వాషింగ్టన్ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అమెరికా కోర్టు నోటీసులు పంపింది. 2002 గుజరాత్ అల్లర్ల కేసుకు సంబంధించి ఆయనకు న్యూయార్క్ కోర్టు ఈ నోటీసులు ఇచ్చింది.ఇందుకు సంబంధించి మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని మోడీని ఆదేశించింది. అలియెన్స్ ఫర్ జస్టీస్ అండ్ అకౌంటబిలిటీ ( ఏజేఎ) దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానం ఈ నోటీసులు జారీ చేసింది. గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో అమెరికా ....తొమ్మిదేళ్లపాటు మోడీకి వీసా నిరాకరించిన విషయం తెలిసిందే. కాగా దేశాధినేతగా మోడీకి ఈ కేసు వర్తించదని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
మరోవైపు మోడీ పర్యటనకు నిరసనగా నల్ల జెండాలను ప్రదర్శిస్తామని అలియెన్స ఫర్ జస్టీస్ అండ్ అకౌంటబిలిటీ ( ఏజేఎ) ప్రకటించింది. ఈ నెల 28న న్యూయార్క్ నగరంలోని మన్ హట్టన్ మధ్యనున్న మోడీ మాదిసన్ స్వ్కేర్ కు విచ్చేసినప్పడు తాము తెలుపుతామని వెల్లడించింది. 2002లో సిక్కుల ఊచకోత సందర్భంగా మోడీ తీసుకున్న చర్యలపై ఈ ప్రజాకోర్టు ద్వారా నిరసనలు తెలుపుతామని పేర్కొంది.
ప్రధాని మోడీకి అమెరికా కోర్టు నోటీసులు
Published Fri, Sep 26 2014 11:42 AM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- ఎగ్గొట్టారు!
- పూర్తిస్థాయిలో విస్తరించిన రుతుపవనాలు
- Election Commission: ఎన్నికల వ్యయంలో తేడాలున్నాయి
- హస్తినకు చేరుకున్న సీఎం చంద్రబాబు
- డ్రోన్ల ద్వారా దోమలను కనిపెడదాం
- అగ్గే.. పిడుగు కాదు!
- కమిషన్లతోనే సర్కార్ కాలయాపన
- లైవ్ రిపోర్టింగ్లో మహిళా జర్నలిస్టుకు షాకింగ్ అనుభవం
- ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు
- ‘విశాఖ ఉక్కు’ ఆస్తుల విక్రయంపై అభ్యంతరం ఉందా?
Advertisement