ప్రధాని మోడీకి అమెరికా కోర్టు నోటీసులు US rights group gets court summons against Narendra modi | Sakshi
Sakshi News home page

ప్రధాని మోడీకి అమెరికా కోర్టు నోటీసులు

Published Fri, Sep 26 2014 11:42 AM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM

ప్రధాని మోడీకి అమెరికా కోర్టు నోటీసులు - Sakshi

వాషింగ్టన్ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అమెరికా కోర్టు నోటీసులు పంపింది. 2002 గుజరాత్ అల్లర్ల కేసుకు సంబంధించి ఆయనకు న్యూయార్క్ కోర్టు ఈ నోటీసులు ఇచ్చింది.ఇందుకు సంబంధించి మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని మోడీని ఆదేశించింది. అలియెన్స్  ఫర్ జస్టీస్ అండ్ అకౌంటబిలిటీ ( ఏజేఎ) దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానం ఈ నోటీసులు జారీ చేసింది.  గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో అమెరికా ....తొమ్మిదేళ్లపాటు మోడీకి వీసా నిరాకరించిన విషయం తెలిసిందే. కాగా దేశాధినేతగా మోడీకి ఈ కేసు వర్తించదని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

మరోవైపు  మోడీ పర్యటనకు నిరసనగా  నల్ల జెండాలను ప్రదర్శిస్తామని అలియెన్స ఫర్ జస్టీస్ అండ్ అకౌంటబిలిటీ ( ఏజేఎ) ప్రకటించింది. ఈ నెల 28న న్యూయార్క్ నగరంలోని మన్ హట్టన్ మధ్యనున్న మోడీ మాదిసన్ స్వ్కేర్ కు  విచ్చేసినప్పడు తాము  తెలుపుతామని వెల్లడించింది.  2002లో సిక్కుల ఊచకోత సందర్భంగా మోడీ తీసుకున్న చర్యలపై ఈ ప్రజాకోర్టు ద్వారా నిరసనలు తెలుపుతామని పేర్కొంది.

Advertisement
 
Advertisement
 
Advertisement