మెట్పల్లి : బైక్ కొట్టేసి దర్జాగా పారిపోతున్న ఓ దొంగను స్థానికులు పట్టుకుని చితక్కొట్టారు. కరీంనగర్ జిల్లా మెట్పల్లిలోని పాతబస్టాండ్ ప్రాంతంలో మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తిరుమల లాడ్జి ముందు పార్క్ చేసిన బైక్ను ఓ ఆగంతకుడు అన్లాక్ చేసి తీసుకెళుతుండగా... దాన్ని లాడ్జి సిబ్బంది సీసీ కెమెరాల్లో గమనించి వెంటనే అప్రమత్తమయ్యారు. స్థానికులతో కలసి వెంబడించి దొంగను పట్టుకున్నారు. అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
బైక్ కొట్టేసి పారిపోతున్న దొంగకు దేహశుద్ధి
Published Wed, Mar 23 2016 7:54 AM | Last Updated on Sun, Sep 3 2017 8:24 PM
Advertisement
Advertisement