caught
-
మహారాష్ట్ర: రూ. 5 కోట్ల నగదు పట్టివేత
పూణె: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలయ్యింది. ఇంతలో పూణె సమీపంలో ఓ కారులో భారీగా నగదు పోలీసులకు పట్టుబడింది. ఖేడ్ శివ్పూర్ టోల్ ప్లాజా సమీపంలో ఓ వాహనంలో రూ. 5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ వాహనం ఎక్కడి నుంచి వచ్చింది? డబ్బులు ఎక్కడికి తరలిస్తున్నారనేదానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ఇన్నోవా వాహనంలో భారీగా డబ్బు తరలిస్తున్నట్లు సమాచారం అందిన వెంటనే పోలీసులు అప్రమత్తమై, ఖేడ్ శివపూర్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ నేపధ్యంలో ఒక ఇన్నోవా కారులో తనిఖీలు చేసినప్పుడు భారీగా నగదు బయటపడింది. విషయం తెలుసుకున్న ఆదాయపు పన్ను శాఖ ఉన్నతాధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు గంటల పాటు నోట్లను లెక్కించారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు.ఇది కూడా చదవండి: ‘చియోంగ్చియాన్’పై అధ్యయనం -
బహ్రాయిచ్లో పట్టుబడిన చిరుత
బహ్రాయిచ్: ఉత్తరప్రదేశ్లోని బహ్రాయిచ్ జిల్లాలో జనాలపై దాడి చేస్తున్న చిరుత ఎట్టకేలకు పట్టుబడింది. దానిని అటవీశాఖ అధికారులు బోనులో బంధించారు. ఆ చిరుత ఒక బాలికతో పాటు వృద్ధురాలిపై కూడా దాడి చేసింది. చిరుత పట్టుబడటంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.దీనికిముందు గత సోమవారం అటవీశాఖ అధికారులు ఒక చిరుతను పట్టుకున్నారు. ఇప్పుడు రెండో చిరుతపులిని పట్టుకున్నారు. కతర్నియాఘాట్ అటవీ ప్రాంత పరిధిలోని పలు గ్రామాల్లో చిరుతలు భీభత్సం సృష్టిస్తున్నాయి. ఐదు రోజుల క్రితం ఒక చిరుత 13 ఏళ్ల బాలికపై దాడి చేసి గాయపరిచింది. ఇదేవిధంగా 80 ఏళ్ల రెహమానా ఇంట్లోకి చొరబడి ఆమెపై దాడి చేసింది. ఆ చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు గ్రామ సమీపంలోని చెరుకు తోటలో బోనును ఏర్పాటు చేశారు. కొద్దిసేపటికి చిరుత ఆ బోనులో చిక్కింది. పోలీస్ స్టేషన్ హెడ్ హరీష్ సింగ్, రేంజర్ రోహిత్ యాదవ్ సంఘటనా స్థలానికి చేరుకుని, చిరుతను ట్రాక్టర్ ట్రాలీలో ఎక్కించి, అటవీశాఖ రేంజ్ కార్యాలయానికి తరలించారు.ఇది కూడా చదవండి: బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ముగ్గురు మృతి -
నల్లా కనెక్షన్ కోసం లంచం.. మణికొండ జల మండలి మేనేజర్ అరెస్ట్
మణికొండ: మంచినీటి కనెక్షన్ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసి వసూలు చేసిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగితో పాటు జలమండలి మేనేజర్ను అవినీతి నిరోధక శాఖ( ఏసీబీ) అధికారులు అరెస్టు చేశారు. మణికొండ జలమండలి డివిజన్–18లో మేనేజర్గా పనిచేస్తున్న స్ఫూర్తి రెడ్డితో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్గౌడ్ను వలపన్ని పట్టుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని వేంకటేశ్వర కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఉపేంద్రనాథ్రెడ్డి ఇచి్చన ఫిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో అధికారుల బృందం దాడులు చేసి వారిని అరెస్టు చేశారు. తన అపార్ట్మెంట్కు రెండు నీటి కనెక్షన్లకు ఆన్లైన్లో ధరఖాస్తు చేసి నెలలు గడుస్తున్నా పట్టించుకోకపోవటంతో ఉపేంద్రనాథ్రెడ్డి జలమండలి కార్యాలయానికి వచ్చి మేనేజర్ స్ఫూర్తిరెడ్డిని కలిశాడు. ఆమె సమాధానం చెప్పకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్గౌడ్ను కలవాలని సూచించింది. అతన్ని కలవగా ఒక్కో కనెక్షన్కు రూ.15 వేల చొప్పున రూ.30 వేలు ఇస్తే మీ పని అయిపోతుందని సలహా ఇచ్చారు. దాంతో అతను ఏసీబీని ఆశ్రయించి మంగళవారం వారి సూచన మేరకు మణికొండ మర్రిచెట్టు సర్కిల్లో ఉన్న జలమండలి కార్యాలయం వద్ద నవీన్గౌడ్కు డబ్బులు ఇవ్వగానే ఏసీబీ అధికారులు అతన్ని అరెస్టు చేశారు. విచారణలో మేనేజర్ ఆదేశం మేరకే డబ్బు తీసుకున్నానని పేర్కొనటంతో ఆమెను కూడా అరెస్టు చేశారు. వసూలు చేసిన మొత్తంలో మేనేజర్తో పాటు డీజీఎం, జీఎంలకు వాటా ఇవ్వాల్సి ఉందని ఏసీబీ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో నవీన్గౌడ్ అంగీకరించాడు. దాంతో ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. దాడులలో ఏసీబీ సీఐలు ఆజాద్, జగన్మోహన్రెడ్డి, నవీన్లతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. -
ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ : రెడ్ హ్యాండెడ్గా దొరికిన డెలివరీ బోయ్, వైరల్ వీడియో
అసలే వర్షాకాలం.. ఆపైన నక నకలాడే ఆకలి. ఉందిగా ఆన్లైన్ ఫుడ్ అంటూ ఆర్డర్ చేసుకొని తినేయడం చాలామందికి అలవాటు. అలాగే నోయిడాకు చెందిన ఒక వ్యాపారవేత్త ఓలా ఫుడ్స్ నుండి భోజనాన్ని ఆర్డర్ చేశాడు. కానీ అతని ఆకలి తీరలేదు సరికదా కడుపు రగిలిపోయే చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్టోరీ నెట్టిజనుల ఆగ్రహానికి గురవుతోంది. విషయం ఏమిటంటే... వ్యాపారవేత్త అమన్ బీరేంద్ర జైస్వాల్ ఓలా ఫుడ్స్ ఆన్లైన్లో ఆర్డర్ చేశాడు. డెలివరీ ఏజెంట్ ఫోన్ చేసి అదనంగా పది రూపాయిలివ్వాలని డిమాండ్ చేశాడు.దీనికి తొలుత నిరాకరించిన జైస్వాల్ ఆ తరువాత సరే అన్నాడు. ఆసగా ఫుడ్ కోసం ఎదురు చూస్తున్నాడు. అలా 45 నిమిషాలు గడిచిపోయాయి. ఇంకా ఫుడ్ డెలివరీ కాలేదుగానీ తన ఫుడ్ను ఎంచక్కా లాగించేస్తున్న దృశ్యాన్ని షాక్ అయ్యాడు. అంతేకాదు హాన్ తో కర్తే రహో జో కర్నా హై" (ఏం చేసుకుంటావో చేస్కో) అన్న అతగాడి సమాధానం విని మరింత దిగ్భ్రాంతికి లోనయ్యాడు. తన ఫుడ్ ఎందుకు తిన్నారని ప్రశ్నించగా మరి ఏం చేయాలి అంటూ ఉదాసీనంగా సమాధానం చెప్పాడు. మోటార్సైకిల్పై కూర్చుని డెలివరీ డ్రైవర్లు కస్టమర్ల ఫుడ్ను భోంజేస్తున్న రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని, ఆ వీడియోను జైస్వాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. View this post on Instagram A post shared by Aman Birendra Jaiswal (@amanbjaiswal)దీనిపై చాలామంది ఎక్స్ యూజర్లు స్పందించారు. తమకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డర్ ప్లేస్ అవుతుంది. డెలివరీ బోయ్ జాడ ఉండదు. కాల్కి సమాధానం ఉండదు. ఓలా ఫుడ్స్కి ఫిర్యాదు లేదా పరిష్కార వ్యవస్థ లేదని తరువాత తెలిసిందే. చివరికి ఫుడ్ కేన్సిల్ అయింది అంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు ఒక యూజర్. ఈ ప్లాట్పాంలో సీవోడీ(క్యాష్ అన్ డెలివరీ) అప్షన్లేదని మరొకరు ఆరోపించారు. రెండు సార్లు ఓటీపీ షేర్ చేయకుండానే ఫుడ్ డెలివరీ అయిందని వచ్చింది. రెండు సార్లు ఇలా జరిగిందని, ఓలాలోనే ఇలా జరగుతుందని ఒకరు, ఓలాలో మాత్రమే కాదు, స్విగ్గీలో కూడా ఇంతే అని మరొక వినియోగదారు తన గోడు వెళ్లబోసుకోవడం గమనార్హం. ఈ ఉదంతంపై ఓలా ఫుడ్ ఇంకా స్పందించలేదు. -
ముప్పై ఏళ్ల తర్వాత పోలీసులకు చిక్కిన నిందితుడు
ముంబై: ముప్పై ఏళ్ల క్రితం నాటి ముంబయి అల్లర్ల కేసులో పరారీలో ఉన్న ఓ నిందితుడు ఇప్పుడు మళ్లీ చిక్కాడు. అతడు గుట్టుచప్పుడు కాకుండా ఇంటికి వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. 1993లో ముంబయిలో అలర్లు చెలరేగాయి. అల్లర్ల సమయంలో చట్టవిరుద్ధంగా మనుషులను పోగు చేసిన కేసుతోపాటు ఓ హత్యలో సయ్యద్ నాదిర్ షా అబ్బాస్ ఖాన్ (65) అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.అనంతరం అతడు బెయిల్పై విడుదలయ్యాడు. బెయిల్పై విడుదలైనప్పటి నుంచి కనిపించకుండా పోయి పరారీలో ఉన్నాడు. దీంతో కోర్టు అతడిని చట్టపరంగా పరారీలో ఉన్న నిందితుడిగా ప్రకటించి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. సెంట్రల్ ముంబయి సేవ్రీలోని నిందితుడి ఇంటికి పోలీసులు అనేకసార్లు వెళ్లినా అతడు ఎక్కడున్నాడో కనుక్కోలేకపోయారు. చివరకు బంధువుల ఫోన్ల రికార్డులను పరిశీలించగా ఆచూకీ లభ్యమైంది. జూన్ 29న అతడు తన ఇంటికి వెళ్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు వలపన్ని అతడిని అరెస్టు చేశారు. 1993 కేసులో నిందితుడిని తాజాగా మళ్లీ అరెస్టు చేశామని, కేసులో తదుపరి విచారణ కొనసాగుతుందనియ పోలీసులు తెలిపారు -
నంద్యాల: బోనుకి చిక్కిన మ్యాన్-ఈటర్ చిరుత!
కర్నూలు, సాక్షి: ఒక మనిషి చంపి.. పచ్చర్ల సమీప గ్రామ ప్రజలకు మూడు రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేసిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. కుక్క కోసం వచ్చి బోనులో చిరుత చిక్కుకుపోయింది. నంద్యాల జిల్లాలో గత మూడు నెలలుగా సంచరిస్తున్న చిరుత పులి కోసం ఫారెస్ట్ అధికారులు తీవ్రంగా గాలించారు. పలు చోట్ల బోన్లు ఏర్పాటు చేశారు. పచ్చర్ల టోల్ గేట్ సమీపంలో ఏర్పాటు చేసిన బోనులో కుక్కను ఎరగా వేయగా.. గత అర్ధరాత్రి చిరుత వచ్చి చిక్కుకుపోయింది. ఈ చిరుత మూడు రోజుల కిందట మెహరున్నీసాను చంపడంతో పాటు మరో ఇద్దరిపైనా దాడి చేసింది. చలమ దగ్గర రైల్వే కూలీల పైనా కూడా దాడి చేసినట్లు సమాచారం. దీంతో అధికారులు చిరుతను బంధించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. చివరికి.. చిరుతను బంధించడంతో పచర్ల వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ చిరుతను సురక్షిత ప్రాంతానికి తరలిస్తారా లేక తిరుపతి జూ కు తరలిస్తారా అనేది చూడాలి.మరోవైపు.. మహానంది సమీపంలో సంచరిస్తున్న చిరుతను పట్టుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మహానంది ఆలయ పరిసరాల్లో గత ఆరు రోజుల నుంచి ప్రతి రోజు తిరుగుతున్న మరో చిరుత.. భక్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుత సంచారిస్తుండటంతో మహనందిలో భారీగా భక్తుల రద్దీ తగ్గిపోయింది. -
పామును పట్టి, డబ్బాలో పెట్టి, నాలుగు రోజులకు తెరవగానే..
పామును చూడగానే చాలామంది భయపడిపోతుంటారు. మధ్యప్రదేశ్లోని బుందేల్ఖండ్లో పామును పట్టుకున్న తరువాత విచిత్ర పరిణామం చోటుచేసుకుంది. అది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. బుందేల్ఖండ్లోని మక్రోనియా పరిధిలోగల బెటాలియన్ ప్రాంతంలో పాములుపట్టే అఖిల్ బాబా ఇటీవల ఒక నాగు పామును పట్టుకున్నాడు. తరువాత దానిని ఒక పెట్టెలో బంధించాడు. నాలుగు రోజుల తరువాత ఆ పెట్టెను తెరచి చూసి, ఆశ్యర్యంతో నోరెళ్లబెట్టాడు. తన 30 ఏళ్ల అనుభవంలో తొలిసారిగా ఇలాంటి ఘటన జరిగిందని తెలిపాడు. తాను ఒక నాగు పామును పట్టుకుని పెట్టెలో బంధించి ఉంచానని, అయితే నాలుగు రోజుల తరువాత ఆ పెట్టెలో నుంచి ఏవో శబ్ధాలు రావడంతో తెరిచి చూసేసరికి ఆ పాముతో పాటు ఏకంగా 16 పాము గుడ్లు కనిపించాయని తెలిపాడు. వీటిని అటవీశాఖ అధికారులకు అప్పగిస్తానని అఖిల్ బాబా తెలిపారు.నాగుపాము అనేది పాము జాతులలో ప్రమాదకరమైనదిగా పరిగణిస్తారు. ఇది భారతదేశంతో సహా అనేక దేశాలలో కనిపిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆడ నాగుపాము ఒకేసారి 10 నుండి 30 గుడ్లు పెడుతుంది. వాటి నుంచి 45 నుండి 70 రోజులలో పాము పిల్లలు బయటకు వస్తాయి. -
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
సాక్షి,హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో పోలీసులు భారీగా బంగారం, వెండి జ్యువెల్లరీని పట్టుకున్నారు. శుక్రవారం(మే3)న పోలీసులు విమానాశ్రయం సమీపంలో తనిఖీలు చేస్తుండగా ఓ కారులో 34 కిలోల బంగారం, 40 కిలోల వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి.సరైన పత్రాలు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆభరణాలను ముంబై నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నట్లు గుర్తించారు. -
మాదాపూర్ పీఎస్పై ఏసీబీ దాడులు.. పట్టుబడ్డ ఎస్సై
సాక్షి,హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్లో శనివారం(ఏప్రిల్ 6) ఏసీబీ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఎస్సై రంజిత్, రైటర్ విక్రమ్ ఏసీబీ పోలీసులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. వీరిద్దరిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ పోలీసులు లంచం వ్యవహారంపై విచారిస్తున్నారు. మాదాపూర్ పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బంది అవినీతి వ్యవహారంపై రెండు రోజులుగా ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు. ఇందులో భాగంగా ఎస్సై, రైటర్ అవినీతి వ్యవహారం బయటపడింది. ఇదీ చదవండి.. కేబుల్ బ్రిడ్జిపై హిట్ అండ్ రన్ -
రాయదుర్గం కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్
సాక్షి, నంద్యాల/హైదరాబాద్: రాయదుర్గం కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. కిడ్నాపర్లతో చేతులు కలిపిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సురేందర్ సోదరి సహకారంతో కిడ్నాప్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. సమస్య పరిష్కారానికి సురేందర్ని రాయదుర్గం పిలిపించిన సోదరి.. కిడ్నాపర్లకు అప్పగించింది. సురేందర్ను బలవంతంగా కారులో ఎక్కించుకున్న కిడ్నాపర్లు.. నల్లమల వైపు తీసుకెళ్లారు. గతంలోనూ ఇదే తరహా కిడ్నాప్కి పాల్పడి డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. సురేందర్ను కిడ్నాప్ చేసి పెద్ద మొత్తంలో కిడ్నాపర్లు డబ్బులు డిమాండ్ చేశారు. సాప్ట్వేర్ ఇంజనీర్ను కిడ్నాప్ చేసి నల్లమల అడవులకు తరలిస్తున్నారని సమాచారం రావడంతో కారును కర్నూలు జిల్లా ఆత్మకూరులో ఫారెస్ట్ సిబ్బంది ఆపి తనిఖీ చేయగా, కారు,బాధితుని వదిలేసి కిడ్నాపర్లు పారిపోయారు. ఒక కిడ్నాపర్ను ఫారెస్ట్ సిబ్బంది పట్టుకున్నారు. రాయదుర్గం పోలీసులకు పారెస్ట్ అధికారులు సమాచారం ఇవ్వడంతో సురేందర్ను క్షేమంగా హైదరాబాద్కు తీసుకొచ్చారు. మరో ఇద్దరు కిడ్నాపర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కిడ్నాప్ కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కిడ్నాప్ స్పాట్కు సురేంద్ను తరలించిన పోలీసులు.. సోదరి పాత్రపై వివరాలు సేకరిస్తున్నారు. సురేందర్ నుంచి ఆరు గంటల పాటు వివరాలు సేకరించారు. నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. భారీగా డబ్బులు వసూలు చేయడానికే కిడ్నాప్ స్కెచ్ వేసినట్లు సమాచారం. ఇదీ చదవండి: రేణుశ్రీ ఆత్మహత్యకు ముందు ఎవరితో ఫోన్లో మాట్లాడింది.. -
హైదరాబాద్: పోలీసులకు చిక్కిన వెరైటీ దొంగ
సాక్షి, హైదరాబాద్: ఓయూ పోలీసులకు ఓ వెరైటీ దొంగ చిక్కాడు. ఆ ఇంట్లో ఎంత దొంగతనం చేశాడో చీటీ కూడా రాసి పెడతాడు శంకర్ నాయక్.. అలాగే డైరీలో ఏ రోజు ఎవరి ఇంట్లో దొంగతనం చేశాడో కూడా రాసుకుంటాడు. ఇలా ఎందుకు చేస్తాడు అనుకుంటారా? పోలీసులకు తనపై తప్పుడు ఫిర్యాదు ఇవ్వకుండా ఇలా చేస్తాడని ఓయూ పోలీసులు తెలిపారు. దొంగిలించబడ్డ సొమ్ముతో ముత్తూట్ గోల్డ్ లోన్లో తాకట్టు పెట్టి హోటల్స్లో విలాసవంతమైన జీవితం గడుపుతూ, మిగిలిన ఆ డబ్బుతో మళ్లీ దొంగతనం చేయడానికి ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసి, ఆ బండ్లపై దొంగతనం చేసే వెరైటీ దొంగ ఈ శంకర్ నాయక్. మహబూబ్నగర్కి చెందిన దొంగ శంకర్ నాయక్ గతంలో మేడిపల్లి పోలీస్ స్టేషన్లో పీడీ యాక్ట్ కేసు నమోదైంది. అయినా దొంగ బుద్ది మారలేదు, హబ్సిగూడ పరిధిలో మూడు దొంగతనాలు చేయడం దొంగిలించిన సొమ్ము ఎంత అనేది ఆ ఇంట్లో చీటీ రాసి మరి వెళతాడు. ఇప్పటివరకు 94 దొంగతనాలు చేసిన శంకర్ నాయక్ చివరికి ఓయూ పోలీసులకు చిక్కి మళ్లీ రిమాండ్ అయ్యాడు. అయితే రిమాండ్ చేసిన శంకర్ నాయక్ నుంచి 20 తులాల బంగారం, 2 బైక్స్, 3 మొబైల్ ఫోన్లు, డైరీ, చోరీకి ఉపయోగించిన వస్తువులు ఓయూ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదీ చదవండి: బ్రేకప్ చెప్పాడని మాజీ ప్రియుడిపై కక్షతో -
HYD: ఆరు కార్లలో రూ. 6.5 కోట్ల పట్టివేత
సాక్షి, హైదరాబాద్: నగర శివార్లలో శనివారం భారీ నగదు పోలీసులకు పట్టుబడింది. ఆధారాల్లేకుండా తరలిస్తున్న రూ. 6.5 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు అప్పా జంక్షన్ వద్ద ఆరు కార్లలో ఈ నగదు తరలిస్తుండగా పోలీసులు తనిఖీలు చేసి స్వాధీనం చేసుకున్నారు. అయితే.. పట్టుబడ్డ ఈ నగదు ఖమ్మం జిల్లా నుంచి తొలిసారి పోటీ చేస్తున్న ఓ నాయకుడికి చెందినదిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవలె ఐటీ దాడులు ఎదుర్కొన్న నేత అయ్యి ఉండొచ్చని భావిస్తున్నారు. మరోవైపు ఈ తనిఖీలపై పోలీసుల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
Viral Video: కూతురి గదిలోకి దూరిన బాయ్ఫ్రెండ్.. ఏం చేశారంటే?
Viral Video: బాయ్ఫ్రెండ్ను ఇంటికి పిలిచి ఎంజాయ్ చేస్తుండగా తన తల్లిదండ్రులు ఒక్కసారిగా రావడంతో బిత్తరపోయిన ఓ యువతి ప్రియుడిని బాల్కనీ నుండి పారిపొమ్మని సలహా ఇచ్చింది. దాంతో గాల్లో తాడు పట్టుకుని వేలాడుతూ కిందకు దిగుతున్న ఆ ప్రియుడిని పట్టుకుని ఆమె తల్లి చీపురు తిరగేసి చితక్కొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతొంది. ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ హల్చల్ చేస్తోంది. దొంగచాటుగా తన గర్ల్ఫ్రెండ్ గదిలోకి దూరిన ఓ యువకుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు తన గర్ల్ఫ్రెండ్ మాత్రం తనని కాపాడేందుకు ప్రయత్నించి అతడి బట్టలను బాల్కనీ నుండి కిందకు విసిరేసింది. ఎలాగోలా తాడుని పట్టుకుని కిందకు జారుతున్న అతడిని కింది అంతస్తులో గర్ల్ఫ్రెండ్ తల్లి ఒక చీపురు పట్టుకుని చితక్కొట్టేసింది. ఈ వీడియోకు సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. అప్లోడ్ చేసిన గంటల్లోనే మిలియన్ల వీక్షణలు వచ్చాయి. వీడియో చూస్తే ఎవ్వరికైనా ఒళ్ళు గగుర్పొడుస్తుంది. పాపం ప్రియుడు ఏ మాత్రం పట్టు తప్పినా అతడు కింద పడే లోపే ప్రాణాలు గాల్లోకి పోవడం ఖాయం. Every pleasure in life has a price pic.twitter.com/rtHwfFNjtr — Enezator (@Enezator) August 10, 2023 ఇది కూడా చదవండి: రష్యాలో భారీ పేలుడు.. 12 మంది మృతి -
డబ్ల్యూడబ్ల్యూఈ స్టైల్లో ఫైటింగ్.. పొట్టుపొట్టు కొట్టుకున్నారు..!
అమెరికాలోని అలబామాలోని రివర్ ఫ్రంట్ పార్క్లో దారుణం జరిగింది. కొందరు యువకులు ఓ సెక్యూరిటీ గార్డ్పై పిడిగుద్దులు కురిపించారు. ఓ బోటును పక్కకు జరపమని సెక్యూరిటీ గార్డ్ అడిగిన నేపథ్యంలో ఆయన అభ్యర్థనను తిరస్కరించిన కొందరు యువకులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. Yo this is wild 😭 A group of white men attacked a black security guard after the security asked them to move their pontoon boat so the big Harriot can dock. They refused to & attacked the security guard. A group of black men seen & went defend him by beating the white men 💯🙌🏾 pic.twitter.com/Qzo3U3Kq1r — Shannonnn sharpes Burner (PARODY Account) (@shannonsharpeee) August 6, 2023 యువకులు దాడి చేసిన వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారింది. మొదట ఓ యువకుడు సెక్యూరిటీ గార్డ్పై దాడి చేశాడు. అనంతరం అతనికి మద్దతుగా వచ్చిన మరికొందరు పిడిగుద్దులు కురిపించారు. విచక్షణా రహితంగా ఆయనపై దాడి చేశారు. చొక్కాలు విప్పుకుని ఒకరిపై మరొకరు దాడికి తెగబడ్డారు. డబ్ల్యడబ్ల్యూఈ స్థాయిలో కుర్చీలతో చొక్కాలు విప్పుకుని పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఇందులో మహిళలు కూడా పాలు పంచుకున్నారు. ఘర్షణలో కొందరిని నదిలో నెట్టేశారు. ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఇదీ చదవండి: ఆ భారీ షాపింగ్ మాల్లో కనిపించని క్యాషియర్.. మరి పేమెంట్ ఎలాగంటే.. -
చికెన్ షాపులో కొండచిలువ.. షాకైన యజమాని.. తర్వాత ఏం జరిగిందంటే?
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: రోజు అడవిలో ఎలుకలు, ఉడతలు తిని తిని బోర్ కొట్టిందో ఏమో ఒక కొండచిలువ చికెన్ షాప్లో దూరింది. చక్కగా అత్తారింటికి వచ్చిన అల్లుడిలా దర్జాలు వలకబోసి బాగా బలిసిన బ్రాయిలర్ కోళ్లను చూసి తన పంట పండిందనుకుంది. చక్కగా ఓ రెండు కోళ్లను గుటుక్కున మింగి సేదతీరింది. తెల్లారే వచ్చి చూసిన చికెన్ షాపు యజమానికి కొత్త అల్లుడిలా కోళ్ల ఫామ్ లో కొండచిలువు కనిపించింది. వెంటనే ఫారెస్ట్ వారికి సమాచారం ఇవ్వగా వచ్చిన సిబ్బంది తిన్న కోళ్లు కక్కించి బుద్ధిగా ఉండమని మళ్లీ అడవికి పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం వినాయకపురంలో జరిగింది ఘటన. చదవండి: Telangana: నేడు, రేపు వర్షాలు -
19 అడుగుల పైథాన్తో యువకుని పోరాటం.. ఎట్టకేలకు..
అమెరికాలో భారీ పైథాన్ను ఓ యువకుడు పట్టుకున్నాడు. ఇది దాదాపు 19 అడుగుల పొడవు ఉంది. 56.6 కేజీల బరువు ఉంది. ఫ్లోరిడాలో ఓహియో యూనివర్శిటీకి చెందిన ఓ యువకుడు(22) దీన్ని సాహసంతో పట్టుకున్నాడు. అనంతరం అటవీ అధికారులకు అప్పగించారు. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా.. తెగ వైరల్గా మారింది. యువకులు రోడ్డుపై వెళుతుండగా.. ఓ పెద్ద పైథాన్ వారిని అడ్డగించింది. భయపడిన యువకులు కాసేపు తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇక లాభం లేకపోవడంతో ఓ యువకుడు దాన్ని పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇంతలోనే అతని స్నేహితులు కూడా సహాయం చేయగా.. అందరూ కలిసి దాన్ని పట్టుకున్నారు. పైథాన్ను పట్టుకునే క్రమంలో ఆ యువకుడు పెద్ద యుద్దమే చేశాడు. కిందపడినప్పటికీ దాని తలను మాత్రం వదలకుండా గట్టిగా పట్టుకున్నాడు. View this post on Instagram A post shared by Glades Boys Python Adventures (@gladesboys) దక్షిణ ఫ్లోరిడాలో పైథాన్లు ఎక్కువగా ఉంటాయని అటవీ అధికారులు తెలిపారు. 2020 అక్టోబర్లో 18 అడుగులు ఉన్న అత్యంత పెద్దదైనా బర్మీస్ పైథాన్ వెలుగులోకి వచ్చిందని వెల్లడించారు. ఆ తర్వాత ఇదే అత్యంత పెద్ద పైథాన్గా గుర్తించారు. రాత్రి సమయాల్లో సాధారణంగా రోడ్డుపైకి వస్తుంటాయని పేర్కొన్నారు. ఇదీ చదవండి: లైకులు, కామెంట్ల కోసం చావు వార్తని సోషల్ మీడియాలో.. ఇప్పుడిది అవసరమా? -
శంషాబాద్: అండర్వేర్లో బంగారం పట్టివేత
సాక్షి, క్రైమ్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా అక్రమ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అండర్వేర్లో బంగారం తరలిస్తుండగా.. ఆ ముఠాను అధికారులు పట్టేసుకున్నారు. దాదాపు రూ. కోటి 37లక్షలు విలువ చేసే.. 2.279 కిలోలు బంగారం సీజ్ చేశారు అధికారులు. అలాగే.. లక్షకుపైగా విదేశీ సిగిరెట్లు స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. మొదటి బంగారం కేసు.. 1196 గ్రాముల బంగారం 72 లక్షల బంగారాన్ని ఎయిర్ క్రాఫ్ట్ సీట్ వద్ద పేస్టు రూపంలో అమర్చి తీసుకొని హైదరాబాద్ వచ్చిన రసల్ కైమా ప్రయాణికుడి వద్ద స్వాధీనం చేసుకున్నారు. రెండో కేసులో 752 గ్రాముల బంగారాన్ని కట్ పీస్ గోల్డ్ బార్ గా పెట్టుకొని కువైట్ వయా దుబాయ్ మీదిగా హైదరాబాద్ వస్తూ పట్టుపడ్డాడు విలువ 45 లక్షలు. మూడో కేసులో 331 గ్రాముల స్మగ్ల్డ్ గోల్డ్ విలువ 20 లక్షలు ప్రయాణికుడు షార్జా వయా దుబాయ్ నుండి వస్తూ పట్టుబడ్డాడు మరో కేసులో 1,10,000 సిగరెట్ ప్యాక్స్ ని ముగ్గురు ప్రయాణికులు కంబోడియా బ్యాంకాక్ నుండి వస్తు పట్టుబడిన ముగ్గురు వద్ద విదేశీ సిగరెట్లు. ఇదీ చదవండి: బండ్లగూడ కారు ప్రమాదం.. పోలీసులే షాకయ్యారు -
తిరుమల: బోనులో చిక్కిన చిరుత
సాక్షి, తిరుపతి: తిరుమలలో బోనులో చిరుత పులి చిక్కింది. మొన్న అలిపిరి మార్గంలో మూడేళ్ల బాలుడిపై దాడి చేసిన చిరుతే ఇది. 7వ మైలురాయి వద్ద ఇది బోనులో పడింది. కేవలం ఒక్కరోజులోనే చిరుతను బంధించారు అధికారులు. నిన్న సాయంత్రం చిరుతను బంధించేందుకు రెండు బోన్లను ఏర్పాటు చేశారు అధికారులు. 150 ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు సైతం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నిన్న రాత్రి(శుక్రవారం, జూన్ 23) 10.45 గంటల ప్రాంతంలో చిరుత బోనులో పడినట్లు తెలుస్తోంది. డీఎఫ్వో ఏమన్నారంటే.. బాలుడిపై దాడి చేసిన ఒక్కరోజులోనే చిరుతను బంధించాం. తల్లి, పిల్ల చిరుతలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ చిరుతను ఇంకా వేటాడడం పూర్తిగా అలవాటు కాలేదు అని డీఎఫ్వో తెలియజేశారు. చిన్నారి కౌశిక్ను పరామర్శిస్తున్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. పక్కన చికిత్స అందిస్తున్న వైద్యుడు తిరుమల నడక మార్గంలోని 7వ మైలు వద్ద ఓ చిరుత పులి బాలుడిపై దాడి చేసింది. తన తాతతో కలిసి అక్కడే ఉన్న దుకాణంలో తినుబండారాలు కొనుక్కుంటున్న సమయంలో హఠాత్తుగా వచ్చిన చిరుత బాలుడి మెడ పట్టుకుని ఎత్తుకెళ్లింది. వెంటనే స్పందించిన అక్కడి దుకాణదారుడు, తల్లిదండ్రులు, భద్రతా సిబ్బంది కేకలు పెడుతూ చిరుత వెనుక పరుగులు తీశారు. టార్చ్లు వేస్తూ, రాళ్లు విసరడంతో 7వ మైలు కంట్రోల్ రూం వద్ద చిరుత బాలుడిని వదిలేసి అడవిలోకి వెళ్ళిపోయింది. చిరుత దాడి నుంచి బాబును అక్కడి భద్రతా సిబ్బంది రక్షించారు. గాయాల పాలైన బాలుడిని మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని శ్రీపద్మావతి చిన్నపిల్లల ఆస్పత్రికి తరలించారు. బాలుడి చెవి వెనుక, మరికొన్ని ప్రాంతాల్లో చిరుత దంతపు గాయాలయ్యాయి. అయితే ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. గాయపడిన బాలుడు కర్నూలు జిల్లా ఆదోని వాసి కౌషిక్(3)గా గుర్తించారు. దాడి గురించి తెలియగానే.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి బాలుడిని పరామర్శించారు. బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. చిరుత దాడి చేసిన మెట్ల మార్గంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటునట్టు తెలిపారు. ఇకపై నడక మార్గంలో భక్తులను గుంపులు గుంపులుగా పంపుతామన్నారు. భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ఇదీ చదవండి: గోవధ నివారణకు ఏం చర్యలు తీసుకుంటున్నారు? -
నిందితుడి అతితెలివి: పోలీసులకు చిక్కుకుండా కొరియన్లా సర్జరీ! కానీ..
ఇటీవలకాలంలో పలు నేరస్తులు పోలీసులకు పట్టబడకుండా ఉండేందుకు చేసే పనులు విస్మయానికి గురి చేస్తున్నాయి. అతి తెలివితో పేరు, వేషంతో సహా కొందరూ సర్జరీలతో ముఖ మార్పిడికి సిద్ధపడిపోతున్నారు. అయినప్పటికీ వారు చేసిన నేరాలే వారిని చివరికి పట్టించేస్తున్నాయి. ఎన్ని వేషాలు వేసినా.. చివరికీ కటకటాలపాలు కాక తప్పట్లేదు. వివరాల్లోకెళ్తే..థాయ్ డ్రగ్ డీలర్ పోలీసులకు చిక్కకూడదని పలు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నాడు. ఐతే అతను చేసిన ఆ ప్రయత్నాలేమి ఫలించకపోగా..అతడు పోలీసులకు పట్టుబడక తప్పలేదు. సహరత్ సవాంగ్జాంగ్ అనే వ్యక్తి కొరియన్లా సర్జరీ చేయించుకుని సియోంగ జిమిన్గా పేరు మార్చుకుని అసలు గుర్తింపు దాచే యత్నం చేశాడు. ఐతే అతను డ్రగ్స్ను ఇతరలకు కొనుగోలు చేయడం కారణంగా అతన్ని సులభంగా ట్రాక్ చేశారు పోలీసులు. దీంతో బ్యాంకాక్లోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న సవాంగ్జాంగ్ని పోలీసులు అందుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అంతేగాదు దర్యాప్తులో సాక్ష్యులు అతన్ని అందమైన కొరియన్గా అభివర్ణించారు. ఐతే అతను క్లాస్ వన్ డ్రగ్ అయిన ఎక్స్టసీ(ఎండీఎంఏ)ని దిగుమతి చేస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అతను పట్టబడటానికి ముందు గతంలో మూడుసార్లు అరెస్టు అయ్యాడు కూడా. గానీ ఏదోరకంగా నిర్బంధం నుంచి తప్పించుకునే వాడని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు పోలీసు మేజర్-జనరల్ థీరదేజ్ తమ్మసూటీ మాట్లాడుతూ.. సవాంగ్జాంగ్ కేవలం 25 ఏళ్ల వయసులో పేరుమోసిన డ్రగ్ డీలర్గా మారాడని, ఇలాంటి వాళ్లు విదేశాల్లో ఎక్కువగా ఉంటున్నట్లు తెలిపారు. దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేస్తామని తెలిపారు. కాగా, ఇటీవల థాయ్ ప్రభుత్వం మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణ తదితరాలపై కొరడా ఝళిపిస్తోంది. (చదవండి: అమెరికా ఏమి ప్రపంచ ఏటీఎం కాదు! మరోసారి పాక్పై విరుచుకపడ్డ నిక్కీ) -
భయపెట్టి.. హతమార్చి.. చివరికిలా..
సాక్షి,చంద్రాపూర్: ఇరు రాష్ట్రాలను వణికించిన, అధికారులను ముప్పు తిప్పలు పెట్టిన మ్యాన్ ఈటర్.. ఎట్టకేలకు చిక్కింది. తెలంగాణ-మహరాష్ట్ర బార్డర్లో మనుషులనే లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడింది ఈ పులి. దీని బారిన పడి ఇద్దరు మృత్యువాత చెందారు. అయితే.. భారీగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన ఫారెస్ట్ అధికారులు చివరికి బ్రహ్మపురి అటవీ ప్రాంతంలో ఆ పులిని పట్టేసుకున్నారు. చంద్రపూర్ బ్రహ్మపురి తాలూకాలోని టోర్గావ్ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. దానిని ట్రేస్ చేసేందుకు అధికారులు తీవ్రంగా యత్నించారు. ఈ లోపు కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరిని హతమార్చింది అది. నాగ్భిడ్ తాలూకాలోని టేక్రి షెట్శివార్లో డిసెంబర్ 30న ఒక మహిళపై దాడి చేసి చంపింది. ఆ వెంటనే 31 డిసెంబర్ 2022న బ్రహ్మపురి తాలూకాలోని టోర్గావ్ భుజ్ షెట్శివార్లో నివసించే మరో మహిళను దాడి చేసి చంపింది. ఈ ఘటనల నేపథ్యంలో బ్రహ్మపురి అటవీశాఖ ప్రాంతంలో అధికారులు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయితే టోర్గావ్ వ్యవసాయ శివారులో మహిళను చంపిన ఘటనా స్థలంలో మళ్లీ పులి కనిపించింది. చంద్రాపూర్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ లొంకర్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, దీపేష్ మల్హోత్రా మార్గదర్శకత్వంలో బ్రహ్మపురి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సబ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, షూటర్ బి.ఎమ్. వంకర్ తదితరులు పులిపై మత్తు ఇంజక్షన్ ప్రయోగించారు. అనంతరం బంధించి పులిని జూకు తరలించారు. ఈ పరిణామం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. -
సంగారెడ్డి : చిరుత చిక్కింది
-
Viral Video: సముద్రంలో చేపను ఒడిసి పట్టుకున్న గ్రద్ద..
-
మహిళపై మంత్రి చేతివాటం ... తర్వాత పాదాలను తాకి...
బెంగళూరు: ఒక మంత్రి తీవ్ర అసహనంతో బహిరంగంగా ఒక మహిళ చెంప చెళ్లుమనిపించారు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఏం జరిగిందంటే....కర్ణాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి శాఖ మంత్రి వి సోమన్న చామరాజనగర్ జిల్లా హంగల గ్రామంలో సుమారు 175 మందికి భూ పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. ఆ కార్యక్రమంలో ఒక మహిళ తనకు భూమి పట్టా రాలేదన్న కోపంతో ఆయన మీదకు వచ్చింది. దీంతో సదరు మంత్రి ఆ మహిళ చెంప చెళ్లుమనిపించారు. ఐతే ఆ మహిళ తర్వాత సదరు మంత్రి పాదాలను తాకి మరీ ఆశీర్వాదం తీసుకుంది. తదనంతరం ఆ మంత్రి కూడా సదరు మహిళకు క్షమాపణాలు చెప్పారు. వాస్తవానికి మంత్రిగారు ఆ కార్యక్రమానికి చాలా ఆలస్యంగా చేరుకున్నారు. మరోవైపు ఆమెకు భూమి పట్టా అందకపోవడం, వారందర్నీ ఎదురుచూసేలా చేయడం తదతర కారణాల రీత్యా ఆయన ఇలాంటి సంఘటనను ఎదుర్కోవల్సి వచ్చింది. అచ్చం అలానే ఇటీవల ఒక జనతాదళ్(సెక్యులర్) నాయకుడు శ్రీనివాస్ కళాశాల ప్రిన్సిపాల్పై ఇలానే చేతివాటం చూపి కెమెరాకు చిక్కిన సంగతి తెలిసింది. (చదవండి: రాజీవ్ గాంధీ ఫౌండేషన్ లైసెన్స్ రద్దు) -
సినిమా రేంజ్లో బైక్ చోరీ.. హీరో అనిపించుకున్న సెక్యూరిటీ గార్డ్!
ఇద్దరు దొంగలు సినిమా రేంజ్కు బైక్ దొంగతనానికి పాల్పడ్డారు. కానీ, ఇంతలో గేట్ వద్ద కాపలాగా ఉన్న సెక్యూరిటీ గార్డ్ సమయస్పూర్తితో వారికి ఊహించిన షాక్ తగిలింది. దెబ్బకు పట్టపగలే దొంగలకు చుక్కలు కనిపించాయి. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకోగా.. వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల ప్రకారం.. సౌత్ఢిల్లీలోని ఎవరెస్ట్ అపార్ట్మెంట్లోకి తాము మున్సిపల్ అధికారులమని చెప్పుకుంటూ ఇద్దరు వ్యక్తులు వెళ్లారు. తర్వాత వారి కదలికలు అనుమానంగా ఉండటంతో సెక్యూరిటీ గార్డ్ గమనిస్తూనే ఉన్నాడు. కాగా, మధ్యాహ్నం సమయంలో అపార్ట్మెంట్లోపలికి బైక్పై ఓ కొరియర్ డెలివరీ బాయ్ వచ్చాడు. అయితే, ఓ డెలివరీ ఏజెంట్ తన బైక్ తాళాలను ఆ వాహనానికే ఉంచి వెళ్లాడు. బైక్ను గమనించిన ఇద్దరు వ్యక్తులు బైక్ను తీసుకొని పారిపోయేందుకు యత్నించారు. బైక్ను స్టార్ట్ చేయడం గమనించిన డెలివరీ బాయ్.. గట్టిగా కేకలు వేయడంతో గేట్ వద్ద కాపలాగా ఉన్న సెక్యూరిటీ గార్డ్ అలర్ట్ అయ్యాడు. ఫాస్ట్గా దూసుకొస్తున్న బైక్ను ఆపేందుకు సూపర్ ప్లాన్ చేశాడు. ఒక్కసారిగా గేటు మూసివేయడంతో బైక్ ఆ గేటు మధ్యలో ఇరుక్కుపోయింది. దీంతో, వారిద్దరూ గేటు వద్దే పడిపోయారు. అనంతరం, స్థానికులు వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా ఒకరు పారిపోయారు. మరొకరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Caught On CCTV: Bike Thieves Try To Speed Through Colony Gate In Delhi https://t.co/0k6GJ1LTbU pic.twitter.com/rC6rQKmn1U — NDTV (@ndtv) September 27, 2022 -
ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేస్తూ పట్టుబడ్డ ప్రభుత్వ వైద్యుడు
-
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తొగుట ఎమ్మార్వో కృష్ణమోహన్
-
వైరల్ వీడియో: మరో యువతితో కాపురం.. భర్తను చితక్కొట్టిన మొదటి భార్య
సూర్యాపేట జిల్లా : ఇద్దరు పిల్లలు, భార్యను వదిలేసి మరో యవతితో కాపురం పెట్టాడో భర్త. కుటుంబాన్ని వదిలేసి రహస్యంగా ప్రియురాలితో ఉంటున్న భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది మొదటి భార్య ప్రియాంక. సూర్యాపేటలో ఈ ఘటన వెలుగు చూసింది. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్న భానుప్రకాశ్ భార్య పిల్లలను వదిలేసి మరో యువతితో కాపురం వేరుగా ఉంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మొదటి భార్య ప్రియాంక.. తన కుటుంబ సభ్యులతో కలిసి భర్త, అతని ప్రయురాలిని చితకొట్టింది. తన వివాదం కోర్టులో నడుస్తుండగా.. రహస్యంగా వివాహం చేసుకొని కాపురం పెట్టాడని మొదటిభార్య ఆరోపించింది. అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరువురిని స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టారు. -
మరో యువతితో కాపురం పెట్టిన భర్తను చితకొట్టిన మొదటి భార్య
-
బాలాజీ నాయుడు మళ్లీ చిక్కాడు!
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ పథకాల పేరు చెప్పి ప్రజాప్రతినిధులకే టోకరా వేసే ఘరానా మోసగాడు తోట బాలాజీ నాయుడు మరోసారి చిక్కాడు. ఈసారి ఏపీలోని తిరుపతి ఎంపీ గురుమూర్తితో పాటు తెలంగాణలోని కొందరు ప్రజాప్రతినిధులకు ఎర వేశాడు. ఇప్పటి వరకు 30 మంది ఎంపీ, ఎమ్మెల్యేలకు టోకరా వేసిన ఇతగాడిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని 30 పోలీసుస్టేషన్లలో ఇతడిపై 33 కేసులు ఉండగా..22 సార్లు జైలుకు వెళ్ళివచ్చాడు. తొలిసారిగా ఓ అనుచరుడిని ఏర్పాటు చేసుకుని నేరం చేశాడు. వీరిద్దరినీ హైదరాబాద్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. బీటెక్ చదివి... ఏసీబీకి చిక్కి.. ♦ తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడికి చెందిన తోట బాలాజీ నాయుడు కాకినాడలోని జేఎన్టీయూ నుంచి బీటెక్ పూర్తి చేశాడు. 2003లో ఎన్టీపీసీలో జూనియర్ ఇంజనీర్గా చేరి రామగుండం, పాల్వంచ, విశాఖపట్నంల్లో పని చేశాడు. వైజాగ్లో విధులు నిర్వర్తిస్తుండగా 2008లో అప్పటి తణుకు ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు ఆనంద్ నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా చిక్కాడు. ఈ కేసు కోర్టులో నిరూపితం కావడంతో ఉద్యోగం కోల్పోయాడు. విశాఖ జైలులో ఉండగా పాత నేరగాళ్లతో ఏర్పడిన పరిచయం ప్రభావంతో బయటకు వచ్చినప్పటి నుంచి మోసాలు చేయడమే వృత్తిగా మార్చుకుని విజృంభించాడు. ఉద్యోగాలు, పథకాల పేర్లు చెప్పి... ♦ఇతగాడు వివిధ మార్గాల్లో ప్రజా ప్రతినిధులు, వారి పీఏల ఫోన్ నెంబర్లు సంగ్రహిస్తాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పథకాలు, సంస్థల్లో ఉద్యోగాలంటూ ఎర వేస్తాడు. వారి నియోజకవర్గాలకు చెందిన అర్హులను ఎంపిక చేయాల్సిందిగా కోరి..ప్రాథమికంగా డిపాజిట్ చెల్లించాలంటూ బ్యాంకు ఖాతాల్లో డబ్బు వేయించుకుని మోసం చేస్తాడు. గతంలో వి.హనుమంతరావు, దేవేందర్ గౌడ్, పాల్వాయి గోవర్థన్, ఆకుల లలిత, రాంజగదీష్.. ఇలా అనేక మంది నుంచి సైతం బాలాజీ నాయుడు డబ్బు గుంజాడు. మనోహర్, లక్ష్మణ్, మల్లేష్ పేర్లతోనూ చెలామణి అయ్యే ఇతగాడు జైల్లో ఉండగా అభిషేక్ అనే యువకుడితో పరిచయమైంది. ఎల్బీనగర్ ఠాణా పరిధిలో ఓ అత్యాచారం కేసులో ఇతడు జైలుకు వెళ్లాడు. ఇటీవలే బయటకు వచ్చిన వీరిద్దరూ ముఠాగా ఏర్పడ్డారు. ఖాదీ కమిషన్ పేరుతో ఎంపీకి... ♦అభిషేక్తో కలిసి రంగంలోకి దిగిన బాలాజీ నాయుడు ఇటీవల తిరుపతి ఎంపీ గురుమూర్తికి ఫోన్ చేశాడు. ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మాట్లాడుతున్నట్లు చెప్పి... కేంద్రం ఆధీనంలోని ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ నుంచి ఆయన నియోజకవర్గానికి రూ.5 కోట్లు మంజూరయ్యాయని చెప్పాడు. ఈ మొత్తాన్ని పంపిణీ చేయడానికి 20 మంది అర్హులైన వారికి ఎంపిక చేయమని కోరాడు. చలాన్ చార్జీల కోసం ఒక్కో లబ్దిదారుడి పేరుతో రూ.1.25 లక్షలు చెల్లించాలంటూ ఓ బ్యాంకు ఖాతా వివరాలు అందించాడు. అనుమానం వచ్చిన గురుమూర్తి సీఎంఓలో ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. దీంతో ఆయన అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. బాలాజీ ఇదే పంథాలో ఇక్కడి ఎమ్మెల్సీలకు కాల్స్ చేశాడు. వీరి వ్యవహారంపై సమాచారం అందుకున్న హైదరాబాద్ పోలీసుల వలపన్ని ఇద్దరినీ పట్టుకున్నారు. -
Uppada: మత్స్యకారుల వలకు ‘బాహుబలి’
కాకినాడ రూరల్(తూర్పుగోదావరి): బంగాళాఖాతం సముద్ర జలాల్లో తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడకు చెందిన మత్స్యకారుల వలకు బాహుబలి చేప చిక్కింది. కంబాల టేకుగా పిలిచే ఈ చేప సుమారు 2 మీటర్ల పొడవు, 4 మీటర్ల మేర వెడల్పు ఉంది. బరువు సుమారు 300 కేజీలు. దీనిని అతి కష్టంపై బోటు నుంచి క్రేన్తో ఆటో పైకి ఎక్కించి, కాకినాడకు తరలించారు. అర డజను మంది మత్స్యకారులు తాళ్ల సాయంతో కిందకు దింపి విక్రయించగా వెంకన్న అనే వ్యాపారి రూ.16,500కు కొనుగోలు చేశాడు. చదవండి: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు -
మహిళ కళ్లల్లో కారం చల్లి..
-
51 కేసులు, నేరాలు చేయడంలో దిట్ట.. ఏడేళ్లుగా అజ్ఞాతంలో.. చివరికి..
సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని మూడు కమిషనరేట్ల పోలీసులకు మోస్ట్ వాంటెడ్గా ఉన్న ఘరానా రౌడీషీటర్ మహ్మద్ అష్వఖ్ను దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇతడిపై 51 కేసులు ఉండటంతో విచారణ తప్పించుకోవడానికి 2014 నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మి ఆదివారం తెలిపారు. కాలాపత్తర్ ప్రాంతానికి చెందిన అష్వఖ్ 2000 సంవత్సరం నుంచి నేరాలు చేస్తున్నాడు. గ్యాంగ్స్టర్ అయూబ్ ఖాన్ను అనుచరుడిగా వ్యవహరించాడు. కాలాపత్తర్, ఫలక్నుమ, రెయిన్బజార్, శాలిబండ, సంతోష్నగర్, అంబర్పేట్, రాజేంద్రనగర్, పహాడీషరీఫ్ల్లో ఇతడిపై కేసులు ఉన్నాయి. దీంతో 2005లో ఇతడిపై కాలాపత్తర్ పోలీసులు రౌడీషీట్ తెరిచారు. దాడి, హత్యాయత్నం, దొంగతనం, దోపిడీలతో పాటు తుపాకులతో బెదిరించిన ఆరోపణలపై 51 కేసులు నమోదయ్యాయి. పహాడీషరీఫ్ ప్రాంతంలో తన అనుచరులతో కలిసి 2014లో ఓ వ్యక్తిని తుపాకీతో బెదిరించి డబ్బు వసూలు చేయడానికి ప్రయత్నించాడు. ఈ కేసులో అనుచరులు అంతా అరెస్టు కాగా... అష్వఖ్ మాత్రం గుజరాత్ పారిపోయాడు. అక్కడి ఉండీ కాలాపత్తర్లో ఇద్దరిని బెదిరించడంతో రెండు కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఇతడిపై ఉన్న కేసుల విచారణను తప్పించుకోవడానికి కోర్టుకు గైర్హాజరయ్యాడు. దీంతో వివిధ కేసులకు సంబంధించిన 16 నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. ఇలా మోస్ట్ వాంటెడ్గా మారిన అష్వఖ్ను పట్టుకోవడానికి సౌత్జోన్ టాస్క్ఫోర్స్ రంగంలోకి దిగింది. ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్సైలు వి.నరేందర్, ఎన్.శ్రీశైలం, మహ్మద్ థకియుద్దీన్, కె.చంద్రమోహన్ తమ బృందాలతో నిఘా ఉంచారు. గుజరాత్ నుంచి రాజస్థాన్కు మకాం మార్చిన ఇతగాడు రహస్యంగా నగరానికి వచ్చిపోతున్నాడనే సమాచారం అందడంతో నెల రోజులుగా కాపుకాశారు. ఆదివారం సిటీకి వచ్చిన అష్వఖ్ను పట్టుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం కాలాపత్తర్ పోలీసులకు అప్పగించామని చక్రవర్తి తెలిపారు. చదవండి: కట్నం డబ్బుతో వరుడు పరార్.. ఇంకెవరూ తనలా మోసపోకూడదని ఏం చేసిందంటే! -
ఇలాంటి చేపను ఎప్పుడైనా చూశారా..?
బైరెడ్డిపల్లె (చిత్తూరు జిల్లా): బంగారు వర్ణంలో నిగనిగా మెరిసే చేప చిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గం, బైరెడ్డిపల్లె మండలంలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మండలంలోని లక్కనపల్లె చెరువుకు వస్తోన్న వరదనీటికి చేపలు ఎదురీదుతుండగా స్థానికులు గుర్తించి వలవిసిరారు. అందులో 7 కిలోల బరువున్న బంగారు తీగ జాతికి చెందిన చేప చిక్కింది. ఇది పేరుకు తగ్గట్టు బంగారు వర్ణంలో ఉండడంతో స్థానికులు ఆసక్తిగా గమనించారు. ఇవీ చదవండి: రుషికొండ తీరంలో డాల్ఫిన్ల సందడి ఆధిపత్య పోరు: ‘టీడీపీ’లో ‘పిల్లి’ మొగ్గలు -
రమ్య హత్య కేసు: హెడ్ కానిస్టేబుల్ ధైర్య సాహసాలు
ముప్పాళ్ళ: జిల్లాలో సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడైన శశికృష్ణను పట్టుకోవటంలో హెడ్ కానిస్టేబుల్ చాకచక్యం ప్రదర్శించారు. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటున్నారు. హత్యానంతరం పరారైన నిందితుడు నరసరావుపేట మండలం ములకలూరు గ్రామ సమీపంలో ఉన్నట్టుగా ఫోన్ సిగ్నల్ ద్వారా గుర్తించిన పోలీసు ఉన్నతాధికారులు ముప్పాళ్ల, నరసరావుపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. ముప్పాళ్లలో స్టేషన్ విధుల్లో ఉన్న హెడ్కానిస్టేబుల్ మహ్మద్రఫీ తన స్వగ్రామం కూడా పక్కనే ఉన్న పమిడిపాడు కావటంతో హుటాహుటిన నిందితుడిని పట్టుకునేందుకు బయలుదేరారు. చదవండి: గాంధీ ఆసుపత్రి అత్యాచార ఘటనలో ట్విస్ట్ ములకలూరు పొలాల్లో ఉన్నట్లుగా గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకునేందుకు యత్నించే క్రమంలో నిందితుడు తనవద్ద నున్న కత్తితో చేతిపైన, గొంతుపైన గాయపరుచుకొని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. హెడ్కానిస్టేబుల్ రఫీని కూడా కత్తితో బెదిరించాడు. అయినా రఫీ వెనుకడుగు వేయకుండా చాకచక్యంగా తోటి సిబ్బంది సాయంతో నిందితుడిని వెనుకవైపుగా వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన రఫీని ఇన్చార్జ్ డీఐజీ రాజశేఖర్, రూరల్ ఎస్పీ విశాల్గున్నీ, అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్, అదనపు ఎస్పీ రిశాంత్రెడ్డితో పాటు సత్తెనపల్లి డీఎస్పీ విజయభాస్కరరెడ్డి, రూరల్ సీఐ నరసింహారావు ఫోన్లో అభినందించారు. ఇది మా స్టేషన్కే గర్వకారణమని ఎస్సై ఎమ్.పట్టాభిరామయ్య ఆనందం వ్యక్తం చేశారు. ఇవీ చదవండి: హైదరాబాద్ నగర వాసులకు తీపి కబురు ఇడ్లీ, పూరీ అంటే ఇష్టం.. దోశ, వడ కూడా.. -
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తహసీల్దారు, డ్రైవర్ : విశాఖ
-
సినీ ఫక్కీలో దొంగల అరెస్ట్
-
ఇదో రకం చీటింగ్: కొనక ముందు పుత్తడి.. కొన్నాక ఇత్తడి
సాక్షి, సిటీబ్యూరో: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లకు చెందిన ముగ్గురితో ఏర్పడిన అంతరాష్ట్ర ముఠా ఇత్తడిని పుత్తడిగా నమ్మించి అంటగట్టడం మొదలెట్టింది. ట్రావెల్ ఏజెంట్లు, వ్యాపారుల విజిటింగ్ కార్డ్స్ ఆధారంగా వాళ్లకు ఫోన్లు చేసి ఎర వేస్తోంది. పాతబస్తీకి చెందిన ఓ ట్రావెల్ ఏజెంట్ నుంచి రూ.17 లక్షలు కాజేసింది. ఈ ముఠా కోసం రంగంలోకి దిగిన చాంద్రాయణగుట్ట పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. వీరి నుంచి రూ.15 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. హోటళ్లు, రెస్టారెంట్లు, ట్రావెల్ ఏజెంట్స్తో పరిచయం...తరువాత ► కర్ణాటక, ఏపీలోని సరిహద్దు ప్రాంతాలకు చెందిన శివయ్య (డ్రైవర్), తిరుపతయ్య (రైతు), బి.ఇంద్రాజు (డ్రైవర్) ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఈ ముగ్గురూ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటారు. ప్రధానంగా హోటళ్లు, రెస్టారెంట్లు, ట్రావెల్ ఏజెంట్స్తో పరిచయం ఏర్పరుచుకుని వారి నుంచి విజిటింగ్ కార్డ్స్ తీసుకుంటారు. ఆపై వారికి ఫోన్లు చేసి తమకు దొరికిన బంగారం తక్కువ ధరకు విక్రయిస్తామంటూ ఎర వేస్తారు. ► చాంద్రాయణగుట్ట పరిధిలోని రాజీవ్ గాంధీనగర్కు చెందిన విజయ్కుమార్ కేఎల్ఏ లాజిస్టిక్స్ అండ్ బస్ టిక్కెట్స్ పేరుతో ఓ సంస్థను నిర్వహిస్తున్నాడు. గత నెలలో ఈయన వద్దకు వచ్చిన ఈ త్రయం విమాన టిక్కెట్ బుక్ చేసుకున్నారు. ఆ తర్వాతి రోజు మరోసారి వచ్చి ఆ టిక్కెట్ కేన్సిల్ చేసుకున్నారు. అలా ఆయనతో పరిచయం పెంచుకుని విజిటింగ్ కార్డు తీసుకున్నారు. గత నెల 9న విజయ్కుమార్కు కాల్ చేసిన ఈ ముఠా సభ్యులు తమకు బంగారం దొరికిందన్నారు. ► మైసూర్ ప్రాంతంలో ఉన్న తమ పొలంలో తవ్వకాలు జరుపుతుండగా బంగారు ఆభరణాలతో కూడిన లంకె బిందెలు దొరికాయని, ఆ పసిడిని కేజీ రూ.17 లక్షలకు విక్రయించడానికి సిద్ధంగా ఉన్నామంటూ పేర్కొన్నారు. కావాలంటే మచ్చుకు కొంత ఇస్తామన్నారు.. ఇది జరిగిన నాలుగు రోజులకు బండ్లగూడ ప్రాంతంలో విజయకుమార్ను కలిసిన వాళ్లు ఇత్తడితో చేసి, పుత్తడి కోటింగ్ వేసిన ఆభరణం చూపించి నమ్మించారు. పథకం ప్రకారం ముందుగా వాటిలో ఉంచిన అసలు బంగారం ముక్కల్ని తీసి ఇచ్చారు. ► వీటిని బంగారం దుకాణానికి తీసుకువెళ్లిన విజయ్కుమార్ పరీక్ష చేయించారు. ఆ సందర్భంలో ఇది నిజమైన బంగారమే అని తేలడంతో ఆయన పూర్తిగా నమ్మారు. ఆపై రూ.17 లక్షలు ఆ ముగ్గురికీ చెల్లించి కేజీ ‘బంగారం’ ఖరీదు చేశారు. ► పది రోజుల తర్వాత కొత్తగా ఆభరణాలు చేయించుకోవడానికి వీటిని తీసుకుని బంగారం దుకాణానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో అది పుత్తడి కాదని, ఇత్తడని తేలడంతో తాను మోసపోయానని బాధితుడు గుర్తించాడు. ► దీంతో ఆయన చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కేఎన్ ప్రసాద్ వర్మ నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగి ముగ్గురు నిందితులను గుర్తించి వారి నుంచి రూ.15 లక్షలు రికవరీ చేశారు. ( చదవండి: శ్వేతను బతికించండి ) -
కలవరపెట్టిన ఆరడుగుల శ్వేతనాగు..
మామిడికుదురు: అతి ప్రమాదకరమైన ఆరడుగుల శ్వేతనాగు పెదపట్నంలంకలో స్థానికులను శుక్రవారం కలవరపాటుకు గురి చేసింది. స్థానికంగా కొమ్ముల శంకరం ఇంటిలోకి ఆ పాము రావడంతో స్థానికులు అప్పనపల్లికి చెందిన పాములు పట్టే యాళ్ల ప్రకాశరావును ఆశ్రయించారు. అతను వచ్చే సరికి పాము ఇంటి పెరట్లో ఉన్న కొబ్బరి డొక్కల రాశులోకి వెళ్లింది. ప్రకాశరావు దానిని అతి చాకచక్యంగా బంధించి ఊరి పొలిమేరలకు తీసుకువెళ్లి విడిచిపెట్టాడు. ఇది అరుదైన శ్వేతజాతికి చెందిన తాచుపామని ప్రకాశరావు చెప్పారు. దీని శరీరం తెలుపు రంగులో ఉంటుందని, ఇది చాలా ప్రమాదకరమైనదన్నారు. చదవండి: ఈ ఆవు దూడ ఎంత లక్కీ అంటే.. పెళ్లిరోజు.. అంతలోనే ఊహించని విషాదం -
ఆనియన్ టీతో రోగనిరోధక శక్తి
సాధారణంగా సీజనల్ వ్యాధులను నివారించుకోవడానికి మన ఇళ్లలోనే ఎన్నో చిట్కాలు ఉంటాయి. జలుబు, దగ్గు, తుమ్ములు వంటి సాధారణ వ్యాధులకు ఇంట్లోని పెద్దవాళ్లు వంటింటి వస్తువులతోనే చిటికెలో ఉపశమనం కలిగించే ఔషధాన్ని తయారు చేసి ఇస్తుంటారు. వీటి వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని వారు తరచూ చెబుతుంటారు. కానీ వాటిపై ఈ తరం వారు అంతగా నమ్మకం ఉంచరు. అయితే పెద్దలు చెప్పినట్లుగానే వంటింటి పదార్థాలలో తక్షణ ఉపశమనం పొందే ఎన్నో గుణాలు ఉన్నాయన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలంటున్నారు నిపుణులు. అందులో ఒకటి ఉల్లిపాయ టీ కూడా. ఉల్లిపాయలు వంటల్లో రుచిని ఇవ్వడమే కాక, మంచి ఆరోగ్యాన్నిచ్చే ఎన్నో లక్షణాలను ప్రేరేపిస్తుందట. అందుకే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే నానుడి కూడా ఉంది. అయితే ప్రస్తుతం చలికాలంలో చాలా మంది జలుబు, తగ్గు, గొంతునొప్పి, ముక్కు కారడం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారంతా తక్షణ ఉపశమనం కోసం ఈ ఉల్లిపాయ టీ తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఆనియన్ టీ రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రభావంతంగా పనిచేస్తుందని పరీశోధనలో కూడా వెల్లడైందట. అంతేగాక ఉల్లిపాయ విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలకు కూడా అమూల్యమైన వనరుగా నిపుణులు పేర్కొంటున్నారు. ఓ కప్పు టీని మీ రోజువారి ఆహారపు అలవాట్లలో చేర్చుకుని రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఈ టీని ఉల్లిపాయతో లేదా వాటి తొక్కలతో కూడా చేసుకోవచ్చు. ఉల్లిపాయ టీ: ఒక గ్లాసు నీరు మరిగించి అందులో తరిగిన ఉల్లిపాయ, 2-3 నల్ల మిరియాలు, 1 యాలుకతో పాటు సగం చెంచా సోపు గింజలను జోడించాలి. దీనిని 15-20 నిమిషాల పాటు మరగించి తర్వాత వడకట్టుకుని తాగాలి. ఉల్లిపాయ పీల్ టీ: టీ పొడి లేదా గ్రీన్ టీ ఆకులు వేసి నీటిని మరగించాలి, ఆ తర్వాత మరిగించిన నీటిని చిన్న ఉల్లిపాయ లేదా సగం ఉల్లిపాయ తొక్కలు తీసి ఉంచుకున్న కప్పులో పోయాలి. వేడి వేడి నీటిలో సుమారు 10 నిమిషాలు పాటు ఈ ఉల్లిపాయ తొక్కలు నానబెట్టాలి. ఆ తర్వాత ఈ నీటిని వడకట్టి తేనె, నిమ్మరసం కలుపుకుని తాగాలి. -
ఉచ్చులో చిక్కిన చిరుత
చండూరు: అడవి పందుల కోసం వేసిన ఉచ్చులో చిరుతపులి చిక్కింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం అజిలాపురం అటవీ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. అజిలాపురం, రంగా రెడ్డి జిల్లా సరిహద్దు అడవుల మధ్య అజిలాపురం గ్రామానికి చెందిన రైతులు తమ పంటలను అడవి పందుల బారినుంచి కాపాడుకునేందుకు ఉచ్చులు వేశారు. దీంతో మంగళవారం తెల్లవారుజామున ఆ ఉచ్చులో చిరుతపులి చిక్కింది. ఉదయాన్నే వచ్చి చూసిన రైతులకు చిరుత కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకుని ఫారెస్ట్, జూపార్క్ అధికారులకు సమాచారం ఇచ్చారు. జూ సిబ్బంది వచ్చి చిరుతకు మత్తు మందు ఇచ్చి జూపార్క్కు తరలించారు. -
ఏసీబీకి చిక్కిన వీఆర్వో
సాక్షి, సీతానగరం(విజయనగరం) : భూములు ఆన్లైన్ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన రెవెన్యూ ఉద్యోగిని ఏసీబీ అధికారులు సోమవారం పట్టుకున్నారు. లంచం ఇచ్చిన డబ్బులను స్వాధీనం చేసుకున్నారు. వీఆర్వోను విచారణ జరపుతున్నారు. వివరాల్లోకి వెళ్తే... సీతానగరం మండలం బూర్జ రెవెన్యూ పరిధిలోని చెల్లన్నాయుడువలస గ్రామానికి చెందిన రైతు భాస్కరరావు తన భూములను ఆన్లైన్ చేయాలని వీఆర్వో రాయిపిల్లి బలరాంకు విన్నవించాడు. భూముల పత్రాలను సైతం అందజేశాడు. ఏడాదిగా తిరుగుతున్నా ఇప్పటికీ పని పూర్తిచేయలేదు. ఇప్పటికే కొంత మొత్తాన్ని లంచంగా ముట్టచెప్పాడు. మళ్లీ లంచం డిమాండ్ చేయడంతో విసిగిపోయిన రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు లంచం ఇస్తానని వీఆర్వోకు భాస్కరరావు నమ్మబలికాడు. వీఆర్వో సూచనల మేరకు తహసీల్దార్ కార్యాలయానికి వస్తానని చెప్పాడు. లంచం డబ్బుల కోసం ఉదయం 11.30 గంటలకే తహసీల్దార్ కార్యాలయానికి వీఆర్వో చేరుకున్నాడు. రైతు కోసం ఎదురుచూస్తున్నాడు. అప్పటికే వలపన్నిన ఏసీబీ అధికారులు మధ్యాహ్నం 12 గంటల సమయంలో లంచం ఇవ్వాల్సిన రూ.9 వేలును దాసరి భాస్కరరావుకు అందజేశారు. వాటిని తీసుకెళ్లి రైతు ఇస్తుండా వీఆర్వోను ఏసీబీ డీఎస్పీ బీవీఎస్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. -
నకిలీ ‘బాబు’ అలా బుక్కయ్యాడన్నమాట!
సాక్షి, న్యూఢిల్లీ: వేషం మార్చి నకిలీ పాస్పోర్ట్తో విదేశాలకు చెక్కేద్దామనుకున్న వ్యక్తికి ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయ భద్రతా అధికారులు చెక్ పెట్టారు. సినీ ఫక్కీలో జయేశ్ పటేల్ (32) 81 ఏళ్ల వృద్ధుడిలా వేషం మార్చుకున్నాడు. గడ్డం, కళ్ల జోడు, నెత్తికి, గడ్డానికి తెల్ల రంగు, వీల్ చైర్ ఇలా అన్ని హంగులతో సీనియర్ సిటిజన్లా దర్జాగా న్యూయార్క్కు పయనమయ్యాడు. కానీ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) అతగాడి వాలకాన్ని, ప్రవర్తనను పసిగట్టేయడంతో అడ్డంగా బుక్కయ్యాడు. వివరాల్లోకి వెళితే..గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన జయేశ్ పటేల్ తనను తాను 81 ఏళ్ల అమ్రిక్ సింగ్గా మార్చుకున్నాడు. అతని పేరుతో నకిలీ పాస్పోర్ట్ సృష్టించాడు. తెల్లని జుట్టు, గడ్డంతో వీల్ చైర్ మీద న్యూయార్క్ వెళ్లేందుకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆదివారం చేరుకున్నాడు. అయితే అతని శారీరక రూపానికి, ప్రవర్తనకు సరిపోలకపోవడంతో సిఐఎస్ఎఫ్ ఎస్ఐ రాజ్వీర్ సింగ్ అతగాడిని ప్రశ్నించాడు. నిందితుడు అధికారి కళ్లలోకి సూటిగా చూడకుండా.. బిత్తిరి చూపులు చూడటం మొదలు పెట్టాడు. దీంతో మరింత లోతుగా పరిశీలించగా అసలు గుట్టు రట్టయింది. తదుపరి దర్యాప్తు కోసం జయేష్ పటేల్ను ఇమ్మిగ్రేషన్ అధికారులకు అప్పగించామనీ, ఈ చట్టవిరుద్ధమైన చర్యకు ఎందుకు పాల్పడ్డాడనే దానిపై దర్యాప్తు జరుగుతోందని సీనియర్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. -
చైన్ స్నాచింగ్, రఫ్పాడించిన తల్లీకూతుళ్లు
-
చైన్ స్నాచింగ్, రఫ్పాడించిన తల్లీకూతుళ్లు
సాక్షి, న్యూఢిల్లీ : మెడలో బంగారు గొలుసులతో ఆడవాళ్లు కనిపిస్తే.. చైన్ స్నాచింగ్లతో రెచ్చిపోయే కేటుగాళ్ల ఆగడాలకు చెక్ చెప్పే సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. తన మెడలో గొలుసు లాక్కునేందుకు ప్రయత్నించిన యువకుడికి కూతురుతో కలిసి తగిన శాస్తి చేసిందో మహిళ. ఆగస్టు 30న ఢిల్లీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. తల్లీ కూతుళ్లు పక్కన నిలుచొని ఉండగా, బైక్పై వచ్చిన దుండగుల్లో ఒకడు మహిళ మెడలోని చెయిన్ లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించాడు. అంతే శరవేగంగా స్పందించిన ఆమె (తల్లి) బైక్పై వెనక కూర్చుని ఉన్న అతగాణ్ని గుంజి నాలుగు తగిలించింది. దీనికి యువతి (కూతురు) కూడా తోడయ్యింది. ఇంతలో చుట్టుపక్కల వారు కూడా జత కూడడంతో అతగాడి ఆట కట్టింది. ఈ దృశ్యాలు మొత్తం సీసీటీవీలో రికార్డయ్యాయి. మరోవైపు బైక్పై వున్న మరో యువకుడు పారిపోవడం కూడా కెమెరా కంటికి చిక్కింది. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
బాబోయ్ భల్లూకం
సాక్షి, వజ్రపుకొత్తూరు రూరల్: జనావాసంలోకి ఎరక్కపోయి వచ్చిన భారీ భల్లూకం అమ్మవారి గుడిలో ఇరుక్కుపోయింది. గ్రామస్తులు తాళం వేయడంతో రోజంతా ఆలయంలోనే గడిపింది. ఆఖరికి విశాఖ నుంచి జూ అధికారులు వచ్చి మత్తు ఇంజక్షన్ ఇచ్చి బోనులోకి తరలించారు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. చినవంక గ్రామ పరిసర ప్రాంత జీడి తోటలో ఉన్న వంక పో లమ్మ గుడిలోకి గురువారం ఉదయం ఎలు గు బంటి ప్రవేశించింది. జీడి తోట పనులకు కోసం వెళ్లిన రైతులు ఈ విషయాన్ని గమనించారు. అప్రమత్తమై గుడి తలుపులు వేసి గొళ్లెం పెట్టి అటవీ శాఖాధికారులకు సమాచారం అందించారు. దీంతో ఈ విషయం సోషల్ మాధ్యమాలలో హల్చల్ చేయడంతో ఎలుగును చూసేందుకు పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు బారులు తీరారు. అయితే సంబంధిత అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించి విశాఖపట్నం జూ అధికారులకు సమాచారం అందించారు. ఉద్దాన తీర ప్రాంతంలో గత కొంత కాలంగా ఎలుగులు హల్చల్ చేస్తూ ఈ ప్రాంత ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఒక భారీ ఎలుగు ఎప్పటిలాగే సంచరిస్తూ గుడిలో చిక్కింది. ఎలుగుతో సెల్ఫీ.. గుడిలో చిక్కుకున్న ఎలుగు బంటిని చూసేం దుకు వచ్చిన ప్రజలు ఆసక్తిగా సెల్ఫీలు దిగా రు. మరికొందరు దగ్గరగా ఎలుగును చూసి ఫొటోలకు పోజులు ఇచ్చారు. అలాగే ఎలుగుకు కొంతమంది యువకులు, మహిళలు బిస్కెట్లు, రొట్టెలు, బెల్లం, నూనె లాంటి ఆహార పదార్ధాలు అందిస్తూ వీడియోలు, ఫోటోలు తీస్తూ సెల్ఫోన్లో ఈ చిత్రాలు బంధించారు. అధికారుల తీరుకు స్థానికుల మండిపాటు.. గుడిలో ఎలుగు ఉన్నట్లు అటవీ శాఖాధికారులకు ఉదయం సమాచారం అందిస్తే సంఘటన స్థలానికి మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకున్నారు. పరిస్థితి పరిశీలించిన అధికారులు అప్పటికే ఎలుగును చూసేందుకు వచ్చిన ప్రజలను వెళ్లిపోవాలని సూచించారు. ఇప్పుడు ఏమి చేయలేమని గుడి తలుపులు తీసి ఎలుగును బయటకు పంపించే ప్రయత్నం చేశారు. అయితే దీనిని స్థానికులు అడ్డుకొని అధికారుల తీరును వ్యతిరేకించారు. నిత్యం జీడి సాగులో గడిపే తమపై ఎలుగులు దాడి చేస్తే ఎవరు బా ధ్యత వహిస్తారని నిలదీశారు. దీంతో అధికారులు అక్కడ నుండి వెనుదిరిగి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. విశాఖపట్నం జూ అధికారులకు సమాచారం అందించామని, వారు వచ్చే వరకు ఎలుగును రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయరాదని అధికారులు సూచించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అటవీ శాఖాధికారులు మీనా బాబు, రజనీకాంత్, రమేష్, తిరుపతి పరిస్థితిని సమీక్షించారు. ఉత్కంఠకు తెర.. విశాఖపట్నం జూ నుంచి 8 మంది సభ్యులతో రెస్క్యూ టీం రాత్రికి ఘటనా స్థలానికి చేరుకొని, ఎలుగును బంధించే ప్రయత్నం చేశారు. సుమారు 3 గంటల పాటు శ్రమించి బంధించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వైద్యులు శ్రీనివాస్ గన్తో మత్తు ఇంజెక్షన్ వేయడంతో ఎలుగు స్పృహ తప్పి, బోనులో చిక్కింది. అనంతరం దానిని బంధించి విశాఖ జూకి తరలించారు. కార్యక్రమంలో డీఎఫ్ లక్ష్మణ్, ఫారెస్టు రేంజర్ అమ్మనాయుడు, డిప్యూటీ రేంజర్ వీఎసఎన్ రాజు, ఎఫెస్ఓ రజనీకాంత్ పాల్గొన్నారు. -
అనంతపురం జిల్లాలో దివాకర్ ట్రావెల్స్లో చీరల తరలింపు పట్టివేత
-
పెళ్లికి నిరాకరించిందని ఆర్మీ మేజర్ కిరాతకం
న్యూఢిల్లీ : ఆర్మీ మేజర్ అమిత్ ద్వివేది భార్య శైలజ హత్య కేసులో ప్రధాన నిందుతుడు మేజర్ నిఖిల్ హండాను ఆదివారం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. శైలజ, నిఖిల్ హండాను వివాహం చేసుకోవడానికి నిరాకరించడంతోనే నిఖిల్ ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఆర్మీ మేజర్గా పనిచేస్తున్న నిఖిల్ హండాకు 2015లో నాగలాండ్లో పోస్టింగ్ ఇచ్చారు. అదే సమయంలో శైలజ భర్త మేజర్ ద్వివేదికి కూడా నాగలాండ్లోనే పోస్టింగ్ ఇచ్చారు. ఆ విధంగా నిఖిల్, శైలజల మధ్య పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వీరిద్దరు స్నేహితులుగా మారారు. కొంత కాలం తర్వాత నిఖిల్, శైలజను వివాహం చేసుకోవాల్సిందిగా కోరాడు. కానీ శైలజ అందుకు అంగీకరించలేదు. అయితే వీరిద్దరి స్నేహం గురించి శైలజ భర్త మేజర్ ద్వివేదికి తెలిసింది. దాంతో అతడు శైలజ, నిఖిల్ల మధ్య ఎటువంటి కాంటక్ట్ ఉండకూడదని వారించాడు. ఇదిలా ఉండగా కొద్ది రోజుల క్రితం నిఖిల్ కొడుకు ఆరోగ్యం పాడవడంతో అతన్ని ఢిల్లీలోని కంటోన్మెంట్ ఆస్పత్రిలో చేర్చాడు. ఇదే సమయంలో శైలజ కూడా ఢిల్లీలోనే ఉంది. కొడుకు వైద్యం కోసం ఢిల్లీకి వచ్చిన నిఖిల్ శైలజకు ఫోన్ చేసి తనను కలవాల్సిందిగా కోరాడు. దాంతో గత శనివారం శైలజ ఇంట్లో ఫిజియోథెరపికి వెళ్తున్నాని చెప్పి బయటకు వచ్చింది. అయితే శైలజను ఫిజియోథెరపికి తీసుకెళ్లడానికి ద్వివేది ప్రభుత్వ వాహనాన్ని ఏర్పాటు చేశాడు. ఫిజియోథెరపి కోసం వెళ్లిన శైలజ తిరిగిరాలేదని తెలిపాడు డ్రైవర్. ఫిజియోథెరపీ కోసం వెళ్లిన శైలజ నిఖిల్ హండాను కలిసింది. ఆ సమయంలో నిఖిల్ తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా శైలజను కోరాడు. ఈ విషయం గురించి వారిద్దరి మధ్య గొడవ ప్రారంభమయ్యింది. శైలజ వివాహనికి నిరాకరించడంతో విచక్షణ కోల్పోయిన నిఖిల్ వెంట తెచ్చుకున్న కత్తితో శైలజ గొంతు కోసి చంపాడు. శైలజ మరణాన్ని ఆక్సిడెంట్గా చిత్రికరించడానికి ఆమె మృత దేహాన్ని కారులో తీసుకెళ్లి రోడ్డుపై పడేశాడు.అనంతరం అక్కడ నుంచి ఆస్పత్రికి వెళ్లి తన కుమారున్ని కలిసి యథాప్రకారం ప్రస్తుతం పనిచేస్తున్న మీరట్(ఉత్తరప్రదేశ్)కు వెళ్లి పోయాడు. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసుకున్నాడు. శనివారం మధ్యాహ్నం రోడ్డు మీద శైలజ మృత దేహాన్ని చూసిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మరణించిన వ్యక్తిని శైలజగా గుర్తించి, కేసు నమోదు చేశారు. శైలజ భర్త మేజర్ ద్వివేది, నిఖిల్ హండా మీద అనుమానం ఉందని చెప్పడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేశారు. ఇలోపు శైలజ ఫోన్లో నిఖిల్ హండాకు, శైలజకు మధ్య జరిగిన సంభాషణను పరిశీలించిన పోలీసులు నిఖిల్ హండాను నేరస్తుడిగా నిర్ధారించారు. దాంతో ఒక పోలీసులు బృందం ఆదివారం మీరట్ వెళ్లి నిఖిల్ను అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకొచ్చారు. -
దొరికిన గుడివాడ హత్య నిందితులు!
గుడివాడ : గుడివాడ రాజేంద్రనగర్లో దంపతుల హత్య కేసులో నిందితులు పోలీసులకు చిక్కినట్లు సమాచారం. నలుగురు నిందితులతో పాటు వాళ్లు దొంగిలించిన కారును తమిళనాడు రాష్ట్రంలోని వేలేరు సమీపంలో పట్టుకున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది. శుక్రవారం రాత్రి జరిగిన బొప్పన సాయిచౌదరి దంపతుల హత్య కేసును పోలీసులు ఛాలెంజ్గా తీసుకున్నారు. కేసును ఛేదించేందుకు అన్ని రకాల మార్గాలలో విచారణ ప్రారంభించారు. హత్య జరిగిన చోట వేలిముద్రలు దొరికిపోవటంతో పాటు ప్రధాన రహదారిలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజి ఆధారంగా వాళ్లు వెళ్లిన మార్గాన్ని గుర్తించి పట్టుకున్నట్లు తెలుస్తోంది. బృందాలుగా ఏర్పడిన పోలీసులు.. హత్య కేసును ఛేదించేందుకు పోలీసులు పెద్ద ఎత్తున బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. దీనిపై సమీక్షించేందుకు డీజీపీ మాలకొండయ్య, జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి గుడివాడ పోలీసులతో రాజేంద్రనగర్లోని అగ్రోస్ భవనంలో శనివారం రాత్రి సమావేశం అయ్యారని తెలిసింది. నిందితులను పట్టుకునేందుకు ఏఏ బృందాలు ఎలా వెళ్లాలి అనే అంశాలపై సమీక్షించినట్లు సమాచారం. గుడివాడ డీఎస్పీ ఆధ్వర్యంలో తమిళనాడు వెళ్లిన పోలీసు బృందానికి నిందితులు చిక్కినట్లు తెలుస్తోంది. పాత నేరస్తులేనా?.. దంపతుల హత్య ఘటనలో పాల్గొన్న వారిలో గుడివాడకు చెందిన మాజీ రౌడీషీటర్ గిన్నెల సురేష్ ఉన్నట్లు సమాచారం. ఇతను కొంతకాలంగా గుంటూరులో ఉంటున్నాడని తెలిసింది. తమిళనాడులో పోలీసులకు చిక్కిన వారిలో గుడివాడకు చెందిన వారితోపాటు అతను కూడా ఉన్నట్లు వినికిడి. వేలిముద్రలు, సీసీ కెమెరా ఫుటేజీలే పట్టించాయా?.. హత్య జరిగిన చోట నిందితుల వేలిముద్రలు క్లూస్ టీం నిపుణులు కనుగొన్నారు. దీనికి తోడు గుడివాడ పట్టణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజిలు నిందితులను పట్టుకోవటంలో సహకరించినట్లు తెలుస్తోంది. నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉన్నందున మరో నాలుగు రోజుల్లో కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు పోలీసు వర్గాల నుంచి వినికిడి. అయితే హత్య ఎందుకు చేశారనే అంశాలు ఇంకా వెలుగు చూడలేదు. ఆర్థికపరమైన లావాదేవీలే కారణమని తెలుస్తోంది. -
అతడు సైకో కిల్లర్
చిత్తూరు అర్బన్ : ఫిబ్రవరి 25.. నగరి మండలంలోని వికెఆర్.పురం వద్ద ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తు న్న రత్నమ్మ (62) దారుణ హత్యకు గురైం ది. తలపై బండరాయి వేసి హత్య చేశారు. వివస్త్రను చేయడమేగాక ఆమె శరీరంపై పలుచోట్ల పంటిగాట్లు ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. ఈ నెల 9వ తేదీ అర్ధరాత్రి పాలసముద్రం మండలం గంగమాంబపురం పంచాయతీ అభిరాజుకండ్రిగ గ్రామ శివారుల్లో ఉన్న ఇంట్లో వళ్లియమ్మ (65) నిద్రించింది. ఉదయం కూతురు వచ్చి చూసేసరికి వళ్లియమ్మ రక్తపు మడుగులో ఉంది. ఆమె శరీరంపై కూడా అదే ఆనవాళ్లు. హత్యలు చేస్తున్నది ఒక్కరేనని పోలీసులు నిర్ధారిం చుకున్నారు. అది కూడా సైకో కిల్లర్గా ఉన్నాడని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ రెండు హత్యల్లో నిందితుడిని చిత్తూరు పోలీసులు పట్టుకున్నారు. గ్రామాల శివారులో ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని ఒంటరిగా ఉన్న వృద్ధురాళ్లను హత్య చేసి లైంగిక దాడి చేస్తున్న సీరియల్ సైకో కిల్లర్ను మన పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. శనివారం తమిళనాడులోని షోలింగర్ వద్ద ఉన్న నిందితుడు మునస్వామి (40)ని అదుపులోకి తీసుకుని చిత్తూరుకు తరలించారు. ప్రాథమిక సమాచారం ఎస్పీ రాజశేఖర్బాబుకు తెలియడంతో అధికారులను అభినందించారు. నిందితుడు ఇదే తరహాలో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఆరు హత్యలు చేసినట్లు ప్రాథమిక విచారణలో సమాచారం రాబట్టిన అధికారులు నిర్ఘాంతపోయారు. ఇలా చిక్కాడు.. నగరిలో రత్నమ్మను హత్య చేసిన తరువాత మునస్వామి బస్సుల్లో తిరుగుతూ ఈ నెల 8న పాలసముద్రం చేరుకున్నాడు. ఇతనిది షోలింగర్ కావడంతో ఊరికి వెళ్లే దారిలో ఒంటరిగా ఉన్న వళ్లియమ్మను బండరాయితో హత్య చేశాడు. అనంతరం నడుచుకుంటూ తమిళనాడు వెళ్లిపోయాడు. ఆంధ్ర–తమిళనాడు సరిహద్దులో ఉన్న ఓ పెట్రోలు బంకు వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరా పుటేజీలో మునస్వామి అర్ధరాత్రి వెళ్లడాన్ని పోలీసులు గుర్తించారు. వారం రోజులుగా వేలూరు, షోలింగర్, ఆర్కాడు ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. ఆయా పోలీస్ స్టేషన్లలో వేలిముద్రల ఆధారంగా పాత నేరస్తుడి వివరాలను మన పోలీసులు సేకరించారు. ఇందులో మునస్వామి ఉన్నట్లు గుర్తించి షోలింగర్ వద్ద ఉన్న అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి స్థాయిలో విచారించిన తరువాత అరెస్టు చూపే అవకాశం ఉంది. మరెన్నో కేసులు.. మునస్వామిపై తమిళనాడులోని తిరువళ్లూరు, వేలూరు తదితర ప్రాంతాల్లో చోరీలతోపాటు హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. వీటిల్లో కొన్ని కేసులు న్యాయస్థానంలో రుజువుకాకపోగా.. మరికొన్నింటిలో బెయిల్పై బయటకొచ్చి కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. మరోవైపు తిరువళ్లూరు, షోలింగర్, అరక్కోణం, వేలూరు ప్రాంతాల్లో దాదాపు ఆరు హత్యలకు పాల్పడినట్టు నిందితుడు అంగీకరించినట్లు సమాచారం. పట్టుకోకుంటే మరిన్ని హత్యలు... చిత్తూరు జిల్లాలో జరిగిన రెండు హత్య కేసుల్ని పరిశీలించిన పోలీసులు ఒకే వ్యక్తి దారుణానికి ఒడిగట్టినట్టు నిర్ధారణకు వచ్చారు. పైగా హత్యానంతరం వృద్దుల ఛాతీపై పళ్లగాట్లు ఉండటంతో అతను సైకో అని తెలుసుకుని విస్తుపోయారు. ఈ వ్యవహారాన్ని జాగ్రత్తగా డీల్ చేయాలని ఎస్పీ రాజశేఖర్బాబు ఆదేశించడంతో ఓ ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. వారం రోజుల పాటు విచారించి మాటువేసి నిందితుడ్ని పట్టుకున్నారు. మునస్వామిని పట్టుకోకుంటే మరిన్ని హత్యలు జరిగి ఉండేవని పోలీసులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న తమిళనాడు పోలీసులు చిత్తూరుకు వచ్చి కేసుపై మన పోలీసులతో విచారిస్తున్నారు. -
ఏసీబీకి చిక్కిన బిల్కలెక్టర్
నర్సంపేట: ఇంటి యాజమాన్య ధ్రువీకరణ పత్రం ఇవ్వడానికి రూ.10 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి నగర పంచాయతీ బిల్కలెక్టర్ను పట్టుకున్న సంఘటన పట్టణంలో మంగళవారం జరిగింది. ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్ సుదర్శన్గౌడ్ కథనం ప్రకారం.. నర్సంపేట పట్టణానికి చెందిన జడల వెంకటేశ్వర్లు తన స్వయాన సోదరుడు జడల శ్రీనివాస్ ఇంటికి సంబంధించిన యాజమాన్య ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని 2017, డిసెంబర్ 22న దరఖాస్తు చేసుకున్నాడు. ఇంటి ఓనర్షిప్ సర్టిఫికెట్ ఇవ్వాలంటే రూ.20 వేలు లంచం ఇవ్వాలని బిల్కలెక్టర్ మురళీ తెలపడంతో వారం రోజుల క్రితం ఆ డబ్బులను వెంకటేశ్వర్లు ముట్టజెప్పాడు. అయినప్పటికీ ఆలస్యం చేస్తుండటంతో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించగా మరో రూ.10 వేలు ఇస్తేనే సర్టిఫికెట్ ఇస్తానని తెగేసి చెప్పాడు. వెంకటేశ్వర్లు ఎంత బతిమిలాడినా మురళీ అంగీకరించలేదు. దీంతో మూడు రోజుల క్రితం వెంకటేశ్వర్లు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి సూచన మేరకు అతడు రూ.10 వేలను బిల్కలెక్టర్కు ఇస్తుండగా ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్ సుదర్శన్గౌడ్ ఆధ్వర్యంలో ఏసీబీ డీఎస్పీ ముద్దసాని కిరణ్కుమార్, సీఐలు సతీష్, పులి వెంకట్, క్రాంతికుమార్ దాడులు నిర్వహించి పట్టుకున్నారు. అనంతరం మురళీని నగర పంచాయతీకి తరలించి రికార్డులను తనిఖీ చేసి విచారించారు. అక్కడి నుంచి మురళీ ఇంట్లోకి వెళ్లి తనిఖీలు చేసి ఆస్తుల వివరాలు, బ్యాంక్ ఖాతా వివరాలను స్వాదీనం చేసుకొని అరెస్ట్ చేశారు. బుధవారం పూర్తి వివరాలను సేకరించిన తర్వాత ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఏసీబీ డీడీ వెల్లడించారు. బాధ భరించలేక ఏసీబీని ఆశ్రయించా న్యాయంగా మాకు ఇవ్వాల్సిన ఓనర్షిప్ సర్టిఫికెట్ ఉచితంగా ఇవ్వకుండా కొన్నిరోజులు తిప్పుకున్న తర్వాత డబ్బులు ముట్టజెబితేనే ఇస్తానని మురళీ అనడంతో గత్యంతరం లేక గతంలో రూ.20 వేలు ఇచ్చాను. అయినప్పటికీ మరో రూ.12 వేలు కావాలని డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించా. రూ.10 వేలు ఇచ్చేందుకు ఒప్పుకొని అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టించా. -
మద్యం సేవించి బస్సు నడిపిన డ్రైవర్
చేవెళ్ల: మద్యం సేవించి బస్సు నడుపుతున్న ఆర్టీసీ బస్డ్రైవర్పై చేవెళ్ల పోలీసులు డ్రంక్అండ్డ్రైవ్ కేసు నమోదు చేశారు. వికారాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (టీఎస్ 07 యూఏ 2073) శంకర్పల్లి–చేవెళ్ల మధ్య తిరుగుతుంది. గురువారం ప్రయాణికులతో తిరుగుతున్న బస్సు డ్రైవర్ టి.మురళిగౌడ్ ప్రవర్తనలో ప్రయాణికులకు తేడా కనిపించింది. దీంతోపాటు మద్యం సేవించినట్లుగా వాసనరావడంతో ప్రయాణికులు చేవెళ్ల బస్స్టేషన్లో బస్సును నిలిపివేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి బ్రీత్ఎన్లైజర్తో చెక్చేయడంతో డ్రైవర్ మురళీగౌడ్ మద్యం సేవించినట్లు 179 శాతం రిపోర్టు వచ్చింది. దీంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
అన్నం పెట్టిన దుకాణానికే కన్నం వేశాడు
జమ్మికుంట(హుజూరాబాద్): అన్నంపెట్టిన దుకాణానికే కన్నం వేశాడు ఓ ఘనుడు. సాయంగా ఉంటాడని గుమాస్తాను పెట్టుకుంటే డమ్మీతాళం చెవి సృష్టించి రెండు నెలలుగా బంగారం, నగదు అపహరిస్తున్నాడు. బుధవారం యజమాని రెడ్హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. జమ్మికుంట పట్టణంలోని గాంధీచౌక్ వద్ద కాసుల శేషు బంగారం దుకాణం ఉంది. యాజమాని శేషు పట్టణంలోని మోత్కులగూడెం గ్రామానికి చెందిన రామకృష్ణను నాలుగు మాసాల క్రితం గుమాస్తాగా పెట్టుకున్నాడు. రామకృష్ణ షాపు కౌంటర్ తాళాలను పరిశీలించి యాజమాని లేని సమయంలో దొంగతనం చేసేందుకు కౌంటర్ తాళానికి డమ్మీ తాళం చెవిని తయారుచేశాడు. యాజమాని కౌంటర్కు తాళం వేసుకొని వెళ్లిన సమయంలో డమ్మీ తాళంచెవితో కౌంటర్ తాళాలు తీస్తూ్త అందులోని నగదు, బంగారం, వెండి వస్తువులు అపహరించేవాడు. ఈ విషయమై అనుమానం వచ్చిన శేషు అతడి కదలికలపై నిఘా పెట్టాడు. బుధవారం సాయం త్రం శేషు బయటకు వెళ్లినట్లు నటించి దుకాణంలో ఉన్న గుమాస్తాను పరిశీలించాడు. ఇదే సమయంలో రామకృష్ణ జేబులో ఉన్న డమ్మీతాళం చెవితో కౌంటర్ తీసి అందులో రూ. 6వేల నగదు, కొంత బంగారాన్ని తీసి జేబులో పెట్టుకున్నాడు. గమనించిన వ్యాపారి అతడిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నాడు. అనంతరం పోలీసులకు అప్పగించాడు. ఇప్పటి వరకు రూ. 50 వేల నగదు, రెండు కిలోల వెండి, 12జతల బంగారు కమ్మలు పోయినట్లు శేషు పోలీసులకు వెల్లడించాడు. -
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు
నిజామాబాద్ నాగారం: ఇందల్వాయి మండలం గన్నారం పరిధిలో ఉన్న దాబాలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్శాఖ టాస్క్ఫోర్సు సీఐ వెంకట్రెడ్డి తెలిపారు. టాస్క్ఫోర్సు సిబ్బంది దాడుల్లో మంగళవారం గన్నారం పరిధిలో ఉన్న దాబా లో దేవితండాకు చెందిన వినోద్కుమార్ దాబాలో ఎండుగంజాయి ప్యాకెట్లను లారీ డ్రైవర్లకు విక్రయిస్తుండగా దాడి చేసి పట్టుకున్నామన్నారు. దాబా యజమానులు అశోక్, వినోద్కుమార్పై కేసు నమోదుచేసి అరెస్టు చేశామన్నారు. 1.6 కేజీల గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నామని, దాని విలువ రూ.30 వేలు ఉంటుందన్నారు. టాస్క్ఫోర్సు ఎస్ఐ సింధూ, సిబ్బంది ఫయాజ్, మశ్చేందర్, అహ్మద్, రాజేశ్వర్, రమణ పాల్గొన్నారు. -
మాఫియాకు రాచమార్గం
ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి అక్రమ రవాణాకు దేవరపల్లి–జీలుగుమిల్లి రోడ్డు కేరాఫ్ అడ్రస్గా మారింది. విశాఖ నుంచి ఖమ్మం మీదుగా హైదరాబాద్కు వాహనాలు ఇటుగా వెళుతుండటంతో రోడ్డు రద్దీగా ఉంటుంది. దీంతో ఈ మార్గాన్ని అడ్డాగా మార్చుకుని పశువులు, గంజాయి, రేషన్ బియ్యం అక్రమ రవాణాలతోపాటు దొంగనోట్ల మార్పిడి సాగుతోంది. సాక్షి ప్రతినిధి, ఏలూరు: దేవరపల్లి–జీలుగుమిల్లి మార్గంలో అక్రమ రవాణా మాఫియాను పట్టుకోవడానికి పోలీసులు ఏడాదిలో రెండుసార్లు కాల్పులు జరపాల్సి వచ్చింది. జిల్లాలో గంజాయి సాగు లేకపోయినా విశాఖ ఏ జెన్సీ నుంచి జిల్లా మీదుగా గంజాయి అ క్రమ రవాణా సాగుతోంది. రవాణాలో కీలకపాత్రధారులు జిల్లావారు కావడంతో గుట్టుచప్పుడు కాకుండా రాష్ట్ర సరిహద్దులు దాటుతోంది. అయితే అప్పుడప్పు డు పోలీసులకు వచ్చిన సమాచారంతో భారీగా గంజాయి పట్టుపడుతోంది. విశా ఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో పండించిన గంజాయిని హైదరాబాద్, మహారాష్ట్రకు వయా పశ్చిమగోదావరి జిల్లా నుంచి సరిహద్దు దాటిస్తున్నారు. దీని కోసం ప్ర త్యేకమైన రూట్లను స్మగ్లర్లు ఎంచుకుంటున్నారు. దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం మీదుగా ఒక రూట్లోను, దేవరపల్లి, నల్లజర్ల, ద్వారకాతిరుమల, కామవరపుకోట, చింతలపూడి మీదుగా మరో రూట్లో రాష్ట్ర సరి హద్దులు దాటిస్తున్నారు. దీనిలో జిల్లాకు చెందిన స్థానిక వ్యక్తులతో పాటు పోలీసులలో కూడా కొందరు సహకరిస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఇటీవల గంజా యి వ్యవహారంలో చింతలపూడి సీఐపై సస్పెన్షన్ వేటు పడిన సంగతి తెలిసిందే. పశువుల అక్రమ రవాణా విషయానికి వస్తే జిల్లాలో ఇప్పటివరకూ 24 కేసులు నమోదు కాగా సుమారు 1,850 ఆవులను పోలీసులు పట్టుకుని గోసంరక్షణ సమితికి అప్పగించారు. జిల్లా మీదుగా ప శువుల అక్రమ రవాణా చాలా కాలంగా జరుగుతోంది. జిల్లా సరిహద్దులు దాటిం చేందుకు ఏకంగా ఒక ముఠా పనిచేస్తోం ది. దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం మీదుగా వీటి ని తరలించేవారు. అప్పుడప్పుడు రూ ట్ మార్చి నల్లజర్ల, కామవరపుకోట, చిం తలపూడి మీదుగా జిల్లా సరిహద్దులు దా టిస్తున్నారు. ఎక్కడైనా పోలీసులు దాడి చేసి పశువులను రవాణా చేసు ్తన్న వాహనాలు సీజ్ చేస్తే దగ్గరలోని గో శాలకు తరలించి అక్కడి నుంచి రాత్రికి రాత్రే తెలంగాణాకు తరలిస్తున్నారు. గతంలో దేవరపల్లి వద్ద పట్టుకున్న గోవులు సకాలంలో గోశాలకు తరలించకపోవడంతో 40 వరకూ హృదయవిదారక పరిస్థితిలో మృతి చెందడం వివాదం అయ్యింది. పేదలకు ఇచ్చే రేషన్ బియ్యం అ క్రమ రవాణాకు కూడా మాఫియా ఈ రూట్నే ఎంచుకోవడం గమనార్హం. తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున ఇదే రూట్లో కాకినాడ పోర్టుకు ఈ బి య్యం చేరుతున్నాయి. మధ్యలో తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని రైస్ మిల్లుల్లో వీటిని రీసైక్లింగ్, పాలిష్ చేసి ఏదొక బ్రాండ్ పేరుతో 25 కేజీల బ్యాగ్ల్లో నింపుతున్నారు. ఇలా చేసిన బ్యాగ్లను కాకినాడ పోర్టు నుంచి బంగ్లాదేశ్కు తరలిస్తున్నారు. ఈ రూట్లో పోలీసుల సహకా రం ఉండటంతో ఇంత పెద్ద ఎత్తున అక్రమ రవాణా సాగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఒకే రోజు జిల్లాలో రెండు దొంగనో ట్ల కేసులు నమోదు కావడం విశేషం. దేవరపల్లి, నరసాపురంలో దొంగనోట్ల ముఠాలను పట్టుకున్నారు. ఇద్దరు నిరాయుధులను పట్టుకోవడం కోసం దేవరపల్లిలో కాల్పులదాకా వెళ్లాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం డిపార్టుమెంట్లోనే వ్యక్తమైంది. ఇటీవల యర్నగూడెం వద్ద దొం గనోట్ల ముఠా పోలీసులపై దాడికి ప్రయత్నించి తప్పించుకుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారన్నది తెలియాల్సి ఉంది. దేవరపల్లి–జీలుగుమిల్లి మార్గంలోని పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులు దేవరపల్లిలో.. గంజాయి కేసులు 4 గోవుల రవాణా 3 రేషన్ బియ్యం 2 దొంగనోట్ల మార్పిడి 1 గోపాలపురంలో.. గంజాయి కేసు 1 గోవుల రవాణా 1 నల్లజర్లలో.. గోవుల రవాణా 2 లింగపాలెంలో.. రేషన్ బియ్యం 2 కామవరపుకోటలో.. గోవుల రవాణా 1 కొయ్యలగూడెంలో.. గోవుల రవాణా 6 గుట్కా, ఖైనీ రవాణా 1 జంగారెడ్డిగూడెంలో.. గోవుల రవాణా 2 రేషన్ బియ్యం 1 బుట్టాయిగూడెంలో గోవుల రవాణా 1 జీలుగుమిల్లిలో.. గంజాయి రవాణా 1 రేషన్ బియ్యం 1 చింతలపూడిలో.. గంజాయి కేసు 1 రేషన్ బియ్యం 1 -
వ్యభిచార ముఠా గుట్టు రట్టు
కోల్కత్తా : గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తోన్న ఓ ముఠాను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐడీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..ఈ ఘటనలో నలుగురు మహిళలకు, ఇద్దరు మైనర్ బాలికలకు పోలీసులు విముక్తి కల్పించారు. వీరి చేత కోల్కత్తాలోని డండం ప్రాంతంలో వ్యభిచారం చేయించేందుకు నిర్వాహకులు తీసుకువచ్చారు. ఈ విషయం తెలిసి బెంగాల్ సీఐడీ ఆఫీసర్లు దాడులు నిర్వహించడంతో విషయం బయటపడింది. 12 మంది నిర్వాహకుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. నిర్వాహకులంతా బెంగాల్లోని వివిధ జిల్లాకు చెందిన వారని పోలీసులు తెలిపారు. ఒక్క చోట చేరి తేలికగా డబ్బులు సంపాదిద్దామని ఈ వ్యాపారంలోకి దిగినట్లు చెప్పారు. వ్యభిచార నిర్వాహకుల నుంచి రూ.2.28 లక్షల నగదు, ఓ కారు స్వాధీనం చేసుకుని వ్యభిచారం జరిగిన హోటల్ను సీజ్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డీడీ
కరీంనగర్ : లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఎస్సీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్(డీడీ) పెరిక యాదయ్య ఏసీబీకి చిక్కారు. కూరగాయల కాంట్రాక్టర్ కనకయ్యకు ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థులకు వంట వండే క్యాటరింగ్ పర్మిషన్ ఇచ్చేందుకు డీడీ యాదయ్య రూ.1.30 లక్షలు డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని కనకయ్య ఏసీబీ అధికారులకు తెలియజేశాడు. దీంతో పధకం ప్రకారం యాదయ్యను అరెస్ట్ చేసేందుకు వ్యూహం పన్నారు. అనుకున్న విధంగా రాంనగర్లో కనకయ్య రూ.లక్ష ఇస్తుండగా యాదయ్యను పట్టుకున్నారు. మధ్యవర్తిగా వెళ్లిన లక్ష తీసుకున్న అటెండర్ శ్యామ్ సుందర్ను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు డబ్బులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బంగారాన్ని స్క్రూ డ్రైవర్ రూపంలో తరలిస్తూ..
తూర్పుగోదావరి జిల్లా : రాజమండ్రి రైల్వే స్టేషన్లో భారీగా బంగారం పట్టుకున్నారు. బంగారాన్ని టూల్ కిట్లోని స్క్రూ డ్రైవర్ రూపంలో తరలిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ప్రయత్నించాడు. అయినా గానీ పోలీసులకు చిక్కాడు. పట్టుబడిన బంగారం రెండున్నర కిలోలు ఉంటుందని అధికారులు తెలిపారు. గుహాహటి నుంచి చెన్నై వెళ్తున్న రైలులో ఈ బంగారంను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ రూ.77 లక్షల విలువ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. బంగారం మయన్మార్ నుంచి అక్రమంగా తీసుకువచ్చినట్లు గుర్తించారు. ఈ సంఘటనకు సంబంధించి ఓ ప్రయాణికుడిని డైరెక్టరేట్ ఆప్ రెవిన్యూ(డీఆర్ఐ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆరుగురు అరెస్ట్: రూ.11.13 లక్షల సొత్తు సీజ్
సాక్షి, కొవ్వూరు: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు సబ్ డివిజన్ పరిధిలో ద్విచక్ర వాహనాలు, బంగారు ఆభరణాల దొంగతనాలకు పాల్పడిన ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.11,13,600లు విలువ చేసే బంగారపు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 28 వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రవిప్రకాష్ హెచ్చరించారు. -
రెడ్హ్యాండెడ్గా దొరికిన డీఈఓ సూపరింటెండెంట్
సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళంలోని జిల్లా విద్యాశాఖాధికారి(డీఈఓ) కార్యాలయంలో ఏసీబీ దాడులు జరిగాయి. డీఎస్పీ కె.రాజేంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో ఆఫీస్ పర్యవేక్షకుడు ఎ.వి.ప్రసాదరావు రూ.20 వేలు లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా దొరికిపోయారు. పాతపట్నంకు చెందిన జమ్మయ్య అనే ఉద్యోగి ఫిర్యాదు మేరకు ఏసీబీ ఈ దాడులు నిర్వహించింది. -
జవహర్నగర్లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
-
వివాదంలో ఓలా, ఫౌండర్స్పై కేసు
బెంగళూరు: ఆన్లైన్ క్యాబ్ అగ్రిగేటర్ ఓలా వివాదలో ఇరుక్కుంది. కాపీరైట్ చట్టం ఉల్లంఘించిన ఆరోపణలతో బెంగళూరు పోలీసులు ఓలా ఫౌండర్స్పై కేసున మోదు చేశారు. ఓలా ప్లే ప్లాట్ఫారమ్ ద్వారా చలనచిత్ర పాటలను చోరీ చేసి స్ట్రీమింగ్ చేసినందుకు బెంగళూరుకు చెందిన రికార్డింగ్ కంపెనీ ఫిర్యాదు చేయడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఓలా ప్లే ప్లాట్ఫాం ద్వారా పైరేటెడ్ సినిమా పాటలను వాడుతున్నారని మ్యూజిక్ సంస్థ లహరి రికార్డింగ్ కంపెనీ లిమిటెడ్. ఓలా మాతృ సంస్థ ఎఎన్ఐ టెక్నాలజీస్ ప్రయివేటు లిమిటెడ్పై ఫిర్యాదు చేసింది. తాము ఆడియో హక్కులను కొనుగోలు చేసిన కన్నడ , తెలుగు సినిమాల నుండి పాటలను డౌన్లోడ్ చేసుకుంటున్నారనీ ఆరోపించింది. కర్ణాటక, ఢిల్లీ, కోల్కతా తమిళనాడులో వీటిని అక్రమంగా వినియోగిస్తున్నారని మ్యూజిక్ కంపెనీ ఆరోపించింది. దీంతో పోలీసులు ఓలా కార్యాలయంపై దాడి చేసి, పాటలను డౌన్లోడ్ చేయడానికి, నిల్వ చేయడానికి ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎఎన్ఐ టెక్నాలజీస్ లిమిటెడ్, ఓలా ఫౌండర్స్ భవిష్ అగర్వాల్ , అంకిత్ భతీపై కేసు నమోదు చేశారు. -
హైదరాబాద్లో భారీగా పేలుడు పదార్థాలు
హైదరాబాద్: మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గ నగర్ వద్ద పోలీసులు పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను పట్టుకున్నారు. శంషాబాద్ ఎస్వోటీ పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు చేపట్టారు. అటుగా వచ్చిన బొలెరోను తనిఖీ చేసి అందులో ఉన్న 2 వేల జిలెటిన్ స్టిక్స్, 2 వేల డిటోనెటర్స్ స్వాధీనం చేసుకున్నారు. వాహనంతో పాటు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసును మైలార్ దేవుపల్లి పోలీసులకు అప్పగించారు. -
11 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
చిత్తూరు క్రైం: ఎర్రచందనం స్మగ్లింగ్కు పాల్పడుతున్న వారికోసం స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి శేషాచలం అడవుల్లో పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఎర్రగట్టు వద్ద కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులను చూసిన కూలీలు ఎర్రచందనం దుంగలను అక్కడే వదిలి పరారయ్యారు. 11 ఎర్ర దుంగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న కూలీల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
చాక చక్యంతో వ్యక్తి ప్రాణాలు కాపాడిన జవాన్
-
ఢిల్లీలో భారీగా పాత నోట్ల స్వాధీనం
-
స్లిప్పులతో అడ్డంగా దొరికిన ఉపాధ్యాయులు
భీమవరం టౌన్ : పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో వేర్వేరు చోట్ల ముగ్గురు ఉపాధ్యాయులు శనివారం ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. వారిని విధుల నుంచి తొలగించిన అధికారులు సమాచారాన్ని డీఈఓ ఆర్ఎస్ గంగా భవానికి అందించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు కె.నాగేశ్వరరావు, ఎస్కే సలీం తెలిపిన వివరాల ప్రకారం.. భీమవరంలోని కాకతీయ మెరిట్ స్కూల్ పరీక్ష కేంద్రం (నం.2659)లో రూం నెం.7లో ఇన్విజిలేటర్గా ఉన్న ఉపాధ్యాయుడు కె.విజయ్బాబు రెండు కార్పొరేట్ స్కూల్స్కు చెందిన ఇద్దరు విద్యార్థుల జవాబు పత్రాలను మారుస్తుండగా స్క్వాడ్ పట్టుకుంది. వెంటనే అతడిని ఇన్విజిలేటర్ విధుల నుంచి తొలగించారు. అదేవిధంగా కాళ్ల మండలం కలవపూడి జెడ్పీ హైస్కూ ల్ పరీక్ష కేంద్రం (నం.2705)లో తనిఖీలు చేయగా రూం నం.3లో ఇన్విజిలేటర్గా ఉన్న ఉపాధ్యాయు డు వై.శ్రీనివాస్, రూం నం.5లో ఎం ఎన్సీహెచ్ఎస్ వర్మ జేబుల్లో స్లిప్పులు ఉండటాన్ని స్క్వాడ్ గుర్తించిం ది. వీరిని కూడా విధుల నుంచి తొలగించామని అధికారులు చెప్పారు. -
భారీగా పాత నోట్ల పట్టివేత
బెంగళూరు: పాత రూ.500, 1000 నోట్లను మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరిని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.1.28 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. నగర పోలీస్ కమిషనర్ ప్రవీణ్సూద్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని కోణణకుంటెకు చెందిన జిమ్మి రాహుల్, హొన్నావర నివాసి అజయ్లు శేషాద్రిపురం పైప్లైన్ రోడ్డులోని ఒక అపార్టుమెంటును అద్దెకు తీసుకున్నారు. ఇందులో పాత నోట్లను నిల్వచేసి కొత్త నోట్లు మార్చుకోవడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పక్కా సమాచారం అందింది. దీని ఆధారంగా గురువారం ఉదయం వారిని అరెస్టు చేసినట్లు కమిషనర్ సూద్ తెలిపారు. నగదు మార్పిడి చేయడానికి అపార్టుమెంట్లో దాచి ఉంచారని ఆయన తెలిపారు. చెలామణి చేయడానికి సాధ్యం కాకపోవడంతో అక్కడే ఉంచారని అన్నారు. నిందితులు రియల్ఎస్టేట్ దందా నుంచి ఎలాంటి ఆధారాలు లేకుండా నగదును సేకరించారని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో బెంగళూరులో ఇంత పెద్దమొత్తంలో పాత నోట్లు దొరకడం ఇదే మొదటిసారి. -
షూలో వజ్రాల సంచులు..
చైనా: బూట్లలో 1000పైగా వజ్రాలను అక్రమంగా రవాణా చేస్తూ ఓ యువకుడు అడ్డంగా దొరికిపోయాడు. హాంగ్ కాంగ్ సిటీ నుంచి షెన్జెన్ నగరానికి ప్రవేశిస్తుండగా కస్టమ్స్ అధికారులకు చిక్కాడు. వివరాల్లోకి వెళితే..షూ వేసుకున్న యువకుడు సాధారణనడకకు భిన్నంగా అడుగులు ఎత్తి ఎత్తివేస్తూ అధికారుల కంటబడ్డాడు. అధికారులు గమనిస్తూ ఉండడటంతో మళ్లీ మామూలుగా నడవడానికి ప్రయత్నించాడు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు తనిఖీ నిర్వహించారు. దీంతో సాక్స్ లోదాచిన డైమండ్ బ్యాగులు బయటపడ్డాయి. 212.9 క్యారెట్ల సుమారు వెయ్యిగాపైగా వజ్రాలను స్వాధీనం చేసుకున్నామని కస్టమ్స్ అధికారి వాంగ్ తెలిపారు.అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. దర్యాప్తు కొనసాగుతుందన్నారు. గతంలో లువోహుకు పోర్ట్ లో అల్పాహారం ఆహార ప్యాకేజీలో 164 క్యారెట్ల బరువున్న 1,554 వజ్రాలను స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు లువోహుకు పోర్ట్ అధికారులు ప్రకటించారు. -
భారీగా రేషన్ బియ్యం పట్టివేత
నూజివీడు: లబ్దిదారులకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నయానే సమాచారంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కృష్ణాజిల్లా నూజివీడు నుంచి లారీలో తరలిస్తున్న 7 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న విజిలెన్స్ అధికారులు లారీ డ్రైవర్ను పోలీసులకు అప్పగించారు. -
ఆక్సిటోసిన్ను పటుకున్న అధికారులు
-
దేశ రాజధానిలో నడిరోడ్డుపై లైవ్ మర్డర్
-
దొంగ దొరికాడు..
యాడికి: ఓ ఇంట్లో దొంగతనం చేసేందుకు వచ్చిన దొంగ.. పోలీసుల్ని చూసి హడావిడిగా ఇంటిపై నుంచి దూకి గాయాలపాలై దొరికిపోయాడు. యాడికి మండల కేంద్రంలో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. శివ అనే వ్యక్తి యాడికి పాత పోలీస్స్టేçÙ¯ŒS సమీపంలోని ఓ ఇంట్లో సోమవారం రాత్రి దొంగతనానికి వెళ్లాడు. అదే సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసుల దృష్టి అతడిపై పడింది. పోలీసుల్ని గమనించిన శివ తప్పించుకునే యత్నంలో ఇంటిపై నుంచి కిందకు దూకి గాయాలపాలయ్యాడు. దొంగను పోలీసులు 108లో తాడిపత్రి ఆస్పత్రికి తరలించారు. శివ గతంలో జరిగిన గాడిదల దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్నట్లు ఎస్ఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు. -
ఎర్రచందనం డంప్ స్వాధీనం
తిరుపతి: చిత్తూరు జిల్లా బాకరాపేట అటవీ ప్రాంతంలోని బొగ్గులవాండ్ల సమీప ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు ఎర్రచందనం డంప్ను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలించేందుకు వీలుగా అడవిలోని ఓ రాళ్ల గుట్ట వద్ద అక్రమంగా దాచి ఉంచిన 9 ఎర్ర చందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
ఏసీబీ వలలో విద్యుత్ శాఖ ఏఈ
అచ్యుతాపురం(విశాఖపట్నం జిల్లా): ఏసీబీ వలలో అచ్యుతాపురం విద్యుత్శాఖ ఏఈ రంగారావు చిక్కాడు. ఓ వ్యక్తి నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏఈని, ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. వెదురువాడ గ్రామానికి చెందిన రవివర్మకు ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయడానికి రంగారావు రూ.50 వేలు లంచం అడిగాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం వలపన్ని పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ తనిఖీలు
-
220 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
నందిగామ: లబ్ది దారులకు అందాల్సిన రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన సివిల్ సప్లై అధికారులు, పోలీసులు రేషన్ బియ్యం తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 220 క్వింటాళ్ల రేషన్ బియ్యంతో పాటు ఓ లారీని స్వాధీనం చేసుకున్నారు. కృష్ణాజిల్లా నందిగామ నుంచి రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు సోమవారం ఈ దాడులు నిర్వహించారు. -
కల్తీ కారం దందా గుట్టు రట్టు
-
బ్యాంకులో నకిలీ నోట్లు జమ చేయడానికొచ్చి..
-
బ్యాంకులో నకిలీ నోట్లు జమ చేయడానికొచ్చి..
వికారాబాద్: నకిలీ నోట్లను పట్టుకొని ఓ వ్యక్తి సరాసరి బ్యాంకుకే వెళ్లాడు. రూ 49 వేల నకిలీ నోట్లను జమ చేయడానికి ప్రయత్నిస్తుండగా బ్యాంకు అధికారులు గుర్తించారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు ఎస్బీఐ వద్ద చోటు చేసుకుంది. బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
232 బస్తాల చౌక బియ్యం పట్టివేత
సత్తెనపల్లి: చౌక దుకాణాల నుంచి రేషన్ బియ్యం అక్రమంగా సేకరించి రీసైక్లింగ్ ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు సమాచారం అందడంతో సోమవారం దాడులు నిర్వహించారు. డీఎస్పీ వి.వి.రమణ కుమార్ నేతృత్వంలో సీఐ ఎన్.కిషోర్బాబు సత్తెనపల్లి మండలం కొమెరపూడిలోని విఘ్నేశ్వర ట్రేడర్స్ రైస్మిల్లులో ఈమేరకు తనిఖీలు చేపట్టారు. అప్పుడే లారీలో వచ్చిన బియ్యాన్ని దాడి చేసి పట్టుకున్నారు. మిల్లులో 202 తెల్లగోతాల్లో, 30 గన్ని బ్యాగులో రేషన్ బియ్యాన్ని గుర్తించారు. మొత్తం రూ. 3 లక్షలు విలువ చేసే 116 క్వింటాళ్ళ చౌక బియ్యన్ని పట్టుకున్నారు. ఇదే మిల్లులో గత జూన్లో కూడా దాడి చేసి బియ్యం పట్టుకుని కేసు నమోదు చేయడంతోపాటు, సీజ్ చేసినట్లు డీఎస్పీ రమణకుమార్ తెలిపారు. ఎక్కడైనా చౌక బియ్యం ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లయితే విజిలెన్స్ ఎస్పీ 80082 03288, డీఎస్పీ 80082 03289, సీఐ 80082 03291 నెంబర్లకు తెలియజేయాలని కోరారు. దాడుల్లో విజిలెన్స్ ఏఓ కె.వెంకటరావు, కానిస్టేబుళ్ళు నాంచారయ్య, నాగేశ్వరరావు, రాము, రాంబాబు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ దరియావలి, గ్రామ రెవెన్యూ అధికారులు తదితరులు ఉన్నారు.