ఆదిలాబాద్: అక్రమంగా తరలిస్తున్న 30 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా తాండూరు మండలంలోని రెంచిల్ రైల్వేస్టేషన్లో రేషన్ బియ్యం రవాణా అవుతోందన్న సమాచారంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా మహరాష్ట్రకు బియ్యాన్ని తరలిస్తున్నట్టు గుర్తించారు. నిందితులను అరెస్టు చేసి బియ్యాన్ని సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(బెల్లంపల్లి)