నడిరోడ్డుపై మహిళ దారుణ హత్య | Woman murdered in public view in Bhopal | Sakshi
Sakshi News home page

నడిరోడ్డుపై మహిళ దారుణ హత్య

Published Wed, Mar 8 2017 4:37 PM | Last Updated on Fri, May 25 2018 2:29 PM

నడిరోడ్డుపై మహిళ దారుణ హత్య - Sakshi

నడిరోడ్డుపై మహిళ దారుణ హత్య

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో నడిరోడ్డుపై ఓ మహిళను అందరు చూస్తూండగానే ఓ అగంతకుడు గొంతు కోసి చంపేశాడు. ఈ దారుణ హత్య మంగళవారం రాత్రి భోపాల్‌లోని అశోకా గార్డెన్‌ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సునీతా టాకుర్‌ టీ కొట్టు నడుపుతూ జీవనం సాగిస్తుంది. ఇటీవలే ఆమె డ్రగ్స్‌ అమ్మిన కేసులో పట్టుబడి బెయిల్‌పై విడుదలైంది. 
 
మంగళవారం రాత్రి టీకొట్టు మూసిన ఆమె పనివాడితో కలిసి  ఇంటికి వెళ్తుండగా 8 గంటల సమయంలో ఓ అంగతకుడు ఆమెను కత్తితో గొంతు కోసి చంపాడు. ఘటనాస్థలి నుంచి పనివాడు తప్పించుకోగా.. అక్కడున్న వారు ఆమెను  ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందింది. సునీతతో డ్రగ్స్‌ అమ్మిన వ్యక్తే ఈ దారుణానికి పాల్పిడంటుడాని, పూర్తి విచారణ చేసి నిందితుని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement