![Indian Student dies in America - Sakshi](/styles/webp/s3/article_images/2019/04/23/sravan-kumar-reddy.jpg.webp?itok=2vBa4eym)
సాక్షి, మంచిర్యాల : అమెరికాలో తెలుగు విదార్థి శ్రావణ్కుమార్రెడ్డి మృత్యువాతపడ్డాడు. ఈస్టర్ సందర్భంగా స్నేహితులతో కలిసి బోస్టన్ బీచ్కు వెళ్ళిన శ్రావణ్ ప్రమాదవశాత్తూ నీటమునిగిపోయాడు. గమనించిన స్నేహితులు వెంటనే స్థానిక ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అలల ఉధృతికి సముద్రంలో గల్లంతయిన అతని కోసం గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు సోమవారం శ్రావణ్ మృతదేహాన్ని బయటకు తీశారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళిన శ్రావణ్కుమార్ రెడ్డి స్వస్థలం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి. విషయం తెలుసుకున్న శ్రావణ్ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment