bellampalli
-
దుర్గం చిన్నయ్యకు షాక్!.. డీజీపీకి మహిళా కమిషన్ లేఖ
సాక్షి, ఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై శేజల్ అనే యువతి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా శేజల్ ఫిర్యాదుపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ఈ క్రమంలో కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. కాగా, అంతకుముందు బాధితురాలు శేజల్ వేధింపుల అంశంపై బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసింది. దీంతో, జాతీయ మహిళా కమిషన్ స్పందిస్తూ తెలంగాణ డీజీపీకి లేఖ రాసింది. ఈ క్రమంలో శేజల్ ఫిర్యాదుపై విచారణ జరపాలని ఆదేశించింది. లైంగిక ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని లేఖలో ఆదేశించింది. ఇక, 15 రోజుల్లో దీనిపై అప్డేట్ ఇవ్వాలని కమిషన్ లేఖలో పేర్కొంది. ఇది కూడా చదవండి: దుర్గం చిన్నయ్యపై ఆరోపణలు.. వీడియో, ఫొటో రిలీజ్ చేసిన శేజల్ -
ఢిల్లీకి చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదం.. జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు
-
ఢిల్లీకి చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదం..NWCకి ఫిర్యాదు
సాక్షి, మంచిర్యాల: బెల్లంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, అరిజిన్డెయిరీ నిర్వాహకుల మధ్య తలెత్తిన వివాదం దేశ రాజధాని ఢిల్లీకి చేరింది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసినట్లు అరిజిన్ డెయిరీ భాగస్వామి తెలిపారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ను కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే వల్ల ప్రాణ హానీ ఉందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. చిన్నయ్యపై చట్టరీత్యా చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరుతూ డెయిరీ సీఈవో ఆదినారాయణ, సీఏవో శేజల్ ఆదివారం ఢిల్లీలోని కొత్త పార్లమెంట్ భవనం వద్ద ఆందోళన చేశారు. దుర్గం చిన్నయ్య వల్ల తమ కంపెనీలో ఉన్న వాళ్లంతా రోడ్డున పడ్డారని బాధితురాలు శేజల్ ఆరోపించారు. ఎమ్మెల్యే తమను లైంగికంగా వేధిస్తున్నారని.. న్యాయం జరిగేంత వరకు పోరాడతామని పేర్కొన్నారు. ఇప్పటికే తమపై తప్పుడు కేసులు పెట్టారని.. బెయిల్పై బయటకు వచ్చినా.. బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. మంత్రి కేటీఆర్ అపాయింట్మెంట్ అడిగానని.. ఎందుకో ఇవ్వడం లేదంటూ ఆరోపించారు. కాగా, ఎమ్మెల్యేకు, అరిజిన్ డెయిరీ పాల సంస్థ ప్రతినిధులకు మధ్య గతంలో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. లైంగిక వేధింపులతో పాటు ఎమ్మెల్యే తమపై అక్రమ కేసులు బనాయించారని సదరు యువతి ఆరోపించారు. చదవండి: జూబ్లీహిల్స్ పబ్లో పాములు, తొండలు.. కస్టమర్లను ఆకర్షించేందుకు -
ఆ వాట్సాప్ నంబర్ నాది కాదు.. మహిళ ఆరోపణలపై స్పందించిన ఎమ్మెల్యే
సాక్షి, మంచిర్యాల: తనపై ఓ మహిళ చేసిన ఆరోపణలపై బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్పందించారు. వీడియో సందేశం ద్వారా వివరణ ఇచ్చారు. తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, ప్రతిపక్ష నాయకులతో కలిసి కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో, వాట్సాప్లో ప్రచారం అవుతున్న ఫోన్ నంబర్ తనది కాదే కాదని పేర్కొన్నారు. దీనిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. 'రైతులకు ఉచిత ఫాంలు, లోన్లు ఇస్తామని కొంతమంది నా దగ్గరకు వచ్చారు. రైతులకు లాభం చేకూరుస్తారని నమ్మి వారిని ప్రోత్సహించా. కానీ వారు నాకు తెలియకుండా లోన్లు ఇప్పిస్తామని చెప్పి 20-25 మంది రైతుల నుంచి సుమారు రూ.60-70 లక్షలు వసూలు చేశారు. డబ్బులు కట్టించుకొని మోసం చేయడానికి ప్రయత్నించారు. ఈ విషయం రైతులు నా దృష్టికి తీసుకువస్తే.. నేను వెంటనే పోలీసులకు చెప్పాను. వాళ్లు పిలిచి విచారిస్తే లోన్లు ఇప్పిస్తామని చెప్పినవారు భారీ మోసానికి పాల్పడినట్లు తెలిసింది. చాలా ప్రాంతాలు, కొన్ని జిల్లాల్లో వారు ఇలాగే మోసానికి పాల్పడినట్లు తేలింది. వారిపై ఎక్కడెక్కడ కేసులు నమోదు అయ్యాయో తెలుసుకుని రైతులు ఇచ్చిన పిటిషన్ ప్రకారం చీటింగ్ కేసు పెట్టి నిందితులను జైలుకు పంపాం. అది దృష్టిలో పెట్టుకుని నన్ను ఏదో విధంగా బ్లాక్ మెయిల్ చేయాలనే ఉద్దేశంతో వారు బెదిరిస్తున్నారు. సోషల్ మీడియాలో, వాట్సాప్లో కన్పిస్తున్న నంబర్లు నావి కావు. కావాలనే నన్ను ఎన్నికల సమయంలో ఇబ్బంది పెట్టడానికి కొంతమంది ప్రతిపక్ష నాయకులను కూడా కలుపుకొని ఇలా చేస్తున్నారు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నా. తప్పకుండా న్యాయపరంగా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నా.' అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కాగా.. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను వేధించారని ఓ మహిళ వీడియో విడుదల చేయడం సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే తనతో వాట్సాప్ చాట్ చేశాడని ఆమె పేర్కొంది. ఆయన మోసాలను బట్టబయలు చేస్తానంది. బ్లాక్ మెయిల్ చేయడం లేదని చెప్పింది. ఎమ్మెల్యే ఇంటి సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తే అసలు వాస్తవాలేంటో తెలుస్తాయంది. చదవండి: ఎమ్మెల్యే మోసం చేశారు.. మరో వీడియో విడుదల చేసిన యువతి -
సింగరేణిపై ప్రధాని మాట తప్పారు
బెల్లంపల్లి/కాగజ్నగర్ టౌన్: సింగరేణిని ప్రైవేటీకరణ చేయబోమని చెప్పిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్లమెంటు సాక్షిగా నాలుగు బొగ్గు బ్లాక్లను వేలం వేస్తామని ప్రకటించడం.. నోటితో నవ్వి, నొసటితో వెక్కిరించినట్లుగా ఉందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ప్రధాన మంత్రి సింగరేణిపై మాట తప్పారని, బొగ్గు గనులు, విశాఖ ఉక్కుతోపాటు ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, రైల్వేల వంటి ముఖ్యమైన సంస్థలను ప్రైవేటు, కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీకొడుతోందని విమర్శించారు. కాగా, కోల్బెల్ట్ ప్రాంతాల్లో ప్రారంభించనున్న వైద్య కళాశాలల్లో సింగరేణి కార్మికుల పిల్లలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించేందుకు సీఎం కేసీఆర్ సుముఖంగా ఉన్నారని హరీశ్రావు తెలిపారు. రిజర్వేషన్ ప్రక్రియ వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమలు కానుందని చెప్పారు. గురువారం ఆయన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో రాష్ట్ర ప్రభుత్వం రూ.17 కోట్లతో నిర్మించిన 100 పడకల ఏరియా ఆస్పత్రి, డయాలసిస్ కేంద్రం, కుమురంభీం జిల్లా కాగజ్నగర్లో రూ.5 కోట్లతో నిర్మించిన 30 పడకల సామాజిక ఆస్పత్రిని మంత్రులు నిరంజన్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డిలతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభల్లో హరీశ్రావు మాట్లాడుతూ.. మళ్లీ కరోనా వచ్చే అవకాశాలు ఉన్నాయని, అయితే ప్రజలు ఏమాత్రం భయపడకుండా ఉండాలని, ప్రభుత్వపరంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పూర్తి స్థాయి వైద్యులను నియమిస్తామని, వారంరోజుల్లోగా కాగజ్నగర్లో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. ఆసిఫాబాద్లో 340 పడకల ఆస్పత్రి నిర్మాణంతోపాటు వైద్య కళాశాల ప్రారంభానికి కృషి చేస్తామన్నారు. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ ప్రాణహిత ప్రాజెక్టు నిర్మించి సిర్పూర్ (టీ), ఆసిఫాబాద్, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 లక్షల ఎకరాలకు సాగు నీరందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని, త్వరలోనే ఆ ప్రాజెక్టు కోసం టెండర్లు పిలవనున్నామని తెలిపారు. పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్నేత, ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, ఎన్.దివాకర్రావు, కోనేరు కోనప్ప, ఎమ్మెల్సీ దండే విఠల్ తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. -
పిల్లలను లాలిస్తూ పాడిన పాటే.. బాధను మరిపిస్తోంది!
బెల్లంపల్లి: ఆ ఖాకీ చొక్క హృదయంలో అంతులేని వేదన ఉంది. ఇద్దరు పిల్లలు దివ్యాంగులుగా జన్మించడం వేదనకు గురి చేసింది. ఆ వేదనను దిగమింగి పిల్లల సంతోషం కోసం పాడడం మొదలైంది. పాటలు వింటూ పిల్లలు వైకల్యాన్ని మరిచి ఆనందంతో కేరింతలు కొట్టేవారు. కొన్నేళ్లలోనే ఇద్దరు పిల్లలు దూరం కావడం తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ఆ బాధను మరిచిపోవడానికి పాటలు పాడుతూనే ఉన్నాడు. ఆ గాయకుడైన పోలీసు అధికారి రామగుండం పోలీసు కమిషనరేట్లోని బెల్లంపల్లి ఆర్మ్డ్ రిజర్వుడ్ ఏసీపీ చెరుకు మల్లికార్జున్. దివ్యాంగులుగా పిల్లలు.. మల్లికార్జున్, శ్యామల దంపతులకు 1996లో తొలి సంతానంగా సాహితీ దివ్యాంగురాలిగా జన్మించింది. ఎన్నో ఆస్పత్రుల్లో చూపించినా పరిస్థితిలో మార్పు రాలేదు. మంచం, కుర్చీకి పరిమితమై ఉండేది. కొద్దిగా మాట్లాడడం తప్పా భూమిపై అడుగు కదిపేది కాదు. తల్లిదండ్రులు ఆమెకు సపర్యలు చేస్తూ అల్లారు ముద్దుగా చూసుకున్నారు. 2001లో రెండో సంతానంగా మగ బిడ్డ జన్మించాడు. విధి ఆ దంపతులకు పరీక్ష పెట్టింది. హర్షిత్ కూడా మానసిక, శారీరక వైకల్యంతో జన్మించడంతో మల్లికార్జున్ దంపతుల దుఃఖానికి అవధులు లేకుండా పోయాయి. పిల్లల ఆనందం కోసం.. పిల్లలను లాలిస్తూ మల్లికార్జున్ ఓ పాట పాడారు. అంతే ఆ ఇద్దరు పిల్లల మోములో ఆనందం తొణికిసలాడింది. అప్పటి నుంచి మల్లికార్జున్ పదే పదే పాటలు పాడుతుండడంతో ఆ చిన్నారులు వైకల్యాన్ని మరిచి కేరింతలు కొట్టేవారు. వారి సంతోషం కోసం సినిమా పాటలు నేర్చుకుని ఆలపించేవాడు. ఆ తీరుగా ఏళ్లపాటు కొనసాగగా ఆ చిన్నారుల సంతోషాన్ని చూసి విధికి కన్నుకుట్టిందేమో.. 18 ఏళ్ల వయస్సులో హర్షిత్ 2019లో, కూతురు సాహితీ ఇరవై నాలుగేళ్ల వయస్సు వచ్చాక 2020లో దూరమయ్యారు. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చారు. పిల్లల మరణంతో కుంగిపోయిన మల్లికార్జున్ను చూసిన తోటి సహోద్యోగులు ఓదార్చి ధైర్యం చెప్పారు. ఆ వేదనను మర్చిపోవడానికి అతడిలో అంతర్లీనంగా దాగి ఉన్న గాయకుడిని తట్టి లేపారు. గతాన్ని మర్చిపోవడానికి పాటలు పాడడం ప్రారంభించాడు. ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా ఫ్లేస్టోర్ నుంచి స్టార్ మేకర్ యాప్లో పాటలు పాడి అప్లోడ్ చేశారు. శ్రోతల నుంచి స్పందన రావడంతో డ్యూయెట్ పాటలను మేల్వర్షన్లో పాడి అప్లోడ్ చేయడం ప్రారంభించారు. నచ్చిన ఫిమేల్ సింగర్ అతడి గొంతుతో జత కలపడం, నచ్చిన ఫిమేల్ వాయిస్కు మెయిల్ వర్షన్లో మల్లికార్జున్ శృతి కలిపి డ్యూయెట్ పాటలు పాడటం మొదలు పెట్టారు. అలా ఏకంగా 3,387 పాటలు పాడి ప్రత్యేకతను ఏర్పర్చుకున్నారు. చిన్నప్పటినుంచే పాటలపై ఆసక్తి కరీంనగర్కు చెందిన చెరుకు మల్లికార్జున్ 1996లో పోలీసు శాఖలో ఆర్ముడ్ రిజర్వుడ్ సబ్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగంలో చేశారు. అంతకుముందు 1994–95లో మెడికల్ రిప్రజెంటిటివ్గా పని చేశారు. 1995లో శ్యామలతో వివాహం జరిగింది. మల్లికార్జున్ 2009లో ఇన్స్పెక్టర్గా, 2019లో డీఎస్పీగా పదోన్నతి పొందారు. వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పని చేశారు. ఏడాదిన్నర కాలంగా బెల్లంపల్లి ఆర్ముడ్ రిజర్వుడు ఏసీపీగా విధులు నిర్వర్తిస్తున్నారు. చిన్నప్పటి నుంచే పాటలపై ఆసక్తి ఉండగా చదువుకునే రోజుల్లో కళాశాలలో, పోలీసు కార్యక్రమాల్లో పాటలు పాడేవారు. (క్లిక్ చేయండి: అన్నదాతల్లో చైతన్యం తీసుకొస్తున్న ప్రవాసీయులు) బాలు గాత్రం అంటే ఎంతో ఇష్టం పిల్లల జ్ఞాపకాలను మర్చిపోవడానికి ప్రస్తుతం స్టార్ మేకర్ వేదిగా పాటలు పాడుతున్నాను. పిల్లల కోసం నేర్చుకున్న పాటలు ఆ ఇద్దరు మానుండి వెళ్లిపోయాక మర్చిపోవడానికి మళ్లీ పాడడాన్ని ఎంచుకున్నాను. దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గాత్రం అంటే ఎంతో ఇష్టం. తుది ఊపిరి ఆగిపోయే వరకు పాటలు పాడుతూనే ఉంటాను. – మల్లికార్జున్, సీఆర్ ఏసీపీ, బెల్లంపల్లి -
'తెలంగాణ పర్యటనలో అక్కా, చెల్లెమ్మ పదాలు నేర్చుకున్నా'
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ పర్యటనలో భాగంగా అక్కా, చెల్లెమ్మ పదాలు నేర్చుకున్నా. తెలంగాణ ప్రజల ప్రేమ జీవితంలో మర్చిపోలేను’అని జమ్మూకశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి కవీందర్ గుప్తా అన్నారు. ‘బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా నాలుగు రోజుల కిందట బెల్లంపల్లి గ్రామానికి వెళ్లాను. ఏడు సార్లు భోజనం చేస్తే అందులో ఆరుసార్లు వైశ్య సంఘాలే పెట్టాయి. వ్యాపారాల్లో ఉంటూనే దేశ ప్రగతిలో వైశ్యులు పాలుపంచుకుంటున్నారు’అని తెలిపారు. శనివారం రాత్రి అఖిల భారత వైశ్య సంఘం (ఏఐవైఎఫ్) మహా సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ ప్రధాన కార్యదర్శి గోపాల్ మోర్ మాట్లాడుతూ దేశంలో కోటిన్నర కంటే తక్కువ టర్నోవర్ ఉన్న వైశ్య వ్యాపారులకు నెలకు రూ.3 వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశంలో 3.50 కోట్ల మంది వైశ్యులున్నారని, కరోనా టైంలో కూడా ఈ కమ్యూనిటీ పేదల కడుపు నింపిందని పేర్కొన్నారు. దేశంలోని వైశ్య సంఘానికి కూడా అన్ని రకాల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అందాలని కోరారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్షుడు గిరీశ్ సంఘీ, ఇతర ప్రతినిధులు జైస్వాల్, రాజేశ్అగర్వాల్, జితేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: (బీజేపీలో చేరిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి) -
గర్భిణి ప్రసవ వేదన
వేమనపల్లి (బెల్లంపల్లి): సుఖ ప్రసవం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రావాలని ప్రభుత్వం చెబుతుండగా, ప్రసవ వేదనతో ఆస్పత్రికి వెళ్లిన గిరిజన మహిళ వైద్య సిబ్బంది లేక ఇబ్బంది పడాల్సి వచ్చింది. కనీసం పట్టణానికి వెళ్లి ప్రాణాలు కాపాడుకుందామనుకుంటే వాగు దాటలేని పరిస్థితి గర్భిణీని వేదనకు గురి చేసింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలో చోటు చేసుకుంది. రాజారాం గ్రామానికి చెందిన బోరం భీమయ్య, శాంతక్కల కూతురు బుర్స శిరీషకు బుధవారం ఇంటి వద్ద నొప్పులు మొదలయ్యాయి. ఇరుగుపొరుగు వారి సాయంతో అవ్వాల్ కమిటీ అంబులెన్స్లో వేమనపల్లి పీహెచ్సీకి తరలించారు. 24 గంటల వైద్య సదుపాయం అందించాల్సిన ఆస్పత్రిలో సిబ్బంది లేరు. కాంట్రాక్ట్ వర్కర్ బాపు ఒక్కడే ఉన్నాడు. శిరీష ఆరోగ్య పరిస్థితిని చూసి వైద్యాధికారి కృష్ణకు ఫోన్లో సమాచారం అందించగా, ఆయన చెన్నూర్ సివిల్ ఆస్పత్రికి తరలించమని సలహా ఇచ్చారు. అదే అంబులెన్స్లో ఐదు కిలోమీటర్ల దూరంలోని నీల్వాయి వాగు వంతెన వద్దకు తీసుకెళ్లారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు అప్రోచ్ రోడ్డు బురదమయంగా ఉండడంతో అంబులెన్స్ బురదలో కూరుకుపోయింది. రాత్రి 10 గంటలకు వాగు వద్దకు వెళ్లిన అంబులెన్స్ రాత్రి 12.30 గంటల వరకు కూడా బురదలో నుంచి బయటకు రాలేదు. దీంతో అంబులెన్స్లో ఉన్న గర్భిణిని డ్రైవర్ నరేష్, మరో డ్రైవర్ బుర్స భాస్కర్, కుటుంబ సభ్యులు చేతులపై ఎత్తుకెళ్లి వంతెన మీదుగా మామిడితోట అవతలి వైపు మోసుకొచ్చారు. అక్కడ వేచి ఉన్న 108 అంబులెన్స్ సహాయంతో చెన్నూర్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. గురువారం తెల్లవారుజామున శిరీష ఆడశిశువుకు జన్మనివ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, సిబ్బంది లేకపోవడంతోనే ఆమె పరిస్థితిని చూసి అంబులెన్స్ ఏర్పాటు చేసి పంపించామని వైద్యాధికారి కృష్ణ తెలిపారు. -
రూ. 2లక్షలు డిమాండ్.. ఏసీబీకి చిక్కిన బెల్లంపల్లి టూటౌన్ ఎస్సై
సాక్షి, బెల్లంపల్లి: స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి లంచం తీసుకున్న మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి టూటౌన్ ఎస్సై కే.భాస్కర్రావును కరీంనగర్ అవినీతి నిరోధక శాఖ అధికారులు(ఏసీబీ) బుధవారం వలపన్ని పట్టుకున్నారు. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ కే.భద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ శివారు బాహుపేటకు చెందిన తండ్రీకొడుకులు అల్లె సత్యనారాయణ, అల్లె వేణు బెల్లంపల్లి కాల్టెక్స్ ఏరియాకు చెందిన ఓ వ్యక్తికి లారీని లీజుకు ఇచ్చి ఆ లారీ ఇంజిన్, చాసిస్ నంబరు మార్చి వేరే వ్యక్తుల పేర్లపై మార్పిడి చేసి తప్పుడు పద్ధతిలో రుణం పొంది మోసం చేశారని ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ ఫిర్యాదు చేయడంతో వారిద్దరిపై 2019 నవంబర్ 12న బెల్లంపల్లి టూటౌ న్లో కేసు నమోదైంది. వారికి బెయిల్ మంజూరు కోసం అల్లె నవీన్ కొన్ని నెలలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి ఎస్సై భాస్కర్రావు రూ.2లక్షలు డిమాండ్ చేశాడు. నవీన్ ప్రాధేయపడడంతో చివరికి రూ.1.20లక్షలకు ఒప్పందం కుదిరింది. బుధవారం డబ్బు తీసుకుని బెల్లంపల్లికి వచ్చినట్లు నవీన్ ఎస్సైకి సమాచారం ఇచ్చాడు. తన ప్రైవేటు కారు డ్రైవర్ రాజ్కుమార్ టూటౌన్ ముందున్న రహదారిపై ఉంటాడని, అతనికి ఇవ్వాలని ఎస్సై భాస్కర్రావు సూచించాడు. నవీన్ రాజ్కుమార్కు డబ్బు ఇచ్చాడు. వెంటనే ఏసీబీ అధికారులు టూటౌన్కు చేరుకుని నగదు స్వాధీనం చేసుకున్నా రు. ఎస్సై భాస్కర్రావు, రాజ్కుమార్ చేతులకు ర సాయనిక పరీక్ష చేయగా పాజిటివ్గా వచ్చిందని ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపారు. ఎస్సై భాస్కర్రావు, రాజ్కుమార్పై కేసు నమోదు చేశామని, గురువారం కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజ రు పరుస్తామని తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ సీఐలు ఎస్పీ.రవీందర్, సంజీవ్, ఎస్సైలు పాల్గొన్నారు. ఖాకీల్లో కలకలం ఎస్సై ఏసీబీకి చిక్కడంతో జిల్లాలో సంచలనం, పోలీ సుశాఖలో కలకలం సృష్టించింది. ఏడేళ్ల తర్వాత ఓ పోలీసు అధికారి చిక్కడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. భీమిని మండలానికి చెందిన ఓ ఎంఈవో మెట్పల్లి(ఏసయ్యపల్లె) గ్రామానికి చెందిన సాక్షర భారత్ కోఆర్డినేటర్ నుంచి లంచం తీసుకుంటుండగా బెల్లంపల్లి లో ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. బెల్లంపల్లి ఆబ్కారీ సీఐ గురవయ్య గౌడ కులస్తుల నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఆ ఘట నల తర్వాత ఎస్సై స్థాయి అధికారి పట్టుబడడం పోలీసు శాఖను ఉలిక్కిపాటుకు గురి చేసింది. సీఐ ప్రమోషన్లో ఉండి.. బెల్లంపల్లి టూటౌన్ ఎస్సైగా భాస్కర్రావు 2019 న వంబర్ 7న విధుల్లో చేరారు. అంతకుముందు కాసిపేట పోలీసుస్టేషన్లో పనిచేశారు. సాధారణ బదిలీల్లో భాగంగా బెల్లంపల్లి టూటౌన్కు వచ్చిన తర్వాత ప్రత్యేక శైలీ అలవర్చుకున్నారనే ఆరోపణలున్నాయి. మరికొన్ని కేసుల్లోనూ స్టేషన్ బెయిల్కు నిందితులను ఇబ్బందులకు గురి చేశారనే విమర్శలు వచ్చాయి. ఒకట్రెండు నెలల్లో బదిలీ కానున్నారనే ప్రచారం జరిగింది. మరోవైపు పోలీసుశాఖలో పదోన్నతుల కల్పనకు కసరత్తు చేస్తుండగా ఆయన పేరు ఐదో స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. సీఐగా బదిలీపై వెళ్లాలనే తలంపులో ఉన్న ఆయనకు ఏసీబీతో ఎదురుదెబ్బ తగిలింది. -
ఇక నా పెళ్లి జరగదు.. యువతి ఆత్మహత్య
సాక్షి, ఆదిలాబాద్: కోటపల్లి మండలం జనగామ గ్రామానికి చెందిన పడాల హరిప్రియ(22) తనకు పెళ్లి కాదని క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యులు, ఎస్సై రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ గ్రామానికి చెందిన హరిప్రియకు మహారాష్ట్రకు చెందిన మేనబావతో వివాహం జరిపేందుకు రెండు కుటుంబాలు నిశ్చయించాయి. హరిప్రియ తండ్రి మధుకర్ తన అక్క దగ్గర గత సంవత్సరం రూ.2 లక్షల వరకు అప్పు తీసుకవచ్చాడు. వ్యవసాయంలో నష్టాలు రావడంతో మధుకర్ అప్పు తీర్చలేకపోయాడు. ఈ విషయంలో రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అప్పు తీరిస్తేనే పెళ్లి అని మధుకర్ అక్క చెప్పడంతో హరిప్రియ తన పెళ్లి జరగదని కలత చెంది సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. ఇది గమనించిన హరిప్రియ నాన్నమ్మ విషయాన్ని కుటుంబసభ్యులకు సమాచారం అందించగా చికిత్స నిమిత్తం చెన్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు. పిక్ల తండాలో యువకుడు.. లింగాపూర్(ఆసిఫాబాద్): మండలంలోని పిక్లతండాకు చెందిన బానోత్ గోవింద్(32) ఆదివారం రాత్రి క్రిమిసంహారక మందు తాగి మృతిచెందాడు. ఎస్సై మధుకర్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గోవింద్ రెండేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. ఆదివార రాత్రి కూడా బాగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. భార్యతో గొడవ పడ్డాడు. భార్య మందలించడంతో చేను వద్దకు వెళ్లి క్రిమిసంహారక మందు తాగాడు. ఇంటికి వచ్చి వాంతులు చేసుకోవడంతో గమనించిన కుటుబ సభ్యులు ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సలహ మేరకు మెరుగైన చికిత్స కోసం ఆదిలాబాదు రీమ్స్కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి సోమవారం ఉదయం మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పేర్కొన్నారు. ప్రియుడి ఇంటి ఎదుట యువతి నిరసన కాసిపేట(బెల్లంపల్లి): మండలంలోని పెద్దనపల్లి గ్రామానికి చెందిన చెండె స్వరూప సోమవారం ప్రియుడి ఇంటిముందు నిరసన తెలిపింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దనపల్లికి చెందిన లౌడం మహేందర్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఏడాది క్రితం తనను లోబరుచుకున్నాడని ఆరోపించింది. ఇటీవల ప్రెగ్నేన్సి టెస్ట్ కూడా చేయించాడని, ప్రెగ్నేన్సీ లేకపోవడంతో నామోబైల్లో కాల్స్, మేసెజ్ డాటా మొత్తం తొలగించి తనతో ఎలాంటి సంబంధం లేదని వెళ్లిపోయాడని వివరించింది. తనకు న్యాయం చేయాలని, మహేందర్తో వివాహం జరిపించాలని బైఠాయించింది. గ్రామస్తులు మద్దతు తెలపడంతో గోడవ జరుగుతుందని, విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకోని ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించారు. దీంతో కాసిపేట పోలిస్స్టేషన్లో స్వరూప ఫిర్యాదు చేసింది. మహేందర్కు కరోనా పాజిటివ్ వచ్చిందని, అతను కోలుకున్నాక విచారణ చేసి కేసునమోదు చేస్తామని ఎస్సై తెలిపారు. చదవండి: వివాహిత సజీవ దహనం: హత్యా..ప్రమాదమా? -
Bellampalli: ఐసోలేషన్ కేంద్రంలో 12 మంది మృతి
బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. బెల్లంపల్లి ఐసోలేషన్ కేంద్రంలో రెండ్రోజుల వ్యవధిలో 12 మంది మృత్యువాతపడ్డారు. కొద్ది గంటల వ్యవధిలోనే ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు కోల్పోవడం కలకలం సృష్టించింది. బెల్లంపల్లి కేంద్రంగా సింగరేణి ఏరియా ఆస్పత్రిలో ఐసోలేషన్ కేంద్రం నిర్వహిస్తున్నారు. సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాల్చడంతో జిల్లాలో రోజూ దాదాపు 500 కేసులు నమోదవుతున్నాయి. కాగా అనేక మంది రెండు మూడు రోజుల వ్యవధిలోనే తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాపాయ స్థితి లో ఐసోలేషన్ కేంద్రంలో చేరుతున్నారు. ఆక్సిజన్ స్థాయి 50 శాతానికి పడిపోయిన రోగులు ఆస్పత్రిలో చేరిన కొద్ది గంటల వ్యవధిలోనే చనిపోతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 8 మంది, ఆ తర్వా త సాయంత్రం 7 గంటల వరకు మరో నలుగురు వ్యక్తులు కరోనాతో కన్నుమూశారు. -
మాజీ ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితి విషమం
సాక్షి, బెల్లంపల్లి: సీపీఐలో సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వారం క్రితం శ్వా సకోస సమస్యలు ఏర్పడగా అతడిని కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని నిమ్స్లో చేర్పించారు. అప్పటినుంచి ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య చికిత్స అందిస్తున్నారు. మధుమేహ వ్యాధితో బాధపడుతున్న మల్లేష్కు తాజాగా కిడ్నీ సంబంధమైన సమస్యలు తోడైనట్లు పార్టీ శ్రేణులు అంటున్నారు. శుక్రవారం సాయంత్రం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి నిమ్స్కు వెళ్లి మల్లేష్ను పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులతో చర్చించారు. మల్లేష్ ఆరోగ్య సమాచారాన్ని బెల్లంపల్లిలోని పార్టీ శ్రేణులకు చాడ ఫోన్చేసి చెప్పినట్లు సమాచారం. మల్లేష్ ఆరోగ్యంపై సీపీఐ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతుండగా.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. -
ప్రేమ, ఉద్యోగాల పేరుతో.. రూ.లక్షల్లో వసూలు
సాక్షి, బెల్లపల్లి: నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకొని, ఉద్యోగాల ఆశ చూపి, ఓ ముఠా రూ.లక్షల్లో వసూలు చేసింది. అనంతరం బాధితులను మోసగించిన ఘటనలో ఓ మహిళతోపాటు మరో ముగ్గురు వ్యక్తులను కరీంనగర్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. టాస్క్ఫోర్స్ పోలీసుల వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ఓ మహిళ ఉద్యోగం లేక ఖాళీగా ఉండేది. ఈ క్రమంలో కుటుంబసభ్యులతో విడిపోయి, కరీంనగర్లోని ఆదర్శ నగర్లో ఒంటరిగా జీవిస్తోంది. జల్సాలకు అలవాటు పడి, సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్ధేశ్యంతో అమాయక యువకులను లక్ష్యంగా చేసుకొని, ప్రేమ, ఉద్యోగాల పేరుతో మాయమాటలు చెబుతూ వారి నుంచి రూ.లక్షల్లో వసూలు చేసింది. ఆమె తన ముఠా సభ్యులైన కంబాల రాజేశ్(41), కుసుమ భాస్కర్(48), భీమాశంకర్(28)లతో కలిసి కరీంనగర్లోని సిక్వాడీకి చెందిన ఓ యువకుడిని వరంగల్లోని ప్రభుత్వ ఆస్పుత్రిలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించింది. క్యాంటీన్ నిర్వహణ కాంట్రాక్టు పేరుతో రూ.13.5 లక్షలు, కరీంనగర్లోని తిరుమల నగర్లో నివాసం ఉంటున్న మరో వ్యక్తి నుంచి ప్రభుత్వ ఊద్యోగం పేరుతో రూ.7 లక్షలు, గోదావరిఖనికి చెందిన ఓ యువకుడి వద్ద రూ.3లక్షలు వసూలు చేశారు. నిందితురాలు వరంగల్కు చెందిన యువకుడితో తనను నికితారెడ్డిగా పరిచయం చేసుకొని, అతనితో చేసిన ఫోన్ చాటింగ్ చేసింది. దాన్ని అడ్డుగా పెట్టుకొని బాధితుడిని బ్లాక్ మెయిల్ చేస్తూ రూ.8లక్షల వరకు తీసుకుంది. సదరు మహిళ కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అని, అధికారుల వద్ద పలుకుబడి ఉందని నిరుద్యోగులతో నమ్మబలికింది. ఉద్యోగాలు ఇప్పిస్తానని, రిజిస్ట్రేషన్ నిమిత్తం, అధికారులకు ఇవ్వడానికి డబ్బులు ఖర్చవుతాయని నమ్మించింది. తన మూఠా సభ్యులను అధికారులుగా చూపించి, వసూళ్లకు తెరలేపింది. బాధితులు తాము మోసపోయామని గ్రహించి, డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే రాజేష్, భాస్కర్, భీమాశంకర్లను పెద్ద మనుషులుగా చూపించింది. తన మొబైల్లో చాటింగ్ను చూపిస్తూ వారిపైనే కేసులు పెడుతూ బెదిరింపులకు గురిచేసింది. ఈ ఘటనలతో నిఘా పెట్టిన పోలీసులు నిందితులందరినీ పట్టుకొని, వారి వద్ద నుంచి రూ.20 వేలు, నకిలీ నియామక పత్రాలు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కరీంనగర్, గోదావరిఖని, వరంగల్, హైద్రాబాద్ ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయని తెలిపారు. కరీంనగర్ సీపీ వీబీ.కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగాలు ఇప్పిస్తామని వచ్చేవారి మాయమాటలు నమ్మి, డబ్బు, సమయం కోల్పోవద్దన్నారు. ఈ ముఠా వల్ల మోసపోయిన వారు ఎవరైనా ఉంటే నేరుగా పోలీస్స్టేషన్కు వెళ్లి అధికారులను సంప్రదించాలని సూచించారు. సీఐ విజయ్కుమార్, టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్లు ప్రకాష్, శశిధర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
మావోయిస్టు సుదర్శన్ లొంగిపోతారా..?
సాక్షి, బెల్లంపల్లి: మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్న మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ ప్రభుత్వానికి లొంగి పోతారనే ప్రచారం సాగుతోంది. రెండురోజుల నుంచి పుకార్లు షికారు చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సుదర్శన్ డిగ్రీ చదువుతున్న క్రమంలో విప్లవోద్యమానికి ఆకర్షితుడయ్యాడు. చదువు పూర్తయ్యాక ఆర్నెళ్లపాటు సింగరేణిలో కార్మికుడిగా పనిచేశాడు. 1978లో విప్లవోద్యమానికి అంకితమై అజ్ఞాతంలోకి వెళ్లాడు. 42 ఏళ్లపాటు మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న ఆయన అంచలంచెలుగా ఉన్నత శ్రేణికి ఎదిగారు. ప్రస్తుతం కేంద్ర కమిటీ స్థాయికి ఎదిగి కీలకమైన పొలిట్ బ్యూరోలో సభ్యుడిగా ఉన్నాడు. మావోయిస్టు పార్టీలో మిలటరీ శిక్షణ ఇవ్వడం.. వ్యూహాలను రచించి సమర్థవంతంగా అమలు చేయడంలో సుదర్శన్కు మంచి పట్టున్నట్లు చెబుతుంటారు. నాలుగు దశాబ్దాల పైబడి అజ్ఞాతవాసం గడుపుతున్న సుదర్శన్ ఒక్కసారి కూడా పోలీసులకు చిక్కకపోవడం విశేషం. (గణపతి లొంగిపోతాడన్న వార్తల్లో వాస్తవమెంత?) తల్లిదండ్రులు చనిపోయినా.. 64 ఏళ్లున్న సుదర్శన్ ఎన్నోసార్లు ఎదురుకాల్పుల నుంచి తప్పించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం దండకారణ్యం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. విప్లవోద్యమానికి జీవితాన్ని అంకితం చేసిన ఆయన.. అతడి తండ్రి మల్లయ్య 2017లో, తల్లి వెంకటమ్మ 2018లో మృతిచెందినప్పటికీ ఇంటిముఖం చూడలేదు. పోలీసుల సూచనతో జనజీవన స్రవంతిలో కలవాలని తల్లిదండ్రులు కోరినప్పటికీ సుదర్శన్ మాత్రం ముందుకు రాలేదు. సహచరులు కొంతమంది లొంగిపోయినా.. ఎంతోమంది ఎన్కౌంటర్లో మృతిచెందినా.. ఆయన అజ్ఞాతం వదిలి రాలేదు. సుదర్శన్ లొంగిపోతున్నట్లు సాగుతున్న ప్రచారం ఆసక్తికరంగా మారింది. లొంగిపోతారనే ప్రచారంలో వాస్తవమెంత? నిజంగానే సుదర్శన్ పోరుబాట వదులుతాడా..? అందుకు గల కారణాలు ఏమై ఉంటాయి..? ప్రచారంలో వాస్తవం ఎంత..? అనే కోణాల్లో పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణ్రావు అలియాస్ గణపతి ఆరోగ్యం క్షీణించి జనజీవన స్రవంతిలో కలవబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న క్రమంలోనే సుదర్శన్ కూడా లొంగిపోతున్నాడనే వార్తలు వస్తుండటంతో స్థానికంగా వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బుధవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చిన డీజీపీ మహేందర్ రెడ్డి హెలికాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించడం.. పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించడం చర్చనీయాంశమైంది. -
ఆడతోడు కోసమేనా..?
సాక్షి, జన్నారం(మంచిర్యాల) : కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్తో అడవిప్రాంతంలోని వన్యప్రాణులకు స్వేచ్ఛాయుత వాతావరం నెలకొంది. ప్రజలు లాక్డౌన్తో ఇళ్లకే పరిమితమయ్యా రు. రోడ్లపై రాకపోకలు నిలిచిపోగా అడవి ప్రాంతం ప్రశాంత వాతావరణం నెలకొంది. కవ్వాల్ టైగర్జోన్లోని జన్నారం అటవి డివిజన్లోని తాళ్లపేట్, జన్నారం, ఇందన్పల్లి అటవి రేంజ్లలోని అడవి ప్రాంతాల్లో అలజడి తగ్గడంతో వన్యప్రాణులు స్వచ్ఛాయుత వాతావరణంలో విహరిస్తున్నాయి. గతంలో దట్టమైన అడవిలో బిక్కుబిక్కుమంటూ ఉండే వన్యప్రాణులు కాస్త ఊరటగా బయటకు వస్తున్నాయి. అడవి వదులకపోయిన స్వచ్ఛగా తిరుగుతున్నా యి. ఈక్రమంలో‘సాక్షి’ గురువారం జన్నా రం అటవిడివిజన్లో అధికారులతో డుగా పర్యటించగా పలుచిత్రాలు కనిపించాయి. పక్షుల సందడి... అడవిలో వన్యప్రాణులే కాకుండా రకరకాల పక్షలు సందడి చేస్తున్నాయి. ఉదయం అడవిలో అడుగుపెడితే పక్షుల కిలకిల రావాలు చెవులకు వింపుగా వినిపిస్తాయి. సుదూర ప్రాంతాల నుంచి రకరకాల పక్షులు కవ్వాల్లోని కుంటల వద్ద పర్యటిస్తున్నట్లు అటవిశాఖ అధికారులు చెబుతున్నారు. ఇండియన్ స్పాట్ బిల్డ్ డక్, యూరేషియన్ వైజన్ పక్షి, గార్గానీడక్, కామన్టీల్ డక్, ఆసియన్ ఓపెన్బిల్, రెడ్ నాపెడ్ ఐపిస్ పక్షి, గ్రేహెరన్ పక్షి, బ్లాక్ వింజ్డ్ స్టిల్ట్ పక్షి, కామన్ స్టాండ్ పైపర్ పక్షి, పీఏడ్ కింగ్ ఫిషర్, క్రేస్టెడ్ ట్రీస్వీఫ్ట్, బ్లాక్ నెక్డ్, వుల్లి నెక్డ్ పక్షులు ఈ కవ్వాల్లో విహారిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రోడ్డును వదిలి అడవుల్లోకి... ప్రతి రోజు అడవి సమీపంలో ప్రధాన రహదారిపై రోడ్డుకు ఇరువైపులా ఉంటూ వాహనదారులు వేసే పండ్లు, వేరుశనగా, మొక్కజొన్న కంకులు తదితర వాటిని కోతులు తింటూ ఉండేవి. అదే విధంగా ఇందన్పల్లి, చింతగూడ, పొనకల్ తదితర గ్రామాల్లో కోతులు అనేకంగా ఇబ్బందులు పెట్టేవి. లాక్డౌన్ కారణంగా వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో కోతులకు ఆహారం కరువైంది. దీంతో కోతులు ఊర్లను వదిలి అడవిబాట పట్టాయి. కోతులు ఒకసారి అడవి రుచి మరిగితే ఇక జనావాసాల్లోకి రావని, ఇది కొంత ఊరట నిచ్చే విషయమని అటవి అధికారులు చెబుతున్నారు. బెల్లంపల్లి: బెల్లంపల్లి చుట్టుపక్కల మండలాల్లో తిరుగుతున్న పులి గ్రామీణులతోపాటు అటవీ శాఖ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సాధారణంగా పులి ఒక్కచోట ఉండదు. అలాంటిది ఐదురోజులుగా ఒకే ప్రాంతంలో ఉంటూ.. ప్రజల అలికిడి ఉన్నప్పటికీ అదరకుండా తిరుగుతుండడంతో ఇదే ప్రాంతంలో ఆవాసం ఏర్పాటు చేసుకుంటుందా..? లేదా మరో ప్రాంతానికి వెళ్లిపోతుందా అనేది అంతుచిక్కడం లేదు. చెర్లపల్లి శివారులో అడుగుపెట్టగానే ఓ గేదెను హతమార్చిన పులి రోజువారీ కదలికలు అటవీ అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. సూర్యస్తమయం కాకముందే.. దర్జాగా తన స్థావరాన్ని వదిలి బయటకు వస్తోంది. దీంతో పులిని కాపాడుకునేందుకు అటవీ అధికారులు నానాయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో పది సీసీ కెమెరాలు, నాలుగు బేస్క్యాంపులు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా గస్తీ కాస్తున్నారు. వేటగాళ్లు విద్యుత్ తీగలు అమర్చకుండా, అటువైపు జనసంచారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రైతులు పొలాల వద్దకు వెళ్లకుండా కట్టడి చేస్తున్నారు. యవ్వన దశలో పులి.. మహారాష్ట్రలోని తడోబా ప్రాంతం నుంచి వచ్చిన ఈ మగపులి యవ్వన దశలో ఉన్నట్లు తెలుస్తోంది. దీని వయసు నాలుగేళ్ల వరకు ఉంటుందని అటవీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కండపుష్టి కలిగి.. బలిష్టంగా ఉన్న పులి కదలికలను సీసీ కెమెరాల్లో బంధిస్తున్న అధికారులు.. ఆడతోడు కోసం ఆరాటపడుతున్నట్లు అంచనావేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో నాలుగు పులులు సంచరిస్తున్నాయి. బెల్లంపల్లి పులితో ఆ సంఖ్య ఐదుకు చేరిందని చెబుతున్నారు. వీటన్నింటిలోనూ ఈ పులి వయస్సే తక్కువని పేర్కొంటున్నారు. జోడుకోసం వెంపర్లాడుతున్న ఈ పులి కొద్దిరోజులపాటు ఇదే ప్రాంతంలో ఉంటుందా..? లేక తోడు వెదుక్కుంటూ మరో ప్రాంతానికి వెళ్తుందా.. తేలాల్సి ఉంది. బెంబేలెత్తిస్తున్న బెబ్బులి తాండూర్: మండలంలో పులి హడలెత్తిస్తోంది. బుధవారం రాత్రి గోలేటి వన్ ఇంక్లైన్ గని హోటల్ వెనకాలలోని అటవీ ప్రాంతంలో, రెబ్బెన మండలం కైరిగూడ గ్రామానికి చెందిన కోటేష్కు చెందిన ఎద్దును హతమార్చింది. ఆ ప్రాంత ప్రజలు భయందోళనకు గురవుతున్నారు. గోలేటి వన్ ఇంక్లైన్ గని నుంచి బీపీఏ ఓసీ –2 మధ్యలో పులి సంచారం చేస్తున్నట్లు చూపరులు చెబుతుండగా, అర్ధరాత్రి అచ్చులాపూర్ గ్రామ శివారు ప్రాంతంలో పులి గాండ్రింపులు వినిపించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. రెండు పులులు తిరుగుతున్నాయా.? ఒకే పులినా అనేది అటవీ అధికారులు ఇంకా ఓ అభిప్రాయానికి రాలేకపోతున్నారు. -
గొల్లపల్లి అడవిలో పులి సంచారం
నెన్నెల(బెల్లంపల్లి): మండలంలోని గొల్లపల్లి అడవిలో పులి సంచరిస్తోంది. ఆదివారం గొర్లకాపరులు పులి అడుగులను గుర్తించారు. దీంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. సర్పంచ్ ఇందూరి శశికళ అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. నెల రోజుల క్రితం గొల్లపల్లి, ఖమ్మంపల్లి శివారులో పోచమ్మగుండాల వద్ద పులి సంచరించింది. గ్రామస్తులు అడుగులను గుర్తించి ఫొటోలు సైతం తీశారు. నెలలో మూడుసార్లు పులి జాడలను గొల్లపల్లి శివారు ప్రాంతాలలో గుర్తించడంతో పులి ఇదే ప్రాంతంలో ఆవాసం ఏర్పచుకుందేమోనని గ్రామస్తులు భయంతో వణుకుతున్నారు. వ్యవసాయ క్షేత్రంలో చిరుత పులి నర్సాపూర్(జి): మండల కేంద్రం సమీపన గాడి ప్రభాకర్కు చెందిన వ్యవసాయ క్షేత్రంలో శనివారం రాత్రి చిరుత పులి అడుగులను రైతు ప్రభాకర్ గుర్తించారు. సమాచారాన్ని వెంటనే అటవీ శాఖ అధికారులకు అందజేశారు. సంఘటన స్థలాన్ని డిప్యూటీ ఎఫ్ఆర్వో గౌత్ పరిశీలించి చిరుత పులి అడుగులుగా నిర్ధారించారు. మండలంలోని కుస్లి, గోల్లమాడ, అంజనితండా గ్రామాల్లో చిరుత పులి ఆవులను, మేకలను హతమార్చింది. సమీప గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ అధికారులు ప్రజలకు సూచించారు. -
లక్కీ డ్రా పేరుతో మోసం..!
సాక్షి, బెల్లంపల్లి(అదిలాబాద్): లక్కీ డ్రా పేరుతో అమాయక ప్రజలను మోసగిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం బెల్లంపల్లి రూరల్ సర్కిల్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూరల్ సీఐ కె.జగదీష్ వివరాలు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం విట్టునాయక్ తండాకు చెందిన కొంతమంది యువకులు లక్కీ డ్రా పేరుతో బెల్లంపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ప్రజలను మోసం చేస్తూ వసూళ్లకు పాల్పడ్డారు. ఇంటింటికి వెళ్లి జుపిటర్ మార్కెటింగ్, పాలీగోల్డ్ మార్కెటింగ్, రెడ్ ఫాక్స్ హోమ్ అప్లయన్సెస్, స్కాలర్ హోమ్ అప్లయన్సెస్, శ్రీసాయి ఓంకార్ ఎంటర్ ప్రైజేస్ కంపెనీ పేర్లతో స్క్రాచ్ కార్డులను చూపించి గ్రామీణులను లక్కీ డ్రా పేరుతో మోసం చేశారు. «గత నెల 20వ తేదీన ధర్మపురిలో ఎనిమిది మంది బృందం సభ్యులు రెండు గ్రూపులుగా విడిపోయారు. స్క్రాచ్కార్డులు కొనుగోలు చేసిన తరువాత లక్కీ డ్రాలో బహుమతులు వస్తాయని నమ్మించి రూ.2వేల నుంచి రూ.7,500 వరకు దొరికినంత వసూళ్లు చేశారు. చెన్నూర్, రామగుండం, ధర్మారం తదితర ప్రాంతాల్లోనూ ఇలాగే వసూళ్లకు పాల్పడ్డారు. గత నెల 29న బెల్లంపల్లి మండలం కాశిరెడ్డిపల్లి గ్రామంలో కొంతమంది మహిళలను లక్కీ డ్రా ఆశచూపి రూ.14వేలు వసూళ్లు చేశారు. ఆ సమాచారంతో తాళ్లగురిజాల పోలీసులు ఈ నెల 1న నిందితులపై రెండు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్క్రాచ్ కార్డులపై ఉన్న ఫోన్ నంబర్ల ఆధారంగా నిందితులను గుర్తించి బుధవారం సాయంత్రం ఎంపీడీవో కార్యాలయం సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన వారిలో మూడు సంజీవ్, కేతవాత్ గోపాల్, కేతవాత్ అరవింద్ , జాదవ్ అకాశ్, కేతవాత్ అలియాస్ రాథోడ్ రాజు, పవర్కేషు, కేతవాత్ గోపాల్, చవాన్కుమార్ ఉన్నట్లు వివరించారు. అనంతరం నిందితుల వద్దనుంచి రూ.29,090 నగదు, 2కార్లు, గృహోపకరణ వస్తువులైన కుక్కర్లు, మొబైల్ ఫోన్లు 8, వివిధ కంపెనీలకు చెందిన స్క్రాచ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో తాళ్లగురిజాల ఎస్సై బి.సమ్మయ్య, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
మనకూ ఉంది ఓ ఫ్లైఓవర్..
సాక్షి, కాగజ్నగర్(ఆదిలాబాద్) : ఫైఓవర్లు ప్రమాదకరంగా మారుతున్నాయి. సరైన డిజైన్ లోపం, రక్షణ చర్యలు లేక ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కాగజ్నగర్లో ఉన్న జిల్లాలోనే ఏకైక రైల్వే ఫైఓవర్ బ్రిడ్జి సైతం ప్రమాదాలకు ఏమాత్రం అతీతంగా లేదు. ఈ బ్రిడ్జిపై సరైన రక్షణ చర్యలు లేక తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. శనివారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ గచ్చిబౌలిలోని డయో డైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదం అలర్ట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో కాగజ్నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి దుస్థితిపై ప్రత్యేక కథనం కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జితో పాటు వేంపల్లి– సిర్పూర్(టి) మధ్య మరో ఫ్లైఓవర్ నిర్మిణంలో ఉంది. కాగజ్నగర్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రమాదాలకు అడ్డాగా మారింది. తరచూ ఈ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదా లు జరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చి, జూన్ మాసాల్లో చోటు చేసుకున్న ప్రమాదాల్లో ఇద్దరు మృత్యువాత పడ్డారు. సిర్పూర్ నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్గా ఉన్న కాగజ్నగర్ ప్రాంతా నికి చుట్టు పక్కల మండలాల ప్రజలు, వాహనదారులు ఎక్కువగా ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి గుండానే రాకపోకలు సాగిస్తుంటారు. కాగజ్నగర్ నుంచి దహెగాం, కౌటాల, బెజ్జూర్, చింతలమానేపల్లి, పెంచికల్పేట, భీమిని మండలాలకు వెళ్లాలం టే ఈ బ్రిడ్జి మీదుగానే వెళ్లాల్సిన ఉంటుంది. ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలు, లారీలు, ట్రాక్టర్లు, వ్యాన్లు, ఆటోలు ఇలా అన్నిరకాల వాహనాలు ఈ వంతెన గుండా రాకపోకలు సాగిస్తున్నాయి. కానరాని రక్షణ చర్యలు.. దాదాపు కిలోమీటర్ దూరం ఉన్న ఈ బ్రిడ్జిపై రక్షణ చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఎక్కడా కూడా ప్రమాద సూచికలు ఏర్పాటు చేయలేదు. కనీసం రేడియం కటింగ్లతో హెచ్చరికలు కూడా ఏర్పాటు చేయకపోవడం విశేషం. ఈ నేపథ్యంలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. బ్రిడ్జి మొదలు ప్రాంతంలో రోడ్డుకు పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. చివరి భాగంలో కూడా రోడ్డు శిథిలావస్థకు చేరడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక బ్రిడ్జిపై మలుపులు ఉన్న చోట్ల అతివేగంతో వెళ్లే వాహనాలు అదుపు తప్పితే పెను ప్రమాదం సంభవించే అవకాశాలున్నా యి. ఫ్లైఓవర్ బ్రిడ్జి మొదలు, ముగింపు ప్రాంత ంలో అధికారులు కనీసం స్పీడ్ బ్రేకర్లు సైతం ఏర్పాటు చేయలేదు. రాత్రిపూట ఇబ్బందే.. రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ప్రధానంగా రాత్రిపూట ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాత్రిపూట మూల మలుపుల వద్ద అధికారులు రేడియం కటింగ్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో వాహనదారులకు చీకటిలో సరిగ్గా కనబడకపోవటం, ప్లైఓవర్పై ఉన్న విద్యుత్ స్తంభాల్లో ఎక్కువ శాతం వెలగకపోవడం కూడా ప్రమాదాలకు దారి తీయవచ్చని నిపుణులు పేర్కొటున్నారు. మరోవైపు రాత్రిపూట మద్యం మత్తులో వాహనాలను అతి వేగంతో నడుపుతూ వెళుతున్నారని ఆర్వోబీ సమీపంలో ఉన్న ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇరువైపులా సైడ్ వాల్ ఇంకా ఎత్తుగా నిర్మించాలని వాదనలు వినిపిస్తున్నాయి. ఆర్అండ్బీ, రైల్వే అధికారులు స్పందించి ఇక్కడ కూడా హైదరాబాద్ వంటి ప్రమాదం జరగకముందే మేల్కోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. రక్షణ చర్యలు ఏర్పాటు చేయాలని ఆకాంక్షిస్తున్నారు. రేడియం ఏర్పాటు చేయాలి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిపై రాత్రిపూట ఇండికేషన్ లభించే విధంగా అధికారులు రేడియం కటింగ్లతో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. అలాగే బ్రిడ్జి మొదలు, ముగింపు పాయింట్లలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తే ప్రమాదాలను నివారించవచ్చు. ఆర్వోబీ ముగింపు వద్ద ఉన్న గుంతలను సత్వరమే పూడ్చివేయాలి. – సుభాష్ పాల్, స్థానికుడు చర్యలు తీసుకుంటాం కాగజ్నగర్ రైల్వే ఫైఓవర్ బ్రిడ్జిపై ప్రమాదాలు చోటు చేసుకోకుండా రేడియం కటింగ్లతో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తాం. అవసరాన్ని బట్టి బ్రిడ్జిపై స్పీడ్ బ్రేకర్ కూడా నిర్మిస్తాం. ప్రమాదాల నివారణకు శాఖపరంగా చర్యలు తీసుకుంటాం. అలాగే గుంతలు ఏర్పడిన చోట మరమ్మతులు చేయించి ప్రజలకు సౌకర్యం కల్పిస్తాం. – రాము, ఆర్అండ్బీ, ఈఈ -
ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమజంట మృతి
సాక్షి, తాండూర్(బెల్లంపల్లి): ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రేమజంట ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గురువారం మృతి చెందారు. వివరాలలోకి వెళితే.. బెజ్జూరు మండలం లంబాడితండా పరిధిలోని బొగుడ గూడ గ్రామానికి చెందిన గోమాస జీవన్ (35), తాండూర్ మండలం కాసిపేట గ్రామానికి చెందిన ఏల్పుల గౌరు(29) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. సామాజిక వర్గాలు వేరు కావడంతో ఇరు కుటుంబాలు అంగీకరించకపోవచ్చని బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్నేహితులు మంచిర్యాల ఆస్పత్రిలో చేర్పించగా మెరుగైన వైద్యం కోసం కరీంనగర్కు తరలిం చారు. వేర్వేరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గురువారం మృతి చెందిన సీఐ సామల ఉపేందర్ తెలిపారు. -
సింగరేణిలో అత్యధిక ఇన్సెంటివ్ అతడిదే
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థ ఇటీవల ప్రకటించిన 28 శాతం లాభాల వాటాలో శ్రీరాంపూర్ ఏరియాకు చెందిన టింబర్యార్డు వర్క్మెన్ మందాల ఓదేలు అత్యధికంగా రూ.1.80 లక్షల ఇన్సెంటివ్ సాధించాడు. ఏరియాల వారీగా అత్యధిక ఇన్సెంటివ్లు సాధించిన వారి వివరాలను యాజమాన్యం సోమవారం విడుదల చేసింది. ఓదేలు అత్యధిక ఇన్సెంటివ్ సాధించి మొదటి స్థానంలో నిలువగా, రూ.1.76 లక్షలతో మందమర్రి ఏరియాకు చెందిన జనరల్ మజ్దూర్ కుమ్మరి జెస్సీరాజ్ ద్వితీయ, రూ.1.67 లక్షలతో కొత్తగూడెం ఏరియా ఎల్హెచ్డీ ఆపరేటర్ రాంజీవన్ పాసి తృతీయ స్థానంలో నిలిచారు. బెల్లంపల్లి ఏరియాకు చెందిన జూనియర్ అసిస్టెంట్ రూ.1.38 లక్షలు, కార్పొరేట్ ఏరియాకు చెందిన జూనియర్ అసిస్టెంట్ బొజ్జ రవీందర్ రూ.1.34 లక్షలు, ఇల్లెందు ఏరియాకు చెందిన జూనియర్ కెమిస్ట్ మనోజ్ కుమార్ రూ.1.51లక్షలు, భూపాలపల్లి ఏరియాకు చెందిన ఎల్హెచ్డీ ఆపరేటర్ చిలుకల రాయలింగు రూ.1.42 లక్షలు, రామగుండం–1 ఏరియాకు చెందిన ఫోర్మెన్ కె.ముత్తయ్య రూ.1.55 లక్షలు, రామగుండం–2 ఏరియాకు చెందిన ఓవర్మెన్ గోపు రమేష్కుమార్ రూ.1.58 లక్షలు, రామగుండం–3 ఏరియాకు చెందిన జనరల్ మజ్దూర్ నల్లని రాంబాబు రూ.1.52 లక్షలు, మణుగూరు ఏరియాకు చెందిన ఫిట్టర్ ముప్పారపు శ్రీనివాసరావు రూ.1.38 లక్షలు స్పెషల్ ఇన్సెంటివ్ సాధించారు. -
నీలగిరితోటల్లో పులి సంచారం
సాక్షి, బెల్లంపల్లి: బెల్లంపల్లి అటవీ డివిజన్ పరిధి కుశ్నపల్లి రేంజ్లో పులి సంచారిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల నుంచి పులి విస్తారంగా అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఆనవాళ్లు (పాద ముద్రలను) అటవీశాఖకు చెందిన ఫారెస్టు డెవలాప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) అధికారులు గుర్తించారు. ఈ పాదముద్రలతో పులి సంచారం జరుగుతున్నట్లు ప్రస్పుటమైంది. బెల్లంపల్లి నుంచి నెన్నెల మండల కేంద్రానికి వెళ్లే మార్గంలో బొప్పారం గ్రామం ఉంది. ఆ గ్రామ శివారు ప్రాంతంలో అటవీ శాఖకు చెందిన నీలగిరి ఫ్లాంటేషన్ను పెంచుతున్నారు. ఆ ఫ్లాంటేషన్ పక్కన కడమడుగుల వాగు ఉంది. ఆ వాగు, నీలగిరి ఫ్లాంటేషన్ మధ్యలో నుంచి అటవీ ప్రాంతం లోనికి వెళ్లడానికి ఓ రహదారి ఉంది. అక్కడి నుంచి దట్టమైన అటవీ ప్రాంతం నెలకొంది. దాదాపు పది కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతాన్ని ఆనుకుని కొన్ని రోజుల నుంచి ఎఫ్డీసీ ఆధ్వర్యంలో అటవీశాఖ పనులు జరుగుతున్నాయి. కూలీలు రోజువారీగా అటవీ ప్రాంతం మధ్యలో నుంచి పనులు జరుగుతున్న స్థలి వరకు రాకపోకలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఆకస్మికంగా పులి అడుగులు దర్శనమిచ్చాయి. ఆ అడుగులను చూసి ఒక్కసారిగా భయపడిన కూలీలు పులి సంచారం జరుగుతున్నట్లు గ్రహించారు. విషయాన్ని వెంటనే ఎఫ్డీసీ బెల్లంపల్లి రేంజ్ ఫ్లాంటేషన్ మేనేజర్ జీ.సురేష్ కుమార్కు సమాచారం అందించారు. స్పందించిన సురేష్కుమార్ శనివారం ఆ ప్రాంతానికి వెళ్లి పులి పాదముద్రలను పరిశీలించి నిర్ధారించారు. సంచారం చేస్తున్న ఆ పులి కే–4 అయి ఉంటుందని అటవీ శాఖ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దట్టమైన అటవీ ప్రాంతాన్ని ఎంచుకుని.. కుశ్నపల్లి అటవీ రేంజ్ పరిధిలో విస్తారంగా అటవీ సంపద కేంద్రీకృతమైంది. నలువైపుల నాలుగు గ్రామాలు ఉండటంతో ఆ అటవీ ప్రాంతం ఇప్పుడిప్పుడే దట్టంగా విస్తరిస్తోంది. తూర్పున ఘన్పూర్ గ్రామం, పడమర ప్రాంతంలో దుగినేపల్లి, ఉత్తరం వైపు బొప్పారం, దక్షిణం దిశలో జోగాపూర్ గ్రామాలు ఉన్నాయి. ఆ నాలుగు గ్రామాల మధ్యన ఎటుచూసిన వందలాది మైళ్ల దూరం వరకు అటవీ సంపద పెనవేసుకుని ఉంది. ప్రస్తుతం విస్తారంగా కురుస్తున్న వర్షాలతో అటవీ ప్రాంతంలో వృక్షాలు మరింత ఏపుగా ఎదిగి కుమ్ముకుని ఉన్నాయి. ఆ ప్రాంతం సంచారానికి అన్ని విధాలా అనుకూలంగా ఉండటంతో పులి ఆవాసం చేసుకోవడానికి యత్నిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు అభిప్రాయ పడుతున్నారు. గ్రామాల్లో భయం భయం... పులి సంచిరిస్తున్న విషయం వెలుగులోకి రావడంతో సమీప గ్రామాల ప్రజలు తీవ్రంగా భయపడుతున్నారు. అటవీ ప్రాంతానికి వెళ్లడానికి జంకుతున్నారు. ముఖ్యంగా దుగినేపల్లి , పెర్కపల్లి, గుండ్ల సోమారం, బొప్పారం, ఘన్పూర్, జోగాపూర్ తదితర ప్రాంతాల ప్రజలు పులి కంట కనబడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అడవి నుంచి పులి ఏవైపునకు వస్తుందోనని అభద్రతాభావానికి గురవుతున్నారు. పులి అడుగులు కనిపించడంతో అప్రమత్తమైన అటవీ అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. ముఖ్యంగా వన్యప్రాణుల వధ కోసం సంచరిస్తున్న వేటగాళ్లు ఎక్కడా అటవీ ప్రాంతంలో విద్యుత్ తీగలతో ఉచ్చులు బిగించకుండా నివారణ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. కారిడార్ కోసమేనా..? అటవీ ప్రాంతాన్నీ కారిడార్గా మల్చుకోవడానికి పులి తీవ్రంగా తాపత్రయ పడుతున్నట్లు తెలుస్తోంది. వేమనపల్లి మండలంలోని అటవీ ప్రాంతంలో కొన్నాళ్లుగా సంచరించిన పులి ఆ తర్వాత కోటపల్లి మండలంలోనూ కాలు కదిపింది. ఆ పిమ్మట క్రమంగా నెన్నెల మండలంలో అడుగుపెట్టింది. ఆయా ప్రాంతాలన్నీ కూడా కల గలిసి ఉండటం, అటవీ ప్రాంతం దట్టంగా విస్తరించడంతో కారిడార్ ఏర్పాటుకు పులి పాకులాడుతున్నట్లు తెలుస్తోంది. సరిగ్గా ఏడాది క్రితం బెల్లంపల్లి మండలం గుండ్ల సోమారం గ్రామ పొలిమేరల్లో నుంచి పులి సంచారం చేసినట్లు వదంతులు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తదుపరి మూడు నెలల క్రితం నెన్నెల అటవీ ప్రాంతంలో సంచరించిన పులి తాజాగా మరోమారు అడుగులతో ఉనికిని చాటుకుంది. ఆవాసం కోసం అనువైన ప్రాంతాన్నీ ఎంచుకోవడానికి పులి వేట సాగిస్తున్నట్లు అటవీ అధికారులు అనుమానిస్తున్నారు. -
బెల్లంపల్లి గురుకులంలో ఫుడ్ పాయిజన్
సాక్షి, బెల్లంపల్లి : బెల్లంపల్లి తెలంగాణ రాష్ట్ర బాలుర గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాల వసతిగృహంలో ఉంటున్న దాదాపు పది మంది విద్యార్థులు వాంతులు, విరోచనాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు కోలుకుంటున్నారు. తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు తెలిపిన వివరాల ప్రకారం.. గురుకుల పాఠశాల వసతిగృహంలో బుధవారం రాత్రి విద్యార్థులకు బెండకాయ కూర, పప్పుతో భోజనం అందించారు. వసతిగృహంలో ఉన్న ఆర్వో ప్లాంట్ పనిచేయకపోవడంతో బయట నుంచి నీళ్లు తెప్పిం చారు. భోజనం చేసిన విద్యార్థులు ఆ నీళ్లు తాగారు. కొద్ది సేపటికే కొందరు విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. దీంతో వసతిగృహ వైద్య సిబ్బంది విద్యార్థులకు మాత్రలు వేశారు. ఆ మాత్రలు వేసుకున్నా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. రక్తపు విరేచనాలు.. మాత్రలు వేసుకున్నా విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడకపోగా ఒకరిద్దరు రక్తపు విరోచనాలు చేసుకున్నారు. దీంతో ఆందోళన చెందిన ఉపాధ్యాయులు గురువారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో విద్యార్థులను బెల్లంపల్లి ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసున్న ఎంఈవో మహేశ్వర్రెడ్డి, ఎంపీడీవో ముజాఫర్ ఖాద్రి, ఎంపీపీ గోమాస శ్రీనివాస్, ఈవోపీఆర్డీ ఎన్.వివేక్రాం ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. ఇందుకు గల కారణాలను ప్రిన్సిపాల్ వేణుగోపాల్ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. ప్రస్తుతం విద్యార్థులకు ఎలాంటి అపాయం లేదని, వారు కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. కలుషిత నీరు తాగడం వల్లే.. కలుషిత నీటిని తాగడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురై ఉండవచ్చని వైద్యులు తెలుపుతున్నారు. కాగా పాఠశాలలో ఆర్వో ప్లాంట్ పనిచేయకపోవడంతో వసతిగృహ అధికారులు పట్టణంలోని ఓ ప్లాంట్ నుంచి మినరల్ వాటర్ తెప్పించారు. మినరల్ వాటర్ తాగినా విద్యార్థులకు ఇలా జరగడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. వసతిగృహ అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ఈ సంఘటన జరిగిందని, విద్యార్థులు ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విద్యార్థి సంఘాల కోరుతున్నారు. -
మంత్రాలు చేస్తుందని ఆరోపించడంతో..
సాక్షి, బెల్లంపల్లి(ఆదిలాబాద్) : మంత్రాల నెపంతో వేధిస్తున్నారని మండలంలోని పెద్దలంబాడి తండా గ్రామానికి చెందిన దరావత్ కళావతి అనే యువతి మంగళవారం పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గ్రామానికి చెందిన దరా వత్ చత్రునాయక్, వెంకుబాయి దంపతులు, వారి కుమారుడు కిరణ్కు మంత్రాలు చేస్తున్నారంటూ అదే గ్రామానికి చెందిన దరావత్ రాజ్కుమార్, అతడి తల్లి తులసీ, చెల్లి కళావతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో బాధితులు మూడురోజుల క్రితం స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమపైనే ఫిర్యాదు చేస్తారా..? అంటూ చత్రునాయక్, వెంకుబాయి, కిరణ్, వారి బంధువులు కలిసి కళావతి కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. విషయాన్ని రాజ్కుమార్ ఎస్సై మొగిళికి ఫోన్లో సమాచారం అందించారు. ఎస్సై పోలీస్స్టేషన్కు రావాలని చెప్పడంతో అంద రూ కలిసి వెళ్లారు. చత్రునాయక్ కుటుంబసభ్యులు కూడా వచ్చారు. పెద్దల సమక్షంలో మాట్లాడుదామని, అంతవరకు గొడవలు పడొద్దని ఎస్సై ఇరువర్గాలకు చెప్పి ఇంటికి పంపించాడు. ఇంటికెళ్లాక చత్రునాయక్ కుటుంబం రాజ్కుమార్ కు టుంబంపై రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కళావతికి గాయాలయ్యాయి. తీవ్ర మనస్తాపానికి గురైన కళావతి పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు 108లో బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడినుంచి మం చిర్యాల ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. న్యాయం చేయకపోవడంతో ఆత్మహత్యకు యత్నించిందని ఆమె కుటుంబ సభ్యులు రోదిస్తూ తెలిపారు. -
అమెరికాలో బెల్లంపల్లి యువకుడి మృతి
బెల్లంపల్లి: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ యువకుడు ప్రమాదవశాత్తూ నీటమునిగి మరణించాడు. టెక్సాస్ రాష్ట్రంలోని రిచ్మండ్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న బెల్లంపల్లికి చెందిన రెడ్డి శ్రావణ్ (27) ఆదివారం తన స్నేహితులతో కలసి సరదాగా ఫ్లోరిడా రాష్ట్రంలోని డెస్టిన్లో సముద్రస్నానానికి వెళ్లాడు. లోనికి వెళ్లిన తర్వాత ఒక్కసారిగా పెద్ద అల ముంచెత్తడంతో శ్రావణ్ కొట్టుకుపోయాడు. దీంతో భీతిల్లిన స్నేహితులు బయటకు పరుగులు తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు శ్రావణ్ కోసం గాలింపు చేపట్టినా ఆచూకీ లభించకపోవడంతో గల్లంతైనట్లు సోమవారం అతని తండ్రి రెడ్డి రాజంకు ఫోన్లో సమాచారం అందించారు. చివరకు మృతదేహం లభ్యం కావడంతో మంగళవారం ఉదయం శ్రావణ్ నీటమునిగి మృతి చెందినట్లు అమెరికా పోలీసులు ధ్రువీకరించి వర్తమానం పంపారు. కొడుకు మరణ వార్త విని శ్రావణ్ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన శ్రావణ్ అకాల మరణం ఆ కుటుంబంలో విషాదఛాయలు నింపింది. హైదరాబాద్లో బీ ఫార్మసీ పూర్తి చేసిన శ్రావణ్... 2014లో ఎంఎస్ కోసం అమెరికా వెళ్లాడు. 2016లో ఎంఎస్ పూర్తి చేసిన శ్రావణ్ మరో విభాగంలోనూ ఎంఎస్ చేస్తున్నాడు. పార్ట్టైమ్ జాబ్ చేస్తూనే చదువు కొనసాగిస్తున్నాడు. సింగరేణిలో మైనింగ్ సర్దార్గా పని చేసి రిటైరైన రెడ్డి రాజం, మాలతి దంపతుల నలుగురు సంతానంలో శ్రావణ్ చిన్నవాడు. శ్రావణ్ మృతదేహం బెల్లంపల్లికి రావడానికి మరో మూడు రోజులు పట్టొచ్చని అతని కుటుంబీకులు తెలిపారు. -
అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి
సాక్షి, మంచిర్యాల : అమెరికాలో తెలుగు విదార్థి శ్రావణ్కుమార్రెడ్డి మృత్యువాతపడ్డాడు. ఈస్టర్ సందర్భంగా స్నేహితులతో కలిసి బోస్టన్ బీచ్కు వెళ్ళిన శ్రావణ్ ప్రమాదవశాత్తూ నీటమునిగిపోయాడు. గమనించిన స్నేహితులు వెంటనే స్థానిక ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అలల ఉధృతికి సముద్రంలో గల్లంతయిన అతని కోసం గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు సోమవారం శ్రావణ్ మృతదేహాన్ని బయటకు తీశారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళిన శ్రావణ్కుమార్ రెడ్డి స్వస్థలం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి. విషయం తెలుసుకున్న శ్రావణ్ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
ఆంధ్రాబ్యాంక్లో చోరీకి యత్నం
సాక్షి,బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని ఆంధ్రాబ్యాంకులో బుధవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తి చోరీకి యత్నించిన ఘటన కలకలం సృష్టించింది. బెల్లంపల్లి ఏసీపీ వి.బాలుజాదవ్ వివరాల ప్రకారం.. బుధవారం తెల్లవారుజామున 2:05 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి టీషర్టు, ప్యాంటు ధరించి ముఖం కనబడకుండా వస్త్రం కట్టుకుని బ్యాంకు ప్రధాన ద్వారం వద్దకు వెళ్లాడు. వెంట తెచ్చుకున్న గడ్డపారతో తాళాన్ని పగులగొట్టి షెటర్ను పైకి లేపి లోనికి ప్రవేశించాడు. లోపలికి వెళ్లిన అగంతకుడు నేరుగా డబ్బు భద్రపర్చి ఉన్న లాకర్ల వద్దకు వెళ్లి పగులగొట్టేందుకు యత్నించాడు. గడ్డపారతో లాకర్ను తెరవడానికి శతవిధాల ప్రయత్నించాడు. అది సాధ్యం కాకపోవడంతో వెంటనే ప్రధాన ద్వారం పక్కనే ఉన్న ఏటీఎం గది వద్దకు వచ్చాడు. ఏటీఎం గదిని ధ్వంసం చేసి లోనికి వెళ్లడానికి యత్నించే క్రమంలో సైరన్ మోగింది. ఆన్లైన్ సెక్యూరిటీ ఫోన్ ముంబై నుంచి వన్టౌన్ ఎస్హెచ్వో రాములు, ఎస్సై రాజేంద్రప్రసాద్, పోలీసు సిబ్బంది, ఆంధ్రా బ్యాంకు మేనేజర్ ప్రసాద్కు ఏకకాలంలో వచ్చింది. వెంటనే అప్రమత్తమైన ఎస్హెచ్వో సిబ్బందితో హుటాహుటిన బ్యాంకు వద్దకు చేరుకున్నారు. ఆ లోపే అగంతకుడు పరారయ్యాడు. ఫింగర్ ప్రింట్స్ సేకరణ.. ఆన్లైన్ సెక్యూరిటీ ఫోన్ అలర్ట్ చేయడంతో ఎస్హెచ్వోతో పాటు బ్యాంకు మేనేజర్ ప్రసాద్ ఏకకాలంలో ఘటన స్థలానికి చేరుకున్నారు. బ్యాంకు లోనికి వెళ్లి ఏం జరిగిందో పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తి బ్యాంకు లాకర్లను తెరవడానికి గడ్డపారతో చేసిన తవ్వకాలు, ధ్వంసం చేసిన పరికరాలను పరిశీలించారు. క్లూస్ టీమ్ను రప్పించి ఫింగర్ ప్రింట్స్ను సేకరించారు. తెల్లవారుజామున జాగిలాన్ని రప్పించి వ్యక్తి ఆచూకీ కోసం యత్నించారు. జాగిలం బ్యాంకు పక్కనే ఓ వీధి వరకు వెళ్లి వెనక్కివచ్చింది. అగంతకుడు ఆ వీధిలోంచి పారిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సీసీ ఫుటేజీ పరిశీలన.. చోరీ జరిగిన తర్వాత పోలీసులు నేరుగా బ్యాంకులోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. అగంతకుడు ఎక్కడి నుంచి బ్యాంకులోకి ప్రవేశించాడు, డబ్బుకోసం యత్నించిన తీరును ఎస్హెచ్వోతో పాటు ఏసీపీ బాలుజాదవ్ సీసీ కెమెరాల్లో చూశారు. మరోవైపు నిందితుడి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. లావుగా ఉన్న ఆ వ్యక్తి ఒక్కడే బ్యాంకులోకి వచ్చినట్లు సీసీ ఫుటేజీలో కనిపిస్తోంది. కాని బయట ఇంకెవరైనా ఉన్నారా లేదా ఒక్కడే ఈ సాహసానికి ఒడిగట్టాడా అన్న కోణాల్లో విచారణ చేస్తున్నారు. సెక్యూరిటీ గార్డు లేకపోవడంతో.. బ్యాంకుల వద్ద గతంలో రాత్రిపూట సెక్యూరిటీ గార్డు విధులు నిర్వహించేవాడు. కాని కొన్నాళ్ల క్రితం నుంచి రాత్రిపూట సెక్యూరిటీ గార్డును తొలగించారు. దీంతో అగంతకుడు రాత్రిపూట చోరీకి యత్నించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పట్టణంలో రాత్రిపూట పోలీసు గస్తీ ఉన్నా అగంతకుడు బ్యాంకు చోరీకి యత్నించి పోలీసులకు సవాల్ విసిరినంత పనిచేశాడు. బ్యాంకుల వద్ద పాయింట్ బుక్ పెడతాం.. బ్యాంకుల వద్ద భద్రత ఉండేలా తగిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ బాలుజాదవ్ తెలిపారు. రాత్రిపూట సెక్యూరిటీ గార్డు ఉంటే అగంతకుడు చోరీకి యత్నించేవాడు కాదన్నారు. బ్యాంకు అధికారులతో మాట్లాడి సెక్యూరిటీ గార్డును నియమించేలా చూస్తామన్నారు. పెట్రోలింగ్ పోలీసులు రాత్రిపూట బ్యాంకును విధిగా తనిఖీ చేయడానికి పాయింట్ బుక్ పెడతామని వెల్లడించారు. వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారని, నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని వివరించారు. -
ఫొటో తెచ్చిన తంటా
కాసిపేట(బెల్లంపల్లి) : ఓ వ్యక్తి ఫొటో మోజు.. అతనికి కొత్త తంటా తెచ్చి పెట్టిన సంఘటన మండలంలోని చిన్నధర్మారంలో గురువారం జరిగింది. ఆ ఫొటో సర్పంచ్ సీటుకు సంబంధించినది కావడంతో విషయం ఫిర్యాదుల దాకా వెళ్లింది. వివరాలు ఇ లా ఉన్నాయి. ఎన్నికైన చిన్నధర్మారం గ్రామపంచాయతీ సర్పంచ్గా ప్రేమవివాహం చేసుకున్న భూక్య సరిత అలియాస్ షేక్ సనా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం గ్రామసభ అనంతరం సర్పంచ్ సమీప బంధువు ముర్తుజా ఆమె సీట్లో కూర్చొని ఫొటో దిగుతానని కోరడంతో ఆమె సరేనంది. దీంతో ముర్తుజా సర్పంచ్ సీట్లో కూర్చొని ఫోజులిస్తూ మరీ ఫొటోలు దిగాడు. ఈ ఫొటోలను ముర్తుజా భార్య వాట్సప్ స్టేటస్లో పెట్టడం వివాదాస్పదమైంది. గురువారం ఉదయం వాటిని తొలగించినప్పటికీ.. అప్పటికే ప్రత్యర్థులు ఆ ఫొటోలను చాలామందికి షేర్ చేశారు. సర్పం చ్ను అవమానించడానికే ముర్తుజా ఇలా చేశాడనీ, అట్రాసిటీ కేసు పెట్టాలని అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ విషయమై సర్పం చ్ను వివరణ కోరగా కార్యాలయంలో ఎవరూ లేనప్పుడు తనను అడిగే ముర్తుజా కూర్చున్నాడు తప్పితే తనను అవమానించడానికి తెలిపారు. దీంతో వాట్సప్ వివాదం సద్దుమణిగింది. -
వీడని అస్థిపంజరం మిస్టరీ
సాక్షి, బెల్లంపల్లి: పట్టణంలోని కాంటా చౌరస్తా ప్రాంతం సింగరేణి పాత సివిల్ విభాగానికి చెందిన శిథిలమైన భవనంలో కనిపించిన అస్థిపంజరం మిస్టరీ ఇంకా వీడలేదు. మూడు రోజుల క్రితం వెలుగుచూసిన ఈ అస్థిపంజరం ఎవరిదన్నది తెలియరావడం లేదు. గుర్తు పట్టడానికి ఏమాత్రం వీలు లేకుండా ఉండడంతో సస్పెన్షన్ వీడడం లేదు. ఈ ఘటనను పోలీసు వర్గాలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఎవరా మహిళా, ఏ ప్రాం తానికి చెందినది, ఇక్కడకు ఎందుకు వచ్చినట్లు, ఒంటరిగా వచ్చిందా లేదా ఎవరితోనైనా వచ్చిందా, చనిపోయి ఎన్ని రోజులు అవుతుంది, ఆత్మహత్య చేసుకుందా, కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్కు ఆనవాళ్లు.. ఘటనా స్థలిలో లభ్యమైన మృతురాలి మోకాలు, కాలి వేలికి ధరించిన మట్టెలు, ఎముకలు, ఇతర పదార్థాలు, ఆ ప్రాంతంలో దొరికిన మరికొన్ని వస్తువులను పోలీసులు సేకరించి ఫోరెన్సిక్ ల్యా బ్కు పంపారు. మరోవైపు క్లూస్ టీమ్ ద్వారా వీలైనంత వరకు ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. డాగ్ స్క్వాడ్ ఆగిన ప్రాంత పరిసరా లను కూడా నిశితంగా పరిశీలన చేస్తున్నారు. ము ఖ్యం గా పాత సివిల్ విభాగం భవనాల వైపు ఇన్నాళ్లుగా ఎవరెవరూ వచ్చారు, ఆ వ్యక్తులు ఏ ప్రాంతానికి చెందిన వారు, ఎందుకోసం ఆ ప్రాం తానికి రాకపోకలు సాగించారు, ఆప్రాంతాన్నే ఎందుకోసం ఎంచుకుని ఉంటారు, ఎన్నిరోజు లుగా తచ్చాడారు ఆ ప్రాంతంలో, ఎంతమంది సంచరించారు, ఏ సమయంలో వచ్చివెళ్లిపోయే వారో తదితర వివరాలను ఆరా తీస్తున్నారు. రోడ్డుకు కూతవేటు దూరంలో.. శిథిలమైన భవనం మధ్య ఉన్న చెట్ల పొదల్లో అస్థిపంజరం బయటపడడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఆ ప్రాంతం బజారు ఏరి యా ప్రధాన రహదారిని ఆనుకుని కేవలం 20 మీటర్ల దూరంలో ఉంది. ఈ మార్గంలో రేయిం బవళ్లు జనసంచారం ఉంటుంది. ఓ వైపు మసీ దు, ముందు ప్రధాన రహదారి, వెనక వైపు పద్మశాలి భవనం, మరోవైపు బాబుక్యాంపు బస్తీకి వెళ్లే అంతర్గత రహదారి ఉంది. మృతురాలు ఆ శిథిలమైన భవనంలోకి ఎందుకు వెళ్లి ఉంటుందో అంతుచిక్కడం లేదు. చెట్ల పొదల్లో చనిపోయి అస్థిపంజరంగా మారే వరకు ఎవరూ గుర్తించలేక పోయారు. రోడ్డు పక్కన మెకానిక్ వర్క్స్ నిర్వహిస్తున్న సయ్యద్ అనే వ్యక్తి మూత్ర విసర్జనకు వెళ్లి దుర్వాసన రావడంతో అటువైపు వెళ్లడంతో అస్థిపంజరం వెలుగు చూడడం సంచలనమైంది. గుర్తింపే అత్యంత కీలకం.. మిస్టరీగా మారిన మహిళ అస్థిపంజరం ఘట నను చేధించడం పోలీసులకు సవాల్గా మారిం ది. ఇటీవలి కాలంలో అదృశ్యమైన మహిళలు ఎంత మందో తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఏడేళ్ల్ల క్రితం బెల్లంపల్లి టేకుల బస్తీలో జనావాసాలను ఆనుకుని గోనే సంచిలో గుర్తుతెలియని ఓ మహిళ మృతదేహం పూర్తిగా కుళ్లిపో యి బయట పడింది. ఇప్పటికీ ఆ మృతదేహం మిస్టరీగానే మారింది. అదే తరహాలో తాజాగా మహిళ అస్థిపంజరం వెలుగుచూడడం చర్చనీయాంశమైంది. -
మసకబారుతున్న ఎర్రకోట
బెల్లంపల్లి: భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ)కి కంచుకోటగా ఉన్న బెల్లంపల్లిలో క్రమంగా ఎర్రజెండా మసక పారుతోంది.రాజకీయ, కార్మికోద్యమాలను నిర్మించి ప్రజల్లో పట్టు సాధించిన సీపీఐ ఎన్నికల్లో ఓటమి పాలై ఉనికిని కోల్పోతోంది. ఏ ఎన్నికలు జరిగిన సరిగ్గా సత్తా చాటుకోలేక చతికిల పడుతోంది. ఒకప్పుడు స్వతంత్రంగా ఎన్నిక ల్లో పోటీ చేసి ఇతర పక్షాలకు గట్టి పోటీ ఇవ్వడంలో, అనేక మార్లు విజయం సాధించడంలో ఆరితేరిన సీపీఐ కొన్నాళ్ల నుంచి‘ పొత్తు’ లతో పోటీ చేయడానికి పరిమతమవుతోంది. ఆ తీరు గా ఎన్నికల్లో పోటీ చేసినా కూడా చివరికి ఏవేవో కారణాలతో ఓడి పోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పరిణామాలు వామపక్ష భావజాలం కలిగి న శ్రేణులకు తీవ్ర నిరాశ కలిగిస్తుండగా చట్టసభ ల్లో ప్రజావాణిని వినిపించలేక పోతున్నారు. కార్మిక, కర్షక, యువజన, విద్యార్థి, మహిళలు, పీడిత, తాడిత, అట్టడుగువర్గాల పక్షాన సమరశీల పోరాటాలు చేయడంలో ఎప్పుడూ ముందుండే కమ్యూనిస్టులు ఎన్నికల సమరంలో మాత్రం బలాన్ని ని రూపించుకోలేక పోతున్నారు. సన్నగిల్లుతున్న పార్టీ నిర్మాణం బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో సీపీఐ నిర్మాణం కొంతకాలం నుంచి తగ్గుతోంది. మండలాలు, శాఖల వారీగా బలహీన పడుతున్నారు. సీపీఐలో కొత్త రక్తం వచ్చి చేరడంలేదు. పార్టీలో యువజన, విద్యార్థులు, మహిళల చేరికలు జరగడంలేదు. నియోజకవర్గంలోని బెల్లంపల్లి, తాండూర్ మండలాల్లో కాస్తా నిర్మాణం కలిగి ఉండగా కాసిపేట, భీమిని, వేమనపల్లి, కన్నెపల్లి, నెన్నెల మండలాల్లో నిర్మాణాత్మకంగా లేక ఎన్నికల సమరంలో వెనుకబడుతున్నారు. ఇతరులపై ఆధారపడి పోటీ చేస్తుండటం అలవాటుగా మా రిందనే విమర్శలు ఉన్నాయి. అనాది నుంచి వసు ్తన్న సీపీఐ శ్రేణులే తప్పా కొత్తతరాన్నీ ఆకర్శించలేకపోతున్నారనే అసంతృప్తి, ఆవేదన ఆ పార్టీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతోంది. కాస్తో , కూస్తో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) మాత్రమే కార్మికవర్గంలో పట్టు కలిగిఉన్నట్లు స్పష్టమవుతోంది. సొంతబలం లేక పోవడంతో ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయలేని ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. సీపీఐకి ఇ న్నాళ్లుగా కొంత ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ మారి న రాజకీయ పరిణామాల నేపధ్యంలో క్రమంగా ఆ ఓట్లు కూడా తగ్గుతూ వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడి.. బెల్లంపల్లి అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కూడా పోటీ చేసే అవకాశం సీపీఐకే దక్కింది. ఈదఫా ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ, టీజేఎస్ పక్షాలు కలిసికట్టుగా మహా కూటమి పేరుతో ఎన్నికల పో రులో నిలిచాయి, టీఆర్ఎస్ ఓటమే ప్రధాన ల క్ష్యంగా సంయుక్తంగా పోటీ చేసిన మహా కూటమి పొత్తులో భాగంగా బెల్లంపల్లి అసెంబ్లీ స్థానాన్ని సీపీఐకి వదిలేసింది. చివరి వరకు కాంగ్రెస్ శ్రేణు లు గట్టి పట్టుపట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి సీపీఐకి సీటు కేటాయించడంతో కూటమి ఉమ్మడి అభ్యర్థిగా సీపీఐ రాష్ట్ర సీనియర్ నాయకుడు గుండా మల్లేశ్ పోటీలో నిలబడ్డారు. ఎన్నికల పోరులో ఇతర ప్రత్యర్థులకు సరిసమానంగా ప్రచారం చేయకపోవడం, ఓటర్లను ప్రస న్నం చేసుకోవడంలో విఫలం కావడం, మరీ ముఖ్యంగా ఇతర పక్షాల ఓట్లు కంకి కొడవలి గుర్తుకు బదలాయింపు జరగకపోవడంతో గుండా మల్లేశ్ ఘోర పరాజయాన్ని చవిచూశారు. కనీసం డిపాజిట్ కూడా రాలేక పోయింది. కేవలం 3,905 ఓ ట్లు సాధించి ఓటమి పాలయ్యారు. ఉమ్మడి ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన బెల్లంపల్లి నియోజకవర్గంలో కూ డా సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా పోటీ చేస్తూ వస్తోంది. 1978 నుంచి ఇప్పటి వరకు 10 సార్లు సీపీఐ పోటీ చేసి నాలుగు దఫాలు విజయం సా ధించింది.ఇన్నిసార్లు కూడా సీపీఐ పక్షాన గుండా మల్లేశ్ పోటీ చేయడం గమనార్హం. ఏది ఏమైనా ఎన్నికల పోరులో సీపీఐ సరిగా రాణించలేక ప్రాభవం కోల్పోతోందనే అభిప్రాయాలు కమ్యూ నిస్టు శ్రేణుల నుంచే వ్యక్తమవుతున్నాయి. -
2ఎంపీ, 10ఎమ్మెల్యే స్థానాలు మావే
సాక్షి,బెల్లంపల్లి ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న రెండు ఎంపీ, పది ఎమ్మెల్యే స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి పాలన సాగిస్తున్నారని కితాబిచ్చారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కాగజ్నగర్లోని ఎస్పీఎం పునరుద్ధరణకు కంకణం కట్టుకుని కార్మికుల ఆశలు నెరవేర్చామన్నారు. త్వరలోనే ఎస్పీఎం ప్రారంభమవుతుందన్నారు. కార్మికుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.6.50 కోట్ల రాయితీని కంపెనీకి చెల్లించడానికి అంగీకారం తెలిపిందన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్లే మిల్లు పున:ప్రారంభానికి మార్గం సుగమమైందన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండటానికి ప్రకృతి కూడా విస్తారంగా వర్షాలను కురిపిస్తోందన్నారు. ఇందుకు ప్రజలు భక్తితో బోనాలు సమర్పించుకుంటున్నారన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టడానికి ఎమ్మెల్యేల చేతుల్లో డీఎంఎఫ్టీ నిధులు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఆ నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని మంత్రి వివరించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, ఎన్ దివాకర్రావు, కోనేరు కోనప్ప, మహిళ,శిశు సంక్షేమశాఖ రెండు జిల్లాల కోఆర్డినేటర్ అత్తి సరోజ, ఎంపీపీ సుభాష్రావు, టీఆర్ఎస్ నాయకులు, ముఖ్యకార్యకర్తలు పాల్గొన్నారు. -
అధిక జనాభాను నియంత్రించాలి
బెల్లంపల్లి: అధిక జనాభాను నియంత్రించాలని బెల్లంపల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు జంగం నిత్యకళ్యాణ్ అన్నారు. బుధవారం ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక బజారు ఏరియా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జనాభాను అదుపులో ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జనాభా పెరగడం వల్ల వనరుల సమస్య ఉత్పన్నమవుతుందన్నారు. అనంతరం ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్క్లబ్ నిర్వాహకులు సిరికొండ ఆంజనేయరావు, ఎస్.నర్శింగం, కె.సత్యనారాయణ, రాజన్న, నారాయణరావు, వెంకట రమణారెడ్డి, రాజయ్య, కె.నర్సయ్య, దుర్గా ప్రసాద్, వి.సంతోష్, పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ శంకర్ పాల్గొన్నారు. -
ప్రజల సౌకర్యం కోసమే క్యాంపు కార్యాలయం
బెల్లంపల్లి : అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల సౌలభ్యం కోసమే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, నివాస గృహాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోందని మంత్రులు అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, జోగు రామన్న తెలిపారు. బుధవారం బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏరియాలో రూ.కోటి అంచనాతో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు, నివాస గృహానికి ప్రారంభోత్సవం చేశారు. అంతకుముందు ఎమ్మెల్యే దంపతులు, టీఆర్ఎస్ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఇతర నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేల క్యాంపు, నివాస గృహాల నిర్మాణాలు జరుగుతున్నాయని వివరించారు. దశలవారీగా వాటిని ప్రారంభోత్సవం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జి.వివేక్, ఎమ్మెల్సీ పురాణం సతీష్, ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, నడిపెల్లి దివాకర్రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, మహిళా శిశు సంక్షేమ శాఖ రీజినల్ కో ఆర్డినేటర్ అత్తి సరోజ, వ్యవసామ మార్కెట్ కమిటీటి చైర్మ సిలువేరి నర్సింగం, కలెక్టర్ ఆర్వీ.కర్ణన్, సబ్ కలెక్టర్ పీఎస్.రాహుల్రాజ్, మున్సిపల్ చైర్పర్సన్ పసుల సునీతారాణి, టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి అరిగెల నాగేశ్వర్రావు, అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. -
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ఆందోళన
నెన్నెల(బెల్లంపల్లి): ప్రేమ పేరిట మాయమాటలు చెప్పి.. తీరా పెళ్లికి నిరాకరించిన ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు ఆందోళనకు దిగింది. తనకు న్యాయం జరిగే దాకా అక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకూర్చుంది. ఈ సంఘటన మండలంలోని గన్పూర్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని మైలారం గ్రామానికి చెందిన గిరిజన యువతి సండ్ర సంధ్యారాణి, గన్పూర్ గ్రామానికి చెందిన సత్యంశెట్టి సత్యనారాయణ కొంతకాలంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి లోబర్చుకొని మోసం చేసినట్లు యువతి తెలిపింది. పెళ్లి మాట ఎత్తినప్పుడల్లా అప్పుడూ.. ఇప్పుడూ అంటూ దాటేసుకుంటు వచ్చినట్లు పేర్కొంది. తీరా సోమవారం వేరే అమ్మాయితో నిశ్చితార్థం కాగా.. తనకు న్యాయం చేయాలంటూ సత్యనారాయణ ఇంటి ఎదుట సంధ్యారాణి ఆందోళనకు దిగింది. న్యాయం జరగకుంటే ఆత్మహత్యే శరణ్యమంటోంది. కాగా, ప్రియుడి తల్లిదండ్రులు ఇంటికి తాళం వేసి వెళ్లగా.. సత్యనారాయణ సైతం తన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని సంధ్యారాణి వాపోయింది. -
బుగ్గ జాతరలో జనసంద్రోహం
బెల్లంపల్లిరూరల్ : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలోని కన్నాల పంచాయతీ బుగ్గ రాజరాజేశ్వరస్వామి జాతర మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు వేకువజాము నుంచే జాతరకు తరలివచ్చారు. మహిమాన్విత క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన బుగ్గ జాతరకు వచ్చిన భక్తులు రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గుట్టపై స్వయంభుగా వెలిసిన గంగాజలాన్ని తలపై చల్లుకుని దైవ దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బారీకేడ్లు నిర్మించారు. ఆలయ కమిటీ సభ్యులు కొందరు ఇష్టారాజ్యంగా గర్భ గుడిలోకి బంధువులు, అనుయాయులను తీసుకెళ్లడంతో సాధారణ భక్తులు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. క్యూలైన్లలో చిన్నారులు, వృద్ధులు అసౌకర్యానికి గురై నీరసించిపోయారు. జాతరకు లక్షకు పైగా భక్తులు విచ్చేసినట్లు అధికారులు అంచనా వేశారు. భక్తులు సాయంత్రం పూట జాతరకు హాజరై దైవ సన్నిధిలో జాగారం చేశారు. బెల్లంపల్లి పాత బస్టాండ్ నుంచి బుగ్గ దేవాలయం వరకు ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపో నుంచి పది బస్సులను నడిపించారు. ప్రముఖుల రాక.. బుగ్గ జాతరకు పలువురు ప్రముఖులు వచ్చి పూజలు చేశారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, జాయింట్ కలెక్టర్ సురేందర్రావు, సబ్ కలెక్టర్ పీఎస్.రాహుల్ రాజ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ ఆర్.ప్రవీణ్, మున్సిపల్ చైర్పర్సన్ పి.సునీతారాణి, ఎంపీపీ సుభాష్రావు, తహసీల్దార్ కె.సురేష్ తదితర ప్రముఖులు జాతరకు వచ్చి పూజలు నిర్వహించారు. స్వచ్ఛంద సంస్థల ఉదారత.. జాతరను పురస్కరించుకుని స్వచ్ఛంద సంస్థలు సేవా కార్యక్రమాలు నిర్వహించాయి. పురగిరి క్షత్రియ(పెర్క) సంఘం ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ, మంచినీరు సరఫరా చేశారు. భవిత డిగ్రీ కళాశాల యాజమాన్యం పాలు, మంచినీటిని అందించింది. ఆర్యవైశ్య సంఘం, యువజన సంఘం ఆధ్యర్యంలో ద్రాక్ష పళ్లను పంపిణీ చేశారు. జనహిత సేవా సమితి నిర్వహకులు మజ్జిగ ప్రదానం చేసి ఉదారతను చాటుకున్నారు. ట్రాఫిక్కు అంతరాయం.. జాతరకు భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల రద్దీ పెరగడంతో రోడ్డుపై ట్రాఫిక్ ఏర్పడింది. గంట సేపు వరకు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో భక్తులు అసౌకర్యానికి గురయ్యారు. చాలాసేపు పోలీసులు శ్రమిస్తే కానీ వాహనాల పునఃరుద్దరణ జరగలేదు. -
రాంపూర్లో రైతు దారుణ హత్య
భీమిని(బెల్లంపల్లి): భీమిని మండలం మల్లీడి గ్రామపంచాయతీలోని రాంపూర్ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి అదే గ్రామానికి చెందిన జాపల్లి శ్రీనివాస్(42)దారుణంగా హత్యకు గురయ్యారు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం...శనివారం ఉదయం గ్రామస్తులు గ్రామ సమీపంలోని అతని కంది చేనులో శ్రీనివాస్ మృతదేహం కనిపించడంతో గ్రామస్తులు వెంటనే కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో భార్య, కుమార్తె, కుమారుడు, బంధువులు వెళ్లి చూడగా తన కంది చేనులోనే విఘతజీవుడై కనిపించాడు. దీంతో కుటుంబీకులు రోదనలు మిన్నంటాయి. కాగా శ్రీనివాస్ మృతదేహం పక్కనే రక్తం మడుగు ఉండటం, మృతదేహం పక్కనే రక్తంతో కూడిన బనియన్ ఉంది. రక్తపు మరకలు అంటిన బండరాయి ఉండటంతో బండరాయితోనే మోది శ్రీనివాస్ను హత్య చేసినట్లు పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. విషయం తెలుసుకున్న తాండూర్ సీఐ జనార్ధన్రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని గ్రామస్తులను, కుటుంబ సభ్యులను వివరాలు అడిగారు. అనంతరం పోలీసులు డాగ్స్క్వాడ్ బృందంతో కుటుంబీకులు చెప్పిన అనుమానిత వ్యక్తుల పేర్ల ఇంటి వద్దే పోలీసు జాగిలం వెళ్లింది. దీనిపై పోలీసులు ఎందుకు హత్యకు గురయ్యాడో గల కారణాలు, నిందితులను పట్టుకుంటేనే తెలిసే అవకాశాలు ఉన్నాయి. మృతుడి భార్య భాగ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శ్రీనివాస్కు కూతురు దివ్య, కుమారుడు వంశీ ఉన్నారు. ఈ విచారణలో కన్నెపల్లి ఎస్సై లక్ష్మణ్, తాండూర్ ఎస్సై రవి, వైస్ ఎంపీపీ గడ్డం మహేశ్వర్గౌడ్ ఉన్నారు. -
బెల్లంపల్లిలో ఉద్రిక్తత
మంచిర్యాల: జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పట్టణంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 12 వ వార్డులో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్న అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అక్కడి నుంచి చెదరగొట్టారు. కూల్చివేతలు తక్షణమే నిలిపేయాలని లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ఓ మహిళ వంటిపై కిరోసిన్ పోసుకుంది. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ప్రయాణికులపై సర్'చార్జ్'
బెల్లంపల్లి :‘చెప్పుకోను పోతే పట్టుకొని కొట్టినట్లు’గా తయారైంది రైలు ప్రయాణికుల పరిస్థితి. ఎక్స్ప్రెస్ రైలుకు బదులు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను ప్రవేశపెట్టాలని అడిగిన పాపానికి ప్రయాణికులపై రైల్వే శాఖ పెను భారం మోపింది. కాగజ్నగర్ ఎక్స్ప్రెస్ రైలును సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్గా మార్చి సర్చార్జి వసూళ్లకు పాల్పడుతోంది. గమ్య స్థానానికి కేవలం ఐదు నిమిషాలు ముందుగా వెళ్తోందనే కారణంతో ఒక్కో ప్రయాణికుడి నుంచి ఏకంగా రూ.15 రైలు ప్రయాణికులపై సర్‘చార్జ్’ చొప్పున సర్చార్జి వసూలు చేస్తోంది. ప్రయాణికుల కష్టనష్టాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా, కనీస ప్రాధాన్యత ఇవ్వకుండా సర్చార్జి భారం మోపి జేబులు గుల్ల చేస్తోంది. సర్చార్జి వసూలుతో సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణం వద్దురా బాబోయ్ అని ప్రయాణికులు గగ్గోలు పెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. రైల్వే శాఖ అనుసరిస్తున్న తీరుపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. ఎక్స్ప్రెస్ను సూపర్ఫాస్ట్ రైలుగా మార్చి.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్–రాష్ట్ర రాజధాని సికింద్రాబాద్ మధ్య కాగజ్నగర్ ఎక్స్ప్రెస్ పేరుతో రైలును ప్రవేశపెట్టారు. ఈ రైలు కుమ్రం భీం, మంచిర్యాల, పెద్దపల్లి, జనగామ, యాదాద్రి జిల్లాల మీదుగా సికింద్రాబాద్కు చేరుకుంటుంది. సుమారు 300 కిలోమీటర్ల దూరం ప్రయాణంలో ఈ రైలు 12 స్టేషన్లలో ఆగుతుంది. రోజువారీగా ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరుస్తున్నా ఈ రైలుకు ముఖ్యమైన, సాధారణ రైల్వే స్టేషన్లలోనూ హాల్టింగ్ ఇస్తున్నారు. సత్వరంగా గమ్యస్థానం చేరుకోలేక రైలులోనే గంటలకొద్ది ప్రయాణం సాగిస్తున్నారు. పేరు మారిందే కాని... కాగజ్నగర్ ఎక్స్ప్రెస్ రైలును సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్గా మార్చారే తప్ప మరెలాంటి మార్పులు జరగలేదు. వేగంలో కొద్దిపాటిగా తేడా ఉన్నా, రైల్వే స్టేషన్ల హాల్టింగ్లో మాత్రం మార్పులు చోటు చేసుకోలేదు. పాత పద్ధతిలోనే ప్రతి రైల్వేస్టేçÙన్లోనూ కాగజ్నగర్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు ఆగుతోంది. కాకపోతే గతంలో కన్న ఐదు నిమిషాల ముందు గమ్యస్థానం చేరుకుంటోంది. ఎక్స్ప్రెస్ రైలు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్గా రూపాంతరం చెందిన ప్రయాణికులకు ఒనగూరిన ప్రయోజనం ఏమీ లేకుండా పోయింది. పైపెచ్చు సర్చార్జి వసూలుతో నిలువుదోపిడీకి గురవుతున్నారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ చార్జి వసూలు చేస్తున్నారు. రూ.కోట్ల భారం సర్చార్జి పేరుతో రైల్వే శాఖ ప్రయాణికుల నుంచి రూ.కోట్లలో ఆదాయం సమకూర్చుకుంటోంది. తద్వారా ప్రయాణికులపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతోంది. సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ఎక్కి ముందు వచ్చే రైల్వే స్టేషన్లో దిగిన కూడా సర్చార్జి రూ.15 చెల్లించుకోక తప్పదు. తూర్పు ప్రాంతంలోని కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలలోని పలు ప్రాంతాల నుంచి రోజువారీగా వేల సంఖ్యలో ప్రయాణికులు కాగజ్నగర్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో రాకపోకలు చేస్తున్నారు. రోజువారీగా కనిష్టంగా 3 వేల నుంచి గరిష్టంగా 4 వేల మంది వరకు ప్రయాణిస్తుంటారు. ఆ తీరుగా ఒక్కో టికెట్పై రూ.15 చొప్పున సర్చార్జి రోజుకు రూ.45 వేలు వసూలు అవుతుండగా, నెలకు రూ.13.50 లక్షలు, ఆ ప్రాతిపదికన ఏడాదికి సుమారు రూ.1.62 కోట్లు రైల్వే ఖజానాకు సమకూరుతోంది. మాది బెల్లంపల్లి. కిరాణ వ్యాపారం చేస్తున్నాను. ప్రతి నెలలో హైదరాబాద్కు రెండు, మూడుసార్లు ప్రయాణం సాగిస్తాను. కాగజ్నగర్ ఎక్స్ప్రెస్ రైలు ప్రతి స్టేషన్లోనూ ఆగుతుండటంతో ఇన్నాళ్లు ఇబ్బందు లు పడ్డాం. అదే రైలును ఇప్పుడు సూపర్ఫాస్ట్గా మార్చారు. కానీ.. ఎక్స్ప్రెస్ రైలు మాదిరిగానే అన్ని స్టేషన్లలోనూ ఆగుతోంది. సర్చార్జి మాత్రం రూ.15 అదనంగా వసూలు చేస్తుండడం గమనార్హం. రైల్వేస్టేషన్ల హాల్టింగ్లో మార్పులు చేయకుండా, వేగం పెంచకుండా సర్చార్జి వసూలు చేయడం సరికాదు. - బ్రిజ్గోపాల్ లోయ -
ఇళ్ల పట్టాల సమస్య తీరేనా..?
దశాబ్దాలు గడిచినా పరిష్కారం కాలేదు పేదలకు పట్టా ఇవ్వడంలో జాప్యం సింగరేణి లీజు భూమిలో నిర్మించుకున్న ఇంటిపై హక్కు లేదు బెల్లంపల్లి : బెల్లంపల్లిలో ఇళ్ల పట్టాల సమస్య తీవ్రంగా ఉంది. బొగ్గు గనుల తవ్వకాలతో ఉత్పన్నమైన ఆ సమస్య 9 దశాబ్దాలు గడుస్తున్నా పరిష్కారం కావడం లేదు. సింగరేణి లీజు భూమిలో శాశ్వత కట్టడాలు నిర్మించుకున్న పేదలకు పట్టాలు ఇవ్వడంలో అసాధారణ జాప్యం జరుగుతోంది. ఎన్నోఏళ్ల నుంచి భూమిపై యాజమాన్యపు హక్కును కల్పించడం లేదు. పట్టాలు లేకపోవడంతో నిర్మించుకున్న ఇంటిపై నిరుపేదలు ఎలాంటి హక్కుకు నోచుకోలేకపోతున్నారు. ఈ విషయంపై అధికారులకు పలుమార్లు విన్నవించిన పట్టించుకున్న పాపానపోలేదు. ఏళ్లు గడుస్తున్నా ఇళ్ల పట్టాల సమస్య అపరిష్కతంగానే ఉంటోంది. కొత్తగా ఏర్పాౖటెనా మంచిర్యాల జిల్లా , బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్పై పుర ప్రజలు పుట్టెడాశలు పెట్టుకున్నారు. ఇప్పటికైన ఇళ్ల పట్టాల సమస్య పరిష్కారమవుతుందనే ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. బొగ్గు గనుల ప్రస్థానంత స్వాతంత్య్రానికి పూర్వం 1926 ప్రాంతంలో బెల్లంపల్లిలో బొగ్గు గనుల ప్రస్థానం ఆరంభమైంది. బ్రిటీష్ పాలనలో ఆంగ్లేయ భూగర్భ శాస్త్రవేత్త సర్ విలియం కింగ్ సర్వే చేయడంతో ఈ ప్రాంతంలో అపారమైన బొగ్గు నిక్షేపాలు బయటపడ్డాయి. “తాండూర్ కోల్మైన్స్’ పేరుతో బొగ్గు గనుల తవ్వకాలు ఆరంభమయ్యాయి. 1927లో మార్గన్స్ఫిట్ గనితో బొగ్గు గనుల ప్రస్థానం మొదలైంది. ఆ రోజుల్లో గ్రామీణులను బలవంతంగా తీసుకొచ్చి మృత్యు గుహల్లాంటి బొగ్గు గనుల్లో దింపి పనులు చేయించేవారు. ఆ తీరుగా సింగరేణి కొలువుచేస్తున్న కార్మికులు, బతుకు దెరువు కోసం కాలరీ ఏరియాకు వలస వచ్చిన కార్మికేతరులు ప్రభుత్వం నుంచి కంపెనీ తీసుకున్న లీజు (ఖాళీ) భూముల్లో పక్కా కట్టడాలు నిర్మించుకున్నారు. ఇప్పటికి 90 ఏళ్లు గడుస్తున్నా నివేశన స్థలాలకు పట్టాలు లేకుండా పోయాయి. భూమిపై హక్కు లేక లీజు భూమిలో నిర్మించుకున్న కట్టడాలకు పట్టాలు ఇవ్వకపోవడంతో పేదలకు భూమిపై ఏ మాత్రం హక్కు లేకుండా పోతోంది. కంపెనీలో రెక్కలు, ముక్కలు చేసుకున్న కార్మికులకు స్థిరాస్తి గుంటెడు భూమి లేకుండా పోయింది. కట్టుకున్న ఇంటి స్థలంపై కూడా హక్కు లేకపోవడంతో ఎన్నో ప్రయోజనాలు కోల్పోతున్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నోచుకోవడం లేదు. రుణ సదుపాయానికి అర్హులు కాలేకపోతున్నారు. ఎన్నో ఏళ్లు నుంచి ఇక్కడే నివసిస్తున్న ఎలాంటి హక్కు లేక నిరాశ, నిస్పృహలకు గురవుతున్నారు. చట్టబద్ధమైన హక్కు లేకపోయిన కొందరు మాత్రం భూ క్రయవిక్రయాలు చేస్తున్నారు. ఎన్నికల హామీగా ఇళ్ల పట్టాల సమస్య ప్రతి ఎన్నికల్లో హామీగా ఉపయోగపడుతోంది. ఏ ఎన్నికలు వచ్చిన పురప్రజలకు ఇళ్ల పట్టాలు ఇప్పిస్తామని రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు హామీలు ఇవ్వడం, గెలిచాక విస్మరించడం పరిపాటిగా మారుతోంది. పార్లమెంట్, అసెంబ్లీ, మున్సిపల్ ఎన్నికల్లో దశాబ్దాల నుంచి హామీలు ఇస్తున్నా కార్యరూపం దాల్చడం లేదు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం, మణుగూరు, ఎల్లందు, కరీంనగర్ జిల్లా గోదావరిఖని ప్రాంతాల్లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో సింగరేణి లీజు భూమిలో నివసిస్తున్న పేదలకు ఇళ్ల పట్టాలను జారీ చేశారు. ఇందు కోసం ప్రత్యేక జీవోను తెచ్చారు. బెల్లంపల్లిలో మాత్రం ఆ సమస్య అపరిష్కతంగానే ఉండిపోయింది. మంచిర్యాల కొత్త జిల్లాలో రెవెన్యూ డివిజన్గా ఏర్పడిన బెల్లంపల్లిలో ఇళ్ల పట్టాల సమస్య కొలిక్కి వస్తుందనే ఆశతో ప్రజలు ఉన్నారు. బెల్లంపల్లి : బి గ్రేడ్ మున్సిపాలిటీ మున్సిపల్ వార్డుల సంఖ్య : 34 జనాభా : 56,369 మున్సిపాలిటీలోని ఇళ్ల సంఖ్య : 15,250 -
బొగ్గు గనుల పుట్టుకతో..
ఆవిర్భవించిన బెల్లంపల్లి 90 దశాబ్దాల క్రితం కుగ్రామం.. బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లికి ఎంతో ప్రాచీన చరిత్ర ఉంది. బొగ్గు పుట్టుకతో బెల్లంపల్లి ఆవిర్భవించింది. నల్ల బంగారం నేలగా ప్రసిద్ధిగాంచిన బెల్లంపల్లి తొమ్మిది దశాబ్దాల క్రితం కుగ్రామంగా ఉండేది. అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటైంది. 90 ఏళ్ల ప్రస్థానంలో బెల్లంపల్లి ఎన్నో మైళ్లు రాళ్లను అధిగమించి ప్రత్యేకతను ఏర్పర్చుకుంది. బొగ్గు గనుల అంకురార్పణతో.. బెల్లంపల్లి ప్రాంతం బొగ్గు గనుల అంకురార్పణతో వెలుగుచూసింది. బ్రిటిష్ భూగర్భ శాస్త్రవేత్త సర్విలియం కింగ్ అన్వేషణ ఫలించి ఈ ప్రాంతంలో అపారమైన బొగ్గు నిక్షేపాలు బయటపడ్డాయి. సింగరేణి చరిత్రలో ప్రప్రథమంగా ఖమ్మం జిల్లా ఇల్లెందులోని సింగరేణి గ్రామంలో నల్ల బంగారం కనుగొనగా, ఆతర్వాత బెల్లంపల్లిలోనే బొగ్గు పుట్టుక ఆరంభమైంది. 1926 ప్రాంతంలో బొగ్గు అన్వేషణ సాగించి 1927 నుంచి బెల్లంపల్లిలో బొగ్గు గనుల తవ్వకాలు చేపట్టారు. ప్రప్రథమంగా మార్గన్స్ఫిట్ గనితో ఇక్కడ బొగ్గు తవ్వకాలు ప్రారంభించారు. ఆతర్వాత అనేక గనులు విస్తరించి బెల్లంపల్లి సింగరేణికి తలమాణికంగా బాసిల్లింది. ఆ తీరుగా బెల్లంపల్లి పారిశ్రామికంగా రూపాంతరం చెందింది. అనుబంధ గ్రామంగా చంద్రవెల్లి.. బొగ్గు గనులు విస్తరించి వేలాది మంది కార్మికులతో వృద్ధిలోకి వచ్చిన బెల్లంపల్లి 30 ఏళ్ల క్రితం వరకు ఓ కుగ్రామంగా ఉండేది. బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి జీపీలో అనుబంధ గ్రామంగా కొనసాగింది. 1981లో జరిగిన చంద్రవెల్లి జీపీ ఎన్నికల్లో మెజార్టీ ఓట్లు ఉన్న బెల్లంపల్లి కార్మిక క్షేత్రం నుంచి పోటీచేసిన కార్మికనేత చిప్ప నర్సయ్య సర్పంచ్గా విజయం సాధించారు. ఐదేళ్ల కాలపరిమితి ముగిసిన తర్వాత 1987లో బెల్లంపల్లిని అప్పటి ప్రభుత్వం ద్వితీయ శ్రేణి మున్సిపాలిటీగా ప్రకటించింది. ఆ ప్రకారంగా దశాబ్దాల అనుబంధం కలిగిన చంద్రవెల్లి గ్రామపంచాయతీ నుంచి బెల్లంపల్లి వేరు పడింది. ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో బెల్లంపల్లి ప్రముఖ పట్టణంగా ఉండేది. ఆసిఫాబాద్ ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బెల్లంపల్లికి చెందిన దాసరి నర్సయ్య(కాంగ్రెస్), గుండా మల్లేశ్(సీపీఐ), ఎ.శ్రీదేవి, పి.సుభద్ర(టీడీపీ) నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొంది ప్రత్యేకతను చాటుకున్నారు. 2009లో జరిగిన పునర్విభజనలో బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పాటైంది. జిల్లా కోసం పోటీ పడి.. నూతన జిల్లాల పునర్విభజనలో బెల్లంపల్లి జిల్లా కేంద్రం కోసం మంచిర్యాలతో పోటీ పడింది. మౌలిక సదుపాయాలు, ఇతర వనరులు పుష్కలంగా ఉన్న బెల్లంపల్లిని జిల్లా చేయాలని ఈ ప్రాంత ప్రజలు పట్టుబట్టిన ప్రభుత్వం మాత్రం నిరాకరించింది. రెవెన్యూ డివిజన్ కేంద్రం ఏర్పాటుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీంతో నూతన జిల్లా కోసం పోటీపడిన బెల్లంపల్లి ఎట్టకేలకు రెవెన్యూ డివిజన్గా ఏర్పాటైంది. బొగ్గుగనుల తవ్వకాలతో మొదలైన బెల్లంపల్లి ప్రస్థానం క్రమక్రమంగా రెవెన్యూ డివిజన్ స్థాయికి చేరుకుంది. -
నిర్లక్ష్యం నీడలో ‘బెల్లంపల్లి’
బెల్లంపల్లి : కార్మికక్షేత్రం బెల్లంపల్లి తీవ్ర నిరాధరణకు గురవుతోంది. బొగ్గుట్టగా ప్రసిద్ధిగాంచిన ఈప్రాంతం క్రమేపీ ఉనికిని కోల్పోతోంది. బొగ్గు గనులు అంతరించి, జనరల్ మేనేజర్ కార్యాలయాన్ని తరలించి, విభాగాలను ఎత్తివేయడంతో సింగరేణి చిత్రపటం నుంచి బెల్లంపల్లి కనుమరుగయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాలు కార్మికవర్గాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. జీఎం కార్యాలయం తరలింపుతో.. బెల్లంపల్లి కేంద్రంగా దశాబ్దాల కాలం పాటు కార్మికవర్గానికి సేవలు అందించిన సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయాన్ని 2006 మే 1న రెబ్బెన మండలం గోలేటీటౌన్షిప్నకు తరలించారు. సింగరేణి ఉన్నతాధికారులు కొందరు తీసుకున్న అనాలోచిత విధానాల వల్ల జీఎం కార్యాలయాన్ని బెల్లంపల్లి నుంచి ఎత్తివేశారు. అప్పటి నుంచి క్రమంగా బెల్లంపల్లిలో ఉన్న వర్క్షాపు, స్టోర్, ఆటో గ్యారేజ్ తదితర విభాగాలను ఎత్తివేశారు. 18 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే పవర్హౌజ్ను ముంబైకి చెందిన ఓ ప్రైవేట్ కంపెనీకి అమ్మేశారు. విభాగాలు ఎత్తివేసి, జీఎం కార్యాలయాన్ని తరలించి ఈ ప్రాంతంలో పనిచేస్తున్న కార్మికులను నిర్ధాక్షిణ్యంగా ఇతర ప్రాంతాలకు బదిలీ చేసి బెల్లంపల్లి ప్రాభవాన్ని తగ్గించారు. ఏరియాలో సర్దుబాటుతో బెల్లంపల్లిని కొన్నాళ్ల పాటు గోలేటీ జీఎం కార్యాలయం పరిధిలో ఉంచారు. ఇక్కడ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడపాదడపా సింగరేణి అధికారులు పర్యటించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. రెండేళ్ల క్రితం బెల్లంపల్లిని మందమర్రి ఏరియాలో కలిపారు. బెల్లంపల్లిలోని సింగరేణికి చెందిన సుమారు 5 వేలకుపైబడి క్వార్టర్లు, సివిల్ విభాగం, ఎలక్ట్రిసిటీ, తిలక్స్టేడియం, బుధాగెస్ట్హౌజ్, ఎల్లందు క్లబ్ మందమర్రి ఏరియా పరిధిలో చేర్చగా, ఏరి యా ఆస్పత్రి నిర్వహణను బెల్లంపల్లి ఏరియా(గోలేటీటౌన్షిప్)కు కట్టబెట్టి బెల్లంపల్లిని రెండు ముక్కలుగా చేశారు. ఈ పరిణామాలతో కార్మికులు అవసరాల కోసం గోలేటీటౌన్షిప్, మందమర్రికి వెళ్లాల్సిన పరిస్థితి. చిన్నచూపు బెల్లంపల్లి ప్రస్తుతం రెండు ఏరియాల పరిధిలో కొట్టుమిట్టాడుతోంది. ఏ ఒక్క ఏరియాకు బెల్లంపల్లిపై ఆధిపత్యం లేకుండా పోయింది. బెల్లంపల్లి పట్ల సింగరేణి యాజమాన్యం చిన్నచూపు చూస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇతర ఏరియాలకు జీవం పోసిన బెల్లంపల్లి ప్రస్తుతం ఉనికిని కోల్పోయి తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. ఈ పరిస్థితుల్లో కాసిపేట, శాంతిఖని గనులు బెల్లంపల్లిలో విలీనం చేసి జీఎం కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కార్మికవర్గం ముక్తకంఠంతో కోరుతోంది. ఆ తీరుగా చేసినట్లయితే బెల్లంపల్లికి పూర్వవైభవం వచ్చే అవకాశాలు ఉంటాయి. సింగరేణి అధికారులు ఇప్పటికైనా బెల్లంపల్లి భవిష్యత్ కోసం తగిన కార్యాచరణ రూపొందించాలని పలువురు కోరుతున్నారు. -
రోజుకో కుంభకోణం
నాలుగేళ్ల నుంచి బయట పడుతున్న అక్రమాలు బెల్లంపల్లి పరిధిలోనే వెలుగుచూస్తున్న వైనం వెల్లడవుతున్న కోట్లాది రూపాయల అక్రమాల దందా బెల్లంపల్లి : బెల్లంపల్లి ప్రాంతంలో రోజుకో కుంభకోణం వెలుగుచూస్తోంది. రూ.కోట్లలో అవినీతి, అక్రమాలు బయటపడుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఘరానా మోసాలు, అక్రమాలు, కుంభకోణాలకు కొదువలేకుండా పోతోంది. మూడేళ్ల క్రితం బొగ్గు అక్రమ దందా వెలుగుచూడగా, ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను వంచించిన ఘటన బయట పడింది. ఆ ఘటన మర్చిపోకముందే తాజాగా తాండూర్ కేంద్రంగా సాగిన ఐటీ రిటర్న్స్ వ్యవహారంలో తప్పుడు ధ్రువీకరణ పత్రాలు తయారు చే సి అక్రమాలకు పాల్పడిన సం ఘటన కలకలం రేపింది. ఇలా వరుసగా వెలుగుచూస్తున్న మోసాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బయటపడుతున్న అక్రమ దందాల వ్యవహారం పోలీసు యంత్రాంగాన్ని నివ్వెరపరుస్తుండగా, ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అక్రమాలకు కేరాఫ్.. బెల్లంపల్లి ప్రాంతంలో నాలుగేళ్ల నుంచి వరుసగా అవినీతి, అక్రమాల దందాలు వెలుగుచూస్తున్నాయి. బెల్లంపల్లి ఏరియా డోర్లి-2 ఓపెన్కాస్ట్ కు చెందిన బొగ్గును తప్పుడు వేబిల్లులతో రవాణా చేసి రూ.కోట్లలో సాగిన అక్రమ దందా ప్రప్రథమంగా వెలుగుచూసింది. ఆ ఘటనను ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన సంగతి పాఠకులకు తెలిసిందే. అదే పరంపరలో తాండూర్ మండలం రేచిని రోడ్ రైల్వేస్టేషన్ నుంచి తప్పుడు రికార్డులతో అక్రమంగా ర్యాక్ బొగ్గును తరలించే యత్నం బెడిసికొట్టిన ఘటన ప్రకంపనలు రేపాయి. ఆ కేసులో అక్రమార్కులు, కొందరు సింగరేణి ఉన్నతాధికారులపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు పంపించారు. మెడికల్ అన్ఫిట్ దందా.. ఆ తర్వాత నెల రోజుల క్రితం సింగరేణిలో మెడికల్ అన్ఫిట్ల అక్రమ దందా వ్యవహారం బెల్లంపల్లిలో బయటపడింది. తూర్పు ప్రాంతానికి చెందిన 33 మంది కార్మికుల నుంచి రూ.2.23 కోట్లు వసూలు చేశారు. ఈ వ్యవహారం నిర్వహించిన నిందితుల్లో 14 మందిని అరెస్ట్ చేసి కోర్టుకు పంపించారు. మరికొందరు పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన మర్చిపోకముందే గత నెల (సెప్టెంబర్) 6వ తేదీన ఉత్తర తెలంగాణ కేంద్రంగా సాగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల దందా బయట పడింది. బెల్లంపల్లి, రామగుండం, గోదావరిఖని, వరంగల్ తదితర ప్రాంతాలకు చెందిన తొమ్మిది మంది నిరుద్యోగుల నుంచి రూ.72 లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడిన కరీంనగర్ జిల్లా రామగుండంకు చెందిన ఎడ్ల ఆదిత్య అనే నిందితుడిని బెల్లంపల్లి వన్టౌన్ పోలీసులు వారం రోజుల క్రితం అరెస్ట్ చేసి కోర్టుకు పంపించారు. తాజాగా తాండూర్ మండల కేంద్రంలో ఉన్న ఓ ఐటీ రిటర్న్స్ కన్సల్టెన్సీ మహారాష్ట్ర వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్(డబ్ల్యూసీఎల్) బొగ్గు గనుల్లో పని చేస్తున్న 201 మంది కార్మికులకు సంబంధించి తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించి రూ.1.42 కోట్లు ఐటీ రిటర్న్స్ ఇప్పించి ప్రభుత్వాన్ని, ఇన్కమ్టాక్స్ శాఖను మోసం చేసినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. ఈ మేరకు బుధవారం తాండూర్ మండల కేంద్రం ఐబీ, మాదారంటౌన్షిప్లలో విస్తృతంగా సోదాలు నిర్వహించి కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఐటీ రిటర్న్స్ కన్సల్టెన్సీ కార్యాలయాన్ని సీజ్ చేసి మరో నలుగురు నిందితులపై కేసు నమోదు చేశారు. ఈ తీరుగా ఘరానా మోసాలు బెల్లంపల్లి ప్రాంతంలో వరుసగా వెలుగుచూడటం సంచలనం సృష్టిస్తోంది. -
బెల్లంపల్లిలో బాలిక ఆత్మహత్యాయత్నం
బెల్లంపల్లి : పట్టణంలోని కూరగాయల మార్కెట్ ఏరియాకు చెందిన ఓ బాలిక(17) గురువారం క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... బాలిక పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదివి అనుత్తీర్ణత చెందడంతో ఇంటిపట్టున ఉంటోంది. గురువారం మధ్యాహ్నం సుమారు 2 గంటల ప్రాంతంలో స్థానిక ఫిష్ మార్కెట్ పక్కన ఉన్న మరుగుదొడ్డికి వెళ్లి క్రిమిసంహారక మందు తాగింది. మందు తాగిన అనంతరం ఆమె మరుగుదొడ్డి నుంచి అస్వస్థతతో బయటకు రాగా.. అది గమనించిన కొందరు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను ఆమె తల్లి వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లింది. వైద్యులు ప్రథమ చికిత్స చేసిన అనంతరం బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. అక్కడి చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితి ఆందోళకరంగా ఉన్నట్లు తెలిసింది. అయితే ఆత్మహత్యా యత్నానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ విషయమై.. వన్టౌన్ ఎస్హెచ్వో ఎల్.రఘును వివరణ కోరగా తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని తెలిపారు. -
రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య
బెల్లంపల్లి: అదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి పాత రైల్వేస్టేషన్ సమీపంలో ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు పట్టణానికి చెందిన యువకుడిగా గుర్తించారు. -
60 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
బెల్లంపల్లి (ఆదిలాబాద్) : అక్రమంగా బ్లాక్మార్కెట్కు తరలుతున్న 60 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి రైల్వే స్టేషన్లో ఆదివారం చోటుచేసుకుంది. కాజిపేట నుంచి బల్లార్షా వెళ్తున్న రైలులో రేషన్ బియ్యం తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన రెవెన్యూ, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, రైల్వే పోలీసులు.. 60 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
ఆటో బోల్తా..15 మందికి గాయాలు
బెల్లంపల్లి: ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో శుక్రవారం మధ్యాహ్నం ఓ ఆటో ట్రాలీ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో 15 మందికి తీవ్రగాయాలు కాగా..అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారంతా రెబ్బన మండలం పులికుంట గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. బెల్లంపల్లిలోని బుగ్గదేవాలయానికి వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ప్రమాదకరంగా బెల్లంపల్లి రైల్ఓవర్ బ్రిడ్జి
-
రెచ్చిపోయిన చైన్ స్నాచర్స్
చంపాపేట: హైదరాబాద్లో చైన్ స్నాచర్లు మరోసారి చెలరేగిపోయారు. సోమవారం ఉదయం చంపాపేట సామ గంగారెడ్డి కాలనీలో మహిళ మెడలో బంగారు గొలుసును తెంపుకుపోయారు. మణెమ్మ అనే గృహిణి గుడికి వెళుతున్న సమయంలో బైక్పై వచ్చిన ఇద్దరు ఆమె మెడలోని సుమారు రెండు తులాల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యారు. బాధిత మహిళ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరో ఘటన ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. బెల్లంపల్లి పట్టణంలో ఓ దుండగుడు మహిళ మెడలోని బంగారు గొలుసును అపహరించుకుపోయాడు. రామిడి కనకలక్ష్మి అనే మహిళ కిరాణ షాపును తెరిచి శుభ్రం చేసుకుంటుంది. అదే సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి సిగరెట్ కావాలని అడిగాడు. అతడికి సిగరెట్ ఇచ్చిన అనంతరం ఆమె ఇంట్లోకి వెళ్లుతున్న సమయంలో దుండగుడు ఆమె వెనుక నుంచి పుస్తెలతాడును తెంపుకుపోయాడు. -
బెల్లంపల్లిలో మెగా రక్తదాన శిబిరం
బెల్లంపల్లి (ఆదిలాబాద్ జిల్లా) : బెల్లంపల్లిలోని కల్వరి మినిస్ట్రీ చర్చిలో మంగళవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. సుమారు 200 మంది ఉచితంగా రక్తం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ..ఆరోగ్యకరమైన సమాజం కోసం అందరూ పాటుపడాలని కోరారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. -
ఎంటర్ప్రైజెస్ పేరుతో వ్యభిచారం
బెల్లంపల్లి: ఎంటర్ప్రైజెస్ కార్యాలయం పేరుతో ఓ కాంప్లెక్స్ను అద్దెకు తీసుకొని గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం సీసీసీ నస్పూర్ గ్రామంలో బుధవారం వెలుగు చూసింది. స్థానికంగా ఉన్న ఒక అపార్ట్మెంట్లో ఎంటర్ప్రైజెస్ పేరుతో ఓ కార్యాలయాన్ని అద్దెకు తీసుకున్న ఓ ముఠా అందులో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ మహిళా నిర్వహకురాలితో పాటు ఇద్దరు మహిళలు, ఇద్దరు విటులను అరెస్ట్ చేశారు. ఈ మేరకు బెల్లంపల్లి అడిషనల్ ఎస్పీ సంప్రీత్సింగ్ విలేకరుల సమావేశంలో వివరాలు తెలియజేశారు. -
రైల్వేస్టేషన్లో 12 క్వింటాళ్ల బియ్యం పట్టివేత
బెల్లంపల్లి: ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి రైల్వే స్టేషన్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుబడింది. మంగళవారం రాత్రి రైల్వే పోలీసులు తనిఖీలు చేస్తుండగా సుమారు 30 సంచుల్లో ఉంచిన 12 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. ఈ బియ్యాన్ని రామగిరి ప్యాసింజర్ రైలులో మహారాష్ట్రకు తరలించేందుకు కొందరు యత్నించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల కోసం విచారణ చేపట్టామన్నారు. -
ప్రాజెక్ట్వర్క్ చేయలేదని కొట్టడంతో..
బెల్లంపల్లి (ఆదిలాబాద్) : ప్రాజెక్ట్ వర్క్ ఎందుకు చేయలేదని ఉపాధ్యాయురాలు కొట్టడంతో ఇంటకి వెళ్లిన విద్యార్థి బంధువులకు విషయం చెప్పి పిలుచుకొని వెళ్లాడు. పాఠశాలకు వెళ్లిన బంధువులతో ఉపాధ్యాయురాలు దురుసుగా మాట్లాడటంతో పాటు.. నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో కోపోద్రిక్తులైన విద్యార్థి బంధువులు ఆమెతో వాగ్వాదానికి దిగారు. ఈక్రమంలో ఉపాధ్యాయురాలిపై దాడి చేసి పాఠశాలలోని ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలోని ఏఎంసీ ఏరియాలోని సెయింట్ విన్సెంట్ ఉన్నత పాఠశాలలో మంగళవారం జరిగింది. పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న సమీర్(14) వారం రోజులుగా ప్రాజెక్ట్ వర్క్ సబ్మిట్ చేయకపోవడంతో.. సాంఘిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయురాలు రాణి విద్యార్థిపై చేయి చేసుకుంది. అంతే కాకుండా ఈ అంశాన్ని ప్రధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన కూడా విద్యార్థిని కొట్టాడు. దీంతో మనస్థాపానికి గురైన విద్యార్థి ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో.. వారు పాఠశాలకు చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఉపాధ్యాయులు దురుసుగా ప్రవర్తించడంతో కోపోద్రిక్తులైన బాధితులు పాఠశాల ఫర్నిచర్ ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కారులో టేకు అక్రమ రవాణా
బెల్లంపల్లి (ఆదిలాబాద్) : కారులో అక్రమంగా తరలిస్తున్న టేకు దుంగలను ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి మండలం సోమగూడెం క్రాస్ రోడ్డు వద్ద అటవీ శాఖ అధికారులు మంగళవారం మధ్యాహ్నం స్వాధీనం చేసుకున్నారు. కారుతోపాటు అందులోని 12 టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ జగదీశ్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాసిపేట్ మండలం నుంచి మంచిర్యాలకు తరలిస్తున్నట్లుగా వెల్లడైంది. -
100 మంది ఆశా వర్కర్ల అరెస్ట్
బెల్లంపల్లి (ఆదిలాబాద్) : మంత్రి రాక సందర్భంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న ఆశా కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి పట్టణంలో శుక్రవారం సాయంత్రం జరిగే వివిధ కార్యక్రమాల్లో మంత్రి హరీశ్రావు పాల్గొనాల్సి ఉంది. అయితే గత కొన్ని రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టిన ఆశా సిబ్బంది మంత్రి రాకను పురస్కరించుకుని ఆందోళన చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సాయంత్రం 5 గంటల సమయంలో సుమారు 100 మంది ఆశా వర్కర్లు మార్కెట్ కమిటీ కార్యాలయం వైపు తరలి వెళ్తుండగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బెల్లంపల్లిలో కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన
బెల్లంపల్లి: టీఆర్ఎస్ నేతల ఆగడాలను అరికట్టాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో కాంగ్రెస్ శ్రేణలు ఆందోళనకు దిగాయి. వివరాలు.. మహబూబ్ నగర్ జిల్లా సర్వసభ్య సమావేశంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాలరాజు, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాం మోహన్ ను చెంపదెబ్బకొట్టడంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు బెల్లంపల్లిలోని కాంటా సెంటర్లో ఆందోళన నిర్వహించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు. -
10 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
బెల్లంపల్లి: రైళ్లో అక్రమంగా తరలిసున్న 10 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాజీపేట నుంచి బల్లార్శకు వెళ్తున్నరామగిరి ప్యాసింజర్లో అక్రమంగా బియ్యం తరలిసున్నారనే సమాచారంతో బెల్లంపల్లి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 20 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తరలిస్తున్న వారిపై అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
30 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
ఆదిలాబాద్: అక్రమంగా తరలిస్తున్న 30 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా తాండూరు మండలంలోని రెంచిల్ రైల్వేస్టేషన్లో రేషన్ బియ్యం రవాణా అవుతోందన్న సమాచారంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా మహరాష్ట్రకు బియ్యాన్ని తరలిస్తున్నట్టు గుర్తించారు. నిందితులను అరెస్టు చేసి బియ్యాన్ని సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (బెల్లంపల్లి) -
23 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
బెల్లంపల్లి: ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి మండలం తాళ్లగుగ్యాల గ్రామం వద్ద అక్రమంగా తరలిస్తున్న 23 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. బెల్లంపల్లి ఎస్ఐ రాజు సోమవారం మధ్యాహ్నం తాళ్లగుగ్యాల గ్రామం వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా మినీ వ్యాన్లో తరలిస్తున్న 23 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. బియ్యం ఎక్కడినుంచి తరలిస్తున్నారో చెప్పకపోవడం, రసీదు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా వ్యాన్ డ్రైవర్, క్లీనర్ను అదుపులోకి తీసుకున్నారు. -
ఊరెళ్తే ఇల్లు గుల్ల చేశారు..
బెల్లంపల్లి : ఆదిలాబాద్ జిల్లా తాండూరు మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. మండల కేంద్రానికి చెందిన పుల్లూరి రమేష్ అనే వ్యాపారి కుటుంబసభ్యులతో కలసి శుక్రవారం హైదరాబాద్ వెళ్లారు. శనివారం ఉదయం తిరిగి వచ్చి చూసేసరికి తలుపు తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఇంట్లో ఉన్న రూ.లక్ష నగదు, ఇరవై తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీంతో కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
యువకుడి దారుణ హత్య
ఆదిలాబాద్ : గుర్తుతెలియని దుండగులు ఓ యువకుడిని రాళ్లతో మోది దారుణంగా హత్య చేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి మండలం తాళ్లగురజాల గ్రామంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తాళ్లగురజాల గ్రామానికి చెందిన గంగారాం అనే యువకుడిని నడిరోడ్డు మీదే కొంత మంది దుండగులు రాళ్లతో కొట్టి చంపేశారు. ఈ హత్యకు పాత కక్షలే కారణమని స్థానికులు అనుమానిస్తున్నారు. -
ప్రజల కోసం ప్రాణత్యాగాలకు సిద్ధం
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుండా మల్లేశ్ - బెల్లంపల్లిలో బైలుభరో బెల్లంపల్లి : ప్రజల కోసం ప్రాణత్యాగాలకు సిద్ధపడతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ అన్నారు. గురువారం దేశ వ్యాప్త పిలుపులో భాగంగా బెల్లంపల్లి ఏఎంసీ మైదానం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో సత్యాగ్రహం(జైలుభరో) నిర్వహించారు. రైతులు, మహిళలు, యువకులు, విద్యార్థులు సామూహికంగా సత్యాగ్రహంలో పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకం గా, భూ సేకరణ చట్ట సవరణ ఆర్డినెన్స్ను రద్దు చేయాలని నినదించారు. అనంతరం ప్రదర్శనగా వెళ్లి తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ప్రధా న ద్వారం వద్ద నుంచి లోనికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మల్లేశ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేం ద్రమోదీ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. భూ సేకరణ చట్టానికి సవరణ తీసుకురావడం వల్ల రైతులకు రక్షణ లేని పరిస్థితు లు ఏర్పడతాయని, ఆ ఆర్డినెన్స్ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ప్రతిపాదిత తుమ్మిడిహెట్టి ప్రాంతంలోనే నిర్మించి జిల్లాలోని 1.66 లక్షల ఎకరాలకు సాగు, తాగునీరు అందించాలని అన్నారు. పోడు వ్యవసాయ చేసుకుంటున్న దళిత, గిరిజనులకు భూమి పట్టాలు ఇవ్వాలన్నారు. కేకే-2 మెగా ఓపెన్కాస్ట్, శ్రావణ్పల్లి ఓపెన్కాస్ట్ ప్రతిపాదనలు ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం తహశీల్దార్ కె.శ్యామలాదేవికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ అసెంబ్లీ నియోజకవర్గ కార్యదర్శి డి.సత్యనారాయణ, పట్టణ కార్యదర్శి సిహెచ్.నర్సయ్య, మండల కార్యదర్శి డి.లక్ష్మీనారాయణ, ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి ఎం.వెంకటస్వామి, బీకేఎంయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోశం, కాసిపేట మండల సీపీఐ కార్యదర్శి కె.లక్ష్మణ్, సీపీఐ జిల్లా నాయకులు దాగం మల్లేశ్, ఎస్.తిరుపతి, గురిజాల సర్పంచ్ డి.తిరుపతి, నాయకులు రత్నం ఐల య్య, జి.సరోజ, పూర్ణిమ, తాళ్లపల్లి మల్లయ్య, పి.శేషగిరి రావు, ఆర్.ప్రశాంత్, జి.మాణిక్యం, డి.శ్రీధర్ పాల్గొన్నారు. జైల్ భరో ఉద్రిక్తం ఆదిలాబాద్ అగ్రికల్చర్ : కేంద్ర ప్రభుత్వం భూసేకరణ చట్ట సవరణను నిరసిస్తూ సీపీఐ జాతీయ కమిటీ పిలుపు మేరకు జిల్లాలో నిర్వహించిన జైల్భరో ఉద్రిక్తతకు దారి తీసింది. గురువారం కలెక్టర్ కార్యాలయం ఎదుట సీపీఐ నాయకులు ఆందోళన చేపట్టగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి కలవేణి శంకర్ మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తులకు ప్రయోజనం కల్పించడం కోసమే చట్టాన్ని తీసుకొస్తోందని విమర్శించారు. తీవ్ర కరువు పరిస్థితుల్లో అన్నదాతలు ఆత్మహత్యకు పాల్పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. సీపీఐ జిల్లా సహయ కార్యదర్శి ముడుపు ప్రభాకర్రెడ్డి, పట్ణణ కార్యదర్శి ఎస్.అరుణ్కుమార్, మహిళా నాయకురాలు ముడు పు నళినిరెడ్డి, సరోజ తదితరులు పాల్గొన్నారు. -
ఆశ వర్కర్ ఆత్మహత్య
బెల్లంపల్లి : బెల్లంపల్లి కొత్తబస్టాండ్ ఏరియూ ఇందిరమ్మ కాలనీకి చెందిన ఆశ వర్కర్ మల్లెపల్లి స్వప్న(34) ఆత్మహత్యకు పాల్పడింది. వన్టౌన్ హెచ్హెచ్వో జయపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి నిద్ర నుంచి మేల్కోన్న స్వప్న వంట గదిలోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. గమనించిన ఆమె భర్త రవికుమార్ మంటలు ఆర్పడానికి ప్రయత్నించాడు. స్వప్న 90శాతం గాయూలపాలైన ఆమెను భర్త స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం చనిపోయింది. చేతులు, పొట్టకు గాయూలైన రవికుమార్ వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. అనారోగ్యం, గత మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడం కారణంగా అ ప్పుల పాలై జీవితం పై విరక్తి చెంది స్వప్న ఆత్మహత్యకు పాల్పడిందని ఎస్హెచ్వో తెలిపారు. కేసు దర్యా ప్తు చేస్తున్నామని వివరించారు. నిప్పంటించుకుని మహిళ.. మందమర్రి రూరల్ : స్థానిక మూడోవ జోన్కు చెందిన కలువల రాజేశ్వరి(28) బుధవారం తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. పట్టణ ఎస్సై సతీశ్ తెలిపిన వివరాల ప్రకారం. రాజేశ్వరికి 2006లో అంజయ్య అనే ప్రైవేట్ డ్రైవర్తో వివాహామైంది. కొంతకాలంగా ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడం, అనారోగ్యానికి గురికావడంతో రాజేశ్వరి మనస్తాపం చెందింది. ఆస్పత్రుల్లో వైద్యం చేరుుంచుకున్నా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు. -
మంచిర్యాలలో 'పోలీసులు మీ కోసం' ప్రారంభం
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో పోలీసులు మీ కోసం కార్యక్రమాన్ని బెల్లంపల్లి అడిషనల్ ఎస్పీ ప్రకాశ్రెడ్డి ప్రారంభించారు. ఆదివారం ప్రారంభమైన ఈ కార్యక్రమంలో భాగంగా ర్యాలీఘడ్పూర్ గ్రామంలోని ప్రజలకు వైద్య సేవలు అందించారు. అంతేకాకుండా ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అన్ని రకాల పరీక్షలు చేయించారు. (మంచిర్యాల) -
గులాబీ కండువా ప్రజలకు శ్రీరామ రక్ష
⇒ చంద్రబాబుది పూటకో మాట ⇒ నిజామాబాద్ ఎంపీ కవిత ⇒ బెల్లంపల్లి, ఆసిఫాబాద్లో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు బెల్లంపల్లి/ఆసిఫాబాద్ : గులాబీ కండువా రాష్ట్ర ప్రజలకు శ్రీరామ రక్షగా నిలుస్తుందని నిజామాబాద్ ఎంపీ, టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా గురువారం ఆమె బెల్లంపల్లి, ఆసిఫాబాద్లో పర్యటించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. బెల్లంపల్లిలోని బాలాజీ మినీ ఫంక్షన్ హాల్లో, ఆసిఫాబాద్లోని జెడ్పీ గ్రౌండ్ ఆవరణలో నిర్వహించిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇతర పార్టీల నుంచి వలసలు ఆరంభమయ్యాయని, పాత, కొత్త కలయికతో టీఆర్ఎస్ ముందుకు సాగుతోందని చెప్పారు. సభ్యత్వ నమోదు పూర్తయిన తర్వాత నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని తెలిపారు. ఒక్కో కార్యకర్త వంద మందిని సభ్యులుగా చేర్పించాలని, గడపగడపకు వెళ్లి సభ్యత్వ నమోదు చేపట్టాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుది పూటకో మాట అని విమర్శించారు. సమయాన్ని బట్టి రెండు కళ్ల సిద్ధాంతం అవలంబి స్తూ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ఆంధ్రా పార్టీలు లేని తెలంగాణ ఉంటే రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆసిఫాబాద్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీనిచ్చా రు. ఆంధ్రా పాలనలో ఆసిఫాబాద్ అభివృద్ధికి నోచుకోలేదని, రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం జిల్లాకు వెయ్యి కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. కాగా, ఆసిఫాబాద్లో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎంపీ కవిత ఆవిష్కరించారు. బెల్లంపల్లిలో ఎమ్మెల్యే దుర్గం చిన్న య్య, బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ పి.సునీతారాణి, టీఆర్ఎస్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ స భ్యుడు పురాణం సతీశ్, సభ్యత్వ నమోదు జిల్లా ఇన్చార్జి సయ్యద్ అక్బర్హుస్సేన్ , నాయకులు ఆర్.ప్రవీణ్, ఎస్.నర్సింగం, సురేశ్, టీఆర్ఎస్వీ జిల్లా నాయకులు పోలు భరత్చంద్ర, ఆసిఫాబాద్లో పార్లమెంటరీ కార్యదర్శి కోవ లక్ష్మి, డీసీసీబీ చైర్మన్ దామోదర్రెడ్డి, జెడ్పీటీసీల ఫో రం రాష్ట్ర అధ్యక్షుడు కొయ్యల హేమాజి, రైతు సంఘం నాయకులు గోవర్ధన్రెడ్డి, రేణుకుంట్ల ప్రవీణ్, ఎంపీపీ అధ్యక్షులు, జెడ్పీటీసీ సభ్యు లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి బలోపేతానికి కృషి మంచిర్యాల టౌన్ : గ్రామగ్రామాన తెలంగాణ జాగృతిని బలోపేతం చేస్తామని జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎంపీ కవిత అన్నారు. గురువారం మంచిర్యాల టీఎన్జీవోస్ భవన్లో నిర్వహించిన జాగృతి జిల్లా సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా బతుకమ్మ సంబరాలు నిర్వహించామన్నారు. రాష్ట్ర వ్యాప్తం గా ఇప్పటి వరకు 1.20 లక్షల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేశామని తెలిపారు. కవిత వెంట జాగృతి తూర్పు జిల్లా అధ్యక్షుడు ప్రేంరావు, సభ్యులు తిరుమల, పుష్ప, విజయలక్ష్మి, సతీశ్, సిరిపురం రాజేశ్ ఉన్నారు. రాచకొండ కుటుంబానికి పరామర్శ శ్రీరాంపూర్ : ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మున్సిపల్ మాజీ చైర్మన్ రాచకొండ కృష్ణారావు కుటుంబాన్ని ఎంపీ కవిత పరామర్శించారు. నస్పూర్లోని వారి ఇంటికి వెళ్లి కృష్ణారావు భార్య మంజుల, పిల్లలను పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె వెంట ఎమ్మెల్యే దివాకర్రావు, పొలిట్ బ్యూరో సభ్యుడు పురా ణం సతీశ్, పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూ మారెడ్డి, ఎంపీపీ బేర సత్యనారాయణ, పార్టీ మండల అధ్యక్షుడు వంగ తిరుపతి ఉన్నారు. పక్క రాష్ట్ర సీఎంకు ఇక్కడేం పని..? పక్క రాష్ట్రం సీఎం చంద్రబాబు కు తెలంగాణ రాష్ట్రంతో పనేందని నిజామాబా ద్ ఎంపీ కవిత ప్రశ్నించారు. ఆంధ్ర సీఎం తెలంగాణలో పర్యటించడం వల్ల ఒరిగేదేమీ లేదని ఎద్దేవా చేశారు. ఆయనకు ఇక్కడ మిగిలింది ఇద్దరు ముగ్గురే న ని.. మరి కొన్ని రోజుల్లో వారు కూడా ఉండరన్నారు. -
బెల్లంపల్లి మున్సిపల్ సమావేశం రసాభస
-
పేలిన కంటైనర్: భారీగా ట్రాఫిక్ జామ్
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి మండలం బొయిపల్లి వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎక్స్ప్లోజివ్ మెటిరియల్ తీసుకువెళ్తున్న కంటైనర్లో పేలుడు సంభవించింది. దాంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. దీంతో రహదారిపై దాదాపు 10 కి.మీ మేర ట్రాఫిక్ స్తంభించింది. స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది..ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే కంటైనర్లో పేలుడు సంభవించి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఎక్స్ప్లోజివ్ మెటిరియల్ను కంటైనర్లో సింగరేణికి సరఫరా చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పశువైద్యం కోసం అంబులె న్స్లు
బెల్లంపల్లి : మూగజీవాలకు సత్వర వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం అంబులెన్స్ వాహనాలను సమకూర్చబోతోంది. 108 మాదిరిగానే పశువుల కోసం ప్రతీ అ సెంబ్లీ నియోజకవర్గానికి ఒక వాహనాన్ని ఏర్పాటు చేయనుంది. సకాలంలో వైద్యం అందక మూగజీవాలు మృ త్యువాతపడుతున్న నేపథ్యంలో అంబులెన్స్ సదుపా యం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. అంబులెన్స్తోపాటు వైద్యానికి సంబంధించిన మందులు సమకూర్చి, వైద్యులను నియమించనుంది. వైద్యం కోసం అంబులెన్స్కు కబురు పంపడానికి ప్రత్యేకంగా ఫోన్ నంబర్ కూడా కేటాయిస్తారు. ఈ ప్రక్రియ త్వరలోనే అమలులోకి రానుంది. ఈ మేరకు బుధవారం శాసనసభలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయంతో మూగజీవాలకు వైద్యసేవలు మరింత చేరువకానున్నాయి. జిల్లాలో పరిస్థితులివి.. జిల్లాలోని 52 మండలాల్లో 97 వెటర్నరీ డిస్పెన్సరీలు, 49 సబ్ సెంటర్లు ఉన్నాయి. వీటి పరిధిలో 101 మంది పశువైద్యాధికారులు పని చేయాల్సి ఉండగా ప్రస్తుతం 76 మంది మాత్రమే ఉన్నారు. మరో 25 పశువైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులు 74 గాను 11 మంది మాత్రమే పని చేస్తున్నారు. 63 పోస్టు లు ఖాళీగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 22 లక్ష ల వరకు పశుసంపద ఉన్నట్లు ఓ అంచనా. అంబులెన్స్ల ను ప్రవేశపెట్టడం వల్ల జిల్లాలో ఉన్న పది అసెంబ్లీ నియోజకవర్గాలకు పశువైద్యం మెరుగుపడుతుంది. తద్వారా ఖాళీగా ఉన్న వైద్యాధికారులు, సిబ్బంది పోస్టులు భర్తీ అవుతాయి. మందుల కొరత కూడా తీరుతుంది. చేరువ కానున్న వైద్యం ఇప్పటి వరకు మూగజీవాలకు కేవలం వెటర్నరీ డిస్పెన్సరీలు, సబ్సెంటర్లలో మాత్రమే వైద్యం అందుతోంది. మూగజీవాల యజమానులు పశువులను డిస్పెన్సరీలకు తీసుకెళ్తే వైద్యులు, సిబ్బంది పరీక్షించి వైద్యం అందిస్తున్నారు. ఇకపై అలాంటి పరిస్థితి ఉండదు. ఎక్కడైన మూగజీవాలకు ప్రాణాపాయ స్థితి ఉన్నట్లు ఒక్క ఫోన్కాల్ చేస్తే చాలు 108 అంబులెన్స్ మాదిరిగానే సదరు మూగజీవి ఉన్న చోటికి వెటర్నరీ అంబులెన్స్ వెళ్తోంది. అంబులెన్స్లో ప్రత్యేకంగా సరిపడ మందులు అందుబాటులో ఉంచి, వైద్యుడు, సిబ్బందిని నియమిస్తారు. మూగజీవి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి వైద్యం చేస్తారు. చాలా మట్టుకు గ్రామాల్లో సకాలంలో వైద్యం అందక మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. గొర్రెలు, మేకలు, పశువులు ఒక్కోసారి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నాయి. రోడ్డు ప్రమాదంలో గాయపడి అందుబాటులో వైద్యం లేక చనిపోతున్న సంఘటనలు కోకొల్లలు. అనారోగ్యానికి గురైన పశువులకు సకాలంలో వైద్యం అందకపోవడం, యాజమాన్య పద్ధతులు సరిగా పాటించకపోవడం వల్ల కూడా మూగజీవాలు మృత్యువుకు చేరువవుతున్నాయి. కొత్తగా ప్రవేశపెట్టనున్న అంబులెన్స్ల వల్ల పశువైద్యం మెరుగుపడుతుందనడంలో సందేహం లేదు. -
దసరా ధమాకా
బెల్లంపల్లి : బెల్ట్షాపులు మళ్లీ పుట్టుకొస్తున్నాయి. ప్రభుత్వం నిషేధించినా కొందరు మద్యం వ్యాపారులు ప్రోత్సహిస్తున్నారు. మద్యం వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి జోరుగా బెల్ట్షాపులకు మద్యం సరఫరా చేస్తున్నారు. దసరా పండుగను పురస్కరించుకొని బెల్ట్షాపులు ఇబ్బడిముబ్బడిగా ఏర్పాటవుతున్నా ఆబ్కారీ, ప్రొహిబిషన్ శాఖ అధికారులు ‘మామూలు’గా తీసుకుంటున్నారు. బెల్ట్షాపులను రద్దు చేసిన ప్రభుత్వం ప్రతి మద్యం దుకాణానికి అనుబంధంగా పర్మిట్ రూంను అనుమతించింది. రూ.2 లక్షలు చొప్పున చెల్లించి వ్యాపారులు పర్మిట్ రూంను ఏర్పాటు చేసుకున్నారు. అయినా కొందరు వ్యాపారులు చాటుమాటుగా బెల్ట్షాపులను నిర్వహిస్తున్నారు. వీటి ద్వారానే బస్తీలు, గ్రామీణ ప్రాంతాలలో మద్యం వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్నారు. దసరా పండుగను పురస్కరించుకొని పెద్ద ఎత్తున వ్యాపారం సాగించేందుకు బెల్ట్షాపులకు భారీగా మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన ఎమ్మార్పీ ధర కన్న అధికంగా బెల్ట్షాపుల్లో వసూళ్లు చేసి అక్రమ దందా నిర్వహిస్తున్నారు. దసరా వేదికగా.. దసరా పండుగ వేదికగా బెల్ట్షాపులలో పెద్ద ఎత్తున మద్యాన్ని నిల్వ ఉంచారు. ముందస్తు వ్యూహంగా వ్యాపారులు కొందరు మద్యం స్టాక్ ఉంచి కొన్ని రోజుల నుంచి అమ్మకాలు సాగిస్తున్నారు. తూర్పు ప్రాంతంలోని మంచిర్యాల, మందమర్రి, చెన్నూర్, జైపూర్, లక్సెట్టిపేట, దండేపల్లి, బెల్లంపల్లి, కాసిపేట, తాండూర్, రెబ్బెన, ఆసిఫాబాద్, వాంకిడి, కాగజ్నగర్, సిర్పూర్(టీ) తదితర ప్రధాన పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్షాపుల నిర్వహణ గుట్టుగా జరుగుతోంది. మద్యం అధికంగా అమ్మకాలు జరిపే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని బెల్ట్షాపులను నిర్వహిస్తున్నారు. దసరా పండుగ తూర్పు ప్రాంతంలో ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. పండుగకు ముందు మద్యం భారీ ఎత్తున కొనుగోళ్లు జరుగుతాయి. ఈ పండుగ రాక కోసమే ఏడాదిపాటున మద్యం వ్యాపారులు ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం ఆ సమయం ఆసన్నం కావడంతో ఏ మాత్రం ఆలస్యం లేకుండా మూసివేసిన బెల్ట్షాపుల తలుపులు తెరుస్తున్నారు. రోజు బెల్ట్షాపులకే అత్యధికంగా మద్యం షాపుల నుంచి సరుకు సరఫరా జరుగుతోంది. రోజుకు సుమారు రూ.అర కోటి వరకు బెల్ట్షాపుల్లోనే మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు ఓ అంచనా. ఆ ప్రకారంగా మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. కొన్నేళ్ల నుంచి మద్యం వ్యాపారంలో కీలకంగా వ్యవహరిస్తున్న కొందరు బెల్ట్షాపులను ముందుండి నడుపుతున్నట్లు తెలుస్తోంది. మరో పక్క మద్యం కల్తీ కాకుండా బార్కోడ్ విధానంతో స్కానింగ్ చేసి మద్యం అమ్మకాలు జరపాలని ప్రభుత్వం ఆదే శించిన ఎక్సైజ్ అధికారుల నిర్లిప్తతతో అమలు జరగడం లేదు. ఆ పద్ధతి అమలు కాకపోవడంతో వ్యాపారులు మద్యాన్ని కల్తీ చేసి అమ్ముతున్నారని ఆరోపణలు ఉన్నాయి. పట్టింపులేని అధికారులు మద్యం షాపుల నుంచి బెల్ట్షాపులకు అక్రమంగా మద్యం సరఫరా అవుతున్నా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదు. వ్యాపారులు సాగిస్తున్న అక్రమ దందాను నిరోధించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం బెల్ట్షాపులను రద్దు చేసిన క్షేత్ర స్థాయిలో మాత్రం కొనసాగడం ఎక్సైజ్ అధికారుల నిర్లిప్తతకు అద్దం పడుతోంది. ఇప్పటికైనా బెల్ట్షాపులను రద్దు చేయించి అక్రమ మద్యం అమ్మకాలను ఆపాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై బెల్లంపల్లి ఎక్సైజ్ సీఐ నరేందర్రెడ్డిని ఫోన్లో వివరణ కోరగా బెల్ట్షాపులు నిర్వహిస్తున్న విషయం తన దృష్టికి రాలేదన్నారు. ఎక్కడైనా బెల్ట్షాపులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
‘మావో’ల సామగ్రి స్వాధీనం
బెల్లంపల్లి : తిర్యాణి మండలం పంగిడి మాదర అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టులకు చెందిన సామగ్రి లభించినట్లు ఎస్పీ గజ రావుభూపాల్ తెలిపారు. శనివారం రాత్రి స్థాని క డీఎస్పీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 14వ తేదీన పంగిడిమాదర అడవుల్లో గ్రేహౌండ్స్ పోలీసులు కూంబింగ్ చేపట్టారు. అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు 12 మంది మావోయిస్టులు అలీవ్గ్రీవ్ దుస్తుల్లో ఆయుధాలతో కనిపించారు. సాయుధులైన మావోయిస్టులను లొంగిపోవాల ని హెచ్చరికలు చేయగా పోలీసులపై కాల్పులు జరిపారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురుకాల్పులు చేయగా మావోయిస్టులు పారిపోయా రు. అనంతరం ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించగా మావోయిస్టులకు చెందిన కిట్బ్యాగులు, మెడికల్ కిట్, విప్లవ సాహిత్యం, హవర్సాక్స్, వంట పాత్రలు, గొడుగులు లభించినట్లు వివరించా రు. జిల్లాలో పట్టు సాధించడానికి మావోయిస్టు జిల్లా కమిటీ కార్యదర్శి బండి ప్రకాశ్ అలియాస్ ప్రభాకర్ అలియాస్ క్రాంతి, ఏరియా కమిటీ కార్యదర్శి ఆత్రం శోభన్ అలియాస్ చార్లెస్, జిల్లా కమిటీ సభ్యుడు మైలారపు అడేల్లు అలి యాస్ భాస్కర్, ఇద్దరు మహిళా మావోయిస్టులు, మరో తొమ్మిది మంది సభ్యులు సంచరిస్తున్నారన్నారు. ఖాళీ చేయిస్తాం మావోయిస్టులను జిల్లా నుంచి ఖాళీ చేయిస్తామని ఎస్పీ గజరావు భూపాల్ స్పష్టం చేశారు. జిల్లాలో మావోయిస్టుల ఉనికి లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుత పరి స్థితుల్లో మావోయిస్టులు పోలీసులకు లొంగిపోవడమో లేక జిల్లా నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవడ మో చేయాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో డీఎస్పీ కె.ఈశ్వర్రావు, సీఐ బాలాజీ, టూటౌన్ ఎస్హెచ్ఓ మహేశ్బాబు, తిర్యాణి ఎస్సై మో హన్, దేవాపూర్ ఎస్సై కె.స్వామి పాల్గొన్నారు. -
వసూల్ రాజాలు
బెల్లంపల్లి : సింగరేణి కంపెనీ ఆస్తులను ఎస్అండ్పీసీ విభాగం పరిరక్షిస్తోంది. ఆ విభాగానికి చెందిన కొందరు అధికారులు, సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారు. ఆస్తుల పరిరక్షణ పేరుతో అందినంత దోచుకుంటున్నారు. నిర్భయంగా వసూళ్ల దందా సాగిస్తున్నా రు. బెల్లంపల్లిలో భూగర్భ గనులు మూతపడి, ఏరియా సింగరేణి జీఎం కార్యాలయాన్ని గోలేటీ టౌన్షిప్కు తరలించిన తర్వాత మూడేళ్ల నుంచి గృహ, దుకాణ సముదాయాల నిర్మాణాలు సాగుతున్నాయి. ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న భూములను ఆక్రమించుకొని కొందరు శాశ్వత కట్టడాలు నిర్మిస్తుండగా, శిథిలమైన ఇళ్లను కూల్చివేసి మరికొందరు పక్కా గృహాలు కట్టుకుంటున్నారు. దీంతో బెల్లంపల్లిలో కట్టడాల నిర్మాణాలు ఊపందుకున్నాయి. ఎక్కడ నిర్మాణాలు మొదలైనా అక్కడ ఎస్అండ్పీసీ అధికారులు, సిబ్బంది క్షణాల్లో వాలి కట్టడాలు నిలిపివేస్తారు. సింగరేణి భూమిలో నిర్మాణాలు చేపడుతున్నారని నిర్మాణ సామగ్రిని ధ్వంసం చేసి పరికరాలను పట్టుకెళ్తున్నారు. అనంతరం నిర్మాణదారులతో రహస్యంగా బేరసారాలు కుదుర్చుకుంటారు. వ్యాపార, వాణిజ్య వర్గాల వారు ముందస్తుగా అవినీతి అధికారులను సంప్రదించి బేరం కుదిరిన తర్వాతనే నిర్మాణ పనులను చేపడుతారు. తొలుత అడ్డుకోవడం ఒప్పందం కుదిరిన తర్వాత నిర్మాణం పూర్తయ్యే వరకు అటువైపు కన్నెత్తి చూడకపోవడం అవినీతి అధికారులకు పరిపాటిగా మారినట్లు కార్మికులు పేర్కొంటున్నారు. ఆ తీరుగా ఎస్అండ్పీసీ విభాగంలో పనిచేస్తున్న కొందరు అధికారులు, సిబ్బంది భారీ ఎత్తున అక్రమార్జనకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నా ఉన్నతాధికారులు మాత్రం ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారు. బజార్ ఏరియాలో భారీ డిమాండ్ బెల్లంపల్లిలో కన్నాలబస్తీ, టేకులబస్తీ, హన్మాన్బస్తీ, బూడిదగడ్డ, ఏఎంసీ ఏరియా, స్టేషన్రోడ్ కాలనీ, నంబర్ 2 ఇంక్లైన్బస్తీ, సుభాష్నగర్, 68 డీప్ ఏరియా, శాంతిఖని, 24 డీప్ ఏరియా, బెల్లంపల్లిబస్తీ, గోల్బంగ్లాబస్తీ, బజార్ ఏరియా, కాంటా చౌరస్తా, పాతబస్టాండ్, కొత్తబస్టాండ్ ఏరియా, షంషీర్నగర్, అంబేద్కర్నగర్, బుధాగెస్ట్హౌస్ తదితర ప్రాంతాల భూములు సింగరేణి ఆధీనంలో ఉన్నాయి. వీటిలో కొత్తబస్టాండ్ ఏరియా నుంచి ఏఎంసీ ఏరియా వరకు ప్రధాన రహదారి పక్కన ఉన్న భూములకు మంచి డిమాండ్ ఉంది. ఆయా ప్రాంతాల్లో శాశ్వత కట్టడాలు నిర్మించుకునే వ్యక్తుల నుంచి ఎస్అండ్పీసీ సిబ్బంది భారీ మొత్తంలో ముడుపులు డిమాండ్ చేసి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఒక్కో నిర్మాణానికి కనీసం రూ.20 వేల నుంచి రూ. లక్షల్లో వసూలు చేస్తున్నారు. కొందరు వ్యాపార, వాణిజ్యవర్గాల వారు రూ.లక్షలు ముట్టజెప్పి బహుళ అంతస్తుల భవనాలు నిర్మించుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. నిరుపేదలు రూ.వేలల్లో చెల్లించుకుంటున్నట్లు సమాచారం. అంత భారీ స్థాయిలో వసూళ్ల దందా జరుగుతున్నా సింగరేణి ఉన్నతాధికారులు స్పందించిన పాపాన పోవడం లేదు. ఇదివరలో బెల్లంపల్లిలో పని చేసిన ఓ ఎస్అండ్పీసీ అధికారి అవినీతి అక్రమాలు బయటపడటంతో సదరు అధికారిని వా రం రోజులు సస్పెన్షన్ చేసి గోలేటీకి బదిలీ చేశారు. మరో ఏరియా ఉన్నతాధికారి రూ.లక్షల్లో ముడుపులు తీసుకొని అక్రమ నిర్మాణాలు ప్రొత్సహించడం అప్ప ట్లోసంచలనం సృష్టించింది. సదరు అధికారి ప్రస్తుతం ఉద్యోగ విరమణ చేశారు. ప్రస్తుతం పని చేస్తున్న అధికారులు, సిబ్బందిలో కొందరు ఆ ఆనవాయితీనే కొనసాగిస్తున్నారు. ఏరియా సింగరేణి ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి అక్రమ వసూళ్ల దందాను అరికట్టి, సదరు అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కార్మికులు ముక్తకంఠంతో కోరుతున్నారు. -
సింగరేణిలో దొంగలు పడ్డారు!
సింగరేణిలో దొంగలు పడ్డారు. టన్నులకొద్దీ నల్లబంగారం తవ్వేశారు. ఇక తరలించడమొక్కటే తరువాయి. అంతలోనే విషయం బయటకు పొక్కింది. అక్రమార్కుల గుట్టు రట్టైంది. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి- రేచ్నీ ప్రాంతంలో ఇది జరిగింది. ఇక్కడి రైల్వేస్టేషన్ నుంచి రెగ్యులర్గా కేపీసీఎల్కి బొగ్గు రవాణా అవుతుంటుంది. ఇటీవల ఇక్కడే బొగ్గు అక్రమ రవాణా వ్యవహారం వెలుగు చూసింది. సింగరేణిలో పని చేసే కొందరు అధికారులు ఈ అక్రమానికి పాల్పడ్డారు. కేపీసీఎల్కి రైల్వే వ్యాగన్లలో 4 వేల టన్నుల బొగ్గు సరఫరా చేయాలి. కానీ ఆ బొగ్గు ర్యాక్ని మహారాష్ట్రలోని సిమెంట్ పరిశ్రమకి తరలించేందుకు అక్రమార్కులు సిద్ధమయ్యారు. ర్యాక్ అంటే 54 వ్యాగన్లతో కూడిన గూడ్స్ రైలు. కేపీసీఎల్కు బొగ్గు సరఫరా చేస్తున్నట్లు ఎన్ఓసి తీసుకున్నారు. అయితే ఆ ఎన్ఓసిలో కేపీసీఎల్ అన్న చోట వైట్నర్తో కెవిపిటి అని దిద్దేశారు. ఇక వ్యాగన్ కదలడమే తరువాయి. అయితే సింగరేణి ఉద్యోగులు కొందరు ఈ విషయాన్ని నేరుగా సంస్థ సీఎండీకి తెలిపారు. వెంటనే స్పందించిన సీఎండీ విజిలెన్స్ అధికారులను రంగంలోకి దించారు. రవాణాకి సిద్ధంగా ఉన్న రైలును విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఎన్ఓసీపై ఫోర్జరీ సంతకం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న సింగరేణి సెక్యూరిటీ అధికారిని ప్రశ్నిస్తే.. తనకేమీ తెలియదని ముఖం చాటేశాడు. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడంటే ఇదే. సొంత సంస్థకే కన్నాలు వేసేందుకు ప్రయత్నించి దొరికిపోయిన దొంగలకు అధికారులు ఎలాంటి శిక్ష విధిస్తారో వేచి చూడాలి. ** -
ఆశలు రేపిన కొత్త జిల్లా
బెల్లంపల్లి : కొత్త జిల్లాల ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుండటంతో మరోమారు తూర్పు ప్రాంత ప్రజల్లో ఆశలు రేగాయి. ప్రభుత్వం ఏ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తుందనేది సర్వత్రా ఆసక్తినెలకొంది. వైశాల్యంలో పెద్దదైన ఆదిలాబాద్ జిల్లాను తూర్పు, పశ్చిమ ప్రాంతాలుగా విడదీసి తూర్పు ప్రాంతానికి జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ ప్రజల నుంచి దశాబ్దాల నుంచి వస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో 14 కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అందుకు అనుగుణంగ కసరత్తు కూడా మొదలుపెట్టడంతో మరోమారు ఈ అంశం తెరమీదకు వచ్చింది. కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ఉన్నత స్థాయి కమిటీని నియమించి, నిశితంగా అధ్యయనం చేయిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఉన్నతాధికారులతో సమావేశమైన అనంతరం ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రెండింటి మధ్య పోటీ.. తూర్పు ప్రాంతంలో మంచిర్యాల, బెల్లంపల్లి రెండు ప్రధాన పట్టణాలుగా ఉన్నాయి. ఈ ప్రాంతాల ప్రజలు ఎవరికి వారు కొత్త జిల్లాను తమ ప్రాంతం కేంద్రంగానే ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఎన్నికల సందర్భంలోనూ ఈ అంశం ప్రతిసారి ప్రస్తావనకు వస్తోంది. మంచిర్యాలను జిల్లా చేస్తామని కేసీఆర్ సార్వత్రిక ఎన్నికల ముందు ప్రకటించారు. ఇదే క్రమంలో ప్రభుత్వ భూములు, మౌలిక వసతులు అపారంగా ఉన్న బెల్లంపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని రాజకీయ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. రెండు ప్రాంతాల ప్రజలు పోటీ పడి ఎవరికి వారు అనుగుణంగా జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో అధ్యయన కమిటీ మౌలిక అంశాలను పరిశీలించి ఏ ప్రాంతాన్ని కొత్త జిల్లాకు అనుకూలంగా ప్రకటిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. పుష్కలంగా మౌలిక వసతులు కొత్త జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం ప్రకటించినట్లుగా మౌలిక వసతులు ప్రధానం అనేది సుస్పష్టమైంది. కొత్త జిల్లా పరిశీలనకు వచ్చిన ప్రాంతాలను అధ్యయన కమిటీ స్వయంగా పరిశీలించి తుది నివేదికను ప్రభుత్వానికి అందజేస్తుంది. కొత్త జిల్లా ఏర్పాటుకు కావాల్సిన మౌలిక సదుపాయాలు బెల్లంపల్లిలో పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా తూర్పు ప్రాంతంలోని చెన్నూర్, మంచిర్యాల, సిర్పూర్(టి), ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలకు బెల్లంపల్లి కేంద్ర బిందువుగా ఉంది. ఏఆర్ పోలీస్ హెడ్క్వార్టర్స్, అడిషనల్ ఎస్పీ కార్యాలయం బెల్లంపల్లిలో ఉండటం మరో అదనపు అర్హతగా పేర్కొంటున్నారు. అపారమైన ప్రభుత్వ భూములు కలిగి ఉండటంతోపాటు సింగరేణి భవనాలు, క్వార్టర్లు, రోడ్డు, రైల్వే రవాణ సౌకర్యాలు కలిసి వచ్చే అంశంగా రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మంచిర్యాలలో జిల్లా కేంద్రం ఏర్పాటుకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ భూములు తగినంత లేకపోవడం ప్రతికూలంశంగా మారే అవకాశాలు ఉన్నట్లు పలువురు పేర్కొంటున్నారు. భౌగోళిక స్వరూపం, రవాణ, వసతులు, జనాభా తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ఎక్కడ కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వానికి అధ్యయన కమిటీ సూచించనుంది. మరోపక్క కొత్త జిల్లాలను ఒకేసారి కాకుండా దశలవారీగా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఏదిఏమైనా కొత్త జిల్లా ఏ ప్రాంతమవుతుందనేది అధ్యయన కమిటీపైనే ఆధారపడి ఉందనేది గమనార్హం. -
అన్వేషణ
బెల్లంపల్లి : తూర్పు ప్రాంతంలో గుట్టుగా డంప్ల కోసం వేట కొనసాగుతోంది. నిషేధిత మావోయిస్టులకు చెందిన డంప్ కొన్ని ముఠాలు అన్వేషణ సాగిస్తున్నాయి. అణువణువున అడవులను జల్లెడ పడుతున్నారు. ఈ దందా నిత్యకృత్యంగా సాగుతోంది. ఇప్పటివరకు ఏ ముఠాకుడంప్లు దొరికినట్లు ఆధారాలు లేకపోయినా అన్వేషణ ఆగడం లేదు. తూర్పు ప్రాంతంలోని తిర్యాణి, సిర్పూర్(టి), బెజ్జూర్, కౌటాల, కాసిపేట, చెన్నూర్, జైపూర్, మందమర్రి, వేమనపల్లి, జన్నారం, నెన్నెల, బెల్లంపల్లి తదితర ప్రాంతాలు సుమారు దశాబ్ధంన్నర క్రితం వరకు మావోయిస్టులకు కేంద్రాలుగా ఉన్నాయి. ఆయా ప్రాంతాలలోని అడవులను షెల్టర్జోన్లుగా చేసుకొని మావోయిస్టులు ఉద్యమ నిర్మాణం చేపట్టారు. ఉధృత స్థాయిలో కార్యకలాపాలు సాగించారు. ఆ తర్వా త పోలీసు నిర్బంధం పెరగడం, ఎదురుకాల్పుల్లో ముఖ్య నాయకులు మృతి చెందడం, మరికొంత మంది ప్రభుత్వానికి లొంగిపోవడంతో మావోయిస్టుల ప్రభావం సన్నగిల్లింది. ప్రస్తుతం ఉద్యమంలో కొంతమంది నేతలు పని చేస్తున్న పోలీసు నిర్బంధం రీత్యా దండకారణ్యంలోకి వెళ్లారు. ఆ ప్రాంతంలోనే ఉద్యమాలలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో మావోయిస్టుల అలికిడి పూర్తిగా లేకుండా పోయింది. ఇదే అదునుగా భావించిన కొందరు ముఠాలుగా ఏర్పడి మావోయిస్టులు దాచిపెట్టిన డంప్ల కోసం గాలిస్తున్నారు. ఈ చర్యలో కొందరు మాజీలు ముఠా సభ్యులకు సహకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అత్యాశతో.. కష్టపడకుండా, తక్కువ సమయంలో ధనవంతులు కావాలనే కాంక్షతో కొందరు మావోయిస్టుల డంప్లపై దృష్టి సారించారు. మావోయిస్టులు కచ్చితంగా డంప్ల్లో భారీ మొత్తంలో డబ్బులు దాచిపెట్టి ఉంటారనే నమ్మకంతో అదే పనిగా అన్వేషణ చేస్తున్నారు. అటవీ ప్రాంతం శివారు గ్రామాల ప్రజలతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకొని డంప్ల వేట సాగిస్తున్నారు. కోల్బెల్ట్ ప్రాంతానికి చెందిన వ్యక్తులే డంప్ల అన్వేషణలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రూపులుగా ఏర్పడి రాత్రిపూట అడవులను గాలిస్తున్నారు. ఎక్కడ అనుమానం వచ్చిన ఆ ప్రాంతంలో తవ్వకాలు జరుపుతున్నారు. రోజువారీగా అదే పనిలో ముఠాలు నిమగ్నం కావడం తూర్పు ప్రాంతంలో చర్చనీయాంశమైంది. అన్వేషణలో భాగంగానే.. గుట్టుగా సాగుతున్న అన్వేషణలో భాగంగానే ఇటీవలి కాలంలో జిల్లాలో పలు చోట్ల మావోయిస్టుల డంప్లు బయటపడినట్లు తెలుస్తోంది. ముందస్తు అందిన పక్కా సమాచారంతో అటవీ ప్రాంతంలో తవ్వకాలు జరిపి డంప్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. ఈ ఏడాది మే 23న కాసిపేట మం డలం వెంకటాపూర్ గ్రామ శివారు ప్రాంతంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో పోలీసులకు డంప్ దొరికింది. జూన్ 30న తిర్యాణి మండలం బీరల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతంలో మరో డంప్ పోలీసుల చేతికి చిక్కింది. అంతకుముందు గతేడాది జనవరి నెలలో బెల్లంపల్లి-మందమర్రి మండలాల మధ్యలోని దట్టమైన అటవీ ప్రాంతంలో డంప్ పోలీసులకు దొరికింది. మావోయిస్టులకు చెందిన ఈ మూడు డంప్ల్లోనూ భారీ మొత్తం లో పేలుడు పదార్థాలు, ఆయుధాలు, విప్లవ సాహిత్యం, యూనిఫాంలు, ఇతర సామగ్రి లభ్యమైన సంగతి తెలిసిందే. రహస్యంగా డంప్ల కోసం వెతుకుతున్న ముఠాల చేతికి ఇంత వరకు డబ్బు దొరికిన ఆనవాళ్లు లేకపోయిన అదే తంతుగా వేటను సాగిస్తున్నారు. -
బొగ్గు అక్రమ రవాణా గుట్టు రట్టు
బెల్లంపల్లి : బెల్లంపల్లి ఏరియాలో మరో బొగ్గు అక్రమ రవాణా వ్యవహారం వెలుగుచూసింది. తప్పుడు (నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్)ఎన్వోసీతో బొగ్గును అక్రమంగా తరలించేందుకు చేసిన యత్నాలు వెలుగుచూడటం బెల్లంపల్లి ఏరియాలో కలకలం రేపింది. ఈ ఘటనపై సింగరేణి విజిలెన్స్ విభాగం అధికారులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. బెల్లంపల్లి ఏరియాలోని రేచిని రోడ్ రైల్వేస్టేషన్ నుంచి కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (కేపీసీఎల్)కు ఆనంద్ ట్రాన్స్పోర్టు ప్రైవేట్ లిమిటెడ్ బొగ్గు రవాణా చేసేందుకు కాంట్రాక్ట్ను చేజిక్కించుకుంది. ప్రస్తుతం ఆ ట్రాన్స్పోర్టు సంస్థ కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్కు బొగ్గును రవాణా చేసేందుకు గోదావరి ఎంటర్ప్రైజెస్కు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చినట్లు తెలిసింది. ఆనంద్ ట్రాన్స్పోర్టు ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీదనే గోదావరి ఎంటర్ప్రెజైస్ బొగ్గు సరఫరా చేస్తోంది. ఎప్పటి మాదిరిగానే ఈ నెల 17వ తేదీన కేపీసీఎల్కు బొగ్గును సరఫరా చేసేందుకు సింగరేణి నుంచి 924 నంబర్తో ఎన్ఓసీ తీసుకుంది. ఆ ప్రకారంగా ఒక రేక్ (54 వ్యాగన్లు కలిగిన గూడ్స్ రైలు) 4 వేల టన్నుల బొగ్గును లోడ్ చేసి రవాణాకు సిద్ధం చేసుకుంది. అంతలోనే రైల్వే అధికారులు ఎందుకో అనుమానం వచ్చి సదరు ట్రాన్స్పోర్టు సంస్థ అందజేసిన ఎన్వోసీని నిశితంగా పరిశీలించారు. ఆ ఎన్వోసీపై వైట్నర్తో దిద్ది కేపీసీఎల్కు బదులు కేపీవీటీ అని రాసి ఉండటంతో బొగ్గు రవాణా చేసేందుకు రైల్వే అధికారులు నిరాకరించారు. ఈ విషయాన్ని రైల్వే అధికారులు వెంటనే సింగరేణి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఈ అక్రమ బొగ్గు రవాణా వ్యవహారం బయట పడింది. వెంటనే స్పందించిన సింగరేణి అధికారులు రేచిని రోడ్ రైల్వేస్టేషన్కు వచ్చి సదరు ఎన్వోసీని పరిశీలించి అందులో దిద్దుబాటు జరిగినట్లు రూడీ చేసుకున్నారు. ఫార్వర్డ్ నోట్, ఇండెంట్ కాపీలపై కేపీసీఎల్ రాసి ఉండటంతో ఆ తర్వాత ఏరియా ఎస్వోటూ జీఎం సంతకంతో మరో ఎన్వోసీ తయారు చేయించి కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్కు లోడ్ చేసిన రేక్లోడ్ బొగ్గును అదే రోజు రాత్రి పంపిం చేశారు. ఆ ఎన్వోసీని ఎవరి ప్రోద్బలంతో వైట్నర్ పెట్టి దిద్దారో, ఈ వ్యవహారం వెనుక ఎందరు సింగరేణి అధికారుల హస్తం ఉందో అనేది చర్చనీయాంశంగా మారింది. ఇంతకుముందు ఇలాగే ఎన్ని రేక్ల బొగ్గు అక్రమ రవాణా జరిగిందనేది ప్రశ్నార్థకంగా మారింది. బెల్లంపల్లి ఏరియాలో రూ.కోట్లు విలువ చేసే బొగ్గు అక్రమ రవాణా జరిగిన విషయం ఇంకా మరువకముందే తాజాగా మరో ఘటన వెలుగుచూడటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. విచారణ చేస్తున్న విజిలెన్స్ అధికారులు తప్పుడు ఎన్వోసీతో బొగ్గు రవాణాకు యత్నించిన ఘటనపై సింగరేణి విజిలెన్స్ విభాగం అధికారులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. సింగరేణి విజిలెన్స్ ఏజీఎం నాగేశ్వర్రావు ఆధ్వర్యంలో బుధవారం రేచిని రోడ్ రైల్వేస్టేషన్, సదరు ట్రాన్స్పోర్టు కార్యాలయానికి వెళ్లి రికార్డులు పరిశీలించారు. దిద్దుబాటు చేసిన ఎన్వోసీని స్వాధీనం చేసుకొని దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ ఘటనపై సింగరేణి డెరైక్టర్(పా) విజయ్కుమార్ సీరియస్గా స్పందించినట్లు తెలుస్తోంది. గురువారం విజిలెన్స్ అధికారులు దర్యాప్తు నివేదికను డెరైక్టర్(పా)కు నివేదించనున్నట్లు తెలుస్తోంది. నిజాయితీ కలిగిన అధికారులతో దర్యాప్తు చేయిస్తే ఈ అక్రమ బొగ్గు రవాణా గుట్టు వెలుగుచూసే అవకాశాలు ఉన్నట్లు కార్మికులు పేర్కొంటున్నారు. -
సర్వేతో ప్రజలకు ఒరిగేదేమీ లేదు..
తాండూర్ : ఒక రోజు సర్వే నిర్వహించడం వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ విమర్శించారు. ఈ సర్వే వల్ల నిర్దిష్టమైన ప్రణాళిక తయారు కాబోదని పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని మాదారం ఏఐటీయూసీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. విధివిధానాలు ప్రకటించకుండా హామీలు ఎలా అమలు చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో గద్దెనెక్కిన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను గాలికొదిలేసిందని అన్నారు. ప్రభుత్వ భూమిని అమ్మి రుణ మాఫీలు చేస్తే పేదలకు భూమి ఎలా పంచుతారని అన్నారు. అవినీతిని నిర్మూలిస్తామని అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం బడా కార్పొరేట్ సంస్థలు, పారిశ్రామికవేత్తలు, బహుళజాతి సంస్థలకు లాభం చేకూర్చే చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర సాగుతోందని, అటవీ హక్కుల చట్టానికి కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని అన్నారు. బహిరంగ సభకు భారీగా తరలిరండి ఈ నెల 11న హైదరాబాద్ నిజాం కళాశాల మైదానంలో నిర్వహించే చండ్ర రాజేశ్వర్రావు శతజయంతి బహిరంగ సభకు ప్రజలు పెద్దయెత్తున తరలి రావాలని గుండా మల్లేశ్ కోరారు. పది వేల మంది జన సేవాదళ్ కార్యకర్తలతో కవాతు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కళవేణి శంకర్, మండల కార్యదర్శి మామిడాల రాజేశ్, జిల్లా కార్యవర్గ సభ్యులు పులుగం వెంకటేశ్, ఏఐటీయూసీ బ్రాంచి ఉపాధ్యక్షుడు బయ్య మొగిళి తదితరులు పాల్గొన్నారు. -
బండ కింద బతుకులు
బెల్లంపల్లి : భూగర్భంలో పనిచేస్తున్నకార్మికుల ప్రాణాలకు రక్షణ లేదు. బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతపై చూపిస్తున్న శ్రద్ధ అధికారులు గనుల్లో రక్షణ చర్యలపై చూపడం లేదు. కనీస రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో కార్మికులు ప్రమాదాల భారినపడుతున్నారు. మందమర్రి ఏరియా శాంతిఖని గనిలో కార్మికులు ప్రతికూల పరిస్థితుల మధ్య విధులు నిర్వహిస్తున్నారు. పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం ఎవరికి సంభవిస్తుందోననే అభద్రతాభావం కార్మికుల్లో వ్యక్తమవుతోంది. గత శనివారం రెండో షిప్ట్లో 2 డీప్ 55 లెవల్ వద్ద సపోర్టు పనులు నిర్వహిస్తుండగా ఆకస్మికంగా పైకప్పు కూలింది. ఈ ఘటనలో ఓవర్మెన్ మీన సుదర్శన్ ఎడమ కాలుకు తీవ్రమైన గాయాలు తగలగా, బ్రహ్మేశ్వర్రావు అనే బదిలీ ఫిల్లర్ కార్మికుడికి స్వల్ప గాయాలయ్యాయి. ఆ క్షణంలో ఏఎం యంత్రం మరమ్మతులకు రావడంతో పక్కకు వెళ్లిన మరో నలుగురు కార్మికులు తృటిలో ప్రాణాల నుంచి బయటపడ్డారు. బొగ్గు అధికోత్పత్తి సాధనే లక్ష్యంగా పని చేస్తున్న అధికారులు ప్రకృతికి విరుద్దంగా భూగర్భంలో పని చేస్తున్న కార్మికుల ప్రాణాల మీదికి వస్తున్నా పట్టింపు చేయడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రక్షణ టీంకే రక్షణ లేదు.. భూగర్భంలో బొగ్గు వెలికితీతకు రక్షణ చర్యలు పటిష్టవంతంగా చేపట్టాల్సి ఉంటుంది. కార్మికులు పనిస్థలాలకు వెళ్లే ముందస్తుగానే రక్షణ టీం సపోర్టు పనులు నిర్వహించాలి. పైకప్పు కూలకుండా డబ్ల్యుస్ట్రాఫ్ రూఫ్ బోల్ట్తో బిగించి కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత రక్షణ టీంపైనే ఉంటుంది. ప్రెస్లీ ఎక్స్పోజ్డ్(బొగ్గు వెలికితీత తర్వాత ఏర్పడిన ఖాళీ స్థలం)లో రక్షణ పనులు నిర్వహించే సపోర్టు టీం సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటోంది. సపోర్టు పనులు చేపట్టే ముందు రక్షణ టీం ఖాళీ ప్రదేశంలో దాటు లేదా దిమ్మె, ఫోర్ఫోలింగ్ను ఏర్పాటు చేసుకొని సపోర్టు పనులు ప్రారంభించాల్సి ఉండగా అలాంటి పద్ధతులు శాంతిఖని గనిలో నిర్వహించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు. ఈ విధానం కొంత కాలం నుంచి గనిలో చేపట్టడం లేదు. ఈ కారణంగానే రక్షణ టీంకు రక్షణ లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అడపాదడపా పైకప్పు కూలి గాయాలపాలవుతున్నారు. పర్యవేక్షణ లేని డీజీఎంఎస్ భూగర్భ గనుల్లో రక్షణ చర్యలపై పర్యవేక్షణ నిర్వహించే డెప్యూటీ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ(డీజీఎంఎస్) పత్తా లేకుండా పోయారు. మైన్స్ యాక్టు ప్రకారం ప్రతి ఆరు నెలలకోసారి డీజీఎంఎస్ గనులను తనిఖీ చేయాల్సి ఉండగా ఇటీవలి కాలంలో నిర్లక్ష్యం విహ స్తున్నారు. మైనింగ్ ఇన్స్పెక్టర్లు గనుల వైపు కన్నెత్తి చూడటం లేదు. పర్యవేక్షణ నిర్వహించడం లేదు. ఏదో ఏడాదికోసారి అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గనిలో దిగి రక్షణ చర్యలను నిశితంగా పర్యవేక్షించాల్సిన అధికారులు నిర్లిప్తంగా పర్యవేక్షిస్తుండటంతో సింగరేణి అధికారులు చిత్తశుద్ధితో సేఫ్టీ పనులు చేపట్టలేకపోతున్నట్లు తెలుస్తోంది. వర్క్లేని... వర్క్మన్ ఇన్స్పెక్టర్లు మైనింగ్ ఇన్స్పెక్టర్లే కాకుండా గని స్థాయిలో ఏర్పాటు చేసిన వర్క్మెన్ ఇన్స్పెక్టర్లు కూడా సపోర్టు పనులను పర్యవేక్షించాల్సి ఉంటుంది. గనిలో వర్క్మెన్ ఇన్స్పెక్టర్లు వారానికో రోజు సేఫ్టీ పనులను తనిఖీ చేసి రిపోర్టు తయారు చేయాల్సి ఉంటుంది. చాలా మట్టుకు గని ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే వీరు పని చేయాల్సి ఉండటం వల్ల ఉన్నతాధికారుల సూచనల మేరకే రిపోర్టులు తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. సేఫ్టీ విషయంలో వర్క్మన్ ఇన్స్పెక్టర్లు సూచనలు, సలహాలు ఇచ్చిన ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు. వర్క్మన్ ఇన్స్పెక్టర్లకు స్వయం ప్రతిపత్తి లేకపోవడంతో నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నారు. ఆ రకంగా గనిలో కార్మికుల ప్రాణాలకు రక్షణ లేనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రక్షణ చర్యలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే భవిష్యత్లో ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితులు ఉంటాయని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
నిలువు దోపిడీ
బెల్లంపల్లి, న్యూస్లైన్ : మామిడి తోటలకు నిలయమైన జిల్లాలో మార్కెట్ సౌకర్యం కరువైంది. దీన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారులు, దళారులు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. మరోవైపు ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కొద్దో గోప్పో పంట చేతికందినా గిట్టుబాటు ధర లభించడం లేదు. జిల్లాలోని 23వేల హెక్టార్ల లో రైతులు మామిడి తోటలు పెంచుతున్నారు. వీటిలో 18 వేల హెక్టార్లలో కాపు వచ్చే మామిడితోటలు ఉండగా.. ఐదు వేల హెక్టార్లలో ఐదేళ్ల వయసు గల తోటలు ఉన్నాయి. ప్రకృతి అనుకూలిస్తే ఎకరాకు ఏడు టన్నుల చొప్పున మామిడి కాయ దిగుబడి వస్తుంది. కానీ అకాల వర్షాలు, ఈదురుగాలుల వల్ల ఏటా పూత, పిందె రాలిపోయి తోటలకు నష్టం వాటిల్లుతోంది. దీంతో కాయ దిగుబడి హెక్టారుకు సగటున 3 టన్నులకు మించి రావడం లేదు. ఈసారీ మామిడి రైతులను ప్రకృతి వైపరీత్యాలు దెబ్బతీశాయి. మామిడి చెట్లకు పూత విరగబూసి పిందె దశకు చేరే క్రమంలో అకాల వర్షాలతో పిందెలు సగానికి పైగా రాలిపోయింది. కొద్దో గొప్పో మిగిలిన పంటను అమ్ముకుందామనుకున్న రైతులకు గిట్టుబాటు కాని పరిస్థితులు ఏర్పడ్డాయి. మార్కెట్ సౌకర్యం లేక.. మామిడి తోటలకు నిలయమైన జిల్లాలో మార్కెట్ సౌకర్యం లేదు. మంచిర్యాల కేంద్రంగా మార్కెట్ ఏర్పాటుకు చేసిన ప్రతిపాదనలు బుట్ట దాఖలయ్యాయి. రెండేళ్ల నుంచి ఆ ప్రతిపాదనలు మరుగున పడిపోవడంతో రైతుల ఆశలు ఆవిరయ్యాయి. దీంతో రైతులు మామిడి కాయలను మాహారాష్ట్రలోని నాగ్పూర్, నాందేడ్ మార్కెట్లకు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. రైతుల అమాయకత్వాన్ని వ్యాపారులు, దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. మామిడికాయలను తీసుకెళ్లే క్రమంలో ధర ఆకాశంలో ఉన్నట్లు నమ్మబలికి.. తీరా తీసుకెళ్లాక ఒక్కసారిగా ధర దించి రైతులను వంచనకు గురి చేస్తున్నారు. వ్యాపారులు, దళారులు సిండికేట్గా మారి దోచుకుంటున్నారు. మామిడికాయలు, పండ్లను వేలం పాడి విక్రయించి ఇచ్చినందుకు రూ.లక్షకు రూ.10వేల చొప్పున దళారులు రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. మరోవైపు టన్నుకు 50 కిలోల తరుగు తీస్తున్నారు. రైతులు ఎదురుతిరిగితే కొనుగోలు చేయడం లేదు. తడిసి మోపెడవుతున్న చార్జీలు మార్కెట్ సౌకర్యం అందుబాటులో లేక మామిడి రైతులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కాయలను చెట్లపై నుంచి తెంపడం నుంచే ఇబ్బందులు మొదలవుతాయి. గతంలో రోజువారీ కూలీకి వచ్చే కూలీలు ప్రస్తుతం టన్ను లెక్కన డబ్బులు తీసుకుంటున్నారు. ఆరు టన్నుల కాయలు కోస్తే రూ.10వేలు కూలిగా ఇవ్వాల్సి వస్తోంది. కాయలు తెంపిన తర్వాత మార్కెట్కు తరలించడానికి రవాణా చార్జీ అదనపు భారమవుతోంది. బెల్లంపల్లి ప్రాంతం నుంచి నాగ్పూర్కు మామిడికాయలు తరలిస్తే డీసీఎం వ్యాన్కు రూ.18వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారు. నెన్నెల, జైపూర్, భీమారం తదితర ప్రాంతాల నుంచి తరలిస్తే రూ.22వేల వరకు చెల్లించాల్సి వస్తోంది. దీంతో రవాణా భారం రైతులకు తడిసి మోపెడవుతోంది. మద్దతు ధర కరువు.. రోజు రోజుకు మార్కెట్లో నిత్యావసర వస్తువులు, పండ్ల ధరలు ఆకాశాన్నంటుతుండగా.. మామిడి కాయలు పండించే రైతులకు మాత్రం మద్దతు ధర కరువవుతోంది. ఏయేటికాయేడు గిట్టుబాటు ధర లేక విలవిలలాడుతున్నారు. ఈయేడు తొలుత బంగినపల్లి మామిడి పండ్లకు టన్నుకు రూ.25 వేల నుంచి రూ.30 వేలు, దశేరికి రూ.35 వేల నుంచి రూ.40 వేలు మద్దతు ధర చెల్లించి రైతులను వ్యాపారులు ఊరించారు. మద్దతు ధర లభిస్తోందని ఆశపడిన రైతులు ఒక్కసారిగా మామిడికాయలు, పండ్లను మార్కెట్లో ముంచెత్తగా ఆకాశంలో ఉన్న ధరను పాతాళానికి దించారు. ప్రస్తుతం బంగెనపల్లి మామిడికాయలు టన్నుకు రూ.13 వేల నుంచి రూ.16 వేల వరకు, దశేరి టన్నుకు రూ.25 వేల నుంచి రూ.28 వేల వరకు ధర పలుకుతోంది. ఇతర రసాల పండ్లను టన్నుకు రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు చెల్లిస్తున్నారు. ప్రస్తుతం చెల్లిస్తున్న మద్దతు ధర కూలీల ఖర్చు, ట్రాన్స్పోర్టు చార్జీలు, రైతుల శ్రమను తీసివేస్తే ఏ మాత్రం గిట్టుబాటు కాని పరిస్థితులు నెలకొన్నాయి. ఏటా ఇదే పరిస్థితి ఎదురవుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. చేయూత కరువు.. మామిడి రైతులకు మార్కెట్ సదుపాయం కల్పించి కష్టాలు తొలగించడంలో ప్రభుత్వ యంత్రాంగం, పాలకులు తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారు. మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఏ ఒక్కనాడూ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. మార్కెట్ సౌకర్యం కోసం చేసిన ప్రతిపాదనలను ఇప్పటికైనా కార్యారూపం దాల్చేలా చర్యలు తీసుకుని మద్దతు ధర దక్కేలా చూడాలని రైతులు కోరుతున్నారు. -
డంప్ కలకలం
బెల్లంపల్లి, న్యూస్లైన్ : మావోయిస్టులకు చెందిన మరో డంప్ శనివారం పోలీసులకు లభ్యమైంది. డంప్లోని మారణాయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన తూర్పు జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. బెల్లంపల్లి పోలీసు సబ్ డివిజన్ పరిధిలోని కాసిపేట మండలం వెంకటాపూర్ గ్రామ శివారు అటవీ ప్రాంతంలో లభ్యమైన డంప్లో భారీగా మారణాయుధాలు, పేలుడు పదార్థాలు ఉన్నాయి. చెరువు పైభాగంలోని భూగర్భంలో ఆరు గ్రేనెడ్లు, నాలుగు టిఫిన్ బాంబులు, నాలుగు ఎస్బీఎంఎల్ తుపాకులు, ఆరు ఎస్బీబీఎల్ బ్యారెల్స్, పాయింట్ 38 రివాల్వర్, ఏడు లైవ్రౌండ్స్, నాలుగు పాయింట్ త్రినాట్త్రీ రైఫిల్స్ మ్యాగ్జిన్స్, మూడు మ్యాగ్జిన్ బాక్సులు, 23 ఎలక్ట్రిక్ డిటోనేటర్స్, నాలుగు స్ప్రింగ్స్, ఐదు పిన్బోల్ట్స్, తొమ్మిది టీ టైప్ పిన్బోల్ట్స్ దాచి ఉంచారు. కొన్నేళ్ల క్రితం దాచడంతో ప్రస్తుతం అవి పూర్తిగా తప్పుపట్టి పనికి రాకుండా తయారయ్యాయి. మావోయిస్టుల కదలికలు ఏమాత్రం లేకపోయినా పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచడంతో డంప్ లభ్యమైంది. 2013 జనవరి నెలలోనూ బెల్లంపల్లి పోలీసులు మావోయిస్టుల డంప్ను కనిపెట్టారు. బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి-మందమర్రి మండలం మామిడిగట్టు గ్రామాల మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో పక్కా సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్ నిర్వహించి డంప్ను కనుగొన్నారు. చెట్ల పొదల్లో గోతులు తవ్వి పెద్ద సైజ్ స్టీల్ డబ్బాల్లో దాచిపెట్టిన సుమారు 1600 జిలెటిన్స్ట్రిక్స్, డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. 2013 జనవరి 29న బెజ్జూర్ మండలం ప్రాణహిత సరిహద్దు అటవీ ప్రాంతంలో పోలీసులు ఐదుగురు మావోయిస్టు కొరియర్లు, సానుభూతిపరులను అరెస్ట్ చేశారు. సరిహద్దు ప్రాంతంలో ప్రత్యేక పోలీసు బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా అటవీ ప్రాంతంలోని మురళిగూడ వద్ద ఎనుముల వెంకటి(అగర్గూడ), మడె శంకర్, తలండి గణపతి(లోహ), ఎ.రమేశ్రెడ్డి(మంగెనపల్లి), ఎ.రోషిరెడ్డి(రాజారాం) అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని సోదాచేశారు. వీరి వద్ద 8 ఎంఎం రౌండ్స్ 44, 22 జిలెటిన్ స్టిక్స్, ఏడు డిటోనేటర్లు లభించాయి. మావోయిస్టు జిల్లా కార్యదర్శి మైలారపు అడెళ్లు ఉరఫ్ భాస్కర్ను సరిహద్దు అటవీ ప్రాంతంలో కలిసి తిరిగి వస్తుండగా ఐదుగురు పోలీసులకు చిక్కారు. అదే ఏడాది మే 12న తిర్యాణి మండలం పంగిడి మాదారం పంచాయతీ పరిధి లొద్దిగూడ అటవీ ప్రాంతంలో మరో డంప్ను పోలీసులు కనుగొన్నారు. ఆ డంప్లో పోలీసులకు పెద్ద మొత్తంలో విద్యుత్ వైర్ల బెండల్స్, ఆలీవ్గ్రీన్ దుస్తులు, మందులు, 303, 9ఎంఎం రౌండ్స్ 200లకుపైగా లభించాయి. అప్రమత్తతతోనే.. మావోయిస్టుల కదలికలు జిల్లాలో అంతగాలేకపోయిన పోలీసు బలగాలు మాత్రం నిత్యం అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా తూర్పు ప్రాంతంలో మావోయిస్టులు పట్టు సాధించకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. బెల్లంపల్లి నియోజకవర్గంలోని వేమనపల్లి మండలం ప్రాణహిత నదీ తీరం వెంట గస్తీని ముమ్మరం చేసి సరిహద్దు ప్రాంతం నుంచి మావోయిస్టులు జిల్లాలో చొరబడకుండా నిరంతరం పహారా కాస్తున్నారు. మావోయిస్టుల అలికిడి ఏమాత్రం వినిపించిన పోలీసు బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహించి శాంతిభద్రతలకు భంగం కలగకుండా వ్యవహరిస్తున్నారు. దీంతోపాటు ఎప్పటికప్పుడు ఇన్ఫార్మర్ వ్యవస్థను అప్రమత్తం చేయడంతో డంప్లు స్వాధీనం అవుతున్నాయి. మావోల డంప్లు ఎన్నో ఉన్నాయి : ఎస్పీ జిల్లా సేఫ్జోన్గా భావించి మావోయిస్టులు అటవీ ప్రాంతంలో ఇబ్బడిముబ్బడిగా డంప్లు దాచిపెట్టారని జిల్లా ఎస్పీ గజరావుభూపాల్ తెలిపారు. శనివారం బెల్లంపల్లిలోని అడిషనల్ ఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మావోయిస్టుల డంప్లు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయని తెలిపారు. ఎన్నో ఏళ్ల క్రితం మావోయిస్టులు డంప్ దాచారని అన్నారు. జిల్లాలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల్లో మావోయిస్టులు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారని పేర్కొన్నారు. అడపాదడపా ఆర్గనైజేషన్ చేయడానికి మావోయిస్టులు ప్రయత్నాలు చేస్తున్నా ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నామని అన్నారు. రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడిన ప్రతిసారి జిల్లాలో రావడానికి మావోయిస్టులు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. మావోయిస్టులకు జిల్లాలో చొరబడే అవకాశం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తెలంగాణలో రాబోయే ప్రభుత్వం కూడా మావోయిస్టుల పట్ల కఠినంగానే వ్యవహరిస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ భాస్కర్భూషణ్, మందమర్రి సీఐ విజయ్కుమార్, దేవాపూర్ ఎస్సై జె.సురేశ్ పాల్గొన్నారు. -
‘నోటా’కు ఓటర్ల స్పందన
బెల్లంపల్లి, న్యూస్లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా ప్రవేశపెట్టిన నోటా ఓటుకు ఓటర్ల నుంచి విశేష స్పందన లభించింది. ఓటర్లు పెద్ద సంఖ్యలో నోటా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన పలువురు అభ్యర్థుల పట్ల ఓటర్లు విముఖత చూపారు. బెల్లంపల్లి అసెంబ్లీ ఎన్నికల్లో 21 మంది అభ్యర్థులు పోటీ చేశారు. పోలింగ్కు మూడు రోజుల ముందు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి పోటీ నుంచి అర్ధంతరంగా వైదొలిగి కాంగ్రెస్-సీపీఐ ఉమ్మడి అభ్యర్థికి మద్దతు తెలిపారు. దీంతో 20 మంది అభ్యర్థుల మధ్యనే పోటీ జరిగింది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు నచ్చకపోతే నోటా ఓటును వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు పెద్ద ఎత్తున ప్రచారం సాగించింది. ఎన్నికల సంఘం చేసిన ప్రచారానికి తొలి ప్రయత్నంలోనే అనూ హ్య స్పందన లభించింది. నియోజకవర్గ వ్యాప్తంగా 1,60,960 మంది ఓటర్లు ఉండగా 1,19,442 మంది ఓటర్లు ఓటు వేశారు. ఇందులో టీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య 73,779 ఓట్లతో విజయం సాధించగా సమీప ప్రత్యర్థి సీపీఐ-కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి గుండా మల్లేశ్కు 21,251 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి పాటి సుభద్రకు 9,167 ఓట్లతో తృతీయ స్థానంలో నిలిచారు. మిగతా స్వతంత్ర అభ్యర్థులు కేవలం 3 వేల లోపు ఓట్లు పొంది చతికిల పడ్డారు. ఎన్నికల్లో పోటీ చేసిన ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోవడంతో 769 మంది ఓటర్లు నోటా ఓటు వేశారు. తొలి ప్రయత్నంలోనే ఓటర్లు నోటా ఓటును సద్వినియోగం చేసుకున్నారు. ఓటర్ల విలక్షణ తీర్పు నియోజకవర్గంలో ఈ దఫా ఓటర్లు విలక్షణ తీర్పు ఇచ్చారు. తొలి పర్యాయం మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. బెల్లంపల్లి మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికలో ఓటర్లు హంగుకు అవకాశం కల్పించారు. కాంగ్రెస్ అభ్యర్థులను 14 వార్డుల్లో గెలిపించగా, టీఆర్ఎస్ అభ్యర్థులు 10 వార్డుల్లో, 5 వార్డుల్లో టీడీపీ, 2 వార్డుల్లో సీపీఐ అభ్యర్థులు, 03 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులను గెలిపించారు. సంపూర్ణ మెజార్టీ ఏ రాాజకీయ పార్టీకి కట్టబెట్టలేదు. దీంతో హంగ్ ఏర్పడింది. స్వతంత్ర, సీపీఐ అభ్యర్థుల మద్దతుతో మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని దక్కించుకోవడానికి కాంగ్రెస్ యత్నాలు చేస్తోంది. రెండో దఫా జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటర్లు మార్పును కోరుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన టీఆర్ఎస్ అభ్యర్థులు విజయానికి దోహదపడ్డారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 47 ఎంపీటీసీ స్థానాలకు గాను 26 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించగా 20 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థిని ఓటర్లు గెలిపించారు. 6 జెడ్పీటీసీ స్థానాలకు గాను బెల్లంపల్లి, వేమనపల్లి మండలాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు పట్టం కట్టిన ఓటర్లు, తాండూర్, నెన్నెల, భీమిని, కాసిపేట మండలాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు విజయం చేకూర్చిపెట్టారు. ఈ రకంగా ఓటర్లు ఎన్నికల్లో అనూహ్యమైన తీర్పు ఇచ్చి పరిశీలకుల అంచనాను తారుమారు చేశారు. తమదైన శైలిలో తీర్పు ఇచ్చి రాజకీయ విశ్లేషకులను అయోమయానికి గురి చేశారు. -
బొగ్గు దందాలో అధికారుల అరెస్టు
బెల్లంపల్లి, న్యూస్లైన్ : బెల్లంపల్లి ఏరియాలో జరిగిన బొగ్గు కుంభకోణంలో ఇద్దరు సింగరేణి ఉన్నతాధికారులపై వేటు పడింది. ఏరియాలోని డోర్లి-2 ఓపెన్కాస్ట్ ప్రాజెక్టు మేనేజర్ బి.వెంకటేశ్వర్రావు, ఏరియా కోల్బ్రాంచి మేనేజర్ శేషసాయిబాబాను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు నిందితులను మంచిర్యాలలోని బెల్లంపల్లి ఇన్చార్జి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చినట్లు బెల్లంపల్లి డీఎస్పీ కె.ఈశ్వర్రావు తెలిపారు. బొగ్గు అక్రమ దందాలో ఇంత వరకు 24 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో బొగ్గు టిప్పర్ల యజమానులు, మధ్యవర్తులు, దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ కమర్షియల్ మేనేజర్ అవదేశ్కుమార్సింగ్, మహారాష్ట్రలోని వాయునందన పవర్ప్లాంట్ ము ఖ్య అధికారి ఉన్నారు. బొగ్గు అక్రమ రవాణాలో సింగరేణి అధికారుల ప్రమేయం ఉన్న వైనాన్ని కూడా ‘సాక్షి’ తేటతెల్లం చేసింది. సింగరేణి అధికారులు నిర్దోషులేనా? అనే శీర్షికతో వార్తా కథనాన్ని ప్రచురించింది. అప్పటి వరకు సింగరేణి అధికారులపై ఎలాంటి విచారణ జరపని పోలీసులు ఆలస్యంగానైనా ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. చివరికి బొగ్గు అక్రమ రవాణా జరగడానికి సింగరేణి అధికారుల నిర్లక్ష్యం ఉన్నట్లు పోలీసుల విచారణలో స్పష్టమైంది. దీంతో డోర్లి-2 ఓసీ మేనేజర్, కోల్బ్రాంచి మేనేజర్లను అరెస్ట్ చేసి కోర్టుకు పంపించారు. బొగ్గు అక్రమ రవాణా దందాలో ఇద్దరు సింగరేణి ఏరియా అధికారులు అరెస్ట్ కావడం కోల్బెల్ట్లో కలకలం రేపింది. సర్వత్రా చర్చనీయాంశమైంది. వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ ఏరియాలో తప్పుడు వే బిల్లులు, నకిలీ స్టాంపులు సృష్టించి డోర్లి-2 ఓపెన్కాస్ట్ నుంచి టిప్పర్ల యజమానులు భారీ ఎత్తున బొగ్గు అక్రమ రవాణా చేశారు. ఈ వైనాన్ని ‘సాక్షి’ దినపత్రికలో 2013 డిసెంబర్ 27న ‘బొగ్గు దొంగలు’, ఈ ఏడాది జనవరి 7వ తేదీన ‘ఆగని దందా’ శీర్షికలతో వెలుగులోకి తెచ్చింది. ‘సాక్షి’లో వచ్చిన కథనాలతో సింగరేణి యాజమాన్యం ఒక్కసారిగా తేరుకొని జరిగిన బొగ్గు అక్రమ రవాణా దందాపై విచారణ జరిపి వాస్తవమేనని నిర్ధారించింది. ఈ మేరకు జనవరి 19వ తేదీన ఏరియా ఎస్అండ్పీసీ జూనియర్ ఇన్స్పెక్టర్ వి. రాజయ్య తిర్యాణి పోలీస్స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కోట్లాది రూపాయల బొగ్గు కుంభకోణం కేసును బెల్లంపల్లి అదనపు ఎస్పీ భాస్కర్భూషణ్, డీఎస్పీ ఈశ్వర్రావు ప్రతిష్టాత్మకంగా తీసుకొని దర్యాప్తు సాగించారు. ఈ దర్యాప్తులో ఎన్నో విషయాలు వెలుగుచూశాయి. బొగ్గు టిప్పర్ల యజమానులను అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు ఆ తర్వాత క్రమక్రమంగా నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు పంపించారు. నిందితుల నుంచి రూ.70 లక్షల నగదు, 19 బొగ్గు టిప్పర్లు, ఒక ఇండికా కారు, 3.50 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు రికవరీ చేశారు. తప్పుడు మార్గాన బొగ్గు కొనుగోలు చేసిన దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం సింగరేణికి రూ.4.36 కోట్లు పరిహారం అందించింది. వాయునందన పవర్ప్లాంట్ యాజమాన్యం రూ.89 లక్షలు చెల్లించింది. మంచిర్యాలకు చెందిన ముగ్గురు బడా కోల్ట్రాన్స్పోర్టు యజమానులు కొన్నాళ్లు అజ్ఞాతవాసం ఉండి ఆతర్వాత హైకోర్టులో ముందస్తు బేయిల్ తీసుకున్నారు. వీరిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ రకంగా పోలీసులు వేగవంతంగా దర్యాప్తు చేసి బొగ్గు అక్రమ దందా చేధించారు. -
టీఆర్ఎస్లో అంతర్యుద్ధం
బెల్లంపల్లి, న్యూస్లైన్ : టీఆర్ఎస్ బెల్లంపల్లిశాఖలో ముసలం పుట్టింది. మున్సిపల్ ఎన్నికలతో అంతర్లీనంగా పొడచూపిన విభేదాలు సార్వత్రిక ఎన్నికలతో బహిర్గతమయ్యాయి. ఈసారి జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బల్దియాలోని 29 వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరికి పోటీగా పలు వార్డుల్లో రెబల్స్ బరిలో నిలిచారు. వీరిని కట్టడి చేయకుండా తమను ఓడించాలనే ఉద్దేశంతోనే రెబల్స్ను పోటీకి దింపినట్లు రెండు వర్గాల నాయకులు ఎవరికి వారు అపోహపడ్డారు. ఆరోపణలు చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో ముఖ్య నేతలు వార్డుల్లో ప్రచారం చేయలేదు. సమష్టిగా ఎన్నికలను ఎదుర్కోవడంలో, కార్యకర్తలను సమాయత్తపర్చడంలో ముఖ్య నేతలు విఫలమయ్యారు. పెపైచ్చు తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన కార్యకర్తలకు టికెట్ ఇవ్వకుండా ఓ ముఖ్య నేత అమ్ముకున్నట్లు ఓ వర్గం నాయకుడు ఆరోపిస్తుండగా.. రెబల్ అభ్యర్థులను పోటీకి నిలిపి అధికారిక అభ్యర్థులను ఓడించడానికి ప్రత్యర్థి వర్గం నాయకుడు కుట్ర పన్నాడని మరో వర్గం నాయకుడు ఆరోపణలు గుప్పిస్తున్నాడు. అసెంబ్లీ ఎన్నికల్లో.. మున్సిపల్ ఎన్నికల నాటికి నేతల మధ్య గుట్టుగా ఉన్న వైరుధ్యాలు సార్వత్రిక ఎన్నికలతో ఒక్కసారిగా గుప్పుమన్నాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇద్దరు ముఖ్య నాయకులు కార్యకర్తల సమక్షంలోనే గొడవ పడ్డారు. ఆ గొడవ చిలికిచిలికి గాలివానగా మారి తీవ్ర స్థాయికి చేరింది. ఎన్నికల్లో వచ్చిన నిధులు రూ.10 లక్షలు ఓ నేత స్వాహా చేసినట్లు ఆరోపిస్తుండగా.. మరో నేత ఇతర పార్టీల అభ్యర్థులకు ఓట్లు వేయించాడని ఒకరిపై మరొకరు దుమ్మేత్తిపోసుకున్నారు. ఇలా ఇరువురు నేతలు బహిరంగంగా ఆరోపణలు చేసుకోవడం టీఆర్ఎస్లో కలకలం రేపుతోంది. పట్టించుకోని అధిష్టానం టీఆర్ఎస్ ముఖ్య నేతల మధ్య ఏర్పడిన విభేదాలు పతాకస్థాయికి చేరుకున్నా అధిష్టానం మాత్రం పట్టించుకోవడంలేదు. నాయకుల మధ్య పొడచూపిన మనస్పర్ధలను పరిష్కరించి ఇద్దరి మధ్య సఖ్యత ఏర్పడేలా చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తోంది. ఇప్పటికే ముఖ్య నాయకులు, కార్యకర్తలు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఇరువురు నేతల మధ్య ఆధిపత్య పోరు నువ్వా, నేనా అనే రీతిలో సాగుతోంది. తెలంగాణ పునఃనిర్మాణంలో చిత్తశుద్ధితో కలిసికట్టుగా పనిచేయాల్సిన టీఆర్ఎస్ నేతలు వ్యక్తిగత విమర్శలతో పార్టీ పరువును బజారుకు ఈడ్చడంపై గులాబీ తమ్ముళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధిష్టానం స్పందించాలని కోరుతున్నారు.