల్చి చంపారు. అనంతరం సమీపంలోని కొండ ప్రాంతంలోకి వారంతా పరారయ్యారు. ఉగ్రవాదులు ప్రయాణికుల వాహనాలతో పాటు బొగ్గుతో వెళ్లే ట్రక్కులను కూడా అడ్డగించి డ్రైవర్లను చంపేశారు. పది ట్రక్కులకు నిప్పుపెట్టారు’అని అధికారులు తెలిపారు. ఇదే ప్రావిన్స్లోని మరికొన్ని చోట్ల ఉగ్రవాదులు పోలీస్ స్టేషన్లు, భద్రతా బలగాల పోస్టులే లక్ష్యంగా దాడులకు దిగారు. ఈ ఘటనల్లో మరో 10 మంది చనిపోయారు. బలోచిస్తాన్లోని ఖలాట్ జిల్లాలో మరో ఘటనలో..ఆరుగురు పోలీసులు సహా మొత్తం 11 మందిని బీఎల్ఏ తీవ్రవాదులు చంపారు. మరో ఘటనలో బొలాన్ జిల్లా డొజాన్ ప్రాంతంలోని పాక్– ఇరాన్లను కలిపే రైల్వే మార్గంపై వంతెనను పేల్చివేసిన ఉగ్రవాదులు, ఆరుగురిని కాల్చి చంపారు. ఈ ఘటనలకు తమదే బాధ్యతంటూ అనంతరం బీఎల్ఏ మీడియాకు పంపిన ఈ మెయిల్లో ప్రకటించుకుంది. పారామిలటరీ బలగాల బేస్పైనా దాడి చేసినట్లు అందులో చెప్పుకుంది. అయితే, ప్రభుత్వం దీనిని ధ్రువీకరించాల్సి ఉంది. సహజవనరులు పుష్కలంగా ఉన్న బలూచిస్తాన్ పాక్లోని అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఉండిపోయింది. -
ఉగ్రదాడులపై ప్రతీ దేశ భక్తుడి డిమాండ్: రాహుల్ గాంధీ
ఢిల్లీ: జమ్ము కశ్మీర్లో కొన్ని నెలల నుంచి భారత సైనికులే లక్ష్యంగా జరుగుతున్న ఉగ్రవాద దాడులపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన తరచూ చోటుచేసుకోవటం చాలా విచారకమని ‘ఎక్స్’లో అన్నారు. సోమవారం జమ్ము కశ్మీర్లోని దోదా జిల్లాలో జరిగిన ఉగ్రవాద దాడిలో నలుగురు భారత సైనికులు అమరులయ్యారు. సైనికుల మృతికి రాహుల్ సంతాపం వ్యక్తం చేశారు.‘జమ్ము కశ్మీర్లోని దోడా జిల్లాలో ఉగ్రవాద దాడుల్లో అమరులైన సైనికులకు సంతాపం వ్యక్తం చేస్తున్నా. అమరులైన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’అని ‘ఎక్స్’లో తెలిపారు.మరోవైపు.. జమ్ము కశ్మీర్లో నెలకొన్న దారుణమైన పరిస్థితులపై రాహుల్ గాంధీ బీజేపీ పభుత్వంపై మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన తప్పుడు పాలసీలను భారత ఆర్మీ సైనికులు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు. ఉగ్రదాలకు కారణం బీజేపీ తీసుకున్న తప్పుడు పాలసీలే. అందులో ఒకటి జమ్ము కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయటం. దీంతో ఇటీవల జమ్ము కశ్మీర్లో ఉగ్రదాడులు పెరిగాయి. తరచూ జమ్ము కశ్మీర్లో చోటుచేసుకుంటున్న భద్రత లోపాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని ప్రతి దేశ భక్తుడు డిమాండ్ చేయాలి’అని రాహుల్ గాంధీ అన్నారు.आज जम्मू कश्मीर में फिर से एक आतंकी मुठभेड़ में हमारे जवान शहीद हो गए। शहीदों को विनम्र श्रद्धांजलि अर्पित करते हुए शोक संतप्त परिजनों को गहरी संवेदनाएं व्यक्त करता हूं।एक के बाद एक ऐसी भयानक घटनाएं बेहद दुखद और चिंताजनक है। लगातार हो रहे ये आतंकी हमले जम्मू कश्मीर की जर्जर…— Rahul Gandhi (@RahulGandhi) July 16, 2024 ఉగ్రవాద దాడులు పెరుగుతున్న ఈ సమయంలో రాజకీయం అందరూ ఐక్యంగా ఉండాలని తెలిపారు. ఉగ్రవాద దాడులపై ప్రభుత్వం స్పందిస్తూ.. చర్యలు తీసుకుంటే ప్రతిపక్షం నుంచి పూర్తి సహకారం అందిస్తామని రాహుల్ గాంధీ తెలిపారు. -
జమ్ము కశ్మీర్ ఉగ్రదాడుల వెనుక లష్కరే తోయిబా టెర్రరిస్ట్ హస్తం!
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో ఇటీవల వరుసగా చోటుచేసుకున్న ఉగ్రదాడుల వెనక లష్కర్-ఇ-తోయిబా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ సైఫుల్లా సాజిద్ జట్ హస్తం ఉన్నట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఎజేన్సీ (ఎన్ఐఏ) వెల్లడించింది. పాకిస్తాన్లోని కసూర్ జిల్లాలోని శంగమంగ గ్రామానికి చెందిన సాజిద్.. లష్కర్-ఇ-తోయిబా సంస్థకు చెందిన ఉగ్రవాది. అతని తలపై రు. 10 లక్షల రివార్డు ఉన్నట్లు ఎన్ఐఏ పేర్కొంది.సైఫుల్లా సాజిద్ జట్ పాకిస్తాన్ ఇస్లామాబాద్లో బేస్ క్యాంపు కార్యకలాపాలను నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. భారత సంతతికి చెందిన భార్య తనతోపాటు ఉంటోంది. సాజిద్ గతంలో పాక్ ఆక్రమిత కశ్మీర్లో సాధారణ పనులు చేస్తూ ఉండేవాడు. అనంతరం అతను లష్కరే తొయిబాలో చేరి.. ప్రస్తుతం ఉగ్రవాదుల నియామకాలను నిర్వహిస్తున్నాడు. అదేవిధంగా భారత దేశ వ్యాప్తంగా ఉగ్రవాదలుకు సాయం చేస్తున్నట్లు దర్యాప్తు సంస్థలు పేర్కొంటున్నాయి.లష్కరే తొయిబాలో సాజిద్ ఆపరేషనల్ కమాండర్. దీంతో ఉగ్రవాదులు నిధులు సమకూర్చుతాడు. సాజిత్ ఎన్ఐఏ జాబితాలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది. సాజిత్కు ఖాసిమ్అనే వ్యక్తి సాయం చేస్తున్నాడని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఖాసిమ్ కోసం వెతుకుతున్నారు. కొన్నేళ్ల నుంచి కశ్మీర్ వ్యాలీలో జరుగుతున్న ఉగ్రదాడుల వెనక సాజిద్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. గత నెలలో రియాసీ జిల్లాలో యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో 9 మంది మృతి చెందారు. ఈ ఘటన తర్వాత జరిగిన మరో ఉగ్రదాడిలో ఇద్దరు ఉగ్రవాదులు, ఒక సీఆర్పీఎఫ్ జవాన్ మృతిచెందాడు. గడిచిన రెండు రోజుల్లో కుల్గాం జిల్లాలో జరిగిన ఉగ్రదాడుల్లో ఐదుగురు టెర్రరిస్టులు మృతి చెందారు. -
Narendra Modi: ఉగ్రనిరోధక సామర్థ్యాలను పెంచండి
న్యూఢిల్లీ/జమ్మూ: ఉగ్రవాదం పీచమణిచేలా జమ్మూకశ్మీర్లో ఉగ్రనిరోధక సామర్థ్యాలను మరింతగా పెంచాలని పాలనా యంత్రాంగానికి ప్రధాని మోదీ సూచించారు. యాత్రికుల బస్సుపై ఉగ్రదాడి, చెక్పోస్ట్పై మెరుపుదాడి వంటి ఉదంతాలు మళ్లీ పెచ్చరిల్లిన నేపథ్యంలో జమ్మూకశ్మీర్లో తాజా పరిస్థితిపై ప్రధాని మోదీ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అదనపు భద్రతా బలగాల మొహరింపుతోపాటు ఉగ్రనిరోధక వ్యవస్థలను క్షేత్రస్థాయిలో మరింత విస్తృతంచేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు మోదీ సూచించారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తాజా పరిస్థితిపై వివరాలను జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను మోదీ అడిగి తెల్సుకున్నారు. స్థానిక యంత్రాంగంతో ఏ విధంగా వ్యూహాలను అమలుచేస్తున్నారో సిన్హా మోదీకి వివరించారు. జీ7 సదస్సు కోసం ఇటలీకి మోదీఇటలీలో నేటి నుంచి జరగబోయే జీ7 శిఖరాగ్ర సదస్సులో కృత్రిమ మేథ, ఇంధనం, ఆఫ్రికా, మధ్యధరా ప్రాంత సమస్యలపైనే దృష్టిసారించే అవకాశం ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సదస్సులో పాల్గొనేందుకు మోదీ గురువారం ఇటలీకి బయల్దేరి వెళ్లారు. ‘గ్లోబల్ సౌత్’ దేశాల సమస్యలపైనా ప్రధానంగా చర్చ జరగొచ్చని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ఇటలీలోని అపూలియో ప్రాంతంలోని విలాసవంత బోర్గో ఎగ్నాజియా రిసార్ట్లో జీ7 శిఖరాగ్ర సదస్సు నేటి నుంచి 15వ తేదీదాకా జరగనుంది. -
కశ్మీర్లో బస్సు దాడి మా పనే: టీఆర్ఎఫ్
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని రియాస్ జిల్లాలో యాత్రికుల బస్సుపై జరిగిన ఉగ్రదాడికి పాల్పడింది తామేనని పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ద రెసిస్టంట్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) ప్రకటించింది. అంతేగాక భవిష్యత్తులో పర్యాటకులు లేదా స్థానికేతరులపై ఇలాంటి దాడులు మరిన్ని జరగవచ్చని హెచ్చరించింది. రియాస్ దాడి కేవలం ప్రారంభం మాత్రమేనని తెలిపింది. ఆదివారం జమ్మూ కాశ్మీర్లోని రియాసి జిల్లాలో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై జరిగిన ఉగ్రదాడిలో పది మంది మృతి చెందగా, 33 మంది గాయపడ్డారు. రియాస్లోని శివ్ఖోరి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుని కాత్రాలోని వైష్ణో దేవి ఆలయానికి వెళ్తునన భక్తుల బస్సుపై ఈ దాడి జరిగింది. దీంతో అదుపుతప్పిన బస్సు లోయలో పడిపోయింది. బస్సుపై కాల్పులు జరిపిన దుండగులు అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.సంఘటన ప్రాంతంలో భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో దాడి జరిగిన ప్రాంతం చుట్టూ దట్టమైన అడవి, భారీ వృక్షాలతో ఉండటంతో ఉగ్రవాదుల్ని పట్టుకునేందుకు అధికారులు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలతో జాతీయ దర్యాప్తు సంస్త ఎన్ఐఏ ఈ దాడిపై దర్యాప్తు చేపట్టనున్నట్లు సమాచారం. ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) బృందం కూడా ఆపరేషన్లో చేరింది.కాగా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటతో 2023 జనవరి 6న ద రెసిస్టెన్స్ ఫ్రంట్పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దానిని ఉగ్రవాద సంస్థగా గుర్తించింది. లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థగా టీఆర్ఎఫ్ 2019లో ఉనికిలోకి వచ్చింది. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆన్లైన్ సంస్థగా ఇది పుట్టుకొచ్చింది. పాకిస్థాన్లోని కరాచీ కేంద్రంగా పనిచేస్తుంది. -
పోలింగ్ వేళ జమ్ములో కాల్పుల కలకలం
జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్, షోపియాన్లలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో బీజేపీ నేత, మాజీ సర్పంచ్ అజాజ్ అహ్మద్ షేక్ తీవ్రంగా గాయపడ్డారు. బాధితుడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఉదంతం షోపియాన్లోని హీర్పోరాలో చోటుచేసుకుంది. #WATCH | Anantnag, J&K: Terrorists fired upon and injured a lady Farha, resident of Jaipur and spouse of Tabrez at Yannar. Injured evacuated to hospital for treatment.(Video source: Local) https://t.co/7UUq9YXR8Y pic.twitter.com/im1NZ2hSEm— ANI (@ANI) May 18, 2024 జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అజాజ్ అహ్మద్ షేక్ ఇటీవలే బీజేపీలో చేరారు. అతనిపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. మరో ఘటన అనంత్నాగ్లో చోటుచేసుకుంది. ఇక్కడి యన్నార్ ప్రాంతంలో రాజస్థాన్లోని జైపూర్కు చెందిన ఫర్హా అనే మహిళ, ఆమె భర్త తబ్రేజ్లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. గాయపడిన ఇద్దరినీ చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలు జరిగిన ప్రాంతంలో పోలీసులు మోహరించారు. ఈ రెండు ఉగ్రవాద దాడులపై పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ట్విట్టర్లో తన స్పందనను తెలిపారు. ‘ఈరోజు పహల్గామ్లో ఇద్దరు పర్యాటకులు గాయపడిన ఘటనను, షోపియాన్లోని హీర్పోరాలో సర్పంచ్పై జరిగిన దాడిని ఖండిస్తున్నాం. ఇది ఆందోళన కలిగించే అంశం. కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో ఈ దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి’ అని పేర్కొన్నారు.Terrorist fired upon a person Aijaz Ahmad at Heerpora, Shopian. Injured evacuated. Area cordoned off. Further details to follow: Kashmir Zone Police pic.twitter.com/Y31BJouz0J— ANI (@ANI) May 18, 2024 -
పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని పూంచ్లో ఇండియన్ ఎయిర్ఫోర్స్ కాన్వాయ్పై శనివారం(మే4) ఉగ్రదాడికి పాల్పడ్డ టెర్రరిస్టుల ఊహాజనిత చిత్రాలను పోలీసులు విడుదల చేశారు. పాకిస్తాన్కు చెందిన ఇద్దరు టెర్రరిస్టులు ఈ ఉగ్రదాడికి పాల్పడ్డారని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ టెర్రరిస్టుల గురించి సమాచారమిచ్చిన వారికి రూ.20 లక్షల రివార్డు ప్రకటించారు. ఎయిర్ఫోర్స్ కాన్వాయ్పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో విక్కీ పహాడే అనే ఎయిర్ఫోర్స్ అధికారి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దాడి జరిగినప్పటి నుంచి ఉగ్రవాదుల కోసం రక్షణదళాలు భారీ సెర్చ్ ఆపరేషన్ను చేపట్టాయి. -
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
చండీగఢ్: జమ్ము-కశ్మీర్లోని పూంఛ్ జిల్లాలో చోటు చేసుకున్న ఉగ్రదాడి.. లోక్సభ ఎన్నికల ముందు బీజేపీ చేస్తున్న స్టంట్ అని పంజాబ్ మాజీ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జలంధర్లో నిర్వహించన ఎన్నికల ప్రచారంలో చన్నీ బీజేపీపై ఘాటుగా విమర్శలు చేశారు. ‘‘ఎన్నికల ముందు ఇవన్నీ బీజేపీ చేస్తున్న స్టంట్లు తప్ప ఉగ్రదాడులు కాదు. వాటిల్లో అసలు నిజమే లేదు. బీజేపీ ప్రజలు, శవాలతో ఆటలాడుతోంది. ఈ దాడులు నిజంగా జరిగినవి కావు. కేవలం బీజేపీకి ప్రయాజనం చేసేవి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. గతంలో లాగా బీజేపీ ఇలాంటి చిల్లర స్టంట్లు చేస్తుంది’’ అని చన్నీ దుయ్యబట్టారు. 2019 లోక్సభ ఎన్నికల ముందు పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ సైనికులు మృతి చెందిన విషయం తెలిసిందే.అయితే చన్నీ వ్యాఖ్యలపై బీజేపీ కేంద్ర మంత్రి స్పందించారు. ‘‘చన్నీ ఉగ్రదాడిపై సైతం చాలా దిగజారిన వ్యాఖ్యలు చేశారు. అది ఆయన మనస్తత్వానికి నిదర్శనం’’ అని మండిపడ్డారు. శనివారం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాహనంపై జరిగిన ఉగ్రదాడిలో ఎయిర్ ఫోర్స్కు చెందిన విక్కీ పహాడే సైనికుడు మరణించగా.. నాలుగురు సైనికులు గాయపడ్డారు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 25న జరగనున్న అనంత్నాగ్-రాజౌరీ లోక్సభ నియోజకవర్గం పరిధిలో పూంఛ్ ఉంది. -
బెంగళూరు కేఫ్ టెర్రరిస్టులు ఎలా దొరికారంటే?
బనశంకరి: సిలికాన్ సిటీ బెంగళూరులో రామేశ్వరం కేఫ్లో జరిగిన బాంబు పేలుడు గుర్తుంది కదా..! మార్చి 1, 2024న బెంగళూరు వైట్ఫీల్డ్లోని రామేశ్వరం కేఫ్లో బాంబు పేలిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో 9 మంది గాయపడ్డారు. అయితే ఉగ్రవాద ఘటనలకు చాలా రోజులుగా బ్రేక్ పడ్డ తర్వాత ఈ ఘటన జరగడం అందరినీ షాక్కు గురి చేసింది. ఈ కేసులో నిందితులు తాము చేసిన ఓ చిన్న తప్పుతో పోలీసులకు దొరికిపోయారు. పక్కాగా ప్లాన్ చేసి తప్పించుకున్నారు ముసావీర్ హుసేన్ షాజీబ్, అబ్దుల్ మతీన్ తాహ.. ఇద్దరు ఉగ్రవాద శిక్షణలో ఆరితేరారు. పక్కాగా స్కెచ్ వేసి బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ను ఎంచుకున్నారు. ఎన్నికల వేళ దక్షిణాది రాష్ట్రాల్లో అలజడి సృష్టించాలన్నది వీళ్ల కుట్ర. రెక్కీల తర్వాత మార్చి 1, శుక్రవారం రోజున తమ ప్లాన్ అమలు చేశారు. రామేశ్వరం కేఫ్లో బాంబు పేలగానే జారుకున్నారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) రంగంలోకి దిగి కేసు దర్యాప్తు ప్రారంభించింది. అప్పటికే నిందితులు సరిహద్దులు దాటేశారు. సిసి టీవీ ఫుటేజ్ సేకరించిన NIA.. నిందితుల జాడ చెప్పిన వారికి పది లక్షల బహుమానం ప్రకటించింది. అబ్బో.. ఎన్ని జాగ్రత్తలో.? బెంగళూరు నుంచి బయటపడ్డ నిందితులిద్దరూ.. చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. బాంబు అమర్చిన హుస్సేన్ షాజీబీ (30), తెర వెనక మాస్టర్మైండ్ మథీన్ థాహ (30) తమ ఆహార్యాన్ని మార్చేశారు. పశ్చిమబెంగాల్లోని మారుమూల ప్రాంతాలకు చేరుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 35 సిమ్ కార్డులు మార్చారు. ఏ ప్రాంతానికి వెళ్లినా.. కొత్త పేర్లు చెప్పి లాడ్జ్లు తీసుకున్నారు. వీలైనంత వరకు తక్కువ ఖరీదు ఉండే మాస్ ఏరియాల్లో.. పోలీసు గస్తీ ఎక్కడయితే తక్కువగా ఉంటుందో అలాంటి ప్రాంతాలు మాత్రమే ఎంచుకున్నారు. స్కాన్ చేసి చెల్లించే UPI పేమెంట్ ఎక్కడా చేయలేదు, కేవలం నగదు మాత్రమే చెల్లించి భోజనం, కావాల్సిన వస్తువులు కొన్నారు. ఓ జిరాక్స్ సెంటర్లో ఆధార్ కార్డులను, డ్రైవింగ్ లైసెన్స్లను సేకరించిన వీరిద్దరు.. వాటితో ఫేక్ ఐడెంటిటీ కార్డులను తయారు చేసి వాడారు. వీరికి ఎప్పటికప్పుడు క్రిప్టో కరెన్సీ ద్వారా నిధులు సమకూరేవని దర్యాప్తులో తేలింది. చిక్కరు.. దొరకరు పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్కు వచ్చిన నిందితులు అక్కడ ఒక హోటల్లో పర్యాటకుల తరహాలో మకాం వేశారు. ఒకసారి ఒక పని మీద వాడిన సిమ్ను వెంటనే మార్చేవారు. అలా 35 సిమ్కార్డులను చేతిలో ఉంచుకున్నారు. ఒక్కో పనికి ఒక్కో సిమ్ చొప్పున వాడడం పక్కనబెట్టడం. పని పూర్తి కాగానే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం. ఇలా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. పైగా ఈ సిమ్ కార్డులన్నీ నకిలీ అడ్రస్లు ఉపయోగించి సేకరించినవే. కొన్ని తమిళనాడు పేరుతో ఉన్నవయితే.. మరికొన్ని మహారాష్ట్ర, ఢిల్లీలోని ఫేక్ అడ్రస్లు, ఆధార్లతో సేకరించిన సిమ్ కార్డులు. ఈ సిమ్లను వినియోగించినా.. వీళ్ల ఆచూకీ NIA పసిగట్టలేకపోయింది. ఏ చిన్న ఆధారం దొరికినా.. తప్పుడు అడ్రస్ల కారణంగా దర్యాప్తు మాత్రం ముందుకు సాగలేదు. ఆడింది ఆట.. పాడింది పాట హోటల్లో రూం తీసుకునేటప్పుడు రిజిస్టర్లో తమ పేర్లు కాకుండా నకిలీ పేర్లు రాశారు. కొన్ని సార్లు పొరపాటున అసలు పేరు రాసి కొట్టివేసి నకిలీ పేర్లు రాశారు. పర్యాటకులమని, డార్జిలింగ్ నుంచి వస్తున్నామని, చెన్నెకు వెళుతున్నామని.. ఇలా తోచిన కారణాలను హోటల్ సిబ్బందికి చెప్పారు. నకిలీ ఆధార్ కార్డులు చూపారు. స్థానికంగా వివిధ పర్యాటక స్థలాలను సందర్శిస్తూ జల్సా చేశారు. కోల్కతాలో మూడు హోటల్స్లో ఎప్పటికప్పుడు మకాం మార్చారు. చిన్న కారణంతో చిక్కారు మకాం మార్చుతూ పశ్చిమబెంగాల్లోని చాంద్నీ అనే ప్రాంతానికి వచ్చిన వీరు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే, వీళ్లిద్దరిలో ఒకరు వాడుతున్న మొబైల్ కింద పడడంతో ఫోన్లో స్పీకర్ పాడయింది. దీన్ని రిపేర్ చేయించేందుకు.. ఫోన్లోని సిమ్ కార్డు తీసేసి.. దగ్గరలోని రిపేర్ షాప్ మైక్రోమాజిక్ ఇన్ఫోటెక్ అనే చిన్న మొబైల్ షాప్కు తీసుకెళ్లారు. ఫోన్ను పరిశీలించిన మొబైల్ షాపు మెకానిక్.. స్పీకర్ పని చేస్తుందా లేదా అని తెలియడానికి షాప్ కీపర్ తన దగ్గరున్న సిమ్ను ఫోన్లో వేసి రిపేర్ చేశాడు. అప్పటికే IMEA నంబర్పై నిఘా పెట్టిన NIA అధికారులు.. సిమ్ వేయగానే దాని ఆధారంగా అడ్రస్ కనిపెట్టారు. ఈ సారి మాత్రం పక్కాగా ఒరిజినల్ అడ్రస్ దొరికింది. మొబైల్ లొకేషన్ను సంపాదించిన అధికారులు.. కొన్ని గంటల్లోనే చాంద్నీ ప్రాంతానికి చేరుకున్నారు. షాప్ కీపర్ ఇచ్చిన విలువైన సమాచారంతో నిందితుల జాడ పట్టేశారు. వేర్వేరు హోటళ్ల సిబ్బంది వాంగ్మూలం, ఎన్ఐఏ బృందాలు సేకరించారు, రిజిస్టర్లు, సీసీ కెమెరా ఫుటేజీలు, గుర్తింపు కార్డులు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. -
మాస్కో మారణహోమం.. నేరం ఒప్పుకున్న ఉగ్రవాదులు
మాస్కో: రష్యా రాజధాని మాస్కోలో దాడులకు పాల్పడ్డ నలుగురిలో ముగ్గురు తమ నేరాన్ని ఒప్పుకున్నారు. దాడులకు పాల్పడ్డ అనుమానితుల్ని అరెస్టు చేసిన అనంతరం ఆదివారం(మార్చి 24) వారిని మాస్కోలోని బాస్మనే జిల్లా కోర్టులో హాజరుపరిచారు. సంగీత కచేరిలో కాల్పులు జరిపింది తామేనని ఈ సందర్భంగా ముగ్గురు ఉగ్రవాదులు ఒప్పుకున్నారు. దీంతో.. మొత్తం నలుగురికీ మే 22 వరకు కోర్టు ప్రి ట్రయల్ కస్టడీ విధించింది. కాల్పులకు పాల్పడిన నలుగురు తజికిస్థాన్కు చెందినవారని తేల్చారు. కోర్టుకు తీసుకువచ్చినపుడు నలుగురి శరీరాలు గాయాలమయమై రక్తమోడుతున్నాయి. ముఖాలన్నీ ఉబ్బిపోయాయి. ఒక ఉగ్రవాదికి ఏకంగా ఒక చెవే లేకుండా పోయింది. విచారణ సమయంలో పోలీసులు వీరిని తీవ్రంగా హింసించారని మీడియా కథనాలు వెలువడ్డాయి. నలుగురితో పాటు దాడులతో సంబంధం ఉన్న మరో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మార్చి 22 రాత్రి మాస్కో శివార్లలోని ఓ సంగీత కచేరి కార్యక్రమంలో నలుగురు ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 133 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడులకు తామే కారణమని ఐసిస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. అయితే దాడులకు ఉక్రెయిన్కు లింకు ఉందని, దాడి తర్వాత ఉగ్రవాదులు ఉక్రెయిన్కు పారిపోయేందుకు ప్రయత్నించారని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోపించారు. ఇదీ చదవండి.. ఉక్రెయిన్పై రష్యా మిసైళ్ల వర్షం -
Putin: ‘మాస్కోలో ఉగ్రదాడి.. ఉక్రెయిన్తో లింక్’
రష్యా రాజధాని మాస్కోలో జరిగిన భారీ ఉగ్రదాడిపై ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. మాస్కోలో చోటు చేసుకున్న నరమేధానికి పాల్పడిన ఉగ్రవాదలకు ఉక్రెయిన్తో సంబంధాలు ఉన్నాయని అన్నారు. ‘మాస్కోలో దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఉక్రెయిన్ వైపు పారిపోవడానికి యత్నించారు. తమకు ఉన్న ప్రాథమిక సమాచారం మేరకు ఉక్రెయిన్-రష్యా సరిహద్దులను క్రాస్ చేసి ఉక్రెయిన్ వైపు వెళ్లడానికి ప్రయత్నించారు’ పుతిన్ స్థానిక టెలివిజన్తో మాట్లాడుతూ ఆరోపించారు. ‘ఈ ఉగ్రదాడి వల్ల వందలాది మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు దేశ వ్యాప్తంగా బాధకరమైన రోజు. ఈ దారుణమైన దాడికి పాల్పన వ్యక్తులు, ఉగ్రసంస్థలను శిక్షిస్తాం. వారు ఎవరైనా.. వారికి వెనక ఎవరున్నా కోరుకోం. ఉగ్రవాదుల వెనక ఎవరు ఉన్నారనే విషయాన్ని గుర్తిస్తాం. రష్యా ప్రజలకు వ్యతిరేకంగా దాడులకు ప్రణాళిక వేసిన వారిని గుర్తించి శిక్షిస్తాం’ అని పుతిన్ హెచ్చరించారు. మాస్కో దాడి వెనకాల ఉక్రెయిన్కు లింక్ ఉందని రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన ఆరోపణలను ఉక్రెయిన్ తీవ్రంగా ఖండించింది. ‘మాస్కో ఉగ్రదాడిలో ఉక్రెయిన్కు ఎటువంటి సంబంధం లేదు. ఆ ఉగ్రదాడికి మాకు లింక్ ఉందన్న ఆరోపణలు నిరాధారమైనవి’ అన ఉక్రెయిన్ మిలిటరీ స్పై ఏజెన్సీ స్పష్టం చేసింది. రష్యాలోని మాస్కోలోని ఓ కాన్సర్ట్ హాల్లోకి చొచ్చుకుని వచ్చిన పలువురు సాయుధులు బాంబులు విసురుతూ.. తుపాకులతో అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 133 మంది మరణించారు. వంలాది మంది గాయపడినట్లు రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్విస్ వెల్లడించింది. మరోవైపు.. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ మాస్కో దాడి తమ పనే అని ప్రకటించుకుంది. రష్యా రాజధాని మాస్కో శివార్లలో.. మా సంస్థ పెద్ద గుంపుపై దాడి చేసింది. అంతేకాదు మా బృందం సభ్యులు దాడి తర్వాత సురక్షితంగా తమ స్థావరాలకు చేరుకున్నారు అని టెలిగ్రామ్ ద్వారా ఒక సందేశం విడుదల చేసింది. మరోవైపు రష్యా నేషనల్ గార్డు మాత్రం ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగిస్తున్నట్లు ప్రకటించుకుంది. -
Russia: మాస్కోలో ఐసిస్ భారీ ఉగ్రదాడి
మాస్కో: రష్యా రాజధానిలో ఉగ్రవాదులు(ISIS) నరమేధానికి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి మాస్కోలోని ఓ కాన్సర్ట్ హాల్లోకి చొచ్చుకుని వచ్చిన పలువురు సాయుధులు బాంబులు విసురుతూ.. తుపాకులతో అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 60 మందికిపైగా మృతి చెందగా, వంలాది మంది గాయపడినట్లు రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్విస్ వెల్లడించింది. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అక్కడి అధికారులు ప్రకటించారు. మాస్కో శివారులోని క్రోకస్ సిటీ కాన్సర్ట్ హాల్లో ప్రముఖ రష్యన్ రాక్ బ్యాండ్ ‘ఫిక్నిక్’ సంగీత కార్యక్రమం జరుగుతోంది. ఆ సమయంలో సైనిక దుస్తుల్లో కాన్సర్ట్హాల్లోకి వచ్చిన ఐదుగురు దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు. తుపాకుల మోత నడుమ.. ఏం జరుగుతుందో అర్థకాక తీవ్ర భయాందోళనలతో అక్కడున్న వారు సీట్ల మధ్య దాక్కున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు భారీ ఎత్తున అక్కడికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. హాల్లో చిక్కకున్న పలువురిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గాయపడిన వారి కోసం భారీగా అంబులెన్స్లు అక్కడికి చేరుకున్నాయి. అతి సమీపం నుంచి తుపాకులతో కాల్పులు జరిపిన దాడి వీడియోలు బయటికొచ్చాయి. Horrifying visuals of the terror attack coming out of Moscow. The carnage is unimaginable. Devastating to say the least. This world needs peace and sanity. pic.twitter.com/sWFc4mTjVK — Supriya Shrinate (@SupriyaShrinate) March 22, 2024 The scary footage where people are running during the attack.#Moscou #Moskou #CrocusCityHall #Moscow #Russia #terrorist pic.twitter.com/gJchCa8zrU — Reality Talks (@RealityTallk) March 23, 2024 Very sad to hear what happened in #Moscow Praying for them 💔 pic.twitter.com/UUMcl9RsmI — Follow Back (@FzlMah) March 22, 2024 దాడి సమాచారం అందుకున్న ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారాయన. దాడి వెనుక ఎవరున్నా ఉపేక్షించేది లేదని పుతిన్ పేర్కొన్నట్లు క్రెమ్లిన్ ఒక ప్రకటన విడుదల చేసింది. పుతిన్ దేశాధ్యక్షుడిగా తిరిగి ఎన్నికై సంబరాలు జరుపుకుంటున్న వేళ ఈ దాడి జరగడం గమనార్హం. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత రష్యాలో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇదే అని చెబుతున్నారు. దాడి మా పనే ఇస్లామిక్ స్టేట్ గ్రూప్(ISIS-Islamic State of Iraq and Syria) మాస్కో దాడి తమ పనే అని ప్రకటించుకుంది. రష్యా రాజధాని మాస్కో శివార్లలో.. మా సంస్థ పెద్ద గుంపుపై దాడి చేసింది. అంతేకాదు మా బృందం సభ్యులు దాడి తర్వాత సురక్షితంగా తమ స్థావరాలకు చేరుకున్నారు అని టెలిగ్రామ్ ద్వారా ఒక సందేశం విడుదల చేసింది. మరోవైపు రష్యా నేషనల్ గార్డు మాత్రం ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగిస్తున్నట్లు ప్రకటించుకుంది. -
భారత్-ఇంగ్లండ్ నాలుగో టెస్ట్కు ఉగ్ర బెదిరింపులు
భారత్-ఇంగ్లండ్ మధ్య రాంచీ వేదికగా ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్కు ఉగ్రవాద బెదింపులు వచ్చాయి. ఈ మ్యాచ్కు ఆటంకం కలిగిస్తానని నిషేధిత ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నున్ సోషల్మీడియాలో ఓ బెదిరింపు వీడియోను పోస్ట్ చేశాడు. మ్యాచ్కు అంతరాయం కలిగించాలని పన్నున్ సీపీఐ మావోయిస్ట్ పార్టీకి విజ్ఞప్తి చేశాడు. ఈ ఉదంతంతో అలర్ట్ అయిన రాంచీ పోలీసులు టెస్ట్ మ్యాచ్కు భద్రతను కట్టుదిట్టం చేశారు. అదనంగా వెయ్యి మంది పోలీసులను మొహరించినట్లు రాంచీ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. పన్నున్పై బెదిరింపు కేసును నమోదు చేశారు. రాంచీలోని జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది. ఎవరీ పన్నున్.. భారత్-ఇంగ్లండ్ నాలుగో టెస్ట్కు ఆటంకం కలిగిస్తానని బెదిరించిన పన్నున్.. కెనడా, అమెరికా దేశాల పౌరసత్వం కలిగిన నిషేధిత ఖలిస్తానీ ఉగ్రవాద నాయకుడు. ఇతను అమెరికా, కెనడా దేశాల్లో ఉంటూ పంజాబ్, చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రత్యేక ఖలిస్తాన్ పేరుతో అరాచకాలకు పాల్పడుతుంటాడు. ఇతనిపై యాంటి టెర్రర్ ఫెడరల్ ఏజెన్సీ 2019లో కేసు నమోదు చేసింది. అప్పటి నుంచి పన్నున్ ఎన్ఐఏ నిఘాలో ఉన్నాడు. ఫిబ్రవరి 3, 2021న ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు పన్నున్పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 2023 నవంబర్ 29న పన్నున్ను ప్రత్యేక నేరస్థుడిగా ప్రకటించింది. ఇదిలా ఉంటే, ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ క్రికెట్ జట్టు భారత్లో పర్యటిస్తుంది. ఈ సిరీస్లో ఇప్పటికే మూడు టెస్ట్ మ్యాచ్లు అయిపోయాయి. హైదరాబాద్లో జరిగిన తొలి టెస్ట్లో ఇంగ్లండ్ గెలుపొందగా.. విశాఖలో జరిగిన రెండో టెస్ట్, రాజ్కోట్లో జరిగిన మూడో టెస్ట్ల్లో టీమిండియా విజయాలు సాధించింది. ఈ సిరీస్లోని నాలుగో టెస్ట్ రాంచీలో, ఐదు టెస్ట్ ధర్మశాలలో జరగాల్సి ఉంది. ఐదో టెస్ట్ మ్యాచ్ మార్చి 7 నుంచి ప్రారంభమవుతుంది. -
జమ్మూకశ్మీర్లో ఉగ్ర ఘాతుకం.. వెలుగులోకి కీలక విషయాలు
జమ్మూ: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో సాయుధ ఉగ్రవాదులు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. రెండు సైనిక వాహనాలపై మెరుపుదాడి చేశారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సురాన్కోట్ పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం మధ్యాహ్నం 3.45 గంటలకు ఈ దాడి జరిగింది. గాలింపు చర్యల కోసం వెళ్తున్న సైనిక వాహనాలపై దత్యార్మోర్హ్ వద్ద ముష్కరులు దాడి చేశారు. ఒక ట్రక్కు, మరో జిప్సీపై తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మృతిచెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. కాగా ఉగ్రదాడికి సంబంధించి పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పూంచ్లో జరిగిన ఉగ్రదాడికి తామే బాధ్యులమని పాకిస్తాన్ ఆధారిత తీవ్రవాద సంస్థ లష్కరే తోయిబా అనుబంధ యాంటీ–ఫాసిస్ట్ ఫ్రంట్(పీఏఎఫ్ఎఫ్) ప్రకటించింది. గతంలో కూడా ఈ సంస్థ దాడులకు పాల్పడింది. 2019లో జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక హోదా(ఆర్టికల్ 370) రద్దు చేసిన తర్వాత తమ కార్యకలాపాలను ప్రారంభించింది. ఇటీవలి కాలంలో జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలు, పౌరులపై జరిగిన ఉగ్రదాడుల్లో చాలా వరకు పీఏఎఫ్ఎఫ్ చేసినవే. ఈ అటాక్లో ఉగ్రవాదులు అమెరికా తయారీ రైఫిళ్లు 4 కార్బైన్ను ఉపయోగించారు. దాడికి పాల్పడిన ఆయుధాలతో ఉగ్రవాదులు సోషల్ మీడియాలో ఫోటోలు విడుదల చేశారు. M4 కార్బైన్ అనేది 1980లలో యూఎస్లో అభివృద్ధి చేశారు. గ్యాస్ ఆపరేటెడ్, తేలికపాటి మ్యాగజైన్ ఫెడ్ కార్బైన్. ఇది అమెరికా సాయుధ దళాల ఆయుధం. ప్రస్తుతం దీనిని 80కి పైగా దేశాల్లో వాడుతున్నారు. పలు తీవ్రవాద సంస్థలు ఈ ఆయుధాన్ని వాడుతున్నాయి. వారు దాడులను రికార్డు చేసేందుకు బాడీ కెమెరాలను ఉపయోగిస్తుంటారు. ఆ తర్వాత ఈ వీడియోలను తమ సంస్థను ప్రచారం చేసేందుకు ఉపయోగించుకుంటాయి. ఈ విధంగానే ఈ ఏడాది ఏప్రిల్లో పూంచ్లో ఆర్మీ ట్రక్కుపై పీఏఎఫ్ఎఫ్ దాడి చేసి వీడియో తీసింది. దాడిలో మరణించిన సైనికుల ఆయుధాలతో ఉగ్రవాదులు ఆ ప్రాంతం నుంచి పారిపోతున్నట్లు చూపించిన వీడియోను తరువాత విడుదల చేసింది. -
ఆర్మీ కాన్వాయ్పై ఉగ్రవాదుల కాల్పులు.. ఐదుగురు జవాన్ల వీర మరణం
జమ్మూకశ్మీర్: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో ఇవాళ ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. నెల రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో సైన్యంపై జరిగిన రెండో ఉగ్రదాడి ఇది. . పూంచ్లోని సురన్కోట్ ప్రాంతంలో ఆర్మీ ట్రక్పై మెరుపుదాడి జరిగిందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు జవాన్లు అమరులయ్యారని అధికారులు తెలిపారు. ఆకస్మిక దాడి జరిగిన ప్రాంతానికి ఆర్మీ బలగాలను పంపినట్లు సమాచారం. కాల్పులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మరో ముగ్గురికి గాయాలుకాగా, ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత నెలలో రాజౌరీలోని కలాకోట్లో సైన్యం ప్రత్యేక బలగాలు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇద్దరు ఆర్మీ కెప్టెన్లతో సహా సైనికులు మరణించారు. గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతం ఉగ్రవాదులకు నిలయంగా మారడంతో సైన్యంపై పెద్దఎత్తున దాడులు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో రాజౌరీ-పూంచ్ ప్రాంతంలో జరిగిన దాడుల్లో 10 మంది సైనికులు మరణించారు. గత రెండేళ్లలో ఈ ప్రాంతంలో యాంటీ టెర్రర్ ఆపరేషన్లలో 35 మందికి పైగా సైనికులు మరణించారు. ఇదీ చదవండి: పార్లమెంట్ భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం -
ఇజ్రాయెల్-హమాస్ సంధిపై బైడెన్ కీలక వ్యాఖ్యలు
న్యూయార్క్: హమాస్-ఇజ్రాయెల్ మధ్య సంధి కుదరడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అంగీకరించిన కాల్పుల విరమణను పొడిగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. హమాస్ చెరలో ఉన్న బందీలు విడదల కావడంపై స్పందిస్తూ.. ఇది ప్రారంభం మాత్రమే అని అన్నారు. తమ చెరలో ఉన్న 24 మంది బందీలను హమాస్ విడిచిపెట్టింది. వీరిలో 13 మంది ఇజ్రాయెల్ పౌరులు, 10 మంది థాయ్లాండ్ పౌరులు, ఒకరు ఫిలిప్పైన్స్ పౌరుడు ఉన్నారు. విడుదలైన బందీలంతా ఆరోగ్యంగానే కనిపిస్తున్నారని ఇజ్రాయెల్ వైద్య శాఖ తెలియజేసింది. కాగా.. నేడు మరో దఫా బందీలను హమాస్ విడుదల చేయనున్నట్లు సమాచారం. హమాస్ డిమాండ్ను నెరవేరుస్తూ ఇజ్రాయెల్ కూడా మొదటి దశలో 39 పాలస్తీనా ఖైదీలను విడుదల చేసిందని సమాచారం. ఇజ్రాయెల్-హమాస్ మధ్య అక్టోబర్ 7న యుద్ధం ప్రారంభం అయింది. హమాస్ అంతమే ధ్యేయంగా ఇజ్రాయెల్ గాజాపై దూకుడుగా ప్రవర్తించింది. గాజాను ఖాలీ చేయించింది. స్వతంత్ర్య పాలస్తీనాను నినదిస్తూ పశ్చిమాసియా దేశాలు ఏకమయ్యాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ రంగంలోకి దిగారు. ఇరుదేశాలు కాల్పుల విరమణ అంగీకారానికి రావాలని కోరారు. ఈ డిమాండ్ల తర్వాత నాలుగు రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించింది. ఇందుకు బదులుగా హమాస్ తమ చెరలో ఉన్న 50 మందిని విడుదల చేయడానికి ఒప్పుకుంది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఇప్పటివరకు జరిగిన యుద్ధంలో గాజా వైపు 15,000 మంది మరణించారు. ఇజ్రాయెల్ వైపు 1,200 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: Israel-Hamas war: 24 మంది బందీలకు స్వేచ్ఛ -
పాక్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడి
ఇస్లామాబాద్: పాకిస్థాన్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు. తెహ్రిక్ ఏ తాలిబాన్ పాకిస్థాన్(టీటీపీ) సంస్థతో పాక్ ప్రభుత్వం చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందం కిందటి ఏడాది ముగిసింది. అప్పటి నుంచి దేశంలో ఉగ్రవాదం మళ్లీ ఊపందుకుంది. తాజాగా శనివారం పంజాబ్ ప్రావిన్స్లోని మియన్వాలిలో గల వైమానిక స్థావరంపై శనివారం తెల్లవారుజామున ఉగ్రవాదులు దాడి చేశారు. అయితే సైన్యం అప్రమత్తం కావడంతో పెను విధ్వంసం తప్పింది. శనివారం ఫైటర్ జెట్లు ఉన్న స్థావరంలోకి ఐదు నుంచి ఆరుగురు సాయుధ ఉగ్రవాదులు తెల్లవారుజామున చొరబాటుకు యత్నించారని పాక్ ఎయిర్ ఫోర్స్ (పీఏఎఫ్) ధ్రువీకరించింది. తాము అప్రమత్తమై ఆ దాడిని భగ్నం చేశామని పేర్కొంది. కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని, ఒక పాక్ సైనికుడు వీరమరణం పొందారని.. పలువురికి గాయాలయ్యాయని ప్రకటించుకుంది. ఈ ఘటనలో ఎయిర్బేస్లోని మూడు యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయని వెల్లడించింది. దాడికి గల కారణాలు తెలియ రావాల్సి ఉంది. అయితే.. ఇది బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(BLA) పనేనని ఆర్మీ వర్గాలు భావిస్తున్నాయి. బీఎల్ఏ.. పాక్ నుంచి స్వాతంత్రం కోరుతూ 2004 నుంచి పోరాడుతోంది. సాధారణ పౌరులనే కాకుండా.. ఈ ఏడాది జూన్లోనూ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని తొలిసారిగా దాడికి పాల్పడింది. ఇదిలా ఉంటే.. శుక్రవారం కూడా పాక్లో ఉగ్రదాడి జరిగింది. పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో పోలీసు గస్తీ బృందాలే లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు బాంబులతో దాడికి దిగారు. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా వీరిలో ఇద్దరు పోలీసులు. మరో 24 మంది గాయాలపాలయ్యారని ఓ అధికారి తెలిపారు. ఇదిలాఉంటే.. గత ఆరునెలలుగా పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్ ప్రాంతాలు తీవ్ర ఉగ్రవాద దాడులను చవిచూస్తున్నాయి. అయితే ఈ దాడులు పాక్ భద్రతకు ముప్పుగా మారడమే కాదు.. పొరుగు దేశాలతో సంబంధాలను దెబ్బ తీస్తున్నాయి. తాలిబన్, హక్కానీ నెట్వర్క్లను ప్రోత్సహిస్తూ పాక్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. కానీ, ఆ విమర్శలను తోసిపుచ్చుతున్న పాక్.. తాము ఉగ్ర పీడిత దేశమేనని చెప్పుకుంటోంది. మరోవైపు అంతర్జాతీయ సమాజం, ఉగ్రవాదాన్ని అణచివేసే చర్యలు చేపట్టాలంటూ పాక్ను కోరుతున్నాయి. -
పుల్వామాలో మళ్లీ ఉగ్రదాడి.. వలసకూలీపై కాల్పులు
జమ్ము: జమ్ముకశ్మీర్లో మళ్లీ ఉగ్రతూటా పేలింది. ఉత్తరప్రదేశ్కు చెందిన వలస కూలీపై దుండగులు కాల్పులు జరిపారు. పుల్వామాలో ఈ ఘటన జరగగా.. బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. క్రికెట్ ఆడుతున్న ఎన్స్పెక్టర్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపి మరుసటి రోజే ఈ ఘటన జరగడం కలకలం రేపుతోంది. "పుల్వామాలోని తుమ్చి నౌపోరా ప్రాంతంలో యూపీకి చెందిన వలస కూలీపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. మృతున్ని ముఖేష్గా గుర్తించాం. ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాం." అని పోలీసులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో పుల్వామాలో జరిగిన రెండో ఉగ్రదాడి ఇది. ఆదివారం ఈద్గా ప్రాంతంలో క్రికెట్ ఆడుతున్న ఇన్స్పెక్టర్ మస్రూర్ అహ్మద్ వానీపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఇదీ చదవండి: శివసేన, ఎన్సీపీ అనర్హత పటిషన్లపై స్పీకర్కు సుప్రీంకోర్టు తుది గడువు -
హమాస్ దాడి.. పూర్తిగా ఇజ్రాయెల్ వైఫల్యమే’
ఇజ్రాయెల్-గాజా సంక్షోభం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అన్నీ దేశాల దృష్టి ప్రస్తుతం ఈ యుద్ధంపైనే ఉంది. నాలుగు రోజుల కిందట పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ ఇజ్రాయెల్పై ఆకస్మిక దాడికి దిగిన విషయం తెలిసిందే. గాజా స్ట్రిప్ ద్వారా దక్షిణ ఇజ్రాయెల్లోకి చొరబడ్డ హమాజ్ ఉగ్రవాదులు వేల రాకెట్లతో దాడులకు తెగబడ్డారు. ఇజ్రాయెల్ సైతం హమాస్ ఉగ్రవాదులపై దాడులను మరింత తీవ్రతరం చేసింది. హమాస్ దాడులు, ఇజ్రాయెల్ ప్రతిదాడులతో ఇరు వర్గాలకు చెందిన 1600 మంది ప్రాణాలు కోల్పోయారు.. వేలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా ఇజ్రాయెల్- పాలస్తీనా యుద్ధంపై ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ మాజీ అధినేత మేజర్ జనరల్ యాడ్లిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భూ, జల, వాయు మార్గాల ద్వారా చేపట్టిన హమాస్ దాడిని ఊహించలేనిదన్నారు. దాడికి సంబంధించి ఎలాంటి ముందస్తు హెచ్చరిక, సిగ్నల్ అందుకోలేకపోయినట్లు తెలిపారు. ఇది ఆశ్చర్యకరమైన దాడి అని పేర్కొన్నారు. హమాస్ చర్యను సెప్టెంబర్ 11, పెరల్ హార్బర్, యోమ్ కిప్పూర్ యుద్ధంతో పోల్చుతూ.. ఈ సంక్షోభం ముగిసిన వెంటనే దీనిపై దర్యాప్తు చేయాలని పేర్కొన్నారు. హమాస్ దాడిలో భారీగా ఇజ్రాయెల్ పౌరులు మరణించడానికి ఇంటెలిజెన్స్ వైఫల్యంతోపాటు వ్యూహత్మక వైఫల్యాల కారణమేనని మేజర్ జనరల్ యాడ్లిన్ వ్యాఖ్యానించారు. హమాస్ దాడిని ముందుగానే పసిగట్టడంలో శక్తివంతమైన ఇజ్రాయెల్ నిఘా సంస్థలు విఫలమైనట్లు తెలిపారు. దీనికితోడు ఉగ్రవాదులను చర్యపై వేగంగా స్పందించి ప్రతిదాడులు చేయడంలోనూ ఇజ్రాయెల్ సైన్యం వైఫల్యం కనిపిస్తోందన్నారు. చదవండి: హమాస్ దాడులపై ఇరాన్ సుప్రీం స్పందన ఉద్రిక్త పరిస్థితులు ఉండే ఇజ్రాయెల్, గాజా సరిహద్దు కంచె వెంట కెమెరాలు, గ్రౌండ్ మోషన్ సెన్సార్లు, సాధారణ సైన్యం పెట్రోలింగ్ కూడా ఉంటుందని అయితే శత్రువుల రాకను గుర్తించి సైనిక దళాలకు సమాచారం ఇవ్వడంలో ఇవన్నీ విఫలమయ్యాయని విమర్శించారు. ముందస్తు హెచ్చరికలు అందకపోయినా సరిహద్దు వెంబడి ఉన్న సెన్సార్లు కూడా ఈ పనిచేయలేకపోయాయని అన్నారు. ఇజ్రాయెల్ అంతర్గత నిఘా వ్యవస్థ షిన్ బెట్, గూఢచార సంస్థ మొసాద్, ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఈ దాడులను అంచనా వేయలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఒకవేళ వాళ్లకి ముందే తెలిసి ఉన్నట్టయితే, ఈ దాడులను తిప్పికొట్టడంలో వారు నిర్లక్ష్యం వహించారని ఆరోపిస్తూ.. వీటన్నింటిపై తప్పక విచారణ చేయాలన్నారు. కాగా మేజర్ జనరల్ అమోస్ యాడ్లిన్.. ఇజ్రాయెల్ రక్షణ దళాల్లో 40 సంవత్సరాల అనుభవం ఉంది. ఫైటర్ జెట్ పైలట్గా 33 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్కు డిప్యూటీ కమాండర్గా బాధ్యతలు స్వీకరించారు. తరువాత ఐడీఎఫ్ మిలిటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్కు పనిచేశారు. 2011 నుంచి ఇజ్రాయెల్ వ్యూహాత్మక విభాగం ఇన్స్టిట్యూట్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్కు డైరెక్టర్గా ఉన్నారు. -
కాశ్మీర్లో ఉగ్రవాదుల ఘాతుకం.. ముగ్గురు భారత సైనికులు మృతి
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో శుక్రవారం ఉగ్రవాదులకు భారత సైన్యానికి మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు భారత సైనికులు మరణించారని అధికారులు తెలిపారు. దక్షిణ కాశ్మీర్లోని కుల్గామ్ జిల్లా హలాన్ అటవీ ప్రాంత పరిసరాల్లో ఉగ్రవాదులు ఉన్నారన్న కచ్చితమైన సమాచారం అందడంతో భారత మిలటరీ వర్గాలు ఆగస్టు 4న ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. సైన్యం ఉగ్రవాదుల జాడను జల్లెడ పడుతుండగా ఒక్కసారిగా భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో సెర్చ్ ఆపరేషన్ కాస్తా ఎన్కౌంటర్గా మారిందన్నారు. ఉగ్రవాదులు చేసిన కాల్పులకు ప్రతిగా సైన్యం కూడా ఎదురుకాల్పులు జరిపిందని, ఈ కాల్పుల్లో ముగ్గురు భద్రతా దళాల సిబ్బంది గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించామని అక్కడ వారు చికిత్స పొందుతూ వారు మృతి చెందినట్లు ఆ అధికారి తెలిపారు. హాలాన్ అడవుల్లో ఎత్తైన ప్రాంతాల్లో ఉగ్రవాదుల ఉనికి ఇంకా ఉన్నట్టు మావద్ద పక్కా సమాచారముందని భారత భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ను కొనసాగిస్తున్నాయని అయన తెలిపారు. Operation Halan #Kulgam On specific inputs regarding presence of terrorists on higher reaches of Halan in Kulgam, operations launched by Security Forces on 04 Aug 23. In exchange of firing with terrorists, three personnel sustained injuries and later succumbed. Search operations… pic.twitter.com/NJ3DZa2OpK — Chinar Corps🍁 - Indian Army (@ChinarcorpsIA) August 4, 2023 ఇది కూడా చదవండి: Defamation Case: రాహుల్ సభ్యత్వాన్ని పునరుద్ధరించండి -
ఆరో ఉగ్రవాది దొరికాడు! జవహర్నగర్లో ఎస్కేప్.. రాజేంద్రనగర్లో అరెస్టు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, భోపాల్ సహా అనేక నగరాల్లో విధ్వంసానికి కుట్ర పన్నిన హిజ్బ్ ఉత్ తెహ్రీర్ (హెచ్యూటీ) ఉగ్రవాద సంస్థకు చెందిన మరో ఉగ్రవాది సల్మాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ మాడ్యుల్కు చెందిన ఐదుగురిని భోపాల్ ఏటీఎస్ పోలీసులు ఈ ఏడాది మే రెండో వారంలో పట్టుకుని తీసుకువెళ్లారు. ఆపై ఈ కేసు దర్యాప్తు నిమిత్తం ఎన్ఐఏకు బదిలీ అయింది. అప్పట్లో తప్పించుకున్న జవహర్నగర్ వాసి మహ్మద్ సల్మాన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇతడి కోసం సుదీర్ఘ కాలం నిఘా ఉంచిన ఎన్ఐఏ ప్రత్యేక బృందం ఎట్టకేలకు రాజేంద్రనగర్ ప్రాంతంలో అరెస్టు చేసింది. దీంతో మధ్యప్రదేశ్, హైదరాబాద్లో కలిపి ఈ కేసులో ఇప్పటివరకు పట్టుబడిన ఉగ్రవాదుల సంఖ్య 17కు చేరింది. టెర్రర్ మాడ్యుల్లో ఓ కళాశాలలో హెచ్ఓడీగా పని చేసిన ఫార్మాస్యూటికల్ బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్ మహ్మద్ సలీం కీలకమని నిర్ధారించిన విషయం విదితమే. గోల్కొండలోని ఓ ప్రార్థన స్థలంలో సలీంకు దినసరి కూలి మహ్మద్ హమీద్తో పరిచయమైంది. ఇతడిని ఉగ్రవాద బాట పట్టించిన సలీం మరికొందరిని తన మాడ్యుల్లో చేర్చుకోవాలని భావించాడు. ఈ విషయం హమీద్కు చెప్పగా... అతడు తన చిన్ననాటి స్నేహితుడైన జవహర్నగర్కు చెందిన మహ్మద్ సల్మాన్ను తీసుకువచ్చి పరిచయం చేశాడు. వీరితో పాటు మొత్తం ఐదుగురితో సలీం మాడ్యుల్ ఏర్పాటు చేశాడు. ఈ ముష్కరులను పట్టుకోవడానికి మధ్యప్రదేశ్ ఏటీఎస్, రాష్ట్ర నిఘా వర్గాలు నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు భోపాల్లోనూ ఏకకాల దాడులు చేశాయి. ఫలితంగా అక్కడ 11 మంది, నగరంలోని గోల్కొండ, హఫీజ్బాబానగర్, జగద్గిరిగుట్టల్లో సలీం, హమీద్ సహా ఐదుగురు చిక్కారు. జవహర్నగర్లోని శివాజీనగర్కు చెందిన మహ్మద్ సల్మాన్ పోలీసులు దాడి చేసే సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. పోలీసులు వచ్చిన విషయం తెలిసిన సల్మాన్ పక్కింటి వాళ్లు అతడికి ఫోన్ చేసి చెప్పడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న సల్మాన్ కోసం ముమ్మరంగా గాలించిన ఎన్ఐఏ రాజేంద్రనగర్ ప్రాంతంలో పట్టుకుంది. ఇతడి నుంచి నిషేధిత సాహిత్యం సీజ్ చేసింది. కోర్టులో హాజరుపరిచిన అధికారులు భోపాల్ తరలించడానికి ట్రాన్సిట్ వారెంట్ తీసుకున్నారు. బుధవారం అక్కడకు తరలించిన తర్వాత న్యాయస్థానం అనుమతితో తమ కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. -
జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల కుట్ర భగ్నం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశారు బాంబ్ స్క్వాడ్. శ్రీనగర్ బారాముల్లా హైవేపై ఐఈడీని అమర్చిన ఉగ్రవాదులు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న బాంబ్ స్క్వాడ్ బృందం నిముషాల వ్యవధిలో దాన్ని నిర్వీర్యం చేశారు. పాకిస్తాన్ లో ఉగ్రదాడి జరిగిన గంటలు కాలేదు అప్పుడే భారత దేశంలో భారీ విధ్వంసానికి వ్యూహరచన చేశాయి ఉగ్రమూకలు. శ్రీనగర్ లోని బారాముల్లా హైవేపై సంగమ్ ఫ్లై ఓవర్ వద్ద ఐఈడీ ని అమర్చారు ఉగ్రవాదులు. సంగమ్ ఫ్లై ఓవర్ వద్ద ఒక బ్యాగ్ కనిపించడంతో స్థానికులు అప్రమత్తమై బాంబ్ స్క్వాడ్ కు సమాచారమందించారు. వెంటనే బాంబ్ స్క్వాడ్ బృందాలు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఐఈడీని నిర్మానుష్య ప్రదేశంలో నిర్వీర్యం చేశాయి. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. సంగమ్ ఫ్లై ఓవర్ వద్ద ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది.. ఒకవేళ ఈ పేలుడు గనుక యధాతధంగా జరిగి ఉంటే భారీగా నష్టం వాటిల్లేది. ఇది కూడా చదవండి: ప్రారంభమైన కొద్దిసేపటికే ఉభయ సభలు వాయిదా -
ఉగ్రదాడిలో తీవ్రంగా గాయపడి.. కట్చేస్తే సక్సెస్ఫుల్ అంపైర్గా
ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరీస్లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా తొలి టెస్టుకు పాకిస్తాన్ అంపైర్ అహ్సన్ రాజా ఫీల్డ్ అంపైర్గా పనిచేయడం ఆసక్తి కలిగించింది. ఎలైట్ ఐసీసీ అంపైర్గా అహ్సన్ రాజాకు తొలిసారి యాషెస్ టెస్టు సిరీస్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఈ విషయం పాక్ అభిమానులను సంతోషపరిచింది. మరి అభిమానుల సంతోషం వెనుక కారణం ఏంటని అనుకుంటున్నారా.. 2009లో శ్రీలంక జట్టు పాక్లో పర్యటించిన సంగతి తెలిసిందే. బస్సులో స్టేడియానికి వెళ్తున్న లంక క్రికెటర్లపై ఉగ్రదాడి జరిగింది. అదే బస్సులో అహ్సన్ రాజా కూడా ఉన్నాడు. పలువురు లంక క్రికెటర్లతో పాటు అహ్సన్ రాజా కూడా ఉగ్రవాదుల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. అతని శరీరంలోకి బులెట్ దూసుకెళ్లడంతో బతకడం కష్టమన్నారు. కానీ అహ్సన్ రాజా బతకాలనే పట్టుదల అతన్ని కోలుకునేలా చేసింది. అంతేకాదు అంపైరింగ్ చేయాలన్న కోరికతో క్రికెట్ కెరీర్కు గుడ్బై చెప్పిన అహ్సన్ రాజా కోరిక మళ్లీ నెరవేరింది. అంపైరింగ్పై ఉన్న ఇష్టంతో అహ్సన్ రాజా క్రికెట్కు తొందరగానే రిటైర్మెంట్ ఇచ్చాడు. తన కెరీర్లో అహ్సన్రాజా 21 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు, నాలుగు లిస్ట్-ఏ మ్యాచ్లు ఆడాడు. ఇక క్రికెట్లో తాను సక్సెస్ కాలేనని గ్రహించిన అహ్సన్ రాజా ఆటకు గుడ్బై చెప్పి అంపైరింగ్కు సంబంధించిన శిక్షణ తీసుకున్నాడు. అలా 2006లో అంపైర్గా కెరీర్ను మొదలుపెట్టాడు. 2006లో ఒక ఫస్ట్క్లాస్ మ్యాచ్ ద్వారా అహ్సన్ రాజా అంపైరింగ్ చేవాడు. ఆ తర్వాత 2009లో పీసీబీ కాంట్రాక్ట్ దక్కించుకున్న అహ్సన్ రాజా అక్కడి నుంచి వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. 2018లో అండర్-19 వరల్డ్కప్, ఆ తర్వాత మహిళల టి20 వరల్డ్కప్, 2019 ఐసీసీ టి20 వరల్డ్కప్ క్వాలిఫయర్స్, 2020 ఐసీసీ మహిళల టి20 వరల్డ్కప్లో అంపైర్గా విధులు నిర్వర్తించాడు. ఇక 2021లో పాకిస్తాన్, సౌతాఫ్రికా మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా తొలిసారి టెస్టుల్లో అంపైరింగ్ నిర్వహించాడు. అలా కేవలం నాలుగేళ్లలోనే అత్యంత విజయవంతమైన అంపైర్గా పేరు తెచ్చుకున్న అహ్సన్ రాజా ఐసీసీ ఎలైట్ అంపైర్ లిస్ట్లో చోటు దక్కించుకున్నాడు. కట్చేస్తే.. ఇవాళ ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరీస్లో అంపైర్గా విధులు నిర్వర్తిస్తూ టాప్ అంపైర్గా పేరు తెచ్చుకున్నాడు. What an inspiring journey from Ahsan Raza. Was one of the victims of SL team attack back in 2009 and there were even rumors that he had expired but he fought through it and made his way to the top from bottom. From umpiring in Bermuda vs Namibia to umpiring in Ashes. pic.twitter.com/WiNjv2slxW — yang goi (@GongR1ght) June 16, 2023 so good to see ahsan raza umpiring in an ashes opener. icc have had always respect for aleem dar & after his retirement, they have passed in it onto ahsan raza. pic.twitter.com/W7PfSR7ppu — Kamran (@kamran_069) June 16, 2023 చదవండి: రెండేళ్ల వ్యవధిలో తొమ్మిది శతకాలు.. కొత్తగా కనిపిస్తున్నాడు -
ఉగ్రదాడిలో అమరులైన జవాన్లు వీరే.. రంగంలోకి ఎన్ఐఏ
కశ్మీర్: అయిదుగురు భారత జవాన్లను హతమార్చిన ఉగ్రదాడిపై దర్యాప్తు చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) రంగంలోకి దిగింది. ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు ఎన్ఐఏ అధికారుల బృందం కాసేపట్లో జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లాకు చేరుకోనున్నారు. ఢిల్లీకి చెందిన ఎనిమిది మంది ఫోరెన్సిక్ నిపుణులతోపాటు ఎన్ఐఏ బృందం మధ్యాహ్నం 12.30 గంటలకు సంఘటనా స్థలానికి చేరుకోనుంది. General Manoj Pande #COAS and All Ranks of #IndianArmy salute the supreme sacrifice of 05 #IndianArmy Bravehearts, Hav Mandeep Singh, L/Nk Debashish Baswal, L/Nk Kulwant Singh, Sep Harkrishan Singh & Sep Sewak Singh who laid down their lives in the line of duty at #Poonch Sector. https://t.co/7YSI1sEiEb — ADG PI - INDIAN ARMY (@adgpi) April 21, 2023 అమరులైన జవాన్లు వీరే ఉగ్రదాడిలో అమరులైన జవాన్లను హవల్దార్ మన్దీప్ సింగ్, లాన్స్నాయక్ దేవాశిష్ బస్వాల్, లాన్స్నాయక్ కుల్వంత్ సింగ్, హర్కిషన్ సింగ్, సేవక్ సింగ్గా గుర్తించారు. వీరులైన సైనికులకు ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే నివాళులు అర్పించారు. అమరుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. చదవండి: Char Dham Yatra: ‘ఛార్ధామ్’కు మంచు తిప్పలు అసలేం జరిగిందంటే.. పూంచ్ జిల్లాలో రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్కు చెందిన జవాన్లు ప్రయాణిస్తున్న ఆర్మీ ట్రక్పై గురువారం మధ్యాహ్నం ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భింబెర్ గలి నుంచి సింగియోట్ వైపు వస్తుండగా గ్రనేడ్లు విసరడంతో వాహనానికి నిప్పంటుకుంది. ఈ ఘటనలో అయిదుగురు సైనికులు వీర మరణం పొందగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. భారీ వర్షం, తక్కువ వెలుతురు మాటున ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాద కార్యకలాపాలను మట్టుబెట్టేందుకు వెళ్తున్న క్రమంలోనే ఈ దాడి జరిగినట్లుపేర్కొన్నారు. J&K | Visuals from Bhimber Gali in Poonch where five soldiers lost their lives in a terror attack yesterday. (Visuals deferred by unspecified time) pic.twitter.com/331XNOeQWj — ANI (@ANI) April 21, 2023 హై అలర్ట్ పిడుగుపాటు వల్ల ఈ ఘటన జరిగి ఉంటుందని తొలుత భావించినా, ఆ తర్వాత ఇది ఉగ్రవాదుల పనేనని సైన్యం నిర్ధారించింది. ఉగ్రదాడి నేపథ్యంలో జమ్ముకశ్మీర్లో ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. ఈ దాడి అనంతరం బటా-డోరియా ప్రాంతంలోని అడవులలో భద్రతా దళాలు భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఘటనా ప్రాంతాన్ని చుట్టిముట్టిన భద్రతా దళాలు.. ఉగ్రవాదుల జాడ కోసం డ్రోన్లు, స్నిఫర్ డాగ్లను ఉపయోగిస్తున్నారు. దాడిని పరిశీలించేందుకు బాంబు డిస్పోసల్ స్క్వాడ్, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) కూడా సంఘటనా ప్రాంతంలో ఉన్నాయి. మరోవైపు పూంచ్లో దాడికి పాల్పడింది తామేనని జైషే మహమ్మద్ అనుబంధ సంస్థ పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ (పీఏఎఫ్ఎఫ్) ప్రకటించింది. 2021 అక్టోబర్లో ఇదే ప్రాంతంలో ఉగ్రవాదులు 9 మంది భారత సైనికులను కాల్చి చంపారు. చదవండి: Karnataka: ఈశ్వరప్ప కుమారుడికి మొండిచేయి -
ముంబైపై ఉగ్రదాడి చేస్తామని ఎన్ఐఏకు బెదిరింపు మెయిల్
ముంబైలో ఉగ్రదాడి జరగుతుందంటూ జాతీయ దర్యాప్తు సంస్థకు బెదిరింపు మొయిల్ వచ్చింది. తాను తాలిబాస్ సభ్యుడనంటూ దర్యాప్తు సంస్థకు ఓ గుర్తు తెలియని వ్యక్తి మెయిల్ పంపాడు. ఈ నేపథ్యంలోనే దర్యాప్తు సంస్థ మహారాష్ట్రలోని ముంబై పోలీసుల అప్రమత్తం చేసింది. దీంతో పోలీసులు ముంబైలోని వివిధ నగరాలకు హైఅలర్ట్ జారీ చేశారు. బెదిరింపు మెయిల్లో గర్తు తెలియని వ్యక్తి తనను తాను తాలిబానీ సభ్యుడిగా పేర్కొన్నాడు. ముంబైలో ఉగ్రదాడి జరుగుతుందంటూ బాంబు పేల్చాడని పోలీసుల వర్గాలు చెప్పాయి. ఈ మెయిల్ తదనంతరం దర్యాప్తు సంస్థ, ముంబై పోలీసులు సంయుక్తంగా ఇందులో నిజానిజాలను వెలికితీసే పని ప్రారంభించాయి. అంతేగాదు ఆ వ్యక్తి మెయిల్లో ముంబైలోని పలు కీలక ప్రాంతాల్లో బాంబులు అమర్చినట్లు తెలిపినట్లు సమాచారం. అందులో భాగంగా నగరంలో ఇన్ఫినిటీ మాల్ అంధేరి, పీవీఆర్ మాల్ జుహు, సహారా హోటల్ ఎయిర్పోర్ట్లో పోలీసులు భద్రతను కట్టుదిటట్టం చేశారు. ఈ ఏడాది జనవరిలో ముంబైలోని ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూలకు ఇలానే ఓ బెదిరింపు కాల్ వచ్చింది. అలాగే గతేడాది అక్టోబర్లో కూడా ఇదే తరహాలో బెదిరింపు కాల్ వచ్చింది. (చదవండి: బాల్య వివాహాలపై ఉక్కుపాదం..ఏకంగా 18 వందల మంది అరెస్టు!) -
యూదుల ప్రార్థనా మందిరంపై ఉగ్రదాడి.. ఏడుగురు మృతి..
జెరూసలెం: ఇజ్రాయెల్ రాజధాని జెరూసలెంలోని యూదుల ప్రార్థనా మందిరంపై ఉగ్రవాది దాడికి తెగబడ్డాడు. కన్పించిన వారిపై బుల్లెట్లు వర్షం కురిపించాడు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. తూటాలు తగిలి మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. నివె యాకోవ్ బోలెవార్డ్లో జరిగిన ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. తుపాకీతో ఉన్న ఉగ్రవాదిని కాల్చి చంపారు. అతను తీసుకొచ్చిన వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఘటనా స్థలాన్ని సందర్శించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఇది అత్యంత తీవ్రమైన ఉగ్రచర్య అని అధికారులు తెలిపారు. ఇటీవలి కాలంలో ఇలాంటి భయానక ఘటన జరగలేదన్నారు. నిందితుడ్ని పాలస్తీనాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. సంబరాలు.. మరోవైపు ఈ దాడిని పాలస్తీనా ఉగ్రసంస్థలు ప్రశంసించాయి. కానీ ఇది తమ పని కాదని పేర్కొన్నాయి. కొన్ని చోట్ల పాలస్తీనా ప్రజలు ఈ ఘటనను సంబరంగా జరుపుకొన్నారు. మిఠాయిలు పంచి, ర్యాలీలు చేశారు. చదవండి: నన్ను చంపించేందుకు జర్దారీ కుట్ర: ఇమ్రాన్ -
ఇళ్లల్లోకి చొరబడి ఉగ్రవాదుల కాల్పులు.. ముగ్గురు పౌరులు మృతి
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రాజౌరీ జిల్లాలోని డాంగ్రి గ్రామంలో మైనారిటీ వర్గం లక్ష్యంగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ దుర్ఘటనలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఆయుధాలతో గ్రామంలోకి చొరబడిన దుండగులు కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో మరో 10 మంది స్థానికులు గాయపడ్డారు. తూటాలు తగిలిన క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఉగ్రమూకల కోసం భద్రతా దాళం గాలింపు చర్యలు చేపట్టాయి. ఇద్దరు దుండగులు గ్రామంలోకి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. ‘మూడు ఇళ్లల్లో కాల్పులు జరిగాయి. ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దుండగుల కోసం గాల్పింపు చర్యలు కొనసాగుతున్నాయి. ’అని తెలిపారు అదనపు డీజీపీ ముకేశ్ సింగ్. మరోవైపు.. కాల్పుల్లో ముగ్గురు చనిపోయారని, మరో ఎనిమిది మంది గాయపడినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటనతో రాజౌరీ వైద్య కళాశాల వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గడిచిన రెండు వారాళ్లో పౌరులే లక్ష్యంగా కాల్పులు జరగటం ఇదే రెండో సంఘటన. డిసెంబర్ 16న ఆర్మీ క్యాంప్ సమీపంలో ఇద్దరు పౌరులను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఇదీ చదవండి: చంద్రబాబు సభలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి -
మీ త్యాగాన్ని జాతి మరువదు
న్యూఢిల్లీ: 2001లో పార్లమెంట్పై ఉగ్ర దాడి ఘటనలో నేలకొరిగిన వారికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా జాతి యావత్తూ మంగళవారం నివాళులర్పించింది. పార్లమెంట్ భవనం వెలుపల జరిగిన కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అన్ని పార్టీల ఎంపీలు ఘనంగా నివాళులర్పించారు. 2001 పార్లమెంట్ దాడి ఘటనలో వీరమరణం పొందిన వారికి జాతి ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని రాష్ట్రపతి ముర్ము అనంతరం ట్వీట్ చేశారు. దేశం కోసం ప్రాణాలను ఫణంగా పెట్టిన వారి త్యాగాన్ని, ధైర్యసాహసాలను ఎన్నడూ మరువబోమని ప్రధాని మోదీ ట్విట్టర్లో తెలిపారు. ఘనంగా నివాళులర్పించిన రాజ్యసభ అంతకుముందు, పార్లమెంట్పై దాడి ఘటనలో ప్రాణాలర్పించిన వారికి రాజ్యసభ నివాళులర్పించింది. సభ్యులు తమ స్థానాల నుంచి లేచి నిలబడి మౌనం పాటించారు. సభా కార్యకలాపాలు ప్రారంభం కాగానే డిప్యూటీ చైర్మన్ హరివంశ్ రాయ్ మాట్లాడారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో డిసెంబర్ 13వ తేదీ ఎప్పటికీ విషాదకరమైన రోజుగానే గుర్తుండిపోతుందన్నారు. 2001 డిసెంబర్ 13వ తేదీన లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థలకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు పార్లమెంట్ వద్ద కాల్పులకు తెగబడ్డారు. పార్లమెంట్ భవనంలోకి చొచ్చుకుపోయేందుకు వారు చేసిన యత్నాన్ని బలగాలు తిప్పికొట్టాయి. ఈ ఘటనలో ఐదుగురు ఢిల్లీ పోలీసులు, సీఆర్పీఎఫ్ మహిళా జవాను ఒకరు, పార్లమెంట్ సిబ్బంది ఇద్దరు, జర్నలిస్ట్ ఒకరు ప్రాణాలు కోల్పోగా భద్రతా బలగాల కాల్పుల్లో ఉగ్రవాదులందరూ హతమయ్యారు. -
బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన సోమాలియా.. 100కు చేరిన మృతుల సంఖ్య
సోమాలియా రాజధాని మొగదిషులో సంభవించిన బాంబు పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య 100కు పెరిగిందని ఆ దేశ అధ్యక్షుడు హసన్ షేక్ ప్రకటించారు. రద్దీగా ఉండే ప్రాంతంలో పేలుళ్లు సంభవించడంతో మరో 300 మంది గాయపడినట్లు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. కాగా మొగదిషులోని విద్యాశాఖ కార్యాలయం బయట రద్దీగా ఉండే జోబ్ కూడలి వద్ద శనివారం(ఆక్టోబర్ 29) రెండు కారు బాంబులు పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే. సోమాలియా అధ్యక్షుడు సహా ప్రధాని, ఇతర ఉన్నతాధికారులు దేశంలో హింసాత్మక తీవ్రవాదాన్ని, ముఖ్యంగా ఉగ్రవాద సంస్థ అల్ షబాబ్ను ఎదుర్కోవడంపై చర్చిస్తుండగానే రాజధానిలో రెండు చోట్ల భారీ పేలుళ్లు సంభవించింది. అంతేగాక గత ఐదేళ్లకాలంలో సోమాలియాలో జరిగిన అతిపెద్ద దాడి ఇదే కావడం గమనార్హం. విద్యాశాఖ కార్యాలయం గోడ వద్ద తొలి పేలుడు జరగ్గా, రద్దీగా ఉన్న ఒక రెస్టారెంట్ ముందు మరో కారు బాంబు పేలింది. సోమాలియా అధ్యక్షుడు హసన్ షేక్ మొహమూద్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. పేలుడు ధాటికి వాహనాలు తుక్కుతుక్కైనట్లున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి. మృతదేహాలు చెల్లచెదురుగా పడిపోయాయి. అల్ ఖైదా ప్రోద్భలంతో పనిచేసే అల్సబాబ్ ఉగ్ర సంస్థే ఈ పేలుళ్లు జరిపి ఉంటుందని అధ్యక్షుడు ఆరోపించారు. రాజధానిని లక్ష్యంగా చేసుకుని ఈ పేలుళ్లకు కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్నారు. గతంలో చాలా సార్లు మొగదిషులో అల్సబాబ్ సంస్థే పేలుళ్లకు తెగబడింది. అయితే అల్ షబాబ్ దీనిపై స్పందించలేదు. మరోవైపు సోమాలియా రాజధాని మొగదిషులో జరిగిన ఉగ్రదాడులను భారత్ ఖండించింది. ఉగ్రదాడి తర్వాత సోమాలియాలో మరణించిన వారి కుటుంబాలకు భారత్ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది. ఇదిలా ఉండగా పేలుళ్లపై తమదే బాధ్యతంటూ ఎవరూ ప్రకటించుకోలేదు. ఇదిలా ఉండగా ఇదే జంక్షన్లో ఐదేళ్ల క్రితం(2017) ట్రక్ బాంబ్ పేలిన ఘటనలో 500 మంది మృత్యువాతపడ్డారు. ఈ ఘటన ఉగ్ర సంస్థ అల్ షబాబ్ పనేనని తేలింది. చదవండి: హిజాబ్ ఆందోళనల వేళ పోలీసు కస్టడీలో సెలబ్రిటీ చెఫ్ మృతి.. అంత్యక్రియలకు వేలాది మంది హాజరు -
ఉగ్రదాడుల కుట్రను భగ్నం చేసిన హైదరాబాద్ పోలీసులు
-
నరమేధం.. చెల్లాచెదురుగా మృతదేహాలు
ఉగ్రవాదుల మారణహోమంతో ప్రపంచం మరోసారి ఉలిక్కి పడింది. అదను చూసి కాల్పులు, బాంబు దాడులతో మారణహోమం సృష్టించారు. ప్రాణాల కోసం బయటకు పరిగెత్తినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు.. చెల్లాచెదురైన మృతదేహాలే ఎటు చూసినా కనిపించాయి. నైజీరియాలో ఓ చర్చిలో జరిగిన ఉగ్రకాండలో యాభై మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. మృతుల సంఖ్య మరింతంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఓండో రాష్ట్రంలోని సెయింట్ ఫ్రాన్సిస్ క్యాథలిక్ చర్చిలో ఈ ఘటన జరిగింది. ఆదివారం కావడంతో ప్రార్థనల కోసం ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువమంది చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. దాడిని చాలా పక్కగా నిర్వహించారు ఉగ్రవాదులు. కొందరు చర్చిలోపల కాల్పులకు పాల్పడగా.. ప్రాణాల కోసం బయటకు పరిగెత్తుకుంటూ వచ్చిన వాళ్లపై బయట ఉన్న మరో ఉగ్రవాది తూటాల వర్షం కురిపించాడు. మృతదేహాలు, చెల్లాచెదురుగా విడిభాగాలతో చర్చి భీతావహంగా ఉంది. ఈ దాడిలో ఎంతమంది మరణించారన్న విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించనప్పటికీ.. 50 మందికిపైనే ప్రాణాలు కోల్పోయినట్టు నైజీరియా లోయర్ లెజిస్లేటివ్ చాంబర్ సభ్యుడు అడెలెగ్బె టిమిలెయిన్ తెలిపారు. ఘటన తర్వాత చర్చి ప్రధాన పాస్టర్ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఈ ఘటనపై నైజీరియా అధ్యక్షుడు మహమ్మద్ బుహారీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నెదర్ ప్రాంతానికి చెందిన ఉగ్రవాదుల పనిగా భావిస్తున్నారు. కాగా, చర్చిపై దాడికి ఇప్పటి వరకు ఏ సంస్థా బాధ్యత ప్రకటించలేదు. నైజీరియాలో అత్యంత శాంతియుత రాష్ట్రాలలో ఒకటిగా ఖ్యాతికెక్కిన ఓండోలో జరిగిన ఈ ఘటన ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉంటే.. పలు దేశాల అధినేతలు ఘటనను తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకలించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. చదవండి: బైడెన్ ఇంటి వద్ద విమాన కలకలం -
పాకిస్తాన్.. మీకు మళ్లీ చెబుతున్నాం: భారత్
సాక్షి, న్యూఢిల్లీ: ముంబై ఉగ్రవాదదాడి గాయాల నుంచి భారతదేశం ఇంకా కోలుకోలేదు. ఈ విషాద ఘటన చోటుచేసుకొని నేటికి 13ఏళ్లు గడుస్తోంది. అయితే ఈ సందర్భంగా భారత విదేశాంగశాఖ.. పాకిస్తాన్ హైకమిషన్ సీనియర్ దౌత్యవేత్తకు ఓ నోట్ను విడుదల చేసింది. తమ దేశ నియంత్రణలో ఉన్న భూభాగాల నుంచి భారత్కు వ్యతిరేకంగా ఉగ్రదాడులకు అనుమంతించవద్దనే నిబద్దతకు పాక్ కట్టుబడి ఉండాలని తెలిపింది. ఈ విషయాన్ని పాకిస్తాన్కు మరోసారి తెలుపుతున్నామంటూ భారత విదేశాంగ శాఖ వార్నింగ్ ఇచ్చింది. 13ఏళ్ల క్రితం జరిగిన పాశవిక ఘటనలో ప్రపంచవ్యాప్తంగా 15 దేశాలకు సంబంధించిన 166 కుటుంబాలు బాధితులయ్యాయి. అయితే ఈ ఉగ్రదాడికి పాల్పడినవారిని కోర్టు ముందుకు తీసుకురావటంలో పాకిస్తాన్ ఇప్పటికీ తన చిత్తశుద్ధిని చూపించలేదని పేర్కొంది. మరోసారి పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఈ ఘటనపై ద్వంద్వ వైఖరి కట్టిపెట్టి ఉగ్రదాడికి పాల్పడిన నేరస్తులను శిక్షించాలని డిమాండ్ చేసింది. ఇది పాకిస్తాన్ ప్రభుత్వం జవాబుదారితనం కంటే టెర్రరిస్టుల చేతిలో మృతి చెందిన బాధితుల కుటుంబాలకు సంబంధించిన అంతర్జాతీయ బాధ్యతని గుర్తుచేసింది. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులు, ఇతర బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపింది. 26 నవంబర్, 2008లో పది మంది పాకిస్తాన్ ఉగ్రవాదుల గ్రూప్ భారత్లోకి చొరబడి ముంబైలోని రైల్వేస్టేషన్, రెండు హోటల్స్పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు కారకుడైన ఉగ్రవాది అజ్మల్ అమీర్ కసబ్ను 21 నవంబర్, 2012లో ఉరితీశారు. -
13 ఏళ్ల నాటి విషాద ఛాయలు..రతన్ టాటా ఆవేదన
ముంబై: ముంబైలో 26/11 ఉగ్రదాడులు జరిగి నేటికి 13 ఏళ్లు అవుతున్నాయని, పైగా ఆనాటి విషాదాంతాన్ని అంత తేలికగా మర్చిపోలేమంటూ దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు నాటి ఉగ్రదాడుల్లో ధ్యంసం అయిన తాజ్ మహల్ ప్యాలెస్ చిత్రాన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ నాటి దాడులకు సంబంధించిన విషాధ ఛాయలను నెటిజన్లుతో పంచుకున్నారు. (చదవండి: కొడుక్కి అరుదైన వ్యాధి.. తండ్రి హైస్కూల్ డ్రాపవుట్.. సొంతంగా మందు తయారీ) ఈ మేరకు రతన్ టాటా మాట్లాడుతూ.... 13 సంవత్సరాల క్రితం మేము అనుభవించిన బాధ, కోల్పోయినవారిని ఎప్పటికీ తిరిగి పొందలేం. అయితే మనం కోల్పోయిన వారిని గౌరవించడం ద్వారా మనల్ని విచ్ఛిన్నం చేయడానికి ఉద్దేశించి జరిపిన ఉగ్రదాడుల తాలుకా స్మృతులను మన బలానికి మూలంగా మార్చుకోవాలి" అని అన్నారు. అంతేకాదు ఆనాటి ఉగ్రదాడిలో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిని అమరవీరులకు రతన్టాటా ఈ సందర్భంగా నివాళులర్పించారు. అయితే నవంబర్ 26, 2008న ముంబైలో నాలుగు రోజుల పాటు జరిగిన భయంకరమైన ఉగ్రదాడిలో సుమారు 166 మంది మృతి చెందడమే కాక దాదాపు 300 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రతన్ టాటా ఇన్స్టాగామ్లో చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: ఒక్క యాక్సిడెంట్!...ఆరు కార్లు ధ్వంసం !: షాకింగ్ వైరల్ వీడియో) View this post on Instagram A post shared by Ratan Tata (@ratantata) -
కొడుకు బర్త్డేకి తప్పకుండా వస్తానన్నాడు.. ఇంతలోనే
ఇంపాల్: మణిపూర్లో తీవ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. భద్రతా దళాల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకొని శనివారం ఉదయం మెరుపుదాడికి దిగారు. ఈ ఘటనలో ‘46 అస్సాం రైఫిల్స్’కు చెందిన ఖుగా బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ విప్లవ్ త్రిపాఠి, ఆయన భార్య, కుమారుడితోపాటు మరో నలుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మరణించిన భద్రతా సిబ్బందిలో అస్సాం రైఫిల్స్ జవాన్ సుమన్ స్వర్గిరీ ఒకరు. బక్సా జిల్లాలోని బరామా ప్రాంతానికి సమీపంలోని తేకెరకుచి కలిబారి గ్రామానికి చెందిన సుమన్ 2011లో భారత సైన్యంలో చేరాడు. అంతకుముందు 2007లో మిలిటెంట్లు అతని తండ్రి కనక్ స్వర్గిరీని హత్య చేశారు. సుమన్ చివరిసారిగా ఈ ఏడాది జూలైలో ఇంటికి వచ్చాడు. (చదవండి: మణిపూర్లో తీవ్రవాదుల ఘాతుకం) సుమన్కు వివాహం అయి ఓ కుమారుడు ఉన్నాడు. డిసెంబర్లో కుమారుడి మూడవ పుట్టిన రోజు. కొడుకు బర్త్డేకు తప్పకుండా వస్తానని భార్యకు మాటిచ్చాడు. మరి కొన్ని రోజుల్లో భార్యాబిడ్డలను కలవబోతున్నానని తెగ సంతోషించాడు సుమన్. కానీ అతడి ఆనందాన్ని తీవ్రవాదులు దూరం చేశారు. సుమన్ కుటుంబంలో జీవితాంతం తీరని దుఖాన్ని మిగిల్చారు. సుమన్ మరణ వార్త తెలిసి అతడి భార్య గుండలవిసేలా విలపిస్తోంది. ‘‘నా భర్త వచ్చే నెల కుమారుడి పుట్టిన రోజు సందర్భంగా ఇంటికి వస్తానని మాటిచ్చాడు. పోయిన శుక్రవారం నాకు కాల్ చేశాడు. అప్పుడు తాను ఓ రిమోట్ ఏరియా ప్రాంతానికి వెళ్తున్నట్లు తెలిపాడు.. అక్కడి నుంచి తిరిగి వచ్చాక కాల్ చేస్తానన్నాడు. మాకు కాల్ చేసే లోపే అతడికి తీవ్రవాదుల రూపంలో చివరి కాల్ వచ్చింది. నాకు, నా బిడ్డకు దిక్కెవరు’’ అంటూ ఏడుస్తున సుమన్ భార్యను చూసి ప్రతి ఒక్కరు కంటతడి పెట్టారు. (చదవండి: ఉగ్రదాడి.. బీజేపీ సర్పంచ్ దారుణ హత్య) ఈ దాడికి పాల్పడింది తామేనని పీపుల్స్ రివల్యూషనరీ పార్టీ ఆఫ్ కాంగ్లీపాక్(ప్రెపాక్), పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) అనే తీవ్రవాద సంస్థలు ప్రకటించాయి. మణిపూర్ విముక్తి కోసం ఈ సంస్థలు పోరాడుతున్నాయి. చదవండి: ఆ విషాదంపై రతన్ టాటా భావోద్వేగం -
మణిపూర్ లో ఉగ్రవాదుల మెరుపుదాడి
-
మణిపూర్లో తీవ్రవాదుల ఘాతుకం
ఇంఫాల్/న్యూఢిల్లీ: సరిహద్దు రాష్ట్రం మణిపూర్లో తీవ్రవాదులు రెచ్చిపోయారు. భద్రతా దళాల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకొని శనివారం ఉదయం మెరుపుదాడికి దిగారు. ఈ ఘటనలో ‘46 అస్సాం రైఫిల్స్’కు చెందిన ఖుగా బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ విప్లవ్ త్రిపాఠి, ఆయన భార్య, కుమారుడితోపాటు మరో నలుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ దాడికి పాల్పడింది తామేనని పీపుల్స్ రివల్యూషనరీ పార్టీ ఆఫ్ కాంగ్లీపాక్(ప్రెపాక్), పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) అనే తీవ్రవాద సంస్థలు ప్రకటించాయి. మణిపూర్ విముక్తి కోసం ఈ సంస్థలు పోరాడుతున్నాయి. చురాచాంద్పూర్ జిల్లాలోని సెఖాన్ గ్రామం వద్ద విప్లవ్ త్రిపాఠి తన భార్య, ఆరేళ్ల కుమారుడితోపాటు కాన్వాయ్లో వస్తుండగా తీవ్రవాదులు పేలుడు పదార్థాలను(ఐఈడీ) పేల్చారు. కాల్పులు సైతం జరిపారు. దీంతో కాన్వాయ్లో ఉన్న అస్సాం రైఫిల్స్ జవాన్లు సైతం ఎదురు కాల్పులు ప్రారంభించారు. తీవ్రవాదుల దాడిలో కల్పల్ విప్లవ్ త్రిపాఠి, ఆయన భార్య, కుమారుడు, నలుగురు జవాన్లు మృతిచెందారు. గాయపడిన వారిని అధికారులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తీవ్రవాదుల దాడిలో మరణించిన కల్నల్ విప్లవ్ త్రిపాఠి గతంలో మిజోరాంలో పనిచేశారు. 2021 జూలైలో బదిలీపై మణిపూర్కు వచ్చారు. మిజోరాంలో ఉన్నప్పుడు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. డ్రగ్స్ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. విప్లవ్ త్రిపాఠి స్వస్థలం ఛత్తీస్గఢ్ లోని రాయ్గఢ్. (చదవండి: అద్భుతం: తల్లి దీవెనలు.. తమ్ముడూ నీ బుర్రకు హ్యాట్సాఫ్) ఏడుగురి ప్రాణ త్యాగాల్ని మర్చిపోలేం: మోదీ మణిపూర్లో అస్సాం రైఫిల్స్ కాన్వాయ్పై తీవ్రవాదులు దాడి చేసి, ఏడుగురి ప్రాణాలను బలిగొనడాన్ని ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. ఏడుగురి ప్రాణ త్యాగాల్ని ఎప్పటికీ మర్చిపోలేమని శనివారం ట్వీట్ చేశారు. అది పిరికిపంద చర్య: రాజ్నాథ్ సింగ్ మణిపూర్లో తీవ్రవాదుల దాడిని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పిరికిపంద చర్యగా అభివర్ణించారు. తీవ్రవాదులను కచ్చితంగా న్యాయస్థానం ముందు నిలబెడతామని చెప్పారు. ఐదుగురు యోధులను దేశం కోల్పోయిందని అన్నారు. చదవండి: ‘‘ఇవాళ ఉన్నాం. రేపుంటామో లేదో!’’ ఏమిటీ పీఎల్ఏ? మణిపూర్లో అస్సాం రైఫిల్స్ జవాన్లపై తీవ్రవాదుల దాడి నేపథ్యంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) మరోసారి తెరపైకి వచ్చింది. ఈ సంస్థను 1978 సెప్టెంబర్ 25న ఎన్.బిశ్వేశ్వర్ సింగ్ ప్రారంభించారు. మణిపూర్కు భారతదేశం నుంచి విముక్తి కలిగించి, స్వతంత్ర దేశంగా మార్చడమే తమ సంస్థ ధ్యేయమని ప్రకటించారు. మార్క్సిజం–లెనినిజం సిద్ధాంతాలు, మావో ఆలోచనా విధానంపై ఆధారపడి పీఎల్ఏ పనిచేస్తోంది. పీఎల్ఏకు చైనా ప్రభుత్వం నుంచి అండదండలు లభిస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లోని ఇతర తీవ్రవాద, వేర్పాటువాద సంస్థలతో పీఎల్ఏ చేతులు కలిపింది. ఉమ్మడి శత్రువైన భారతదేశాన్ని ఓడించడానికి ఆయా సంస్థలు ఒక్క తాటిపైకి వచ్చాయి. పీఎల్ఏ 1989లో రివల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్(ఆర్పీఎఫ్) పేరిట ఒక రాజకీయ విభాగాన్ని ప్రారంభించింది. మణిపూర్ పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్లో పీఎల్ఏ భాగస్వామిగా చేరింది. -
బ్యాంక్పై కోపం.. ‘నగరంపై మరో ఉగ్ర దాడి’ అంటూ
సాక్షి, హైదరాబాద్: ఓ బ్యాంకు సేవలు నచ్చకపోతే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడమో, ఖాతాను మరో బ్యాంకులోకి మార్చుకోవడమో చేస్తాం. నగరానికి చెందిన ఓ వ్యక్తి మాత్రం సహనం కోల్పోయి బెదిరింపులకు దిగాడు. ముంబైలోని ఆ బ్యాంక్ కాల్ సెంటర్కు ‘నగరంపై మరో ఉగ్ర దాడి జరగనుంది’ అంటూ ఈ–మెయిల్ పంపాడు. ఫలితం సైబర్ టెర్రరిజం ఆరోపణలపై కేసు నమోదైంది. నిందితుడిని అరెస్టు చేయాల్సి ఉంది. వివరాలిలా ఉన్నాయి... నగరానికి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగికి ఓ జాతీయ బ్యాంకులో పెన్షన్ ఖాతా ఉంది. పెన్షన్ నిబంధనల ప్రకారం ఈ ఖాతా వివరాలను ఆన్లైన్లో పెట్టాల్సి ఉంది. జాప్యం కావడంతో కొన్నాళ్లుగా సదరు రిటైర్డ్ ఉద్యోగికి పెన్షన్ అందట్లేదు. దీంతో ఆయన దీనిపై ఆ బ్యాంక్ డిప్యూటీ మేనేజర్కు దరఖాస్తు చేసుకున్నారు. ఇది పెండింగ్లో ఉండిపోవడంతో పలుమార్లు ముంబైలోని బాంద్రా–కుర్లా కాంప్లెక్స్లో (బీకేసీ) ఉన్న బ్యాంక్ కాల్ సెంటర్కు ఫోన్లు, ఈ–మెయిల్స్ ద్వారా ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ స్పందన లేకపోవడంతో సహనం కోల్పోయిన నగరవాసి ఆవేశపడ్డారు. బ్యాంకు కస్టమర్ కేర్ ఈ–మెయిల్ ఐడీకి మరో మెయిల్ పంపారు. ఈ కాల్ సెంటర్ ముంబైలోని బీకేసీ కాంప్లెక్స్లో ఉందని తెలిసిన ఆయన తన ఈ–మెయిల్లో అతి త్వరలోనే అక్కడ ఉగ్రదాడి జరుగనుందని, దానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. అదే మెయిల్లో తన బ్యాంకు ఖాతా నెంబర్, వివరాలను పొందుపరిచారు. దీన్ని చూసి కంగుతిన్న కాల్ సెంటర్ ఉద్యోగులు విషయాన్ని బ్యాంక్ జనరల్ మేనేజర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన బ్యాంకు అధికారులు దీనిపై ఎంఆర్ఏ మార్గ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్వాపరాలు పరిశీలించిన పోలీసులు నగరవాసిపై ఐపీసీలోని 506, 507లతో పాటు ఐటీ యాక్ట్లో సైబర్ టెర్రరిజానికి సంబంధించిన 66 ఎఫ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బ్యాంకు ఖాతా వివరాలను బట్టి బాధ్యుడు హైదరాబాద్ వాసిగా తేల్చారు. బెదిరింపు ఈ–మెయిల్ వచి్చన ఐపీ అడ్రస్లో ఆధారాలు సేకరిస్తున్నారు. అతడి వివరాలు గోప్యంగా.. నిందితుడిని అరెస్టు చేయడానికి ఎంఆర్ఏ మార్గ్ పోలీసులకు చెందిన ప్రత్యేక బృందం త్వరలో హైదరాబాద్కు రానుంది. ఈ విషయంపై సదరు ఠాణా అధికారిని సాక్షి బుధవారం ఫోన్ ద్వారా సంప్రదించగా ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే అతడి పేరు, వివరాలతోపాటు బ్యాంక్ అధికారుల కోరిక మేరకు ఆ వివరాలు బయటకు చెప్పలేమని అన్నారు. బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం, సేవల్లో లోపంపై స్పందించాల్సిన తీరు ఇది కాదని వ్యాఖ్యానించారు. -
‘బీజేపీ ప్రభుత్వానికి ఉగ్రవాదులు భయపడుతున్నారు’
గుజరాత్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఇప్పటి వరకు ఒక్క పెద్ద ఉగ్రవాద దాడి కూడా జరగలేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఆయన గుజరాత్లోని నర్మాద జిల్లాలో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. అప్పటి నుంచి దేశంలో ఒక్క పెద్ద ఉగ్రవాద దాడి కూడా జరగలేదని అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఉగ్రవాదులు భయపడుతున్నారని పేర్కొన్నారు. అది బీజేపీ సాధించిన గొప్ప విజయమని తెలిపారు. చదవండి: West Bengal Post Poll Violance: సీబీఐ ఛార్జ్షీట్లో ఇద్దరు నిందితుల పేర్లు ఉగ్రవాదులు తమకు బలమైన స్థావరాలు అనుకుంటున్న ప్రాంతాలు కూడా సురక్షితమైనవి కాదని భావిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. పీఓకేలో సర్జికల్ స్ట్రైక్ ద్వారా భారత్దేశ శక్తిని ప్రపంచానికి తెలియజేశామని పేర్కొన్నారు. భారత సైన్యం పట్ల ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రశంసించే ఆలోచన కూడా లేదని మండిపడ్డారు. అదీకాక 40 ఏళ్లుగా వన్ ర్యాంక్-వన్ పెన్షన్ సమస్యను పరిష్కరించకుండా ఉంచారని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దుయ్యబట్టారు. చదవండి: ‘అఫ్గాన్ నుంచి భారతీయుల తరలింపే మొదటి ప్రాధాన్యత’ -
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల కుట్ర భగ్నం
న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదుల కుట్ర భగ్నమైంది. దేశ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా బాంబు దాడులకు ప్లాన్ చేసిన నలుగురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. జైసే ఈ మహ్మద్ ఉగ్రవాద సంస్ధకు చెందిన వీరు శనివారం పట్టుబడ్డారు. ఈ నలుగురు డ్రోన్ల ద్వారా ఆయుధాలను సేకరించి మిగిలిన ఉగ్రవాదులకు సరఫరా చేయటానికి ప్రయత్నిస్తున్నట్లు.. టూవీలర్కు ఐఈడీ అమర్చి పేలుళ్లు జరపాలని కుట్ర పన్నినట్లు తేలింది. ఆదివారం స్వాంతంత్ర్య వేడుకల సందర్భంగా దేశ వ్యాప్తంగా పలు ప్రదేశాల్లో బాంబు దాడులకు సిద్ధమైనట్లు గుర్తించారు. -
బస్సు బాంబు దాడిపై పాకిస్తాన్ పచ్చి అబద్ధాలు
న్యూఢిల్లీ: ఖైబర్ పక్తూంఖ్వా ప్రావిన్స్లో గత నెలలో జరిగిన బస్సు బాంబు పేలుడు వెనుక భారత్ హస్తం ఉందంటూ పాకిస్తాన్ చేసిన ఆరోపణలను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ శుక్రవారం ఖండించారు. ఆసియా ప్రాంతంలో స్థానికంగా అస్థిరతకు, ఉగ్రవాదానికి అడ్డాగా మారిన పాకిస్తాన్ బాహ్య ప్రపంచం దృష్టిని మళ్లించేందుకు పచ్చి అబద్ధాలు చెబుతోందని మండిపడ్డారు. పాకిస్తాన్లోని ఖైబర్ ఫక్తూంఖ్వా ప్రావిన్స్లో అప్పర్ కోహిస్తాన్ జిల్లాలో జరిగిన బస్సు బాంబు పేలుడు ఘటనలో 9 మంది చైనా ఇంజనీర్లు సహా మొత్తం 13 మంది మరణించారు. ఈ దాడికి భారత నిఘా సంస్థ ‘రా’, అఫ్గానిస్తాన్కు చెందిన నేషనల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ(ఎన్డీఎస్) కారణమని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ ఆరోపించారు. ఈ ఆరోపణలను అరిందమ్ బాగ్చీ తిప్పికొట్టారు. భారత్ను అప్రతిష్ట పాలు చేయాలన్నదే పాక్ పన్నాగమని మండిపడ్డారు. ఉగ్రవాదంపై జరుగుతున్న పోరాటంలో భారత్ ముందు వరుసలో నిలుస్తోందని గుర్తుచేశారు. ఈ విషయంలో అంతర్జాతీయ సమాజంతో కలిసి పని చేస్తోందని అన్నారు. ఉగ్రవాద విష భుజంగాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తోందన్న సంగతి అందరికీ తెలుసని చెప్పారు. -
ఉగ్రదాడి.. బీజేపీ సర్పంచ్ దారుణ హత్య
కశ్మీర్: జమ్ముకశ్మీర్లో దారుణం చోటు చేసుకుంది. బీజేపీ నేత, అతడి భార్యపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. అనంతనాగ్లోని లాల్ చౌక్లో సోమవారం జరిగిన కాల్పుల్లో.. ఆ రాష్ట్ర బీజేపీ పార్టీకి చెందిన కిసాన్ మోర్చా అధ్యక్షుడు, సర్పంచ్ గులామ్ రసూల్ దార్తో పాటు ఆయన భార్య జవహీరా బానూ మృతిచెందారు. ఉగ్రవాదుల దాడుల్లో కిసాన్ మోర్చా అధ్యక్షుడు చనిపోయినట్లు మరో బీజేపీ నేత అల్తాఫ్ ఠాకూర్ తెలిపారు. అమాయకులును బలి తీసుకున్న వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ సందర్భంగా జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ దారుణాన్ని ఖండించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘కుల్గాంలో జరిగిన కాల్పుల్లో కిసాన్ మోర్చా అధ్యక్షుడు, సర్పంచ్ గులామ్ రసూల్ దార్తో పాటు ఆయన భార్య జవహీరా బానూ మృతిచెందారు. ఈ దారుణ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది పిరికిపంద చర్య.. హింసకు పాల్పడిన వారిని అతి త్వరలో న్యాయస్థానం ముందు నిలబెడతాం. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అంటూ మనోజ్ సిన్హా ట్వీట్ చేశారు. Jammu & Kashmir | Terrorists fired bullets at a couple at Lal Chowk in Anantnag. Both husband & wife have been shifted to hospital. More details awaited. — ANI (@ANI) August 9, 2021 మరో వైపు పూంచ్ సెక్టార్లో బీఎస్ఎఫ్ దళాలు నిర్వహించిన తనిఖీల్లో భారీ స్థాయిలో ఆయుధాలు లభ్యమయ్యాయి. ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం.. బీఎస్ఎఫ్ దళాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. విల్ సంగద్ అటవీ ప్రాంతంలో జరిగిన గాలింపులో ఆయుధాలు దొరికాయి. వాటిల్లో ఏకే 47 రైఫిళ్లు, పిస్తోళ్లు ఉన్నాయి. Jammu & Kashmir | Terrorists fired bullets at a couple at Lal Chowk in Anantnag. Both husband & wife have been shifted to hospital. More details awaited. — ANI (@ANI) August 9, 2021 -
Jammu Airport: జంట పేలుళ్ల కలకలం.. ఉగ్రకోణంలో దర్యాప్తు!
న్యూఢిల్లీ: జమ్ము విమానాశ్రయం వద్ద ఎయిర్ఫోర్స్ కార్యాకలాపాలు నిర్వహించే చోట జంట పేలుళ్ల కలకలం నెలకొంది. శనివారం అర్ధరాత్రి దాటాక హై సెక్యూరిటీ జోన్ పరిధిలో ఉన్న ఎయిర్ఫోర్స్ స్టేషన్ వద్ద ఈ పేలుళ్లు జరిగాయి. అయితే పేలుళ్లు స్వల్ప తీవ్రతతో జరగడం వల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదని ఇండియన్ ఎయిర్ఫోర్స్ ప్రకటించింది. కాగా, రాత్రి 1గం.35ని. నుంచి 1.గం.42 ని.. ఈ ఐదు నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్లు జరిగినట్లు తెలుస్తోంది. ఒక దాడిలో పైకప్పు స్వల్పంగా దెబ్బతిందని, మరో పేలుడు బహిరంగ ప్రదేశంలో జరిగిందని ప్రకటించింది. ఈ ఘటనలో రెండు బ్యారక్లు ధ్వంసం అయ్యాయని, ఇద్దరు గాయపడినట్లు తొలుత సమాచారం అందించింది. అయితే డిఫెన్స్ పీఆర్వో మాత్రం ఎలాంటి నష్టం వాటిల్లదేని ప్రకటించడం విశేషం. Two low intensity explosions were reported early Sunday morning in the technical area of Jammu Air Force Station. One caused minor damage to the roof of a building while the other exploded in an open area. — Indian Air Force (@IAF_MCC) June 27, 2021 కాగా, టెక్నికల్ ఏరియాల్లో ఈ ఘటన జరగడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఘటన జరిగిన విషయం తెలిసి ఎన్ఐఏ, ఎన్ఎస్జీ టీంలు రంగంలోకి దిగాయి. ఫోరెన్సిక్ టీంలు క్లూస్ కోసం గాలిస్తున్నాయి. డ్రోన్లలో ఐఈడీ బాంబులు అమర్చిన ఉగ్రవాదులు.. ఈ పేలుళ్లకు పాల్పడి ఉంటారేమోనని అనుమానిస్తున్నారు. చదవండి: అలాగైతేనే పోటీ చేస్తా: మెహబూబా ముఫ్తీ కీలక వ్యాఖ్యలు -
కశ్మీర్లో ఉగ్ర ఘాతుకం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో ముష్కరులు మళ్లీ రెచ్చిపోయారు. మున్సిపల్ కౌన్సిలర్ను, ఆయన వ్యక్తిగత అంగరక్షకుడిని కాల్చి చంపారు. బారాముల్లా జిల్లాలోని సోపోరు పట్టణంలో సోమవారం ఈ దారుణం జరిగింది. మధ్యాహ్నం సోపోరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుండగా గుర్తుతెలియని సాయుధులు లోపలికి ప్రవేశించారు. మున్సిపల్ కౌన్సిలర్ రియాజ్ అహ్మద్, సెక్యూరిటీ గార్డు షఫ్ఖాత్ అహ్మద్పై తుపాకులతో కాల్పులు జరిపారు. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శంషుద్దీన్ పీర్ అనే మరో కౌన్సిలర్ గాయపడ్డాడు. జమ్మూకశ్మీర్ డీజీపీ విజయ్ కుమార్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. దుండగుల దుశ్చర్యపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ దాడిలో లష్కరే తోయిబాకు చెందిన ముదాసిర్ పండిట్ అనే ఉగ్రవాది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ముష్కరులను పట్టుకొనేందుకు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. కౌన్సిల్ సమావేశ మందిరంలోకి చొరబడి ఉగ్రవాదులు కాల్పులు జరపడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదులది పిరికిపంద చర్య అని విమర్శించింది. వారిని పట్టుకొని, కఠినంగా శిక్షించాలని బీజేపీ జమ్మూకశ్మీర్ అధ్యక్షుడు రవీందర్ రైనా డిమాండ్ చేశారు. మృతులకు నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా సంతాపం తెలిపారు. ముష్కరుల అకృత్యాన్ని తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో మృతిచెందిన రియాజ్ అహ్మద్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి, గెలిచారు. -
‘‘ఇవాళ ఉన్నాం. రేపుంటామో లేదో!’’
శ్రీనగర్: ఎలా ఉన్నావన్న మిత్రుడితో ‘‘బాగానే ఉన్నా. కానీ మా (సైనికుల) గురించి ఎవరేం చెప్పగలరు? ఇవాళ ఉంటాం. రేపుండొచ్చు, ఉండకపోవచ్చు’’ అని సమాధానమిచ్చాడు ఒక ఇరవయ్యేళ్ల జవాను. ఆ మరునాడే ఒక ఉగ్రదాడిలో అమరుడయ్యాడు. సైనికుల ప్రాణాలకు ఉన్న భరోసా ఏ పాటిదో చెప్తూ, సొంతూర్లోని తన చిన్ననాటి స్నేహితుడితో అతను చేసిన వాట్సాప్ చాట్ వైరల్గా మారడమే కాకుండా నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది. ఎవరతను? మహారాష్ట్ర, జల్గావ్ జిల్లా, చలిగావ్ తాలూకాకు చెందిన యశ్ దిగంబర్ దేశ్ముఖ్ గతేడాదే ఆర్మీలో చేరాడు. యశ్ తల్లిదండ్రులు వ్యవసాయదారులు. అతనికి ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు. అక్కలిద్దరికీ పెళ్లవగా, తమ్ముడింకా స్కూలుకు వెళుతున్నాడు. కర్ణాటక, బెళగావ్లో నిర్వహించిన మిలటరీ ఎంపిక శిబిరానికి చేరుకున్న యశ్ ఎంతగానో శ్రమించి ఆర్మీలో చోటు సంపాదించి తన కల నెరవేర్చుకున్నాడు. అసలేమైంది? అక్రమంగా ఎల్వోసీ దాటిన ముగ్గురు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు గురువారం శ్రీనగర్లోని ఓ రద్దీ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ విధుల్లో ఉన్న సైనికులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. పట్టపగలే జరిగిన ఈ మెరుపుదాడిలో యశ్తో పాటు మరో జవాను అమరుడయ్యాడు. పన్నెండేళ్ల క్రితం ఇదే రోజున (26/11) ముంబై ఉగ్రదాడి జరగడం గమనార్హం. మరో రెండు రోజుల్లో జమ్ము కశ్మీర్లో ‘జిల్లా అభివృద్ధి మండలి’ (డీడీసీ) ఎన్నికలు జరనున్న నేపథ్యంలోనే ముష్కరులు ఈ దాడి జరిపి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. కాగా ఈ నెల 19న జమ్ము-శ్రీ నగర్ జాతీయ రహదారిపై ట్రక్కులో ప్రయాణిస్తున్న నలుగురు జైషే మొహమ్మద్ మిలిటంట్లను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే! -
ఆ విషాదంపై రతన్ టాటా భావోద్వేగం
సాక్షి,ముంబై: టాటా గ్రూపు గౌరవ ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా 12 ఏళ్ల నాటి ఉగ్రదాడిని గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ముంబై నగరంలో నవంబరు 26న చోటుచేసుకున్న మారణహోమంపై సోషల్ మీడియాలో గురువారం స్పందించారు. ఈ సందర్భంగా ఉగ్రవాద దాడిలో అసువులు బాసిన అమరవీరులకు, ప్రజలకు రతన్ టాటా నివాళులర్పించారు. 12 సంవత్సరాల క్రితం జరిగిన అవాంఛనీయ విధ్వంసాన్ని ఎప్పటికీ మర్చిపోలేనంటూ తీవ్ర విషాదానికి చేదు జ్ఞాపకంగా నిలిచిన తాజ్మహల్ ప్యాలెస్ హోటల్ పెయింటింగ్ను షేర్ చేశారు. అయితే అంతకన్నా గుర్తుండిపోయే విషయం ఏమిటంటే, విభిన్నజాతుల సమ్మేళనమైన ముంబై ప్రజలంతా అన్ని తేడాలను పక్కనపెట్టి, ఉగ్రవాదాన్ని, విధ్వంసాన్ని అధిగమించారంటూ ప్రశంసించారు. ఆప్తులను కోల్పోవడం దుఃఖభరితమే అయినా, శత్రువును జయించడంలో వారి, ధైర్యవంతుల త్యాగాన్ని గౌరవించి తీరాలి. వారి తెగువను, ఐక్యతను మెచ్చుకోవాలన్నారు. ఆ రోజు వారు ప్రదర్శించిన సాహసం, సున్నితత్వం భవిష్యత్తులోనూ కొనసాగాలని రతన్ టాటా తన పోస్ట్లో పేర్కొన్నారు. కాగా 2008, నవంబర్ 26వ తేదీన ముంబై నగరంపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. నాలుగు రోజుల పాటు జరిగినఈ దారుణ మారణహోమంలో 166 మంది మరణించగా, 300 మందికి పైగా గాయపడ్డారు. ముఖ్యంగా తాజ్ హోటల్లోనే 31 మంది మరణించిన సంగతి తెలిసిందే. pic.twitter.com/3qnuvXfE6M — Ratan N. Tata (@RNTata2000) November 26, 2020 -
ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి రూ. 50 లక్షలు
సాక్షి, అమరావతి: జమ్మూ కశ్మీర్ కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ వెంట ఎదురు కాల్పులలో వీర మరణం పొందిన హవాల్దార్ సీహెచ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించింది. చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు చెందిన ప్రవీణ్కుమార్ రెడ్డి గత 18 ఏళ్లుగా భారత సైన్యంలోని మద్రాస్ రెజిమెంట్లో పని చేస్తున్నారు. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్లోని మాచిల్ సెక్టార్, నియంత్రణ రేఖ వద్ద విధులు నిర్వర్తిస్తుండగా, ఉగ్రవాదులు కాల్పులకు తెగపడడంతో ప్రవీణ్కుమార్రెడ్డి వీర మరణం పొందారు. (చదవండి : ఉగ్రపోరులో చిత్తూరు జిల్లా కమాండో వీరమరణం) దేశం కోసం ప్రవీణ్కుమార్రెడ్డి చేసిన ప్రాణ త్యాగం వెలకట్టలేనిదన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన త్యాగానికి దేశం మొత్తం గర్విస్తోందని పేర్కొన్నారు. వీర జవాన్ మరణం ఆ కుటుంబానికి తీరని లోటని, అందువల్ల ఆ కుటుంబానికి కొంతైనా ఆసరాగా ఉండేలా సీఎం సహాయ నిధి నుంచి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రవీణ్కుమార్రెడ్డి భార్య రజితకు ముఖ్యమంత్రి లేఖ రాశారు. మరోవైపు ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబాన్ని రాష్ట్ర మంత్రి వర్గం సందర్శించి పరామర్శించింది. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి , మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఎంపి రెడ్డెప్ప స్థానిక ఎమ్మెల్యే ఎం ఎస్ బాబు లు రెడ్డివారిపల్లి కి వెళ్లి ప్రవీణ్ కుటుంబీకును పరామర్శించారు. ప్రభుత్వం తరపున మంత్రి పెద్దిరెడ్డి ప్రవీణ్ కుటుంబీకులకు 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. సీఎం ఆదేశాల మేరకు మేము వచ్చామన్నారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన గవర్నర్ బిశ్వ భూషణ్ చిత్తూరు జిల్లా, ఐరాల మండలం, రెడ్డివారిపల్లెకు చెందిన సైనిక దళాల సిపాయి చీకాల ప్రవీణ్ కుమార్ రెడ్డి మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ 18 సంవత్సరాల క్రితం మద్రాస్ రెజిమెంట్ -18లో భారత సైన్యంలో చేరిన ప్రవీణ్ కుమార్ రెడ్డి జమ్మూ కాశ్మీర్ లో దేశ సరిహద్దులకు కాపలాగా ఉండి, బలిదానం పొందారన్నారు. కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సంతాపం తెలిపిన గవర్నర్ ప్రవీణ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. -
చిత్తూరు: ఉగ్రవాదుల కాల్పుల్లో భారత్ జవాను మృతి
-
నిజామాబాద్: జవాన్ వీర మరణం
-
ఉగ్ర పోరులో నిజామాబాద్ జవాన్ వీర మరణం
సాక్షి, నిజామాబాద్: జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇందూరు బిడ్డ వీరమరణం పొందాడు. దీంతో ఆయన స్వగ్రామం వేల్పూరు మండలం కోమన్పల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. కోమన్పల్లికి చెందిన ర్యాడా మహేష్ ప్రాథిమిక విద్యాభ్యాసం స్వగ్రామంలో జరిగింది. కుకునూర్లో పదో తరగతి వరకు చదువుకున్నాడు. నిజామాబాద్లోని ఓ ప్రేవేటు కళాశాలలో ఇంటర్ పూర్తి చేసిన అనంతరం కరీంనగర్ మిలిటరీ శిక్షణ సంస్థలో శిక్షణ తీసుకున్నాడు. ఐదేళ్ల క్రితం ఆర్మీకి ఎంపికయ్యాడు. గతేడాది డిసెంబర్లో ఇంటికి వచ్చి ఈ ఏడాది జనవరిలో తిరిగి వెళ్లాడు. ఏడాదిన్నర క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఆయనకు ఇంకా సంతానం కాలేదు. అక్టోబర్ వరకు డెహ్రాడూన్లో విధులు నిర్వర్తించిన మహేష్ బదిలీపై జమ్మూకశ్మీర్కు వెళ్లాడు. ఆదివారం ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందాడు. ఈ వార్త తెలియగానే అతడి తల్లిదండ్రులు చిన్నరాజు, గంగమల్లు కన్నీరుమున్నీరయ్యారు. అమర జవాన్కు నివాళి జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులతో జరిగిన పోరులో వీరమరణం పొందిన ర్యాడా మహేష్కు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి నివాళి అర్పించారు. దేశ రక్షణ కోసం సైన్యంలో చేరి భారతావని కోసం మహేష్ చేసిన త్యాగం మరువలేనిదని కొనియాడారు. ‘వీర సైనికుడు మహేష్కు యావత్తు తెలంగాణ నివాళి అర్పిస్తోంది. ఎదురు కాల్పుల్లో వీరమరణం పొందిన మహేష్ తోటి సైనికులకు నా జోహార్లు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’అని పోచారం శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. ఆర్మీ జవాన్ మహేష్ వీర మరణం పట్ల మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత ఘన నివాళి అర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మహేష్ త్యాగం మరువలేనిదని అన్నారు. మహేష్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. మహేష్తో పాటు వీర మరణం పొందిన సైనికులకు జోహార్లు పలికారు. (చదవండి: కశ్మీర్లో కాల్పులు, ముగ్గురు జవాన్ల వీర మరణం) -
ఉగ్రపోరులో చిత్తూరు జిల్లా కమాండో వీరమరణం
ఆయన మారుమూల గ్రామంలో పుట్టి పెరిగాడు. దేశ భక్తి మెండుగా ఉండడంతో మాతృభూమి సేవలో పాలుపంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. 18 ఏళ్ల క్రితం సైన్యంలో చేరాడు. విధుల్లో చురుగ్గా ఉంటూ ఉన్నతాధికారుల మన్నలు పొందాడు. జమ్మూ కాశ్మీర్లోని కుష్వారా సెక్టార్లోని మాచెల్ నాలా పోస్టు వద్ద ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో అమరుడయ్యాడు. సాక్షి, చిత్తూరు : ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు చెందిన చీకలప్రతాప్ రెడ్డి, సుగణమ్మ దంపతుల ఏకైక కుమారుడు చీకల ప్రవీణ్కుమార్ రెడ్డి (37) డిగ్రీ వరకు చదివాడు. గ్రామానికి చెందిన చాలామంది సైన్యంలో పనిచేస్తుండడం చూసి తాను దేశానికి సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు. 18 ఏళ్ల క్రితం మద్రాసు రెజ్మెంట్–18లో చేరారు. ప్రవీణ్కుమార్రెడ్డి విధుల్లో చురుగ్గా ఉండేవాడు. ప్రస్తుతం ఆయన స్పెషల్ టాస్క్ఫోర్స్ కమాండోగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం జమ్మూకాశ్మీర్లోని కుష్వారా సెక్టార్ లోని మాచెల్ నాలా పోస్టు వద్ద దేశంలోకి చొరబడుతున్న ఉగ్రవాదులను నిలువరించే ఆపరేషన్లో 15 మంది బృందంలో ఉన్న ప్రవీణ్కుమార్రెడ్డి పాల్గొన్నారు. ఆరుగురు ఉగ్రవా దులు జరిపిన దాడుల్లో ప్రవీణ్కుమార్రెడ్డితోపాటు మరో ఇద్దరు భారత్ సైనికులు మృతిచెందారు. సంక్రాంతి పండుగకు వస్తానని చెప్పిన కొడుకు అనంతలోకాలకు చేరుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రవీణ్ కుమార్రెడ్డికి భార్య, ఎనిమిదేళ్ల కుమార్తె, ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. గ్రామంలో విషాదఛాయలు ప్రవీణ్కుమార్రెడ్డి మృతి సమాచారం అందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి వచ్చినప్పుడల్లా అందరితో ఎంతో కలివిడిగా ఉండేవాడని, సైన్యం వీరోచితగాథల గురించి తమకు స్ఫూర్తిదాయకంగా చెప్పేవాడని పలువురు యువకులు చెప్పారు. అలాంటి వ్యక్తి కాల్పుల్లో మృతిచెందడం బాధగా ఉందని యువత, స్నేహితులు, బంధువులు అతడి జ్ఞాపకాలతో విచలితులయ్యారు. దేశసేవ చేయాలని యువతకు చెప్పేవారు సెలవుల్లో గ్రామానికి వస్తే యువకులతో మాట్లాడేవారు. ప్రతి ఒక్కరూ సైన్యంలో చేరి దేశసేవ చేయాలని చెప్పేవారు. గ్రామానికి పండుగకు వస్తే అందరితోనూ కలిసిపోయేవారు. హుషారుగా ఉండే ప్రవీణ్కుమార్రెడ్డి మృతిచెందడం గ్రామానికి తీరని లోటు. – రవి, గ్రామస్తుడు చాలా చురుకైన వ్యక్తి ప్రవీణ్ కుమార్ సైన్యంలో చురుకైన వ్యక్తి. జమ్మూకాశ్మీర్లో కుష్వారా సెక్టార్లో కమాండోగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన వద్ద నేను సీహెచ్ఎంగా ఉన్నాను. అలర్ట్గా ఉండేవారు. నేను సెలవుల్లో వచ్చాను. నా స్నేహితుడు వీరమరణం పొందాడని తెలియగానే షాక్ గురయ్యా. –హేమాద్రి, వెదుర్లవారిపల్లె చాలా మంచివాడు ప్రవీణ్ చాలా మంచివాడు, సైన్యం నుంచి ఇంటికి ఎప్పుడు వచ్చినా గ్రామం గురించి ఆలోచించేవాడు. అందరూ కలిసిమెలిసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించేవాడు. అలాంటి వ్యక్తి చనిపోయాడనే విషయం తెలియగానే షాక్కు గురయ్యాం. –బాబురెడ్డి, మృతుడి బాబాయి, రెడ్డివారిపల్లె -
ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఉగ్రదాడి
-
ఆస్ర్టియా రాజధాని వియన్నాలో ఉగ్రదాడి
వియన్నా :ఆస్ర్టియాలో రాజధాని వియన్నాలో సోమవారం జరిగిన ఉగ్రదాడి జరిగింది. హిల్టన్ హోటల్లోని పర్యాటకులను బందీలుగా చేసుకొని ముంబై తరహాలోనే ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో ఏడుగురు పౌరులు మృతిచెందగా, పలువురికి గాయాలయ్యాయి. వియన్నాలోని దాదాపు ఆరు ప్రాంతాల్లో ముష్కరులు ఈ కాల్పులకు తెగబడ్డారు. వెంటనే ఆర్మీని రంగంలోకి దించిన ఆస్ట్రియా ప్రభుత్వం.. వియన్నా ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. భద్రతా దళాల కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతం మరొక నిందితుడు పరారీలో ఉన్నాడు. అటోమెటిక్ మొబైల్ సిస్టమ్ ద్వారా ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు గుర్తించారు. వియన్నా నగరవ్యాప్తంగా హైఅలర్ట్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలెవరూ బయటకు రావద్దని మంత్రి నెహమ్మర్ తెలిపారు. (కాబూల్ వర్సిటీలో కాల్పులు ) కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆస్ర్టేలియాలో పాక్షిక లాక్డౌన్ అమలు చేయడానికి కొన్ని గంటల ముందే ఈ దాడి జరిగింది. అప్పటికే కొన్ని రెస్టెంట్లు, కేఫ్లు మూసిఉన్నాయని అధికారులు తెలిపారు. ఉగ్ర కదలికలపై నిఘా పెట్టామని, ప్రజలు అత్యవసరం అయితేనే బయటకు రావాలని పేర్కొన్నారు. ఈ ఉగ్రదాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ ఆంటోనియో గుట్రెస్ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆస్ర్టియా ప్రజలకు, ప్రభుత్వానికి సంఘీబావం తెలియజేస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. I’m following with grave concern the violent attacks of terror in Vienna, one of our UN HQ. I condemn these attacks in the strongest possible terms and reaffirm the @UN's solidarity with the people & Government of Austria. https://t.co/WQfbKhsMg6 — António Guterres (@antonioguterres) November 3, 2020 -
వర్సిటీపై దాడి: 19 మంది విద్యార్థులు మృతి
ఆప్ఘనిస్తాన్: కాబూల్ యూనివర్సిటీపై ఉగ్రవాదులు సోమవారం దాడికి పాల్పడ్డారు. పేలుళ్లు, కాల్పుల శబ్ధాలతో కాబూల్ యూనివర్సిటీ ప్రాంగణం దద్దరిల్లింది. ఈ దాడిలో 19 మంది విద్యార్థులు మరణించినట్లు ప్రాథమిక సమాచారం. మరో 22మంది గాయపడినట్లు తెలుస్తోంది. యూనివర్సిటీలో నిర్వహించబోయే ఇరానియన్ బుక్ ఫెయిర్ను ప్రారంభించడానికి వచ్చే అధికారులే లక్ష్యంగా ఈ ఉగ్రదాడి జరిగినట్లు భావిస్తున్నారు. ఈ దాడిని ఆప్ఘన్ ప్రభుత్వం కూడా ధ్రువీకరించింది. అయితే ఈ దాడిలో ముగ్గురు ఉగ్రవాదులు పాల్గొన్నట్లు అఫ్ఘనిస్తాన్ హోం శాఖ మంత్రి తారీఖ్ ఆరియన్ వెల్లడించారు. దాడికి పాల్పడిన ముష్కరులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. మృతుల్లో ఎక్కువమంది విద్యార్థులే. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలిస్తున్నారు. -
ఫ్రాన్స్లో ఉగ్ర దాడి : ముగ్గురు మృతి
పారిస్ : ఫ్రాన్స్ నగరం నీస్లో గురువారం జరిగిన ఉగ్ర దాడిలో మహిళ సహా ముగ్గురు మరణించారు. కత్తితో చర్చిలో ప్రవేశించిన ఆగంతకుడు మహిళపై దాడి చేసి ఆమె తలను నరికేశాడని మరో ఇద్దరు ఈ ఘటనలో మరణించారని అధికారులు తెలిపారు. ఇది ఉగ్రవాద చర్యేనని నీస్ మేయర్ క్రిస్టియన్ ఎస్త్రోసి వెల్లడించారు. నగరంలోని నాట్రేడేమ్ చర్చిలో ఈ ఘటన జరిగిందని, దాడికి పాల్పడిన దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. దాడికి తెగబడిన వ్యక్తి ఓ మతానికి సంబంధించి నినాదాలు చేశాడని చెప్పారు. మరణించిన వారిలో ఒకరిని చర్చి వార్డెన్గా భావిస్తున్నామని మేయర్ పేర్కొన్నారు. బాధితులను కిరాతకంగా చంపారని అన్నారు. నిందితుడు పారిపోతుండగా పోలీసులు కాల్పులు జరిపారని ప్రస్తుతం నిందితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని చెప్పారు. కాగా, ఈ దాడిలో ముగ్గురు మరణించారని, పలువురికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఫ్రాన్స్ ఉగ్రవాద వ్యతిరేక ప్రాసిక్యూషన్ విభాగం దర్యాప్తు చేపట్టనుంది. ఫ్రాన్స్లో ఈ తరహా దాడి ఈ నెలలో ఇది రెండవది కావడం గమనార్హం. ఫ్రెంచ్ మిడిల్ స్కూల్ టీచర్ను ఇటీవల చెచెన్యా సంతతికి చెందిన ఓ వ్యక్తి తలనరికి చంపడం కలకలం రేపింది. చదవండి : ఫ్రాన్స్లో టీచర్ తలనరికిన యువకుడు -
సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పుల్వామా జిల్లా పాంపోర్లోని కందిజల్ బ్రిడ్జిపై జమ్ము కశ్మీర్ పోలీసులతో కలిసి విధులు నిర్వహిస్తున్న 110 బెటాలియన్ సీఆర్పీఎఫ్ సిబ్బందిపై ఉగ్రవాదులు సోమవారం కాల్పులతో విరుచుకుపడ్డారు. ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు జవాన్లు గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు. ఓ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా విధినిర్వహణలో ఉన్న సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు ఈ దాడికి తెగబడ్డారు. ఉగ్రదాడిపై పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. చదవండి : ‘ఉగ్ర అడ్డాగా సోషల్ మీడియా’ -
ప్రముఖ వ్యక్తి హత్యకు కుట్ర, పోలీసుల చెక్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఉగ్ర కుట్రను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అడ్డుకున్నారు. పక్కా సమాచారంతో ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) టెర్రరిస్టును అరెస్టు చేశారు. అతన్ని ఐసిస్కు ఉగ్రవాద గ్రూపునకు చెందిన అబు యూసుఫ్ ఖాన్గా పోలీసులు గుర్తించారు. టెర్రరిస్టు నుంచి ఒక గన్, రెండు ఐఈడీ బాంబులను స్వాధీనం చేసుకున్నట్టు ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ప్రమోద్ సింగ్ కుశ్వారా మీడియాతో చెప్పారు. అబు యూసుఫ్ను పట్టుకునే క్రమంలో గత అర్ధరాత్రి దౌలా కువా, కరోల్ బాగ్ వద్ద ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు. ఢిల్లీలో ఓ ప్రముఖ వ్యక్తిని హతమార్చేందుకు అబు యూసుఫ్ నగరానికి వచ్చినట్టు తెలుస్తోందని అన్నారు. తన కుట్రకు సంబంధించి ఉగ్రవాది రెక్కీ కూడా నిర్వహించినట్టు సమాచారం. ఇక అబు యూసుఫ్కు ఢిల్లీలోని కొందరు సహాయసహకారాలు అందిస్తున్నారని వారిని వెతికి పట్టుకునే పనిలో ఉన్నామని డిప్యూటీ కమిషన్ ప్రమోద్ సింగ్ కుశ్వారా వెల్లడించారు. కాగా, అబు యూసుఫ్ స్వస్థలం ఉత్తర్ప్రదేశ్లోని బలరామ్పూర్గా విచారణలో తేలిందని చెప్పారు. యూపీలోని అతని నివాసాలపై దాడులు చేపట్టినట్టు ప్రమోద్ సింగ్ పేర్కొన్నారు. (చదవండి: ఐసిస్ కొత్త లీడరే అమెరికా టార్గెట్: ట్రంప్) -
బారాముల్లా ఉగ్రదాడిలో ఇద్దరు జవాన్లు మృతి
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో సోమవారం ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు సహా ఓ పోలీసు ఉన్నతాధికారి మరణించారు. సీఆర్పీఎఫ్ జవాన్లు తమ వాహనం నుంచి బయటికి దిగుతున్న సమయంలో ఈ దాడి జరిగిందని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు. ఉగ్రదాడిలో గాయపడిన వారిని ఇప్పటికే ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఉగ్రవాద కదలికలపై నిఘా పెట్టామని తెలిపారు. జమ్ము కశ్మీర్లో గత వారంలోనే భద్రతా దళాలపై ఉగ్రవాదులు జరిపిన మూడవ దాడి ఇది. ఆగస్టు 14న శ్రీనగర్ నగర శివార్లలోని నౌగాం వద్ద ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు పోలీసులు అమరులైన సంగతి తెలిసిందే. దాడి అనంతరం ఉగ్రవాదులు పారిపోయారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. అంతకుముందు శ్రీనగర్- బారాముల్లా హైవేలోని హైగాం వద్ద సైనికుల బృందంపై ఉద్రవాదులు కాల్పులు జరపగా, ఓ జవాను తీవ్రంగా గాయపడ్డారు. -
ఉగ్రదాడులపై హెచ్చరించిన యూఎన్
న్యూఢిల్లీ: కేరళ, కర్ణాటకల్లో ఐసిస్ ఉగ్రవాదులు గణనీయమైన సంఖ్యలో ఉన్నట్లు ఐరాస నివేదిక హెచ్చరించింది. భారత ఉపఖండ టెర్రర్ గ్రూపులోని అల్-ఖైదా.. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్లకు చెందిన దాదాపు 150 నుంచి 200 మంది ఉగ్రవాదులను కలిగి ఉందని పేర్కొంది. వీరిలో ఎక్కువ మంది కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో తలదాచుకుంటున్నట్లు తెలిపింది. అల్ఖైదా ఇండియన్ సబ్ కాంటినెంట్ ప్రస్తుత నాయకుడు ఒసామా మహమూద్ తమ మాజీ నాయకుడు అసీమ్ ఉమర్ మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ ప్రాంతాల్లో ప్రతీకార చర్యలకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు యూఎన్ నివేదికలో హెచ్చరించింది. -
కెనడా చరిత్రలోనే దారుణమైన ఘటన
ఓట్టావా : 35 ఏళ్ల క్రితం జూన్ 23న ఎయిర్ ఇండియా విమానం 182పై జరిగిన ఉగ్రదాడి కెనడా చరిత్రలోనే అత్యంత దారుణమైనదని, ఉగ్రవాదుల దుర్మార్గపు చర్యకు ఆ ఘటన నిదర్శనమని ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యానించారు. ఎయిర్ ఇండియా ఫ్లయిట్ 182 ఎంపరర్ కనిష్కలో ఉగ్రవాదులు బాంబు పెట్టిన ఘటన జరిగి 35 సంవత్సరాలు అవుతున్న సందర్బంగా బాధిత కుటుంబాలు ఓ ప్రత్యేక యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోలతో నివాళులు అర్పించాయి. ఈ సందర్భంగా ప్రధాని జస్టిన్ సైతం ఓ వీడియోలు విడుదల చేశారు. ఆ వీడియోలో.. దేశానికి అదో పెద్ద షాకని, అప్పటి సామూహిక భద్రతను ప్రమాదంలో పడేసిందని అన్నారు. కెనడా నుంచి యూకే వెళుతున్న విమానం పేలటంతో 329 మంది అమాయకులు మరణించారని, వారిలో 280 మంది కెనడియన్లు ఉన్నారని అన్నారు.('జగ్మీత్ సింగ్ అంశం నన్ను బాధించింది') కాగా, 1985 జూన్ 23న ఎయిర్ ఇండియా విమానం 182, ఎంపరర్ కనిష్కలో ఖాలిస్తాని ఉగ్రవాదులు బాంబు పెట్టారు. ఈ ఘటనలో 329 మంది మృత్యువాత పడ్డారు. దారుణ సంఘటనకు గుర్తుగా జూన్ 23వ తేదీని ‘‘ నేషనల్ డే ఆఫ్ రిమెంబరెన్స్ ఫర్ విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజమ్ ఇన్ కెనడా’’గా జరుపుకుంటున్నారు. ఆ రోజున బాధిత కుటుంబాలు అంతా ఒక చోట చేరి చనిపోయిన తమ వారికి నివాళులు అర్పిస్తుంటారు. అయితే ఈ సంవత్సరం కోవిడ్-19 పరిస్థితుల కారణంగా సామూహిక సమావేశాలపై ఆంక్షలు ఉండటంతో యూట్యూబ్ ఛానల్ ద్వారా నివాళులు అర్పించారు. కొంతమంది మాత్రమే అక్కడి స్మారక స్థలాల వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు. -
ఉగ్ర ముప్పు.. రాజధానిలో హై అలర్ట్!
న్యూఢిల్లీ: దేశ రాజధానికి ఉగ్ర ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో అక్కడ హైలర్ట్ విధించినట్లు సమాచారం. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఉగ్రవాదులు ఢిల్లీలో ప్రవేశించే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన పోలీసు వర్గాలు మార్కెట్, ఆస్పత్రి ఏరియాల్లో భద్రత కట్టుదిట్టం చేశాయి. క్రైం ప్రత్యేక విభాగంతో పాటు అన్ని జిల్లాల పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.(కశ్మీర్లో నలుగురు ఉగ్రవాదులు హతం) కాగా గల్వాన్ లోయ ప్రాంతంలో ఘర్షణ వాతావరణాన్ని ఉగ్రవాదులు తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందని ఇంటలెజిన్స్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు నలుగురు ఉగ్రవాదులు ఢిల్లీలో ప్రవేశించే ఆస్కారం ఉందని హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్, కుల్గామ్ జిల్లాల్లో జరిగిన రెండు ఎన్కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే. వీరంతా హిజ్బుల్ ముజాహిదీన్, ఐసిస్లకు చెందిన వారు.(కరోనా పేరిట సైబర్ నేరాలకు ఆస్కారం) -
దావూద్ సాయంతో భారీ ఉగ్ర దాడికి పాక్ స్కెచ్
సాక్షి, న్యూఢిల్లీ : దేశమంతా కరోనా మహమ్మారిపై పోరులో నిమగ్నమగా ఇదే అదనుగా పాక్ భారీ కుట్రలకు తెరలేపుతోంది. సరిహద్దుల్లో ఉగ్ర పొగపెడుతూనే భారీ దాడులతో తీవ్ర అలజడి రేపేందుకు స్కెచ్ వేస్తోంది. గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీం సహకారంతో జమ్ము కశ్మీర్ సహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉగ్రదాడులకు పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా కుట్ర పన్నింది. దావూద్తో లష్కరే ఉగ్రమూక చేతులు కలిపిందని ఓ వార్తాసంస్థ వెల్లడించింది. పాక్ ఐఎస్ఐ బృందంతో కలిసి లష్కరే నేతలతో సంప్రదింపులు జరిపేందుకు ఇస్లామాబాద్లోని తన ఫాంహౌస్ నుంచి దావూద్ ఆదివారం బయలుదేరి వెళ్లారని తెలిపింది. (కరోనా క్యాబ్లు వచ్చేశాయ్!) కోవిడ్-19 మహమ్మారితో భారత్ పోరాడుతున్న క్రమంలో దేశంలో దొంగదెబ్బ తీయాలని ఐఎస్ఐ ప్రణాళికలు రూపొందిస్తోందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు పవిత్ర రంజాన్ మాసంలో సోమవారం పదకొండవ రోజున జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులు భారీ దాడికి తెగబడవచ్చన్న నిఘా వర్గాల సమాచారంతో కశ్మీర్లోయలో భద్రతను కట్టుదిట్టం చేశారు. గతంలో ఇదే రోజున పలుమార్లు ఉగ్రవాదులు భద్రతా దళాల కీలక స్ధావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేపట్టారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయని అధికారులు వెల్లడించారు. కాగా హంద్వారాలో జవాన్లపై దాడికి తమదే బాధ్యతని ప్రకటించిన నూతన ఉగ్ర సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) సైతం మరిన్ని దాడులతో విరుచుకుపడవచ్చని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. చదవండి : కరోనా కాలంలో పాక్ కుట్రలు -
కాబూల్ కేంద్రంగా మరో కుట్రకు జైషే స్కెచ్
కాబూల్ : భారత్లో భారీ దాడులతో తీవ్ర అలజడి రేపేందుకు ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ పకడ్బందీ ప్రణాళికలు రచిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ యూనిట్లలో 400 మంది జైషే ఉగ్రవాదులను మోహరించింది. వారిని భారత్లో ఉగ్ర దాడులతో హోరెత్తించేందుకు కశ్మీర్ లోయకు పంపేందుకు సన్నాహాలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా ఏప్రిల్ 12న చేపట్టిన ఆపరేషన్లో ఆప్ఘన్ దళాలు ఓ ఉగ్ర శిబిరంలో ఈ తరహా కార్యకలాపాలను గుర్తించారని సమాచారం. ఈ ఆపరేషన్లో అరెస్టయిన ఉగ్రవాదులను విచారించడంతో ఆప్ఘన్లో దాదాపు ఈ తరహా క్యాంపులు ఆరు వరకూ ఉండవచ్చని భారత భద్రతా, నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఈ శిబిరాల్లో జైషే మహ్మద్ 400 మంది ఉగ్రమూకను సంసిద్ధంగా ఉంచిందని ఢిల్లీ, కాబూల్లో ఉగ్రవాద కార్యకలాపాల వ్యతిరేక మిషన్ అధికారులు పేర్కొన్నారు. ఖోస్థ నుంచి జలాలాబాద్ వరకూ విస్తరించిన ప్రాంతాలతో పాటు కాందహార్ ప్రావిన్స్లోని పాక్ సరిహద్దుల్లోని తాలిబాన్ యూనిట్లలో జైషే క్యాడర్ను మోహరించారని కాబూల్లోని ఉగ్రవాద వ్యతిరేక దళానికి చెందిన అధికారి వెల్లడించారు. మరోవైపు ఐఎస్ఐ ప్రోత్సాహంతో జైషే మహ్మద్తో పాటు లష్కరే ఉగ్రవాదులను కూడా ఈ శిబిరాల్లోకి పంపారని అధికారులు చెబుతున్నారు. చదవండి : పుల్వామా ఉగ్రదాడి : తండ్రికూతుళ్ల అరెస్ట్ -
మహమ్మారి మాటున భారీ దాడికి పాక్ స్కెచ్..
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సమయాన దొంగదెబ్బ తీసేందుకు భారత్లో భారీ దాడికి పాకిస్తాన్ ప్లాన్ చేస్తోంది. సముద్ర మార్గం ద్వారా పాక్కు చెందిన అండర్వరల్డ్, స్మగ్లింగ్ మాఫియా ముఠా సాయంతో భారత్లో ఉగ్ర దాడికి పాకిస్తాన్ ప్రేరేపిస్తోందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. పశ్చిమ తీరాన్ని లక్ష్యంగా చేసుకుని పాక్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ ఈ కుట్రకు తెరలేపినట్టు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. సింధ్ ప్రావిన్స్లోని ఓ పోర్టు ప్రాంతంలో పాక్ అండర్వరల్డ్, స్మగ్లింగ్ గ్రూప్ల కోసం ఐఎస్ఐ ఓ వ్యవస్థను ఏర్పాటు చేసిందని నిఘా వర్గాలు పసిగట్టాయి. వారికి వనరులు సమకూర్చడంతో పాటు ప్రతిఘటన ఎదురైతే ఎలా ఎదుర్కోవాలో కూడా పాక్ ఏజెన్సీలు శిక్షణ ఇచ్చాయని తెలిపింది. పాకిస్తాన్కు చెందిన బోట్ల ద్వారా డ్రగ్స్ రవాణా సాగుతున్నదని, వీటిలో కొన్ని సందర్భాల్లో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని తరలిస్తున్నారని భారత నిఘా వర్గాలు గుర్తించాయి. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కలవరపరుస్తున్నా భారత్పై దాడులకు పాక్ తన వ్యూహాలకు పదునుపెడుతూనే ఉందని వెల్లడించాయి. వాస్తవాధీన రేఖ వెంబడి పాక్ యదేచ్ఛగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. చదవండి : భారత్లోకి కరోనా ఉగ్రవాదులు -
భారీ ఉగ్రదాడి.. 24 మంది మృతి
వాగాడౌగా : ఆఫ్రికాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బుర్కినా ఫాసోలో ఓ చర్చిపై దుండుగులు కాల్పులకు తెగబడ్డారు. చర్చిలో ప్రార్థనలు చేసుకుంటున్న వారిని లక్ష్యం చేసుకుని ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఫాస్టర్తో సహా.. 24 మంది అమాయకులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికిపైగా పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు మరికొంత మందిని దుండుగులు అపహరించుకుని పోయారని తెలుస్తోంది. బుర్కినా ఫాసోపై ఇటీవల కాలంలో ఉగ్రవాదులు పెద్ద ఎత్తున దాడులకు దిగుతున్నారు. కాగా గడిచిన నాలుగేళ్లగా ఈ ప్రాంతంలో జరిగిన అనేక దాడుల్లో దాదాపు 600కుపైగా పౌరులు మృతి చెందారు. -
భారీ విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర
సాక్షి, న్యూఢిల్లీ : కశ్మీర్లోకి చొరబడేందుకు యత్నించి ఎన్కౌంటర్లో మృతిచెందిన ఉగ్రవాదులు భారత్లో భారీ దాడికి కుట్రపన్నారని పోలీసులు పేర్కొన్నారు. దాడుల కోసం పెద్దమొత్తంలో బాంబులు, మార్ఫిన్ ఇంజెక్షన్లు, ఎల్ఈడీలు, బుల్లెట్ జాకెట్లు పాకిస్తాన్ నుంచి తీసుకువచ్చారని చెప్పారు. రహదారి వెంబడి దాదాపు 300 కిలోమీటర్ల మేర ఉన్న భద్రతా దళాల శిబిరాలపై దాడి చేయడానికి ఉగ్రవాదులు ప్రణాళికలు వేశారని..వారి కుట్రను గట్టిగా తిప్పి కొట్టామని పేర్కొన్నారు. కశ్మీర్లోకి చొరబడేందుకు యత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు శుక్రవారం మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం జమ్మూ - శ్రీనగర్ జాతీయ రహదారిపై బన్నాటోల్ ప్లాజా వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా ముగ్గురు ఉగ్రవాదులు ఓ వ్యానులో వచ్చి కాల్పులు జరిపారు. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తోన్న పోలీస్ కానిస్టేబుల్ గాయపడ్డారు. ఉగ్రవాదుల కాల్పులతో అప్రమత్తమైన సీఆర్పీఎఫ్ జవాన్లు తిరిగి ఎదురుకాల్పులకు దిగడంతో.. ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వ్యాను డ్రైవర్ సమీన్ దార్ను అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదుల నుంచి ఏకే 47రైఫిల్, గ్రెనెడ్లను, రూ.32,000లను స్వాధీనం చేసుకున్నారు. ఆ ముగ్గురు ఉగ్రవాదులుద జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినవారని, సముద్రంగా గుండా భారత్లోకి ప్రవేశించారని పోలీసులు తెలిపారు. ఆర్టికల్ 370రద్దు తర్వాత తొలిసారిగా ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చామని పోలీసులు పేర్కొన్నారు. -
అలియా భట్ తల్లి వివాదాస్పద వ్యాఖ్యలు..
ముంబై : పార్లమెంట్పై దాడి కేసులో దోషిగా తేలిన అఫ్జల్ గురూను ఉరితీయడంపై బాలీవుడ్ నటి అలియా భట్ తల్లి సోనీ రజ్దాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అఫ్జల్ గురూను బలిపశువును చేశారని ఆమె వ్యాఖ్యానించారు. న్యాయం ఎలా అపహాస్యమవుతుందనేందుకు ఇదే ఉదాహరణని అంటూ అఫ్జల్ గురూ అమాయాకుడైతే పోయిన అతడి ప్రాణాన్ని ఎవరు తీసుకురాగలరని ప్రశ్నించారు. అందుకే మరణ శిక్షను అంత తేలికగా విధించరాదని, ఈ కారణంచేతే అఫ్జల్ గురూను ఎందుకు బలిపశువును చేశారనే దానిపై విచారణ చేపట్టాలని ఆమె ట్వీట్ చేశారు. కశ్మీర్ నుంచి ఢిల్లీకి ఓ ఉగ్రవాదిని తీసుకురావాలని జమ్ము కశ్మీర్ డీజీపీ దేవీందర్ సింగ్ తనపై ఒత్తిడి తెచ్చారని అఫ్జల్ గురూ రాసిన లేఖలో పేర్కొన్నాడని, ఆ ఉగ్రవాదే తర్వాత పార్లమెంట్పై దాడికి తెగబడ్డాడని అదే లేఖలో పొందుపరిచాడని రజ్దాన్ పేర్కొన్నారు. ఈ లేఖ నేపథ్యంలో డీజీపీపై ఎందుకు దర్యాప్తు చేపట్టలేదనేది నిగ్గు తేల్చాలని కోరారు. అఫ్జల్ వంటి వారు ఎలాంటి వేధింపులకు గురయ్యారు..నేరస్తుల కోసం ఉగ్ర కార్యకలాపాలు చేపట్టవలసివచ్చిందో విచారణ చేపట్టిన అనంతరమే మరణ శిక్ష విధించాలని అన్నారు. కాగా ప్రస్తుతం జమ్ము కశ్మీర్ పోలీసుల కస్టడీలో ఉన్న దేవీందర్ సింగ్ను ఎన్ఐఏ త్వరలో విచారించనుందని భావిస్తున్నారు. చదవండి : ‘ఆమె నా మరదలైతే.. చాలా సంతోషిస్తాను’ -
బోర్డర్లో పాకిస్తాన్ కుయుక్తులు..
సాక్షి, న్యూఢిల్లీ : తన భూభాగంలో ఉగ్రవాదుల శిబిరాలను కాపాడేందుకు పాక్ సైన్యం, ఐఎస్ఐ సరిహద్దుల్లో హైటెక్ కెమరాలు, సిగ్నల్ టవర్స్ను ఏర్పాటు చేశాయని నిఘా వర్గాలకు సమాచారం అందింది. వాస్తవాధీన రేఖ వెంబడి గ్రామాల్లో పలు ఐఈడీ పేలుళ్లకు ఉగ్రవాదులు సన్నద్ధమయ్యారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. తమ ఉగ్ర శిబిరాలపై భారత్ దాడులు చేస్తే వాటిని కాపాడుకునే క్రమంలో పాక్ సైన్యం ఏర్పాట్లు చేస్తోందని సరిహద్దుల్లో కెమెరాలు, సిగ్నల్ టవర్స్తో పహారా కాస్తోందని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఎల్ఓసీ వెంబడి పాక్ సైన్యం, ఐఎస్ఐ ఇప్పటికే 18 సిగ్నల్ టవర్లను ఏర్పాటు చేశాయి. కెమరాలు, సిగ్నల్ టవర్స్ను ఏర్పాటు చేసిన అనంతరం ఈనెల 8న పీఓకే బ్రిగేడియర్ అసీం ఖాన్ నేతృత్వంలో కోట్లీలో జరిగిన భేటీలో వాస్తవాధీన రేఖ వెంబడి జనవరి 26లోగా పలు ఐఈడీ పేలుళ్లకు పాల్పడాలనే నిర్ణయం తీసుకున్నారని భారత నిఘా వర్గాలకు సమాచారం అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. -
సీఆర్పీఎఫ్ జవాన్లపై గ్రెనేడ్లతో ఉగ్రదాడి
శ్రీనగర్ : శ్రీనగర్లోని కవ్దారా ప్రాంతంలో శనివారం ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సీఆర్పీఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకొని వారు ప్రయాణిస్తున్న పెట్రోలింగ్ వాహనాలపై గ్రెనేడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు తీవ్రంగా గాయపడగా వారు ప్రయాణిస్తున్న వాహనాలు పూర్తిగా ద్వంసమయ్యాయి. అయితే ఈ దాడులు సీఆర్పీఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకొని గ్రెనేడ్లతో దాడులకు పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా ఘటన జరిగిన ప్రాంతాన్ని అధికారులు తమ ఆధీనంలోకి తీసుకొని ఉగ్రవాదులు కదలికలను గుర్తించేందుకు పరిశోధన నిర్వహిస్తున్నారు. అయితే ఈ దాడిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పంజాబ్లో ఉగ్ర దాడికి భారీ స్కెచ్..
సాక్షి, న్యూఢిల్లీ : భారత్లో భారీ ఉగ్రదాడులకు వ్యూహం రూపొందిస్తూ పాకిస్తాన్లో ఇటీవల ఖలిస్తాన్ ఉగ్రమూకల భేటీ జరిగిందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఖలిస్తాన్ ఉగ్రవాదులు పంజాబ్లో ఉగ్ర దాడులు చేపట్టేందుకు పాకిస్తాన్ నుంచి ఆయుధాలను సమీకరిస్తున్నారని తెలిపాయి. పంజాబ్లోకి భారీగా ఆయుధాలను తరలించేందుకు ఉగ్ర సంస్థలు బబ్బర్ ఖల్సా, ఖలిస్తాన్ జిందాబాద్లు పాక్ ఉగ్రవాదులతో టచ్లో ఉన్నట్టు సమాచారం. ఖలిస్తాన్ను కోరే ఉగ్ర మూకల కార్యకలాపాలు ఇటీవల రాజస్ధాన్, హరియాణాల్లోనూ వెలుగులోకి వచ్చాయని నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. ఖలిస్తాన్కు మద్దతిచ్చే ఉగ్రవాదుల కార్యకలాపాలను నిశితంగా పర్యవేక్షించాలని ప్రభుత్వం ఇప్పటికే సరిహద్దు భద్రతా దళం, ఎన్ఐఏ, రా, ఐబీ వర్గాలను ఆదేశించింది. మరోవైపు పంజాబ్లోకి ఆయుధాలు తరలిరాకుండా పంజాబ్ సరిహద్దుల వద్ద భద్రతా దళాలు నిఘాను ముమ్మరం చేశాయి. భారత్లో ఉగ్రదాడులు చేపట్టేందుకు ఖలిస్తాన్ను కాంక్షించే ఉగ్రవాదులు చేపడుతున్న శిక్షణా శిబిరాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా రాబట్టేందుకు నిఘా వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు యూపీలోని అయోధ్యలో ఉగ్రదాడికి జైషే మహ్మద్ యోచిస్తోందని నిఘా వర్గాలు బుధవారం వెల్లడించాయి. అయోధ్యలో ఉగ్రదాడికి జైషే మహ్మద్ సన్నాహాలు చేస్తున్నట్టు ఉగ్రసంస్థ కమ్యూనికేషన్ కోసం వాడుతున్న చాటింగ్ యాప్ టెలిగ్రాం ద్వారా నిఘా వర్గాలు పసిగట్టాయి. -
వారి కుటుంబాల్లో వేదనే మిగిలింది
వరుస ప్రమాదాలు ఈ ఏడాది ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. గతేడాదితో పోల్చుకుంటే 2019లో ప్రమాదాల సంఖ్య భారీగా పెరిగి దేశవ్యాప్తంగా వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. పుల్వామా దాడి యావత్ భారతాన్ని శోక సంద్రంలో ముంచింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అగ్ని ప్రమాదాల్లో పదుల సంఖ్యలో అభాగ్యులు ఆహూతయ్యారు. గోదావరి బోటు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీరని విషాదన్ని మిగిల్చింది. ఇక రోడ్డు ప్రమాదాలకు కేరాఫ్గా నిలిచిన నల్గొండ రహదారి ప్రజల రక్తం తాగేసింది. ఏడాది ముగుస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న ప్రమాదాలను ఓ సారి పరిశీలిద్దాం..! అయ్యప్ప దర్శనం కోసం వెళ్లి.. తమిళనాడులో జనవరి 6న ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుదుకోట్టై జిల్లా తిరుమయం వద్ద అయ్యప్ప స్వాములు ప్రయాణిస్తున్న వ్యాన్, మరో కంటెయినర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన 10 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. శబరిమలై అయ్యప్పను దర్శించి, రామేశ్వరంలో పవిత్ర స్నానాలు ముగించుకుని తిరుగు పయనంలో ఉన్న ఈ భక్తులు ప్రయాణిస్తున్న వ్యానును ఎదురుగా, అతివేగంగా దూసుకొచ్చిన ట్రాలీ లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి మంటల్లో ఎగ్జిబిషన్ హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జనవరి 30 రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో రేగిన నిప్పురవ్వలు.. చూస్తుండగానే దావానలంలా మారి క్షణాల్లో అక్కడున్న400 స్టాళ్లను బూడిద చేశాయి.ఈ ఘటన జరిగిన సందర్భంలో సుమారు యాభైవేలకు పైగా సందర్శకులు ఎగ్జిబిషన్లో వివిధ స్టాళ్లలో ఉన్నప్పటికీ.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఆస్తి నష్టం మాత్రం రూ. వందల కోట్లలో జరిగింది. పూర్తి వార్తకోసం క్లిక్ చేయండి పట్టాలు తప్పిన రైలు.. ఏడుగురు మృతి బీహార్లో ఫిబ్రవరి 3న ఘోర రైలు ప్రమాదం జరిగింది. వైశాలి జిల్లాలో సీమాంచల్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో ఏడుగురు మృతి చెందారు. దాదాపుగా 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. పాట్నాకు 30కి.మీ దూరంలో ఫిబ్రవరి 3న ఈ ప్రమాదం జరిగింది. రైలు ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు రైల్వే శాఖ రూ.5 లక్షల ఎక్స్గ్రేషియో ప్రకటించింది. అలాగే గాయపడిన వారికి రూ. లక్ష ఆర్థిక సాయం అందజేసింది. నకిలీ మద్యానికి 34 మంది బలి (ఫిబ్రవరి 8) : ఉత్తరాఖండ్, ఉత్తర్ప్రదేశ్ రాష్ర్టాల్లోని ఇరుగుపొరుగు జిల్లాల పరిధిలో కల్తీ మద్యం తాగి 34 మంది మృతి చెందారు. ఉత్తరాఖండ్లో 16 మంది, ఉత్తర్ప్రదేశ్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్ జిల్లా ఝాబ్రెరా ప్రాంతం బాలుపూర్ గ్రామస్తులు ఉత్తర్ప్రదేశ్లోని సహారన్ పూర్ జిల్లాలో మరణించిన ఒక వ్యక్తి అంత్యక్రియలకు ఫిబ్రవరి 7న వెళ్లారు. ఆతర్వాత కల్తీ మద్యం తాగారు. ఈ ఘటనలో 16మంది మృతి చెందారు. హోటల్లో మంటలు.. 17 మృతి రాజధాని ఢిల్లీలోని ఓ హోటల్లో ఫిబ్రవరి 12న ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్న ఈ దుర్ఘటనలో 17 మంది చనిపోయారు. అందులో ఇద్దరు ప్రాణాలు కాపాడుకునేందుకు హోటల్ భవంతి నుంచి దూకి మృతిచెందారు. మృతుల్లో ఓ చిన్నారితో పాటు విశాఖపట్నం హెచ్పీసీఎల్ రిఫైనరీ ఉద్యోగి కూడా ఉన్నారు. కరోల్బాగ్లోని హోటల్ అర్పిత్ ప్యాలెస్లో ఈ ప్రమాదం జరిగింది. ఉలిక్కిపడ్డ భారతావని (ఫిబ్రవరి 14-26) : జమ్మూకశ్మీర్లో భద్రతాబలగాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పుల్వామా జిల్లా అవంతిపొరా పట్టణం సమీపంలోని లెత్పొరా వద్ద సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రవాదులు ఫిబ్రవరి14న ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఓ స్కార్పియో ఎస్యూవీలో దాదాపు 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) నింపుకున్న ఓ ఆత్మాహుతి దళసభ్యుడు జవాన్ల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకున్నాడు. తన కారుతో కాన్వాయ్లోని ఓ బస్ను ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి దెబ్బకు దెబ్బ పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. 40 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ను చావు దెబ్బతీసింది. . 2016 నాటి సర్జికల్ దాడుల్ని గుర్తుకు తెస్తూ, పాక్ భూభాగంలోని బాలాకోట్లో జైషే నిర్వహిస్తున్న అతిపెద్ద శిక్షణా శిబిరాన్ని భారత వైమానిక దళం ధ్వంసం చేసింది. బాంబుల్ని జారవిడిచి సుమారు 350 మంది ఉగ్రవాదులు, సీనియర్ కమాండర్లు, వారి శిక్షకుల్ని మట్టుపెట్టింది. నెత్తురోడిన నల్లగొండ రహదారి నల్లగొండ జిల్లాలో రహదారి నెత్తురోడింది. మార్చి 6న హైదరాబాద్ నుంచి దేవరకొండ వైపు వెళ్తున్న టాటా ఏసీ మ్యాజిక్ ఎక్స్ప్రెస్ వాహనం అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. బస్సు కూడా వేగంగా ఉండటంతో టాటాఏసీ వాహనాన్ని 20అడుగుల దూరం వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. విషాదం మిగిల్చిన విమానం ఇథియోపియాలో మార్చి10న జరిగిన ప్రమాదంలో విమానం కూలిపోయింది. ఆ దేశ ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానం..బయలుదేరిన కాసేపటికే కుప్పకూలింది. 149 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది.. మొత్తం 157 మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో కెన్యా, ఇథియోపియా, కెనడా, చైనా, అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్, ఈజిప్టు, నెదర్లాండ్, స్లొవేకియా, భారత్కు చెందినవారు ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి పాదాచారులను మింగిన వంతెన ముంబైలో ఘోర ప్రమాదం సంభవించింది. ఛత్రపతి శివాజీ టెర్మినస్(సీఎస్టీ) నుంచి అంజుమన్ కాలేజీ, టైమ్స్ ఆప్ ఇండియా భవనంవైపు వెళ్లే పాదచారుల వంతెనలో కొంతభాగం మార్చి 12న రాత్రి కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలుసహా ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 31 మంది తీవ్రంగా గాయపడ్డారు. కసబ్ బ్రిడ్జిగా పిలిచే ఈ వంతెనపై పాదచారులు వెళుతుండగా వంతెనలో కొంతభాగం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో పలువురు బ్రిడ్జిపై నుంచి కిందపడ్డారు. 2008 ముంబై ఉగ్రదాడుల సందర్భంగా ఉగ్రవాది కసబ్ ఈ బ్రిడ్జిపై వెళుతూ సీసీటీవీ కెమెరాలకు చిక్కడంతో ఆ వంతెనకి కసబ్ బ్రిడ్జి అనేపేరు స్థిరపడిపోయింది. ఛత్తీస్లో మావోల ఘాతుకం (ఏప్రిల్ 9) : ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు రెచ్చి పోయారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దంతెవాడ బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవికి చెందిన కాన్వాయ్ లక్ష్యంగా ఐఈడీ పేల్చారు. వెంటనే చుట్టుముట్టి కాల్పులు జరిపారు. ఈ దుర్భటనలో ఎమ్మెల్యే మాండవి(40)తో పాటు నలుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి మట్టిదిబ్బ కూలి 10 మంది మృతి (ఏప్రిల్ 9) : నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేర్ శివార్లో మట్టిదిబ్బ కూలి 10 మంది మృతి చెందారు. వీరంతా ఉపాధి హామీ కూలీలు. ఎండ ఎక్కువ ఉండడంతో నీళ్లు తాగేందుకు గుట్ట నీడ కిందికి వెళ్లారు. అదే సమయంలో ఓ చిన్న మట్టిపెళ్ల బోయిని మణెమ్మ అనే కూలీ మీద పడింది. వెంటనే తేరుకున్న ఆమె గుట్ట కూలేటట్టు ఉందని మిగతా కూలీలను అప్రమత్తం చేస్తుండగానే.. ప్రమాదం ఉప్పెనలా వచ్చింది. ఒక్కసారిగా మట్టిదిబ్బ కూలడంతో పది మంది మట్టికింద సమాధి అయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయడం రాములవారి కల్యాణానికి వెళ్లి.. (ఏప్రిల్ 14) : సూర్యాపేట జిల్లా కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని ఆటో ఢికొట్టి ఏడుగురు దుర్మరణం చెందారు. కోదాడ పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ్మర సీతారామ దేవాలయంలో ప్రతి ఏటా జరిగే శ్రీరామనవమి వేడుకలకు వెళ్లి వస్తున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగింది. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగింది. అకాల వర్షాలకు 53 మంది బలి రాజస్తాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలనే భారీ అకాల వర్షాలు కుదిపేశాయి. ఏప్రిల్ 16న కురిసిన భారీ వర్షాలకు నాలుగు రాష్ట్రాలతో కలిపి 53 మంది మరణించారు. వర్షం కారణంగా అత్యధికంగా రాజస్తాన్లో 25 మంది, మధ్యప్రదేశ్లో 15 మంది, గుజజరాత్లో 10 మంది, మహారాష్ట్రలో ముగ్గురు చనిపోయారు. ఈస్టర్ ప్రార్థనలపై ఉగ్రదాడులు.. 215 మంది మృతి ఈస్టర్ పండుగరోజు(ఏప్రిల్ 21) శ్రీలంకలో ఉగ్రవాదులు దాడి చేశారు. రాజధాని కొలంబోతోపాటు నెగొంబో, బట్టికలోవా పట్టణాల్లో బాంబుల మోత మోగించారు. ఈ ప్రమాదంతో 215మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 500మందికితీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు భారతీయులు సహా 33మంది విదేశీయులు మృతి చెందారు. ఇదే నెల 27న మరోసారి ఉగ్రవాదు రెచ్చి పోయారు. శ్రీలంక భద్రతాబలగాలపై కాల్పులు జరిపి తమనుతాము పేల్చేసుకున్నారు. ఈ ఘటనలో ఆత్మహుతి బాంబర్లతో సహా 15మంది మృతి చెందారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి రెచ్చిపోయిన మావోలు.. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్తులు విసిరిన పంజాలో 15 మంది పోలీసులు మృతిచెందారు. కూబింగ్కు బయలుదేరిన పోలీసుల వాహనం లక్ష్యంగా శక్తిమంతమైన ఐఈడీ మందుపాతరను పేల్చారు. మే1న జరిగిన ఈ దుర్ఘటనలో మహారాష్ట్ర పోలీసు విభాగం క్విక్రెస్పాన్స్ టీం యూనిట్కు చెందిన 15 మంది కమాండోలతో పాటు ఓ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. పేలుడు ధాటికి పోలీసుల వాహనం తునాతునకలైంది. కాగా 2018 ఏప్రిల్లో క్యూఆర్టీ కమాండోలు ఓ ఆపరేషన్లో భాగంగా 40 మంది మావోయిస్టులను హతమార్చారు. ఇందుకు ప్రతిగానే మావోలు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. విషాదం మిగిల్చిన పెళ్లి చూపులు కర్నూల్ జిల్లా వెల్దుర్తి వద్ద మే11న జరిగిన ఘోర ప్రమాదంలో 16 మంది దుర్మరణం పాలయ్యారు. వేగంగా వచ్చిన బస్సు ఎదురుగా వచ్చిన బైకును తప్పించబోయి అవతలివైపు వెళ్తున్న తుఫాన్ వాహనాన్ని ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన బంధువులు. ఓ పెళ్లి సంబంధం కుదుర్చుకొని తిరిగివస్తుండగా ఈ ఘటన చోటుచేసకుంది. మృతులంతా 25-40 ఏళ్లలోపే వారే. 15 మంది దుర్మరణం మహారాష్ట్రలోని పుణెలో గోడకూలి 15 మంది దుర్మరణం పాలయ్యారు. కుంద్వా ప్రాంతంలోని బడాతలావ్ మసీదు సమీపంలో అపార్ట్మెంట్ నిర్మాణ పనులు జరుగుతుండగా.. ఎడతెరపి లేని కుండపోత వర్షాలకు నేల కుంగడంతో దాదాపు 22 అడుగుల రక్షణ గోడ కూలి షెడ్లపై పడింది. అక్కడే కార్లు పార్క్ చేయడంతో తీవ్రత మరింత పెరిగింది. అక్కడే నిద్రిస్తున్న 15 మంది కార్మికులు సంఘటనా స్థలంలోనే మృతిచెందారు. కార్మికుంతా బిహార్ నుంచి వలస వచ్చినవారే. జూన్ 31న ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన బస్సు.. జమ్మూకాశ్మీర్లో జులై1న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. కేశవాన్ నుంచి కిష్టావర్ ప్రాంతానికి బయలుదేరిన మినీ బస్సు సిర్గ్వారి ప్రాంతంలో బస్సు మలుపు తీసుకుంటుండగా అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. అతివేగంతో పాటు సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడం వల్ల బస్సు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి అగ్నికి ఆహుతి పంజాబ్లోని గురుదాస్పూర్ జిల్లాలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 23 మంది మృతిచెందగా, మరో 27 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. బటాలా ప్రాంతంలో ఓ టపాసుల ఫ్యాక్టరీలో సెప్టెంబర్ 4న భారీ పేలుడు సంభవించింది. బటాలా-జలంధర్ రహదారిలోని హన్సాలీ పుల్ వద్ద ఉన్న రెండస్తుల ఫైర్క్రాకర్ ఫ్యాక్టరీలో జరిగిన ఈ దుర్ఘటనలో ఫ్యాక్టరీ భవంతి పేకమేడలా కూలిపోయింది. నానక్ దేవ్ పెండ్లి మహోత్సవంతో పాటు పలు పండుగల నేపథ్యంలో కర్మాగారంలో కొన్ని రోజులుగా టపాసులు నిల్వ చేశారు. భారీగా నిల్వచేసిన పటాసులు పేలడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి. పేలుడు ధాటికి చుట్టుపక్కల నివాసాలకు కూడా మంటలు వ్యాపించాయి. విషాదం మిగిల్చిన విహార యాత్ర తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని కచ్చులూరు వద్ద సెప్టెంబర్ 15న పెను విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో 77 మందితో ప్రయాణిస్తున్న బోటు నదిలో బోల్తా పడడంతో 51 మంది మరణించారు. మరో 26 మందిని స్థానికులు రక్షించారు. ధర్మాడి సత్యం బృందం రంగంలోకి దిగి 38 రోజుల తీవ్రంగా శ్రమించి బోటును, బోటులో చిక్కుకున్న మృతదేహాలను వెలికితీసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి పుణ్యక్షేత్రాలకు వెళ్లి.. తూర్పుగోదావరి జిల్లా మన్యంలో అక్టోబర్15 న జరిగిన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. మారేడుపల్లి- చింతూరు ఘాట్రోడ్లో వాల్మీకి కొండ వద్ద వీరు ప్రయాణిస్తున్న టెంపో వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. రెండు ప్రైవేట్ టెంపో ట్రావెల్స్ వాహనాల్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన 24 మంది తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు బయలుదేరారు. భద్రాచలం నుంచి అన్నవరం దైవ దర్శనానికి వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న టెంపో వాహనం ప్రమాదకర మలుపులో అదుపుతప్పి బోల్తాపడింది. 25 అడుగుల ఎత్తు నుంచి వ్యాన్ కిందపడడంతో ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు. భారీ పేలుడు.. మృతదేహాలు ఛిద్రం మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో అక్టోబర్31 న భారీ పేలుడు సంభవించింది. శిరపూర్ సమీపంలోని వాఘూడీ గ్రామ సమీపంలో ఉన్న రుమిత్ కెమికల్ కంపెనీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 15 మంది చనిపోగా, 65 మంది గాయపడ్డారు. పేలుడు శబ్దాలు సుమారు 10 కిలోమీటర్ల దూరం వినిపించాయి. పేలుడు తీవ్రతకు కొన్ని మృతదేహాలు కూడా ఛిద్రం అయ్యాయి. భారీ అగ్ని ప్రమాదం దేశ రాజధాని ఢిల్లీలోని అనాజ్మండీలో ఉన్న ఫాక్టరీలో డిసెంబర్ 8న జరిగిన అగ్నిప్రమాదంలో 43 మంది వలస కూలీలు ప్రాణాలు కోల్పోయారు. 25 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఏం జరుగుతుందో తెలిసేలోపే జరగరాని నష్టం జరిగింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో భవనం రెండో అంతస్తు నుంచి మంటలు చెలరేగి దట్టమైన పొగ కమ్ముకుంది. పెద్ద ఎత్తున ప్లాస్టిక్ వస్తువులు నిల్ల ఉండడంతో మంటలు వెనువెంటనే వ్యాపించాయి. - శెట్టె అంజి, సాక్షి వెబ్ డెస్క్ -
మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు
-
శ్రీనగర్లో రెచ్చిపోయిన ఉగ్రమూక..
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదుల ఆగడాలు కొనసాగుతున్నాయి. రెండు వారాల వ్యవధిలో రెండవ సారి ఉగ్రమూకలు గ్రనేడ్ దాడితో విరుచుకుపడ్డాయి. శ్రీనగర్లోని మౌలానా ఆజాద్ రోడ్లోని మార్కెట్లో సోమవారం మధ్యాహ్నం ఉగ్రవాదులు గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు. గ్రనేడ్ దాడిలో 15 మందికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. కాగా గతనెల 28న ఉత్తర కశ్మీర్లోని సొపోర్లో ఉగ్రవాదుల గ్రనేడ్ దాడిలో 19 మంది గాయపడిన సంగతి తెలిసిందే. కశ్మీర్లో బ్రిటన్ ఎంపీల పర్యటనకు ఒకరోజు ముందు సొపోర్లోని హోటల్ ప్లాజాకు సమీపంలోని బస్టాండ్ వద్ద ఉగ్రమూకలు ఈ భీకర దాడికి పాల్పడ్డాయి. పీఓకేలోని ఉగ్ర శిబిరాలను భారత్ ధ్వంసం చేస్తుండటంతో దిక్కుతోచని పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కశ్మీర్లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని సైన్యం పేర్కొంటోంది. -
భారీ ఉగ్ర కుట్ర భగ్నం
శ్రీనగర్ : ఉగ్రవాదులు భారీ ఉగ్ర దాడికి రూపొందించిన కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. జమ్ము బస్టాండ్ సమీపంలో పార్క్ చేసిన బస్ నుంచి భద్రతా దళాలు మంగళవారం భారీ మొత్తంలో ఆర్డీఎక్స్ను స్వాధీనం చేసుకోవడంతో పెనుముప్పు తప్పింది.కథువా జిల్లా బిలావర్ నుంచి జమ్ముకు ఈ బస్సు చేరుకుందని అధికారులు తెలిపారు. బస్ డ్రైవర్, కండక్టర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆర్డీఎక్స్ లభ్యం కావడంపై ప్రశ్నిస్తున్నారు. ఆర్డీఎక్స్తో కూడని ప్యాకెట్ను బిలావర్లో తమకు ఓ జంట అప్పగించిందని బస్ డ్రైవర్ భద్రతా దళాలకు చెప్పినట్టు తెలిసింది. కాగా ఇటీవల బిలావల్లోని దేవల్ ప్రాంతంలో ఓ ఇంటి నుంచి 40 కిలోల గన్ పౌడర్ను అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. -
భారీ ఉగ్ర కుట్ర భగ్నం
సాక్షి, న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్లో భారీ ఉగ్రదాడి కుట్రను భద్రతా దళాలు సోమవారం భగ్నం చేశాయి. కథువా ప్రాంతంలోని దెవాల్ గ్రామంలో 40 కిలోల భారీ పేలుడు సామాగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు భద్రతా దళాలు వెల్లడించాయి. దీనిపై మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఆర్మీ ఇంటెలిజెన్స్ దళాలు, కశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్లో భాగంగా అనుమానిత ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా దేశీయంగా తయారుచేసిన పేలుడు పదార్ధాలు లభించాయి. మరోవైపు బాలాకోట్లో ఉగ్ర శిబిరాలు తిరిగి చురుకుగా మారాయని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ పేర్కొన్నారు. సరిహద్దు ద్వారా 500 మంది ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం భారత్లో ఉగ్ర దాడులను ప్రేరేపించేందుకు పాకిస్తాన్ పలు ప్రయత్నాలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలోకి ఉగ్రవాదులను చొప్పించడంతో పాటు సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాక్ తెగబడుతోంది. -
అఫ్గాన్లో ఆత్మాహుతి దాడులు
కాబూల్: అఫ్గానిస్తాన్లో తాలిబన్లు బీభత్సం సృష్టించారు. గంట వ్యవధిలోనే రెండు చోట్ల ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జరిగిన ఈ ఘటనలు ప్రజల్లో భయాందోళనను కలిగిస్తున్నాయి. మంగళవారం జరిగిన ఈ వరుస ఘటనల్లో 48 మంది మరణించగా, 80 మందికిపైగా గాయపడ్డారు. ఇందులో మొదటి ఆత్మాహుతి దాడి ఆ దేశ అధ్యక్షుడి ఎన్నికల ప్రచారంలో కాగా, రెండోది కాబూల్లో చోటు చేసుకుంది. రానున్న రోజుల్లో మరిన్ని దాడులు ఉంటాయని తాలిబన్ హెచ్చరించింది. ఈ ప్రమాదం నుంచి ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘని ఎటువంటి గాయాలు కాకుండా బయటపడ్డారు. గంట వ్యవధిలో.. మోటార్ బైక్పై వచ్చిన ఓ ఆగంతకుడు ర్యాలీ దగ్గరి చెక్పోస్టు వద్ద బాంబు పేల్చుకొని దాడికి పాల్పడినట్టు అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిధి నస్రత్ రహిమీ తెలిపారు. పేలుడు ఘటనలో 26 మంది మరణించగా, 42 మంది గాయపడ్డారు. ఈ పేలుడు జరిగిన గంట వ్యవధిలోనే కాబుల్లోని అమెరికా ఎంబసీ సమీపంలో మరో ఉగ్రవాది తనను తాను పేల్చుకున్నాడు. ఈ పేలుడులో 22 మంది మరణించగా, 38 మంది గాయపడ్డారు. పేలుడు అనంతరం కొన్ని మృతదేహాలను కూడా వీధిలో చూసినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పినట్లు వెల్లడించారు. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న యుద్ధం నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకోవడంపై, ట్రంప్ సెప్టెంబర్ 10న తాలిబన్లతో చర్చలను అకస్మాత్తుగా ముగించిన తర్వాత ఈ పేలుళ్లు జరగడం గమనార్హం. -
కాబూల్లో ఆత్మహుతి దాడి.. 10 మంది మృతి
కాబూల్ : అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్లో తాలిబన్లు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. గురువారం కాబూల్లో జరిగిన ఆత్మహుతి దాడిలో 10 మంది మృతిచెందగా, 42 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని అఫ్గాన్ అధికారులు ధ్రువీకరించారు. అఫ్గాన్ ప్రభుత్వ కార్యాలయాలు, యూఎస్ ఎంబసీ సమీపంలోని చెక్పాయింట్ వద్ద ఈ దాడి జరిగింది. కాబూల్లో అత్యంత భద్రత కలిగిన ప్రాంతంలో ఈ దాడి జరగడంతో అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. భద్రత బలగాలు ఘటన స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ దాడికి పాల్పడింది తామేనని తాలిబన్లు ప్రకటించారు. విదేశీ బలగాలే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. అమెరికా సైన్యాలు అఫ్గాన్ విడిచి వెళ్లేందుకు, తాలిబన్లకు, యూఎస్ బలగాలకు మధ్య చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాలిబన్లు అఫ్గాన్లో ఇటువంటి దాడులకు పాల్పడటం గమనార్హం. ఈ వారంలో తాలిబన్లు జరిపిన రెండో దాడి ఇది. సోమవారం జరిగిన ఆత్మహుతి దాడిలో 16 మంది మృతి చెందగా, 100 మందికి పైగా పౌరులు గాయపడ్డారు. -
వారణాసిలో ఉగ్రదాడికి లష్కరే స్కెచ్
న్యూఢిల్లీ : పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు భారత్లో ఉగ్ర దాడులకు సరికొత్త టార్గెట్స్ను ఎంపిక చేసుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి లోక్సభ నియోజకవర్గంలో ఉగ్ర దాడులకు లష్కరే తోయిబా ఉగ్ర మూకలు సన్నాహాలు చేస్తున్నట్టు నిఘా వర్గాల హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వారణాసిలో భారీ ఉగ్ర దాడికి స్కెచ్ వేస్తున్న లష్కరే ఈ దిశగా ఇక్కడ ఏకంగా శిబిరాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు నిఘా వర్గాలు పసిగట్టినట్టు సమాచారం.వారణాసి కేంద్రంగా ఉగ్ర దాడులతో చెలరేగేందుకు అవసరమైన సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు గత కొద్ది నెలలుగా లష్కరే ఉగ్రవాదులు వారణాసి సందర్శించారని, ఈ ప్రాంతంలో బేస్ను ఏర్పాటు చేసేందుకు సైతం పరిశీలిస్తున్నారని నిఘా సంస్థలు అధికారులకు సమాచారం అందించాయి. వారణాసిలో విధ్వంసం సృష్టించేందుకు తగిన వెసులుబాటు కోసం మే 7 నుంచి మే 11 మధ్య లష్కరే ఉగ్రవాది ఉమర్ మాద్ని మరో నేపాల్కు చెందిన ఉగ్రవాదితో కలిసి ఇక్కడ మకాం వేసినట్టు నిఘా వర్గాలు ప్రస్తావించాయి. వారణాసి ప్రాంతంలో లష్కరేను ఎలా బలోపేతం చేయడంతో పాటు పవిత్ర వారణాసిలో భారీ ఉగ్రదాడికి వారు మేథోమథనం చేశారని నిఘా వర్గాలు అధికారులను అప్రమత్తం చేశాయి. -
విమానాన్ని కూల్చివేసిన ఉగ్రవాదులు గాంధీ ఆస్పత్రిలో (మాక్ డ్రిల్ )
-
రెచ్చిపోయిన ఉగ్రమూకలు; 10 మంది మృతి!
కిస్మాయో : సోమాలియాలో ఉగ్రమూకలు రెచ్చిపోయాయి. కారు బాంబుతో ఓ హోటల్పై విరుచుకుపడ్డాయి. ఈ ఘటనలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. సోమాలియా పోర్టు సిటీ కిస్మాయోలోని అసాసే హోటల్లో తొలుత కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాదులు అనంతరం కారు బాంబును పేల్చారు. ఈ దుశ్చర్యకు బాధ్యులము తామేనని ఆల్-షబాబ్ అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. కాగా సోమాలియాలో త్వరలోనే ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో వివిధ పార్టీల పెద్దలు, ప్రజాప్రతినిధులు ఆ హోటల్లో సమావేశమైనట్లుగా తెలుస్తోంది. వీరిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడి జరిగినట్లు సమాచారం. అయితే ఈ ఘటనలో సామాన్య పౌరులు, హోటల్ సిబ్బంది సహా ఇద్దరు జర్నలిస్టులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఇక శుక్రవారం అర్ధరాత్రి దాడి జరిపిన అనంతరం దాదాపు మూడు గంటల పాటు ఉగ్రవాదులు అక్కడే ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై లోతుగా విచారణ జరుపనున్నట్లు పేర్కొన్నారు. -
‘నీ త్యాగం ఎందరినో కాపాడింది’
శ్రీనగర్ : కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమిత్ షా తొలిసారి జమ్ము కశ్మీర్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఉగ్రవాదుల దాడిలో మరణించిన పోలీసు అధికారి అర్షద్ అహ్మద్ ఖాన్ కుటుంబ సభ్యులను ఆయన గురువారం పరామర్శించారు. అనంతనాగ్లో ఈ నెల 12న పారామిలటరీ బలగాలపై ఉగ్రవాదులు దాడిచేసిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో వీరమరణం పొందిన అర్షద్ కుటుంబం నగరంలోని బాల్గార్డెన్ ప్రాంతంలో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో అమిత్ షా అర్షద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దేశ రక్షణ కోసం అర్షద్ చేసిన త్యాగం ఎంతోమంది జీవితాలను కాపాడింది. అర్షద్ ఖాన్ ధైర్య సాహసాలను చూసి దేశం గర్విస్తోంది’ అన్నారు. అర్షద్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఫోటోలను ట్విటర్లో పోస్ట్ చేశారు. అర్షద్ ఖాన్కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పిల్లలిద్దరూ చాలా చిన్నవారు. వీరిలో ఒకరికి నాలుగేళ్లు కాగా మరొకరు ఏడాది నిండిన చిన్నారి. Visited the home of inspector Arshad Khan, SHO Anantnag in Srinagar, who was martyred in a terror attack & offered my condolences to the bereaved family. His sacrifice for the security of our nation has saved many lives. Entire nation is proud of Arshad Khan‘s valour & courage. pic.twitter.com/eByqlVubo6 — Amit Shah (@AmitShah) June 27, 2019 జమ్ముకశ్మీర్లో జూన్ 12న భద్రతాబలగాలపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు సీఆర్పీఎఫ్ సిబ్బంది అమరులైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అనేక మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో అర్షద్ కుడా ఉన్నారు. తీవ్ర గాయాలపాలైన అర్షద్ ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. -
అయోధ్య ఉగ్రదాడి కేసు : నలుగురికి జీవిత ఖైదు
లక్నో : 2005 అయోధ్య ఉగ్రదాడి కేసులో నలుగురు నిందితులను దోషులుగా తేల్చిన ప్రత్యేక న్యాయస్ధానం బుధవారం వారికి జీవిత ఖైదు విధించింది. ఇదే కేసులో ఓ వ్యక్తిని నిర్ధోషిగా వెల్లడించింది. 2005, జులై 5న ఆరుగురు సాయుధ ఉగ్రవాదులు భక్తుల మాదిరి జీప్లో చేరుకుని అయోధ్యలోని వివాదాస్పద రామ మందిర ప్రాంతంలోకి చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నించారు. భద్రత సిబ్బందిని నిలువరించి లోపలికి వెళ్లేందుకు బారికేడ్ల వద్ద తాము వచ్చిన వాహనంలో ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఇదే సమయంలో వాహనంలో ఉన్న నిందితులు గ్రనేడ్లు విసురుతూ విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ వివాదాస్పద స్ధలంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా భద్రతా దళాలు, సీఆర్పీఎఫ్ సిబ్బంది తీవ్రంగా ప్రతిఘటించారు. 90 నిమిషాల పాటు సాగిన ఆపరేషన్ అనంతరం వివాదాస్పద స్ధలానికి 70 మీటర్ల దూరంలో సీతా రసోయి ఆలయం వద్ద మిగిలిన ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఈ దాడిలో నలుగురు సీఆర్పీఎఫ్ సిబ్బంది, ఓ మహిళ సహా ఇద్దరు పౌరులకు గాయాలయ్యాయి. కాగా ఈ కేసులో నిందితులందరికీ జీవిత ఖైదు విధిస్తూ ప్రయాగరాజ్ ప్రత్యేక న్యాయస్ధానం స్పెషల్ జడ్జి దినేష్ చంద్ర తీర్పు వెలువరించారు. -
జమ్మూకశ్మీర్లో హై అలర్ట్..!
శ్రీనగర్: ఉగ్రదాడులు జరగొచ్చన్న నిఘావర్గాల హెచ్చరికలతో జమ్మూకశ్మీర్లో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాద దాడులు జరగొచ్చని భారత్, అమెరికాకు పాకిస్థాన్ నిఘా సమాచారం ఇచ్చిన నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. అవంతిపురలో శక్తిమంతమైన ఐఈడీ బాంబులతో కూడిన వాహనాలతో ముష్కరులు పేలుళ్లకు పాల్పడవచ్చని పాక్ ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీచేసింది. గత నెలలో కశ్మీర్లో ఆర్మీ నిర్వహించిన స్పెషల్ ఆపరేషన్లో ఉగ్రవాది జకీర్ మూసా హతమయ్యాడు. దీనికి ప్రతీకారంగా ఉగ్రదాడులు జరుగొచ్చని నిఘావర్గాలు హెచ్చరించాయి. అవంతిపురకు 7 కిలోమీటర్ల దూరంలోనే ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడి జరిగింది. ఆ దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ హెచ్చరికలతో భారత్ అప్రమత్తమైంది. సరిహద్దుల వెంట గస్తీని మరింత పెంచింది. -
కశ్మీర్లో ఉగ్రదాడి : ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్లోని అనంత్నాగ్లో భద్రతా దళాలపై బుధవారం సాయంత్రం ఉగ్రవాదులు జరిపిన దాడిలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించగా,పలువురికి గాయాలయ్యాయి. ఉగ్రదాడిని తిప్పికొట్టేందుకు భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. గాయపడిన వారిలో జమ్ము కశ్మీర్కు చెందిన ఓ ఎస్హెచ్ఓ, సీఆర్పీఎఫ్ జవాన్, స్ధానిక మహిళ ఒకరు ఉన్నారని అధికారులు తెలిపారు. దక్షిణ కశ్మీర్లోని అనంత్నాగ్ పట్టణం కేపీ రోడ్లో సీఆర్పీఎఫ్ బృందంపై ఉగ్రదాడి జరిగిందని వారు వెల్లడించారు. ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయని చెప్పారు. -
ఈజిప్టులో ఉగ్రదాడి : 10 మంది మృతి
కైరో : ఈజిప్టులోని సినాయీ పెనిన్సులాలో ఓ చెక్ పోస్ట్పై బుధవారం ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. రంజాన్ పర్వదినం సందర్భంగా అల్ అరీష్ నగరంలో ముస్లింలు ప్రార్థనలు జరుపుతున్న నేపథ్యంలో మరోవైపు ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. మృతి చెందిన వారిలో ఇద్దరు అధికారులు, ఎనిమిది మంది ఆర్మీ అధికారులు ఉన్నారు. చెక్ పాయింట్ వద్ద దాడి అనంతరం ఆయుధాలు ఉన్న ఓ వాహనాన్ని తీసుకొని ఉగ్రవాదులు తప్పించుకుపారిపోవాలని ప్రయత్నించారు. అయితే, వెంటనే ఓ యుద్ధ విమానంలో వారిని వెంటాడిన భద్రతా బలగాలు ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చాయి. -
ఉగ్రదాడిలో ఎమ్మెల్యే సహా ఆరుగురి మృతి
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఉగ్రవాదులు పంజా విసిరారు. అరుణాచల్ ప్రదేశ్లోని తిరప్ జిల్లాలో మంగళవారం జరిగిన ఉగ్ర దాడిలో నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ)కి చెందిన ఎమ్మెల్యే తిరంగ్ అబో సహా ఆరుగురు వ్యక్తులు మరణించారు. కాగా ఈ దాడి ఎన్ఎస్సీఎన్ (ఐఎం) మిలిటెంట్ల పనేనని అనుమానిస్తున్నారు. తిరంగ్ అబో అసోం నుంచి ఖోన్సా వెస్ట్ నియోజకవర్గానికి వెళుతున్న క్రమంలో తిరప్ జిల్లాలోని బోగపని గ్రామం వద్ద ఉగ్రవాదులు ఎమ్మెల్యేపై కాల్పులకు తెగబడ్డారు. ఉగ్ర దాడిలో ఎమ్మెల్యే సహా ఆరుగురు వ్యక్తులు ఘటనాస్ధలంలోనే మరణించారని తిరప్ డీసీపీ తుంగన్ తెలిపారు. కాగా దాడిని మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా తీవ్రంగా ఖండించారు. దాడికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్లను ఆయన కోరారు. -
మరోసారి సోషల్ మీడియాపై తాత్కాలిక నిషేధం
కొలంబో: హింసాత్మక ఘటనల నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందు జాగ్రత్తగా సామాజిక మాధ్యమాలను అక్కడి ప్రభుత్వం సోమవారం నుంచి తాత్కాలికంగా నిలిపివేసింది. ఫేస్బుక్, వాట్సాప్ తదితర మెసేజింగ్ యాప్లను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ఈస్టర్ దాడులు తరువాతముస్లింలకు సంబంధించిన వ్యాపార సముదాయాలు, ముసీదులు రాళ్లు రువ్వడం తోపాటు, ఒక వ్యక్తిపై దాడిలాంటి తాజా ఘటనల నేపథ్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఫేస్బుక్ పోస్ట్ ద్వారా ఈ వివాదం రాజుకుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో వివాదాస్పద పోస్ట్ పెట్టిన అబ్దుల్ హమీద్ అన్సారీ(38)ని అరెస్టు చేశారు. మరోవైపు ఈస్టర్ దాడుల్లో కీలక వ్యక్తిగా అనుమానిస్తున్న జహ్రాన్ హషీంతో సంబంధాలున్న సౌదీ అరేబియా మతబోధకుడు మొహమ్మద్ అలియార్(60) ను శ్రీలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యావేత్త, అయిన అలియార్..సెంటర్ ఫర్ ఇస్లామిక్ గైడెన్స్ వ్యవస్థాపకుడు. అయితే ఈ సంస్థ ఆధ్వర్యంలో జహ్రాన్.. సొంత పట్టణమైన కట్టంకుడిలో మసీదు, మత పాఠశాల, లైబ్రరీని అలియార్ స్థాపించాడు. అలియార్కు జహ్రాన్తో సంబంధాలు ఉన్నాయని, ఆర్థిక లావాదేవీలు కూడా నిర్వహించినట్టు తమకు సమాచారం ఉందని పోలీసులు పేర్కొన్నారు. అయితే, పోలీసులు పూర్తి వివరాలందించేందుకు నిరాకరించారు. కాగా ఏప్రిల్ 21, ఈస్టర్ సండే రోజున శ్రీలంకలో జరిగిన ఉగ్రదాడుల్లో 257 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత దేశంలో అల్లర్లు చెలరేగే అవకాశాలు ఉన్నందున సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించారు. అయితే ఆ నిషేధాన్ని ఏప్రిల్ 30న ఎత్తివేశారు. తాజా నిర్ణయంతో దీంతో శ్రీలంకలో ఫేస్బుక్, వాట్సాప్, వైబర్, ఇన్స్టాగ్రామ్ వంటి యాప్ల సేవలు శ్రీలంక వాసులకు మరికొన్ని రోజులు దూరం కానున్నాయి. -
ఆరెస్సెస్ నేతపై ఉగ్రవాదుల కాల్పులు
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. కిష్ట్వార్ పట్టణంలో ఆరెస్సెస్ నేత చంద్రకాంత్పై దాడిచేసిన ఉగ్రవాదులు ఆయన వ్యక్తిగత భద్రతాధికారిని హత్య చేశారు. చంద్రకాంత్ వైద్య పరీక్ష కోసం స్ధానిక ఆస్పత్రికి వెళ్లగా అక్కడ ఉగ్రవాదులు దాడి చేయడంతో ఆరెస్సెస్ నేతకు గాయాలయ్యాయి. ప్రత్యక్ష సాక్షుల కధనం ప్రకారం ఆస్పత్రిలోకి చొచ్చుకువచ్చిన ఉగ్రవాదులు చంద్రకాంత్ భద్రతా అధికారి నుంచి తుపాకీని లాక్కుని చంద్రకాంత్ సహా ఆయన భద్రతా అధికారిపై కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల ఘటనలో చంద్రకాంత్ వ్యక్తిగత భద్రతాధికారి మరణించారు. ఆరెస్సెస్ నేతకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా ఆరెస్సెస్ నేతపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో పట్టణంలో కర్ఫ్యూ విధించారు. -
ఫేస్బుక్కు మరో ఎదురు దెబ్బ
కౌలాలంపూర్ : అసత్య, నకిలీ వార్తలు, వీడియోలతో ఇబ్బందులు పాలవుతున్న సోషల్ మీడియా ప్లాట్పాం ఫేస్బుక్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఫేక్ న్యూస్ను నిరోధించడంలో ఫేస్బుక్ విఫలమవుతోందని ఆరోపిస్తూ ఎయిర్ ఏసియా సిఈఓ టోనీ ఫెర్నాండెజ్ తన ఫేస్బుక్ ఖాతాను రద్దు చేసుకున్నారు. కమ్యూనికేట్ చెయ్యడానికి గొప్ప వేదిక ఫేస్బుక్. తాను సోషల్ మీడియా అభిమానిని అయినప్పటికీ, ఫేక్న్యూస్ ఇబ్బందులు తనకు కూడా తప్పలేదన్నారు. వీటన్నింటితోపాటు న్యూజిలాండ్ ఘటన తనను బాధించిందని చెప్పారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని ట్వీట్ చేశారు. న్యూజిలాండ్ క్రైస్ట్చర్చ్ కాల్పుల ఉదంతంలో దుండగుడి ఊచకోత దృశ్యాలు ప్రత్యక్ష ప్రసారం, ఆ విడియో భారీ ఎత్తున షేర్ కావడం పట్ల నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఫేస్బుక్ కేవలం ఆర్థిక ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచించకుండా ప్రక్షాళనకు ప్రాధాన్యత ఇవ్వాలని టోనీ హితవు పలికారు. 6 లక్షల70 వేలమంది ఫాలోయర్స్ ఉన్న టోనీ తన నిర్ణయాన్ని వరుస ట్వీట్ల ద్వారా ఆదివారం ప్రకటించారు. సోషల్ మీడియాలో మంచికి మించి కొన్నిసార్లు ద్వేషమే ఎక్కువగా విస్తరిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో సంస్థ ఇంకా చాలా చేయాల్సి వుందని టోనీ పేర్కొన్నారు. చదవండి : 24 గంటల్లో 1.5 మిలియన్ల వీడియోలు తొలగింపు Facebook could have done more to stop some of this. I myself have been a victim of so many fake bitcoin and other stories. 17 mins of a live stream of killing and hate!!!! Its need to clean up and not just think of financials. — Tony Fernandes (@tonyfernandes) March 17, 2019 It is a great platform to communicate. Strong engagement and very useful but New Zealand was to much for me to take along with all the other issues. — Tony Fernandes (@tonyfernandes) March 17, 2019 -
24 గంటల్లో 1.5 మిలియన్ల వీడియోలు తొలగింపు
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ఫేక్ న్యూస్, హింసాత్మక వీడియోల నిరోధం కోసం నిరంతరం శ్రమిస్తున్నామని వివరించింది. న్యూజిలాండ్ ప్రధాని జసిందా అర్డర్న్ ఈ ఘటనపై ఆదివారం ఫేస్బుక్ను ప్రశ్నించిన నేపథ్యంలో సంస్థ స్పందించింది. న్యూజిలాండ్ నరమేధానికి సంబంధించి నిబంధనలు ఉల్లంఘించే కంటెంట్ను తీసివేయడానికి తీవ్రంగా శ్రమించామని ఫేస్బుక్ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఘటన జరిగిన 24 గంటల్లోనే 1.5 మిలియన్ల వీడియోల ఫుటేజ్ని తొలగించినట్టు వెల్లడించింది. వీడియోగేమ్ తరహాలో లైవ్ స్ట్రీమింగ్ చేసిన వీడియోలను తొలగించామని న్యూజిలాండ్ ఫేస్బుక్ ప్రతినిధి మియా గార్లిక్ తెలిపారు. అలాగే 1.2 మిలియన్ల వీడియోల అప్లోడ్ను బ్లాక్ చేశామన్నారు. క్రైస్ట్చర్చ్ కాల్పుల ఉదంతంలో నిందితుడు బ్రెట్టాన్ టారాంట్ తన దాడిని ఫేస్బుక్లో దాదాపు 17 నిమిషాల పాటు ప్రత్యక్ష ప్రసారం చేశాడు. దీంతో ఫేస్బుక్లో అతని అనుచరులు మొదట ఈ విషయం గురించి ముందుగా తెలుసుకున్నారు. దీనిపై న్యూజిలాండ్ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఇలాంటి హింసాత్మక వీడియోలు సోషల్ మీడియాలో విరివిగా షేర్ అవుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్ట ప్రకారం చెల్లదని.. ఎడిట్ చేసిన వీడియోలయినా సరే, సోషల్ మీడియా వేదికల్లో పోస్ట కావడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ నిబంధనలు న్యూస్ మీడియాకు కూడా వర్తిస్తుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే లైవ్ వీడియో ఫుటేజ్ను ప్రసారం చేసిన స్కై న్యూస్ ఏజెన్సీని న్యూజిలాండ్ బ్రాడ్కాస్టర్ జాబితా నుంచి తొలగించినట్టు తెలుస్తోంది. న్యూజిలాండ్లోని క్రైస్ట్చర్చ్ ప్రాంతంలో మసీదుల్లో శుక్రవారం ఉదయం జాత్యంహకారి జరిపిన కాల్పుల్లో 50 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు తెలుగువారు సహా ఏడుగురు భారతీయులు కూడా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు గన్ కల్చర్కి వ్యతిరేకంగా దేశంలో ఒక చట్టాన్ని తెచ్చేందుకు తమ క్యాబినెట్ సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని న్యూజిలాండ్ ప్రధాని జసిందా సోమవారం వెల్లడించారు. -
‘క్రైస్ట్చర్చ్’ మృతుల్లో ఇద్దరు హైదరాబాదీలు
హైదరాబాద్/త్రిసూర్: న్యూజిలాండ్లోని క్రైస్ట్చర్చ్ మసీదు కాల్పుల్లో మృతిచెందిన 49 మందిలో ముగ్గురు భారతీయులున్నట్లు అక్కడి అధికారులు ధ్రువీకరించారు. అందులో ఇద్దరు హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ హసన్ ఫరాజ్(31), రెస్టారెంట్ వ్యాపారి మహ్మద్ ఇమ్రాన్ ఖాన్(47) కాగా, మరొకరు కేరళలోని త్రిసూర్కు చెందిన 25 ఏళ్ల మహిళ ఆన్సీ అలీగా గుర్తించారు. కాల్పుల ఘటన తరువాత గల్లంతైనట్లు వార్తలొచ్చిన ఫరాజ్ మృతిచెందినట్లు శనివారం ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. తన సోదరుడు చనిపోయినట్లు న్యూజిలాండ్ నుంచి ఫోన్ వచ్చిందని ఆయన అన్న కశీఫ్ హసన్ మీడియాకు వెల్లడించారు. ఈ షాకింగ్ వార్త తెలియగానే టోలిచౌకిలోని వారి నివాసం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. దాడిలో మరణించిన 47 ఏళ్ల మరో హైదరాబాదీ ఇమ్రాన్ఖాన్ కుటుంబంతో కలిసి క్రైస్ట్చర్చ్లో నివాసముంటూ రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. గాయపడిన అహ్మద్ ఇక్బాల్ జహంగీర్ అనే హైదరాబాద్కు చెందిన మరో వ్యక్తి కోలుకుంటున్నారు. జహంగీర్కు శస్త్రచికిత్స చేసి బుల్లెట్ను తొలగించారని, ప్రమాదమేమీ లేదని ఆయన సోదరుడు మహ్మద్ ఖుర్షీద్ వెల్లడించారు. పీజీ చదువుతున్న ఆన్సీ.. క్రైస్ట్చర్చ్ కాల్పుల ఘటనలో గాయపడిన ఆన్సీ అలీ మృతిచెందినట్లు శనివారం కేరళ పోలీసులు ప్రకటించారు. గతేడాదే భర్త అబ్దుల్ నాజర్తో కలిసి న్యూజిలాండ్ వెళ్లిన ఆన్సీ దాడి జరిగిన మసీదు సమీపంలో ఉంటున్నారు. క్రైస్ట్చర్చ్లో ఆమె భర్త ఉద్యోగం చేస్తుండగా, ఆమె పీజీ చదువుతున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, క్రైస్ట్చర్చ్లో గల్లంతైన గుజరాతీల గురించి ఎలాంటి సమాచారం అందలేదని ఆ రాష్ట్ర పోలీసులు చెప్పారు. కాల్పులు జరిగిన సమయంలో ఆ రెండు మసీదుల్లో గుజరాత్కు చెందిన కనీసం నలుగురు ముస్లింలు ఉన్నట్లు వార్తలొచ్చాయి. -
తప్పుడు నిర్ణయాలతోనే తిప్పలు
తప్పుడు నిర్ణయాలతోనే తిప్పలు పుల్వామాలో మన కేంద్రీయ రిజర్వ్ పోలీసు దళం జవాన్లు 40 మందిని బలిగొన్న టెర్రరిజం భూతానికి మూలాలు కనుగొని దాన్ని కూకటివేళ్లతో సహా పెరికివేయడానికి మార్గాలు వెతకవలసిన రోజులివి. భయంకరమైన పేలుడు పదార్థాలను ఉపయోగించి విధ్వంసం సృష్టించే అవకాశాలున్నాయని జమ్మూకశ్మీర్ పోలీసులు ఫిబ్రవరి 8న హెచ్చరిక జారీ చేశారు. ‘మీరు వెళ్లే రోడ్డును పేలుడు పదార్థాలను పూర్తిగా ఏరిపారేసి శుధ్ధి చేయండి. ఎందుకంటే పేలుడు పదార్థాలు వాడే అవకాశాలున్నట్టు మాకు సమాచారం అందింది. చాలా అర్జంట్ విషయం’ అని జనరల్ పోల్ కశ్మీర్ జోన్ వారు పీసీఆర్ కశ్మీర్ ద్వారా సమాచారం పంపారు. ఈ సమాచారం ముందే అందినా ఈ దారుణాన్ని ఎందుకు నివారించలేకపోయారు? 2,500 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లను తరలించే మార్గంలోకి ఆ వ్యాన్ ఎలా రాగలిగింది? దాన్ని అడ్డుకోలేకపోయారా? అసలు చెక్పోస్ట్లే లేవా? పోనీ లేవనే అనుకుందాం. వేలాదిమంది జవాన్లను రోడ్ మార్గం ద్వారా తరలించే ముందు సెక్యూరిటీ కోసం అప్పుడైనా చెక్ చేయరా? జమ్మూ శ్రీనగర్ హైవేలో ఆర్డీఎక్స్ నింపిన వాహనాలను చెక్ చేయడానికి మూడు చోట్ల బారి యర్లు ఉండేవి. కానీ ఈ బారియర్లను మెహబూబా ముఫ్తీ నాయకత్వంలో నడిచిన సంకీర్ణ ప్రభుత్వం తొలగించిందని, అందుకే పుల్వామా జవాన్లమీద దాడిచేసిన వాహనాన్ని ఎవ్వరూ ఆపలేకపోయారని జేఎన్యూలో లా గవర్నెన్స్ అండ్ డిజాస్టర్ స్టడీస్ ప్రొఫెసర్ అమితా సింగ్ విమర్శిం చారు. ఆయనపై ముఫ్తీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. అంతకుముం దున్న బారియర్లను తొలగించారా లేదా అన్నది ప్రశ్న. తొలగిస్తే ఎందుకో చెప్పాలి. తొలగించకపోతే ఆ విషయం రూఢీగా చెప్పాలి. కానీ ప్రొఫెసర్ను దుర్భాషలాడి ఏం ప్రయోజనం? మేజర్ జనరల్ (రిటైర్డ్) జీడీ బక్షీ ఒక టీవీ చర్చలో పాల్గొంటూ ఆ రోడ్ మీద చెక్పోస్టులను, బారియర్లను ముఫ్తీ ఆదేశాలవల్ల తొలగించారని చేసిన వ్యాఖ్య సంచలనం కలిగించింది. అక్కడ బారియర్లను తొలగించడం వల్లనే ఉగ్రవాద దాడి జరిగిందని, దీనికి ఎవరు బాధ్యులని ఆయన తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. పాలనాపరమైన నిర్లక్ష్యాల వల్ల, తప్పుడు నిర్ణయాల వల్ల టెర్రరిస్టు ఘాతుకాలు ఆపగలిగి కూడా ఆపలేకపోతున్నారేమోనని ఈ రెండు వాదాలు విన్న తరువాత జనం అనుమానించవలసి వస్తుంది. ఫిబ్రవరి 16న సుబ్రమణ్య∙స్వామి ఒక ట్వీట్ చేశారు. ‘‘2014లో ఒక మారుతీ కార్ మూడు చెక్ పాయింట్లను దాటుకుని దూసుకు పోయిందని, ఆ కారుపైన కాల్పులు జరిపిన ఆర్మీ జవాన్లను ప్రాసిక్యూట్ చేయడానికి ఎవరు అనుమతించారు? ఆ ఉత్తర్వు ఇచ్చిన వ్యక్తి జవాన్ల మరణానికి బాధ్యత వహించాలి. ఆ ఆర్మీ జవాన్లు ఇంకా జైల్లో ఉన్నారు’’ అని ట్వీట్ చేశారు. ఇండియా టుడే వారి ఫేక్ న్యూస్ వ్యతిరేక వార్ రూం విభాగం వారు ఇందులో నిజానిజాలను పరిశోధించారు. బక్షీ చెప్పిన సంఘటన నవంబర్ 3, 2014 ఛట్టెర్గాం (బుద్గాం జిల్లా)లో జరిగింది. అయిదుగురు యువకులు ప్రయాణిస్తుండగా కాల్పులు జరిగాయనీ, 53వ రాష్ట్రీయ రైఫిల్ మెన్ జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించారనీ, ఈ సంఘటనపై భిన్నవాదాలున్నాయని ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనాన్ని ఉటంకిస్తూ ఇండియా టుడే వివరించింది. ఈ సంఘటన జరిగినప్పుడు ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ఉన్నారని పీడీపీ అధికారంలోకి ఇంకా రాలేదని వివరించారు. కాల్పులు జరిపిన వారిపై చడూరా పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నంబర్ 231 – 2014లో నమోదయింది. ఆర్మీ అధికారులు కూడా కాల్పులు జరపడం పొరబాటే అని అంగీకరించారు. 9 మంది సైనికులమీద కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీలో ప్రాసిక్యూషన్ ప్రారంభించారు. కానీ ఎవరినీ జైలుకు పంపలేదు. ఈ విషయాన్ని బక్షీకి తెలియజేస్తే, ఆయనకూడా పొరబాటు తెలుసుకున్నారని తేలింది. అయినా íపీడీపీ ప్రభుత్వం సెక్యూరిటీ చెకింగ్ను సడ లించడం వల్లనే కశ్మీర్ లోయలో కల్లోల సంఘటన జరిగిందని బక్షీ విమర్శించారు. తప్పుడు వార్తలను ఖండించి నిజానిజాలు తెలియజేయడం గొప్ప సేవ. టీవీ చర్చల్లో, ట్వీట్ వ్యాఖ్యల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించవలసి ఉంటుంది. సెక్యూరిటీ చెక్ నిబంధనలు సడలించడం, బారియర్లు తొలగించడం తప్పుడు నిర్ణయాలు కావా? పేలుడు పదార్థాలు నింపుకున్న వాహనం సీఆర్పీఎఫ్ జవాన్లను బలిగొనడం నిజం, అందాకా ఆ వాహనాన్ని ఎవరూ చెక్ చేయలేదనేది నిజం. వేలాది మంది జవాన్లను తరలించడానికి రోడ్డు దారి భద్రం కాదని, హెలికాప్టర్ల ద్వారా పంపాలని కోరినా నిరాకరించడం కూడా నిజం. నిజానిజాలను పరిశోధించాల్సిన బాధ్యత, నిజాలను జనం ముందుంచాల్సిన బాధ్యత లేదా? పాలనా వైఫల్యాలు, తప్పుడు నిర్ణయాలు ఎంతటి దారుణాని కైనా దారితీస్తాయి. తప్పుడు వార్తలు ఆ దారుణాలను ఇంకా మండిస్తాయి. వ్యాసకర్త : మాడభూషి శ్రీధర్, బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
అన్నింటి వెనుకా ఐఎస్ఐ హస్తం!
దేశమంతటా ఇప్పుడు ఒకే చర్చ. పాకిస్తాన్తో యుద్ధం వస్తుందా...భారత సైన్యం దాడికి పాక్ ప్రతీకార దాడులకు దిగుతుందా అని. ఇటీవలి పుల్వామా దాడితోపాటు మన వైమానిక దాడుల నేపథ్యంలో ఉగ్రవాద సంస్థల చర్యలపై నగరంలోనూ భయాందోళనలు నెలకొన్నాయి. ఎందుకంటే గతంలో హైదరాబాద్లో జరిగిన పలు ఉగ్ర ఘటనలే ఇందుకు కారణం. నిషిద్ధ ఉగ్రవాద సంస్థలైన జైష్ ఏ మహ్మద్ (జేఈఎం), లష్కరే తొయిబా(ఎల్ఈటీ),హిజ్బుల్ ముజాహిదీన్(హెచ్యూఎం) వంటి వాటి వెనుక పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ప్రోద్బలం ఉంది. వీటి ఛాయలు ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు పదిహేడేళ్లుగా సిటీలో ఉన్నాయి. ఇవి పన్నిన కుట్రలు, సృష్టించిన విధ్వంసాలు భారీ నష్టాలనే మిగిల్చాయి. దక్షిణాదిలోని మిగిలిన నగరాల కంటే హైదరాబాద్ పైనే ముష్కరమూకల గురి ఎక్కువగా ఉంటోంది. ఇక్కడ కశ్మీర్కు చెందిన వేర్పాటువాద, ఉగ్రవాద సంస్థల కదలికలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్ర ఉదంతాలపై సాక్షి ప్రత్యేక కథనం... సాక్షి,సిటీబ్యూరో :దేశాన్ని కుదిపేసిన ‘పుల్వామా’ దాడితో పాటు తదనంతర పరిణామాల నేపథ్యంలో భారత్, పాక్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. సరిహద్దుల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. ఇటీవల పరిణామాలతో తెరపైకి వచ్చిన నిషిద్ధ ఉగ్రవాద సంస్థలైన జైష్ ఏ మహ్మద్ (జేఈఎం), లష్కరేతొయిబా(ఎల్ఈటీ), హిజ్బుల్ ముజాహిదీన్(హెచ్యూఎం) వంటి వాటి వెనుక పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ప్రోద్బలం ఉంది. వీటి ఛాయలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇరవై ఏడేళ్లుగా సిటీలో ఉన్నాయి. ఇవి పన్నిన కుట్రలు, సృష్టించిన విధ్వంసాలు భారీ నష్టాలనే మిగిల్చాయి. దక్షిణాదిలోని మిగిలిన నగరాల కంటే హైదరాబాద్ పైనే ముష్కరమూకల గురి ఎక్కువగా ఉంటోంది. ఇక్కడ కశ్మీర్కు చెందిన వేర్పాటువాద, ఉగ్రవాద సంస్థల కదలికలూ ఉన్నాయి. హెచ్యూఎం.. ఏఎస్పీ కృష్ణప్రసాద్ హత్య 1992 డిసెంబర్ 6న అయోధ్యలోని బాబ్రీ మసీదు విధ్వంసం జరిగింది. ఆ తర్వాతే నగరంలో, దేశంలో ఉగ్రవాదం జోరందుకుంది. అయితే, దీనికి ముందే నగరం భారీ ఉదంతానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది. ఇంటెలిజెన్స్ విభాగంలో అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించిన కృష్ణప్రసాద్తో పాటు ఆయన గన్మెన్ వెంకటేశ్వర్లు హత్య నగరానికి సంబంధించి తొలి తీవ్రమైన ఉగ్రవాద చర్యగా చెప్పొచ్చు. టోలిచౌకిలోని బృందావన్ కాలనీలో హెచ్యూఎం ఉగ్రవాదులు తలదాచుకున్నారని కృష్ణప్రసాద్కు సమాచారం అందింది. దీంతో 1992 నవంబర్ 29న తన బృందంతో అక్కడి ఓ ఇంటిపై దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాది ముజీబ్ అహ్మద్ జరిపిన కాల్పుల్లో కృష్ణప్రసాద్, వెంకటేశ్వర్లు అశువులుబాసారు. ఈ ఉదంతం అప్పట్లో దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. నగరం అంతకు ముందుకు వరకు ఈ తరహా ఘటనల్ని ఎప్పుడూ చూడలేదు. 2001లో గణేష్ ఊరేగింపు టార్గెట్ లష్కరే తొయిబా సంస్థ హైదరాబాద్లో భారీ స్థాయిలో మతకలహాలు సృష్టించాలని 2001లో కుట్ర పన్నింది. దీనికోసం నగరానికే చెందిన అబ్దుల్ అజీజ్ను తమ వైపు తిప్పుకుంది. మరికొందరితో కలిసి రంగంలోకి దిగిన ఇతగాడు గణేష్ నిమజ్జన ఊరేగింపులో భారీ పేలుళ్లకు పాల్పడాలని కుట్ర పన్నాడు. అలా చేస్తే నగరం మతకలహాలతో అట్టుడుకుతుందని భావించాడు. అయితే దీన్ని గుర్తించిన నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో మొత్తం మాడ్యుల్ కటకటాల్లోకి వెళ్లింది. సాయిబాబా దేవాలయం వద్ద పేలుడు దిల్సుఖ్నగర్లోని సాయిబాబా దేవాలయం వద్ద 2002 నవంబర్ 21న భారీ పేలుడు జరిగింది. దీనికి అవసరమైన కుట్రను లష్కరే తొయిబా చేసింది. ఈ సంస్థ తరఫున ఉగ్రవాదులుగా వ్యవహరించిన అహ్మద్ ఆజం, అబ్లుల్ అజీమ్ను రంగంలోకి దిగారు. పాలక్యాన్లో పేలుడు పదార్థాలు నింపి, దాన్ని స్కూటర్కు అమర్చడం ద్వారా పేల్చేశారు. ఈ ఉదంతంలో పద్మ అనే మహిళ, భానుప్రకాష్ రెడ్డి అనే బాలుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారిలో నలుగురు నగరంతో పాటు కరీంనగర్లో జరిగిన ఎన్కౌంటర్లలో చనిపోయారు. బీజేపీ నేత హత్యకు జేఈఎం కుట్ర పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై దాడికి తెగబడిన జైష్ ఏ మహ్మద్ (జేఈఎం) సంస్థ.. నగరంలో వరుస హత్యలకు కుట్ర పన్నింది. బీజేపీ, వీహెచ్పీ, ఆర్ఎస్ఎస్, బజరంగ్దళ్, శివసేన, హిందూ వాహినీలకు చెందిన కీలక నేతలను టార్గెట్ చేసింది. వీరిని హత్య చేయడం ద్వారా మత కలహాలు సృష్టించాలని భావించింది. ఈ ముష్కరులు టార్గెట్ చేసిన వారిలో బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి కూడా ఉన్నారు. ఉగ్రవాదుల కుట్ర అమల్లోకి రాకముందే నిఘా వర్గాల సమాచారంతో వీరికి చెక్ పడింది. మొట్టమొదటి మానవబాంబు దాడి నగరంలో తొలిసారి.. ఇప్పటి వరకు ఏకైక మానవ బాంబు దాడి సైతం లష్కరే తొయిబా పనే. 2005 అక్టోబర్ 12న బేగంపేటలోని టాస్క్ఫోర్స్ కార్యాలయంపై దీన్ని పేల్చారు. ఆ రోజు దసరా పండగ కావడంతో అధికారులు, సిబ్బంది లేరు. అయితే ఆ పేలుడు ధాటికి ఒక హోంగార్డు బలయ్యాడు. ఈ కేసులో గులాం యజ్దానీ సహా నగరానికి చెందిన అనేకమంది ఉగ్రవాదుల ప్రమేయం ఉంది. హైదరాబాద్, బెంగళూరు, హుబ్లీల్లో విధ్వంసానికి కూడా.. రాజధాని హైదరాబాద్తో పాటు బెంగళూరు, హుబ్లీల్లో పేలుళ్లకు పన్నిన కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు 2012లో ఛేదించారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా (ఎల్ఈటీ) విదేశాల్లో ఉన్న కొందరి ద్వారా ఇక్కడ ఉంటున్న వారిని ట్రాప్ చేసి విధ్వంసాలకు ప్రేరేపించినట్లు ఎన్ఐఏ గుర్తించింది. వీరి టార్గెట్లో ఉన్న బెంగళూరు, హైదరాబాద్, హుబ్లీ, నాందేడ్కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు, జర్నలిస్టులను కాల్చి చంపడం ద్వారా మత విధ్వేషాలు రెచ్చగొట్టాలని భావించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ నిర్థారించింది. ఈ కేసులో సిటీ వాసి ఒబేద్ కూడా ఉన్నాడు. 1993లో కశ్మీరీ సంస్థల ఛాయలు బాబ్రీ విధ్వసం జరిగిన కొన్నాళ్లకు నగరంలో కశ్మీర్కు చెందిన వేర్పాటువాద సంస్థల కదలికలు కనిపించాయి. దేశ వ్యాప్తంగా ఓ వర్గానికి చెందిన యువతను ఆకర్షించి, భారీ నెట్వర్క్ ఏర్పాటు చేయడానికి ఇక్వాన్ ఉల్ ముస్లమీన్ (ఐయూఎం) కుట్ర పన్నింది. డబ్బు వెదజల్లుతూ యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించడానికి తమ క్యాడర్ను రంగంలోకి దింపింది. అలా వచ్చిన వారే నిస్సార్ అహ్మద్ భట్, అమీన్మీర్. నగరానికి వచ్చిన వీరిద్దరూ కొందరిని ఉగ్రవాదులుగా మార్చారు. చాపకింద నీరుగా తమ కార్యకలాపాలను విస్తరించడానికి కొన్ని స్థానిక సంస్థల సహకారం కూడా తీసుకున్నారు. సిటీతో పాటు దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర పన్నారు. దీనిపై నిఘా వర్గాల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు 1993 నవంబర్ 10న భట్, అమీన్తో పాటు మరికొందరినీ అరెస్టు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. అల్–జిహాద్..భారీ కుట్ర కశ్మీర్కు చెందిన ఉగ్రవాద సంస్థ ‘అల్ జిహాద్’ కదలికలు సిటీలో కనిపించాయి. ఈ సంస్థకు చెందిన కశ్మీరీ బిలాల్ అహ్మద్ కులూ 1993లో నగరానికి వచ్చి చిరుద్యోగిగా తలదాచుకున్నాడు. ఆపై యువతను ఆకర్షించి ఉగ్రవాద శిక్షణకు పంపాలని, వారు తిరిగి వచ్చిన తర్వాత హైదరాబాద్తో పాటు దేశ వ్యాప్తంగా విధ్వంసాలకు వినియోగించుకోవాలని భావించాడు. ఆ ప్రయత్నాల్లో ఉండగానే పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. ఎల్ఈటీకి చెందిన సలీంజునైద్ మాడ్యుల్ దేశంలోని ప్రధాన నగరాల్లో మత కలహాలు సృష్టించడంతో పాటు విధ్వంసాలకు పాల్పడేందుకు ఐఎస్ఐతో పాటు లష్కరేతొయిబా(ఎల్ఈటీ) 1985లో కుట్ర పన్నింది. దీని కోసం పాకిస్తాన్కు చెందిన సలీం జునైద్ను రంగంలోకి దింపింది. నగరానికి వచ్చిన ఇతగాడు పాతబస్తీలో షెల్టర్ ఏర్పాటు చేసుకుని, జమాతే ఇస్లామీ సంస్థకు చెందిన మరికొందరితో కలిసి నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు. వీరి మాడ్యుల్లో సిటీకి చెందిన వారూ చేరారు. వీరంతా సిటీతో పాటు డెహ్రాడూన్, లక్నో, ఘజియాబాద్, ముంబై, అలీఘర్లో రెక్కీలు చేసి పేలుళ్లకు కుట్ర పన్నారు. దీన్ని ఛేదించిన పోలీసులు జునైద్ సహా మరికొందరిని అరెస్టు చేశారు. ఇదే మాడ్యుల్ ఘట్కేసర్లోని రైల్వే ట్రాక్పై బాంబులు పెట్టింది. దీనిపైనా అక్కడి ఠాణాలో మరో కేసు నమోదైంది. ఏసీ గార్డ్స్లో హిజ్బుల్ముష్కరులు పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్కు చెందిన కీలక ఉగ్రవాదులు గుల్జార్ అహ్మద్, గులాం మొహియుద్దీన్, అబు బాఖర్, ముర్తుజా అహ్మద్లను 2001 జూలై 30న ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వీరిని విచారించగా కొందరు తమ అనుచరులు నగరంలోని ఏసీ గార్డ్స్లో తలదాచుకున్నారని చెప్పారు. దీనిపై ఢిల్లీ నుంచి అందిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఏడుగురిని పట్టుకున్నారు. ఇండియన్ ముజాహిదీన్వెనుకాలష్కరే.. గోకుల్చాట్, లుంబినీ పార్కుల్లో 2007 ఆగస్టు 25న, దిల్సుఖ్నగర్లో 2013 ఫిబ్రవరి 21న జంట పేలుళ్లు జరిగాయి. దేశవాళీ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) ముష్కరులు ఈ దుశ్చర్యలకు పాల్పడ్డారు. అయితే, ఈ సంస్థ వెనుక ఎల్ఈటీతో పాటు ఐఎస్ఐ హస్తాలు ఉన్నాయి. అప్పట్లోనే అస్ఘర్ దుశ్చర్యలు నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో గతేడాది జరిగిన ప్రణయ్ దారుణ హత్యలో నిందితుడిగా ఉన్న అస్ఘర్ అలీ దుశ్చర్యలు 1996లోనే వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో కశ్మీర్కు వెళ్లిన అలీ.. అక్కడున్న ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఆపై ఇండియన్ ముస్లిం మహమ్మదీ ముజాహిదీన్ (ఐఎంఎంఎం) సంస్థలో కీలకంగా వ్యవహరిస్తూ ఉగ్రవాద చర్యలకు ఉపక్రమించాడు. మరికొందరు ముష్కరులతో కలిసి భారీ పేలుళ్లకు కుట్ర పన్నాడు. దీనికోసం కశ్మీర్ నుంచి పేలుడు పదార్థాలు, ఆయుధాలు సేకరించాడు. రెక్కీ వంటి చర్యలు చేపడుతుండగా 1997లో పోలీసులకు ఉప్పందడంతో వీరిని పట్టుకున్నారు. దీనికి ఏడాది ముందు నాంపల్లి కోర్టు నుంచి ఉగ్రవాది మీర్జా ఫయాజ్ బేగ్ను తప్పించింది సైతం అస్ఘర్ అలీనే అని వీరి విచారణతో తేలింది. ఇతడి మాడ్యులే 2003లో జరిగిన గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్య హత్య కేసులోనూ ఆరోపణలు ఎదుర్కొంది. గణేష్ టెంపుల్ను పేల్చేయాలని.. సికింద్రాబాద్లోని గణేష్ దేవాలయం సైతం లష్కరే తొయిబా టార్గెట్లో ఉంది. దీన్ని పేల్చేయడానికి 2004లో కుట్ర జరిగింది. నగరానికే చెందిన వారిని తమవైపు తిప్పుకున్న ఎల్ఈటీ.. వారికి అవసరమైన పేలుడు పదార్థాలు అందించింది. అనూహ్యంగా ఈ కుట్రను ఛేదించిన సిటీ పోలీసులు మౌలానా నసీరుద్దీన్ సహా అనేక మందిని అరెస్టు చేసి పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. గ్యాస్ సిలిండర్ను పేలడు పదార్థంతో పేల్చేయడం ద్వారా విధ్వంసం సృష్టించి, మత కలహాలు రెచ్చగొట్టాలని లష్కరే తొయిబా కుట్ర చేసింది. ‘ఓడియన్’ ఘాతుకం ఎల్ఈటీ పనే.. ఆర్టీసీ క్రాస్రోడ్స్లో ఉన్న ఓడియన్ థియేటర్లో 2006 మే 7న జరిగిన గ్రెనేడ్ పేలుడు సైతం పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా (ఎల్ఈటీ) పనే. పాకిస్తాన్లో ఉగ్రవాద శిక్షణ పొంది, తిరిగి నగరానికి వచ్చి ‘స్లీపర్సెల్’గా వ్యవహరించిన మహ్మద్ జియా ఉల్ హక్ ఈ పేలుడుకు పాల్పడ్డాడు. అప్పటి నుంచి నాలుగేళ్ల పాటు నగరంలోనే తలదాచుకున్న జియాను 2010 మే 3న పట్టుకోగలిగారు. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్కు చెందిన మహ్మద్ జియా ఉల్ హక్ కుటుంబం హైదరాబాద్కు వలస వచ్చింది. భవానీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈదిబజార్లో స్థిరపడ్డారు. జియా ఇంటర్మీడియట్ చదువుకు మధ్యలోనే స్వస్తి చెప్పి ఉద్యోగం నిమిత్తం సౌదీ అరేబియా వెళ్లాడు. అక్కడ ఉండగానే పాకిస్తానీ అబు అలీతో పరిచయమై.. అతని ద్వారా ఎల్ఈటీ కమాండర్గా వ్యవహరిస్తున్న అబ్దుల్ అజీజ్కు సన్నిహితుడిగా మారాడు. అబు అలీ 1992 బాబ్రీ విధ్వంసం, 2002 గోద్రా అల్లర్లకు చెందిన సీడీలను తరచూ చూపించడంతో స్ఫూర్తి పొందిన జియా ‘ఉగ్ర’ బాటపట్టి 2002లో శిక్షణ కోసం పాకిస్తాన్ వెళ్లాడు. అక్కడ నెలరోజుల పాటు ఎల్ఈటీ క్యాంప్లో శిక్షణ æపొంది ఆపై హైదరాబాద్ చేరుకున్న జియా క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ ఎల్ఈటీకి స్లీపర్సెల్గా వ్యవహరించాడు. 2005 డిసెంబర్లో ఢిల్లీ రావాల్సిందిగా అజీజ్ నుంచి జియాను ఫోన్ వచ్చింది. అక్కడకు వెళ్లిన జియాకు ఎల్ఈటీ మాడ్యుల్స్ ఓ చైనీస్ మేడ్ తుపాకీ, నాలుగు హ్యాండ్ గ్రెనేడ్స్, తూటాలు కొరియర్ ద్వారా అందాయి. హైదరాబాద్లో ఉన్న జనసమర్థ ప్రాంతాలనే టార్గెట్గా విరుచుకుపడాల్సిందిగా ఎల్ఈటీ ఆదేశించింది. అప్పటి నుంచి అదును కోసం చూసిన జియా.. 2006 మే 7న తొలి ఆపరేషన్ నిర్వహించాడు. ఆర్టీసీ క్రాస్రోడ్స్లోని ఓడియన్ థియేటర్లో ‘లక్ష్మీ’ చిత్రం సెకండ్ షో నడుస్తుండగా గ్రెనేడ్ విసిరి పరారయ్యాడు. మరో గ్రెనేడ్ను డస్ట్బిన్లో పడేశాడు. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఉదంతం జరిగిన తరవాత కూడా జియా క్యాబ్ డ్రైవర్గా నగరంలోనే ఉండి ఆయుధాలతో దాడి కోసం ఎదురు చూశాడు. ఓడియన్ పేలుడు జరిగిన నాలుగేళ్ల తరవాత జియా ఉల్ హక్ను నగర పోలీసులు పట్టుకోగలిగారు. -
‘45 మంది ధైర్యవంతులే.. కర్మకు ఫలితం అనుభవించారు’
గువాహటి : 43 మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకున్న పుల్వామా ఉగ్రదాడిపై యావత్ భారతదేశం ఆగ్రహ జ్వాలలు వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు కొంతమంది ఆ ఘటనను సమర్థించే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు. ఈ క్రమంలో జవాన్ల మరణాన్ని ఉటంకిస్తూ రెచ్చగొట్టే విధంగా ఫేస్బుక్ పోస్టు పెట్టిన పాప్రీ బెనర్జీ అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు. పాప్రీ బెనర్జీ గువాహటిలోని ఐకాన్ కామర్స్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో పుల్వామా దాడి అనంతరం... ‘నిన్నటి ఘటనలో 45 మంది సాహసవంతులైన యువకులు హత్యకు గురయ్యారు. ఇదేమీ యుద్ధం కాదు. దాడి చేసిన వారిపై ప్రతిదాడి చేసేందుకు వారికి సమయం దొరకలేదు. నిజంగా పిరికి పంద చర్యకు పరాకాష్ట ఈ ఘటన. ఇది ప్రతీ ఒక్క భారతీయుని హృదయాన్ని కకావికలం చేసింది... కానీ... కానీ.. కానీ.. లోయలో భద్రతా బలగాలు చేయని అకృత్యాలు ఉన్నాయా! అక్కడి మహిళలపై మీరు అత్యాచారం చేశారు... వాళ్ల పిల్లల్ని చంపారు... వాళ్ల భర్తలను హతమార్చారు.. మీ మీడియా వారందరినీ తక్కువగా చూపే ప్రయత్నమే చేసింది... అయినంత మాత్రాన ప్రతీకారం ఉండదని భావించారా??? అసలు మీకో విషయం తెలుసా.. ఉగ్రవాదం ఇస్లాంకు చెందినదే కావొచ్చు.. కానీ కర్మ అనేది హిందూ సనాతన ధర్మంలోనిది.. ఇప్పుడు ప్రతిఫలం అనుభవించండి’ అంటూ పిప్రీ ఫేస్బుక్లో రెచ్చగొట్టే కథనాన్ని రాసుకొచ్చారు. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆదివారం పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. -
‘అప్పటిదాకా కొనసాగుతాయి.. దయచేసి మమ్మల్ని కొట్టకండి’
శ్రీనగర్ : పుల్వామా ఉగ్రదాడికి కశ్మీరీ ప్రజలు బాధ్యులు కాదన్న విషయం గుర్తుపెట్టుకోవాలని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా అన్నారు. ఉగ్రదాడి నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న కశ్మీరీ విద్యార్థులపై దాడి జరగడంపై ఆయన స్పందించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ‘దయచేసి మమ్మల్ని కొట్టకండి. ఉగ్రదాడిలో మా ప్రమేయం లేదు. ఉగ్రవాదులతో మాకు సంబంధం లేదు. మేము గౌరవప్రదమైన జీవితాన్ని కోరుకుంటున్నాం. రెండు పూటలా మా కుటుంబాలకు భోజనం పెట్టడానికి మాత్రమే ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసేందుకు సిద్ధపడ్డాము. బంగ్లాలు కట్టడానికి కాదు. భవిష్యత్తు కోసం అక్కడ చదువుకుంటున్నాం. రాజకీయపరంగా కశ్మీర్ అంశం వరకు తేలేవరకు పుల్వామా లాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి’ అని ఫరూక్ వ్యాఖ్యానించారు.(పుల్వామా ఉగ్రదాడి: పైశాచిక ఆనందం) ఓపిక పట్టండి.. పుల్వామా ఉగ్రదాడిలో మన తప్పు లేకున్నా.. మనల్ని నిందిస్తున్న వారి పట్ల సహనం వహించాలని ఫరూక్ కశ్మీరీలకు విఙ్ఞప్తి చేశారు. తమ సొంత ప్రయోజనాల కోసం కొంతమంది అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. వారి ప్రణాళికలు అమలు కాకుండా ఉండాలంటే ఓపికగా ఉండాలని పిలుపునిచ్చారు. కాగా పుల్వామా ఉగ్రదాడిని సమర్థిస్తూ పోస్టులు పెట్టిన కశ్మీరీ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న సంగతి తెలిసిందే.(వాట్సాప్ పోస్ట్తో కశ్మీర్ విద్యార్థినుల అరెస్ట్) -
పుల్వామా ఉగ్రదాడి; మాస్టర్ మైండ్ హతం!
శ్రీనగర్ : పుల్వామాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో భాగంగా పుల్వామా ఉగ్రదాడిలో కీలక పాత్ర పోషించిన జైషే మహ్మద్ టాప్ కమాండర్ రషీద్ ఘాజీని భారత సైన్యం మట్టుబెట్టినట్లు సమాచారం. అతడితో పాటు మరో జైషే ఉగ్రవాదిని కమ్రాన్ను కూడా భారత బలగాలు హతమార్చాయి. సోమవారం నాడు తమపై అటాక్ చేసిన ఆ ఇద్దరితో పాటు మరొక ఉగ్రవాదిని సైన్యం కాల్చి చంపినట్లు తెలుస్తోంది. తద్వారా సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై దాడి జరిగిన ప్రదేశానికి సమీపంలోనే వీరిద్దరిని హతమార్చి దీటైన సమాధానం ఇచ్చింది.(ఉగ్రవాది ఆదిల్కు శిక్షణ ఇచ్చింది అతడే!) కాగా 43 మంది జవాన్ల మరణాన్ని మరవక ముందే జైషే ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. పుల్వామాలోని పింగ్లన్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం అందుకున్న భద్రతా బలగాలు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలో అప్రమత్తమైన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో మేజర్ సహా ముగ్గురు భారత జవాన్లు వీరమరణం పొందారు. ఈ జవాన్లు 55 రాష్ట్రీయ రైఫిల్స్ దళానికి చెందిన వారు.(పుల్వామాలో ఎన్కౌంటర్; మేజర్ సహా ముగ్గురు జవాన్ల మృతి) చదవండి : రివేంజ్ తీర్చుకునేందుకు టైమ్, ప్లేస్ డిసైడ్ చేయండి.. ఉగ్ర మారణహోమం పాకిస్తాన్కు దీటైన సమాధానం చెబుతాం -
గొంతు చించుకొని అరవాలా: సానియా మీర్జా
సాక్షి, హైదరాబాద్ : తనకు దేశభక్తి ఉందని గొంతు చించుకొని అరవాలా? అని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అసహనం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్మాలిక్ను పెళ్లి చేసుకున్నందుకు ఆమెకు ఇబ్బందులు తప్పడం లేదు. భారత్-పాక్ మధ్య ఏ వివాదం చెలరేగినా భారత నెటిజన్లు సానియా మీర్జాను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. తాజాగా పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో కూడా ఆమెపై విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. ఉగ్రదాడిని ఆలస్యంగా ఖండించినందుకు భారత నెటిజన్లు ఆగ్రహంతో ఊగిపోయారు. అంతే కాకుండా సానియా తన ఫొటో షూట్లను పోస్ట్ చేయడం.. వారి కోపానికి మరింత ఆజ్యం పోసింది. దీంతో నొటికొచ్చినట్లు కామెంట్ చేశారు. చివరకు ఉగ్రదాడిని ఖండిస్తూ పోస్ట్ చేసినా వదల్లేదు. దీంతో తీవ్ర అసహనానికి గురైన ఆమె.. తన దేశభక్తి గురించి సోషల్ మీడియా వేదికగా వివరణ ఇస్తూ.. ట్రోలర్స్పై మండిపడింది. ‘ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో పోస్ట్లు పెడితేనే సెలబ్రిటీలకు దేశభక్తి ఉందని భావించే వాళ్ల కోసమే ఈ పోస్ట్ పెడుతున్నా. మేం సెలబ్రిటీలం కాబట్టి.. కొందరు వ్యక్తులు మాపై పనిగట్టుకొని విద్వేషాన్ని పెంచాలని ప్రయత్నం చేస్తున్నారు. దాని కోసం వారే ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. తాము ఉగ్రవాదానికి వ్యతిరేకమని గొంతు చించుకొని అరవాల్సిన అవసరం మాకు లేదు. ప్రతీ ఒక్కరు ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తారు. నేను నా దేశం కోసం ఆడుతాను, అందుకోసం నా చమట చిందిస్తాను. అలా నేను నా దేశానికి సేవ చేస్తున్నాను. సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు నేను అండగా నిలబడతాను. వాళ్లు ఈ దేశాన్ని కాపాడే నిజమైన హీరోలు. ఫిబ్రవరీ 14 మన దేశానికి బ్లాక్ డే. ఇలాంటి రోజు మరొకటి చూడొద్దని కోరుకుంటున్నా. ఈ రోజుని, జరిగిన ఘటనని అంత సులువుగా మర్చిపోలేము. కానీ ఇప్పటికీ ద్వేషం కంటే నేను శాంతిని కోరుకుంటున్నా. ఏదైన ఉపయోకరమైన విషయం జరగడం కోసం ఆగ్రహిస్తే.. అది మంచిది. ఉగ్రవాదానికి ఈ ప్రపంచంలో స్థానం లేదు.. ఉండదు కూడా. మీరు కూడా ఇంట్లో కూర్చొని సెలబ్రిటీలు ఎన్ని పోస్ట్లు చేశారు, ఏం పోస్ట్ చేశారో.. అని తీర్మానించడం మానేసి దేశానికి ఉపయోగేపడే పని చేయండి. దేశానికి మీ వొంతు సహాయం అందించండి.. మేం చేస్తున్నాం.. కానీ సోషల్మీడియాలో ప్రకటిస్తూ కాదు. అది సరైన పని’ అంటూ తన అసహనాన్ని వెల్లగక్కింది. We stand united 🕯 #PulwamaAttack pic.twitter.com/Cmeij5X1On — Sania Mirza (@MirzaSania) February 17, 2019 పాకిస్థాన్ పందిని చేసుకున్నావ్ ఇప్పుడి నీ దేశీయులు నా దేశం పై దాడి చేశారు.దాని పై స్పందించకుండా నీ ఫోటో షూట్ లు ఏంది — Sainath (@Sainath27209909) February 15, 2019 -
పాక్ జెండా.. బెస్ట్ టాయిలెట్ పేపరంట!
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచంలోనే అత్యుత్తమ టాయిలెట్ పేపర్ పాకిస్తాన్ జాతీయ జెండానేనట. అవును గూగులమ్మ ఇదే చెబుతోంది. ‘‘Best toilet paper in the world’ అని టైప్ చేస్తే.. పాకిస్తాన్ జాతీయ పతాకమే కనిపిస్తోంది. ఇంకేముంది.. పుల్వామా ఉగ్రదాడితో ఉడికిపోతున్న మనోళ్లకు మంచి అవకాశం దొరికింది. వెంటనే వాటి స్క్రీన్ షాట్లు తీసి పక్కదేశంపై కుళ్లు జోకులు పేల్చారు. అంతేకాకుండా వాటిని మీరు చూడండని నెట్టింట పెట్టారు. ‘Best toilet paper in the world’ అని టైప్ చేసి.. ఇమేజ్ ఆప్షన్ నొక్కితే పాకిస్తాన్ జాతీయ జెండా వస్తుందని, చూసి ఎంజాయ్ చేయండి అంటూ సోషల్ మీడియాలో హోరెత్తించారు. ఈ విషయం తెలసుకున్న గూగులమ్మ నిర్వాహకులు తప్పిదాన్ని సరిదిద్దుకున్నారు. కానీ నెటిజన్స్ సేవ్ చేసిన స్క్రీన్ షాట్లు మాత్రం ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నాయి. #Besttoiletpaperintheworld trending this is. But, pakistan deserves worst than this!They deserve to be rolled in red Hot chillies, And then Fried In hot Burning, Boiling oil! They deserve to be cut down From their hands, legs and tongue and then thrown on d streets for survival. pic.twitter.com/euWnVUYkAY — Gauri Joshi (@GauriJo43735050) February 17, 2019 #besttoiletpaperintheworld #on #google #PulwamaTerrorAttack #weallarereadytoattack #IndiaUnited #BLACK DAY FOR INDIA 🇮🇳#phulwamaattack #PulwamaRevenge #India #RIPBraveRealHero #WantRevengeOnBloodyPakistan pic.twitter.com/vYIY08wBCg — kundan singh rajput (@IamkundanRajput) February 16, 2019 -
అమర జవాన్లకు వైఎస్ జగన్ నివాళి
-
అమర జవాన్లకు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, ఏలూరు : పుల్వామా ఉగ్రదాడిలో అశువులు బాసిన అమర జవాన్లకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రద్ధాంజలి ఘటించింది. ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరుగుతున్న బీసీ గర్జన సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మొదటగా అమర జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. అంతకుముందు సభా వేదికపై జ్యోతిరావు పూలే, సాయిత్రీబాయి పూలే, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే గన్నవరం నుంచి ఏలూరుకు రోడ్డు మార్గంలో చేరుకున్న వైఎస్ జగన్కు పార్టీ నేతలు సాదరంగా స్వాగతం పలికారు. బీసీ గర్జన సభకు ఆర్.కృష్ణయ్య వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న బీసీ గర్జన సభకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హాజరయ్యారు. బీసీ గర్జన వేదికపై ఆయన కూడా ఆశీనులయ్యారు. వైఎస్ జగన్కు బీసీ ఫెడరేషన్ వినతిపత్రం బీసీల సమస్యలపై బీసీ ఫెడరేషన్ ఆల్ ఇండియా అధ్యక్షుడు జస్టిస్ ఈశ్వరయ్య తరఫున ఆయన ప్రతినిది గూడురి వెంకటేశ్వరరావు వైఎస్ జగన్మోహన్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఏలూరు సభా వేదికపై వైఎస్ జగన్ను కలిసిన బీసీ ఫెడరేషన్ ప్రతినిధులు.. పలు సమస్యలు, సలహాలతో కూడిన అర్జీని అందజేశారు. బీసీలకు అండగా ఉంటానని వైయస్ జగన్ హామీ ఇచ్చారు. -
ఉగ్రదాడి.. పాక్ క్రికెట్కు గట్టిషాక్!
న్యూఢిల్లీ : పుల్వామా ఘటన తర్వాత పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్.. దొరికిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇప్పటికే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ను ఉపసంహరించుకున్న భారత ప్రభుత్వం.. ఆ దేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని 200% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక తాజాగా ఆ దేశ క్రికెట్ బోర్డ్ పీసీబీకి భారత ఛానెల్ డీస్పోర్ట్స్ గట్టిషాక్ ఇచ్చింది. సరిగ్గా దాడి జరిగిన (ఫిబ్రవరి 14) రోజే ప్రారంభమైన పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ ప్రత్యక్షప్రసారాన్ని నిషేధించింది. (చదవండి: వారు చితక్కొట్టడంతోనే నా కొడుకు ఉగ్రవాదయ్యాడు) ఈ ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీర మరణం పొందగా.. 20 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటన పట్ల యావత్ భారత్ ఉడికిపోతుంది. ప్రతీకార దాడి జరగాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. సోషల్ మీడియా వేదికగా.. ఉగ్రదాడిలో అసువులు బాసిన వీరజవాన్లకు భారత ప్రజలు నివాళులర్పిస్తున్నారు. తోచిన విరాళాలు ఇస్తూ వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. ఈ ఉగ్ర దాడితో దేశమంతా విషాదంలో మునిగిపోయింది. ఈ పరిస్థితుల్లో పాక్ క్రికెట్ మ్యాచ్లు భారత్లో ప్రసారం కావడం భావ్యం కాదని భావించిన డీస్పోర్ట్స్ ప్రత్యక్షప్రసారాన్ని పూర్తిగా నిషేధించింది. వాస్తవానికి లీగ్ రెండో రోజే సాంకేతిక లోపంతో ప్రసారం నిలిచిపోయినప్పటికి.. అధికారికంగా మాత్రం లీగ్ 5వ గేమ్ నుంచి నిలిపేసినట్లు ఛానెల్ అధికారులు పేర్కొన్నారు. (చదవండి: అమర జవాన్లకు సెల్యూట్) మరోవైపు ఈ ఉగ్రదాడికి నిరసనగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుత ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫొటోలను క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా(సీసీఐ) తొలగించింది. బ్రాబోర్న్ స్టేడియంలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఫొటోలను తీసివేయాల్సిందిగా మేనేజింగ్ కమిటీ నిర్ణయించింది. ‘ఆల్ రౌండర్’ విభాగంలో ఇమ్రాన్ ఖాన్ ఫొటోను, క్రికెట్ జట్టు విభాగంలో పాకిస్తాన్ ఫొటోలను అక్కడ ఉంచారు. ఆ టీమ్లో ఇమ్రాన్ కూడా ఉండటంతో ఈ ఫొటోలను అక్కడ నుంచి తీసేశారు. భారతీయ ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు తీసుకున్నామని మేనేజింగ్ కమిటీ సీనియర్ ఒకరు తెలిపారు. (చదవండి : ఆ జవాన్ల పిల్లలను నేను చదివిస్తా) -
వాట్సాప్ పోస్ట్తో కశ్మీర్ విద్యార్థినుల అరెస్ట్
జైపూర్ : పుల్వామా ఉగ్రదాడిని స్వాగతిస్తూ వేడుకలు జరుపుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నలుగురు జమ్మూ కశ్మీర్ విద్యార్థినులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జైపూర్లోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో చదువుతున్న ఈ నలుగురు విద్యార్థినులను వర్సిటీ సైతం సస్పెండ్ చేసింది. వాట్సాప్లో దేశ వ్యతిరేక సందేశాన్ని షేర్ చేసినందుకు వారిని సస్పెండ్ చేసిన యూనివర్సిటీ అధికారులు అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. విద్యార్థినుల చర్యను తీవ్రంగా ఖండించిన నిమ్స్ యూనివర్సిటీ ఈ తరహా కార్యకలాపాలను వర్సిటీ సహించదని, వీరిని కాలేజ్తో పాటు హాస్టల్ నుంచి సస్పెండ్ చేశామని వెల్లడించింది. విద్యార్థినులను తల్వీన్ మంజూర్, ఇక్రా, జోహ్ర నజీర్, ఉజ్మా నజీర్గా గుర్తించారు. పుల్వామా దాడిపై వారు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రతీకారం తీర్చుకున్నామని వాట్సాప్లో పేర్కొన్నారు. పుల్వామా దాడి తమ ప్రతీకారానికి దీటైన సమాధానం అంటూ విద్యార్థినుల్లో ఒకరైన తల్వీన్ తన వాట్సాప్ స్టేటస్లో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై వర్సిటీలో నిరసనలు వెల్లువెత్తాయి. కాగా, జమ్మూ కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో గురువారం సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై జరిగిన ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. -
నీరజ్ దేవి (ఒక వీర జవాన్ భార్య)-రాయని డైరీ
దుఃఖ పడటానికి దేవుడు సమయం ఇవ్వలేదు. సైనికుడి భార్యకు దుఃఖమేమిటి అనుకున్నాడేమో! ప్రదీప్ కూడా అనేవాడు.. ‘సైనికుడి భార్యకు కన్నీళ్లేమిటి’ అని. కళ్లయినా తుడిచేవాడా! ‘తుడుచుకో’ అని నవ్వేసి రైలు ఎక్కేసేవాడు. పిల్లల్ని తీసుకుని చీకట్లోనే అత్తగారి ఊరికి చేరుకున్నాను. దారి మధ్యలో.. ‘‘ఎ..క్క..డి..కీ..’’ అని అడిగింది సోనా వచ్చీరాని మాటల్తో. రెండేళ్లు దానికి. ‘‘నాన్న దగ్గరికి’’ అని చెప్పాను. మేము వచ్చేటప్పటికి ప్రదీప్ ఇంకా అమ్మగారింటికి ‘చేరుకోలేదు’. ‘‘నాన్నేరీ’’ అంటోంది సోనా నిద్రకు సోలుతూ. సుప్రియకు అర్థమైపోయింది. ‘‘రారు కదమ్మా నాన్న ఇక ఎప్పటికీ’’ అంది చెల్లికి వినిపించకుండా. దగ్గరకు తీసుకుని గట్టిగా హత్తుకున్నాను. పదేళ్ల పిల్ల సుప్రియ! కొన్ని గంటల క్రితం వరకూ తనూ రెండేళ్ల పిల్లలానే ఉండేది. నాన్న ఫోన్ చేస్తే.. ‘ఎప్పుడొస్తావ్ నాన్నా’ అని అడిగేది. ‘నాన్నా.. మనం కట్టుకుంటున్న ఇంట్లో చెల్లికి, నాకు కలిపి.. మా ఇద్దరికే ప్రత్యేకంగా ఒక గది ఉంటుంది కదా’ అనేది. ‘ఉంటుంది తల్లీ. మరి నేను, అమ్మ.. ఎప్పుడైనా మీ గదిలోకి రావచ్చా’ అని అడిగేవాడు ప్రదీప్. ‘రావచ్చు నాన్నా. అయితే మా గదిలో ఉన్నప్పుడు కశ్మీర్ నుంచి ఫోన్ వస్తే నువ్వు ఫోన్ లిఫ్ట్ చెయ్యకూడదు. ఎప్పుడు నీకు ఫోన్ వచ్చినా, వెంటనే రమ్మనే కదా వస్తుంది’ అనేది.. మూతి అదోలా ముడిచి. అమ్మవాళ్ల ఊళ్లో ఉన్నప్పుడు గురువారం తెల్లవారు జామున ప్రదీప్ నుంచి ఫోన్ వచ్చింది. చాలాసేపు మాట్లాడాడు. పిల్లలిద్దరూ నిద్రపోతున్నారు. పది నిముషాలు సోనా గురించే మాట్లాడాడు. ‘జమ్మూ నుంచి శ్రీనగర్ వెళుతున్నాం’ అన్నాడు. ‘ఇంత రాత్రేమిటి?’ అన్నాను. నవ్వాడు. ‘‘నాకొక్కడికే కాదు రాత్రి. ఇంకా రెండువేల ఐదొందల మందికి కూడా. డెబ్భై ఎనిమిది వాహనాల్లో వరుసగా వెళుతున్నాం. వాహనాలు నడిపించడం లేదు మమ్మల్ని. దేశ సమగ్రతను కాపాడవలసిన బాధ్యత నడిపిస్తోంది’’ అన్నాడు! సుప్రియ గురించి, సోనా గురించి తప్ప ప్రదీప్ నాతో ఏం మాట్లాడినా సాటి జవానుతో మాట్లాడినట్లే ఉంటుంది. ‘‘సుప్రియ అడుగుతోంది.. ‘నాన్న మళ్లీ ఎప్పుడొస్తారని’. పని పూర్తవగానే వచ్చేస్తారని చెప్పాను’’ అన్నాను. నవ్వాడు. ‘‘సుప్రియ అడుగుతోంది. నేను అడగలేకపోతున్నాను’’ అన్నాను బెంగగా. ‘‘సైనికుడి భార్యవేనా నువ్వు?’’ అన్నాడు. పెద్ద శబ్దం. నా చేతిలోని ఫోనే పేలిపోయినంతగా శబ్దం! ‘ప్రదీప్.. ప్రదీప్..’ ప్రదీప్ పలకట్లేదు. సుప్రియ లేచింది. ‘ఏంటమ్మా..’ అని. మళ్లీ ఫోన్!! ‘‘ప్రదీప్’’ అన్నాను. నిశ్శబ్దం! ‘‘ప్రదీప్ భార్యేనా మీరు?’’ కంట్రోల్ రూమ్ నుంచి! నాకేదో అర్థమౌతోంది. ప్రదీప్ భార్యనని చెప్పుకోవాలంటే ఏడ్వకూడదు. ‘ఊ’ అన్నాను. పిల్లల్ని దగ్గరికి లాక్కున్నాను. ఊరింకా మేల్కోలేదు. బరసిరోహీ నుంచి సుఖ్సేన్పూర్ వచ్చేశాం. పిల్లలిద్దరూ.. నాన్న రావడం కోసం ఎదురు చూస్తున్నారు. అమరవీరుడైన ఒక జవాన్ రావడం కోసం సుఖ్సేన్పూర్ ఎదురు చూస్తోంది. సుప్రియ నా చెయ్యి పట్టుకుని మెల్లిగా ‘‘అమ్మా..’’ అని పిలిచింది. ‘‘నాన్న.. అక్కడ చెయ్యవలసిన పని పూర్తయి ఉండదు కదమ్మా..’’ అంది. నాన్నపై ఉన్న ప్రేమంతా కన్నీళ్లుగా కరిగి, దాని చెంపల్ని తడిపేస్తోంది. తన కళ్లు కదా తుడుచుకుని చెప్పాల్సింది.. నా కళ్లు తుడుస్తూ చెప్పింది.. ‘‘నాన్న మిగిల్చిపోయిన పని నేను పూర్తి చేస్తానమ్మా..’’ అని చెప్పింది! ఒడిలోకి తీసుకున్నాను. సైనికుడి కూతురు అది. -మాధవ్ శింగరాజు -
సమర్థ దౌత్యమే సరైన ఆయుధం
కశ్మీర్లోయలో పాకిస్తాన్ ఉగ్రపంజా విసిరి విశేషంగా ప్రాణనష్టం సంభవించిన ప్రతిసారీ కేంద్ర ప్రభుత్వ ప్రతిస్పందన ఒకే విధంగా ఉంటుంది. ప్రదానమంత్రి ఆగ్రహం వెలిబుచ్చుతారు. పాకిస్తాన్కి తగినవిధంగా జవాబు చెబుతామంటూ తీవ్రంగా హెచ్చరిస్తారు. అంతర్జాతీయంగా పాకిస్తాన్ను ఒంటరి చేయడానికి అవసరమైన సకల చర్యలూ తీసుకుంటామని హామీ ఇస్తారు. పాకిస్తాన్ను ఉగ్ర దేశంగా అభివర్ణిస్తారు. కొన్ని వారాలపాటు ప్రతీకార దాడుల గురించీ, ‘ముహ్ తోడ్ జవాబ్’ (మొహం పగిలే జవాబు) గురించీ ప్రధాని నరేంద్రమోదీ హెచ్చ రిస్తారు. టెలివి జన్ చానళ్ళు హడావిడి చేస్తాయి. వార్తాపత్రికలలో ప్రధాన శీర్షికలుగా వస్తాయి. 2008లో ముంబయ్పైన పాకిస్తాన్ ముష్కరులు దాడి చేసినప్పటి నుంచీ మొన్న పుల్వామాలో కేంద్ర రిజర్వ్ పోలీసు దళాల (సీఆర్ పీఎఫ్)పైన దాడి వరకూ ఇదే వరుస. గురువారంనాడు అదిల్ మహమ్మద్ దార్ అనే కశ్మీరీ యువకుడు పేలుడు పదార్థాలను స్కార్పియో కారునిండా పెట్టుకొని సీఆర్పీఎఫ్ జవాన్లను తీసుకొని వెడుతున్న ట్రక్కుల శ్రేణిని ఢీకొట్టి పేలిపో యాడు. ఫలితంగా 40 మంది జవాన్లు మరణించారు. అనేకమంది గాయప డ్డారు. లోగడ ఎన్నడూ ఇంతటి తీవ్రమైన దాడి జరగలేదు. జమ్మూ–కశ్మీర్ అసెంబ్లీ భవనంపైన 2001లో పేలుడు పదార్థాలు కలిగిన ట్రక్కుతో దాడి జరిపిందీ, పఠాన్కోట, నాగ్రోతా, ఉడిలోని సైనిక స్థావరాలపైన దాడులు చేసిందీ కశ్మీర్కు చెందిన పౌరులు కాదు. వారు పాకిస్తానీయులు. అక్కడ ఎంపిక చేసి, శిక్షణ ఇచ్చిన ఉగ్రవాదులు. 2000 ఏప్రిల్లో కశ్మీర్లో తొలి మానవబాంబు పేలింది. బాదామీబాగ్లోని సైనిక ప్రధాన కార్యాలయంపైన దాడి చేసి ఇద్దరు సైనికులను హత్యచేశారు. ఈ దాడిలో పాల్గొన్న వ్యక్తి కశ్మీర్కు చెందిన యువ కుడు. కశ్మీర్కు చెందిన యువకులను ఆకర్షించి పాక్ తీసుకువెళ్ళి వారికి ఉగ్రవాద కార్యకలాపాలలో శిక్షణ ఇచ్చి కశ్మీర్పైన ప్రయోగించడం పాకిస్తాన్ సైన్యం పోషి స్తున్న ఉగ్రవాదసంస్థల నిరంతర కార్యక్రమం. శనివారం దేశీయాంగ మంత్రి రాజ్నాథ్సింగ్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాలు ప్రభు త్వానికి అండగా నిలబడతామని ప్రకటించాయి. పుల్వామా దాడిని ఖండిస్తూ ఒక తీర్మానాన్ని సైతం అఖిలపక్ష సభ ఈ సందర్భంగా ఆమోదించింది. కశ్మీర్లో పాకిస్తాన్ చిచ్చు కశ్మీర్లోయలో ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చిచ్చుపెట్టే శక్తి పాకిస్తాన్కు ఉన్నది. పాకిస్తాన్కు ఇండియా ఎటువంటి జవాబు ఇవ్వగలదు? 2016 సెప్టెం బర్లో ఉగ్రదాడులకు ప్రతీకారంగా సర్జికల్ స్ట్రయిక్ చేసినట్టు ప్రభుత్వం ప్రక టించింది. దేశంలోనూ, విదేశాలలోనూ సర్జికల్ స్ట్రయిక్ గురించి నరేంద్ర మోదీ పలు సందర్భాలలో చెప్పారు. అంతా బూటకమేనని పాకిస్తాన్ ప్రచారం చేసింది. ఇప్పుడు కూడా ఏదో ఒకటి చేయాలనీ, ప్రతీకారం తీర్చుకోవాలనీ ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతోంది. సర్జికల్ స్ట్రయిక్ కంటే నేరుగా పాకిస్తాన్ భూభా గంలోకి యుద్ధవిమానాలు వెళ్ళి బాంబింగ్ జరిపితే పాకిస్తాన్ ఇకపైన జాగ్రత్తగా వ్యవహరిస్తుందని కొందరు సూచిస్తున్నారు. అయితే మన యుద్ధవిమానాలు పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశిస్తే పాక్ సైనికులు చేతులు ముడుచుకొని కూర్చుంటారా? వారికి మనకిలాగే రాడార్ వ్యవస్థ ఉండదా? అయినా సరే, ఆవేశం, ఆక్రోశం ఉన్న సమయంలో ఇటువంటి ఆలోచనలు వస్తాయి. నాయ కులు ఇటువంటి ప్రకటనలు సైతం చేస్తారు. ఎన్నికలు సమీపంలో ఉన్నాయి కనుకనే అసాధారణ రీతిలో ప్రభుత్వ స్పందన ఉంటుంది. ఈ కారణంగానే ప్రతిపక్షాలు సైతం ఇంటెలిజెన్స్ వైఫల్యాల గురించి ఏ మాత్రం మాట్లాడకుండా ఏకతాటిపై నిలబడి ప్రభుత్వానికి మద్దతు తెలిపాయి. ఈ పరిస్థితిలో కశ్మీర్ను రావణ కాష్టంగా మార్చిన భారత ప్రభుత్వ విధానాలనూ, వైఫల్యాలనూ ప్రస్తా వించడం సముచితం కాదు. ఇది సంతాప సమయం. విశ్లేషణలకూ, విమర్శ లకూ తగిన సందర్భం కాదు. సైనికంగా స్పందిస్తామంటూ, పాకిస్తాన్కి గుణపాఠం చెబుతామంటూ ప్రధాని గంభీరంగా ప్రకటిస్తుంటే ఆయన వైఖరిని ప్రశ్నించడం అవివేకం. అందుకే అఖిలపక్షం ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఏమి చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో నిర్ణయించే బాధ్యత పూర్తిగా సైన్యానికి వదిలినట్టు నరేంద్ర మోదీ ప్రకటించారు. ఎప్పుడో ఏదో ప్రకటన వస్తుంది. ఇలా అధీనరేఖ దాటి కొందరు శత్రు సైనికులను మట్టుబెట్టి ప్రతీకారం తీర్చుకోవడం కొత్త కాదు. ప్రతీకారం చేసినట్టు పదేపదే చెప్పుకునే సంప్ర దాయానికి మోదీ శ్రీకారం చుట్టారు. కశ్మీర్పైన జరుగుతున్న దాడుల పట్ల కోపంతో కుతకుతలాడుతున్న దేశప్రజలను శాంతింపజేయడానికి ఉద్దేశించిన ప్రక్రియ ఇది. సర్జికల్ స్ట్రయిక్లు నిర్వహించామని ప్రకటించడమే కాకుండా వాటి తాలూకు దృశ్యాలను కూడా ప్రభుత్వం గతంలోనే విడుదల చేసింది. ఎన్నికలు చాలా దూరంగా ఉన్న దశలోనే సర్జికల్ స్ట్రయిక్కు అత్యంత ప్రచారం ఇచ్చినవారు ఎన్నికలు సమీపించిన తరుణంలో చేయబోయే ప్రతీకారానికి ప్రచారం ఇవ్వకుండా ఉంటారా? ఏదో ఒక ప్రతీకార చర్య తీసుకున్నట్టూ, పాకిస్తాన్ మదం అణచినట్టూ త్వరలోనే ప్రభుత్వం ప్రక టిస్తుంది. ఏ విధంగా చూసినా ఇది అనివార్యం. కొన్ని మాసాల తర్వాత ప్రజలు ఈ అంశాన్ని మర చిపోతారు. ఇది తాత్కాలిక ఉపశమనమే కానీ కశ్మీర్ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం కాదు. సర్జికల్ స్ట్రయిక్స్ తర్వాత ఉగ్రవాద సంస్థలు, పాకిస్తాన్ ప్రభుత్వం ఒక అంగుళమైనా వెనుకంజ వేశాయా? కశ్మీర్లో ఉగ్రవాద ఘటనలు తగ్గుముఖం పట్టాయా? ఉగ్రవాదంవైపు మొగ్గుతున్న యువత ఉగ్రవాదుల దాడులు తగ్గినట్టు ప్రభుత్వం చెబుతున్నది. కానీ కొన్నేళ్ళుగా కశ్మీర్లో యువకులు తీవ్రవాదంవైపు మొగ్గుతున్నారు. తుపాకీ నీడన పుట్టి పెరిగిన యువకులకు సైనికులతో కానీ ప్రభుత్వాధికారులతో కానీ చేదు అనుభవం ఎదురైతే వారు ఉగ్రవాద సంస్థలలో చేరిపోతున్నారు. ఫేస్బుక్, ట్వీటర్, వాట్సాప్ వంటి అధునాతన సాంకేతికత ఉగ్రవాదం ప్రచారానికి కూడా దోహదం చేస్తోంది. ప్రపంచం పూర్తిగా తెలియని యువకులను ఆకర్షించడానికి రకరకాల వీడియోలు తయారు చేసి వదులుతున్నారు. సీఆర్పీఎఫ్ జవాన్లు దార్ను చితకబాదడంతో అతడు ఉగ్రవాదాన్ని ఆశ్రయించాడంటూ దార్ తల్లి దండ్రులు చెప్పారు. ఆత్మాహుతి దాడిలో మరణించిన జవాన్ల తల్లిదండుల వలెనే తాము కూడా కొడుకు చనిపోయాడని కుమిలిపోతున్నామని అన్నారు. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులోనైనా దార్ తల్లిదండ్రుల పుత్రశోకానికి కారణాలు కనుగొని తగిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉన్నది. పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ నాయకత్వంలోని పీడీపీ– బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడం కశ్మీర్లోయలో అస్థిరతకూ, అనిశ్చితికీ, శాంతభద్రతల వైఫల్యానికీ, పరిపాలన దెబ్బతినడానికీ దారితీసింది. ఇటువంటి అనిశ్చిత పరిస్థితులలోనే ఉగ్రవాదం పైచేయి సాధిస్తుంది. ఇటువంటి వాతా వరణమే 1989లోనూ, 2010లోనూ కశ్మీర్లోయలో ప్రబలింది. ఈ పరిస్థితిని ఎప్పటికైనా చక్కదిద్దుకోవలసిందే. కశ్మీరీల మద్దతునూ, విధేయతనూ భారత ప్రభుత్వం, ప్రజ సంపాదించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం ప్రథమ కర్తవ్యం. ముఖ్యమైన అంశం పాకిస్తాన్కు సంబంధించింది. ఆ దేశంలో ఉగ్రవాద సంస్థలకు ఊతం లభించినంత కాలం కశ్మీర్లో శాంతిభద్రతలు రక్షించడం అసాధ్యం. పాకిస్తాన్ను బలప్రయోగంతో లొంగదీసుకునేందుకు ప్రయత్నించడం వృధా ప్రయాస. అది కూడా అణుశక్తి కలిగిన రాజ్యం. పైగా పాకిస్తాన్కు కొండంత అండగా చైనా ఉన్నది. ఆత్మాహుతి దాడి తమ పనే అని చాటుకున్న జైషే మహమ్మద్ నాయకుడు మసూద్ అజహర్ను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చాలన్న భారత ప్రతిపాదనకు చైనా పదేపదే మోకాలడ్డుతున్నది. సీఆర్పీఎఫ్ జవాన్ల మృతిపట్ల సంతాపం తెలిపే ప్రకటనలో సైతం చైనా పాకి స్తాన్ ప్రస్తావన చేయలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సానుభూతి ప్రకటిస్తూ మోదీకి సందేశం పంపించారు కానీ అమెరికా మరోవైపు పాకిస్తాన్కు గొప్ప ఉపకారం చేస్తున్నది. వ్యూహాత్మకంగా బలమైన స్థితిలో పాకి స్తాన్ ఉండ బోతోంది. మరోవైపున అఫ్ఘానిస్తాన్ నుంచి అమెరికా సైనికులు పూర్తిగా నిష్క్రమించబోతున్నారు. ప్రపంచంలో ఎదురులేని శక్తిగా అమెరికాను అభివృద్ధి చేస్తానంటూ అధికారంలోకి వచ్చిన ట్రంప్ క్రమంగా అమెరికా సైనికులను సంక్షుభిత ప్రాంతాల నుంచి ఉపసంహరించుకుంటున్నారు. అఫ్ఘానిస్తాన్ నుంచి అమెరికా సైనికులు వైదొలగడం అంటే అఫ్ఘానిస్తాన్ భద్రతాదళాలపైన దాడులు చేస్తున్న తాలిబాన్కు అఫ్ఘానిస్తాన్ను అప్పగించడమే. పరోక్షంగా పాకిస్తాన్ చేతు లలో అఫ్ఘానిస్తాన్ను పెట్టడమే. దౌత్యరంగంలో పాకిస్తాన్ ప్రభుత్వాలు మన ప్రభుత్వాల కంటే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయనడానికి ఇది ఒక స్పష్టమైన ఉదాహరణ. అఫ్ఘానిస్తాన్ వ్యవహారంలో భారత్ ఒంటరి అఫ్ఘానిస్తాన్ సమస్య పరిష్కారానికి మాస్కోలో రష్యా, చైనా, పాకిస్తాన్ ప్రతి నిధుల మధ్య చర్చలు జరిగాయి. ఇందులో భారత్ ప్రస్తావన కానీ ప్రమేయం కానీ లేదు. మన్మోహన్సింగ్. నరేంద్రమోదీ అఫ్ఘానిస్తాన్ను సందర్శించి, అఫ్ఘాన్ సైనికులకు ఇండియాలో శిక్షణ ఇచ్చి, ఆర్థిక సహాయం చేసి, కాబూల్లో పార్ల మెంటు భవన నిర్మాణంలో తోడ్పడినప్పటికీ అఫ్ఘాన్ సంక్షోభం పరిష్కరించ డంలో భారత్ ప్రమేయం ఉండాలని అమెరికా కానీ చైనా కానీ అఫ్ఘానిస్తాన్ కానీ భావించడం లేదు. అంతే కాదు. అఫ్ఘానిస్తాన్లో తాలిబాన్ అనుకూల ప్రభు త్వమో, తాలిబాన్ నడిపించే ప్రభుత్వమో ఏర్పడితే ఇంతకాలం ఆఫ్ఘాన్ భద్రతా దళాలతో పోరాడిన తాలిబాన్ను పాకిస్తాన్ కశ్మీర్వైపు మళ్ళిస్తుంది. 1989లో అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ సంస్థ (సీఐఏ) సహకారంతో పాకి స్తాన్ ప్రోత్సాహంతో తాలిబాన్ అఫ్ఘానిస్తాన్పై పోరాటం చేసి ఆ దేశం నుంచి సోవియెట్ సైన్యాన్ని జయప్రదంగా పంపించివేసింది. అంతవరకూ సోవియెట్ సైన్యంతో పోరాడిన తాలిబాన్ను కశ్మీర్పైకి పంపించింది పాకిస్తాన్. దాని ఫలితంగా ఉగ్రవాదుల దాడులతో కశ్మీర్ కొన్ని సంవత్సరాలు అతలాకుతలమై పోయింది. ఇప్పుడు కూడా తాలిబాన్ను ప్రయోగిస్తే కశ్మీర్ మరోసారి అగ్ని గుండంగా మారిపోతుంది. జైషే మహమ్మద్, లష్కరే తొయిబాలు రెండు అఫ్ఘాన్ సంక్షోభం సృష్టించిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలే. ఇటువంటి సంస్థల సహకారంతో కశ్మీర్లో చిచ్చుపెట్టడం ద్వారా ఇండియాను నిరంతరంగా వేధిస్తూ ఉండటం పాకిస్తాన్ విధానం. సైనిక చర్య తీసుకోవాలంటే ఇజ్రేల్ ఎంటెబేలో చేసిన సాహసం ఇండియా చేయాలి. ఇస్లామాబాద్ పరిసరాలలో తలదాచుకున్న లాడెన్ను ఒబామా పంపిన సైనికులు మట్టుబెట్టినట్టే సయీద్ హఫీజ్, అజహర్ మసూద్ తదితర ఉగ్రవాదులను హతమర్చాలి. అంతటి తెగింపు, సాహసం, శక్తి ఇండియాకు ఉన్నాయా? దూరపు లక్ష్యాలను పేల్చేందుకు స్నైపర్స్ ఉపయోగించే ఆధునిక ఆయుధాలు భారత సైనికుల చేతుల్లో లేవు. పాత తరం రష్యా ఆయుధాలు భారత సైనికుల దగ్గర ఉంటే కొత్తతరం చైనా ఆయుధాలు పాకిస్తాన్ స్నైపర్స్ చేతుల్లో ఉన్నాయి. చైనా ఆయుధాల శక్తి, విస్తృతి అధికం. ఇదీ మనం గుర్తించాల్సిన క్షేత్ర వాస్తవికత. పాకిస్తాన్తో పూర్తి స్థాయి యుద్ధం అనూహ్యం. యుద్ధం ఆరంభించడం తేలికే. ముగించడం కష్టం. సర్జికల్ స్ట్రయిక్స్ వంటివి నిష్ప్రయోజనం. యుద్ధ విమానాల ప్రయోగం సైతం అంతే. దేశవాసుల ఆగ్రహం తగ్గించడానికి మాత్రమే ఇవి ఉపయోగపడతాయి. అఫ్ఘానిస్తాన్ నుంచి సోవియట్ యూనియన్ను తాలిబాన్ సహకారంతో పారదోలినా రష్యాతో పాకి స్తాన్ సంబంధాలు పూర్తిగా చెడిపోలేదు. న్యూయార్క్లో జంటశిఖరాలపైన దాడులు చేయించి విధ్వంసం సృష్టిం చిన బిన్లాడెన్కు ఆశ్రయం ఇచ్చినా, అఫ్ఘానిస్తాన్లో అమెరికా సైనికులను పాకిస్తాన్ మద్దతు ఇస్తున్న తాలిబాన్ మట్టుపెడుతున్నా అమెరికాతో పాకిస్తాన్ సంబంధాలు బాగానే ఉన్నాయి. చైనా–పాకిస్తాన్ మైత్రి ప్రగాఢమైనది. పాకి స్తాన్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఉగ్రవాదాన్ని పోషిస్తున్నందుకు పాకిస్తాన్ మూల్యం చెల్లిస్తున్నది. దౌత్యరంగంలో మాత్రం వీగిపోకుండా నిలిచింది. ఎప్ప టికప్పుడు ఎత్తుగడలతో నెట్టుకొస్తున్నది. అటువంటి కపట రాజకీయాలతో పబ్బం గడుపుకుంటున్న పాకిస్తాన్ నిజస్వరూపాన్ని ప్రపంచానికి చాటవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆ దేశం ఉగ్ర వాదానికి స్థావరంగా ఉన్నదనే సందేశం ప్రపంచ దేశాలన్నిటికీ చేర్చాలి. ఆ దిశగా భారత విదేశాంగ యంత్రాంగం యావత్తూ కృషి చేయడానికి పుల్వామా దాడిని ఒక బలమైన సందర్భంగా వినియోగించుకోవాలి. -కె. రామచంద్రమూర్తి -
ఉగ్రవాది ఆదిల్కు శిక్షణ ఇచ్చింది అతడే!
అప్పటి దాకా సహచరులతో చర్చిస్తూ, కుటుంబ సభ్యులతో ఫోన్లలో మాట్లాడుతూ సాఫీగా సాగిపోతున్న భారత సైనికుల ప్రయాణంలో ఒక్కసారిగా మృత్యుఘోష. జవాన్ల కాన్వాయ్ని ఢీకొట్టి యావత్ భారతావనికి తీరని శోకం మిగిల్చాడు కరుడు గట్టిన ఉగ్రవాది, జైషే కమాండర్ ఆదిల్ అలియాస్ వకాస్. తనను తాను పేల్చుకుని మరీ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. జవాన్లను పొట్టనబెట్టుకోవడానికి ముందే తన ఆశయం నెరవేరిన వెంటనే స్వర్గంలో ఉంటానంటూ ఆదిల్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఆత్మాహుతికి ముందు అతడు ఎంతగా శిక్షణ పొందాడో అర్థమవుతోంది. (మాట ఇస్తున్నా.. ప్రతీ కన్నీటి బొట్టుకు ప్రతీకారం : మోదీ) పుల్వామాలోని కాకపొరా ప్రాంతానికి చెందిన ఆదిల్ పాఠశాల స్థాయిలోనే చదువు మానేశాడు. అనంతరం కొద్దికాలం తాపీమేస్త్రీగా, మరికొంత కాలం మసీదులో పనిచేశాడు. 2016, మార్చి 19న ఇద్దరు యువకులతో కలిసి ఆదిల్ అదృశ్యమయ్యాడు. ఇక ఆనాటి నుంచి జైషే కమాండర్గా మారిన ఆదిల్ ప్రస్తుతం ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు. అయితే తనకు అప్పగించిన ఆపరేషన్ను ఆదిల్ పక్కాగా అమలు చేయడానికి జైషే మహ్మద్ టాప్ కమాండర్ ఘాజీ అబ్దుల్ రషీద్ ఇచ్చిన శిక్షణే కారణమని ఇంటలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. (ఈ వీడియోను చూసేలోగా స్వర్గంలో ఉంటా!) ఐఈడీ ఎక్స్పర్ట్ ఘాజీ.. జైషే ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజహర్కు ఘాజీ అత్యంత నమ్మకస్తుడు. ఆఫ్గనిస్తాన్లోని తాలిబన్ గ్రూపులో శిక్షణ పొందిన ఈ 32 ఏళ్ల ఉగ్రవాది.. 2008లో జైషేలో చేరాడు. అనతి కాలంలోనే మసూద్కు అత్యంత సన్నిహితుడిగా మారిన ఘాజీ.. ఐఈడీ తయారు చేయడం, అమర్చడం, పేల్చడంలో నిపుణుడు. 2010 నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్లో జైషేలో యువకులను చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే కొన్నాళ్ల క్రితం పుల్వామా జిల్లాలో జైషే చీఫ్ మసూద్ మేనల్లుళ్లు తాలా రషీద్ (2017), ఉస్మాన్ (2018)లను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఈ క్రమంలో వారి మృతికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందిగా భావించిన మసూద్ ఘాజీని రంగంలోకి దింపినట్లుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో భారత్కు చేరుకున్న ఘాజీ దక్షిణ కశ్మీర్పై దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. తీవ్రవాద భావాలున్న యువకులను ఆకర్షించి... జైషేను బలోపేతం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఆదిల్ వంటి ఎంతోమంది యువకులను అతడు జైషేలో చేర్చుకుని శిక్షణనిచ్చినట్టు సమాచారం. ఎక్కడైతే తన మేనల్లుళ్లను అంతం చేశారో .. అదే జిల్లాలో జవాన్లే లక్ష్యంగా దాడికి సిద్ధం చేయాలంటూ మసూద్ ఇటీవలే ఘాజీకి సూచించిన క్రమంలో ఆదిల్ ద్వారా గురువారం నాటి హింసరచన సాగించినట్టు తెలుస్తోంది. ఇదిలాఉండగా.. ఇటీవల పుల్వామాలోని రతన్పోరాలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఘాజీ తృటిలో తప్పించుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఏదేమైనా సరే భరత జాతికి ఆగ్రహం తెప్పించిన మసూద్, ఘాజీ వంటి వారిని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు.. భారత్ సరైన సమాధానం చెప్పే రోజు ఎంతో దూరంలో లేదన్న విషయం జగమెరిగిన సత్యం. -
మాట ఇస్తున్నా.. ప్రతీ కన్నీటి బొట్టుకు ప్రతీకారం : మోదీ
ముంబై : భారత వీరజవాన్ల కుటుంబాలు, యావత్ భారతావని కారుస్తున్న ప్రతీ కన్నీటి బొట్టుకు తగిన ప్రతీకారం తీర్చుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదులను హెచ్చరించారు. శనివారం మహారాష్ట్రలో పర్యటించిన ఆయన... పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన మహారాష్ట్ర జవాన్లు నితిన్ రాథోడ్, సంజయ్ రాజ్పుత్లకు నివాళులు అర్పించారు. అనంతరం మోదీ ప్రసంగిస్తూ .. ‘ ఇది సంయమనం పాటించాల్సిన సమయం. అయితే మన జవాన్లను అత్యంత పాశవికంగా అంతమొందించిన వారెవరిని విడిచిపెట్టనని ప్రతీ ఒక్కరికి మాట ఇస్తున్నా. మన సైనికుల పట్ల యావత్ భరత జాతికి పూర్తి నమ్మకం ఉంది. వీర జవాన్ల త్యాగమెన్నటికీ వృథా కాదు. ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా సరే మన సైనికులు వారిని బయటికి లాగి కచ్చితంగా సరైన శిక్షే విధిస్తారు. మన పక్క దేశం ఉగ్రవాదానికి పర్యాయపదంగా మారింది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోంది. ఈ ఘటన వారి దివాళాకోరుతనం, దిగజారుడుతనాలకు నిదర్శనం. పాపం చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదు’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. కాగా కశ్మీర్లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఓ స్కార్పియో ఎస్యూవీలో దాదాపు 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) నింపుకున్న ఆత్మాహుతి దళసభ్యుడు తన కారుతో.. జవాన్ల కాన్వాయ్లోని ఓ బస్సును ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. -
తమిళనాడు చేరుకున్న జవాన్ల మృతదేహాలు
-
వీరజవాన్ల కుటుంబాలకు సూపర్స్టార్ భారీ విరాళం
ముంబై : పుల్వామా దాడిలో అసువులు బాసిన వీరజవాన్ల కుటుంబాలకు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అండగా నిలిచారు. ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షలు చొప్పున విరాళంగా మొత్తం రూ. 2.5 కోట్లు ప్రకటించారు. గురువారం జమ్మూ కశ్మీర్లో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిలో 49 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఘటనపై ప్రపంచం అంతా భారత్కు మద్దతుగా నిలిచింది. అదే సమయంలో దేశంలోని చాలామంది అమరుల కుటుంబాలకు అండగా ఉంటామంటూ ముందుకు వస్తున్నారు. -
తమిళనాడు చేరుకున్న జవాన్ల మృతదేహాలు
చెన్నై: కశ్మీర్లో తీవ్రవాదుల దాడిలో మరణించిన ఇద్దరు తమిళ జవానుల మృతదేహాలను ప్రత్యేక విమానంలో తిరుచ్చి విమానాశ్రయానికి తీసుకువచ్చారు. అక్కడి నుంచి ఉగ్రదాడిలో చనిపోయిన శివచంద్రన్ స్వగ్రామం కారైకుడికి, మరో జవాను స్వగ్రామం తూత్తుకుడికి ప్రత్యేక మిలటరీ వాహనాల్లో తరలించారు. ముందుగా తిరుచ్చి విమానాశ్రయం చేరుకున్న జవానుల మృతదేహాలకు కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర మంత్రులు, అధికారులు ఘననివాళులు అర్పించారు. అక్కడి నుంచి అధికార లాంఛనాలతో ఖననం చేసేందుకు జవానుల గ్రామాలకు తరలించారు. తిరుచ్చి నుంచి రెండు మార్గాల ద్వారా బయలుదేరిన జవానుల భౌతికకాయాలకు దారిపొడవునా ప్రజలు అశ్రునివాళులు అర్పించారు. అధికారులు, మంత్రులతో పాటు ప్రజలు గౌరవ సూచకంగా అంతిమ యాత్రలో పాల్గొనడంలో రోడ్లు స్తంభించిపోయాయి. అమరవీరుల త్యాగాలను మరువబోమంటూ, జైహింద్ అంటూ యువకులు, అన్నివర్గాల ప్రజలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. -
సౌదీ రాజు పాక్ పర్యటన వాయిదా
ఇస్లామాబాద్ : సౌదీ అరేబియా రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ పాకిస్థాన్లో రెండు రోజుల పాటు పర్యటించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఈనెల 16,17 తేదీల్లో ఆయన పాక్లో పర్యటించి పలు ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల పర్యటన కాస్త ఆలస్యమైనట్లు తెలిసింది. శనివారం నుంచి ప్రారంభం కావాల్సిన ఆయన విదేశీ పర్యటన ఆదివారం నుంచి యథావిధిగా కొనసాగనుందని పాకిస్థాన్ ప్రభుత్వం వెల్లడించింది. సౌదీ రాజు వెంట పెద్ద ఎత్తున వ్యాపార ప్రతినిధులు ఇక్కడకు రానున్నారు. అయితే పర్యటనలో మార్పులు, ఆలస్యంపై పాక్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని సౌదీ రాజు సల్మాన్ తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. దాడి జరిగిన వెంటనే ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. భారత ప్రధాని నరేంద్రమోదీ ఆహ్వానం మేరకు వచ్చే వారం సౌదీ రాజు తమ దేశ వ్యాపార ప్రతినిధులతో భారత్కు రానున్నారు. -
‘చాలు.. ఇక చాలు.. గుణపాఠం చెప్పాల్సిందే’
చండీగఢ్ : ‘చాలు.. ఇక చాలు.. శాంతి మంత్రం జపించాల్సిన అవసరం లేకుండా చేశారు. వాళ్లకు గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఇందుకు సంబంధించి భారత ప్రభుత్వం సరైన సమయంలో స్పందిస్తుందని భావిస్తున్నాను’ అంటూ పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ భావోద్వేగానికి లోనయ్యారు. పుల్వామా ఉగ్రదాడిని ఖండిస్తూ పంజాబ్ అసెంబ్లీ శనివారం తీర్మానం చేసింది. ఈ క్రమంలో అమరీందర్ సింగ్ మాట్లాడుతూ... పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శాంతి అంటూ ప్రసంగాలు చేస్తుంటే.. ఇక ఆ దేశ ఆర్మీ జనరల్ కమర్ జావేద్ బజ్వా మాత్రం యుద్ధం గురించి మాట్లాడి అసలు నిజాన్ని బట్టబయలు చేస్తారు అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పంజాబీ(పాక్) అయిన జావేద్ బజ్వా... తానెంతటి ధైర్య సాహసాలు ప్రదర్శించగలడో.. భారత పంజాబీలు కూడా అంతటి ధైర్యవంతులేనన్న విషయం గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. పంజాబ్ జోలికి రావాలని చూస్తే బజ్వాను ఎలా దారికి తేవాలో ఇక్కడి పంజాబీలకు తెలుసునని హెచ్చరించారు. మరోసారి దుస్సాహసానికి పాల్పడకుండా ఉండాలంటే.. ‘పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురునానక్ దేవ్ యూనివర్సిటీ స్థాపించి గురుద్వార సాహిబ్ సేవ చేస్తానంటారు. కానీ ఆయన ఐఎస్ఐ మాత్రం ఇలాంటి చర్యలకు పాల్పడుతుంది. ద్వంద్వ విధానాలకు ఇది నిదర్శనం. ఆ దేశ ఆర్మీ జనరల్ బజ్వా మద్దతుతో గద్దెనెక్కిన ఇమ్రాన్ ఖాన్ ఇంతకన్నా ఏం చేస్తారు. చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి హేయమైన ఘటనలు ఆపండి. మరొక విషయం.. కొన్ని దేశాల ప్రోద్బలంతో 2020లో రిఫరెండం చేపట్టాలని చూస్తున్న కలిస్థాన్ వేర్పాటువాదుల ఆటలు కూడా ఇకపై కొనసాగవు’ అని అమరీందర్ సింగ్ హెచ్చరికలు జారీ చేశారు. ‘వాళ్లు(ఉగ్రవాదులు) అతిగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోనట్లైతే వారు మరోసారి దుస్సాహసానికి పాల్పడే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా పాకిస్తాన్ ఎత్తుగడలను సరైన విధంగా అంచనా వేయాలి. వారికి బుద్ధి చెప్పాలి’ అని కేంద్ర ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు. కాగా సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న ముష్కరులపై యావత్ భారతావని ఆవేశంతో రగిలిపోతోంది. జవాన్ల త్యాగాలు వృథా కాకుండా ఉండాలంటే ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు సరైన జవాబు ఇచ్చి తీరాల్సిందేనంటూ తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. కశ్మీర్లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఓ స్కార్పియో ఎస్యూవీలో దాదాపు 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) నింపుకున్న ఆత్మాహుతి దళసభ్యుడు తన కారుతో.. జవాన్ల కాన్వాయ్లోని ఓ బస్సును ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. -
సైనికుల త్యాగాలకు వెలకట్టలేం : చంద్రబాబు
సాక్షి, అమరావతి : పుల్వామా ఉగ్రదాడి ఘటన బాధాకరమని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో భారత ప్రభుత్వం తీసుకునే ఎలాంటి చర్యలకైనా ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రాణాలను సైతం పణంగా పెట్టి.. మన కుటుంబాల కోసం పాటుపడుతున్న సైనికుల త్యాగం వెలకట్టలేనిదని కొనియాడారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరకుండా కేంద్ర, రాష్ట్రాలు పటిష్ట వ్యూహాన్ని అనుసరించాలని సీఎం సూచించారు. అమరుల త్యాగాలను జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు. జవాన్ల కుటుంబాలకు ప్రతిఒక్కరూ అండగా నిలవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. వీర జవాన్ల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చంద్రబాబు అన్నారు. ఏపీ ప్రభుత్వం నుంచి ఒక్కో అమర జవాన్ కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున సహాయం ప్రకటిస్తున్నామని సీఎం తెలిపారు. -
సైనికుల సహాయ నిధికి ప్రముఖ ఆలయ ట్రస్ట్ విరాళం
సాక్షి, ముంబై: పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సైనికుల కుటుంబాలను ఆదుకునేందుకు పలువురు స్వచ్ఛందంగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో ముంబైలోని ప్రముఖ శ్రీసిద్ధి వినాయక ఆలయ ట్రస్ట్ సైనికుల సహాయ నిధికి భారీ విరాళాన్ని ప్రకటించింది. బాధిత కుటుంబాల సహాయార్థం రూ. 51 లక్షల విరాళాన్ని ప్రకటించింది. మరోవైపు పుల్వామాలో ముష్కరులు జరిపిన ఆత్మాహుతి దాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవానుల సంఖ్య 49కి చేరింది. కాగా దేశంకోసం ప్రాణాలర్పించిన సైనికుల కుటుంబాలకు అండగా నిలిచే విషయంలో టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ అందరికంటే ముందుగా తన వంతు సాయాన్ని అందించి పెద్ద మనసు చాటుకున్నారు. ఈమేరకు తన ట్విట్టర్లో ఆర్థిక సాయం అందించిన సర్టిఫికెట్ను షేర్ చేస్తూ.. సైనికుల కుటుంబాలకి అండగా నిలవాల్సిన సమయం వచ్చింది. మనవంతు సహాకారం అందిద్దాం.. ఎంతో కొంత సాయం చేసి మనమంతా వారికి మన మద్దతును అందించాలంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. -
అమర జవాన్ కుటుంబం సంచలన వ్యాఖ్యలు
పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన ప్రదీప్ సింగ్ కుటుంబం సంచలన వ్యాఖ్యలు చేసింది. పుల్వామాలోని జవాన్లు చేసిన త్యాగం వ్యర్థం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కానీ, ఆయన మాటలను, ప్రభుత్వాన్ని నమ్మలేమంటూ ప్రదీప్ సింగ్ భార్య నీరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకుముందు కూడా కాశ్మీర్లో తీవ్రవాద దాడులు జరిగాయి. అయినా భద్రతా దళాలకు సంపూర్ణ స్వేచ్ఛను ఎందుకు ఇవ్వడం లేదని ఆమె ప్రశ్నించారు. అదే ఈ మారణహోమానికి దారితీసిందన్నారు. ఇటీవల 40 రోజులు సెలవు మీద ఇంటికి వచ్చిన తన భర్త ప్రదీప్ ఫిబ్రవరి 11న కశ్మీర్ వెళ్లారనీ, కానీ ఇంతలోనే తిరిగిరాని లోకాలకు తరలిపోతారని అనుకోలేదంటూ ఉగ్రదాడి విషాదంలో మునిగిపోయిన నీరాజ్ కన్నీటి పర్యంతమయ్యారు. జవాన్ల త్యాగాలను ప్రభుత్వం ఎన్నడూ గౌరవించలేదని ప్రదీప్ సింగ్ తండ్రి, రిటైర్డ్ ఎస్ఐ, అమర్ సింగ్, ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడి త్యాగాన్ని ప్రజలు మరో మూడు రోజుల్లో మర్చిపోతారు .ఎవరి సొంత పనుల్లో వారు బిజీ అయిపోతారు. సర్జికల్ స్ట్రైక్స్ గురించి ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ టెర్రరిస్టుల భీభత్స దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా నిలబడి, దేశంలో పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపులకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడటం ప్రస్తుత తరుణంలో చాలా ముఖ్యమన్నారు. తన కుమారుడు చిన్నతనం నుంచి దేశ సేవ చేయాలని కోరుకున్నాడు. కానీ అతని కోరిక ఇలా తమకు శాశ్వతంగా దూరం చేస్తుందని అనుకోలేదంటూ తల్లి సరోజని దేవి బావురుమన్నారు. అటు ప్రదీప్ సింగ్ సోదరుడు కుల్దీప్ మాట్లాడుతూ, తన సోదరుడి ప్రాణాలు కంటే ప్రభుత్వాలందించే నష్టపరిహారం ఎంతమాత్రం విలువైందికాదన్నారు. ఉగ్రవాదాన్ని మట్టుబెడతామని వాగ్దానం చేసిట్టుగా ప్రధాని, ఆయన మంత్రివర్గ సహచరులు ఉగ్రవాదాన్ని శాశ్వతంగా నిర్మూలించాలన్నారు. కాగా జమ్ము కశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో ఉత్తరప్రదేశ్ కన్నౌజ్ జిల్లాలోని ఆజాన్ గ్రామానికి చెందిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పీఎఫ్) జవాన్ ప్రదీప్ సింగ్ ప్రాణాలు కోల్పోయారు. -
‘ఆ శబ్దాన్ని నేను కూడా విన్నాను’
లక్నో : ఆర్మీ కంట్రోల్ రూమ్ నుంచి వచ్చిన మెసేజ్ చూడగానే షాక్ అయ్యింది నీర్జా. ఇదేలా సాధ్యం.. రెండు నిమిషాల ముందు వరకూ తనతో మాట్లాడిన మనిషి ఇప్పుడు చనిపోవడం ఏంటని ఆలోచిస్తుంది. ఇదంతా అబద్ధమైతే బాగుండని కోరుకుంటుంది. కానీ ఆమె కోరిక నెరవేరలేదు. ముష్కరులు దాడిలో ఆమె భర్త మరణించాడు. దాంతో గుండెలవిసేలా విలపిస్తోంది నీర్జా. గురువారం పుల్వామా ఉగ్రదాడిలో చనిపోయిన 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లలో నీర్జ భర్త ప్రదీప్ కుమార్ కూడా ఉన్నారు. ఉత్తరప్రదేశ్ కాన్పూర్కు చెందిన ప్రదీప్(30) సీఆర్పీఎఫ్ జవాన్గా పనిచేస్తున్నారు. ఇతనికి ఇద్దరు కుమార్తెలు. గురువారం దాడి జరగడానికి ముందు వరకూ కూడా ప్రదీప్ తన భార్య నీర్జాతో ఫోన్లో మాట్లాడుతున్నాడు. తన గారల పట్టి మాన్య ఏం చేస్తుందని అడిగాడు ప్రదీప్. సమాధానం చెప్పేలోపే అవతలి వైపు నుంచి ఏదో పెద్ద శబ్దం వినిపించింది నీర్జాకు. రెండు సెకన్లలో ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ అయ్యింది. ఏదైనా సమస్య వచ్చిందేమో.. తర్వాత తనే కాల్ చేస్తాడు అనుకుంది నీర్జా. కానీ మరో రెండు నిమిషాల్లో ఆర్మీ కంట్రోల్ రూమ్ నుంచి ఆమెకు ఓ సందేశం వచ్చింది. ‘సీఆర్పీఎఫ్ జవాన్ ప్రదీప్ వీర మరణం పొందార’నేది దానిది సారాంశం. ఇది వినగానే ఒక్కాసారిగా షాక్ అయ్యింది నీర్జా. ఇదేలా సాధ్యం.. ఇప్పటివరకూ నాతో ఫోన్లో మాట్లాడుతున్న వ్యక్తి కేవలం రెండు నిమిషాల్లో మరణించడం ఏంటనుకుంది నీర్జా. కాసేపట్లో న్యూస్ చానెల్స్లో ఎక్కడ చూసిన ఈ వార్తలే. దాంతో తాను విన్నది నిజమే అని గ్రహించిన నీర్జా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తన భర్త ఇక రాడని తెలిసి కన్నీరుమున్నిరుగా విలపిస్తుంది నీర్జా. ‘ప్రదీప్కు చిన్న కూతరు మాన్య అంటే చాలా ఇష్టం. ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కూడా మాన్య గురించే అడిగాడు. నేను సమాధానం చెప్పేలోపే ఫోన్ కట్టయ్యింది. ఇంత దారుణం జరుగుతుందని కల్లో కూడా ఊహించలేదం’టూ ఏడుస్తోంది నీర్జా. 2004లో సీఆర్పీఎఫ్లో చేరిన ప్రదీప్ 115వ బెటాలియన్లో విధులు నిర్వహించేవాడు. -
పుల్వామా ఘటన.. విజయ్ ఆర్థిక సాయం
జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మందికి పైగా సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు చెలరేగుతుండగా.. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ట్వీట్లతో ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. కానీ విజయ్ దేవరకొండ మాత్రం ఒక అడుగు ముందుకేశాడు. వారి కుటుంబాలను ఆదుకోవడం కోసం తన వంతు సాయాన్ని చేసి.. అందర్నీ సాయం చేయమని అడిగాడు. తను ఎంత మొత్తాన్ని సాయం చేశాడన్నది తెలియకుండా చేసి.. దానికి సంబంధించిన సర్టిఫికేట్ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘‘వారు మన కుటుంబాల్ని రక్షిస్తున్నారు. మనం ఆ సైనికుల కుటుంబాలకు అండగా నిలవాలి. మన సైనికుల జీవితాలను సాయంతో వెలకట్టలేము. కానీ మనం మనవంతు సహకారం అందించాలి. నావంతు సహకారం నేను అందించా. మనందరం కలిసి సాయం చేద్దాం. మనమంతా కలిసి వారికో పెద్ద సపోర్ట్ని క్రియేట్ చేద్దాం’’ అని ట్వీట్ చేశాడు . అందరి కంటే విజయ్ దేవరకొండ ప్రత్యేకమని ఇలాంటి సందర్బాల్లోనే వ్యక్తమవుతూ ఉంటుంది. మరి ఎంతమంది స్పందించి తమ వంతు సాయాన్ని అందిస్తారో చూడాలి. They protect our families. We must stand by the families of our soldiers. No contribution can be substantial for our soldiers' lives, but we have to do our bit, I've done mine. Together let's Contribute, together we will create a support system.https://t.co/pHp7ITOdit pic.twitter.com/G9ztDj0gvI — Vijay Deverakonda (@TheDeverakonda) February 15, 2019 -
‘అలాంటి వారిని గాడిద మీద ఊరేగించాలి’
ఇక మీదట శాంతి, అహింస అని ఎవరైనా మాట్లాడితే వారిని గాడిద మీద కూర్చోబెట్టి ఊరేగించాలి అంటున్నారు నటి కంగనా రనౌత్. గురువారం పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని కుదిపేసింది. ఈ దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ అమానవీయ చర్యను ప్రపంచదేశాలన్ని ముక్తకంఠంతో ఖండించాయి. బాలీవుడ్ కూడా ఉగ్రచర్యలను తీవ్రంగా విమర్శించింది. ఈ నేపథ్యంలో హీరోయిన్ కంగనా రనౌత్ కూడా ఉగ్రదాడిని ఖండించారు. జవాన్ల మృతికి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా కంగనా మాట్లాడుతూ.. ‘పాక్ మన దేశ భద్రతనే కాకుండా మన మర్యాదను కూడా గేళి చేసింది. మనకు హాని కలిగించడమే కాక అవమానించింది కూడా. ఇందుకు తగిన సమాధానం చెప్పాలి. ఈ పరిస్థితుల్లో మనం మౌనంగా ఉండకూడదు. మన సహనాన్ని వారు చేతకానితనంగా భావిస్తున్నారు. ఫలితంగా ఈ రోజు దేశం రక్తమోడుతోంది. మన బిడ్డలను చంపి మనల్ని సవాలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఎవరైనా శాంతి, అహింస అంటే అలాంటి వారి ముఖానికి నల్లరంగు పూసి.. గాడిద మీద కూర్చోబెట్టి ఊరేగించాలి. నడి వీధిలో నిల్చోబెట్టి చెంప పగలకొట్టాలం’టూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జవాన్ల మృతికి సంతాపంగా కంగనా మణికర్ణిక సక్సెస్ మీట్ కార్యక్రమాన్నికూడా వాయిదా వేశారు. -
ఇదే అసలైన సర్జికల్ స్ట్రైక్ అంటూ ఎగతాళి
కృష్ణరాజపురం (బెంగళూరు): కశ్మీర్లోని సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండగా బెంగళూరులో ఓ యువకుడు ‘అసలైన సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఇదే’ అని ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేయడంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్న జమ్ముకశ్మీర్కు చెందిన అబిద్ మాలిక్ అనే యువకుడు ఉగ్రవాదుల దాడిపై తన ఫేస్బుక్ ఖాతాలో వ్యంగ్యంగా పోస్ట్ పెట్టారు. అసలైన సర్జికల్ దాడి అంటే ఇదే అని అందులో ఎగతాళి చేశాడు. ఆత్మాహుతి దాడి చేసిన ఉగ్రవాదిని పొగుడుతూ ‘రిప్ బ్రో’ అని కూడా వ్యాఖ్యలు చేశాడు. కశ్మీర్ సమస్యపై స్పందించకపోతే భవిష్యత్లో మరో 40 మంది సైనికులు మరణిస్తారని కూడా ఆ పోస్ట్లో హెచ్చరించాడు. దీనిని చూసిన నెటిజన్లు అతనిపై భగ్గుమనడంతో వెంటనే ఖాతా నుంచి పోస్ట్ తొలగించి అబిద్ పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు అబిద్ కోసం గాలింపు ముమ్మరం చేశారు. -
ఉగ్రదాడి తెస్తున్న పెను ప్రమాదం
జమ్మూ–కశ్మీర్లోని పుల్వామాలో సైనిక కాన్వాయ్పై జరిగిన ఆత్మాహుతి దాడి స్థానిక ఘర్షణల ఫలితం కాదు. ఐఎస్ఐ ప్రేరేపిత జైషే అహ్మద్ వ్యూహంలో భాగంగా ఆ దాడి జరిగింది. ఉగ్రదాడులు జరిగిన ప్రతి సందర్భంలోనూ పాక్ ప్రమాదకరమైన వ్యూహాన్ని అమలు చేస్తూంటుంది. నేను కోరిందల్లా ఇవ్వు. లేకపోతే నా తలను నేనే పేల్చుకుంటాను అంటూ తనతలపై తానే ట్రిగ్గర్ గురిపెట్టుకునే తరహాలో పాకిస్తాన్ వ్యవహరిస్తోంది. పైగా ఇరు దేశాల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగినప్పుడు చల్చార్చడానికి అమెరికాతో సహా ప్రపంచ దేశాలు ముందుకొచ్చే పరిస్థితి ఇప్పుడు లేదు. ఈ క్రమంలో యుద్ధ ప్రకటన ఎవరు చేసినా దాని ఫలితం ప్రమాదకరంగానే ముగుస్తుంది. పాకిస్తాన్ వ్యూహచింతనపై దక్షిణాసియా వ్యవహారాల్లో అమెరికన్ నిపుణుడు స్టీఫెన్ పి. కోహెన్ తెలివిగా వర్ణించారు. పాకిస్తాన్ తన తలపై తుపాకీ గురిపెట్టుకుని ఇతర ప్రపంచంతో చర్చలు సాగిస్తూం టుందని వ్యాఖ్యానించారు. దాని సారాంశం ఏమిటంటే, నేను కోరిం దల్లా ఇవ్వు. లేకపోతే నా తలను నేనే పేల్చుకుంటాను. ఆ తర్వాత ఏర్పడే గందరగోళంతో మీరు తలపట్టుకోవలసి వస్తుంది. సరిగ్గా అలాంటి ట్రిగ్గర్నే పాకిస్తాన్ ఇప్పుడు పుల్వామాలో లాగిందా? (ఉగ్ర మారణహోమం) మొదటగా పుల్వామాలో సైనిక కాన్వాయ్పై జరిగిన దాడి పూర్తిగా దేశీయంగా జరిగిన ఉగ్రదాడి అని చెప్పడానికి చాలా తక్కువ అవకాశాలున్నాయి. ఆత్మాహుతికి పాల్పడిన ఉగ్రవాది తిరుగుబాటుతత్వం జీర్ణించుకుపోయిన భారతీయ కశ్మీర్ వాసి. కానీ అతడు పూర్తిగా భారతీయ వ్యూహరచనతో అమలుచేసిన ఉగ్రచర్యలో భాగం కాదని చెప్పడానికి తగిన కారణాలున్నాయి.1. జైషే మహమ్మద్ ఈ దాడికి తానే కారణమని ప్రకటించింది. ఇది పూర్తిగా పాకిస్తాన్ కేంద్రంగా ఉంటూ ఐఎస్ఐ నియంత్రణలో ఉండే సంస్థ. 2. ఈ ఉగ్రచర్యకు దారితీసిన తిరుగుబాటుతత్వం, ప్రేరణ స్థానికపరమైనదే కావచ్చు, కానీ ఔత్సాహిక స్థానిక బృందాల వద్ద ఇంతటి అధునాతనమైన పేలుడు పదార్థాలు (చాలావరకు ఆర్డీఎక్స్ లేక ఆర్డీక్స్ కలిపినవి) లభ్యమవుతాయని, గురిచూసి కొట్టే యంత్రాంగంతో కూడిన నైపుణ్యాలు వీరికి ఉంటాయని చెప్పడానికి కనీస సాక్ష్యాధారాలు కూడా లేవు. 3. ఆత్మాహుతి బాంబర్ రికార్డు చేసిన చివరి వీడియోను చూడండి. అతడు వాడిన భాష కశ్మీరీల బాధలకు ప్రతీకారం కోరుతున్నట్లు లేదు. పైగా భారత్లో ఇతర ప్రాంతాల్లోని ముస్లింలను రెచ్చగొడుతున్నట్లుగా కూడా ఆ ప్రకటనలో లేదు. పైగా బాబ్రీ మసీదు, గుజరాత్ ఘటనలు ప్రస్తావించాడు. ‘ఆవు మూత్రం తాగే వారికి’ వ్యతిరేకంగా తిరుగుబాటుకు ‘మన ముస్లింలు అందరూ’ సిద్ధపడాలని పిలుపునిచ్చాడు. ఇలాంటి భాష లష్కరే తోయిబా కంటే మించి జైషే ఉగ్రసంస్థ నుంచి పుట్టుకొచ్చిందే తప్ప స్థానికులది కాదు. (ప్రతీకారం తీర్చుకునేందుకు ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ: ప్రధాని) పుల్వామాలో జరిగిన దాడి గతంలో జైషే నిర్వహించిన దాడులకు అచ్చుగుద్దినట్లుంది. 2001లో శ్రీనగర్లో రాష్ట్ర అసెంబ్లీపై ఆత్మాహుతి దాడి, అదే సంవత్సరం పార్లమెంటుపై జరిగిన దాడి, ఇటీవల పఠాన్ కోట్, గుర్దాస్పూర్లపై దాడులు మొత్తంగా ఒకే లక్ష్యాన్ని ప్రకటించాయి. కశ్మీర్ వెలుపల ఏదో ఒక స్థాయిలో బీభత్సం సృష్టించాలి. ముంబైలో 2008లో లష్కర్ ఇలాగే చేసింది. కానీ దాని శక్తియుక్తులను చాలావరకు కశ్మీర్లో జరుగుతున్న పోరాటంలోనే ఇప్పటికీ ఉపయోగిస్తోంది. అయితే జైషే దానికంటే చిన్న సంస్థ అయినప్పటికీ, మరింత దుష్టత్వంతో, అపార వనరులతో ఐఎస్ఐ మద్ధతుతో ఇలాంటి ప్రభావశీలమైన దాడులను ఎంచుకుని మరీ సాగిస్తోంది. జైషే ఎంత శక్తిసంపన్నంగా తయారైందో మనకు ఐసీ–814 విమానం హైజాక్ కాలం నుంచే తెలుసు. అది 90ల చివర్లోనే భారతీయ విమానాన్ని కఠ్మాండులో హైజాక్ చేసి సురక్షితంగా కాందహార్లో దించి, ప్రయాణికులను వదిలిపెట్టాలంటే భారత్ జైళ్లలో ఉండే దాని కీలక నేతలను విడుదల చేయాల్సిందేనని పట్టుబట్టి మరీ సాధించుకుంది. జైషే చీఫ్ మసూద్ అజర్ విడుదల ప్రక్రియ వరకు పూర్తిగా అది ఐఎస్ఐ కనుసన్నల్లో నడిచిందని పదే పదే రుజువవుతూ వస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వ యంత్రాంగం, ఐఎస్ఐ అయితే.. లష్కర్, హఫీజ్ సయీద్ల కంటే జైషేనే తమ అతిపెద్ద ఆస్తిగా భావిస్తున్నాయి. జైషే వీరి అతి ప్రధాన శక్తిగా తయారైంది. చైనా ప్రభుత్వం కూడా దాన్ని గుర్తించింది కాబట్టే మసూద్ అజర్ని కాపాడే విషయంలో సిగ్గులేకుండా పాక్తో పోటీపడుతోంది. అందుకే ఉగ్రవాది స్థానిక కశ్మీరీ కావడంలో ఆశ్చర్యపడాల్సింది లేదు. విమాన హైజాక్, పార్లమెంట్ తదితర చోట్ల జరిపిన దాడులతో సహా జైషే సాగించిన ప్రతి ఉగ్రచర్యలోనూ భారతీయ కశ్మీరీలను కీలక భాగస్వాములుగా చేస్తూ వస్తోంది. కాబట్టే ఉగ్రవాదానికి స్థానిక మూలాలను వెదుకుతూ ఉగ్రచర్చల్లో పాకిస్తాన్కు నేరుగా పాత్ర లేదనిపించేలా జరుగుతున్న సూత్రబద్ధ చర్చల్లో సమయం వృ«థా చేయడం మానడం చాలా మంచిది. ఇప్పుడు మనం ఈ ప్రశ్నను ఎందుకు లేవనెత్తుతున్నాం. పాకిస్తాన్ చివరికి తన తలపైకే ట్రిగ్గర్ గురిపెట్టుకుందా? జైషే, లష్కరే గతంలో ఎలాంటి ప్రతీకార ప్రకటనలకు దిగకుండానే దాడులకు పాల్పడేవి. అటల్ బిహారీ వాజ్పేయి నుంచి మన్మోహన్ సింగ్ హయాం మధ్య కాలంలో భారత్ ఆగ్రహావేశాల ప్రదర్శననుంచి బయటపడి పాక్పై అంతర్జాతీయ ఒత్తిడిని తీసుకొచ్చే విధానాలవైపునకు మళ్లింది. రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటం కంటే మౌలికంగా యుద్ధ వ్యతిరేక వ్యూహతత్వం వైపు మొగ్గుచూపింది. మోదీ ప్రభుత్వం ఇలాంటి నటనను సాగించడం లేదు. మన్మో హన్, వాజ్పేయి తదితర ప్రభుత్వాలు గతంలో వ్యవహరించిన తీరుని మోదీ ప్రభుత్వం పిరికి చేష్టగా భావిస్తోంది. ప్రత్యేకించి ఉడీ సర్జికల్ దాడుల అనంతరం ఉగ్రదాడులకు వ్యతిరేకంగా దాడిని నిలి పివేయడం, లేక చాలా కాలం తనకు తాను నిబ్బరంగా ఉండటం మోదీ ప్రభుత్వానికి సాధ్యం కాదు. అలాగే పాక్ కూడా యుద్ధానికి సమీపంలోకి వచ్చింది. అది ఎప్పుడు జరుగుతుంది, ఎలా ఎక్కడ అనేది ఎవరికీ తెలీదు కానీ ఆ తరుణం సంభవించడానికి ఎక్కువ కాలం పట్టేట్టు లేదు. ప్రతీకారాత్మక ప్రతిస్పందన త్వరలో సంభవించవచ్చు. ప్రత్యర్థిపై తాము వీరోచిత విజయం అందుకున్నామంటూ పెద్దగా ప్రకటించుకునే రూపంలో అది ఉండవచ్చు. అదేసమయంలో భారత్ ఇంతవరకు కనీ వినీ ఎరుగని ఎన్నికల ప్రచారం ప్రారంభ దినాల్లోకి అడుగిడుతోంది. పుల్వామా కళంకాన్ని భరిస్తూ నరేంద్రమోదీ రెండో టర్మ్ అధికారంకోసం ప్రయత్నం చేయకపోవచ్చు. ఇక ఈ దాడుల వ్యూహాన్ని ఇంతటితో వదిలిపెట్టాలని నిర్ణయించుకోవడం పాకిస్తాన్ వంతు కావచ్చు. లేదా భారత్ ప్రతిచర్యకు ప్రతీకారం తీసుకోవలసిందేనంటూ తన సొంత ప్రజల ఒత్తిళ్లకు అనుగుణంగా అది స్పందించవచ్చు. సైనికపరంగా ఏం జరిగినప్పటికీ అది ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ పాలనకు ముగింపు పలుకుతుంది. భారత్తో ఎంత చిన్న లేక పెద్ద యుద్ధానికి దిగిన పాక్ పాలకుడు పదవిని కాపాడుకున్న ఘటన లేదని చరిత్ర మనకు తెలుపుతోంది. అయూబ్ ఖాన్(1965), యాహ్యా ఖాన్ (1971), నవాజ్ షరీఫ్(1999)ల పతనం ఇదే చెబుతోంది. తర్వాతేం జరుగుతుందో చెప్పే నిర్ణాయక శక్తి ఇమ్రాన్కు ఉండకపోవచ్చు. కార్గిల్ ఉదంతం తర్వాత నవాజ్లాగే తను కూడా ఆర్మీ లేక ఐఎస్ఐ తలబిరుసుతనానికి ఇమ్రాన్ కూడా ఫలితం అనుభవించవచ్చు. ఆరకంగా బలిపశువు కాకూడదంటే ఇమ్రాన్కు అపార నైపుణ్యంతోపాటు కాస్త అదృష్టం కూడా తోడు రావాల్సి ఉంది. ఇలాంటి అంశాల్లో ఎన్నికైన ఏ పాక్ ప్రధాని మాట కూడా ఇంతవరకు చెల్లుబాటు కాలేదు. పైగా ఇమ్రాన్ అందరికంటే బలహీనుడు. ఎలా స్పందించాలి అనేది ఆర్మీ చేతుల్లోనే ఉంది. ప్రతీకార చర్యకు పాల్పడొద్దని సైన్యానికి సలహా ఇచ్చే శక్తి ఇమ్రాన్కు ఉంటుందనీ చెప్పలేం. తమ తలలను పేల్చుకోవాలా వద్దా అనేది సైన్యమే నిర్ణయించుకోగలదు. వీటిలో ఏది జరిగినా నష్టపోయేది మాత్రం ఇమ్రానే మరి. మోదీకి ఆయన వారసులకు మధ్య తేఢాను పక్కనబెట్టి చూస్తే, రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. 2008లో ముంబైలో లేక 2001–02లో జమ్మూ–కశ్మీర్, భారత పార్లమెంటుపై ఉగ్రదాడులు జరిగినప్పుడు అమెరికన్, యూరోపియన్ నేతలు పరుగున వచ్చి భారత్ను బుజ్జగించారు. రష్యా, చైనా కూడా తమ వంతు పాత్ర పోషించాయి. పాక్ను ఖండిస్తూ భారత్కు సంఘీభావం ప్రకటించడం ద్వారా వారు భారతీయుల ఆగ్రహాన్ని చల్లార్చారు. కానీ అలాంటి ప్రపంచం ఇప్పుడు లేదు. అమెరికాలో ట్రంప్ గెలిచి అమెరికాను ఉన్నత స్థితిలో నిలుపుతానంటూ చేసిన బాసను నెరవేర్చుకునే దిశగా ప్రయాణిస్తూ ప్రపంచాన్ని పట్టించుకోవడం మానేశాడు. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడికి వ్యతిరేకంగా తక్షణం ట్వీట్ చేయడానికి కూడా ట్రంప్ పూనుకోకపోవచ్చు. ఆధునిక ప్రపంచపు చిరకాల ప్రత్యర్థులు తమ ప్రాంతంలో ఘర్షణల పరిష్కారంలోనే కొట్టుమిట్టులాడుతున్నారు. మనగురించి పట్టించుకునే తీరిక, శక్తి వారికి ఉండకపోవచ్చు. భారతీయ ఉపఖండం ప్రపంచానికి గతంనుంచి హెచ్చరిక చేస్తూ వచ్చేది. ‘మా మధ్యకు వచ్చి ఘర్షణలను నిలిపివేయడానికి ప్రయత్నించండి లేకుంటే మేం పరస్పరం అణ్వాయుధాలు ప్రయోగించుకుంటాం.’ తమవద్ద అణ్వాయుధాలు ఉన్నాయని ప్రకటించుకుంటూ ఉపఖండం ప్రపంచాన్ని ఒకరకంగా బ్లాక్మెయిల్ చేసేది. ఇప్పుడు ఇలా బెదిరించినా ప్రపంచం పట్టించుకునే స్థితి కనిపించడం లేదు. పైగా అణ్వాయుధాలు బలహీనమైన ఓటమికి దగ్గరగా ఉన్న దేశాలకు ప్రాధాన్యతా ఆయుధాలుగా మారాయి. 1990లో వీపీ సింగ్ అసమర్థత కారణంగా పాకిస్తాన్ తన అణ్వాయుధ బూచిని పూర్తిగా తనకు ప్రయోజనం కలిగేలా ఉపయోగించుకుంది. ఆ క్రమంలో భారత్నుంచి ఎలాంటి చిన్న ప్రతిఘటన కూడా జరగకుండా పాక్ జాగ్రత్తపడింది. ఇక వ్యూహాత్మక అణ్వాయుధాల విషయానికి వస్తే పాకిస్తాన్ ఇంతవరకు వాటిని పరీ క్షించలేదు. ఇప్పుడు వారు విధ్వంసకరమైన దిగ్భ్రాంతిని కలిగించవచ్చు. పైగా భారత ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడు అణ్వాయుధాలు ఏక పక్షంగా ప్రభావం చూపుతాయని ఎంతమాత్రం భావించడం లేదు. ఒకవేళ ఈ ఎన్నికల వారాల్లో అలాంటి అవకాశాన్ని చేజిక్కించుకోవాలని భారత్ చూస్తున్నట్లయితే ముందుగా ట్రిగ్గర్ మనమే నొక్కవచ్చు కూడా. వ్యాసకర్త : శేఖర్ గుప్తా, ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
మాటలకందని విషాదం
మూడు దశాబ్దాలుగా నెత్తురోడని రోజంటూలేని జమ్మూ–కశ్మీర్లో గురువారం సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్పై జరిగిన ఆత్మాహుతి దాడి దేశ ప్రజానీకాన్ని మాత్రమే కాదు... ప్రపంచాన్నే నిశ్చేష్టుల్ని చేసింది. జవాన్ల వాహనశ్రేణిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాది ఒకడు ఆత్మాహుతి దాడికి పూనుకొని 43 మందిని పొట్టనబెట్టుకున్న ఈ ఉదంతం ఆ రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగనిది. భద్రతా బలగాలు ఒక దాడిలో ఇంతమంది సహచరులను కోల్పోవడం కశ్మీర్లో ఇదే తొలిసారి. ఈ ఆత్మాహుతి దాడి జరిగిన కాసేపటికే పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ దానికి తామే కారణమని ప్రకటించడంతోపాటు ఆ ఉగ్రవాది పేరు ఆదిల్ అహమ్మద్ దార్ అని వెల్లడించింది. (ప్రతీకారం తీర్చుకునేందుకు ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ: ప్రధాని) దాడికి ముందు ఉగ్రవాది ఆదిల్ మాట్లాడిన వీడియోను కూడా సామాజిక మాధ్యమాల్లో ఉంచింది. ‘కశ్మీర్ కోసం వెయ్యేళ్ల యుద్ధానికైనా సిద్ధమ’ని గతంలో పాకిస్తాన్ పాలకులు చెప్పడాన్ని గుర్తుం చుకుంటే ఈ ఉగ్రవాద విషసర్పానికి అక్కడ ఏ స్థాయిలో అండదండలున్నాయో అర్ధమవుతుంది. అలాంటి మద్దతే లేకపోతే దాడికి తామే బాధ్యులమని ప్రకటించిన జైషే మొహమ్మద్ సంస్థపై పాకి స్తాన్ చర్యలకు ఉపక్రమించేది. 24 గంటలు గడిచినా ఆ విషయంలో మౌనంగానే ఉండిపోయింది. కనుకనే ప్రధాని నరేంద్రమోదీ పాకిస్తాన్ను తీవ్రంగా హెచ్చరించవలసి వచ్చింది. (ఉగ్ర మారణహోమం) సైనికంగా తనకంటే అనేక రెట్లు శక్తిమంతమైన భారత్ వంటి పొరుగుదేశాన్ని ఇలాంటి ఉన్మాద దాడులతో పాదాక్రాంతం చేసుకోగలమని, కనీసం అస్థిరత్వంలోకి నెట్టగలమని పాకిస్తాన్ భ్రమిం చడం దాని తెలివితక్కువ నైజాన్ని, మూర్ఖత్వాన్ని బయటపెడుతోంది. గతంలో అది తన మను షుల్ని సమీకరించి, వారికి అవసరమైన శిక్షణనిచ్చి, దాడి చేయాల్సిన ప్రాంతాల వివరాలను అంద జేసి సరిహద్దులు దాటించేది. కానీ అక్కడ భద్రత పటిష్టపడటం వల్ల కావొచ్చు... అంతర్జాతీ యంగా చీవాట్లు పడుతుండటంవల్ల కావొచ్చు దానికి స్వస్తి పలికి కశ్మీరీ పౌరులపై దృష్టి పెట్టినట్టు కనబడుతోంది. చదువుసంధ్యల్లేని యువతను ఎంచుకుని వారికి ఉగ్రవాదం నూరిపోసి, ఆయుధా లిచ్చి పంపి తన ప్రయోజనాన్ని నెరవేర్చుకునే పన్నాగానికి పూనుకుంది. తాజా ఉదంతానికి కారకు డైన ఆదిల్ నేపథ్యం ఈ సంగతిని వెల్లడిస్తోంది. నిజానికి ఈ యువతలో ఎందరు ఇష్టప్రకారం ఆ ముఠాలోకి వెళ్తున్నారో చెప్పలేం. చావడానికి పోతూ ఉగ్రవాది ఆదిల్ ఇచ్చిన ‘సందేశం’ స్వచ్ఛం దంగా ఇచ్చిందో, చుట్టూ తుపాకులతో నిలబడి చెప్పించిందో ఎవరూ నిర్ధారించలేరు. ఇరాక్, సిరి యాల్లో ఉగ్రవాద సంస్థ ఐఎస్ నడిపిన శిబిరాల్లో ఆత్మాహుతి బాంబర్లుగా శిక్షణ పొంది మధ్యలోనే దొరికిపోయిన కొందరు పిల్లలు వెల్లడించిన కథనాలు గతంలో వెలువడ్డాయి. జైషే మొహమ్మద్ స్వతంత్ర ఉగ్రవాద సంస్థ కాదు. దానికి పాకిస్తాన్ సైన్యం కనుసన్నల్లో పనిచేసే గూఢచార సంస్థ ఐఎస్ఐతో ఉన్న సాన్నిహిత్యంలో దాపరికమేమీ లేదు. ఉగ్రవాదంపై పోరాటం బహుముఖంగా ఉండాలి. దాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్ను అంతర్జాతీయంగా ఏకాకిని చేయడం కోసం నిరంతరాయంగా ప్రయత్నించడంతోపాటు చుట్టూ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ భద్రతాపరంగా పటిష్టమైన చర్యలు తీసుకోవడం ముఖ్యం. ఆ విషయంలో మనం విఫలమయ్యామని తాజా ఉదంతం తేట తెల్లం చేస్తోంది. ఫలితంగా ఆత్మాహుతి దాడుల సంస్కృతి కశ్మీర్ లోయకు సైతం జొప్పించడంలో జైషే సంస్థ విజయం సాధించినట్టు కనబడుతోంది. ఆత్మాహుతి దాడి 2000 సంవత్సరంలోనూ జరిగింది. కానీ 29మంది ప్రాణాలు తీసిన ఆ ఉదంతంతో పోలిస్తే తాజా ఉదంతం తీవ్రత అన్ని విధాలా అధికం. అప్పట్లో ఉగ్రవాది ప్రభుత్వ వాహనాన్ని హైజాక్ చేసి ఆ పని చేశాడు. ఇప్పుడు ఆ అవసరం లేకుండా ఒక పల్లెలో పేలుడు పదార్థాలతో నిండిన వాహనాన్ని ఉగ్రవాది సిద్ధం చేసుకున్నాడు. జమ్మూ–కశ్మీర్ భద్రతా విషయాల్లో తలమునకలై ఉండే యంత్రాంగానికి సహ జంగానే ఇటీవల అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలేమిటో తెలియకపోవు. ఆ స్థాయిలోనే నిఘా ఉన్నదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఏడాది కాలంగా ఆత్మాహుతి దాడులు జరగొచ్చునన్న సమాచారం ఇంటెలిజెన్స్ సంస్థలకు అందుతూనే ఉన్నదని ఆ వర్గాల కథనం. అటువంటప్పుడు అందుకనువైన విధానాలను రూపొందించుకోవడం భద్రతా బలగాల బాధ్యత. జవాన్ల వాహనశ్రేణి వెళ్లే దారిలో ముందుగా ప్రత్యేక బృందం వెళ్లి ఆ మార్గం సురక్షితంగా ఉన్నదో లేదో మదింపు వేయడం రివాజు. అది సక్రమంగానే జరిగిందా? ఆత్మాహుతి దాడికి గురైన వాహనశ్రేణిలో 78 వాహనాలుంటే, అందులో 2,547మంది జవాన్లు ప్రయాణిస్తున్నారు. అసా« దారణమైన, అత్యవసరమైన పరిస్థితుల్లో మాత్రమే భారీ కాన్వాయ్లు తరలిస్తారు. మామూలు పరిస్థితుల్లో వేయిమందికి మించని జవాన్లతో ఉండే వాహనశ్రేణిని అనుమతిస్తారని చెబుతారు. అలాంటి పద్ధతులను ఎందుకు పాటించలేదు? జమ్మూ నుంచి తెల్లారుజామున 3.30కు బయ ల్దేరిన జవాన్ల వాహనశ్రేణి గురించిన సమాచారం అక్కడికి 241 కిలోమీటర్ల దూరంలోని అవం తిపొరా పట్టణం సమీపంలో పొంచివున్న ఉగ్రవాదులకు ఎలా చేరింది? అలాగే అడుగడుగునా రాత్రింబగళ్లు తనిఖీలు సాగుతుండే రాష్ట్రంలో ఒక పల్లెకు 350 కిలోల అత్యాధునిక పేలుడు పదార్థం(ఐఈడీ) ఎలా చేరిందనుకోవాలి? వీటన్నిటిపైనా లోతైన సమీక్ష జరగాలి. ఏళ్ల తరబడి అనుసరించే మూస విధానాలు కూడా లొసుగులకు తావిస్తాయి. ఆ విషయంలోనూ జాగ్రత్తలు అవసరం. పాక్పై తక్షణ చర్య అవసరమని కొందరంటున్నారు. కానీ ఆచితూచి అడుగేయడం శ్రేయస్కరం. ఇప్పటికే పాక్పై దౌత్యపరమైన దాడిని మన దేశం ప్రారంభించింది. దాన్ని పక డ్బందీగా కొనసాగించి, అంతర్జాతీయంగా పాక్ను ఏకాకి చేయడానికి గల అన్ని అవకాశాలనూ వినియోగించుకోవాలి. ఇప్పుడు సైతం జైషే చీఫ్ మసూద్ అజర్ను ఉగ్రవాదిగా గుర్తించ నిరా కరిస్తున్న చైనా నైతికతను కూడా ఎండగట్టాలి. -
‘పొరుగు’ కుట్రలను సహించరాదు
సాక్షి, న్యూఢిల్లీ: ఉగ్రదాడులతో భారతదేశాన్ని అస్థిర పరిచేందుకు పొరుగు దేశం చేస్తున్న కుట్రలను సహించరాదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉద్ఘాటించారు. పొరుగు దేశం ఉగ్రవాదులకు సహకరించి నిధులు సమకూర్చ డం దురదృష్టకరమని అంటూ ఆయన.. వీటన్నింటినీ తట్టుకుని నిలబడి మాతృదేశాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా మార్చుకునేందుకు ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఉపరాష్ట్రపతి ప్రసంగాల సంకలనం ‘సెలెక్టెడ్ స్పీచెస్ వాల్యూమ్–1’ను ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో శుక్రవారం మాజీ రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంక య్య మాట్లాడుతూ.. త్వరలో జరగనున్న ఎన్నికల్లో క్యారెక్టర్ (గుణం), కెపాసిటీ (సామర్థ్యం), క్యాలిబర్ (యోగ్యత), కండక్ట్ (నడత) కలిగిన వ్యక్తులను ఎన్నుకోవాలని, అలాంటి వారినే ప్రజాప్రతినిధులుగా చూడాలనుకుంటున్నా నని అన్నారు. ప్రస్తుతం చట్టసభలు సాగుతున్న తీరుపై ఆందోళన వ్యక్తం చేసి న ఆయన.. ప్రజాస్వామ్య దేవాలయాల్లో ప్రజల గొంతు ప్రతిధ్వనించాలని సూచించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూ.. భారతీయతను ప్రతిబింబించే ప్రసంగాలు చేసే వెంకయ్యకు తాను అభిమానినన్నారు. ఈ పుస్తకంలో స్ఫూర్తిదాయక అంశాలే గాక, మదిలో కలకాలం నిలిచి పోయే జ్ఞా పకాల సమాహారం కూడా ఉందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్, థావర్ చంద్ గెహ్లాట్ పాల్గొన్నారు. -
ఉగ్రదాడిపై అభ్యంతరకర ట్వీట్
లక్నో : పుల్వామా ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉగ్రవాదుల దుశ్చర్యపై ఆగ్రహం వ్యక్తమవుతుంటే జైషే దాడిని సమర్ధిస్తూ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) విద్యార్ధి ట్విటర్లో చేసిన అభ్యంతరకర పోస్ట్ వివాదాస్పదమైంది. ఏఎంయూలో బీఎస్సీ మేథమేటిక్స్ అభ్యసిస్తున్న జమ్మూ కశ్మీర్కు చెందిన బాసిం హిలాల్ ట్విటర్లో చేసిన పోస్ట్పై వర్సిటీ తీవ్రంగా స్పందించింది. ఏఎంయూ ఫిర్యాదు నేపథ్యంలో హిలాల్పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు అభ్యంతరకర పోస్ట్ చేసిన విద్యార్ధిని సస్సెండ్ చేస్తున్నట్టు ఏఎంయూ వెల్లడించింది. జైషే దాడి ఎలా ఉంది..? గ్రేట్ సర్. అంటూ హిలాల్ చేసిన ట్వీట్ దుమారం రేపింది. ఈ ట్వీట్ను హిలాల్ తర్వాత తొలగించినా అప్పటికే అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
సాధారణ రసాయనాలతోనే భారీ విధ్వంసం
సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామా జిల్లాలో గురువారం సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్పై జరిగిన ఉగ్రదాడిలో అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్ధం ఆర్డీఎక్స్ను ఉగ్రమూకలు వాడలేదని భావిస్తున్నారు. ఈ దాడిలో ఆర్డీఎక్స్కు బదులు ఎరువుల తయారీకి ఉపయోగించే సాధారణ రసాయనాలను ఉపయోగించి భారీ పేలుడుకు పాల్పడినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని చెబుతున్నారు. ఘటనా స్ధలం నుంచి సేకరించిన శాంపిల్స్ను పరిశీలించిన మీదట ఎన్ఐఏ, ఎన్ఎస్జీలకు చెందిన ఫోరెన్సిక్ నిపుణులు పేలుడుకు వాడిన రసాయనాలపై వివరిస్తూ ఉగ్రవాదులు ఈ భీకర దాడిలో ఆర్డీఎక్స్ వాడలేదని చెప్పుకొచ్చారు. భారీ పేలుడు కోసం ఎరువుల తయారీకి ఉపయోగించే రసాయనాలతో పాటు ఇనుప ముక్కలు, ఇతర పదార్ధాలను కలిపి ధ్వంస రచన సాగించారని ప్రాధమిక ఆధారాలతో వెల్లడవుతోందని ఫోరెన్సిక్ నిపుణులు పేర్కొంటున్నారు. ఆర్డీఎక్స్ వంటి అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్ధం వాడకుండా ఇంతటి భీకర దాడికి ఉగ్రమూకలు పాల్పడటం విస్తుగొలుపుతోంది. భద్రతా దళాల కన్నుగప్పి స్ధానిక మార్కెట్లో సులభంగా లభించే రసాయనాలతోనే భారీ పేలుడుకు అవసరమైన పరికరాన్ని ఉగ్రవాదులు రూపొందించారని నిపుణులు భావిస్తున్నారు. ఆత్మాహుతి దాడికి తెగబడిన జైషే ఉగ్రవాది అదిల్ అహ్మద్ దార్ మృతదేహాన్ని నిశితంగా పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణులు ఈ అంచనాకు వచ్చారు.పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. -
‘ఇది ముమ్మాటికీ పాకిస్తాన్ పనే’
సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామాలో గురువారం జరిగిన ఉగ్రదాడిలో 44 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. దాడికి పాల్పడిన ఉగ్రమూకలకు దీటుగా బదులివ్వాలనే డిమాండ్ పెల్లుబుకుతోంది. మరోవైపు ఈ దాడిలో పాకిస్తాన్ హస్తం ఉందని సుస్పష్టంగా వెల్లడవుతోందని 2016లో పాకిస్తాన్పై భారత్ నిర్వహించిన సర్జికల్ స్ర్టైక్స్ను పర్యవేక్షించిన లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) డీఎస్ హుడా తేల్చిచెప్పారు. .పాకిస్తాన్ పుల్వామా దాడిపై స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు మరింత నిలకడతో కూడిన దీర్ఘకాలిక విధానం అవసరమని హుడా అభిప్రాయపడ్డారు. కాగా పుల్వామా దాడికి బాధ్యులైన వారిని ఉపేక్షించమని, దీనిపై చర్యలు చేపట్టే స్వేచ్ఛ భారత సైన్యానికి ఇచ్చామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రతీకారం తీర్చుకునే తేదీ, సమయాన్నివారే నిర్ధారించాలని ఆయన సూచించారు. -
రివేంజ్ తీర్చుకునేందుకు టైమ్, ప్లేస్ డిసైడ్ చేయండి..
లక్నో : ‘మీకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నాం.. ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకునేందుకు సమయం, ప్రదేశాన్ని నిర్ణయించండి’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ సైనికులకు పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ ప్రాంతంలోని బుందేల్ఖండ్లో డిఫెన్స్ కారిడార్ నిర్మాణానికి ప్రధాని శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రసంగిస్తూ... పుల్వామా ఉగ్రదాడికి బదులు తీర్చుకునేందుకు భారత సైన్యానికి అన్ని రకాల అనుమతులు ఇస్తున్నామని పేర్కొన్నారు. ‘మన జవాన్ల త్యాగం వృథా కాదు.. వారి సాహసాన్ని భరతజాతి మొత్తం వీక్షించింది. వారిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది’ అని మోదీ వ్యాఖ్యానించారు.(చదవండి : ఉగ్ర మారణహోమం) పాక్ ఆర్థిక సాయం కోసం యాచిస్తోంది.. ఉగ్రదాడితో తమకు సంబంధం లేదంటూ బుకాయిస్తున్న పాకిస్తాన్ తీరుపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘ పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అందుకే చేతిలో పాత్ర పట్టుకుని ప్రపంచ దేశాలను సాయం కోసం యాచిస్తోంది. కానీ వారికి ఎవరూ సహాయపడరు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్కు మద్దతుగా ఉన్నాయని మోదీ పునరుద్ఘాటించారు. ‘మన దాయాది దేశానికి సరైన సమాధానం ఇవ్వాలని భారతీయులు భావిస్తున్నారు. ప్రపంచంలోని చాలా వరకు దేశాలు మనకు అండగా ఉన్నాయి. పుల్వామా దాడి పట్ల వారు కేవలం సంతాపం తెలియచేయడానికే పరిమితం కాలేదు.. ఉగ్రవాదాన్ని అంతం చేయాలని భావిస్తున్న భారత్కు అన్ని రకాలుగా సహాయపడటానికి సిద్ధంగా ఉన్నారు’ అని పాక్ను హెచ్చరించారు.(పాకిస్తాన్కు దీటైన సమాధానం చెబుతాం) కాగా గురువారం కశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఆత్మహుతి దాడిలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ దాడిని తీవ్రంగా పరిగణించిన భారత ప్రభుత్వం ప్రతీకార చర్యలకు సిద్ధమవుతోంది. -
అమర జవాన్లకు రాజ్నాథ్ నివాళి
సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్లకు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, జమ్మూ కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్, ఆర్మీ నార్తర్న్ కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్లు శుక్రవారం బుద్గాంలో నివాళులు అర్పించారు. ఉగ్రదాడిలో నేలకొరిగిన అమర .జవాన్ల భౌతిక కాయాలను అమర్చిన పేటికలను కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, జమ్మూ కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్లు తమ భుజాలకెత్తుకున్నారు. ఉగ్రదాడిలో మరణించిన జవాన్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, ఉగ్ర దాడిలో జవాన్లను మట్టుబెట్టిన వారిపై తీవ్ర చర్యలు తప్పవని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. మోదీ అధ్యక్షతన జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో దాడి నేపథ్యంలో జమ్మూ కశ్మీర్లో నెలకొన్న పరిస్థితిని సమీక్షించారు. పుల్వామాలో శుక్రవారం సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 44 మంది జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. -
మారణహోమం
-
‘ద్వేషమెన్నటికి సమాధానం కాదు’
జమ్ము కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో గురువారం సీఆర్పీఎఫ్ జవాన్ల బస్సుపై ఉగ్రవాదులు ఐఈడీ (ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్)తో ఆత్మాహుతి దాడికి తెగబడ్డ సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో 43 మంది ప్రాణాలు కోల్పోగా కొందరు గాయపడ్డారు. ఈ దాడిని రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఖండించారు. బాలీవుడ్ కూడా ఈ దారుణాన్ని ఖండిస్తోంది మనలని కంటికి రెప్పలా కాపాడుతున్న జవాన్లు ఉగ్రదాడిలో మరణించడం మనసుని కలచి వేసింది. ప్రాణాలు విడిచిన జవాన్ల కుటుంబాలకి అండగా నిలబడడం మన బాధ్యత. - సల్మాన్ ఖాన్ పుల్వామా ఘటనతో ఒక్కసారిగా షాక్ అయ్యాను. ద్వేషం ఎన్నటికి సమాధానం కాలేదు. ఉగ్ర దాడిలో గాయపడ్డ జవాన్ల ఆత్మకి శాంతి కలగాలని, వారి కుటుంబాలకి ధైర్యం అందించాలని దేవుడిని కోరుకుంటున్నాను. - ప్రియాంక చోప్రా పుల్వామా దాడి అమానుషం, అమానవీయం. కోపాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను. - అజయ్ దేవగణ్ పుల్వామాలో సీఆర్పీఎఫ్ సైనికులపై జరిగిన దాడిని ఇంకా నమ్మలేకపోతున్నాను. ఈ ఘటనని ఎప్పటికి మరచిపోలేము. దాడిలో గాయపడ్డ వారు త్వరగా కొలుకోవాలని దేవుడిని వేడుకుంటున్నాను. మరణించిన వారి ఆత్మలకి శాంతి కలగాలని దేవుడిని ప్రార్ధిస్తున్నాను. - అక్షయ్ కుమార్ పుల్వామా ఘటనకి సంబంధించిన వార్త నన్ను ఎంతగానో కలచి వేసింది. దాడిలో మరణించిన వారి ఆత్మకి శాంతి కలగాలని, వారి కుటుంబానికి దేవుడు కొండంత ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నారు. - అనుష్క శర్మ -
సీఆర్పీఎఫ్ చూపిన జాలే.. ప్రాణాలు తీసింది
న్యూఢిల్లీ : భద్రతా బలగాలను తరలించే ముందు ఆ రూట్ను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అణువణవు పరీక్షిస్తారు. రోడ్ ఓపెనింగ్ పార్టీలు ముందుగా వెళ్లి తనిఖీలు నిర్వహిస్తాయి. గురువారం జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రవాదులు దాడికి పాల్పడక ముందు కూడా ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ స్థానికులకు ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశంతో వారి వాహనాలను అనుమతించారు. ఇదే సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టన బెట్టుకుంది. స్థానికుని నెపంతో సర్వీస్ రోడ్డుపై నుంచి దూసుకొచ్చిన ఉగ్రవాది అదిల్ అహ్మద్ ఆత్మహుతి దాడికి పాల్పడ్డాడని సీఆర్పీఎఫ్ సీనియర్ అధికారి మీడియాకు తెలిపారు. గురువారం జరిగిన ఈ ఆత్మహుతి దాడిలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ దాడిని సీరియస్గా తీసుకున్న భారత ప్రభుత్వం ప్రతీకార చర్యలకు సిద్ధమవుతోంది. (చదవండి : ఉగ్ర మారణహోమం) ఎవ్వరినీ వదిలిపెట్టం.. ప్రతీకారం తీర్చుకుంటాం ఇక మాటల్లేవ్.. యుద్ధమే : గంభీర్ -
వదిలిపెట్టం.. ప్రతీకారం తీర్చుకుంటాం: సీఆర్పీఎఫ్
న్యూఢిల్లీ : ఉగ్రదాడికి కారుకులైన ఏ ఒక్కరిని వదిలి పెట్టమని, అంతకంతకు ప్రతీకారం తీర్చుకుంటామని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) స్పష్టం చేసింది. జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రవాదులు గురువారం ఆత్మహుతి దాడికి తెగబడిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ సీఆర్పీఎఫ్ తమ అధికారిక ట్విటర్ ఖాతాలో భావోద్వేగమైన వ్యాఖ్యలను చేసింది. ‘మేం ఎప్పటికీ మరిచిపోలేం, ఎవ్వరిని వదిలిపెట్టం.. పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన మా సోదరులకు మేం సెల్యూట్ చేస్తున్నాం. వారి కుటుంబాలకు అండగా ఉంటాం. ఈ దాడికి కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాం.’ భావోద్వేగమైన వ్యాఖ్యలతో ట్వీట్ చేసింది. ఇక ఈ దాడిని ఖండించిన నరేంద్ర మోదీ భద్రతా బలగాలకు ఉగ్రవాదుల ఏరివేత విషయంలో పూర్తి స్వేచ్చను ఇస్తున్నట్లు ప్రకటించారు. ‘సైనికుల త్యాగం వృథా పోదు.. పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెబుతాం’ అని కేబినెట్ సమావేశం అనంతరం వ్యాఖ్యానించారు. ఈ విషయంలో విపక్షాలు సైతం మద్దతు తెలిపాయి. మోదీ తీసుకుబోయే నిర్ణయాలకు తమ మద్దతు ఉంటుందని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. దీంతో మరో సర్జికల్ స్ట్రైక్ జరగనుందా అనే చర్చ నడుస్తోంది. (చదవండి: పాకిస్తాన్కు దీటైన సమాధానం చెబుతాం) WE WILL NOT FORGET, WE WILL NOT FORGIVE:We salute our martyrs of Pulwama attack and stand with the families of our martyr brothers. This heinous attack will be avenged. pic.twitter.com/jRqKCcW7u8 — 🇮🇳CRPF🇮🇳 (@crpfindia) February 15, 2019 -
పుల్వామా ఉగ్రదాడి : పాక్ను హెచ్చరించిన అమెరికా
వాషింగ్టన్ : జమ్మూకశ్మీర్ పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముష్కరుల విషయంలో పాక్ తీరు మారాల్సిందేనంటూ అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. పాక్ ఉగ్రవాదులకు మద్దతివ్వడం.. వారిని కాపాడేందుకు ప్రయత్నించడాన్ని అమెరికా తీవ్రంగా తప్పుపట్టింది. తక్షణమే ముష్కరులకు మద్దతివ్వడాన్ని ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందని పాక్ను హెచ్చరించింది. పాక్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందంటూ అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రపంచ దేశాల్లో గందగోళాన్ని, హింసను వ్యాప్తి చేయడమే ఉగ్రవాదుల లక్ష్యమని అమెరికా మండి పడింది. ఉగ్రవాదాన్ని అంతం చేయడంలో అమెరికా భారత్కు పూర్తి మద్దతిస్తుందని తెలిపింది. రెండు దేశాలు కలిసి ఉగ్రవాద నిర్మూలనకు కృషి చేస్తాయని పేర్కొంది. పుల్వామా ఉగ్రదాడిని అమెరికాతో సహా ప్రపంచ దేశాలన్ని తీవ్రంగా ఖండించాయి. ఉగ్రదాడిని అమానవీయ చర్యగా పేర్కొన్న రష్యా ముష్కరుల అంతానికి ప్రపంచ దేశాలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చింది. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ఫ్రాన్స్, జర్మనీలు ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపాయి. -
మా రక్తం మరిగిపోతోంది: ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: కశ్మీర్లో ఉగ్రదాడికి పాల్పడిన పాకిస్తాన్కు దీటైన సమాధానం చెబుతామని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పాకిస్తాన్ చాలా పెద్ద తప్పు చేసిందని, దాడికి పాల్పడినవారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. పుల్వామాలో ఉగ్రదాడి ఘటనతో దేశ ప్రజల రక్తం మరిగిపోతోందని తెలిపారు. (ఉగ్ర మారణహోమం) ఇలాంటి దాడులతో భారతదేశ సమగ్రతను, స్థిరత్వాన్ని దెబ్బతీయలేరని స్పష్టం చేశారు. మానవతావాదులంతా ఏకమై ఉగ్రవాదులపై పోరాటానికి సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. ఈ ఘటనపై రాజకీయాలు అనవసరమని, ప్రతిపక్ష పార్టీలన్నీ ఏక తాటిపైకి రావాలన్నారు. ఉగ్రవాదంపై కలసికట్టుగా పోరాడదామన్నారు. సైనికుల ధైర్యం, త్యాగాలు వెలకట్టలేనివని అమరుల కుటుంబాలకు అండగా ఉంటామని ప్రధాని మోదీ భరోసాయిచ్చారు. (ఉగ్ర దాడికి కొత్త వ్యూహాలు) పాక్కు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ రద్దు పాకిస్తాన్కు గతంలో ఇచ్చిన మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ ఉపసంహరిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ను ఏకాకిని చేస్తామన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటన వెనుక పాకిస్తాన్, ఆ దేశ మద్ధతుదారుల హస్తం ఉందని ఆరోపించారు. పాకిస్తాన్కు సహకరించేవారిపై కూడా కఠినంగా వ్యవహరిస్తామని వార్నింగ్ ఇచ్చారు. -
పాకిస్తాన్కు దీటైన సమాధానం చెబుతాం
-
పుట్టినరోజు వేడుకలు వద్దన్న కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : జమ్మూకశ్మీర్ పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్ర దాడిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. దాడిలో మృతి చెందిన జవాన్ల కుటుంబాలకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కశ్మీర్లో జరిగిన దాడి నేపథ్యంలో దేశ ప్రజలంతా విషాదంలో మునిగిపోయారని.. తాను కూడా తీవ్ర మనస్థాపానికి గురయ్యానన్నారు కేసీఆర్. ఈ పరిస్థితుల్లో ఈ నెల 17న తన పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి వేడుకలు జరుపుకోరాదని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎవరూ కూడా తన పుట్టినరోజు వేడుకలు జరపవద్దని సీఎం కేసీఆర్ అభ్యర్థించారు. పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకుని, ఉగ్రవాదులు జరిపిన పేలుడులో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. -
పుల్వామా దాడిని ఖండించిన వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రవాదులు జరిపిన దాడిని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల దాడిని పిరికిపందల చర్యగా పేర్కొన్నారు. వీర సైనికులకు సంఘీభావం ప్రకటించారు. ముష్కరులు సాగించిన మారణకాండలో అమరులైన సైనికుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన సైనికులు త్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. పుల్వామా జిల్లా అవంతిపొరా పట్టణం సమీపంలోని లెత్పొరా వద్ద సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రవాదులు గురువారం ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిని తామే చేశామని పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రసంస్థ జైషే మహమ్మద్ ప్రకటించుకుంది. (ఉగ్ర మారణహోమం) I strongly condemn this cowardly attack on @crpfindia convoy in #Pulwama and stand in solidarity with our brave soldiers. My heart goes out to the grieving families of the martyrs and I pray for the speedy recovery of the injured jawans. #CRPF — YS Jagan Mohan Reddy (@ysjagan) 15 February 2019 -
దాడి గురించి 2 రోజుల ముందే హెచ్చరించారా..?
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సీఆర్పీఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే దాడికి పాల్పడిన ఉగ్రసంస్థ జైషే మహమ్మద్ ఈ దారుణం గురించి రెండు రోజుల ముందే హెచ్చరించిందా అంటే.. అవుననే అంటున్నారు అధికారులు. రెండు రోజుల క్రితం జైషే మహ్మద్ వర్గాలు అఫ్గానిస్తాన్లో జరిగిన ఓ దాడికి సంబంధించిన వీడియోను ఆన్లైన్లో అప్లోడ్ చేశాయి. అఫ్గానిస్తాన్లో దాడి జరిగిన తీరు.. గురువారం పుల్వామాలో జరిగిన దాడి రెండు ఒకేలా ఉన్నట్లు సమాచారం. అఫ్గానిస్తాన్లో కూడా పేలుడు పదార్థంతో ఉన్న వాహనాన్ని ఉపయోగించి ముష్కరులు దారుణానికి తెగబడ్డారు. గురువారం పుల్వామాలో కూడా ఇదే తరహా దాడే జరిగింది. అయితే ఈ వీడియోను రెండు రోజుల క్రితమే గమనించిన జమ్ముకశ్మీర్ రాష్ట్ర పోలీస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు.. వీడియోతో పాటు అవసరమైన ఇన్పుట్స్ను కూడా ఇంటిలిజెన్స్ వర్గాలకు షేర్ చేసినట్లు సమాచారం. అయితే ఇంటిలిజెన్స్ అధికారులు ఈ హెచ్చరికలను పెద్దగా పట్టించుకోలేదని... ఫలితంగా 40మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారని అంటున్నారు విశ్లేషకులు. దాడి పట్ల ఆర్మీ ఉన్నతాధికారులు కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బలగాలు భారీ సంఖ్యలో శ్రీనగర్కు వెళ్లే సమాచారం ముందుగానే ఉగ్రవాదులకు లీకై ఉండవచ్చని భావిస్తున్నారు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. దాడికి పాల్పడిన ఉగ్రవాది ఆదిల్ అలియాస్ వకాస్ ఘటన జరిగిన ప్రాంతానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నట్లు తెలిసింది.(ఈ వీడియోను చూసేలోగా స్వర్గంలో ఉంటా!) -
కేంద్ర క్యాబినెట్ అత్యవసర భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర క్యాబినెట్ అత్యవసరంగా సమావేశమవుతోంది. ఈ దాడి నేపథ్యంలో జాతీయ భద్రత పరిస్థితిని చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (సిసిఎస్)కి పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన రక్షణ, హోం, విదేశీ వ్యవహారాలు తదితర మంత్రిత్వ శాఖల మంత్రులు ఈ సమాశానికి విచ్చేశారు. ఈ క్రమంలో అన్ని రాజకీయ కార్యక్రమాలను బీజేపీ రద్దు చేసింది. ముఖ్యంగా ప్రధాని మధ్యప్రదేశ్లోని ఇత్రాసి, ధారలలో ఇవాళ, రేపు తలపెట్టిన ర్యాలీలను రద్దు చేసుకున్నారు. జాతీయ భద్రతపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. హోం శాఖమంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్, రక్షణశాఖమంత్రి నిర్మాలా సీతారామన్, ఆర్మీ చీఫ్ రావత్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్ పోలీసులకు సహాయం అందించేందుకు 12 మంది సభ్యుల నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) బృందం పుల్వామాకు తరలి వెళ్లింది. కాగా గురువారం జమ్మూ కాశ్మీర్లోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పీఎఫ్)పై జరిగిన విధ్వంసకర దాడిలో దాదాపు 40 సైనికులు మంది మృతిచెందగా, మరో 18మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. -
‘మరో కుమారుడ్ని కూడా సైన్యంలోకే పంపిస్తాను’
పట్నా : పాకిస్తాన్కు తగిన సమాధానం చెప్పడం కోసం మరో కుమారున్ని కూడా సైన్యంలోకే పంపిస్తాను అంటున్నారు ఓ వీరజవాను తండ్రి. జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రవాదులు గురువారం దాడికి తెగబడిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఇలా మరణించిన వారిలో బిహార్ భాగల్పూర్కు చెందిన రతన్ ఠాకూర్ కూడా ఉన్నారు. ఈ క్రమంలో రతన్ ఠాకూర్ తండ్రి ఏఎన్ఐతో మాట్లాడారు. ‘నా కొడుకు దేశం కోసం ప్రాణాలర్పించాడు. భరతమాత కోసం ప్రాణాలర్పించి చరిత్రలో నిలిచిపోయాడు. ఓ తండ్రిగా ఇందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. ప్రస్తుతం నేను బాధను, గర్వాన్ని అనుభవిస్తున్నాను. నా కొడుకు లాంటి మరి కొందరు వీర జవాన్లను చంపి.. వారి తల్లిదండ్రులకు తీరని కడుపు కోత మిగిల్చిన పాకిస్తాన్కు బుద్ది చెప్పాలి. పాక్కు తగిన గుణపాఠం చెప్పడం కోసం మరో కుమారున్ని కూడా సైన్యంలోకే పంపిస్తాను. తనను కూడా భరతమాత సేవకే అర్పిస్తాను’ అంటూ ఉద్వేగంగా మాట్లాడారు. -
ఉగ్రదాడిపై భారత్ ప్రతీకారం తీర్చుకుంటుంది
-
సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రదాడి.. 43మంది మృతి
-
ఆస్ట్రేలియాలో ఐఎస్ ఉగ్రదాడి
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాది రెచ్చిపోయాడు. కారుతో ఆత్మాహుతి దాడికి పాల్పడాలని వేసిన ప్రణాళిక విఫలం కావడంతో పాదచారులపై కత్తితో విరుచుకుపడ్డాడు. ఈ ఘటనలో ఒకరు చనిపోగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కాల్పుల్లో ఆ ఉగ్రవాది హతమయ్యాడు. ఈ విషయమై విక్టోరియా రాష్ట్ర పోలీస్ చీఫ్ కమిషనర్ గ్రాహమ్ ఆస్టన్ మాట్లాడుతూ..‘ఈ ఘటనను ఉగ్రదాడిగానే పరిగణిస్తున్నాం. నిందితుడు(31) సోమాలియా నుంచి వచ్చి మెల్బోర్న్లో నివాసం ఉంటున్నాడు. రద్దీగా ఉండే బౌర్కే వీధిలోకి వచ్చిన నిందితుడు శుక్రవారం కారులోని గ్యాస్సిలిండర్లను పేల్చుకుని ఆత్మహుతిదాడి చేయాలనుకున్నాడు. అయితే సిలిండర్లకు మంటలు ముందుగానే అంటుకోవడంతో బయటకొచ్చి కత్తితో దాడిచేశాడు’ అని తెలిపారు. -
మలాలాపై దాడి : సూత్రధారి హతం
కాబుల్, అఫ్గానిస్తాన్ : మలాలా యూసఫ్ జాయ్పై దాడి సూత్రధారిని అఫ్గానిస్తాన్లో అమెరికా దళాలు మట్టుబెట్టాయి. అఫ్గానిస్థాన్లోని తూర్పు కునార్ ప్రావిన్స్లో అమెరికా దళాలు జరిపిన డ్రోన్ దాడిలో పాకిస్థాన్ తాలిబన్ నాయకుడు ముల్లా ఫజ్లుల్లా హతమయ్యాడు. ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని చేసిన డ్రోన్ దాడుల్లో ఉగ్రవాద నాయకుడు హతమైనట్లు అమెరికా ప్రకటించింది. అయితే, అతని పేరును మాత్రం వెల్లడించలేదు. ఈ దాడిలో చనిపోయింది మలాలాపై దాడికి ఆదేశించిన ముల్లా ఫజుల్లా అని అఫ్గాన్ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఫజ్లుల్లా, పలువురు కమాండర్లు ఇఫ్తార్ విందులో ఉండగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఫజ్లుల్లా 2013లో పాకిస్థాన్లోని తాలిబన్ చీఫ్గా నియమితులయ్యాడు. అప్పటినుంచి అమెరికా, పాకిస్థానీ ప్రజలను లక్ష్యంగా చేసుకుని అనేక దాడులకు పాల్పడ్డాడు. 2014 డిసెంబరులో పాకిస్థాన్లోని పెషావర్లో ఆర్మీ పబ్లిక్ స్కూల్పై జరిగిన ఉగ్రదాడిలో ఫజ్లుల్లా ప్రధాన సూత్రధారి. ఆ ఘటనలో 151 మంది చిన్నారులు బలయ్యారు. మరో 130 మంది గాయపడ్డారు. ఫజ్లుల్లాపై 5 మిలియన్ డాలర్ల రివార్డు ఉంది. -
ఆఫీస్పై బాంబు దాడి ; 12 మంది మృతి
కాబుల్, అప్ఘనిస్తాన్ : మంత్రిత్వ కార్యాలయంపై సోమవారం ఉగ్రదాడి ఘటనలో అప్ఘనిస్తాన్లోని కాబుల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. కార్యాలయం బయట భారీ మొత్తంలో పేలుడు సంభవించడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. రంజాన్ పండుగ సందర్భంగా ఉద్యోగులు ముందుగానే ఇళ్లకు వెళ్తున్న సమయంలో బాంబు పేలింది. మొత్తం 12 మంది చనిపోగా, 31 మంది తీవ్రగాయాల పాలయ్యారని ఆ దేశ గ్రామీణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ప్రకటన విడుదల చేశారు. మహిళలు, పిల్లలు, ఉద్యోగులు బాధితుల్లో ఉన్నట్లు తెలిపారు. అయితే, ఉగ్రదాడికి బాధ్యులు ఎవరన్నది ఇంకా తెలియరాలేదని చెప్పారు. -
క్రికెట్ స్టేడియంలో రక్తపు ముద్దలు
కాబూల్: ఉగ్రదాడితో అఫ్ఘనిస్థాన్ మరోసారి నెత్తురోడింది. శుక్రవారం రాత్రి నంగర్హర్ ప్రొవిన్స్లోని ఓ క్రికెట్ స్టేడియంలో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఘటనలో 8 మంది మృతి చెందగా, 45 మంది గాయపడ్డారు. రంజాన్ మాసం ప్రారంభం కావటంతో జలాలాబాద్లో ఓ ఎన్జీవో సంస్థ నైట్టైమ్ టోర్నమెంట్ను నిర్వహించింది. శుక్రవారం మ్యాచ్ను వీక్షించేందుకు వందలాది మంది ప్రేక్షకులు స్పింగర్ క్రికెట్ స్టేడియానికి వచ్చారు. ఆ సమయంలో వరుస పేలుళ్లతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. రక్తపు ముద్ధలు చెల్లాచెదురుకాగా, హాహాకారాలతో ప్రేక్షకులు పరుగులు తీశారు. మూడు శక్తివంతమైన బాంబులు పేలాయని.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు ‘అష్రఫ్ ఘని’ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, ఘటనకు బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ఇప్పటిదాకా ప్రకటన చేయలేదు. -
షరీఫ్ పేల్చిన బాంబు!
అందరికీ తెలిసిన కథే. తొమ్మిదేళ్లక్రితం అమెరికా పోలీసులకు పట్టుబడ్డ ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీ చెప్పిన సంగతే. ముంబై మహా నగరంపై 2008 నవంబర్లో ఉగ్రవాదులు విరుచుకుపడి 166మందిని పొట్టనబెట్టుకున్న ఉదంతం వెనక పాకిస్తాన్ ప్రమేయం ఉన్నదని ప్రపంచ దేశా లన్నిటికీ అర్ధమైన విషయమే. అయిదు రోజులక్రితం పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా పరోక్షంగా అదే చెప్పారు. ఎన్నాళ్లు పాక్ గడ్డపై ఉగ్రవాద ముఠాలను పెంచి పోషిస్తూ పొరుగుదేశంపై దాడులకు పంపుతామని ఆయన ప్రశ్నించారు. అంతే...అక్కడ వ్యవస్థలన్నీ వణికిపోతున్నాయి. సొంత పార్టీ పాకిస్తాన్ ముస్లింలీగ్ (పీఎంఎల్)–ఎన్తో సహా అన్నివైపుల నుంచీ ఒత్తిళ్లు రావడంతో షరీఫ్ స్వరం మార్చి తన మాటల్ని మీడియా వక్రీకరించిందంటూ సంజాయిషీ ఇచ్చుకున్నారు. పాకిస్తాన్ సైన్యం ప్రధాని షహీద్ ఖాకాన్ అబ్బాసీని హడావుడిపెట్టి జాతీయ భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయించింది. ఆయన ఆరోపణల్ని తీవ్రంగా ఖండించింది. షరీఫ్ అపార్ధం చేసుకుని ఉండొచ్చు లేదా ఆయనకు దురభిప్రాయాలు ఏర్పడి ఉండొచ్చునని అభిప్రాయపడింది. జాతీయ భద్రతా మండలి షరీఫ్ మాటల్ని ఖండించ లేదని, మీడియా వక్రీకరించిందని మాత్రమే అభిప్రాయపడిందని పీఎంఎల్–ఎన్ చెబుతోంది. నవాజ్ షరీఫ్ తన మాటల్లో ఎక్కడా సైన్యం గురించి నేరుగా మాట్లాడలేదు. ఉగ్రవాద సంస్థలకు సైన్యం తోడ్పాటునిస్తున్నదని చెప్పలేదు. అయినా ‘గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు’ పాక్ సైన్యానికి కంగారు ఎక్కువైంది. బహుశా తనకూ, సైన్యానికీ మధ్య విభేదాలు రాకుండా ఉంటే షరీఫ్ ఇంత బాహాటంగా పాక్ తప్పిదాన్ని అంగీకరించేవారు కాదేమో! ఆయన ప్రధానిగా ఉండగా ముంబై దాడుల ప్రస్తావన వస్తే తమకేమీ సంబంధం లేదనే చెప్పేవారు. పైగా ఆ దాడులపై పాక్లో సాగుతున్న విచారణకు భారత్ సహకరించడం లేదని ఆరోపించారు. తనను ప్రధాని పదవి నుంచి తప్పించడానికి, ఆ తర్వాత అనర్హత వేటు వేయడానికి సైన్యం లోపాయికారీగా సుప్రీంకోర్టుపై ఒత్తిడి తెచ్చిన తీరు చూశాక ఆయన ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన తాజా వ్యాఖ్యలు చేశారు. ప్రధానిగా పని చేశారు కాబట్టి ఆయనకు మొదటి నుంచీ సైన్యం వేస్తున్న వేషాలన్నీ తెలుసు. లష్కరే తొయిబా, జైషే మహమ్మద్, హక్కానీ నెట్వర్క్ వంటి ఉగ్రవాద ముఠాలకు డబ్బులిచ్చి, ఆయుధాలిచ్చి, శిక్షణ ఇచ్చి మన దేశంపైకి ఉసిగొల్పుతున్న తీరు గురించిన సమస్త సమాచారమూ ఆయన వద్ద ఉంటుంది. కారణాలేమైనా కావొచ్చుగానీ షరీఫ్కూ, సైన్యానికీ మొదటినుంచీ పడటం లేదు. ఆయన రెండోసారి ప్రధాని అయ్యాక 1999లో అప్పటి సైనిక దళాల చీఫ్ జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ తిరుగుబాటు చేసి ఆయన్ను పదవీచ్యుతుణ్ణి చేశారు. ఆ తర్వాత ఖైదు చేయించారు. రాజకీయాలకు స్వస్తి చెప్పి సౌదీ అరేబియా వెళ్లిపోతానని హామీ ఇచ్చాకే ఆయనకు విముక్తి లభించింది. 2013లో షరీఫ్ తిరిగి ప్రధాని కాగానే ముషార్రఫ్ పాలనాకాలంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించారు. 1999నాటి సైనిక కుట్ర గురించి కూడా విచారించి అందుకు ఆయన్ను శిక్షించాలని పట్టుబట్టారు. ఇదంతా సైన్యానికి నచ్చలేదు. పాకిస్తాన్లో మూడు అధికార కేంద్రాలుంటాయి. అవి సమాంతరంగా, స్వతంత్రంగా పని చేస్తుంటాయి. అందులో మొదటిది పౌర ప్రభుత్వం. రెండోది సైన్యం. మూడోది సుప్రీంకోర్టు. ఏ దేశంలోనైనా సైన్యం పౌర ప్రభుత్వం చెప్పుచేతల్లో ఉంటుంది. అది తీసుకునే నిర్ణయాలకూ, రూపొందించే విధానాలకూ కట్టుబడి ఉంటుంది. కానీ పాకిస్తాన్లో దీనికి విరుద్ధంగా జరుగు తుంది. సైన్యం స్వతంత్రంగా వ్యవహరించాలనుకుంటుంది. ప్రజలెన్నుకున్న పౌర ప్రభుత్వాన్ని బేఖాతరు చేస్తుంది. అదును దొరికితే దాన్ని చాప చుట్టి తానే ఏలాలని చూస్తుంది. పాకిస్తాన్ అవతరణ నాటినుంచి ఆ దేశంలో ఎక్కువకాలం సైనిక పాలనే నడిచింది. పదేళ్లుగా సైన్యం ఇలాంటి కుట్రలకు దూరంగా ఉన్నా తెరవెనకనుంచి పౌర ప్రభుత్వాలను శాసించే ధోరణి మానుకోలేదు. మాజీ క్రికెటర్ ఇమ్రాన్ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్(పీటీఐ) వంటి పార్టీల ద్వారా పౌర ప్రభుత్వాన్ని ఇబ్బందులపాలు చేయాలని చూస్తూనే ఉంది. నాలు గేళ్లక్రితం నవాజ్ షరీఫ్ను గద్దె దించడమే లక్ష్యమంటూ పార్లమెంటును ముట్టడించిన ఇమ్రాన్ ఖాన్కు సైన్యమే అండదండలిచ్చింది. ఆయనకు జనంలో అంతగా ఆదరణ లేకపోవడంతో ఆ ముట్టడి కార్యక్రమం నవ్వులపాలైంది. ఈలోగా 2016లో పనామా పత్రాలు వెల్లడై అందులో నవాజ్ షరీఫ్ కుటుంబసభ్యుల పేర్లున్నాయని తెలిశాక సైన్యం ఆయన అడ్డు తొలగించుకునే పని మొదలుబెట్టింది. సుప్రీంకోర్టును ప్రభావితం చేసి ఆయనపై విచారణ తంతు నడిపించి ప్రధాని పదవి నుంచి తప్పుకునేలా చేసింది. ఆ తర్వాత రాజకీయాలకే ఆయన అనర్హుడంటూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఈ పరిణామాల పర్యవసానంగానే నవాజ్ షరీఫ్ గళం విప్పారు. పరోక్షంగా సైన్యం సాగిస్తున్న కుట్రలను ప్రపంచానికి వెల్లడించారు. పాకిస్తాన్లో సాగుతున్న అంతర్గత కుమ్ములాటల మాట అలా ఉంచి ఉగ్రవాదానికి అక్కడి సైన్యం అందిస్తున్న తోడ్పాటుపై అమెరికా మాత్రమే కాదు... చైనా, సౌదీ అరేబియా వంటి సన్నిహిత దేశాలు సైతం అసహనంతో ఉన్నాయి. ఉగ్రవాద ముఠాలను కట్టడి చేయకపోతే ఆర్థిక ఆంక్షలు విధిస్తామని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆయన్ను ప్రసన్నం చేసుకుని ఈ గండం నుంచి గట్టెక్కుదామని ప్రయత్నిస్తుండగా షరీఫ్ ఉన్నట్టుండి ఈ బాంబు పేల్చడంతో సైన్యానికి దిక్కుతోచడం లేదు. అందుకే ఈ ఉలికిపాటు. ఏ ఉద్దేశంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినా ఉగ్రవాద ముఠాలకు తోడ్పాటునిస్తున్న ధోరణులపై సాక్షాత్తూ మాజీ ప్రధానే మాట్లాడటం ఒక రకంగా మంచిదే. ప్రపంచం నలుమూలలనుంచీ పాక్పైఒత్తిళ్లు పెరుగుతాయి. సైన్యం కుటిల ధోరణులకు కళ్లెం పడేందుకు ఇది దోహదపడుతుంది. ఆ దేశంలో పౌర ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తే అది మనకు కూడా మేలు కలిగిస్తుంది. ఇరు దేశాల మధ్యా సామరస్య సంబంధాలు ఏర్పడతాయి. ఉగ్రవాద ముఠాల కార్యకలాపాలకు అడ్డుకట్ట పడుతుంది. -
ఉగ్ర దాడితో ఫ్రాన్స్ ఉలిక్కిపడింది