ఇద్దరు ఉగ్రవాదులు హతం | Two Terrorists Killed In Encounter By Security Forces in Kashmir | Sakshi
Sakshi News home page

ఇద్దరు ఉగ్రవాదులు హతం

Published Sat, Apr 6 2019 4:22 PM | Last Updated on Sat, Apr 6 2019 4:24 PM

Two Terrorists Killed In Encounter By Security Forces in Kashmir - Sakshi

శ్రీనగర్‌ : జమ్మూ కశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూలోని షోపియాన్‌ జిల్లాలోని ఇమామ్‌ సాహిబ్‌ ఏరియాలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.

కాగా పుల్వామా ఉగ్రదాడి, బాలకోట్‌లో జైషే మహ్మద్‌ ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దళం మెరుపు దాడుల నేపథ్యంలో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాక్‌ సైన్యం పదే పదే కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించడం, ఉగ్రవాదులు కూడా కాల్పులకు తెగబడుతుండటంతో భారత సైన్యం వారికి ధీటుగా బదులిస్తూ కుట్రలను తిప్పికొడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement